అందుకే కొత్త మద్యం పాలసీ : నారాయణస్వామి | Deputy CM Narayana Swamy On New Liquor Policy | Sakshi
Sakshi News home page

అందుకే కొత్త మద్యం పాలసీ : నారాయణస్వామి

Published Tue, Aug 20 2019 8:07 PM | Last Updated on Tue, Aug 20 2019 8:13 PM

Deputy CM Narayana Swamy On New Liquor Policy - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మద్యం ద్వారా వచ్చే ఆదాయం కంటే మహిళల ఆరోగ్యమే ముఖ్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి అన్నారు. మంగళవారం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మద్యం బెల్టు షాపులను పూర్తిగా నియంత్రించామని తెలిపారు. మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తున్నామని చెప్పారు. మద్యం నియంత్రణలో భాగంగా ప్రభుత్వం మద్యం దుకాణాలను నిర్వహిస్తోందన్నారు. అందుకోసమే కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చినట్టు వివరించారు. 

గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా మద్యం అమ్మకాలను పెంచారని మండిపడ్డారు. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మద్యం షాపులను భారీగా తగ్గించిందని వెల్లడించారు. సుదీర్ఘ పాదయాత్రలో మహిళల కష్టాలను చూసిన సీఎం వైఎస్‌ జగన్‌ మద్యపాన నిషేధాన్ని ప్రకటించారని గుర్తుచేశారు. ఇచ్చిన మాటను నిలుబెట్టుకునేలా సీఎం వైఎస్‌ జగన్‌ మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తున్నారని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement