
చంద్రబాబు నాయుడు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటనకు బయలుదేరారు. ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరారు. 19 మంది ప్రతినిధి బృందం ఆయన వెంట వెళుతోంది.
సిఐఐ తరపున మరో బృందం కూడా జపాన్ బయలుదేరింది. ఈ రెండు బృందాలు ఈ నెల 29 వరకు జపాన్లో పర్యటిస్తాయి. ఈ పర్యటనలో చంద్రబాబు జపాన్ ప్రధాన మంద్రితోపాటు పలువురు పారిశ్రామికవేత్తలను కలుస్తారు. పలు సంస్థలతో ఆయన అక్కడ ఆరు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది.
**