విశాఖ : విశాఖ జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. చింతపల్లి మండలం బలపం సర్పంచ్ చింపల్లి కర్లాని మావోయిస్టులు హతమార్చారు. అర్ధరాత్రి సర్పంచ్ను అపహరించిన మావోయిస్టులు... రాళ్లగడ్డ మావోయిస్టు స్థూపం వద్ద కాల్చి చంపారు. తామిచ్చిన పిలుపును ధిక్కరించి ఎన్నికల్లో పాల్గొన్నందుకే హత్యచేసినట్లు ఆ ప్రాంతంలో లేఖ వదిలి వెళ్లారు. ఈ సంఘటనతో ఏజెన్సీలో భయాందోళనలు నెలకొన్నాయి.