తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు నెలలో నిర్వహించనున్న వివిధ ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్లు విడుదల చేయనున్నారు. రేపు శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి ఆన్లైన్లో www.ttdsevaonline.comవెబ్సైట్ ద్వారా భక్తులు ముందస్తుగా రిజర్వు చేసుకోవచ్చు.
తిరుమలలో ప్రతి నెలా మొదటి శుక్రవారం నిర్వహించే డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమం నేటి శుక్రవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ పరిధిలో ఎదురయ్యే సమస్యలు, సూచనలపై భక్తులు 0877- 2263261 నెంబరుకు డయల్ చేసి ఫోన్ ద్వారా నేరుగా టీటీడీ ఈవో డాక్టర్ డి.సాంబశివరావుకు తెలియజేయవచ్చు.
ఆన్లైన్ లో టీటీడీ ఆర్జితసేవా టికెట్లు
Published Thu, Jun 30 2016 8:18 PM | Last Updated on Mon, Aug 20 2018 4:09 PM
Advertisement
Advertisement