చాగల్లు: పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు మండలం వనగట్ల వద్ద కారు ఢీకొనడంతో సైకిల్పై వెళుతున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. వనగట్ల గ్రామానికి చెందిన నూతంగి వెంకట్రావ్ (40) ఆదివారం మధ్యాహ్నం సైకిల్పై వెళుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడడంతో వెంకట్రావ్ ప్రమాద స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. పోలీసులు కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.