chintapalli
-
చింతపల్లి అటవీప్రాంతంలో చిరుత సంచారం
-
మన్యంలో మంచుతెరలు
సాక్షి, పాడేరు:మన్యంలో రెండు రోజుల నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ముందస్తు చలిగాలుల వ్యాప్తితో మన్యం వాసులు ఉదయం, సాయంత్రం చలిబారిన పడుతున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా శీతాకాలం రాకముందే మన్యంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో బుధవారం 16.5 డిగ్రీలు, గురువారం 17 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెండు రోజులుగా పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డులో 18 డిగ్రీలు, అరకులోయ కాఫీ బోర్డులో 18.7 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.దట్టంగా పొగమంచుఏజెన్సీలోని అన్ని ప్రాంతాల్లోనూ పొగమంచు దట్టంగా కురుస్తోంది. వేకువజామున ఉదయం 8 గంటల వరకు మంచు తెరలు వీడటం లేదు. పొగమంచు తీవ్రతతో వాహన చోదకులు పగటిపూట కూడా హెడ్లైట్లు ఆన్ చేసుకుని వాహనాలు నడుపుతున్నారు. తుపాను ప్రభావంతోనే..తుపాను కారణంగా ఏజెన్సీలో చలిగాలులు అధికమయ్యాయి. నవంబర్ మొదటి వారం నుంచి ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుతాయి. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా చలితీవ్రత అధికంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. డిసెంబర్ నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలలోపు పడిపోయే అవకాశం ఉంది. – డాక్టర్ అప్పలస్వామి, ఏడీఆర్, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం -
సైబీరియన్ కొంగలు ఎక్కడ ?
-
సీఎం జగన్ పెద్ద మనసు.. ఆపన్నులకు అండగా..
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆపన్నులకు మరోసారి అండగా నిలిచారు. ఆయన గురువారం చింతపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురు సీఎంను కలిసి తమ కష్టాలు చెప్పుకొన్నారు. వారి పరిస్థితులను తెలుసుకున్న సీఎం.. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వెంటనే తగిన సాయం చేసి వారిని ఆదుకోవాలని కలెక్టర్ సుమిత్కుమార్ను ఆదేశించారు. దీంతో ఆయన వెంటనే ముగ్గురు బాధితులకు రూ.లక్ష చొప్పున మొత్తం రూ.3 లక్షలను వారి ఖాతాల్లో శుక్రవారం జమ చేశారు. కండరాల వ్యాధితో బాధపడుతున్న చింతపల్లి మండలం గుమ్మడిగొండకు చెందిన అడిగర్ల రమ్యశ్రీ, బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్న చింతపల్లి గ్రామానికి చెందిన పంపోతి కొండబాబు, పెరాలసిస్తో బాధపడుతున్న చింతపల్లి మండలం దిబ్బగరువుకు చెందిన మోరి కృష్ణవేణిలు ఈ సందర్భంగా సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశించిన 24 గంటల వ్యవధిలోనే ఆర్థిక సాయం వారి అకౌంట్లలో జమవడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: ‘చింతకాయల’కు చెంపదెబ్బలు రాల్తాయ్! -
చింతపల్లిని వణికిస్తున్న చలిపులి
సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా): జిల్లాలోని ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో చలి తీవ్రత పెరిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరకులోయ, చింతపల్లిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 7 డిగ్రీలు, అరకులోయ కేంద్ర కాఫీ బోర్డులో 8.3 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రోజుల వ్యవధిలోనే భారీగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చలి తీవ్రత పెరగడంతో గిరిజనులు వణికిపోయారు. పాడేరు మండలం మినుములూరులో 11డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీ అంతటా పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 10 గంటలకు కూడా మంచు తెరలు అలుముకుంటున్నాయి. చింతపల్లితో పాటు లంబసింగి, గూడెంకొత్తవీధి ప్రాంతాల్లో ప్రయాణికులు కూడా చలి తీవ్రతకు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. -
చింతపల్లి: ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ (ఫొటోలు)
-
CM YS Jagan Birthday Celebrations:విద్యార్థుల మధ్య ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు (ఫొటోలు)
-
AP CM YS Jagan Chintapalli Tour: జగన్ నినాదాలతో హోరెత్తిన చింతపల్లి (ఫొటోలు)
-
పేదలకు మంచి చేస్తుంటే ఎందుకీ కడుపు మంట: సీఎం జగన్
సాక్షి, అల్లూరి జిల్లా: విద్యార్థులకు మంచి చేస్తుంటే విష ప్రచారం చేస్తున్నారని, విద్యార్థులకు చెడు చేస్తున్నామంటూ తప్పుడు రాతలు రాశారంటూ ఎల్లో మీడియాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘‘గిట్టని వాళ్లు జగన్ దుబారా చేస్తున్నాడంటూ మాట్లాడుతున్నారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా పేదలకు ఈ స్థాయిలో ఖర్చుచేయలేదు. ఖర్చు చేసే ప్రతీ రూపాయి భావితరాల కోసమే’’ అని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఎనిమిదో తరగతి విద్యార్థులకు వరుసగా రెండో ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్స్ పంపిణీ చేపట్టింది. పేదింటి పిల్లలు అంతర్జాతీయ వేదికపై తమ సత్తాచాటాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం మేరకు రూ.620 కోట్ల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ గల 4,34,185 ట్యాబ్స్ను 9,424 పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి సీఎం జగన్.. గురువారం ఈ పంపిణీని ప్రారంభించారు. ‘‘పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే. విద్యార్థులకు మంచి చేస్తుంటే విష ప్రచారం చేస్తున్నారు. విద్యార్థులకు చెడు చేస్తున్నామంటూ తప్పుడు రాతలు రాశారు. పేద విద్యార్థులపై విషం కక్కొద్దని చెబుతున్నా. దిగజారుడు రాతలు రాయొద్దని చెబుతున్నా. పేద పిల్లల చేతిలో ట్యాబ్లు ఉంటే చెడిపోతారంట. పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదవద్దా?. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు అంతరించుకుపోతుందట. పేదలకు మంచి చేస్తుంటే మీకెందుకు ఈ కడుపుమంట. పేదల పిల్లలకు మంచి చేస్తుంటే కొందరు ఏడుస్తున్నారు. ఇటువంటి దిక్కుమాలిన రాజకీయాలతో యుద్ధం చేస్తున్నాం’’ అంటూ సీఎం జగన్ ధ్వజమెత్తారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. నాకు కొండంత అండ అడవితల్లి బిడ్డలు దేవుడుదయ మీ అందరి చల్లని దీవెనలతో ఈ రోజు మరో మంచి కార్యక్రమం ఇక్కడ నుంచి చేస్తున్నాం. నా గిరిపుత్రుల స్వచ్చమైన మనసులు మధ్య నాకు కొండంత అండగా నిలబడే అడవితల్లి బిడ్డల మధ్య, పేదల బిడ్డల బంగారు భవిష్యత్ కోసం ఒక గొప్ప కార్యక్రమం ఇవాల ఇక్కడ నుంచి జరుగుతుంది. ఈ మంచి కార్యక్రమం నా పుట్టిన రోజున మీ అందరి ఆశీస్సులు కోరుతూ... మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య మీ అందరి ప్రేమానురాగాలు, ఆప్యాయతల మధ్య జరుపుకోవడం దేవుడి నాకిచ్చిన అదృష్టం. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన నా చిట్టితల్లులు, పిల్లలు, నా అక్కాచెల్లెమ్మలు, అవ్వాతాతలు, సోదరులు, స్నేహితులు మధ్య ఈ కార్యక్రమం జరుపుకుంటూ.. మీ అందరి ప్రేమానురాగాలకు హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. మన పిల్లలే మన భవిష్యత్– మన వెలుగు ఈ రోజు ఇక్కడ నా ఎదుట ఉన్న పిల్లలు, రాష్ట్రంలో ప్రతి ఇంట ఉన్న పిల్లలు.. వీరే మన భవిష్యత్. వీరంతా మన వెలుగులు. వీరంతా మన తర్వాత, మనం వెళ్లిపోయిన తర్వాత కూడా మన రాష్ట్ర భవిష్యత్తును నిలిపే మన వారసులు. వీరి భవిష్యత్తు గురించి ఆలోచించి.. మన రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ, ప్రపంచంలో పోటీపడే పరిస్థితిలోకి రావాలి. ఆ పోటీలో మన పిల్లలు గెలవాలని ఆశిస్తూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే 55 నెలలుగా ప్రతి అడుగు కూడా ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చే దిశగా పడింది. అందులో భాగంగానే వరుసగా రెండో ఏడాది ఈ రోజు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న 8వతరగతి పిల్లలకు ట్యాబులిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజులు ట్యాబుల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా 10 రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే ప్రతిమండలాన్ని సందర్శిస్తూ...ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టుగా 10 రోజులపాటు 8వతరగతి పిల్లలకు ట్యాబులిచ్చే కార్యక్రమం జరుగుతుంది. ట్యాబుల పంపిణీ దశాబ్దంలోనే గొప్ప మార్పు ఇవాళ మనం ఇచ్చేవి కేవలం ట్యాబులు మాత్రమే కాదు. ప్రతి చెల్లెమ్మకూ ఒక మంచి అన్నగా, ప్రతి పిల్లాడికి,పాపకు ఒక మంచి మేనమామగా మన పిల్లలు మీద, మన పేద కుటుంబాల మీద మమకారంతో, తరతరాల పేదరికం సంకెళ్లు తెంచేందుకు, భవిష్యత్తును మార్చేందుకు తీసుకొస్తున్న అనేక గొప్ప మార్పుల్లో ఈ ట్యాబులు పంపిణీ కూడా గొప్ప మార్పుగా రాబోయే దశాబ్దకాలంలో నిల్చిపోతుంది. ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వ బడులలో చదువుతున్న 8వతరగతి పిల్లలకు 4,34,185 మందికి రూ.620 కోట్లు ఖర్చు చేస్తూ మన పిల్లల చేతుల్లో ట్యాబులు పెడుతున్నాం. డిజిటల్విప్లవంలో భాగంగానే గతేడాది కూడా నా పుట్టిన రోజున రూ.686 కోట్లతో 5.18లక్షల ట్యాబులను పిల్లలకు, చదువులు చెబుతున్న టీచర్లకు పంపిణీ చేసాం. పిల్లలకు అవసరమైన బైజూస్ కంటెంట్ను కూడా ప్రతి ట్యాబులోనూ ఆఫ్లైన్లో సైతం పనిచేసేటట్టుగా అప్లోడ్ చేసి మరి ట్యాబులు పంపిణీ చేస్తున్నాం. ప్రతి పిల్లాడికి పాఠాలన్నీ పూర్తిగా, సులభంగా అర్ధం అయ్యేటట్టుగా, కష్టాన్ని తగ్గించేటట్టుగా బైజూస్ కంటెంట్ లోడ్ చేసి పిల్లలకు అండగా నిలబడుతున్నాం. ఈ ట్యాబుల విషయంలో నేను పిల్లలకు చెబుతున్నా.. ట్యాబులు రిపేరుకు వస్తే ఎవరూ కంగారుపడకండి. మీ హెడ్ మాష్టారు దగ్గరికి వెళ్లి చెడిపోయిందని రిపేరుకిచ్చినా, లేదా తల్లిదండ్రులతో పాటు గ్రామసచివాలయం దగ్గరకు వెళ్లి ఇచ్చినా రెండు చోట్ల రశీదు ఇస్తారు. వారం రోజుల్లోనే మీ ట్యాబ్ రిపేరు చేసి ఇస్తారు.ఒకవేళ రిపేరు చేయలేకపోతే ఇంకో ట్యాబు మీ చేతిలో పెడతారు. ఈ ట్యాబుల విషయానికొస్తే... ఇవి సెక్యూర్డ్ మొబైల్ డివైస్ మేనేజిమెంట్ అనే సాప్ట్వేర్ పెడ్డడం జరిగింది. దీనివల్ల పిల్లలు పాఠాలు, లెర్నింగ్కు సంబంధించిన అంశాలు మాత్రమే చూడగలుగుతారు. పిల్లలు ఏం చూశారు, ఏం చదివారు అన్నది టీచర్లకు, తల్లిదండ్రులకు ఈ సాప్ట్వేర్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి తల్లిదండ్రులకు ఎలాంటి ఆందోళన, భయాలు అవసరం లేదు. ఈ ట్యాబులన్నీ పిల్లలకు వాళ్ల చదువుల్లో మంచిచేసే ఒక గొప్ప ఇంధనంగా ఉంటుందని చెబుతున్నాను. రూ.33వేల ఖరీదు చేసే ట్యాబ్, కంటెంట్ ఉచితంగానే ఒక్కో పిల్లాడు చేతిలో పెడుతున్న ఈ ట్యాబ్ మార్కెట్ విలువ రూ.17,500. దీనికి తోడూ బైజూస్ కంటెంట్ను ఇస్తున్నాం. ఎవరైనా శ్రీమంతులు పిల్లలు వెళ్లి బైజూస్ కంటెంట్ను కొనుగోలు చేసి, డౌన్లోడ్ చేసుకోవాలంటే రూ.15వేలు కడితే తప్ప డౌన్లోడ్ చేసుకోలేని పరిస్ధితి. అలాంటి ఈ కంటెంటెన్ ఉచితంగా డౌన్లోడ్ చేసి, ఈ ట్యాబులుతో సహా ఇస్తున్నాం. ఇవాళ 8వతరగతి విద్యార్ధి తన చేతిలో పెట్టుకున్న ఈ ట్యాబ్, కంటెంట్ విలువతో కలుపుకుంటే రూ.33వేలు విలువ చేస్తుంది. మన పిల్లలు ప్రపంచంలోనే నంబర్వన్ కావాలని.. ఈ పిల్లలందరినీ ఇంత ఖర్చు చేసి ఈ పిల్లల చేతుల్లో ఎందుకు పెడుతున్నామంటే.. నా పిల్లలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ వన్గా నిలవాలన్న తలంపుతో వాళ్ల మేనమామగా ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఒకవైపు ట్యాబుల పంపిణీ చేస్తూనే.. మరోవైపున ప్రతి స్కూళ్లో 6వతరగతి నుంచి పైబడిన ప్రతి తరగతి గదినీ డిజిటలైజ్ చేసే కార్యక్రమంలో అడుగులు వేగంగా పడుతున్నాయి. నాడు నేడు పూర్తి చేసుకున్న 6వతరగతి నుంచి 12వతరగతి వరకు ఉన్న ప్రతి తరగది గదిలోనూ ఇంటరాక్టివ్ ప్లాట్ ఫ్యానెల్స్(ఐఎఫ్పి)లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి తరగతిగదినీ డిజిటలైజ్ చేసే కార్యక్రమం జరుగుతుంది. నాడు– నేడుతో సమూల మార్పులు ఇందులో భాగంగా నాడు నేడు మొదటిదశ పూర్తి చేసుకున్న స్కూళ్లలో 15,715 స్కూళ్లలో 6వతరగతి ఆపై ఉన్న 32,213 క్లాస్రూంలలో ఇప్పటికే ఐఎఫ్పిలు పెట్టి డిజిటలైజ్ చేశాం. అదే విధంగా 1 నుంచి 5వతరగతి వరకు స్కూళ్లలో ఇంగ్లిషు ల్యాబ్లు తీసుకువచ్చాం. వాటన్నింటిలోనూ స్మార్ట్ టీవీలు ఏర్పాటులో భాగంగా .. దాదాపు 10,038 స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశాం. ఈ ఐఎఫ్పీలు, క్లాస్రూంల డిజిటౖలñ జేషన్ కోసం మొదటిదఫాలో చేసిన ఖర్చు రూ.427 కోట్లు. నాడు–నేడు రెండో దఫా పనులు ఇవాళ వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడకి రాకముందు అధికారులను అడిగాను. రెండోదఫా నాడు–నేడు పనులు పూర్తి చేసి అక్కడ ఐఎఫ్పి ప్యానెల్స్ బిగించి 6వతరగతి నుంచి ఈ పైచిలుకు తరగతిగదులను డిజిటలైజ్ చేయడానికి ఎంత టైం పడుతుందని అడిగాను. దాదాపు మరో 31,884 తరగతి గదులు 6వతరగతి ఆ పై తరగతిగదులన్నీ డిజిటలైజ్ అయి, పూర్తిగా 62,097 తరగతిగదులన్నీ డిజిటలైజ్ అయ్యే కార్యక్రమం జనవరి 30 నాటికి పూర్తవుతుందని చెప్పారు. సందేహాల నివృత్తికి యాప్లు సైతం ప్రతి తరగతి గదిని డిజిటలైజ్ చేయడమే కాకుండా ఎస్.డి కార్డు, ఆండ్రాయిడ్ బాక్సులన్నింటితో పాటు ఐఎఫ్పి ప్యానెల్స్ ఉన్నచోట బైజూస్ కంటెంట్ కూడా అప్లోడ్ చేసి ఉంటుంది. అంటే పిల్లలకు బైజూస్ కంటెంట్తో కూడిన పాఠాలను తరగతిగదిలో నేర్పుతారు. ఇవే పాఠాలను వాళ్లకున్న ట్యాబులలో కూడా ఉంతాయి. దీనివల్ల పిల్లలకు కన్ఫ్యూజన్ ఉండదు. మెరుగ్గా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా ఈ ట్యాబులున్నప్పుడు, ఈ పాఠాలలో పిజిక్స్, మేథ్స్ బయాలజీ, ఇంగ్లిషు సబ్జెక్టులో పిల్లలకు సందేహాలు వస్తే.. వాటిని నివృత్తి చేసుకోవడం ఎలా ? ఎవరు చెప్తారు ? అన్న సందేహం ప్రతి పిల్లాడికి, తల్లిదండ్రులకూ ఉంటుంది. అందుకనే ఈ సారి పిల్లలకిచ్చే ఈ ట్యాబులలో ఒక యాప్ను కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది. డౌట్ క్లియరెన్స్ బాట్ అనే యాప్ను డౌన్లోడ్ చేయడం జరిగింది. దీన్ని వాడుకుని పిల్లలు తమ సందేహాలను చెప్పినా, టైప్ చేసినా వాటిని నివృత్తి చేసుకునే సౌలభ్యం ఉండేలా యాప్ను డౌన్లోడ్ చేశాం. ఇంత ధ్యాసపెట్టి పిల్లలు ఏం చదువుతున్నారు? ఎలా చదువుతున్నారు? ట్యాబులలో ఏం ఉంది? ఇంకా ఎలా దాన్ని పిల్లలకు ఉపయోగపడేలా మెరుగుపర్చాలి. పిల్లలకు సులభంగా అర్ధమయ్యేలా చేయాలి అని ఆలోచన చేస్తూ తాపత్రయపడుతూ... మీ పిల్లల గురించి ఆలోచనచేసే మీ బిడ్డ ప్రభుత్వం, ఆ పిల్లలకైతే మేనమామ ప్రభుత్వం ఇక్కడ ఉంది. ఈ సందేహాల నివృత్తి కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ను వాడుకునేలా తీసుకొచ్చే కార్యక్రమమూ జరుగుతుంది. అంతే కాకుండా రాబోయే రోజుల్లో పిల్లలు ఇంకా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశ్యంతో ఇతర విదేశీ భాషలను నేర్చుకునేదానికి వీలుగా డ్యుయోలింగో యాప్ అనే కొత్త యాప్ను చేర్చాం. దానివల్ల పిల్లలు విదేశీభాషను నేర్చుకునే అవకాశం ఉంది. ఈ ట్యాబు పిల్లలకు తోడుగా ఉండే ఒక ట్యూటర్గా అన్ని రకాలుగా అండగా ఉంటుంది. ప్రపంచంలో మన పిల్లలే బెస్ట్ కావాలన్న తపనతో మరో ముఖ్యవిషయం కూడా చెప్పాలి. పిల్లలందరూ ఆంధ్రరాష్ట్రంలో బెస్ట్గా చూడాలని కాదు నేను పోటీపడుతున్నది.. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే నా పిల్లలు బెస్ట్గా ఉండాలని, చూస్తున్నాను. దానికోసం ప్రయత్నిస్తున్నాను. అందుకోసం ప్రాథమిక స్ధాయి.. అంటే 3వ తరగతి నుంచే మన పిల్లలకు తర్ఫీదు ఇచ్చి టోఫెల్ పరీక్షకకు వాళ్లను సిద్ధం చేసేలా.. అమెరికాకు చెందిన టోఫెల్ నిర్వాహణా సంస్ధ ఈటీఎస్(ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్)తో ఒప్పందం కూడా చేసుకున్నాం. ఈ రోజు టోఫెల్ను ఒక సబ్జెక్టుగా ఒక పీరియడ్ కేటాయిస్తూ 3వతరగతి నుంచి ప్రతి క్లాసులోనూ టీచ్ చేస్తూ.... కరిక్యులమ్లో తీసుకొచ్చే కార్యక్రమం జరిగింది. టెక్నాలజీని అందిపుచ్చుకునే దిశగా మరో 15–20 సంవత్సరాల తర్వాత పరిస్థితుల వేగంగా మారుతున్నాయి. మారుతున్న పరిస్థితిలకు అనుగుణంగా మనం కూడా వేగంగా అడుగులు వేయాలి. టెక్నాలజీ మారుతుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా మన బ్రతుల్లోకి వస్తుంది. రానున్న 20 సంవత్సరాలలో మనం చేస్తున్న ఈ ఉద్యోగాలన్నీ పూర్తిగా కనుమరుగైపోతాయని చెప్తున్నారు. ఆ రకంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. టెక్నాలజీ కూడా పెరుగుతుంది. మనంకూడా దీనికి అగుణంగా అడుగులు వేయాలి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మన పిల్లలనే ప్రిపేర్ చేస్తున్నాం. వచ్చే సంవత్సరం నుంచి 8వ తరగతి నుంచి ఫ్యూచర్ స్కిల్స్ అనే సబ్జెక్టును ప్రవేశపెడుతున్నాం. అందులో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, మెటావర్స్, డేటా ఎనలెటిక్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, వర్టువల్ రియాలటీ, అగ్మెంటెడ్ రియాలటీ, ఫైనాన్షియల్ లిటరసీ వంటి అంశాలన్నీ పిల్లలకు పరిచయం చేసేలా... వారిని పోటీ ప్రపంచంలో గట్టిగా నిలబడేలా మంచి సంకల్పంతో ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్టును తీసుకువస్తున్నాం. సంబంధిత ట్యూటర్ల నియామకానికి కూడా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇటువంటి సబ్జెక్టులను ఎలా బోధించాలి ? ఎటువంటి ట్యూటర్లు కావాలన్న దిశగా ఆడుగులు పడుతున్నాయి. ఐబీ సిలబస్ దిశగా విద్యారంగంలో భవిష్యత్తు ప్రపంచంలో మన పిల్లలు నిలబడేలా ఉంచేందుకు ఐబీ సిలబస్ను రాబోయే రోజుల్లో తీసుకువస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న మన పిల్లలు నేరుగా విదేశీ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందేలా ఈ సిలబస్ను తీసుకువస్తున్నాం. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా సులభంగా ఉద్యోగావకాశాలు పొందుతారు. దీనికోసం ఐబీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాబోయే రోజుల్లో ఐబీ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తూ.. కరిక్యులమ్లో మార్పులు తీసుకువస్తూ ఐబీ సర్టిఫికేట్ తీసుకొచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. పాఠ్యప్రణాళికలో మార్పులు తీసుకు వస్తూ సంయుక్త సర్టిఫికెషన్ తీసుకువచ్చేలా మార్పులు. ఇవాళ మన బడులన్నీ ఎలా ఉన్నాయి ? గతంలో మన స్కూళ్లు ఎలా ఉండేవి ? మీ బిడ్డ అధికారంలోకి వచ్చి తర్వాత ఈ 55 నెలల కాలంలో మన స్కూళ్లు ఎలా ఉన్నాయో చూడాలని కోరుతున్నాను. ఇవాళ మన ప్రభుత్వ బడులు, పిల్లలకిచ్చే ట్యాబులు, నాడు నేడుతో బడుల బాగుమీద పెట్టే మనసు, పిల్లలకిచ్చే జగనన్న విద్యాకానుక మీద ఆరాటం కానీ, జగనన్న గోరుముద్ద మీద చూపిస్తున్న ధ్యాస కానీ, పిల్లలను బడికి పంపించాలి, ఆ తల్లుల పిల్లలకు తోడుగా ఉండాలని, ఆ పిల్లల కోసం, తల్లుల కోసం ఆలోచన చేస్తూ తీసుకొచ్చిన వైఎస్సార్ అమ్మఒడి పథకం కానివ్వండి.. పిల్లల కోసం ఆలోచన చేస్తూ తెలుగుమీడియం బడులను మార్చుతూ ఇంగ్లిషు మీడియం తీసుకునిరావడంతో పాటు పిల్లలకు పూర్తిగా అర్ధమయ్యేందుకు ఒక పేజీ ఇంగ్లిషు, మరో పేజీ తెలుగు ఉండేలా బైలింగువల్ టెక్ట్స్బుక్స్ తీసుకువచ్చాం. ప్రయివేటుబడులలో పెద్దవాల్లు, శ్రీమంతులు మాత్రమే కొనుగోలు చేసి ఏకంగా రూ.15వేలు ఏడాదికి ఖర్చుచేస్తే తప్ప అందుబాటులోకి రాని బైజూస్ కంటెంట్ను ఇవాళ మన పిల్లలకు ఇవ్వడం కానీ.. 6వతరగతి ఆపై తరగతులకు సంబంధించి ప్రభుత్వ బడులలో ప్రతి తరగతిగదిని డిజిటలైజ్ చేస్తూ.. పిల్లలకు సులభంగా పాఠాలు అర్ధమయ్యేలా చేస్తున్నాం. తెలుగు మీడియం నుంచి ఇంగ్లిషు మీడియంకు మారడంతో పాటు అదొక్కటే సరిపోదని సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు మన బడుల్లో జరుగుతున్న ప్రయాణం వరకు.. మంచి ఆలోచనలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా మొట్టమొదటిసారిగా ఈ 55 నెలల మీ బిడ్డ పరిపాలనలో ప్రతి స్కూల్లోనూ కనిపిస్తున్నాయి. ప్రభుత్వ బడులతో ప్రైవేట్ స్కూళ్లు పోటీపడే పరిస్థితి ప్రైవేటు స్కూళ్లు గవర్నమెంట్ స్కూళ్లు కన్నా మెరుగ్గా ఉంటాయనే నానుడి పోయి.. ఇవాళ ప్రైవేటు స్కూళ్లన్నీకూడా ప్రభుత్వ స్కూళ్లతో పోటీపడే పరిస్థితి వచ్చిందా ? లేదా ? ప్రభుత్వ బడుల్లో బైలింగువల్ టెక్ట్స్బుక్స్, ప్రతి తరగతి గదికి ఐఎఫ్పిలు ఏర్పాటు, 8వతరగతిలో ప్రతి పిల్లాడి చేతిలో ట్యాబు అందించడం, నాడు నేడుతో మారుతున్న స్కూళ్లు వంటి కార్యక్రమాలు చేయడంతో ప్రైవేటు బడులు వాటికోసం గవర్నమెంటు బడులతో పోటీపడే పరిస్థితి మీ బిడ్డ పరిపాలనలో జరుగుతుంది. జగన్ దుబారాగా డబ్బులు ఖర్చుచేస్తున్నారని గిట్టని వారు అంటున్నారు. మేం చేసే ప్రతి పైసాకూడా మానవవనరుల అభివృద్ధి కోసం పెడుతున్నాం. రేపటి భవిష్యత్తుమీద ప్రతి పైసాకూడా పెడుతున్నాం. పిల్లలు అందరికీ కూడా ఇవ్వగలిగే ఆస్తి చదువులు మాత్రమే. అది కూడా నాణ్యతతో కూడిన విద్య ఇవ్వగలిగితే.. వాళ్ల జీవితం, భవిష్యత్తు మారుతుంది. అప్పుడే పేదరికం ఆటోమేటిక్గా పక్కకు పోయే పరిస్ధితి వస్తుందని గట్టిగా నమ్మాం కాబట్టే ఇంత వేగంగా అడుగులు పడుతున్నాయి. మన మీద దుర్బిద్ధితో బురద జల్లుతున్నారు ఇలా పేదల పిల్లల చదువులు మీద దేశచరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం పెట్టనంత దృష్టి పెట్టి.. పేద తల్లిదండ్రుల తరపున వారి బిడ్డల కోసం మార్పులు తీసుకువస్తున్న మన ప్రభుత్వంమీద దుర్భిద్ధితో, దురుద్దేశంతో బురదజల్లుతున్నారు. పేదరికం నుంచి ప్రజలను బయటకు తీసుకురావాలని మీ జగన్ ఆరాటపడుతుంటే... మంచేస్తున్న ప్రభుత్వం మీద బురదజల్లుతున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, చంద్రబాబు, దత్తపుత్రుడు వీరు ఎంతగా దిగజారి మాట్లాడుతున్నారో మీ అందరికీ తెలుసు. పేద పిల్లలకు ట్యాబులు ఇవ్వనే ఇవ్వకూడదని వారంతా చెప్తున్నారు. ట్యాబులు చేతిలో ఉంటే.. పిల్లలు చెడిపోతున్నారని రాస్తున్నారు. మన ప్రభుత్వ బడులలో చదువుకునే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ పేద వర్గాలకు చెందిన పిల్లలుమీద తప్పుడు రాతలు రాస్తున్నారు. ఏవేవో వీడియోలు చూస్తున్నారని, ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారని, చెడిపోతున్నారని పిల్లలకు ట్యాబులు ఇవ్వొద్దని ప్రతిరోజూ పనిగట్టుకుని నాపై విమర్శలు చేస్తున్నారు. అది పేపరా.. పేపరుకు పట్టిన పీడా జగన్ బర్త్డే బహుమతి.. చెడగొడుతోంది మతి, గాడితప్పుతున్న బైజూస్ ట్యాబ్ చదువులు, ఇతర వీడియోలు ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడుతున్న పిల్లలు, వెనక్కి తీసుకోవాలంటూ తల్లిదండ్రుల నుంచి ఒత్తిళ్లు, అయినా వాడాల్సిందేనంటున్న జగన్ సర్కార్ అని ఈనాడులో రాశారు. ఇది పేపరా.. పేపరుకు పట్టిన పీడా. దీన్ని ఈనాడు అంటారు. ఇలాంటి పేపర్ను చదవొచ్చా. నేను ఆ పత్రిక యాజమాన్యాన్ని, ఆ పత్రికను సమర్థించే రాజకీయ పార్టీలను ఒక్కటే ప్రశ్నిస్తున్నాను. ఇంతగా దిగజారి రాతలు రాయకండి అని వీళ్లకు చెప్తున్నాను. ఇంతగా దిగజారి మాటలు మాట్లాడకండి అని చెప్తున్నాను. పేదవర్గాల పిల్లలమీద ఇంతగా విషం కక్కకండి అని చెప్తున్నాను. పేద పిల్లలకు మంచి జరుగుతుంటే.. ఇంత కడుపుమంట వద్దండీ అని చెప్తున్నాను. మీ పిల్లలు, మీ మనవళ్ల చేతిలో ఏమో ట్యాబులు ఉండొచ్చు, ల్యాప్ట్యాపులు ఉండొచ్చు, స్మార్ట్ ఫోన్లు కూడా ఉండొచ్చు. కాని పేదల చేతుల్లో మాత్రం ట్యాబులు ఉండకూడదు, ల్యాప్ట్యాపులు ఉండకూడదు, స్మార్ట్ ఫోన్లు ఉండకూడదు. నిజంగా ఇది సరైన పోకడేనా అని ప్రశ్నిస్తున్నాను. మీ పిల్లల చేతులలో ఇవన్నీ ఉంటే చెడిపోరు, కాని పేదల పిల్లల చేతుల్లో మాత్రం ట్యాబులు, ల్యాప్టాపులు, స్మార్ట్ ఫోన్లు ఉంటే మాత్రం ఉంటే చెడిపోతారు.మీ పిల్లలు, మనవళ్లేమో ఇంగ్లిషు మీడియంలోనే చదవాలి, కాని పేద పిల్లలు ఇంగ్లిషు మీడియం బడులకు వెళ్లకూడదు, ఇంగ్లిషు చదవకూడదు. పేదపిల్లలు ఇంగ్లిష్ మీడియం మాత్రం చదవకూడదు. పేద పిల్లలు ఇంగ్లిషు మీడియంలో చదివితే తెలుగుభాష అంతరించిపోతుంది అంట?. కాని వాళ్ల పిల్లలు, వాళ్ల మనవళ్లు మాత్రం ఇంగ్లిషులోనే చదవాలి. ఇది ధర్మమేనా? ఆలోచన చేయండి. ఇలాంటి ఆలోచనలు, దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారు. ఇలాంటి రాజకీయాలతో మీ బిడ్డ యుద్ధంచేస్తున్నాడు. ఎంత మోసానికైనా వెనకడుగు వేయని దుష్టచతుష్టయం ఈ రోజు మీరంతా ఇవన్నీ చూస్తున్నారు. ఒకవైపు జగన్ ఫొటోకు పది తలకాయలు పెట్టి రాష్ట్రం అంతా అప్పులు పాలై పోయిందని రాస్తారు. మరి జగన్ హయాంలో రాష్ట్రం అప్పులు పాలయిపోతుందంటారు. మరోవైపు చంద్రబాబు మేనిఫెస్టో అని చెప్పి.. ఆరు గ్యారంటీలు అని చెపుతాడు. వాటిని వీళ్లు పతాక శీర్షికల్లో బ్రహ్మాండంగా రాస్తారు. వాళ్లు ఇస్తానన్నవి, ఇవ్వక తప్పని పెన్షన్లు, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ అన్నీ కలిపితే.. జగన్ ఇచ్చేవాటికన్నా, వాళ్లు చెప్తున్నవి మూడింతలు ఎక్కువ. ఎంత మోసానికైనా వాళ్లు వెనకడుగు వేయరు. గతంలో 2014–19 వరకూ వాళ్లే పరిపాలన చేశారు. ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఇదే దత్తపుత్రుడు ఉన్నారు. ఆ రోజుల్లో రూ.87,612 కోట్ల రైతు రుణమాఫీ చేస్తానన్నారు, వాళ్లనూ మోసంచేశారు. పొదుపు సంఘాల రుణాలు మాఫీచేస్తానన్నారు, వాళ్లనీ మోసం చేశారు. ఇంటింటికీ జాబు ఇస్తాను. జాబు రావాలంటే బాబు రావాలన్నారు, జాబు ఇవ్వకపోతే రూ.2వేల నిరుద్యోగభృతి, అంటే ఐదేళ్లలో ప్రతి ఇంటికీ రూ.1లక్ష. ఒక్కరికంటే ఒక్కరికి ఇచ్చిన పాపాన పోలేదు. ఇంత దారుణంగా అడ్డగోలుగా 2014 నుంచి 2019 వరకు ఎవ్వరినీ వదలకుండా మోసం చేశారు. అవ్వాతాలనూ, రైతులను, పిల్లలను, అక్క చెల్లెమ్మలను మోసంచేశారు. చివరకు వారి మేనిఫెస్టోను ఎవ్వరికీ కనిపించకుండా.. ఇంటర్ నెట్లో ఉంటే ప్రజలు ఎక్కడ కొడతారేమోనని దాన్ని నెట్లో నుంచి కూడా తీసేశారు. ఈ రోజు మీ బిడ్డ పరిపాలనలో ఎన్నికల ప్రణాళికను భగవద్గీతగానూ, ఖురాన్గానూ, బైబిల్గానూ భావించి మేనిఫెస్టోలో చెప్పిన 99.5శాతం వాగ్దానాలను అమలు చేశాం. ప్రజలంతా ఆలోచన చేయాలి. ఈ రోజు మీ బిడ్డ 55 నెలల పాలనలో మీ బిడ్డ బటన్ నొక్కాతున్నాడు. రూ.2.40లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతున్నాయి. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. ఆలోచన చేయండి. మీ బిడ్డ ఇలా ఎలా చేయగలుగుతున్నాడు. గతంలో పరిపాలన చేసిన వాళఅలు ఎందుక్లు మీ బిడ్డలా ఎందుకు చేయలేకపోయారు. అప్పులు గురించి విమర్శిస్తున్నారు... అప్పులు గురించి విమర్శలు చేస్తున్నారు. అప్పుల్లో పెరుగుదల అప్పటికన్నా.. ఈ ప్రభుత్వంలో తక్కువే. మరి అదే రాష్ట్రం, అదే బడ్జెట్ అప్పులు పెరుగుదుల అప్పటి కన్నా ఇప్పుడు తక్కువ. మరి మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతున్నాడు. చంద్రబాబు హయాంలో ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేయలేకపోయాడు. అప్పట్లో గజదొంగల ముఠా రాజ్యం... కారణం అప్పట్లో ఒక గజదొంగల ముఠా రాజ్యాన్ని పరిపాలన చేసింది. ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు, జన్మభూమి కమిటీల నుంచి మొదలుపెడితే రాష్ట్రంలో ఇసుక నుంచి మొదలుకుని మద్యం, స్కిల్ స్కామ్ నుంచి పైబర్ గ్రిడ్ వరకు ఏది ముట్టుకున్నా దోచుకోవడం, దాన్ని పంచుకోవడం, తినుకోవడమే. ఆ రోజు ఎందుకు జరగలేదు, ఈ ప్రభుత్వంలో ఇన్ని కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయో ప్రజలంతా ఆలోచన చేయాలి. మీ బిడ్డ హయాంలో 31లక్షల ఇళ్లపట్టాలు అందులో 22 ఇళ్ల లక్షల ఇళ్ల నిర్మాణాలు మీ బిడ్డ హయాంలో ఎందుకు జరిగించగలుగుతున్నాడు, చంద్రబాబు హయాంలో జరగలేదో ఆలోచన చేయండి. మీ బిడ్డ హయాంలో వ్యవసాయం మారుతుంది, గ్రామాలన్నీ మారి ప్రతి గ్రామంలోనూ సచివాలయ వ్యవస్ధ, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్తో వాలంటీర్ వ్యవస్ధ ప్రతి ఇంటికి వచ్చి ఒకటో తేదీన సెలవైనా.. ఉదయాన్నే వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ అవ్వా,తాతల చేతుల్లో పెన్షన్ ఎలా పెట్టగలుగుతున్నారో ఆలోచన చేయండి. రాబోయే రోజుల్లో ఇంకా బురద జల్లుతారు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ బురద జల్లుతారు. ఇంకా ఎక్కువ మోసాలు చేస్తారు. ఇంకా ఎక్కువ అబద్దాలు చెబుతారు. గుర్తుపెట్టుకొండి. ఎవరైతే మీకు మంచిచేశారో.. వారిని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మీ బిడ్డ మీ కళ్ల ముందు నిలబడి మీ కళ్లలోకి చూసి చెప్పగలుగుతున్నాను.. మీకు మంచి జరిగితే మాత్రం.. మీ బిడ్డకు మీరు తోడుగా నిలబడాలని కోరుతున్నాను. మీ బిడ్డకు వాళ్ల మాదిరిగా ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తోడుగా ఉండకపోవచ్చు. ఒక దత్తపుత్రుడి అండ ఉండకపోవచ్చు. కానీ మీ బిడ్డ వాళ్లను నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన ఉన్న దేవుడ్ని, కింద ఉన్న మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాను. మీకు మంచి జరిగిందా? లేదా? అన్నదే కొలమానంగా తీసుకోండి. మీకు మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా, అండగా నిలబడండి. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే... మళ్లీ మోసం చేసేందుకు వీళ్లంతా బయల్దేరారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికీ కేజీ బంగారం ఇస్తామంటారు. జగన్ ట్యాబ్ మాత్రమే ఇచ్చాడు. మేం ఒక బెంజికారు ఇస్తామంటారు. దయచేసి మోసపోవద్దని ప్రజలను కోరుతున్నాను నా చెల్లెమ్మ కొన్ని పనులు మంజూరు చేయమని అడిగింది నా చెల్లెమ్మ భాగ్యలక్ష్మి ఈ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని పనుల మంజూరు కోసం అడిగింది. బీటీ రోడ్లు, బ్రిడ్జిలు కోసం అడిగింది. అన్నింటినీ యుద్ధప్రాతిపదినక మంజూరు చేసి, అడుగులు వేగంగా వేయిస్తాను. ట్రైబల్ ప్రాంతాన్ని ఒక్కసారి చూస్తే ఆశ్చర్యం కలిగించే మార్పులు కనిపిస్తున్నాయి. సాలూరులో మొట్టమొదటసారిగా ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణం వేగంగా జరుగుతోంది. పార్వతీపురం, నర్సీపట్నం, పాడేరులో మూడు మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. ఐటీడీఏ పరిధిలో పార్వతీపురం, సీతంపేట, రంపచోడవరం, బుట్టాయిగూడెం, డోర్నాలలో కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం వేగంగా జరుగుతుంది. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ వేగంగా నిర్మాణం జరుగుతుంది. ఇవన్నీ గతంలో లేనివి కేవలం ఈ 55 నెలల్లో మీ బిడ్డ హయాంలో మాత్రమే జరుగుతున్నాయని మరొక్కసారి గుర్తుపెట్టుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నానని సీఎం శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ ఎడ్యుకేషన్..ఘనత మన సీఎం జగన్ దే
-
చింతపల్లిలో 11, అరకులో 12.3 డిగ్రీలు
సాక్షి,పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 9 గంటల వరకు పాడేరు, చింతపల్లి, అరకులోయ ప్రాంతాల్లో మంచుతెరలు వీడటంలేదు. ఘాట్ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా లైట్ల వెలుగులో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఉష్ణోగ్రతలూ రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో శనివారం 15.5 డిగ్రీలు నమోదు కాగా ఆదివారం 4.5 డిగ్రీలు తగ్గి 11 డిగ్రీలు నమోదైంది. అరకులోయ కేంద్ర కాఫీ బోర్డులో 12.3 డిగ్రీలు, పాడేరు మండలంలోని మినుములూరు కేంద్ర కాఫీ బోర్డు వద్ద 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు కాఫీబోర్డు వర్గాలు తెలిపాయి. ఆయా ప్రాంతాల్లో సాయంత్రం నుంచి చలిగాలులు విజృంభిస్తున్నాయి. మంచు అందాలకు ఫిదా... జిల్లా వ్యాప్తంగా చలిగాలుల తీవ్రత ఉన్నప్పటికీ మంచు అందాలను తిలకించేందుకు పర్యాటకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చి అందాలను వీక్షిస్తూ పరవశిస్తున్నారు. మారేడుమిల్లి ప్రాంతంలోని గుడిసె, చింతపల్లి మండలంలోని లంబసింగిలోని చెరువులవెనం, పాడేరు మండలంలోని వంజంగి హిల్స్, హుకుంపేట మండలంలోని సీతమ్మకొండ, అరకులోయ మండలంలోని మాడగడ హిల్స్ ప్రాంతాలకు వేకువజామునే చేరుకుని పొగమంచు, సూర్యోదయం, మేఘాల అందాలను వీక్షిస్తున్నారు. -
చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్ జగన్
-
AP Cold Waves: విశాఖ ఏజెన్సీ చరిత్రలో తొలిసారి!
దేశం వ్యాప్తంగా కోల్డ్వేవ్ ప్రభావం కనిపిస్తోంది. చలి దెబ్బకు తెలుగు రాష్ట్రాలు గజగజలాడిపోతున్నాయి. ఏపీలోనూ చలి పంజా విసురుతోంది. మొదటిసారిగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో మునుపెన్నడూ లేనంత అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. మరో 3 రోజులు ఇదే తీవ్రతతో పరిస్థితి కొనసాగవచ్చని, చిన్నపిల్లలు.. వృద్ధులు.. శ్వాసకోశ సంబంధిత సమస్యలున్న వాళ్లు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా) : చలి పులి పంజాకు రాష్ట్రం గజగజా వణికిపోతోంది. కోల్డ్ వేవ్ ప్రభావం రాష్ట్రాన్ని తాకడంతో మునుపెన్నడూ లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి గాలుల తీవ్రత పెరిగింది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పడిపోయాయి. అక్కడ సాధారణం కంటె 3 నుంచి 5 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆంధ్రా కశ్మీర్గా అభివర్ణించే ‘చింతపల్లి’తో పాటు హుకుంపేట, జి.మాడుగుల మండలం కుంతలం, గూడెం కొత్తవీధి మండలం జీకే వీధిలో అత్యల్పంగా 1.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంతకు ముందు ఆ రికార్డు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్గా ఉండేది!. డుంబ్రిగూడ మండల కేంద్రం, పెదబయలు మండలం గంపరాయిలో 2.6, హుకుంపేట మండలం కొక్కిసలో 2.7, ముంచంగిపుట్టు మండలం గొర్రెలమెట్టలో 2.8, పెదబయలులో 2.9, పాడేరులో 3.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో ఇక్కడ అత్యల్పంగా 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తొలిసారిగా ఇప్పుడు 1.5 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు, పర్యాటకులు ఆశ్చర్యపోతున్నారు. బయటకు రావడానికే బెంబేలెత్తిపోతున్నారు. అరకు తదితర ప్రాంతాల్లోనూ పలుచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. విజయవాడలో ఆదివారం ఉదయం 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రాన్నీ కోల్డ్వేవ్ తాకినట్టే.. ఇప్పటికే భారత వాతావరణ శాఖ ఛత్తీస్ఘడ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో కోల్డ్ వేవ్ ప్రభావం ఉంటుందని ప్రకటించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటె 5 నుంచి 6 డిగ్రీలు పడిపోతే కోల్డ్ వేవ్గా పరిగణిస్తారు. ఆంధ్రా ఊటీగా పేరున్న అరకు ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో 3 నుంచి 5 డిగ్రీలు పడిపోయాయి. దీంతో కోల్డ్ వేవ్ మన రాష్ట్రాన్ని తాకినట్లే వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. బంగ్లాదేశ్లో ఉన్న అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్(వాతావరణంలోని ఎత్తయిన ప్రదేశాల్లో వీచే గాలులు), పశ్చిమ గాలుల ప్రభావంతో కోల్డ్వేవ్ కొనసాగుతోంది. మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. మరీ ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది. -
పదవి నుంచి చింతపల్లి ఎంపీపీ తొలగింపు
చింతపల్లి రూరల్ (అల్లూరి సీతారామరాజు జిల్లా) : చింతపల్లి ఎంపీపీ వంతాల బాబూరావును పదవి నుంచి తొలగించాలని ఉమ్మడి విశాఖ జిల్లా ఎన్నికల అథారిటీ నుంచి గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పరిషత్ ఎన్నికల సమయంలో ఎంపీపీ ఎన్నికల్లో 20 మంది ఎంపీటీసీల్లో 9 మంది ఇండిపెండెంట్లు బాబూరావును బలపర్చగా, మరో 9 మంది వైఎస్సార్సీపీ అభ్యర్థి అనూషదేవిని బలపర్చారు. ఇద్దరికీ సమానంగా సభ్యుల మద్దతు రావడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవీంద్రనాథ్ లాటరీ తీశారు. డ్రాలో బాబూరావుకు ఎంపీపీ పదవి వరించింది. ఎన్నికల నామినేషన్ దాఖలు సమయంలో బాబూరావు ఆయనపై ఉన్న కేసుల వివరాలను నమోదు చేయలేదని అనూషదేవి కోర్టును ఆశ్రయించడంతో పాడేరు సబ్ కలెక్టర్ విచారణ జరిపారు. బాబూరావుపై కేసులు ఉన్నట్టు తేలడంతో పదవికి అనర్హుడిగా పేర్కొంటూ ఎంపీపీ పదవి నుంచి తొలగించాలని ఎన్నికల అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ కోరాబు అనూషదేవిని ఎంపీపీ పదవి వరించనుంది. (క్లిక్ చేయండి: విచ్చలవిడిగా రంగురాళ్ల తవ్వకాలు.. ప్రమాదం అని తెలిసినా..) -
అక్కడ చెట్లకు డబ్బులు కాస్తాయ్!
చింతపల్లి(పశ్చిమగోదావరి జిల్లా): డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తాయా... అంటూ చాలామంది వ్యంగ్యంగా అంటుంటారు. కానీ, చాలా దేశాల్లో డబ్బులను చెట్ల నుంచే తయారు చేస్తారు. మన దేశంలో చెట్ల నుంచి కరెన్సీ నోట్లు తయారు చేయకపోయినా... ఇందుకోసం ఉపయోగించే అరుదైన ఆల్పైన్స్ వృక్షాలు మాత్రం మన దగ్గర దశాబ్దాలుగా పెరుగుతున్నాయి. చదవండి: శ్రీకాకుళం జిల్లాలో ఎర్ర చీమల దండయాత్ర.. హడలిపోతున్న జనం.. వాటిలో అల్లూరి జిల్లాలోని చింతపల్లి ప్రాంతం కూడా ఒకటి. కొన్ని దశాబ్దాల కిందట అటవీ శాఖ ఆధ్వర్యంలో పరిశోధనల కోసం చింతపల్లి మండలంలోని కృష్ణాపురం, చిన్నగెడ్డ అటవీ ప్రాంతాల్లో 20 హెక్టార్లలో ఆల్పైన్స్ మొక్కలను శాస్త్రవేత్తలు నాటారు. ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉండటంతో చెట్లు బాగా పెరిగాయి. దీంతో మరో పది హెక్టార్లకు ఆల్పైన్స్ మొక్కల సాగును విస్తరించారు. అమెరికా, కెనడా వంటి దేశాల్లో... అమెరికా, స్విట్జర్లాండ్, కెనడా వంటి దేశాల్లో ఆల్ పైన్స్ వృక్షాల కలప నుంచే కరెన్సీ నోట్లు తయారు చేస్తారు. ఆయా దేశాల్లో మెత్తని స్వభావం కలిగిన ఆల్పైన్స్ వృక్షాలు ఎక్కువగా పెరుగుతాయి. అందువల్ల కరెన్సీ నోట్ల తయారీకి పూర్తిగా వీటిపైనే ఆధారపడతారని అటవీ శాఖ అధికారులు తెలిపారు. మన దేశంలో ఆల్పైన్స్ వృక్షాల పెంపకం తక్కువగా ఉండడం వల్ల నగదు తయారీకి ఉపయోగించడం లేదు. కరెన్సీ తయారీకి సంబంధించిన యంత్ర సామగ్రి కూడా అందుబాటులో లేదు. దీంతో ఈ కలపను ఫర్నిచర్, ఇళ్లలో కబోర్డులు, ఫ్లోరింగ్, అలంకరణ వస్తువుల తయారీ వంటి వాటికి వినియోగిస్తున్నారు. పర్యాటకులకు కనువిందు... మన దేశంలో హిమాలయాలు, పశ్చిమ కనుమలు, రాష్ట్రంలోని చింతపల్లిలో గల ఎత్తయిన చల్లని వాతావరణం కలిగిన ప్రాంతాల్లో మాత్రమే ఆల్పైన్స్ చెట్లు పెరుగుతాయి. చాలా ఎత్తుగా ఉండే ఈ చెట్లు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. వేసవిలో సేదదీరేందుకు అనువుగా ఉంటాయి. చింతపల్లి ప్రాంతం అనువైనది ఎత్తయిన పర్వత శ్రేణి ప్రాంతంలో ఉన్న చింతపల్లి అటవీ ఏరియాలో ఆల్పైన్స్ చెట్లను పెంచేందుకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మన దేశంలో తక్కువ ప్రాంతాల్లో ఈ చెట్లు పెంచడం వల్ల కరెన్సీ తయారీకి సరిపడా కలప ఉత్పత్తి కావడం లేదు. దీంతో కరెన్సీ తయారీకి ఉపయోగించడం లేదు. విదేశాల్లో ఎక్కువగా ఈ చెట్ల కలప ద్వారానే కరెన్సీ నోట్లు తయారు చేస్తారు. – శ్రీనివాసరావు, అటవీ శాఖ రేంజ్ అధికారి, చింతపల్లి -
అల్లూరి తొలి దాడికి వందేళ్లు
సాక్షి, అమరావతి/చింతపల్లి/చింతపల్లి రూరల్: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విల్లంబులు ఎక్కుపెట్టి.. చింతపల్లి పోలీస్ స్టేషన్పై మెరుపు దాడి చేసిన ఘటనకు సరిగ్గా వందేళ్లు నిండాయి. 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్పై అల్లూరి తన బృందంతో తొలి దాడి జరిపారు. నాటి వీరోచిత ఘట్టాన్ని స్మరించుకుంటూ సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో సభ జరగబోతోంది. చింతపల్లితో మొదలుపెట్టి.. మన్యంలో గిరిజనులపై బ్రిటిష్ సేనలు సాగిస్తున్న దౌర్జన్యాలను ఎదురించాలంటే.. సాయుధ పోరాటమే శరణ్యమనే నిర్ణయానికి వచ్చాడు అల్లూరి సీతారామరాజు. మన్యానికే చెందిన గంటం దొర, మల్లు దొర, మొట్టడం వీరయ్యదొర, కంకిపాటి ఎండు పడాలు, సంకోజి ముక్కడు, వేగిరాజు సత్యనారాయణరాజు (అగ్గిరాజు), గోకిరి ఎర్రేసు (మాకవరం), బొంకుల మోదిగాడు వంటి 150 మందికి పైగా వీరులతో బృందాన్ని ఏర్పాటు చేశాడు. తొలుత చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి చేయాలని 1922 ఆగస్టు 19న నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడికి పాల్పడటంతో మన్యంలో తిరుగుబాటు మొదలైంది. ఈ దాడిలో 11 తుపాకులు, 5 కత్తులు, 1,390 తుపాకీ గుళ్లు, 14 బాయ్నెట్లను ఆ బృందం ఎత్తుకెళ్లింది. ఆగస్టు 23న రాత్రి కృష్ణదేవిపేట, ఆగస్టు 24న రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లపైనా అల్లూరి బృందం దాడి చేసింది. ఆ మూడు పోలీస్ స్టేషన్ల నుంచి మొత్తం 26 తుపాకులు, 2,500కు పైగా మందుగుండు సామగ్రిని అల్లూరి బృందం ఎత్తుకెళ్లింది. దీంతో ఆగ్రహించిన బ్రిటిష్ పాలకులు మన్యంలో విప్లవ దళాన్ని అంతం చేయడానికి కబార్డు, హైటర్ అనే అధికారులను చింతపల్లి ప్రాంతానికి పంపించింది. ఆ ఇద్దరు అధికారులను రామరాజు దళం గెరిల్లా యుద్ధరీతిలో సెప్టెంబర్ 24న హతమార్చింది. ఆ తరువాత ఆక్టోబర్ 15న ముందుగానే సమాచారం ఇచ్చి మరీ అడ్డతీగల పోలీస్ స్టేషన్పై అల్లూరి బృందం దాడి చేయడం అత్యంత సాహసోపేతమైనదిగా గుర్తింపు పొందింది. అక్టోబర్ 19న రంపచోడవరం స్టేషన్ను పట్టపగలే ముట్టడించారు. ఆ తరువాత 1923 ఏప్రిల్ 17న అన్నవరం పోలీస్ స్టేషన్, 1923 జూన్ 10న మల్కన్గిరి పోలీస్ స్టేషన్, ట్రెజరీ, సెప్టెంబర్ 22న పాడేరు పోలీస్ స్టేషన్పైన దాడులు జరిగాయి. కాగా, కొయ్యూరు గ్రామ సమీపంలో ఏటి ఒడ్డున స్నానం చేస్తున్న రామరాజును 1924 మే 7న బ్రిటిష్ పోలీసులు బంధించగా.. మేజర్ గుడాల్ తుపాకీతో కాల్చి చంపాడు. నేడు భారీ బహిరంగ సభ చింతపల్లి స్టేషన్పై అల్లూరి బృందం దాడిచేసి వందేళ్లయిన సందర్భంగా సోమవారం చింతపల్లిలోని డిగ్రీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. పాడేరు ఎమ్మెల్యే కొట్టిగుళ్లి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. సభకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి, డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ హాజరు కానున్నారు. -
అరక దున్నిన అత్త.. విత్తనాలు వేసిన కోడళ్లు!
వ్యవసాయంలో మహిళల శ్రమే అధికమైనా... రైతు అనగానే నెత్తిన తలపాగ, చేతిలో అరకతో ఓ పురుష రూపం గుర్తుకొస్తుంది. దాన్ని బ్రేక్ చేశారు నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీశైలమ్మ. చింతపల్లి మండలం కుర్రంపల్లిలో గురువారం ఆమె అరక దున్నుతుండగా, తన ఇద్దరు కోడళ్లు విత్తనాలు వేస్తూ కనిపించారు. శ్రీశైలమ్మ భర్త రామచంద్రం సామాజిక కార్యకర్త. వారికి ఆరుగురు కుమారులు. ఇద్దరు ఆర్మీలో ఉన్నారు. నలుగురు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. అయినా శ్రీశైలమ్మ భర్తతోపాటు వ్యవసాయ పనులు చేస్తూ స్ఫూర్తినిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, చింతపల్లి (దేవరకొండ) ‘ఆశ’క్తిగా ఖోఖో ఆదిలాబాద్ డైట్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్లతో కలిసి ఎమ్మెల్యే జోగు రామన్న గురువారం ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన క్రీడా వస్తువులు, మైదానాన్ని పరిశీలించి వెళ్లిపోయారు. అనంతరం విధి నిర్వహణలో భాగంగా అక్కడే ఉన్న ఆశ వర్కర్లు ఖోఖో ఆడారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శైలజ వారితో కలిసి ఉత్సాహంగా ఖోఖో ఆడుతూ కనిపించారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ పిల్లల్ని పలకరించి.. కలిసి భోజనం.. గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తీగలవేణి హైస్కూల్లో కలెక్టర్ కె.శశాంక విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం తీగలవేణికి హాజరైన కలెక్టర్ ‘మన ఊరు – మన బడి’లో ఎంపికైన జెడ్పీహెచ్ఎస్ను సందర్శించారు. మధ్యాహ్న భోజన సమయం కావడంతో పిల్లలు ప్లేట్లు పట్టుకొని బారులు తీరారు. కలెక్టర్ శశాంక వారితో మాట్లాడిన అనంతరం వంటకాలను పరిశీలించారు. ‘రోజూ రుచికరంగా వండి పెడుతున్నారా? నేను మీతో కలిసి భోజనం చేయొచ్చా’.. అని కలెక్టర్ కోరగా.. సార్... రండి అంటూ పిల్లలు ఆనందంగా స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ వారితో కూర్చుని భోజనం చేశారు. ‘వంటలు బాగానే ఉన్నాయి. ఇలాగే చేయండి’.. అని అన్నారు. (క్లిక్: గోళీ అంత గుడ్డు.. వావ్.. మూన్!) -
కాలం ఎంతగామారింది.. తాచేరు వయా ‘ఫోన్ పే’మెంట్!
చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా): కాలం ఎంతగామారింది.. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని గిరిజనులు తమ సంప్రదాయ పండగలకు వినియోగిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏటా ఈ నెలలో ఇటుకల పండగ నిర్వహిస్తారు. అందులో భాగంగా ప్రధాన రహదారుల్లో గేట్లు ఏర్పాటు చేసి వాహన చోదకుల వద్ద తాచేరు (డబ్బులు) వసూలు చేస్తుంటారు. చదవండి: హిజ్రాల అందాల పోటీలు.. సందడే సందడి అయితే చిల్లర లేదని చెప్పి కొందరు వాహనచోదకులు డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుంటుంటారు. ఈ నేపథ్యంలో గిరిజన మహిళలు, యువతులు గేట్ల వద్ద ఫోన్ పేకు సంబంధించిన క్యూ ఆర్ కోడ్ స్కానర్ను ఉపయోగించి తాచేరు వసూలు చేస్తున్నారు. పురుషులు వేటకు అడవి బాట పడుతుండడంతో మహిళలే ఈ పనిలో నిమగ్నమవుతారు. ఒకప్పుడు ఫోన్లో సంభాషించడమే అంతగా తెలియని గిరిజనులు ఇప్పుడు స్కానర్ ద్వారా తాచేరు వసూలు చేయడం చూసి మైదాన ప్రాంతాలకు చెందిన వాహన చోదకులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. -
ఇటు వ్యవసాయం.. అటు పూలసాగు
చింతపల్లి: అల్లూరి సీతారామరాజు జిల్లాకు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తలమానికంగా నిలవనుంది. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ అభివృద్ధికి పరిశోధన కేంద్రం ఎనలేని కృషి చేస్తోంది. మొన్నటి వరకు నూతన వంగడాలపైనే పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు ఇప్పుడు వివిధ రకాల పూల సాగును కూడా ప్రయోగాత్మకంగా చేపడుతున్నారు. మంచి ఫలితాలు వస్తుండడంతో గిరిజన రైతులను ప్రోత్సహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 1985లో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఇక్కడ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏర్పాటు చేశారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన 36 మండలాల్లోని ఉన్నత పర్వత శ్రేణి గిరిజన మండలాల్లో వ్యవసాయ అభివృద్ధి చేయాలన్నది ప్రధాన ఉద్దేశం. కొత్త పంటలపై పరిశోధనలు చేయడంతో పాటు పొలాలకు వెళ్లి పంటలకు ఆశించే తెగుళ్లు, వాటి నివారణ పద్ధతులపై సలహాలు, సూచనలు అందిస్తున్నారు. కొత్త పంటల సాగుకు గిరిజనులను ప్రోత్సహిస్తున్నారు. సంప్రదాయేతర పంటలైన గోధుమ, బార్లీ, లిన్సీడ్, బఠానీ, పొద్దు తిరుగుడు, వేరుశనగ, ఆవాలు వంటి పంటలపై పరిశోధనలు జరిపి మంచి ఫలితాలు సాధించారు. ఈ పంటల సాగుకు గిరిజనులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోనే తొలిసారిగా రూ.9 లక్షలతో సంచార వ్యవసాయ ప్రయోగశాల వాహనాన్ని కొనుగోలు చేశారు. ఆయా గ్రామాల్లో బుల్లి తెరపై పంటలు, వాటికి ఆశించే తెగుళ్లు, నివారణ పద్ధతులపై గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నారు. మానవ రహిత ఆటోమెటిక్ శాటిలైట్ వెదర్ స్టేషన్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఇక్కడ వా తావరణ పరిస్థితులు, గాలిలో తేమ శాతం తెలుసుకుని.. ఏ పంటకు ఏ రకమైన తెగుళ్లు సోకే అవకాశముందో ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆన్లైన్లో వాతావరణ సమాచారం వాతావరణ విభాగం శాస్త్రవేత్తగా సౌజన్యను నియమించారు. పరిశోధన కేంద్రంలోని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఆటోమెటిక్ శాటిలైట్ వెదర్ స్టేషన్ ద్వారా ప్రతి రోజూ నమోదైన వాతావరణ వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. వాతావరణ వివరాలు నేరుగా న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి పంపిస్తున్నారు. వెంటనే ఆన్లైన్లో ఈ వివరాలు పొందుపరుస్తున్నారు. ఐఎండీ వెబ్సైట్ హోం పేజీలోని ఏడబ్ల్యూఎస్ అబ్జర్వేషన్లోకి వెళ్లి ఉష్ణోగ్రతలు తెలుసుకోవచ్చు. గుబాళించిన పూల సాగు మార్కెట్లో అలంకరణ పూలకు మంచి డిమాండ్ ఉంది. విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలు ఇతర రాష్ట్రాల నుంచి కట్ ఫ్లవర్లను దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పూలసాగుపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. గ్లాడియోస్, బంతి, జెర్బెరాలో వైట్హౌస్, సన్వ్యాలీ ఫోర్స్ తదితర రకాల పూలను ప్రయోగాత్మకంగా సాగు చేపట్టి మంచి దిగుబడులు సాధించారు. శీతల వాతావరణంలో ఈ పూలను సాగు చేయవచ్చు. గిరిజనులను ప్రోత్సహిస్తాం వ్యవసాయ పంటలతో పాటు పూల సాగుకు గిరిజనులను ప్రోత్సహిస్తాం. మైదాన ప్రాంతాల్లో కట్ఫ్లవర్స్కు మంచి డిమాండ్ ఉంది. గిరిజనులు అందిపుచ్చుకుంటే మంచి లాభాలు సాధించవచ్చు. – డాక్టర్ అనురాధ, ఏడీఆర్, చింతపల్లి పరిశోధన స్థానం -
వరుడు లేకుండా చిన్నారులకు పెళ్లి
చింతపల్లి (పాడేరు): ఆడ పిల్లలు పుడితే ఆ గిరిజనుల ఆనందానికి హద్దులు ఉండవు. అల్లారుముద్దుగా పెంచుకుంటారు. ముచ్చటగా మూడు సార్లు పెళ్లి కూడా చేస్తారు. ఆడపిల్లలకు పెళ్లికి ముందు బాల్యంలో ఒకసారి, యుక్తవయసు వచ్చాక మరోసారి పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి తంతు నిర్వహించడం వారి ఆచారం. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో నివసించే మాలి జాతి గిరిజనుల్లో ఈ ఆచారం కొనసాగుతోంది. సోమవారం చింతపల్లి మండలంలోని చౌడుపల్లిలో 27 మంది ఐదేళ్లలోపు బాలికలకు వరుడు లేకుండా సామూహిక వివాహాలు జరిపించారు. గ్రామ సమీపంలో రాటలు వేసి, వాటికి కుండలను అమర్చి, పెళ్లి పందిరి నిర్మించారు. చిన్నారులకు కొత్త చీరలు కట్టి పెళ్లికూతురు వలె ముస్తాబు చేసి తల్లిదండ్రులు, బంధుమిత్రుల సమక్షంలో సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసారు. అనంతరం భారీ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బాల్యంలో పెళ్లిళ్లు చేయడం మాలి తెగ గిరిజనులకు తరతరాలుగా వస్తోన్న ఆనవాయితీ. ఏజెన్సీలో కూరగాయలు సాగు చేసేందుకు ఒడిశా నుంచి వలస వచ్చిన ఈ గిరిజనుల భిన్నమైన ఆచారం అందరినీ ఆకట్టుకుంటోంది. -
37 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం
గూడెంకొత్తవీధి/డుంబ్రిగుడ/కొయ్యూరు: విశాఖ ఏజెన్సీలో మంగళవారం 37 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. గూడెంకొత్తవీధి మండలంలోని జర్రెల, జి.కె.వీధి పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో స్వచ్ఛందంగా గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. జర్రెల పంచాయతీలోని పలు గ్రామాల్లో సర్పంచ్ వీరోజి నాగరాజు ఆధ్వర్యంలో సుమారు 5 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. జి.కె.వీధి పంచాయతీలోని బి.కొత్తూరు, డి.కొత్తూరు గ్రామాల పరిధిలో జి.కె.వీధి సీఐ అశోక్కుమార్, ఎస్ఐ షమీర్ ఆధ్వర్యంలో 20 ఎకరాలలో గంజాయి తోటలను ధ్వంసం చేసి మొక్కలకు నిప్పంటించారు. చింతపల్లి మండలంలోని అన్నవరం స్టేషన్ పరిధిలో గచ్చిపల్లి సమీపంలోని సుమారు 6 ఎకరాల్లోని గంజాయి తోటలను ఎస్ఐ ప్రశాంత్కుమార్ సమక్షంలో ధ్వంసం చేశారు. డుంబ్రిగుడ మండలం కితలంగి పంచాయతీ కొంతుగుడ గ్రామంలో ఎస్ఐ సంతోష్కుమార్ ఆధ్వర్యంలో 6 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. 46 కిలోల గంజాయి పట్టివేత గొలుగొండ ఎస్ఈబీ సీఐ రాజారావు ఆధ్వర్యంలో మంగళవారం డౌనూరు పంచాయతీ తురబాలగెడ్డ వద్ద 46 కిలోల గంజాయిని పట్టుకున్నారు. విశాఖ ఏజెన్సీ చింతపల్లి ప్రాంతం నుంచి టాటా నానో కారులో గంజాయి ప్యాకెట్లను తీసుకెళ్తుండగా ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ.లక్ష వరకు ఉంటుంది. కారు, ద్విచక్ర వాహనం, నాలుగు ఫోన్లు, రూ.1,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. డుంబ్రిగుడకు చెందిన బి.రాజారావును, పాములవాకకు చెందిన సీహెచ్ నానిబాబు, హుకుంపేటకు చెందిన జి.రంగారావు, వి.రాజులను అరెస్టు చేశామని సీఐ తెలిపారు. -
అల్లూరి పేరిట పోస్టల్ కవర్
చింతపల్లి: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చరిత్ర భావితరాలకు ఆదర్శనీయమని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా చింతపల్లి పోలీస్ స్టేషన్పై అల్లూరి సీతారామరాజు దాడి చేసి వందేళ్లు పూర్తయిన సందర్భంగా తపాలా శాఖ ఆదివారం విశాఖ జిల్లా చింతపల్లిలో అల్లూరి పేరిట పోస్టల్ కవర్ను ఆవిష్కరించింది. తొలుత ఎంపీ, ఎమ్మెల్యే, తపాలా శాఖ అధికారులు పాత బస్టాండ్ నుంచి సెయింట్ ఆన్స్ స్కూల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, పోస్టల్ కవర్ను ఆవిష్కరించారు. అల్లూరి పోరాట చరిత్ర భావితరాలకు గుర్తుండాలనే లక్ష్యంతోనే పోస్టల్ కవర్ను ఆవిష్కరించినట్టు విశాఖ రీజియన్ పోస్ట్మాస్టర్ జనరల్ డాక్టర్ ఎన్.వెంకటేశ్వర్లు తెలిపారు. అల్లూరి దాడి చేసిన ప్రతి పోలీసు స్టేషన్కు ఒకటి చొప్పున పోస్టల్ కవర్ను విడుదల చేయనున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ తమర్భ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ మన్యంలో వలిసెల సోయగం విలసిల్లేలా..
సాక్షి, విశాఖపట్నం: మంచు తెరల మధ్య పసుపు వర్ణంతో మెరిసిపోయే వలిసె పూలు ప్రకృతి కాంతకు స్వర్ణ కాంతులద్దుతాయి. విశాఖ మన్యానికొచ్చే పర్యాటకుల మనసులను ఇట్టే దోచుకుంటాయి. ఏటవాలు కొండ ప్రాంతాల నడుమ చల్లని వాతావరణంలో పెరిగే వలిసె తోటలు కొన్నేళ్లుగా కనుమరుగవుతున్నాయి. గిరిజన రైతుల సంప్రదాయ పంట అయిన వలిసెల సాగు రెండు దశాబ్దాల్లో నాలుగో వంతుకు పడిపోయింది. అత్యధికంగా తేనె ఉండే వలిసె పూల సాగు తగ్గడంతో తేనెటీగలకు కష్టకాలం వచ్చింది. తేనె సేకరణపైనా తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వలిసె తోటలకు పూర్వ వైభవం తెచ్చేందుకు చింతపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పరిశోధనలు చేపట్టింది. వలిసె తోటల మాతృ ప్రదేశం ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా. వందల ఏళ్ల క్రితమే మన్యంలోకి వచ్చి గిరిజనుల సంప్రదాయ పంటగా మారింది. విశాఖ మన్యంలోని అరుకు లోయ, పాడేరు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ, అనంతగిరి, జి.మాడుగుల, చింతపల్లి ప్రాంతాలతోపాటు విజయనగరం జిల్లాలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, పాచిపెంట, శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట, తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో వలిసెల సాగు ఉండేది. తర్వాత కాలంలో విశాఖ మన్యానికే పరిమితమైంది. ఇక్కడ కూడా వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం 2003–04లో 16 వేల హెక్టార్లకు పరిమితమైన వలిసెల సాగు క్రమేపీ తగ్గుతూ 2020–21 నాటికి 3,695 హెక్టార్లకు పడిపోయింది. వలిసె ఉపయోగాలివీ.. వలిసె పూలలో తేనె అధికంగా ఉంటుంది. తోటల్లో ఎకరానికి వంద చొప్పున తేనె పెట్టెల చొప్పున ఉంచి తేనెటీగల సాయంతో గిరిజనులు తేనెను సేకరిస్తారు. ఒక్కో పెట్టె నుంచి 35–40 కిలోల చొప్పున తేనె దిగుబడి వస్తుంది. వలిసె గింజల నుంచి వంటనూనె తీస్తారు. దీనిని గిరిజనులు ఇళ్లల్లో వినియోగిస్తుంటారు. ఈ నూనెను కాస్మొటిక్స్, పెయింటింగ్స్ తయారీలోనూ వినియోగిస్తున్నారు. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే వలిసె గింజలను కోళ్లు, పక్షుల దాణా తయారీలోనూ మిశ్రమంగా వాడతారు. తగ్గిపోవడానికి కారణాలు విశాఖ మన్యంలో నీరు నిలవని ఏటవాలు కొండ ప్రాంతాలు, చల్లని వాతావరణం వలిసెల సాగుకు అత్యంత అనుకూలం. పరిమాణం, రంగు, సాగు కాలంలో తేడాను బట్టి 30 రకాల వరకూ ఉన్నాయి. వలిసె గింజల దిగుబడులు తగ్గిపోవడం, రైతులకు పెద్దగా గిట్టుబాటు కాకపోవడం, భూసారం తగ్గడం వంటి పరిస్థితులు వలిసె తోటల సాగు తగ్గడానికి కారణమయ్యాయి. ఎకరాకు రెండు నుంచి మూడు క్వింటాళ్లకు మించి వలిసె గింజల దిగుబడి రావడం లేదు. ఆకాశ పందిరి, బంగారు తీగ అనే కలుపు మొక్కలను నిరోధించడం కష్టమవుతోంది. గిరిజన రైతులు వలిసె విత్తనాలను తామే తయారుచేసుకోవడం వల్ల నాణ్యత లోపించి పంట దెబ్బతిని దిగుబడులు పెద్దగా ఉండటం లేదు. దీంతో వారంతా ప్రత్యామ్నాయ ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపడంతో సాగు విస్తీర్ణం క్రమేపీ తగ్గిపోయింది. పూర్వ వైభవానికి కృషి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ ఎ.విష్ణువర్దన్రెడ్డి గతంలో భారతీయ నూనెగింజల పరిశోధన కేంద్రం (ఐఐవోఆర్) డైరెక్టర్గా ఉన్నప్పుడు వలిసెలకు పూర్వ వైభవం తేవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన చొరవతో వలిసెలపై చింతపల్లిలో నాలుగేళ్ల పరిశోధన ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.69 లక్షలు మంజూరు చేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో సాగవుతున్న 1,800 రకాల వలిసెల మూల విత్తనాలను న్యూఢిల్లీలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ రిసోర్సెస్ నుంచి చింతపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రానికి తీసుకొచ్చారు. మన్యంలో వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు అనువైన, వివిధ తెగుళ్లను తట్టుకొని స్వల్ప కాలంలో అధిక దిగుబడిని ఇచ్చే మేలు రకం విత్తనాలను ఇక్కడి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. మరోవైపు పాడేరు ఐటీడీఏతో పాటు సంజీవని స్వచ్ఛంద సంస్థ గిరిజన రైతులను ప్రోత్సహిస్తోంది. సాగు, సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించడమే గాక టార్పాలిన్లు, కోత పరికరాలు అందజేస్తుంది. రెండు లాభదాయక రకాల అభివృద్ధి మధ్యప్రదేశ్లోని జబల్పూర్ పరిసర ప్రాంతాల్లో మంచి దిగుబడి ఇస్తున్న జేఎన్ఎస్–26, జేఎన్ఎస్–28 రకాల మూల విత్తనాలను తెచ్చాం. మన్యం పరిస్థితులకు అనుగుణంగా ఉండే వీటిని ఇక్కడ అభివృద్ధి చేశాం. ఎకరానికి రెండు కిలోల విత్తనాలు వేస్తే ఆరేడు క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తుంది. ఈ విత్తనాలను ఉచితంగా గిరిజన రైతులకు త్వరలోనే ఇస్తాం. ఇలా కనీసం వంద రకాల మేలు రకం విత్తనాలను అభివృద్ధి చేయాలనేది లక్ష్యం. గిరిజన రైతులను వలిసెల సాగు వైపు అన్నివిధాలా ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నాం. – డాక్టర్ గుత్తా రామారావు, సహాయ పరిశోధన సంచాలకులు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం -
పోస్టాఫీస్లో సొత్తు స్వాహా..!
సాక్షి, చింతపల్లి (దేవరకొండ): ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ సొమ్మును కాపాడాల్సిన అధికారే జిల్లా స్థాయి అధికారుల కళ్లు కప్పి రూ.33లక్షల లక్షలను స్వాహా చేశాడు. ఈ ఘటన మండల కేంద్రంలోని తపాలా కార్యాలయంలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. చింతపల్లి మండల తపాలా కార్యాలయం పరిధిలోని చింతపల్లి, నసర్లపల్లి, గడియగౌరారం, వింజమూరు, కుర్రంపల్లి, మధనాపురం, తక్కెళ్లపల్లి గ్రామాల్లో తపాలా సేవలు అందుతున్నాయి. ఇటీవల మండల కేంద్రానికి ఎస్పీఎంగా వచ్చిన ఓ ఉద్యోగి గ్రామాల్లోని బీపీఎంలకు తక్కువ నగదు ఇచ్చి ఎక్కువ నగదు ఇచ్చినట్లుగా రికార్డుల్లో నమోదు చేయడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామాల్లో బీపీఎంలు ఉపాధి హామీ, పెన్షన్ తదితర సేవలు అందిస్తుంటారు. అయితే వీరికి మండల కేంద్రంలోని తపాలా కార్యాలయం నుంచి నిత్యం లావాదేవీలు కొనసాగుతుంటాయి. ఇదే అదునుగా భావించిన తపాలా కార్యాలయం ఎస్పీఎం, బిపిఎంలకు ఎక్కువ నగదు ఇచ్చినట్లుగా రికార్డుల్లో నమోదు చేసి బీపీఎంలకు మాత్రం తక్కువ నగదు ఇచ్చి జిల్లా అధికారులకు ఎక్కువ డబ్బులు ఇచ్చినట్లుగా తెలిపాడు. ఇదిలా ఉండగా జిల్లా స్థాయి అధికారులు కూడా గ్రామ బీపీఎంలు ఇచ్చే రికార్డులను సరిపోల్చుతారు. దీంతో రూ.33లక్షల సొమ్ము తేడా రావడంతో తీరా ఎస్పీఎం సొమ్ము స్వాహా చేసినట్లు గుర్తించారు. చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు ప్రభుత్వ సొమ్మును కాపాడాల్సిన బాధ్యత కలిగిన అధికారి రూ.33లక్షల సొమ్మును స్వాహా చేయగా గుట్టుచప్పుడు కాకుండా విచారణ చేపట్టడమే కాకుండా అధికారులు అక్రమార్కున్ని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం బయటకు చెప్పకుండా విచారణ చేసి స్వాహా అయిన సొమ్మును రికవరీ చేసేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో అధికారిని కాపాడే ప్రయత్నంలో జిల్లా అధికారులు ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆగిన ఆసరా పెన్షన్లు గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ను తపాలా కార్యాలయం నుంచి పంపిణీ చేస్తోంది. చింతపల్లి మండలంలోని అన్ని గ్రామాలకు ఈనెల మొదటి వారం నుంచే ఆసరా పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉండగా కార్యాలయానికి రావాల్సిన పెన్షన్ ఇప్పటికీ జమ కాలేదు. దీంతో దసరా పండుగ సందర్భంగా ఆసరా అందక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. సెలవుల్లో ఎస్పీఎం తపాలా కార్యాలయంలో అవినీతికి పాల్పడిన సంబంధిత అధికారి గత వారం రోజుల నుంచి సెలవుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అవినీతికి పాల్పడిన అధికారిపై జిల్లా అధికారులు విచారణ నిర్వహించి అక్రమాలకు పాల్పడినట్లు ఇప్పటికే తేల్చారు. ఈ విషయం బయటికి పొక్కకుండా జిల్లా అధికారులు జాగ్రత పడుతున్నట్లు సమాచారం. అధికారుల సూచన మేరకే సదరు ఉద్యోగి సెలవుల్లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. -
విధి మిగిల్చిన విషాదం
నాలుగేళ్ల క్రితమే కన్నవారిని పోగొట్టుకొని అనాథలయ్యారు ఆ సోదరులు.. నిలిచేందుకు నిలువ నీడా కూడా లేదు.. అన్న కరెంటు రిపేర్ చేస్తూ తమ్ముడిని పోషిస్తున్నాడు.. తల్లిదండ్రులను కోల్పోయి నా అనే వారు లేకుండా విధివంచితులుగా బతుకీడుస్తున్నారు.. ఓ వ్యవసాయ పొలంలో ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అన్న మృతి చెందడంతో తమ్ముడు ఒంటరివాడయ్యాడు. చింతపల్లి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి ఈ విషాదకర ఘటన చోటు చేసుకోవడంతో గ్రామస్తులు ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. సాక్షి, చింతపల్లి (నల్గొండ) : మండల కేంద్రానికి చెందిన చింతపల్లి విష్ణు, భాగ్యమ్మ దంపతులకు సాయి, ప్రవీణ్ ఇద్దరు కుమారులు. తల్లి దండ్రుల అకాల మృతితో అన్న సాయి కరెంటు మరమ్మతు పనులు చేస్తూ తమ్ముడిని పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే సాయి(20) ఆదివారం రాత్రి మండల కేంద్రంలోని ఓ వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ సరఫరా లేకపోవడంతో మరమ్మతులు చేసేందుకు వెళ్లాడు. అక్కడ విద్యుత్ సరఫరా సరిగా లేదని గమనించిన సాయి నేరుగా ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గుౖరై అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన స్థానికులు అతడిని దేవరకొండ ఆస్పత్రికి తరలించగా అప్పటికే సాయి మృతిచెం దినట్లు వైద్యులు తెలి పారు. సాయి తమ్ముడు ప్రవీణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. నాలుగేళ్ల క్రితం.. చింతపల్లి విష్ణు, భాగ్యమ్మ దంపతులకు కూలీ లుగా జీవనం సాగించే వారు. తండ్రి నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, తల్లి భాగ్యమ్మ మూడేళ్లుగా చెరువుగట్టు దేవస్థానంలో ఉంటూ అక్కడే అనారోగ్యానికి గురై మృతి చెం దింది. వీరికి కనీసం ఉండేందుకు సొంత ఇల్లు కూడా లేదు. దీంతో తల్లిదండ్రుల మృతదేహాలను గ్రామంలోని శివాలయం సమీ పంలో టెంటు వేసి దహనసంస్కారాలు నిర్వహించా రు. ప్రస్తుతం సాయికి నా అనే వాళ్లు ఎవ రూ లే రు. నేరుగా శ్మశానవాటికకే మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామస్తుల ఆందోళన మండల కేంద్రంలోని సమీపంలో సాయి మృతి చెందిన విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు దేవరకొండలోని బంధువుల సహాయంతో సోమవారం వ్యవసాయ క్షేత్రానికి సాయి మృతదేహాన్ని తీసుకొచ్చి న్యాయం చేయాలని ధర్నాకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. సమాచారం అందుకున్న నాంపల్లి సీఐ గౌరినాయుడు ఘటన స్థలానికి చేరుకొని అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీనివ్వడంతో సమస్య సద్దుమణిగింది. అందుబాటులో ఉండని విద్యుత్ అధికారులు మండల కేంద్రంలో విద్యుత్ అధికారులు అందుబాటులోఉండని కారణంగానే విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానిక ప్రజా ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ సిబ్బంది హైదరాబాద్లో ఉంటుండడంతో విద్యుత్ మరమ్మతులు చేసేందుకు ఎవరూ అందుబాటులో ఉండని కారణంగా ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు. సాయి మృతికి విద్యుత్ అధికారులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మరమ్మతులు చేయాలని విద్యుత్ అధికారులను కోరినా స్పందించక పోవడంతోనే ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించి నట్లు వ్యవసాయ క్షేత్రం యజమాని పేర్కొంటున్నాడు. కంటతడి పెట్టిన గ్రామస్తులు మండల కేంద్రానికి చెందిన సాయి మృతితో గ్రామస్తులు కంటతడి పెట్టారు. సాయికి ఉన్న ఒక్కగానొక్క ప్రవీణ్ రోదిస్తున్న తీరు పలువురిని కంటతడిపెట్టించింది. ప్రవీణ్కు నా అనే వారు లేకపోవడంతో గ్రామస్తులు ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. -
చింతపల్లిగూడ గేట వద్ద గర్భిణీ మృతదేహం
-
విశాఖ ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీలోని చెరువూరు గ్రామంలో ఆదివారం జరిగిన ఆటో ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యుత్ స్తంభాన్ని ఆటో ఢీకొన్న ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విశాఖ జిల్లా కలెక్టర్తో మాట్లాడి సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు నిబంధనల ప్రకారం ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. చెరువూరులో విద్యుత్ స్తంభాన్ని ఆటో ఢీకొన్న దుర్ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు చింతపల్లి ప్రమాద బాధితుల్ని జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ పరామర్శించారు. లోతుగడ్డ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
అక్రమాలకు నెలవు వెంచర్లు
సాక్షి, చింతపల్లి : నగరాలు, పట్టణాల్లో సాగే స్థిరాస్తి వ్యాపారం గ్రామీణ ప్రాంతాలకు పాకింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల్లో అనధికారిక వెంచర్లు ఏర్పాటు చేసి జోరుగా విక్రయాలు జరుపుతున్నారు. అయినా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దాంతో రూ.కోట్లు చేతులు మారుతున్నాయి. వెంచర్లకు అనుమతులు లేకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఫిర్యాదులు అందినప్పుడు అధికారులు నోటీసులతో సరిపెడుతుండడంతో అక్రమ వెంచర్దారుల పంట పండుతోంది. హైదరాబాద్–నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారిపై చింతపల్లి మండలం సుమారు 32 కి.మీ. మేర విస్తరించి ఉంది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న భూముల ధరలకు ఇటీవల రెక్కలొచ్చాయి. భూములు ప్రస్తుతం రూ.లక్షలు పలుకుతుండడంతో అక్రమ వెంచర్లకు అడ్డూఅదుపూ లేకుండాపోయింది. అక్రమ వెంచర్లకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని, అందుకే చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ భూములను తక్కువ ధరలకు కొని ప్లాట్లు చేసి ఎక్కువకు అమ్ముతున్నారు. భూమి మార్పిడి రు సుము చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. మండలంలో ఎన్ని వెంచర్లు ఏర్పాటు చేశారు.. ఎన్నింటికి అనుమతులు తీసుకున్నారనే సమాచారం అధికారుల వద్ద లేదు. అధికారుల కళ్లముందే వెంచర్లు ఏర్పాటు చేస్తున్నా వారు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. మండలంలో ఇబ్బడిముబ్బడిగా వెంచర్లు మండలంలోని మాల్ వెంకటేశ్వరనగర్, గొడుకొండ్ల, పోలేపల్లిరాంనగర్తో పాటు మండల కేంద్రంలో రోడ్డుకు ఇరువైపులా అక్రమ వెంచర్లు వెలిశాయి. గొడుకొండ్ల గ్రామానికి వెళ్లే దారిలో కృష్ణా జలాశయం ప్లాంట్ సమీపంలో, కుర్మేడు, గొల్లపల్లి గ్రామాలు, గిరిజనతండాలు, విరాట్నగర్, అనబోయినపల్లి, వింజ మూరు, నసర్లపల్లి, తీదేడుతో పాటు మండల కేంద్రంలోని మైస మ్మ దేవాలయం, పోలీస్ స్టేషన్కు వెళ్లే దారి తదితర ప్రాంతాల్లో అక్రమ వెంచర్లు జోరుగా కొనసాగుతున్నాయి. చింతపల్లి మండలం హైదరాబాద్ రాష్ట్ర రహదారికి సమీపంలో ఉండడంతో వాణిజ్య కేంద్రంగా విరాజిల్లుతున్న మాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. అయితే వెంచర్లకు డీటీసీపీ అనుమతులు తీసుకోకుండా గ్రామపంచాయతీ అనుమతులతోనే లే–అవుట్ తయారు చేస్తున్నారు. అంతేకాకుండా కొంత మంది పాత సర్పంచ్ల పేరిట అనుమతి పత్రాలను సృష్టిస్తున్నారు. వ్యవసాయ భూముల్లో లే–అవుట్లు చేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి అక్రమ లే–అవుట్లపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కలెక్టర్కు ఫిర్యాదు చింతపల్లి మండలంలో అనుమతులు లేకుండా వెంచర్లు చేశారని స్థానికులు ఎంపీడీఓ, జిల్లా కలెక్టర్, తహసీల్దార్, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులు అందుకున్న విజిలెన్స్ అధికారులు చింతపల్లి మండలంలో గతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లను పరిశీలించి అనుమతులు లేవని తెలిపారు. అనుమతులు లేవని వెంచర్ల వివరాలు సేకరించి నేటికీ ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అక్రమ వెంచర్దారులకు నోటీసులు జారీ చేశాం గ్రామాల్లో అనుమతులు లేకుండా అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లకు నోటీసులు జారీ చేశాం. మండలంలోని అనుమతులు లేని వెంచర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – మమతాబాయి, ఎంపీడీఓ -
వచ్చాడు.. మా ఊరి మొనగాడు
సాక్షి, చింతపల్లి : పల్లెల్లో ఒకప్పుడు పలుకుబడి ఉన్న చోటామోటా నేతలంతా ఇప్పుడు పట్టణం వీడి సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు. పండుగకో ..పబ్బానికో వచ్చే నేతలంతా ఎన్నికల సమయానికి రెక్కలు కట్టుకొని సొంత ఊళ్లలో వాలిపోతున్నారు. వారంతా ఎంతోకొంత రాజకీయ నేపథ్యం ఉన్న వారు కావడంతో తమ మాట నెగ్గించుకునేందుకు తహతహలాడుతున్నారు. పార్టి పెద్దలను ప్రసన్నం చేసుకుంటూనే తమ పరపతిని ప్రదర్శిస్తున్నారు. తాము మద్దతిచ్చే పార్టి అభ్యర్థి గెలి స్తేనూ.. లేక పార్టి అధికారంలోకి వస్తేనూ తాము కూర్చున్న వద్దనే చక్రం తిప్పుకునే అవకాశాలు ఉంటాయని ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా దేవరకొండ నియోజకవర్గంలోని మండలాల్లో ఉన్న ప్రముఖులు చాలా మంది రాష్ట్ర రాజధానికి వెళ్లి స్థిరపడ్డారు. మండలంలోని ముఖ్యులు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉంటున్నారు. వీరంతా ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యే వరకు ఊళ్లోనే తిష్ట వేస్తున్నారు. రాజకీయ అనుభవాన్ని రంగరిస్తున్నారు.. పాతికేళ్లకుముందు ప్రజల్లో రాజకీయ చైతన్యం అంతంత మాత్రంగానే ఉండేది. ఎన్నికల్లో రిజర్వేషన్లు కూడా అప్పటికి లేకపోవడంతో కాస్త పేరు, పలుకుబడితో ఆర్థికంగా అంగబలం ఉన్న వారంతా స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలుగా చెలామణి అయ్యారు. ఏళ్లతరబడి స్థానికంగా రాజకీయాలను శాసించే వారు. వారు చేసే అభివృద్ధి జన ఆదరణకు కారణమయ్యేవి. పంచాయతీకి వచ్చే నిధులతో గుత్తేదారులుగా ఉండి పనులు చేయించే వారు. ఊరికి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు వస్తే వారినిది సంప్రదించనిదే మాట ఇచ్చే వారు కాదు. అంతటి ప్రాబాల్యం ఉన్న గ్రామ స్థాయి నేతలంతా ఇప్పుడు మరోమారు చక్రం తిప్పే పనిలో పడ్డారు. తాజాలు.. మాజీలు కూడా.. పల్లెల్లో.. సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులుగా ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులుగా పని చేస్తున్న వారిలో కూడా కొంత మంది మండల జిల్లా కేంద్రం కేరాఫ్గా ఉండే వారు. తాజా మాజి సర్పంచులతో పాటు ప్రస్తుతం ఉన్న ఎంపిటిసిలలో కొంత మంది ఇదే వరుసలో ఉన్నారు. చాలా మంది మండల కేంద్రంలో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. పిల్లలు చదువుకోలేక, వ్యాపార పనులకో పల్లెలను వదిలేశారు. ఇలాంటి వారు మళ్లీ ఎన్నికల కోసం ఆగమేఘాల పై సొంత ఊరికి వచ్చి తిరుగుతున్నారు. అవ్వా.. మంచిగున్నావా అంటూ పలకరింపులు మొదలుపెట్టారు. తమ ఊరికి చేసిన ఉపకారాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎవరికైన కష్టం వస్తే ఆపదలో తాము ఆదుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గ్రామఅభివృద్ధికి భారీగా నిధులు కావాలన్నా, గ్రామంలో సమస్యలు పరిష్కారం కావాలంటే పైస్థాయి పరిచయాలు ఉన్న తమలాంటి నేతల మాటలకు విలువ ఇస్తే పూర్తయితాయని భరోసా కల్పిస్తున్నారు. అభ్యర్థులు కూడా వారి వెంటనే.. ఏ గ్రామంలో కూడా మూకుమ్మడిగా ఓట్లను ప్రభావితం చేసే వ్యక్తులపైనే అభ్యర్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎవరి మాట ఎవరు వింటారనేదానిపైనే దృష్టిపెట్టారు. ఇప్పటితరం దానికి భిన్నమైనప్పటికి పాత తరం వారి మాట వేదమంటారు. చైతన్యం ఉన్న వారి అడుగుజాడల్లో నడవాలని కలుస్తారు. అందుకే అభ్యర్థులు కూడా పాత కాలపు ప్రాధాన్యతనిస్తున్నారు. క్యాడర్ సమన్యాయాన్ని, ఎన్నికల బాధ్యతలను అప్పజెబుతున్నారు. చివరి వరకు అన్ని తామే చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు. భవిష్యత్తులో అదే తమకు శ్రీరామరక్ష అవుతుందని తలుస్తున్నారు. పోలింగ్ పూర్తయితేనే కాలు బయట పెట్టి తట్టాబుట్ట సర్దుతారు. అప్పటి వరకు ఊళ్లోనే ఉంటామంటున్నారు నేతలు. -
పథకం పక్కదారి
చింతపల్లి : గ్రామీణ ప్రాంతాల్లోని గొల్ల, కురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రాయితీ గొర్రెల పథకం కొందరికి కాసులపంట పండిస్తుంది. దళారులు లబ్ధిదారుల నుంచి యూనిట్కు రూ. 2వేలు వసూలు చేస్తున్నారు. అధికారులు నాణ్యమైనవి పంపిణీ చేయకపోవడంతో గొర్రెలు మృత్యువాతపడుతున్నాయని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. మరికొందరు అక్రమంగా విక్రయిస్తున్నా అడ్డుకట్ట వేసే వారు కరువవుతున్నారు. చింతపల్లి మండలంలోని 20 గ్రామపంచాయతీల్లో మొదటి దశలో 1105 మంది లబ్ధిదారులు, 2వ విడతలో 1104 మంది లబ్ధిదారులకు రాయితీ గొర్రెలను అందించేందుకు అధికారులు ముందుకొచ్చారు. మొదటి విడతగా 13 గ్రామాలను ఎంపిక చేసి 395 మంది లబ్ధిదారులకు లా టరీ పద్ధతిలో ఎంపిక చేసి 8,295 గొర్రెలను పంపిణీ చేశారు. ప్రతి లబ్ధిదారుడికి కచ్చితంగా 20 గొర్రెలు, ఒక పొట్టేలు అందించాల్సి ఉంది. అధికారులు మాత్రం తక్కువ ధరకు గొర్రెలను కొనుగోలు చేసి 15 గొర్రెలు, 5 పాలు తాగే వయసున్న గొర్రెలను అంటగట్టారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో గొర్రెలను ఇంటికి తెచ్చిన తర్వాత వయసు మీరిన చిన్న గొర్రెలు మృత్యువాతపడుతున్నాయని చెబుతున్నారు. సకాలంలో వైద్యం అందక మరణిస్తున్నాయి. ఇప్పటికే 900 గొర్రెలకు పైగా మృతి చెందినట్లు సమాచారం. 200 యూనిట్లు మాయం.. మండలంలో మొదటి విడతలో 395 మంది లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేశారు. ఇప్పటికే 200 యూనిట్లు విక్రయాలు జరిగినట్లు సమాచారం. ఎప్పటికప్పుడు పశువైద్య అధికారులు గ్రామాలకు వెళ్లి తనిఖీ చేస్తే జీవాలు కనిపించకపోవడంతో కంగుతింటున్నారు. బయటి మార్కెట్లో గొర్రెలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్న అధికారులు పేపర్ ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. లబ్ధిదారులు రూ.31,250 చెల్లిస్తే 21 గొర్రెలను అధికారులు అందిస్తున్నారు. బయటి మార్కెట్లో రూ. 80వేలకుపైగా వస్తుండడంతో మండలంలో అక్రమ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అధికారులు ఇదే అదునుగా చేసుకుని దళారులకు ఒత్తాసు పలుకుతూ గొర్రెల విక్రయానికి సహకరిస్తున్నట్లు సమాచారం. ఒక్కో రైతు వద్ద రూ. 2వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో నెల రోజుల క్రితం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా అధికారులకు ఖంగుతినే పరిస్థితి కనిపించింది. విక్రయదారులు అధికారులు వస్తున్నారనే సమాచారంతో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిన సంఘటనలతో పాటు రెండు, మూడు గొర్రెల గుంపును అధికారులు వచ్చే ముందు వారి ఇంటి ముందు ఉంచుకుంటుండడంతో అధికారులు ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. -
ప్రాణం తీసిన అతి వేగం
సాక్షి, చింతపల్లి: ఉపాధ్యాయులతో వెళ్తున్న కారు ట్రాక్టర్ను ఢీకొనడంతో ఒకరు మృతిచెందిన సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి వద్ద జరిగింది. సాగర్ రహదారిపై చింతపల్లి మండలం గొల్లపల్లి వద్ద ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రయాణిస్తున్న వ్యాగన్ ఆర్ కారు ట్రాక్టరును బలంగా ఢీకొంది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో శ్రీరాం రమేష్(40) అనే ఉపాధ్యాయుడు మృతిచెందాడు. మరో ముగ్గురు సుమలత, సుమతి, రాధారాణిలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైదరాబాద్ కామినేని ఆస్పత్రికి తరలించారు. వీరు హైదరాబాద్ నుంచి చింతపల్లికి వస్తున్నారు. రమేష్ చింతపల్లి సమీపంలోని బోజ్యా తండాలో పనిచేస్తున్నారు. కారు పూర్తిగా ధ్వంసం అయ్యింది. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తున్నది. -
చింతపల్లిలో ల్యాండ్మైన్ పేలుడు: హోంగార్డు మృతి
విశాఖపట్నం: విశాఖ జిల్లాలోని చింతపల్లి మండలంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. స్థానిక మేడివాడ పంచాయతీ పరిధిలో రామన్నపాలెం వద్ద మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ సంఘటనలో ఒక హోంగార్డు మృతి చెందాడు. పోలీసు వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సంచలనం సృష్టించిన వీడియో
చింతపల్లి : మండలంలోని తక్కెళ్లపల్లి గ్రామపంచాయతీ రోటిగడ్డతండాలో ఆదివారం భార్యను హత్య చేసిన భర్త కేసులో పోలీసులకు కీలక ఆధారం చిక్కింది. వివరాలు..రోటిగడ్డతండాకు చెందిన నేనావత్ రాజు బోరుబండిపై డ్రైవర్గా పనిచేస్తున్నాడు. భార్య మోతీ(25) వ్యవసాయకూలీగా పనిచేస్తుంది. రాజు పది ఇరవైరోజులకొకసారి ఇంటికి వస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో భర్య పై రాజు అనుమాను పెంచుకున్నాడు. శనివారం రాత్రి డ్యూటీ దిగి వచ్చిన మద్యం మత్తులో భార్యను అక్రమ సంబంధం అంటగట్టి విచారించసాగాడు. ఈ నేపథ్యంలో కుమారులు ముఖేశ్, రాకేష్ ఇద్దరితో రాత్రి 12గంటల సమయంలో తన సెల్ఫోన్లో వీడియో చిత్రీకరిస్తూ సుత్తితో కొడుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు పోలీసులకు దొరికిన వీడియోలో ఉంది. ఈ వీడియో పోలీసులకు హత్యకు సంబంధించి పూర్తి ఆధారంగా మా రింది. రెండు రోజుల నుంచి పరారీలో ఉన్న నిందితుడు మంగళవారం గ్రామానికి రావడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచా రం అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘట నాస్థలానికి చేరుకుని రాజును విచారించగా తన భార్య తప్పు చే సిందనే అనుమానంతోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. -
అర్ధరాత్రి దారుణం
కొడుకు చేతిలో తండ్రి హతం రాళ్లతో మోది.. గొడ్డలితో నరికి.. చింతపల్లి మండలం మల్లారెడ్డిపల్లిలో ఘటన చింతపల్లి : కొడుకు చేతిలో ఓ తండ్రి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన చింతపల్లి మండలం మల్లారెడ్డిపల్లిలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వస్కుల ముత్తయ్య (50)కి కుమారుడు, కూతురు సంతానం. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు శంకర్ బీటెక్ రెండో సంవత్సరం వరకు చదివి మానేసి జులారుుగా తిరుగుతున్నాడు. మందలించాడని.. ముత్తయ్య ఆదివారం రాత్రి వ్యవసాయ బావి వద్ద నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటికే ఇంట్లో టీవీ చూస్తూ కనిపించిన కుమారుడిని చూడడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. చదువు మధ్యలోనే మానేశావు..ఏ పని చేయకుండా తిరుగుతుంటే పూట ఎలా గడుస్తుందని మందలించాడు. దీంతో కుమారుడు శంకర్ కూడా తండ్రిపై కేకలు వేశాడు. ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. గాఢ నిద్రలో ఉండగా ఘాతుకం.. వాగ్వాదం ముగిసిన తర్వాత ముత్తయ్య ఇంట్లో పడుకున్నాడు. అరుుతే అప్పటికే తండ్రిపై కక్షపెంచుకున్న శంకర్ మాత్రం హత్య చేయాలని నిర్ణరుుంచుకున్నాడు. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న తం డ్రిని బయటికి ఈడ్చుకుంటూ వచ్చి తొలుత రాళ్లతో తలపై బలంగా మోదాడు. కిందపడడంతో ఆపై గొడ్డలి తీసుకుని తలను మొండెం నుంచి వేరు చేశాడు. అంతటితో ఆగకుండా రెండు కాళ్లను దారుణంగా నరికేశాడు. పక్క గదిలో నిద్రిస్తున్న తల్లి వచ్చే సరికి శంకర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఆమె ఏడుపులను విని చుట్టు పక్కల వారు వచ్చే సరికి ముత్తయ్య అప్పటికే విగతజీవుడయ్యాడు. సమాచారం మేరకు ఘటన స్థలాన్ని దేవరకొండ డీఎస్పీ చంద్రమోహన్, ఎస్ఐ నాగభూషణ్రావు పరిశీలించారు. పరారీలో ఉన్న నిం దితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టు డీఎస్పీ తెలిపారు. -
రెండు ఆటోలు ఢీ, 10 మందికి తీవ్రగాయాలు
చింతపల్లి : హైదరాబాద్ – నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారిపై చింతపల్లి మండల పరిధిలోని నసర్లపల్లి ఎక్స్రోడ్డు వద్ద రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం... కొండమల్లేపల్లి వైపు నుంచి∙ఓ ఆటో, చింతపల్లి వైపు నుంచిlవస్తున్న మరో ఆటో నసర్లపల్లి స్టేజీ వద్దకు రాగానే ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చింతపల్లికి సంతకు వెళ్లి వస్తున్న నసర్లపల్లి గ్రామానికి చెందిన పద్మ, సాలమ్మ, సంతోష, యాదయ్య, వెంకటయ్య, వెంకటేష్, సుకుమార్, కౌసల్య, లక్ష్మి, నాగమణి, యాదమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం చింతపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
చింతపల్లి : అతి వేగంతో దూసుకు వచ్చిన ఓ వాహనం.. రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టి అతని మృతికి కారణమైంది.lఈ సంఘటన మండల పరిధిలోని నసర్లపల్లి ఎక్స్రోడ్డు వద్ద శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. చింతపల్లి ఎస్ఐ నాగభూషణ్రావు తెలిపిన వివరాల ప్రకారం... చింతపల్లి మండల కేంద్రానికి చెందిన నల్లా మాసయ్య (45) నసర్లపల్లి సమీపంలోని నిమ్మ తోటలో పని చేస్తున్నాడు. తోట నుంచి∙శుక్రవారం రాత్రి నసర్లపల్లి వద్ద రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో కొండమల్లేపల్లి వైపు నుంచిlపుష్కరాలకు వెళ్లి వస్తున్న టవేరా వాహనం మాసయ్యను ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన ఆయన్ను దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. డ్రైవర్ మద్యం మత్తులో, అజాగ్రత్తతో వాహనాన్ని నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు. వాహనంలో మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. మృతుడి కుమారుడు సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అదుపుతప్పి బోల్తాకొట్టిన కారు.. మహిళ మృతి
చింతపల్లి : హైదరాబాద్–నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారి మరోసారి రక్తసిక్తమైంది. సికింద్రాబాద్కు చెందిన ఒకే కుటుంబం వారు మారుతీ 800 కారులో పుష్కర స్నానాల కోసం సాగర్ వెళ్తుండగా హైదరాబాద్ రాష్ట్ర రహదారిపై చింతపల్లి మండలం వింజమూరు దేవులాతండా సమీపంలో వారి కారు అదుపుతప్పి బోల్తా కొట్తింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృత్యువాత పడగా ఆరుగురు గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సికింద్రాబాద్లోని త్రిపురానగర్ కాలనీకి చెందిన పర్శ లక్ష్మి (35), మహేశ్వర్ కుటుంబ సభ్యులైన తమ్ముడు నాగరాజు, నాగరాజు భార్య ప్రత్యశ్రీ, వారి పిల్లలు నిత్యశ్రీ, పూజ్యశ్రీ, యశ్వంత్లతో కలిసి కృష్ణా పుష్కరాలకు తమ సొంత వాహనమైన మారుతీ 800 కారులో గురువారం ఉదయం నాగార్జునసాగర్కు బయల్దేరారు. మండల పరిధిలోని వింజమూరు దేవులతండా సమీపంలోకి రాగానే కారు అతివేగంతో దూసుకొచ్చి కారు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కనే బోల్తా కొట్టింది. దీంతో కారు నడుపుతున్న పర్శ లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా కారులో ఉన్న యశ్వంత్, నిత్యశ్రీలకు తీవ్ర గాయాలు కాగా నాగరాజు, నిత్యశ్రీ, ప్రత్యశ్రీలకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిలో యశ్వంత్, నిత్యశ్రీల పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి 108 ద్వారా తరలించగా లక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చింతపల్లి ఎస్ఐ నాగభూషణ్రావు తెలిపారు. పండుగ పూట విషాదం.. హైదరాబాద్–నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారిపై ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు గాయాలపాలు కాగా మరొకరు అక్కడికక్కడే మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాఖీ పండుగ సందర్భంగా కృష్ణా పుష్కరాలకు వెళ్తూ ప్రమాదానికి గురి కావడంతో ఆ కుటుంబం తీరని శోకంలో మునిగిపోయింది. -
పుష్కరాలకు విచ్చేయనున్న సూపర్ స్టార్
కృష్ణా పుష్కరాలలో పవిత్ర స్నానం ఆచరించేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ గుంటూరు విచ్చేయనున్నారు. పుష్కరాలలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు ఆహ్వానాలు పంపించింది. త్వరలో రజనీకాంత్ గుంటూరులోని చింతపల్లిలో ఉన్న విష్ణు పంచాయతన దివ్య మహా పుణ్య క్షేత్రానికి చేరుకుని పవిత్ర పుష్కర స్నానం ఆచరించనున్నారు. గతేడాది గోదావరి పుష్కరాలకే ప్రభుత్వం రజనీకి ఆహ్వానం పంపినప్పటికీ.. ఆ సమయంలో ఆయన రాలేకపోయారు. కృష్ణా పుష్కరాలకు రజనీ హాజరవుతారని ప్రభుత్వానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. అనంతరం రజనీ ఓ నెల రోజులపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో 'రోబో 2.0' రెండవ దశ షూటింగ్లో పాల్గొంటారు. రోబో 2.0లో బాలీవుడ్ రుస్తుం అక్షయ్ కుమార్ విలన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. -
2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి
చింతపల్లి : ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో గ్రామాల్లో పేద ప్రజల, రైతుల కడుపులు కొడితే సహించేది లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో భూనిర్వాసితుల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం 123 జీఓను తెచ్చి ప్రజల కడుపు కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తుండగా హైకోర్టు ఆ జీఓను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మళ్లీ హైకోర్టులో అప్పీల్ చేయడం సమంజసం కాదన్నారు. 2013 చట్టం ప్రకారం భూమికి భూమి, ఇళ్లకు బదులు ఇళ్లు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు సీపీఎం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బి. పద్మ, జిల్లా కార్యదర్శి నారి అయిలయ్య, సహాయ కార్యదర్శి శ్రీశైలం, కంబాలపల్లి ఆనంద్, ఉడుగుండ్ల రాములు, నర్సింహ్మ, పోలె యాదయ్య, కృష్ణయ్య, ఆంజనేయులు తదితరులున్నారు. -
రాహుల్ గాంధీ పర్యటన 17కు వాయిదా
అల్లిపురం: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ చింతపల్లి పర్యటనను ఆగస్టు 5 నుండి 17కు వాయిదా వేసినట్టు పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘవీరారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై ఆగస్టు 5న ఓటింగ్కు జరగనున్నందున రాహుల్ చింతపల్లి పర్యటన వాయిదా పడినట్టు తెలియజేశారు. -
నారాయణరావును ఆదర్శంగా తీసుకోవాలి
చింతపల్లి : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, మునుగోడు మాజీ శాసనసభ్యుడు ఉజ్జిని నారాయణరావును ఆదర్శంగా తీసుకుని నేటి యువత ఉద్యమించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని ఘడియగౌరారంలో ఉజ్జిని నారాయణరావు స్మారక స్థూపాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారన్నారు. మూడు పర్యాయాలు మునుగోడు నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించి పేద ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటం చేసి అందరి మనసుల్లో నిలిచారన్నారు. పేద ప్రజలకు భూములు పంచాలని ఎర్ర జెండా పక్షాన ఉద్యమాలు నిర్వహించారని పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ నారాయణరావు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ ఇచ్చే పిలుపుల్లో పాల్గొనాలని కోరారు. ప్రభుత్వాలు, పాలకులు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రానున్న రోజుల్లో యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి, సీపీఐ మాజీ శాసనసభాపక్షనేత గుండా మల్లేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లేపల్లి ఆదిరెడ్డి, రైతు సంఘం జాతీయ అధ్యక్షుడు రావుల వెంకటయ్య, మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పద్మ, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్రావు, బొమ్మగోని ప్రభాకర్, కందిమళ్ల శ్రీనివాస్రెడ్డి, ఉజ్జిని యుగంధర్రావు, పల్లా నర్సింహారెడ్డి, నేలకంటి సత్యం, సృజన, చిలుకూరు జెడ్పీటీసీ శివాజీనాయక్, చంద్రశేఖర్, అంజయ్యనాయక్, ఆరెకంటి మైసయ్య, ముచ్చర్ల మల్లయ్య, శ్రీనివాస్, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పల్లె నర్సింహ, లక్ష్మయ్య, కళాకారులు జగన్, శ్రీనివాస్, సంజీవ, పాండురంగారావు, రాజు తదితరులు పాల్గొన్నారు. పలువురు నేతల పరామర్శ ఉజ్జిని నారాయణరావు కుటుంబాన్ని ఆదివారం పలు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు పరామర్శించి ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. పరామర్శించిన వారిలో రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్రెడ్డి, జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్, మాజీ ఎంపీ తుమ్మలపల్లి దామోదర్రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తదితరులున్నారు. -
2019లో కాంగ్రెస్ విజయం ఖాయం
చింతపల్లి : గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ బలంగా ఉందని 2019 ఎన్నికల్లో విజయం ఖాయమని మాజీ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చార్జి మల్లు రవి అన్నారు. బుధవారం స్థానిక ఐబీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ మండల సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరై ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తలను మోసం చేసి పార్టీ ఫిరాయించిన నాయకులకు రానున్న రోజుల్లో ఓట్లేసిన ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, జిల్లాపరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్, కాంగ్రెస్ మద్దతుతో విజయం సాధించిన సీపీఐ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్లపై గ్రామ స్థాయిలో పార్టీ కార్యకర్తలు వారిపై గుర్రుగా ఉన్నారన్నారు. నాయకులు మోసం చేశారు కాని పార్టీ కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉంటుందన్నారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. కాంగ్రెస్ హయాంలో రెండు రూపాయలకు కిలో బియ్యంతో పాటు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ గృహాలు, విద్యార్థులకు స్కాలర్షిప్, 108, 104, ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ రుణాలు తదితర పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. పార్టీలు ఫిరాయించిన నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. అనంతరం దేవరకొండ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ రమావత్ జగన్లాల్నాయక్ మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్యాదవ్, ఎం.డి. ఖలీల్, రావు నర్సింహారావు, శ్రీనివాస్రెడ్డి, వెంకట్నర్సింహారెడ్డి, ఇంద్రారెడ్డి, తిరుపతయ్య, శ్రావణ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
చింతపల్లిలో చిరుత సంచారం!
గుట్టపై మేక కళేబరం హైనా అయి ఉంటుందంటున్న అటవీ శాఖాధికారి చింతపల్లి(కురవి) : మండలంలోని చింతపల్లి గుట్ట ల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతోంది. చింతపల్లి శివారులోని సీరోలు క్రాస్రోడ్ సమీపంలో ఉ న్న బోడ గుట్టపైన మేకను తిన్న ఆనవా ళ్లు సోమవారం కనిపించించారుు. తండా కు చెందిన భూక్య సూక్యకు చెందిన మేక ల మంద ఆదివారం మేత కోసం వెళ్లగా అందులో నుంచి ఒకటి ఇంటికి తిరిగి రా లేదు. దాన్ని వెతికేందుకు గుట్టపైకి వెళ్లగా కళేబరం(నాలుగుకాళ్లు) కనిపించింది. దీంతో సూక్య భయంతో తండాకు వచ్చి గ్రామస్తుల ద్వారా సీరోలు ఎస్సై ప్రవీణ్కుమార్కు సమాచారం అందజేశారు. ఆయన వెంటనే గుట్టపైకి వచ్చి పరిశీలిం చి మహబూబాబాద్లోని డిప్యూటీ రేంజ్ అధికారి రాజేందర్కి సమాచారం అందించగా తన సిబ్బందితో సంఘటనా స్థలాని కి చేరుకున్నారు. మేక కళేబరాన్ని పరిశీ లించి చిరుతపులి కాదని నిర్ధారించుకుని హైనా అయి ఉంటుందని డిప్యూటీ రేంజ్ అధికారి తెలిపారు. హైనా తోడేలు జాతి కి చెందిన జంతువు అని వివరించి వెళ్లిపోయూరు. తండా గిరిజనులు ఎవరు భయపడవద్దని అటవీశాఖ అధికారులు చెప్పి వెళ్లిపోయూరు. అనంతరం అదే గుట్ట వద్ద పశువులపై జంతువు దాడికి యత్నించడంతో పశువుల కాపర్లు భయంతో పరుగులు తీశారు. పశువులు సైతం పరుగు లు తీశాయి. దీంతో తండావాసులు భ యంతో వణికిపోతున్నారు. జంతువును పట్టుకుని తండావాసులకు రక్షణ కల్పిం చాలని వేడుకుంటున్నారు. ఈ ప్రదేశాన్ని సందర్శించిన వారిలో బీట్ అధికారి పూ ల్య, సిబ్బంది మహేశ్, భాస్కర్, బిక్షపతి, పోలీస్ సిబ్బంది, తండావాసులు, మాజీ సర్పంచ్ జెర్రిపోతుల రంగన్నగౌడ్, మా జీఎంపీటీసీ చందూలాల్ ఉన్నారు. -
పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య
చింతపల్లి : ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం చింతపల్లి మండలంలోని హోమంతాలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అనాజీపురంలో చోటు చేసుకుంది. భర్త వేధింపుల కారణంగానే మృతి చెందిందని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాంపల్లి సీఐ వెంకట్రెడ్డి, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... దేవరకొండ మండలం కొమ్మేపల్లి గ్రామానికి చెందిన దర్శనం పర్వతాలు, అంజమ్మ కుమార్తె రేణుక (28)ను చింతపల్లి మండలం హో మంతాలపల్లి గ్రామ పరిధిలోని అనాజీపురం గ్రామానికి చెందిన వస్కుల రాములు కుమారుడు రాజుకు పది సంవత్సరాల క్రితం ఇచ్చి వివాహం జరిపిం చారు. అప్పటి నుంచి వారికి సంతానం లేని కారణంగా ప్రతి రోజూ రేణుకను హింసించేవాడు. సోమవారం గ్రామస్తులు వనభోజనాలకు వెళ్లడంతో భార్యాభర్తలు ఇరువురూ వెళ్లారు. అక్కడ మద్యం సేవిం చిన రాజు తన భార్యను చితకబాదాడు. దీంతో మనస్థాపానికి గురైన రేణుక అక్కడే వ్యవసాయ పొలంలో ఉన్న పురుగుల మందును తాగింది. విషయం తెలుసుకున్న స్థాని కులు, బంధువులు వెంటనే చికిత్స నిమిత్తం చింతపల్లికి తరలి స్తుం డగా మృతి చెందింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం మండలంలోని అనాజీపురంలో రేణుక మృతి చెందిందన్న విషయం తెలుసుకున్న కొమ్మేపల్లి గ్రామస్తులు అనాజీపురానికి చేరుకున్నారు. అక్కడ రాజు కుటుంబ సభ్యులకు, రేణుక కుటుంబీకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న నాంపల్లి సీఐ వెం కట్రెడ్డి, ఎస్ఐ శంకర్రెడ్డి తమ సిబ్బం దితో గ్రామానికి చేరుకుని ఇరువర్గాల వారికి నచ్చజెప్పారు. అనంతరం సంఘటనకు గల కారణాలను బంధువులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాం ఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిం చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. భర్తే కారణమని ఫిర్యాదు రేణుకకు సంతానం లేని కారణంగా పది సంవత్సరాల నుంచి ప్రతి రోజూ రాజు రేణుకను చితకబాదేవాడని ఆమె బంధువులు, తల్లిదండ్రులు ఆరోపించారు. రాజు మద్యం సేవించి రేణుకను హింసకు గురి చేసేవాడని, సోమవారం కూడా కొట్టడంతో భరించలేక ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని వారు కోరారు. -
150 కేజీల గంజాయి స్వాధీనం
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలం ఎ. సోమవరం వద్ద శుక్రవారం ఉదయం ఎక్సైజ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 150 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఒకరిని అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య
నల్గొండ : చింతపల్లి మండల కేంద్రంలో ఏడో తరగతి విద్యార్థి మంగళవారం అనుమానాస్పదస్థితిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానిక జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న పి.శ్రీను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థి మృతికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. -
అప్పులబాధతో పత్తి రైతు ఆత్మహత్య
చింతపల్లి: పత్తి పంట పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో పాటు కూతురు వివాహం కోసం చేసిన అప్పు ఎక్కువవడంతో.. వాటిని తీర్చే దారి కానరాక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కొక్కిరాల తండలో శనివారం చోటు చేసుకుంది. తండాకు చెందిన కొర్ర భాను(44) తనకున్న రెండున్నర ఎకరాల భూమితో పాటు మరో ఐదున్నర ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేశాడు. ఆశించిన మేర దిగుబడి రాకపోవడంతో.. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పలు పెరిగిపోయాయి. దీనికి తోడు వారం రోజుల క్రితమే కూతురు వివాహం కోసం కూడా అప్పు చేశాడు. అవి తీర్చడం గురించి మధన పడుతున్న భాను ఈ రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మన్యంలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
విశాఖ ఏజెన్సీ వణుకుతోంది. ఉష్ణోగ్రతలు ఆదివారం మరింతగా పడిపోయాయి. లంబసింగిలో ఆదివారం ఉదయం 3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లిలో 6 డిగ్రీలుగా ఉంది. ఇక పాడేరు, మోదపల్లిలో 7 డిగ్రీలు నమోదైంది. లంబసింగిలో శనివారం ఉదయం 7 డిగ్రీల ఉష్ణోగ్రత, చింతపల్లిలో 10 డిగ్రీలు ఉండగా ఆదివారం ఉదయం నాటికి బాగా తగ్గినట్టు తెలుస్తోంది. చలి గాలులు, మంచుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 20 అడుగుల దూరంలో ఏమీ కనిపించని పరిస్థితి నెలకొంది. -
'ఆదిమ జాతి అంతరిస్తుంది'
-
'ఆదిమ జాతి అంతరిస్తుంది'
చింతపల్లి: బాక్సైట్ తవ్వకాలతో నీరు కలుషితమవుతుందని వైఎస్సార్ సీపీ అరకు ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వరరావు తెలిపారు. విశాఖపట్నం జిల్లా చింతపల్లిలో వైఎస్సార్ సీపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బాక్సైట్ తవ్వకాలతో 250 గ్రామాలు ప్రమాదంలో పడే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. విషపూరిత రసాయనాలు విడుదలయి, భూగర్భ జలాలు కలుషితవుతాయని చెప్పారు. చట్టుపక్కల ప్రాంతాల్లో ప్రవసిస్తున్న నదీజలాలు కూడా కలుషితం అవుతాయని, గిరిజన ప్రజలకు కొత్త రకాల రోగాలు వచ్చి ఆదిమ జాతి అంతరిస్తుందని అన్నారు. తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల వాసులకు తాగునీరు సంక్షోభం తప్పదని, విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందని వివరించారు. -
'అధికారంలోకి వచ్చారు కాబట్టి తప్పుకాదట'
-
'అధికారంలోకి వచ్చారు కాబట్టి తప్పుకాదట'
చింతపల్లి: తన బంధువులు, టీడీపీ నాయకులకు లాభం చేకూర్చేందుకే ఏపీ సీఎం చంద్రబాబు బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్ సీపీ కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి ఆరోపించారు. విశాఖపట్నం జిల్లా చింతపల్లిలో గురువారం వైఎస్సార్ సీపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. విపక్ష నేతగా ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలను చంద్రబాబు వ్యతిరేకించారని ఆమె గుర్తు చేశారు. తవ్వకాల వల్ల గిరిజనులకు, పర్యావరణానికి చాలా నష్టం జరుగుతుందని 2011లో ప్రభుత్వానికి ఆయన లేఖ రాశారని, నిన్నమొన్నటివరకు ఈ లేఖ టీడీపీ వెబ్ సైట్ లోనూ ఉందని తెలిపారు. అధికారంలోకి వచ్చారు కాబట్టి బాక్సైట్ తవ్వకాలు తప్పుకాదు అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. 97 జీవో విడుదల చేసి గిరిజనుల అభివృద్ధి కోసమేనని చెప్పడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. నిజంగా గిరిజనులపై ప్రేమవుంటే గిరిజన గ్రామాలకు, తండాలకు మంచినీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు బాసటగా వైఎస్సార్ సీపీ నిలుస్తుందని హామీయిచ్చారు. -
విశాఖలో వైఎస్ జగన్కు ఘన స్వాగతం
-
విశాఖలో వైఎస్ జగన్కు ఘన స్వాగతం
విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి వైఎస్ జగన్ అనకాపల్లి బయల్దేరారు. అక్కడ నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైఎస్ జగన్ నర్సీపట్నం మీదుగా చింతపల్లి బయల్దేరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన బాక్సైట్ ఖనిజ తవ్వకాలకు నిరసనగా జిల్లాలోని చింతపల్లిలో ఇవాళ బహిరంగ సభ జరగనుంది. 'విశాఖ బాక్సైట్ - గిరిజనుల హక్కు' అనే నినాదంతో మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. బాక్సైట్ ఖనిజ తవ్వకాలపై వైఎస్ఆర్ సీపీ కార్యచరణను ఆయన ప్రకటిస్తారు. -
కుక్క దాడిలో 19 మేకలు మృతి
చింతపల్లి (నల్లగొండ) : ఇంట్లో కట్టేసి ఉన్న మేకలపై కుక్క దాడి చేసిన ఘటనలో 19 మేకలు మృతిచెందాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం హర్జనాపురం తండాలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. తండాకు చెందిన ఓ రైతు మేకలను ఇంట్లో కట్టేసి పని మీద పక్క ఊరికు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఉన్న మేకలను కుక్క చంపేసింది. దీంతో రైతు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. -
ఫార్మా కంపెనీలో పేలుడు: ముగ్గురికి గాయాలు
విజయనగరం: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని చింతపల్లిలో ఓ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది. శుక్రవారం కంపెనీలోని యూనిట్-8 లో రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కు తరిలించారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మాజీ ఎమ్మెల్యే దేముడు కన్నుమూత
విశాఖపట్నం: విశాఖ జిల్లా చింతపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దేముడు అస్వస్థతతో మరణించారు. ఆయన గత కొద్ది రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. దేముడు సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కన్నుమూశారు. సీపీఐ తరఫున ఆయన చింతపల్లి నియోజకవర్గం నుంచి 1994, 2004 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన నిస్వార్థ రాజకీయ నాయకుడిగా, ప్రజల కోసం పనిచేసిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. దేముడు అంత్యక్రియలు మండలంలోని శరబన్నపాలెంలో జరుగనున్నాయి. -
బాక్సైట్ తవ్వకాలపై తీర్మానం
బాక్సైట్ తవ్వకాలకు వ్యతికేకంగా 20 గ్రామాల ప్రజలు ఏకమయ్యారు. చింతపల్లి మండలం బలపం అటవీ ప్రాంతంలో సమావేశమయ్యారు. 1/70 చట్టాన్ని అమలు పరచాలని ఈ సమావేశంలో ప్రజలు తీర్మానించారు. బాక్సైట్ గనుల్లో గుణపాలు దించితే.. తమ పదవులకు రాజీనామా చేస్తామంటూ ప్రజాప్రతినిధులు ప్రతిన బూనారు. ఈ కార్యక్రమంలో బాక్సైట్ చింతపల్లి పరిసర ప్రాంతాలకు చెందిన 20 గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. కాగా.. ఇటీవల బాక్సైట్ తవ్వకాలను ఆపాలంటూ.. తెలుగు దేశం పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులను మావోయిస్టులు అరెస్టు చేసిన సంగతితెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రజా ప్రతినిధులు, ప్రజలు బాక్సైట్ మైనింగ్ కి వ్యతిరేకంగా తీర్మానం చేయడం జిల్లా వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. -
ప్రాణం తీసిన వరకట్న వేధింపులు
సమాజం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నా... మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా ఇంకా వరకట్న చావులు ఆగడంలేదు. నిత్యం ఏదో ఒక చోట వరకట్నం బాధితులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తాజాగా మంగళవారం మండలంలోని గొల్లపల్లిలో వరకట్నం వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. - చింతపల్లి మండల పరిధిలోని మర్రిగూడ మండలం ఖుధాభక్ష్పల్లికి చెందిన పాలకుర్ల పద్మయ్య, లక్ష్మమ్మ రెండో కుమార్తె శివలీల (24)ను గొల్లపల్లి గ్రామానికి చెందిన అల్వాల నారయ్య, ముత్తమ్మల కుమారుడు అల్వాల జంగయ్యకు గత నాలుగేళ్ల కిందట వివాహం జరిపించారు. వివాహ సమయంలో నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని పెద్దమనుషుల సమక్షంలో ఒప్పుకున్నారు. మొదట మూడు లక్షలు ముట్టజెప్పి వివాహ అనంతరం మిగిలిన లక్ష ఇస్తామని పెళ్లి జరిపించారు. అయితే అట్టి డబ్బులకోసం భర్త జంగయ్య, శివలీల అత్త ముత్తమ్మలు తరచూ కోడలిని వేదింపులకు గురి చేసేవారు. పలుమార్లు పంచాయితీకూడా పెట్టారు. నెలకిందట డబ్బులు తీసుకొని రావాలని తల్లిగారింటికి పంపించి రోజు ఫోన్లో మానసికంగా వేదించేవారు. ఈ నేథప్యంలో సోమవారం రాత్రి శివలీలను కట్నం తీసుకరావాలని భర్త చితకబాదాడు. అవమానం భరించలేని వివాహిత మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేనిదిచూసి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. పొగలు రావడం గమనించిన చుట్టుపక్కల వారు తలుపులు తెరచిచూడగా అప్పటికే శివలీల మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎస్ఐ రాఘవేందర్రెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించా రు. బంధువులు, చుట్టు పక్కల వారిని ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వరకట్నం వేధింపులు భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. భర్త, అత్తలే కడతేర్చారు : మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణ శివలీల వివాహం అయిన రెండు నెలల నుంచే కట్నం కోసం భర్త జంగయ్య, అత్త ముత్తమ్మలు వేధించేవారని, కట్నం విషయమై తమ బిడ్డ ఇంటికొచ్చి గోడు వెళ్లబోసుకునేదని మృతురాలి తల్లిదండ్రులు వాపోయారు. పలుమార్లు పెద్దమనుషులు నచ్చజెప్పిటినప్పటికీ కూతురు ప్రాణం పోయేవరకు వదిలిపెట్టలేదని కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమార్తెను అత్త, భర్తలే కడతేర్చారని వారు ఆరోపించారు. ఇదిలావుండగా శివలీల ఆత్మహత్య సంఘటన జరిగినప్పటినుంచి అత్తా, భర్తలు పరారీలో ఉండటం అనుమానాలకు తావిస్తోంది. -
1100 కేజీల గంజాయి పట్టివేత
విశాఖపట్నం: విశాఖపట్నం ఏజెన్సీలో గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుంది. అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా ఆదివారం చింతపల్లి మండలం రాజుపాకల వద్ద వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 1100 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంతో భయపడిన వాహన డ్రైవర్ వాహనం వదలి పరారైయ్యాడు. పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని.. సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లింట విషాదం
అదుపు తప్పి పెళ్లిబృందం లారీ బోల్తా ఇద్దరి దుర్మరణం మరో 32 మందికి తీవ్రగాయాలు తక్కెళ్లపల్లి శివారులో ఘటన పచ్చని తోరణాలు..బంధువుల సందడి.ఒకరినొకరి పలకరింపులు.. చిన్నారుల కేరింతలు.. ఆడపడుచుల అలంకరణలు.. ఇలా ఆ ఇంట్లో పండగవాతావరణం..కొన్ని గంటల్లో ఓ జంటను ఒక్కటి చేసేందుకు పెళ్లి బృందం సభ్యులంతా ఓ లారీలో బయలుదేరారు...పట్టుమని పది నిమిషాలు గడిచాయో లేదో.. ఈ లోపు పిడుగులాంటి వార్త.. అప్పటి వరకు సందడిగా ఉన్న ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. స్థానికులు, పోలీసుల కథనం - చింతపల్లి చింతపల్లి మండలం తక్కెళ్లపల్లి గ్రామ పంచాయతీ పరి ధి రోటిగడ్డతండాకు తౌర్యానాయక్ కుమారు డు ఇస్లావత్ నరేష్కు నాంపల్లి మండల పరిధిలోని ముష్టిపల్లి తండాకు చెందిన సీతారామ్నాయక్ కుమార్తె అనుజతో బుధవారం ముష్టిపల్లిలో వివాహం జరగనుంది. ఆ వేడుకకు హాజరయ్యేందుకు పెళ్లికుమారుడి బంధువు లు తక్కెళ్లపల్లి నుంచి లారీలో బయలుదేరారు. అదుపుతప్పి.. బోల్తాకొట్టడంతో.. తక్కెళ్లపల్లి నుంచి బయలుదేరిన పెళ్లిబృందం లారీ గ్రామ శివారులోకి రాగానే అదుపు తప్పి ఒక్కసారిగా బోల్తాకొట్టింది. దీంతో లారీలో ప్ర యాణిస్తున్న నేనావత్ బాష (62), నేనావత్ చావిలి (65) అక్కడికక్కడే మృతిచెందగా నేనావత్ జ్యోతి, నేనావత్ సోనా, నేనావత్ రంజిత, నేనావత్ అశోక్, కేతావత్ నాకో, ఇస్లావత్ బాలా, నేనావత్ సావుకార్, నేనావత్ కిష న్, ఇస్లావత్ నాన్కు, నేనావత్ జంగి, ఇస్లావత్ మహేష్, ఇస్లావత్ జంగి, ఇస్లావత్ గోవి ందు, ఇస్లావత్ లక్ష్మి, మెగావత్ సుప్రజ, ఇస్లావత్ బిచ్యా, ఇస్లావత్ అఖిల, ఇస్లావత్ కమ్లి, నేనావత్ జీజీ, నేనావత్ రెడ్డి, ఇస్లావత్ రుక్క మ్మ, నేనావత్ భూమిక, నేనావత్ సుప్రియ, సపావట్ లక్ష్మి, నేనావత్ జుమాని, నేనావత్ రాం చంద్ర, ఇస్లావత్ బుజ్జి, నేనావత్ కింగినా, నేనావత్ చక్రి, నేనావత్ చంటి, ఇస్లావత్ రా ములు, స్వప్నలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆహాకారాలు.. ఆర్తనాదాలు పెళ్లి బృందం లారీ ఒక్కసారిగా బోల్తా కొట్టడంతో అందులో ఉన్న వారు తలా ఒ దిక్కు ఎగిరిపడ్డారు. తీవ్రగాయాలతో తమను రక్షిం చాలని కోరుతూ వారు చేసిన ఆర్తనాదాలకు స్థానికులు చలించిపోయారు. ప్రమాదం జరి గిందని తెలసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్య లో ప్రమాదస్థలికి చేరుకుని క్షతగాత్రులను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కొంపముంచిన అతివేగం వివాహానికి వెళ్తున్న డ్రైవర్ లారీని అజాగ్రత్తతతో, అతివేగంతో నడపడంతో ప్రమాదం చో టు చేసుకుందని క్షతగాత్రులు ఆరోపించారు. గ్రామం నుంచి బయల్దేరిన పది నిమిషాలకే అతివేగంతో ఉన్న లారీ తక్కెళ్లపల్లి గ్రామశివారులోకి రాగానే సడన్ బ్రేక్ వేయడంతో ఒక్కసారిగా బోల్తా కొట్టిందన్నారు. ఇరుకు రోడ్డులోనూ అతివేగంగా వచ్చి ప్రమాదానికి డ్రైవరే కారణమయ్యాడని క్షతగాత్రులు వాపోయారు. రోడ్డుపై లారీ పడి ఉండటంతో వాహనాలు వెళ్లే దారి లేకపోవడంతో వాహనదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇబ్బందులు ఎదుర్కొన్న క్షతగాత్రులు ప్రమాదంలో తీవ్ర గాయాలైన క్షతగాత్రులు మధ్యాహ్న సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చింతపల్లికి 108 ఒకటి మాత్రమే అందుబాటులో ఉండటంతో అందులో సుమారు 15 మందిని హుటాహుటీనా హైదరాబాద్కు తరలించినప్పటికీ ప్రమాదంలో గాయపడిన మరో 15 మంది వరకు అక్కడే పడి ఉన్నారు. దేవరకొండ 108కు సమాచారం అందించినప్పటికీ సమయానికి సంఘటన స్థలానికి చేరుకోకపోవడంతో క్షతగాత్రులు ఆటో, ట్రాక్టర్ ద్వారా పోలీసులు, బంధువులు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే సంతాపం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన, గాయపడిన వారి కుటుంబాలను దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించాలని గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు తక్కెళ్లపల్లి గ్రామశివారులో ప్రమాదం చోటు చేసుకుందని విషయం తెలుసుకున్న చింతపల్లి ఎస్ఐ రాఘవేందర్రెడ్డితో పాటు నాంపల్లి సీఐ ఈర్లపల్లి వెంకట్రెడ్డి, మర్రిగూడ ఎస్ఐ మురళి హుటాహుటినా సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను 108 ద్వారా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. -
ఒక నెల పనికి..రెండు జీతాలు..!
చింతపల్లి సబ్ ట్రెజరీలో మరో వింత సాంకేతిక లోపమే అంటున్న అధికారులు చింతపల్లి : చింతపల్లి సబ్ ట్రెజరీలో నిధుల దుర్వినియోగం కుంభకోణాన్ని మరవకముందే మరో ఘటన వెలుగుచూసింది. కొందరు ఉద్యోగులు వేతనాలు అందక ఇబ్బందులు పడుతుంటే, మరికొందరు ఉద్యోగులకు ఒకే నెలకు రెండు సార్లు వేతనాలు జమకావడం చర్చనీయాంశమైంది. ఈ సబ్ ట్రెజరీలో వైద్య ఆరోగ్యశాఖలో బోగస్ కాంట్రాక్టు ఉద్యోగుల పేరిట రూ.కోట్ల నిధుల దుర్వినియోగంపై ఎస్టీఓ లోకేశ్వరరావు, అకౌంటెంట్ అప్పలరాజులపై వేటు పడటం తెలిసిందే. స్థానిక సబ్ ట్రెజరీ కార్యాలయంలో చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో పని చేస్తున్న వివిధ శాఖల ఉద్యోగుల వేతనాలు, ప్రభుత్వ వసతిగృహాల నిర్వహణ, అంగన్వాడీ కేంద్రాల బడ్జెట్ రూ.కోట్లలో లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నుంచి వేతన బిల్లుల చెల్లింపుల్లో ప్రవేశ పెట్టిన నూతన విధానాలు ఆన్లైన్ చేయించడంలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో వివిధ శాఖలకు చెందిన వంద మంది ఉద్యోగుల వేతనాలు వారి అకౌంట్లలో జమకాలేదు. వారంతా వేతనాలకోసం ప్రతి రోజూ సబ్ట్రెజరీ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. హైదరాబాద్ ప్రధాన ఖజానా కార్యాలయానికి ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ పరిస్థితుల్లో కొంతమంది ఉద్యోగులకు ఒకే నెలలో రెండుసార్లు వేతనాలు జమ అయ్యాయి. ఈ విషయాన్ని కొంతమంది సహకార ఉద్యోగులు ట్రెజరీ అధికారులకు సమాచారం అందించారు. చింతపల్లి ఐసీడీఎస్కు అదనంగా రూ.7.30 లక్షల వరకు నిధులు జమ అయ్యాయి. స్థానిక కేంద్రీకృత ఆశ్రమ పాఠశాలలో ఎనిమిది మంది ఉపాధ్యాయులకు, పశువుల ఆస్పత్రిలోని కొంతమంది ఉద్యోగులకు ఒకే నెలలో రెండు నెలలకు సంబంధించిన వేతనాలు జమ అయినట్టు అధికారుల దృష్టికి వచ్చింది. బిల్లింగ్ నమోదులో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా రెండోసారి వారి ఖాతాల్లోకి వేతనాలు జమ అయ్యాయని, వాటిని సీఎన్బీ ఖాతాల్లోకి బదిలీచేస్తున్నారని ఇన్చార్జి ఎస్టీవో శ్రీనివాసులు తెలిపారు. -
ట్రెజరీ కుంభకోణంపై సీఎం సీరియస్
విజిలెన్స్ విచారణకు రంగం సిద్ధం {పిన్సిపల్ సెక్రటరీని మరోసారి కోరిన కలెక్టర్ నెలరోజులైనా స్పందించని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను తప్పించేందుకు ప్రయత్నాలు ఐసీడీఎస్, విద్యాశాఖల్లోనూ అవినీతి జలగలు విశాఖపట్నం: రాష్ర్టవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చింతపల్లి సబ్ ట్రెజరీ కుంభకోణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్గా ఉన్నట్టు తెలిసింది. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై ఆయన దృష్టి సారించినట్టుగా చెబుతున్నారు. విజిలెన్స్చే విచారణ చేపట్టాలని ఇప్పటికే కలెక్టర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై ఇప్పటికే రెండుసార్లు లేఖలు రాసిన కలెక్టర్ స్వయంగా ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలతో కూడా చర్చించినట్టు తెలియవచ్చింది. బుధవారం విశాఖ వస్తున్న ముఖ్యమంత్రి ఈ మేరకు ప్రకటన చేసే అవకాశాలున్నాయి. విజిలెన్స్ విచారణ జరిగితే కానీ ఈ కుంభకోణానికి మూలమైన వైద్యఆరోగ్యశాఖ, ట్రెజరీ శాఖల్లో ఏ స్థాయి అధికారుల ప్రమేయం ఉందో.. ఎవరెవరు ఎంత స్వాహా చేశారో తేలే అవకాశాలు లేవు. ఇప్పటి వరకు తేలిన మొత్తం రూ.3.61కోట్లుమాత్రమే అయినప్పటికీ ఈ మొత్తం కనీసం రూ.15 కోట్లకుపైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతంలో చలానాలు.. పే స్లిప్లతో జీతభత్యాల బట్వాడా జరిగేది. ఆన్లైన్ అమలులోకి వచ్చాక నేరుగా సంబంధిత ఉద్యోగి అకౌంట్లోకి జమవుతుండడంతో అవతకవకలకు కొంత మేర బ్రేకుపడింది. కేవలం రెండేళ్ల వ్యవధిలో పక్కదారి పట్టిన మొత్తమే రూ.3.61కోట్లుంటే కనీసం ఐదారేళ్లకు ముందు లోతైనదర్యాప్తు జరిపితే ఈమొత్తం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని అంటున్నారు. ఈ కుంభకోణం వెలుగు చూసి నెల రోజులైంది. నిధులను పక్కదారి పట్టించడంలో చక్రం తిప్పిన చింతపల్లి సబ్ ట్రెజరీలో సీనియర్ అకౌంట్, ఎస్టీవోలపై వేటు వేశారు. కానీ ఈ కుంభకోణం ద్వారా వైద్య ఆరోగ్యశాఖలో కోట్లు మింగిన ఘనులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలకు ఆ శాఖ ఉపక్రమించలేదు. అంతర్గత విచారణతో కాలయాపన చేసిన ఆ శాఖాధికారులు ఈ అవినీతిలోఎంతమంది ప్రమేయం ఉంది? ఏ స్థాయి అధికారుల భాగస్వామ్యం ఉందో మాత్రం నిగ్గు తేల్చలేకపోతున్నారు. ఉన్నత స్థాయి నుంచి వస్తున్న ఒత్తిళ్ల మేరకే ఆశాఖలో స్వాహాపరుల జాబితాను బయటకువిడుదల చేయడంలేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. పైగా ఇందులో ప్రత్యక్షంగా కోట్లుమింగిన ఉన్నతాధికారులను తప్పించేందుకు చాపకింద నీరులా ప్రయత్నాలు సాగుతున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే పోలీస్ శాఖ ద్వారా విచారణ సాగుతోంది. విజిలెన్స్ విచారణ మొదలైతే కానీ కలుగులో దాక్కున్న అవినీతి ఎలుకలు బయటకొచ్చే అవకాశాల్లేవు. కుంభకోణం మూలాలపై ఆరా విశాఖ మెడికల్: చింతపల్లి ట్రెజరీలో ఇటీవల జరిగిన భారీ కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తునకు నియమించిన అనకాపల్లి క్రైం విభాగం డీఎస్పీ కృష్ణవర్మతోపాటు ఇద్దరు సభ్యుల బృందం బుధవారం మధ్యాహ్నం విశాఖలోని డీఎంహెచ్వో కార్యాలయంలో ఆరా తీశారు. ఈ వ్యవహారంలో కొందరు వైద్య,ఆరోగ్యశాఖ సిబ్బంది పాత్ర ఉంటుందన్న అనుమానంతో డీఎస్పీ కృష్ణవర్మ డీఎంహెచ్వో కార్యాలయ సిబ్బంది ప్రమేయంపై కూపీలాగారు. తొలుత డీఎంహెచ్వో డాక్టర్ జె.సరోజినిని కలిశారు. ప్రాథమిక సమాచారం సేకరణతోపాటు దర్యాప్తునకు సహకరించాలని కోరారు. పూర్తి సమాచారం కోసం ఒక సీనియర్ సహాయకునితో పాటు వాహనాన్ని సమకూర్చాలన్నారు. అందుకు డీఎంహెచ్వో సుముఖత వ్యక్తం చేశారు. కార్యాలయంలో పనిచేస్తున్న కె.సూర్యనారాయణ అనే సీనియర్ సహాయకుడ్ని కేటాయించారు. 2012 ఏప్రిల్ నుంచి 2013 మార్చి 31 మధ్యకాలంలో డీఎంహెచ్వో కార్యాలయం నుంచి పాడేరు అదనపు డీఎంహెచ్వోకు బట్వాడా చేసిన నిధులకు సంబంధించిన రికార్డులను అకౌంట్స్ విభాగం నుంచి దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. ఇందులో భాగంగా అకౌంట్స్ విభాగం పర్యవేక్షకురాలు నిర్మల, కార్యాలయ పరిపాలనాధికారి విశ్వేశ్వరరావును విచారించారు. వారి చిరునామాలు,సెల్ఫోన్ నంబర్లను సేకరించారు. దీనికి సంబంధించి డీఎంహెచ్వో సరోజిని మాట్లాడుతూ ఈవ్యవహారంలో తమ కార్యాలయం ప్రమేయం ఉండదన్నారు. పాడేరు కేంద్రంగా ఉన్న 11 ఏజన్సీ మండలాల పరిధిలోని పీహెచ్సీల నిర్వహణకు సంబంధించిన 80 శాతం నిధులను ప్రభుత్వం అదనపు డీఎంహెచ్వో ఖాతాకు నేరుగా పంపిస్తుందన్నారు. ఆ నిధులు చాలని పక్షంలో 20 శాతం తమ కార్యాలయం నుంచి బట్వాడా చేస్తామన్నారు. అవి అదనపు డీఓంహెచ్వో ద్వారా పీహెచ్సీలకు సబ్ట్రెజరీద్వారా వెళ్తాయన్నారు. -
మార్చినాటికి జంటనగరాలకు కృష్ణా నీళ్లు
పెద్ద అడిశర్లపల్లి/ చింతపల్లి : కోదండాపురం ప్లాంట్ నుంచి మార్చి నాటికి మూడోదశ పైపులైన్ ద్వారా జంటనగరాలకు కృష్ణాజలాలు అందిస్తామని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి టి. పద్మారావు వెల్లడించారు. సోమవారం ఆయన హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ(హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు)అధికారులతో కలిసి పెద్ద అడిశర్లపల్లి మండలంలోని కోదండాపురం ప్లాంటును, మూడోదశ పైపులైన్ పనులను అలాగే చింతపల్లి మండలంలోని గొడకొండ్ల, నసర్లపల్లి వాటర్ప్లాంట్లలో కొనసాగుతున్న పైపులైన్ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జంటనగరాలకు తాగునీటి అవసరాల దృష్ట్యా నాలుగో పైపులైన్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్ వరకు చేపట్టిన పైప్లైన్ పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. సుంకిశాల డీపీఆర్(డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణ రాష్ట్రం తీవ్ర కరెంట్ సమస్యను ఎదుర్కొంటున్నదని అన్నారు. అర్హులందరికీ ఆహారభద్రత కార్డులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలందరికీ ఈ కార్డులు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అవసరమైతే నూతనంగా మరో పది లక్షల కార్డులైనా అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గొడకొండ్ల, నసర్లపల్లి వాటర్ప్లాంట్లలో పని చేస్తున్న పలువురు కాంట్రాక్టు ఉద్యోగులు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట బోర్డు ఎండీ జగదీశ్వర్, ఈడీలు సత్యనారాయణ, ప్రభాకర్ శర్మ, కొండారెడ్డి, శ్రీధర్బాబు, డెరైక్టర్ రామేశ్వర్ రావు, డీజీఎం దశరథరెడ్డి,డిప్యూటీ కమిషనర్ అనసూయాదేవి, ఈఎస్లు దత్తరాజ్గౌడ్, శ్రీనివాస్, ఏఈలు పవన్కుమార్ , ధనవంతరెడ్డి పాల్గొన్నారు. -
గ్రామస్థుల దాడిలో ముగ్గురు మావోయిస్టుల మృతి
ఇన్ఫార్మర్ అనే ముద్ర వేసి మావోయిస్టులు ఓ గిరిజనుడిని హతమార్చారు. దాంతో ఆగ్రహించిన గ్రామస్థులు మావోయిస్టులపై ఎదురుదాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. ఈ సంఘటన విశాఖ జిల్లా ఏజెన్సీ పరిధిలోని చింతపల్లి మండలం కోరుకొండలో జరిగింది. కొత్తగా పెళ్లయిన ఓ గిరిజన యువకుడిని ప్రజాకోర్టులో ఇన్ఫార్మర్ అని మావోయస్టులు ముద్ర వేశారు. అయితే అతడిని చంపొద్దని గ్రామస్థులు వేడుకున్నా, మావోయిస్టులు వినిపించుకోకుండా అతడిని చంపేశారు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గిరిజనులు.. రాళ్లతో కొట్టి ముగ్గురు మావోయిస్టులను చంపేశారు. మృతుల్లో డీసీఎం స్థాయి నేత కూడా ఒకరున్నారు. ఏకే 47 సహా మరికొన్ని ఆయుధాలు సంఘటన స్థలంలో లభించాయి. ఇటీవలి కాలంలో ఆంధ్రా ఒడిషా సరిహద్దు ప్రాంతం (ఏవోబీ)లో మావోయిస్టుల కదలికలు కొంత వరకు తగ్గుముఖం పట్టాయి. అందులోనూ, హుదూద్ తుఫానుతో ఈ ప్రాంతం అంతా అల్లకల్లోలంగా మారడంతో.. మావోయిస్టులు కూడా పెద్దగా ఎలాంటి కార్యకలాపాలు చేయట్లేదు. అయితే ఉన్నట్టుండి ఓ గిరిజనుడిని వాళ్లు హతమార్చడంతో.. గ్రామస్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. గ్రామస్థులు ఇలా దాడి చేయడం, వారి దాడిలో మావోయిస్టులు మరణించడం లాంటి సంఘటనలు ఇటీవలి కాలంలో ఎప్పుడూ లేవు. -
రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురి మృతి
జిల్లాలో శుక్రవారం రాత్రి, శనివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. చింతపల్లి వద్ద ఒకరు, కొయ్యలగూడెం శివారులో మరొకరు, ఎల్లారెడ్డిగూడెం వద్ద ఇంకొకరు మృత్యువాత పడ్డారు. కొండమల్లేపల్లి, జలాల్పూర సమీపంలో, అక్కంపల్లి స్టేజీ వద్ద ఒక్కొక్కరు దుర్మరణం పాలయ్యారు. చింతపల్లి : రెండు బైక్లు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి చింతపల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాఘవేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నాంపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన గట్టుపల్లి రఘుమారెడ్డి (24) చింతపల్లి మండలం ఉమ్మంతాలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అనాజీపురంలోని తన అత్తగారింటికి దసరా పండగకు వస్తున్నాడు. మార్గమధ్యలో చింతపల్లి పోలీస్స్టేషన్ సమీపంలో చింతపల్లి ఎక్స్రోడ్డు వైపు వెళ్తున్న మరో ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో రఘుమారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం దేవరకొండకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ సివిల్ ఆస్పత్రికి తరలించారు. బైక్ పైనుంచి పడి... చౌటుప్పల్: మండలంలోని కొయ్యలగూడెం శివారులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. వివరాలు.. మండలంలోని ఖైతాపురం గ్రామానికి చెందిన గోపి రాజు(32) ఆర్టీసీ డ్రైవర్. ఇతనికి ఇద్దరు పిల్లలు. దసరా పండగకని అతని భార్య, పిల్లలు రెండు రోజుల క్రితమే సంస్థాన్ నారాయణపురం మండలం మల్లారెడ్డిగూడెం వెళ్లారు. ఈయన కూడా శుక్రవారం రాత్రి అత్తవారింటికి బైక్పై బయలు దేరాడు. కొయ్యలగూడెం శివారులోకి రాగానే జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జి దిగువ భాగంలో బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ఘటనలో బ్రిడ్జికి ఉన్న పైపు రాజు తలకు తగలడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లు తెలిపారు. బస్సులో నుంచి జారిపడి వృద్ధుడు కొండమల్లేపల్లి : బస్సు నుంచి జారిపడి ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన కొండమల్లేపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పీఏపల్లి మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన ఎర్ర పుల్లయ్య (68) కొండమల్లేపల్లి నుంచి గుడిపల్లికి ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా కొండమల్లేపల్లి చౌరస్తా మూలమలుపు వద్ద బస్సులో నుంచి జారిపడ్డాడు. దీంతో బస్సు వెనుక చక్రాల కింద అతడి శరీరం పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బొలెరో వాహనం బోల్తా పడి యువకుడు.. తిరుమలగిరి : బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో ఓ యువకుడు మృతిచెందాడు. ఈఘటన తిరుమలగిరి మండలం జలాల్పురం గ్రామ పరిధిలో శుక్రవా రం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరా ల ప్రకారం.. తుంగతుర్తి మండలం దేవుని గుట్ట తండా కు చెందిన రాధాక్రిష్ణ బోలోరో వాహనంలో తిరుమలగి రికి వస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన లో రాధాక్రిష్ణ 19) తీవ్ర గాయాలై అక్కడిక్కక్కడే మృతి చెందాడు మృతుడి తండ్రి బద్రు ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసిదర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. అక్కంపల్లి స్టేజీ వద్ద వాహనం ఢీకొని.. వలిగొండ : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని అక్కంపల్లి స్టేజీ వద్ద శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని నాతాళ్లగూడేనికి చెందిన కొరబోయిన లక్ష్మణ్ (22) మిత్రుడి బైక్ తీసుకుకుని వలిగొండకు వచ్చి తిరిగి నాతాళ్లగూడెం వెళ్తున్నాడు. ఈ క్రమంలో అక్కంపల్లి స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యులు మాత్రం ఏదో వాహనం ఢీ కొట్టడంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యా దు మేరకు ఎస్ఐ మంజునాథ్రెడ్డి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ నిమిత్తం సంఘటన స్థలం నుంచి రామన్నపేట వైద్యశాలకు తరలించారు. సదురు మృతుడిని ఏదైనా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టిందా.. లేదా అతడే బైక్ై పె నుంచి జారి పడి మృతిచెందాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎల్లారెడ్డిగూడెం వద్ద గుర్తుతెలియని వృద్ధుడు... నార్కట్పల్లి : రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వృద్ధుడు(70) మృతి చెందిన సంఘటన నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపి న వివరాల ప్రకారం.. యల్లారెడ్డిగూడెం గ్రామ సమీపంలో ఓ వృద్ధుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వాహనం ఢీ కొట్టింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీ సులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. బాధితున్ని నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. మృతుడు తెల్లటి చొక్క, దోవతి ధరించి ఉన్నాడని, అతని చేతికి రెండు ఇత్తడి రింగులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అతని వద్ద రూ. 1500 నగదు ఉన్నట్లు తెలిపారు. మృతుడి సం బంధికులు ఎవరైనా ఉంటే నార్కట్పల్లి పోలీస్స్టేషన్లో సంప్రదించాలన్నారు. ఈ మేరుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మోతిరామ్ తెలిపారు. -
అటవీ డివిజన్గా చింతపల్లి?
ఐదు రేంజ్లతో ఏర్పాటుకు ప్రతిపాదన పెద్దదైన నర్సీపట్నాన్ని విభజించే యోచన సిబ్బంది పదోన్నతుల్లో చిక్కులు? జిల్లాలో నాలుగో అటవీ డివిజన్గా చింతపల్లిని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు ముందుకు కదులుతున్నాయి. జిల్లాలోనే నర్సీపట్నం అతిపెద్ద అటవీ డివిజన్. ఎనిమిది రేంజ్లు, 116 బీట్లు, 47 సెక్షన్లతో రెండు లక్షల 34 వేల హెక్టార్ల పరిధిలో విస్తరించి ఉంది. నర్సీపట్నానికి 200 కిలోమీటర్ల దూరంలో కూడా రేంజ్లున్నాయి. ఇంత పెద్ద డివిజన్ను పర్యవేక్షణ చేయడం ఒక డీఎఫ్వోతో సాధ్యం కాదు. దీంతో పరిపాలన సౌలభ్యం కోసం చింతపల్లి కేంద్రంగా మరో డివిజన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన తయారైంది. ఉద్యోగుల పునర్నిర్వహణ కమిటీ చేస్తున్న ప్రతిపాదనకు ఈసారైనా మోక్షం కలుగుతుందో లేదో వేచి చూడాల్సిందే. కొయ్యూరు : జిల్లాలో పాడేరు, విశాఖపట్నం, నర్సీపట్నంలో అటవీ డివిజన్లున్నాయి. ముగ్గురు డీ ఎఫ్వోలు ఉన్నారు. నర్సీపట్నం డివిజన్లో నర్సీపట్నం, కేడీపేట, చింతపల్లి, లోతుగెడ్డ, పెదవలస, ఆర్.వీ నగర్, సీలేరు, మర్రిపాకల రేంజ్లున్నాయి. మర్రిపాకల రేంజ్ నర్సీపట్నానికి 200 కిలోమీటర్ల పరిధి వరకు విస్తరించి ఉంది. అటు సీలేరు కూడా ఎక్కువ దూరంలో విస్తరించింది. అంతదూరంలో ఉన్న అడవిని ఒక డీఎఫ్వో పర్యవేక్షించడం సాధ్యం కాదు. దీంతో చింతపల్లిని డివిజన్గా చేస్తే దాని పరిధిలోకి సీలేరు, ఆర్.వీ నగర్, పెదవలస, చింతపల్లి, లోతుగెడ్డ రేంజ్లను తీసుకువచ్చే అవకాశం ఉంటుందని ప్రతిపాదించారు. నర్సీపట్నం డివిజన్లోకి నర్సీపట్నం, కేడీపేట, మర్రిపాకల రేంజ్లను ఉంచుతారు. కిందటేడాది పెదవలసను కొత్త రేంజ్గా చేశారు. 52 బీట్లను 116కు పెంచారు. ఫలితంగా కొత్త డివిజన్ ఏర్పాటుకు అంకురార్పణ చేశారు. ఇప్పటి వరకు చింతపల్లిలో ఒక సబ్- డీఎఫ్వో ఉంటున్నారు. డివిజన్ అయితే డీఎఫ్వో వస్తారు. పదోన్నతులపై చిక్కులొచ్చే అవకాశం ఫారెస్టు సెక్షన్ అధికారి స్థాయి వరకు బదిలీలను డివిజన్ స్థాయిలో చేయాల్సి ఉంటుంది. అటవీ శాఖలో బదిలీలకు జిల్లాను కాకుండా డివిజన్ను యూనిట్గా పరిగణిస్తారు. కొత్త డివిజన్ ఏర్పాటు చేసేటప్పుడు ఇద్దరు వ్యక్తులు ఒకే తరహా సీనియారిటీ కలిగి ఉంటే ఎవరికి పదోన్నతి ఇవ్వాలన్న దానిపై నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఉద్యోగుల పంపకాల విషయంలోను వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. దీనిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కొత్త డివిజన్ ఏర్పాటయితే రేంజ్లు వేరు అవుతాయి. రేంజ్ ల్లో పనిచేసే వారు డివిజన్ మారేందుకు ఇష్టపడతారో లేదో చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఇష్టపడకుంటే వారి కేటాయింపును ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంటుంది. -
రెండో రోజూ కొనసాగిన సర్వే
చింతపల్లి :కలెక్టర్ చిరంజీవులు ఆదేశాల మేరకు స్థానిక తహసీల్దార్ పుష్పలత.. మండలంలోని వర్కాల, ఘడియగౌరారం, మల్లారెడ్డిపల్లి గ్రామాలలో రెం డో రోజైన బుధవారం కూడా సమగ్ర కుటుంబ సర్వేను కొనసాగించారు. ఘడియగౌరారం, మ ల్లారెడ్డిపల్లిలలో సర్వే సాఫీగా సాగింది. కానీ వర్కాలలో మాత్రం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వర్కాలకు చెందిన శ్రీను అనే వ్యక్తికి గ్రామంలో రేషన్కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, సొంత ఇల్లు ఉన్నా అతని పేరు సర్వేలో నమోదు చేయకపోవడంతో ఎన్యుమరేటర్ను సంప్రదిస్తున్నాడు. ఆ సమయంలో వర్కాల సర్పంచ్ కిరణ్కుమార్రెడ్డి ఈ విషయమై కల్పించుకుని తహసీల్దార్ ఎదుటే శ్రీనుపై దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని సర్వే ప్రశాంతంగా కొనసాగేలా చర్యలు చేపట్టారు. అద్దె కుటుంబాల సర్వే వాడపల్లి(దామరచర్ల): మండల పరిధిలోని వాడపల్లి గ్రామంలో అద్దెకు ఉంటున్న కుటుంబాలను కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం సర్వే చేశారు. గ్రామంలో వేరే ప్రాంతాల నుంచి వచ్చి అద్దె ఇళ్లలో ఉంటున్న కుటుంబాలను ఎన్యుమరేటర్లు మంగళవారం సర్వే చేయలేదు. దీంతో వారు స్థానిక నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక అధికారులను సర్వే చేయాలని కోరినప్పటికీ స్పందించక పోవడంతో మంగళవారం రాత్రి ఫోన్ ద్వారా కలెక్టర్కు ఈ విషయం చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తసీల్దార్ రమాదేవి.. అద్దెకు ఉంటున్న వారిని సర్వే చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. 120 ఇళ్లను ఎనిమిది మంది ఎన్యుమరేటర్ల ద్వారా గ్రామ పంచాయ తీ కార్యాలయంలో సర్వే చేయించారు. ఈ విషయమై గ్రామ పంచాయతీ కార్యదర్శి కేశ్యానాయక్కు ఎంపీడీఓ ఉమాదేవి మెమో జారీ చేశారు. అన్ని కుటుంబాల సర్వే పూర్తి చేయాలని ధర్నా బేగంపేట(రాజాపేట) : అన్ని కుటుంబాల సర్వే పూర్తి చేయాలని కోరుతూ మండలంలోని బేగంపేటవాసులు బుధవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట గంట పాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడారు. సమగ్ర సర్వేలో కొందరిని మాత్రమే గుర్తించి సర్వే చే శారని మిగిలినవారిని పట్టించుకోలేదన్నారు. ఒక ఇంటిలో మూడు కుటుంబాలు ఉన్నా ఒకే కుటుంబంగా గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అన్ని కుటుంబాలను సర్వే చేయడానికి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సుదగాని వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
వర్షాతిరేకం
ఏజెన్సీలో భారీ వర్షాలు పొంగి పొర్లుతున్న వాగులు, గెడ్డలు ఖరీఫ్కు అనుకూలం పాడేరు: ఏజెన్సీలో మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల 8 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసి రెండు రోజులపాటు తెరిపినిచ్చిన ప్పటికి మరల వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షాలతో జనజీవనానికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పాడేరు, చింతపల్లి, రొంపుల, సీలేరు, అనంతగిరి ఘాట్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈదురుగాలుల ఉధృతికి గిరిజనులు అవస్థలు పడుతున్నారు. రోడ్డుకు ఆనుకుని భారీ వృక్షాలు ఉండడంతో భయంభయంగానే వాహనాలను నడుపుతున్నారు. కాగా విస్తారంగా కురుస్తున్న వర్షంతో ఖరీఫ్ వ్యవసాయ పనులకు మరింత మేలు చేస్తుంది. పంట పొలాల్లో నీరు చేరింది. ఇప్పటికే ఏజెన్సీవ్యాప్తంగా 50 శాతం వరినాట్లు పూర్తవగా ఈ వర్షాలకు మిగతా వ్యవసాయ భూముల్లో కూడా పనులకు మేలు జరగనుంది. మరోవైపు ఏజెన్సీలో చిన్న చిన్న కొండవాగులు కూడా ఉధృతంగానే ప్రవహిస్తున్నాయి. జోలాపుట్టు, సీలేరు, కోనాం, తారకరామ, పెద్దేరు, రైవాడ జలాశయాలకు కూడా వరదనీరు చేరుతోంది. మత్స్యగెడ్డ, రాళ్ళగెడ్డ, బొయితిలి గెడ్డ, కించూరు గెడ్డ, లోతుగెడ్డ సమీపంలోని పెద్ద గెడ్డలన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రమాదస్థాయికి డుడుమా ముంచంగిపుట్టు: అల్పపీడన ప్రభావంతో మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే డుడుమ(డైవర్షన్) డ్యాంలో 2 వేలు క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండడంతో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరుతోంది. ఈ డ్యాం పూర్తి సామర్ధ్యం 2690 అడుగులకుగాను మంగళవారం నాటికి 2589.1 అడుగుల నీటి మట్టం నమోదైంది. దీంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు 7,8 నంబర్ల గేట్ల ద్వారా 5000 క్యూసెక్కుల నీటిని దిగువనున్న బలిమెల రిజర్వాయర్కు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి పెరిగితే మరింత నీటిని విడుదల చేసే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు పేర్కొంటున్నారు. జోలాపుట్టు గేట్లు మూసివేత : డుడుమ డ్యాంలో వరద నీరు అధికంగా చేరుతుండడంతో సోమవారం రాత్రి నుంచి జోలాపుట్టు ప్రధాన రిజర్యాయర్లోని గేట్లను మూసేసి నీటి విడుదల నిలుపుదల చేశారు. ఇక్కడ నుంచి విద్యుత్ ఉత్పతికి డుడుమ డ్యాంకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండేవారు. ఈ రిజర్వాయర్ పూర్తి సామర్ధ్యం 2750 అడుగులకుగాను ప్రస్తుతం 2721.10 అడుగులు నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం మాచ్ఖండ్లో 92 మెగావాట్ల విద్యుదుత్పతి జరుగుతుంది. -
'ఎన్నికల్లో పోటీ చేసినందుకు కాల్చి చంపారు'
విశాఖ : విశాఖ జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. చింతపల్లి మండలం బలపం సర్పంచ్ చింపల్లి కర్లాని మావోయిస్టులు హతమార్చారు. అర్ధరాత్రి సర్పంచ్ను అపహరించిన మావోయిస్టులు... రాళ్లగడ్డ మావోయిస్టు స్థూపం వద్ద కాల్చి చంపారు. తామిచ్చిన పిలుపును ధిక్కరించి ఎన్నికల్లో పాల్గొన్నందుకే హత్యచేసినట్లు ఆ ప్రాంతంలో లేఖ వదిలి వెళ్లారు. ఈ సంఘటనతో ఏజెన్సీలో భయాందోళనలు నెలకొన్నాయి. -
రాజ్మా చిక్కుడు
విశాఖపట్నం, న్యూస్లైన్ : వ్యాపారులు కొనుగోలు చేయరు.. జీసీసీ పట్టించుకోదు.. దాంతో ఏజెన్సీలో రాజ్మా రైతు బాధలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. ఏదో ఒక ధరకు వ్యాపారులు కొనుగోలు చేస్తేనే బాగుండేదని అనుకునేటంత విషమ స్థితికి వారి సమస్య చేరుకుంది. ఏజెన్సీలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రాజ్మా చిక్కు డు వ్యాపారం స్తంభించిపోయింది. దీంతో గిరిజన రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది. విశాఖ ఏజెన్సీ గూడెంకొత్తవీధి, చింతపల్లి, జి.మాడుగుల మండలాల్లో గిరిజనులు రాజ్మా చిక్కుడును ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేస్తున్నారు. ఏటా సుమారు రూ. 60 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఈ ప్రాంతాల్లో పండించిన రాజ్మాను నర్సీపట్నానికి చెందిన వ్యాపారులు కొనుగోలు చేసి వీటిని ఢిల్లీ, పుణె, ముంబాయి, కర్ణాటక, మహారాష్ట్ర వంటి నగరాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ ఏడాది రాజ్మా పంట అంతంత మాత్రంగానే ఉంది. గిట్టుబాటు ధర మాత్రం బాగానే ఉంది. ప్రస్తుతం కిలో రాజ్మాను వ్యాపారులు రూ.48 ధరకు కొనుగోలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు వారు కొనుగోళ్లను నిలిపేశారు. నర్సీపట్నం వ్యాపారులే కాక, స్థానిక వర్తకులు కూడా లావాదేవీలు ఆపేశారు. అసలు కారణం.. రాజ్మా కొనుగోలు చేసే వ్యాపారులు గిరిజనులకు భారీ ఎత్తున బకాయి పడ్డారు. గత ఏడాది చాలా మందికి పూర్తి స్థాయిలో చెల్లించలేదు. ఈ విషయాన్ని గమనించిన మావోయిస్టులు రంగంలోకి దిగారు. జీకే వీధికి చెందిన ఓ వ్యాపారిని మావోయిస్టులు గత సోమవారం అదుపులోకి తీసుకున్నారు. రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తాన్ని చెల్లిస్తానని వ్యాపారి భార్య హామీ ఇవ్వడంతో ఆమెను నిర్బంధించారు. దీంతో నర్సీపట్నం వ్యాపారులు ఈ ప్రాంతంతో కాలు మోపడానికే వెనుకాడుతుండగా స్థానిక వ్యాపారులు సైతం మారుమూల ప్రాంతాలకు వెళ్లేందుకు సాహసించడం లేదు. జీసీసీ నిర్లక్ష్యం గత ఏడాది కూడా రాజ్మాను కొనుగోలు చేసిన జీసీసీ, ఈసారి మాత్రం అసలు ఆ జోలికే పోలేదు. సరకు నిల్వ ఉండిపోతోందన్న కారణం చూపి కొనుగోలు చేపట్టలేదు. దాంతో పెదపాడు, మర్రిపాకలు, అగ్రహారం, లక్కవరం, ఈతరబ్బలు, సాగులు వంటి ప్రాంతాల్లో రాజ్మా నిల్వలు పేరుకుపోయాయి. రైతులు కావళ్లతో వారపు సంతలకు మోసుకువచ్చి విక్రయించలేక ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం చింతపల్లి, జీకే వీధి మండలాల్లోని అన్ని మారుమూల ప్రాంతాల్లో రాజ్మా చిక్కుడు వ్యాపా రం నిలిచిపోయింది. మావోయిస్టుల ఉత్సాహం గిరిజనులకు సమస్యలు తెచ్చిపెట్టింది. -
తప్పిన పెను ప్రమాదం
చింతపల్లి, న్యూస్లైన్ : నాగార్జునసాగర్-హైదరాబాద్ హైవేపై గరుడ బస్సు లో అగ్ని ప్రమాదం జరిగింది. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన చింతపల్లి మండలం నసర్లపల్లి గేటు సమీపంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. హైదరాబాద్లోని మహాత్మాగాంధీ బస్స్టేషన్లో 50 మంది ప్రయాణికులను ఎక్కించుకున్న గరుడ బస్సు రాత్రి 12:30 గంటలకు నెల్లూరుకు బయలుదేరింది. నసర్లపల్లి సమీపంలోకి రాగానే గరుడ బస్సు ఇంజన్ డిక్కీలో నుంచి పొగ వచ్చింది. గమనించిన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు ఆపాడు. అప్పటికే ఇంజన్ డిక్కీలో నుంచి మంటలు రేగుతున్నాయి. అయితే మాల్ సమీపంలోకి రాగానే బస్సులో నుంచి ఒక రకమైన వాసన వస్తుండడంతో ప్రయాణికులు కూడా ఈ విషయాన్ని డ్రైవర్కు చెప్పారు. దీంతో ముందుగానే ఇంజన్ డిక్కీ తెరిచి చూడడంతో ప్రమాదం తప్పింది. డిక్కీలో మంటలు రేగుతున్న విషయాన్ని ప్రయాణికులకు చెప్పడం తో వారు బస్సు నుంచి కిందకు దిగి ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికులు తమ వద్ద ఉన్న వాటర్ బాటిళ్లతో మం టలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. వెంటనే ఫైరిం జన్కు, పోలీసులకు సమాచారం అంది ంచారు. దేవరకొండ అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే డిక్కీలో ఉన్న సామగ్రి కొంతమేర కాలిపోయింది. అయితే మరికొద్దిసేపు విషయాన్ని గమనించకుండా అలాగే బస్సు నడిపితే భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేది. రెండు గంటల అనంతరం మరో బస్సులో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశారు. షార్ట్సర్క్యూట్తోనే మంటలు బస్సు డిక్కీలో పరిమితికి మించి ప్రయాణికుల లగేజీని ఉంచడమే ప్రధా న కారణమని తెలుస్తోంది. లగేజీని అందులోకి నెట్టి ఉంచడంతో వైర్లు షార్ట్సర్క్యూట్ కావడంతోనే ప్రమాదం జరిగిందని డ్రైవర్, ప్రయాణికులు పేర్కొన్నారు. -
మొదలైన పై-లీన్ తుపాను అలజడి
విశాఖపట్నం: పై-లీన్ తుపాను అలజడి మొదలైంది. కాకినాడ-ఉప్పాడ తీరంలో 3 మీటర్ల ఎత్తుకు అలలు ఎగసిపడుతున్నాయి. వాకలపూడి బీచ్ వద్ద సముద్రం 20 మీటర్ల ముందుకొచ్చింది. * విజయనగరం జిల్లా బోగాపురంలో 33 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 15వేల మందిని అధికారులు తరలిస్తున్నారు. *చింతపల్లి తీరంలో సముద్రం 40 మీటర్లు ముందుకొచ్చింది. * నెల్లూరు జిల్లాలో కూడా సముద్రం మందుకు చొచ్చుకు వస్తోంది. తీరప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. * పై-లిన్ తుఫాన్ ప్రభావం కారణంగా పలు రైళ్లు రద్దు చేశారు. * విశాఖపట్నం పోర్టు రక్షణ గోడ రెండు చోట్ల కూలింది. * భీమిలి మండలం మంగమారిపేట గ్రామంలో సముద్రపు నీరు ఇళ్లలోకి చేరుతోంది. * తుపాన్ కంట్రోల్ రూమ్ల ఫోన్ నెంబర్లు: శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 - 0884-1077 అమలాపురంలో ఆర్డీవో కార్యాలయంలో తుఫాన్ కంట్రోల్ రూమ్ నెంబర్: 08856 233100 - జిల్లాలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ :1554, మెరైన్ పోలీస్ :1093 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు జిల్లా: 08644 223800,-0863 2345103/ 0863 2234990 తెనాలి: 08644 223800 నెల్లూరు: 1800 425 2499, 08612 331477 -
నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం