కరోనా: ఏపీలో మరో 58 పాజిటివ్‌ కేసులు | Coronavirus 58 New Positive Cases Reported In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కరోనా: ఏపీలో మరో 58 పాజిటివ్‌ కేసులు

May 3 2020 12:37 PM | Updated on May 3 2020 3:03 PM

Coronavirus 58 New Positive Cases Reported In Andhra Pradesh - Sakshi

గత 24 గంటల్లో మరో 47 మంది కోవిడ్‌ బాధితులు కోలుకున్నారని, దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య  488 కు చేరుకుందని తెలిపింది.

సాక్షి, అమరావతి: గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 6534 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 58 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం ప్రకటించింది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1583కు చేరుకుందని వెల్లడించింది. గత 24 గంటల్లో మరో 47 మంది కోవిడ్‌ బాధితులు కోలుకున్నారని, దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య  488 కు చేరుకుందని తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 33 కోవిడ్‌ మరణాలు సంభవించాయని, గత 24 గంటల్లో ఎటువంటి మరణాలు చోటుచేసుకోలేదని ఆరోగ్యశాఖ మీడియా బులెటిన్‌లో పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1062గా ఉందని తెలిపింది. జిల్లాల వారీగా కరోనా బాధితులు, కోలుకున్నవారి వివరాలతో జాబితా విడుదల చేసింది. 
(చదవండి: ఆ మూడు జిల్లాల్లో.. 50 శాతానికి పైగా రికవరీ)


(చదవండి: కరోనాపై యూట్యూబ్‌లో అవగాహన)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement