అమరావతికి బ్రిటన్ మసాలా బాండ్లు | Britain spice bonds to Amaravati | Sakshi
Sakshi News home page

అమరావతికి బ్రిటన్ మసాలా బాండ్లు

Published Sat, Nov 12 2016 4:31 AM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM

అమరావతికి బ్రిటన్ మసాలా బాండ్లు - Sakshi

అమరావతికి బ్రిటన్ మసాలా బాండ్లు

బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ మెక్ అలిస్టర్ వెల్లడి
రాజధాని నిర్మాణానికి బ్రిటన్ సహకారం కావాలన్న సీఎం    


 సాక్షి, అమరావతి: అమరావతి నిర్మాణానికి మసాలా బాండ్ల రూపంలో నిధులు సమకూర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ అండ్రూ మెక్ అలిస్టర్ తెలిపారు. లండన్ స్టాక్ ఎక్స్చేంజి ద్వారా ఈ బాండ్లు ఇచ్చే అవకాశముందన్నారు. విజయవాడలోని ఓ హోటల్‌లో శుక్రవారం అలిస్టర్ ఆధ్వర్యంలో ‘స్మార్ట్ సిటీ నిర్మాణ సామర్థ్యం, అనుభవం, అమరావతికి సహకారం’అనే అంశాలపై సమావేశం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సమావేశంలో అలిస్టర్ మాట్లాడుతూ.. అమరావతి సహా దేశంలోని 8 స్మార్ట్ సిటీల నిర్మాణానికి బ్రిటిష్ ప్రభుత్వం 11 మిలియన్ పౌండ్లు వెచ్చించనుందని తెలిపారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధాని తొలి దశ నిర్మాణానికి ప్రయత్నాలు మొదలవుతున్న తరుణంలో బ్రిటన్ సహకారం కావాల్సి ఉందన్నారు.

 15న మంత్రివర్గ సమావేశం: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 15వ తేదీన జరగనుంది. విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement