
రాజమండ్రిలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి
కోటగుమ్మం: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి విశాఖపట్నం పర్యటన ముగించుకుని బుధవారం మధ్యాహ్నం రాజమండ్రి వచ్చారు. మధురపూడి నుంచి విమానంలో హైదరాబాద్ వెళ్లేందుకు ఇక్కడకు వచ్చిన నగరంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత అతిథి గృహంలోని భోజనం చేసి అనంతరం మధురపూడి వెళ్లారు. ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. మంత్రిని కలిసి హుదూద్ తుపాను సహాయక కార్యక్రమాలపై చర్చించారు.