Narayana Swamy
-
మీడియా చానెల్స్ కి నారాయణ స్వామి కూతురు వార్నింగ్
-
పవన్ పై నారాయణస్వామి కామెంట్స్
-
ఏపీ సీఎం చంద్రబాబుపై నారాయణ స్వామి ఫైర్
-
అమిత్ షా క్షమాపణ చెప్పాలి..
-
పార్టీలు మారే నేతలపై నారాయణస్వామి కీలక వ్యాఖ్యలు
-
ఎన్ని కుట్రలు చేసినా జగన్ ని ఏమి చెయ్యలేరు
-
వలంటీర్లపై బాబు, పవన్ మాటలు ఏమయ్యాయి?: నారాయణ స్వామి
సాక్షి, చిత్తూరు: ఏపీలో వలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. చంద్రబాబు మోసపూరిత హామీలు ఇచ్చి.. ఇంకా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని కామెంట్స్ చేశారు. చంద్రబాబు సంపద సృష్టి ఏమైందని ప్రశ్నించారు.మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ..‘రాజ్యాంగం ఆమోదించిన రోజు అయినప్పటికీ ఈరోజున పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు. చంద్రబాబు మోసపూరిత హామీలు ఇచ్చి మోసం చేస్తూనే ఉన్నాడు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేశాడు. నవరత్నాలు పేరుతో హామీలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది. విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్ జగన్ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకువస్తే చంద్రబాబు వాటిని తుంగలోకి తొక్కాడు. ప్రతీ పేదవాడు ఉన్నత విద్యావంతుడు కావాలని, ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించిన వ్యక్తి వైఎస్ జగన్.స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కోటీశ్వరుల బిడ్డలు, డబ్బున్న వారికే ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉండేది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీ పేదవారికి ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తీసుకువచ్చారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తున్నారు. వలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఏమయ్యాయి?. కేంద్రప్రభుత్వ సంస్థ సెకీ అనే సోలార్ ఎనర్జీకి సంబంధించి యూనిట్ రూ.2.49లపై చెల్లించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆమోదం తెలిపితే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో విద్యుత్ ఒప్పందాలు రూ.5.98 జరిగితే ఆరోజు ఎల్లో మీడియా ప్రశ్నించలేదు.చంద్రబాబు నాయుడు ఏం చెబితే అదే వింటున్నారు జిల్లాల ఎస్పీలు. తప్పుడు కేసులు పెట్టీ వైఎస్సార్సీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు.. మంత్రులు, టీడీపీ కార్యకర్తలకు బెల్ట్ షాపుల ద్వారా సంపద సృష్టిస్తున్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్ను ఏమీ చేయలేరు’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఇవి మీకు కనిపించవా?.. పోలీసులపై నారాయణస్వామి ఆగ్రహం
-
నీ తోబుట్టువులకు పది పైసలు ఇచ్చావా బాబు.. నీకు దమ్ముంటే..
-
వైఎస్సార్సీపీపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాలు.. నారాయణ స్వామి సీరియస్ వార్నింగ్
-
టీడీపీ మంత్రిపై నారాయణ స్వామి ఆగ్రహం
-
ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు గాలికి వదిలేశారు
-
తిరుమలలో ప్రమాణం చేస్తారా? నారాయణ స్వామి కామెంట్స్
-
లడ్డూ వివాదం: ‘బాబు, లోకేష్ తిరుమలలో ప్రమాణం చేయగలరా?’
సాక్షి, తిరుపతి: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ, సిట్టింగ్ జడ్డీతో విచారణ జరిపించాలన్నారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. రాజకీయ లబ్ధి కోసం తిరుమల శ్రీవారిపై తప్పుడు ప్రచారం చేసిన వారికి దేవుడే తగిన శిక్ష విధిస్తాడని చెప్పుకొచ్చారు.మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కులాలు, మతాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసే వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను చూస్తుంటే మత ఘర్షణలను ప్రేరేపిస్తున్నట్టు ఉంది. రాజకీయ లబ్ధి కోసమే తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీయాలని చూస్తున్న వారికి దేవుడే తగిన శిక్ష వేస్తాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇదే అంశంపై నెల్లూరు జిల్లాలో కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మామని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా లడ్డూపై దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు వంద రోజుల పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ డ్రామాకు తెర తీశారు. వైఎస్ జగన్పై విమర్శలు చేయడం దారుణం. లడ్డూలో కల్తీ జరిగిందని చంద్రబాబు, లోకేష్ తిరుమలలో ప్రమాణం చేయగలరా?’ అని సవాల్ విసిరారు. ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ దేవరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ సెగ -
చంద్రబాబుపై నారాయణ స్వామి ఫైర్
-
తిరుమలపై మోసగాడి మాటలు క్షమించరాని నేరం..
-
మళ్ళీ.. మళ్ళీ... చెప్తున్న మీ పతనానికి ఇదే నాంది
-
‘అంబేద్కర్ విగ్రహంపై దాడి కూటమి సర్కార్ పతనానికి నాంది’
సాక్షి, తిరుపతి: అంబేద్కర్ స్మృతివనం శిలా ఫలకాలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు తొలగించడం అమానుషమని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ జగన్.. అంబేద్కర్ ఆశయాలకు దీటుగా శిలా విగ్రహావిష్కరణ చేశారన్నారు. అంబేద్కర్ శిలా విగ్రహంపై దాడి ప్రభుత్వ కూటమి పతనానికి దారితీస్తుందన్నారు.‘‘శిలా ఫలకాలపై వైఎస్ జగన్ పేరు చెరిపివేయవచ్చు కానీ చేసిన సేవలను చరిత్ర నుంచి తొలగించలేరు. ఒక వర్గానికి, ఒక మతానికి, ఒక కులానికి నాయకుడు కాదు అంబేద్కర్. పార్టీలకతీతంగా నాయకులందరూ ఏకతాటిపై వచ్చి శిలా విగ్రహంపై జరిగిన దాడిని ప్రతిఒక్కరూ ఖండించాలి. అంబేద్కర్ ఆశయాలు కనుగుణంగా బడుగు, బలహీన వర్గాలకు ఇంగ్లీష్ మీడియం విద్యను తెచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రెడ్బుక్ పరిపాలన సాగుతోంది జవాబుదారితనం అన్న పవన్ కల్యాణ్ జరుగుతున్న విధ్వంసాలపై సమాధానం చెప్పాలి. ఇకనైనా దాడులు మానుకుని చంద్రబాబు పరిపాలనపై దృష్టి పెట్టాలి’’ అని నారాయణస్వామి హితవు పలికారు. -
చంద్రబాబుపై నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు
-
ప్రజలను ఏమార్చి చంద్రబాబు గెలిచారు: నారాయణ స్వామి
సాక్షి, తిరుపతి: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై దాడులు చేస్తుంటే దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అని మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం నేడు ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తోందని మండిపడ్డారు. సూపర్ సిక్స్ అమలు చేయలేనని చంద్రబాబు అనడం అవమానకరని అన్నారు. తిరుపతితో గురువారం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడారు. ‘‘గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలకు పప్పు, బెల్లంలా సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చేస్తున్నారని ఏడ్చారు. పేదవారికి ఆశ చూపి అధికారంలోకి వచ్చి సూపర్ సిక్స్ను చూస్తే భయంగా ఉందని చంద్రబాబు అంటున్నాడు. దళితులు అన్ని రంగాల్లో రాణించాలని అంబేద్కర్ ఆశయం. చంద్రబాబు అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే విధంగా చూడాలి. విద్య, వైద్యం జోలికి వెళ్లొద్దని చంద్రబాబుకి, రెడ్ బుక్ లోకేష్, పవన్ కళ్యాన్లకు విజ్ఞప్తి చేస్తున్నా. వైఎస్ జగన్ నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అని ఎన్నికల ప్రచారం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కమ్యూనిటీలను నమ్ముకుని ముందుకెళ్ళి అధికారం చేపట్టారు. ..మద్యం పాలసీలో ఎటువంటి అవినీతికి పాల్పడలేదు. మద్యంలో కొత్త బ్రాండ్ లన్ని చంద్రబాబు తీసుకొచ్చిందే. తప్పు చేస్తే ఎటువంటి శిక్షకైనా రెడీ. ప్రస్తుతం టీడీపీ తరుపున పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీకి కనీసం ఒక గ్రామంలో కూడా సరిగ్గా తెలీదు. చంద్రబాబు ప్రజలను ఏమార్చి గెలిచారు. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు అమ్మ ఒడి, కార్పోరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను ధీటుగా రెన్యువేషన్ చేయడం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ విద్య అందించడం, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయడం తప్పా. దళితులు చదువుకోవాలని, వారు సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.పేదలపై పడి దాడులు చేయొద్దు, ఎమ్మెల్యేలుగా ఉన్న మాపై మీ ప్రతాపం చూపండి’’ అని అన్నారు. -
మోదీ, చంద్రబాబు.. మమ్మల్ని చంపేయండి: నారాయణ స్వామి ఫైర్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో సీఎం చంద్రబాబు రాజ్యాంగం నడుస్తోంది. ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయలేదనే నెపంతో దాడులు చేయడం సరికాదన్నారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. నచ్చిన వారికి పేదవాడు ఓటు వేయడమే శాపంగా మారినప్పుడు వారి ఓటు హక్కును రద్దు చేయండని ఆవేదన వ్యక్తం చేశారు.కాగా, నారాయణ స్వామి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా పోటీచేసిన అభ్యర్థులను కాల్చేయండి. ఎందుకంటే మాకు ఓటు వేయడమే ప్రజలు వేసిన పెద్ద నేరం. అందుకే వైఎస్సార్సీపీ మద్దతుదారులపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారు. అలా కాకుండా మమ్మల్ని చంపేస్తే వచ్చే ఎన్నికల్లో మీకు పోటీ ఎవరూ ఉండరు. అప్పుడు సునాయాసంగా మీరు ఎన్నికల్లో గెలవచ్చు.దేశంలో బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు. కేంద్రంలో మోదీ రాజ్యాంగం, రాష్ట్రంలో చంద్రబాబు రాజ్యాంగమే నడుస్తోంది. ఈ ప్రజాస్వామ్య దేశంలో కులం, మతం, వర్గం, లింగ వివక్ష అనే తేడా లేకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన అంబేద్కర్ ఆత్మ నేడు ఘోషిస్తూ ఉంటుంది. పేదవాడు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయడం నేరమా?. మాకు ఓటు వేస్తే దాడులు చేయడం ఎంత వరకు కరెక్ట్?. అందుకే పేదవారికి ఉన్న ఓటు హక్కును రద్దు చేయండి. ఎలాగో మీరు అన్ని చట్టాలు మారుస్తున్నారు కదా.ఇకనైనా ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలపై దాడిని ఆపండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. గ్రామాల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులపై దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన నేతలు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడండి. మీకు సహకారం అందిస్తాం. అంతేకానీ, ఇలా దాడి చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోము. ముందు.. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చండి’ అంటూ హితవు పలికారు. -
నా ఆఖరి శ్వాస ఉన్నంతవరకు జగన్ తోనే
-
సీఐ నారాయణస్వామిపై ఈసీ చర్యలు
-
ఆ ముగ్గురు అధికారులపై వెంటనే నిర్ణయం తీసుకోండి
సాక్షి, అమరావతి: మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అధికార విధుల నుంచి గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట్ త్రిపాఠీ, ఎస్పీ మలికా గార్గ్, కారెంపూడి ఇన్స్పెక్టర్ నారాయణ స్వామిని దూరంగా ఉంచేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సమర్పించిన వినతిపత్రంపై రేపటికల్లా (శుక్రవారంలోగా) నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, డీజీపీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ పోలీసు అధికారులపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున, పిన్నెల్లి వినతిపై వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని ధర్మాసనం స్పష్టంచేసింది.త్రిపాఠీ, గార్గ్, నారాయణ స్వామిలపై చర్యలు తీసుకోవాలని, వారు పని చేస్తున్న స్థానాల నుంచి మార్చాలంటూ తానిచ్చిన వినతిపత్రంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోకపోవడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురించి పిన్నెల్లి తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి గురువారం కోర్టు విచారణ మొదలు కాగానే న్యాయమూర్తులు జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ధర్మాసనం ముందు ప్రస్తావించారు.లంచ్మోషన్ రూపంలో అత్యవసర విచారణకు అభ్యర్థించారు. లంచ్మోషన్ అవసరం లేదని ధర్మాసనం మొదట చెప్పింది. అయితే నిరంజన్రెడ్డి అత్యవసరాన్ని వివరించారు. ఈ ముగ్గురు అధికారులు పిన్నెల్లికి వ్యతిరేకంగా ఉన్నారని, ఆయన్ని కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా చేసేందుకు కోర్టుకు సైతం తప్పుడు సమాచారం ఇచ్చి, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. ఈవీఎంల కేసులో పిన్నెల్లికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తరువాత తిరిగి హత్యాయత్నం కేసులు పెట్టిన విషయాన్ని వివరించారు.ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషనర్ ఇచ్చిన వినతిపత్రంపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్న ఈ అధికారులను పిటిషనర్పై నమోదు చేసిన కేసుల దర్యాప్తు నుంచి దూరంగా ఉంచాలన్నారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు వారిని విధుల నుంచి దూరంగా ఉంచితే సరిపోతుందని వివరించారు. దీంతో ధర్మాసనం లంచ్మోషన్ ద్వారా అత్యవసర విచారణకు అనుమతినిచ్చింది.ఏబీ వెంకటేశ్వరరావు చెప్పినట్లే ఐజీ చేస్తున్నారుగురువారం సాయంత్రం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, పిన్నెల్లి తరఫు న్యాయవాది నిరంజన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఐజీ త్రిపాఠీ, ఇన్స్పెక్టర్ నారాయణస్వామిలపైనే తమకు అభ్యంతరం ఉందన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సర్వశ్రేష్ట త్రిపాఠీ అత్యంత సన్నిహిత మిత్రుడుని, ఆయన చెప్పినట్లే చేస్తున్నారని తెలిపారు. అలాగే నారాయణ స్వామి ఓ పార్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పారు.వీరిద్దరూ పిన్నెల్లి పట్ల దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తూ తప్పుడు కేసులతో వేధిస్తున్నారని, కోర్టును సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని, దీనిని తీవ్రంగా పరిగణించాలని కోరారు. ఈ నెల 4 వరకు పిటిషనర్పై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా, ఆ కేసుల దర్యాప్తులో వీరు భాగం కాకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఎన్నికల సంఘం, పోలీసుల తీరును చూస్తుంటే రాష్ట్రంలో న్యాయ పాలన ఉందా అన్న సందేహం కలుగుతోందన్నారు. కోర్టు మాత్రమే తమకు రక్షణగా ఉందని, అందుకే మరోసారి కోర్టును ఆశ్రయించామని నిరంజన్రెడ్డి వివరించారు.ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. పిన్నెల్లి వినతిపత్రంపై మీరేం చేస్తున్నారని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. దీనికి ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ స్పందిస్తూ.. తగిన నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచిస్తానన్నారు. వినతిపత్రం తమకు ఇవ్వలేదని, డీజీపీకి ఇచ్చారని చెప్పారు. దీంతో ధర్మాసనం హోంశాఖ న్యాయవాదిని వివరణ కోరింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున డీజీపీ కూడా ఎన్నికల సంఘం పరిధిలోనే పని చేస్తుంటారని తెలిపారు. నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్నికల సంఘమేనన్నారు.పిన్నెల్లి తన పిటిషన్లో కొందరు పోలీసు అధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేశారని, అందువల్ల ఆయన వినతిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. రేపటికల్లా తగిన నిర్ణయం వెలువరించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఎన్నికల ప్రధాన అధికారిని, డీజీపీని ఆదేశించింది. పిన్నెల్లి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని వినతి పత్రంగా పరిగణించాలని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది. -
చంద్రబాబుపై డిప్యూటీ సీఎం ఫైర్
-
టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
చిత్తూరు: చంద్రబాబు బూటకపు హామీలను ప్రజలు నమ్మరని, టీడీపీకి ఇవే చివరి ఎన్నికలని డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పష్టం చేశారు. గురువారం మండలంలోని వనదుర్గాపురం, తొట్టికండ్రిగ, కృష్ణజమ్మపురం, శ్రీకావేరిరాజుపురం, పాలసముద్రం పంచాయతీల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డిప్యూటి సీఎం మాట్లాడుతూ 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 99.5 శాతం అమలు చేశారన్నారు. సచివాలయాల ద్వారా 1.35 లక్షల మందికి ఉద్యోగావకాశం కల్పించారని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖలో 54 వేల పోస్టుల భర్తీ, పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం తీసుకువచ్చారని వెల్లడించారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్తో కలసి ఐదేళ్లలోమొత్తం 6.48 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు వివరించారు. ప్రజలకు మేలు చేశామనే పెద్దసంఖ్యలో ఇతర పార్టీల నుంచి వైఎస్సార్సీపీలోకి వస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో గెలవలేమని భావించే చంద్రబాబు జనసేన, బీజేపీతోపాటు రహస్యంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. ఒకప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీని హీనంగా తిట్టిన చంద్రబాబు కేసుల భయంతో బీజేపీకి సాష్టాంగం పడ్డారని విమర్శించారు.అధికారం కోసం కుట్రలకు పాల్పడుతున్న చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించామని, ఈ ఎన్నికల్లో తన కుమార్తె కృపాలక్ష్మిని ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. చంద్రబాబు కళ్లలో ఆనందం చూడడానికే పీసీసీ అధ్యక్షులు షరి్మల విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.రాజన్న రాజ్యం తెస్తానని తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల అక్కడి ప్రజలు తిరస్కరించడంతో ఏపీకి వలస వచ్చారని విమర్శించారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైనామళ్లీ సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టడం ఖాయమన్నారు.కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్.శివప్రకాష్ రాజు, సింగిల్విండో చైర్మన్ గాలి జ్యోతి, వైస్ ఎంపీపీ శేఖర్ యాద్, పార్టీ మండల కన్వీనర్ తులసియాదవ్, జెడ్పీటీసీ సభ్యుడు అన్భళగన్, సినీ నిర్మాత షణ్ముగం, ఆర్బీకే చైర్మన్ పోలయ్య, పుత్తూరు మార్కెట్ డైరెక్టర్ రమాదేవి, కో–ఆప్షన్ మెంబర్ వేలు, సర్పంచ్ గాలి మహేష్ బాబు, అయ్యప్ప, నరసింహరాజు, భాష్కర్రెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, పుత్తూరు కేశవరెడ్డి, మురళి, నరసింహన్, ప్రేమ్కుమార్, ఆనందన్, ప్రకాశ్, కుమార్, చంద్రశేఖర్రాజు, షణ్ముగరెడ్డి, వరదరాజు, చిన్నవరదరాజు, సిద్దమందడి, శరవణన్, కుట్టి, చిన్నపయ్యన్, లక్ష్మణన్, రాజామణి, అరుల్, బాబు, మనోహర్, దనంజయన్, వాసురాజు, కుమార్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు షణ్ముగం పాల్గొన్నారు. -
వాలంటీర్ల సేవలపై టాలీవుడ్లో సినిమా!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ ఎంత అద్భుతంగా పని చేస్తుందో అందరికి తెలిసిందే. ఎక్కడ అవినీతి జరగకుండా.. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ నేరుగా లబ్దిదారులకు అందిచడంలో వాలంటీర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వృద్దులకు, వికలాంగులకు నెల నెల వారి గడపవవద్దకే వెళ్లి ఫించన్లు అందిస్తున్నారు. గతంలో ప్రభుత్వ పథకాలు పొందాలి అంటే.. స్థానిక రాజకీయనేతలు, ప్రజాప్రతినిధుల చుట్టు తిరిగాల్సి అవసరం వచ్చేది. కానీ ఇప్పుడు అర్హత ఉంటే చాలు.. వాలంటీర్లు మీ ఇంటి వద్దకే వచ్చి ఆయా పథకాలను అందిస్తున్నారు. ఈ వ్యవస్థపై అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా ‘వాలంటీర్’ వ్యవస్థ గురించి చర్చ జరుగుతోంది. త్వరలోనే ఈ వ్యవస్థపై టాలీవుడ్లో ‘వాలంటీర్’ అనే సినిమా కూడా రాబోతుంది. ఈ చిత్రంలో సూర్య కిరణ్ హీరోగా నటించగా.. ప్రసిద్ధి దర్శకత్వం వహిస్తున్నారు. రాకేష్ రెడ్డి నిర్మాత. ఈ రోజు(ఏప్రిల్ 12) తిరుపతిలో ఈ సినిమా టైటిల్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నారాయణ స్వామి మాట్లాడుతూ.. ‘వాలంటీర్ల సేవలపై వస్తున్న ‘వాలంటీర్’ మూవీ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. వాలంటీర్లు స్వచ్ఛందంగా సేవ చేస్తూ ప్రభుత్వానికి తోడుగా ఉంటున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ సర్వీస్ చేస్తున్నాడు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం వాలంటీర్ వ్యవస్థను సమర్థించారు. నిజాయితీగా సేవ చేస్తున్న వాలంటీర్ వ్యవస్థను లేకుండా చేయాలని చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నాడు. నిమ్మగడ్డ రమేశ్తో ఈసీకి ఫిర్యాదు చేయించి వాలంటీర్ సేవలను నిలిపివేశారు. చంద్రబాబు చేసిన కుట్ర వల్ల ఇప్పటికే 33 మంది వృద్ధులు, వితంతువులు చనిపోయారు.పేద ప్రజలకు సీఎం జగన్ చేస్తున్న సేవలను చూసి ఓర్వలేకనే చంద్రబాబు ఇలాంటి కుట్రలు చేస్తున్నాడు’ అని విమర్శించాడు. నిర్మాత, వైఎస్సార్సీపీ నేత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘వాలంటీర్లు రియల్ హీరోలు. తమిళనాడు, కర్ణాటకతో పాటు దేశం మొత్తం ఈ వ్యవస్థపై ప్రశంసలు కురిపిస్తుంది. అలాంటి గొప్ప వ్యవస్థపై సినిమా నిర్మించడం సంతోషంగా ఉంది. త్వరలోనే వాలంటీర్ చేస్తున్న సేవలను వెండితెరపై చూస్తారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన.. సినిమాను మాత్రం విడుదల చేసి తీరుతాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వామీజీ శ్రీకృష్ణమా చార్యులు, సుమతీ రెడ్డి, సాహితీవేత్త శ్రీదేవి తదితరులు హాజరయ్యారు. -
మోసపూరిత హామీలతో బాబు ఎత్తుగడలు: నారాయణస్వామి
-
‘ఎర్రచందనం స్మగ్లర్ల ముఠా నాయకుడు చంద్రబాబే’
సాక్షి, అమరావతి: చంద్రబాబు పక్కనున్నోళ్లంతా అభివృద్ధి నిరోధకులేనని డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి కె. నారాయణ స్వామి ఫైర్ అయ్యారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి నారాయణ స్వామి మాట్లాడారు. చంద్రబాబుల హయాంలో ఏ దళిత నేతకైనా డిప్యూటీ సీఎం పదవిచ్చావా? అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్కళ్యాణ్లు పెత్తందార్లకు ప్రతినిధులని ఎద్దేవా చేశారు. పేద కుటుంబాల్లో వెలుగులు నింపే పెద్దబిడ్డ వైఎస్ జగన్ అని తెలిపారు. ఎల్లోమీడియాకు బుద్ధిచెప్పే బాధ్యతను ప్రజలే తీసుకుంటారని అన్నారు. ఇంకా ఏమన్నారంటే.. ఎర్రచందనం స్మగ్లర్లంతా చంద్రబాబు మనుషులే దొంగే ..దొంగా దొంగా అని అరిచిన చందంగా ఎర్రచందనం స్మగ్లర్లకు నాయకుడైన చంద్రబాబు.. మా పార్టీ నేతల్ని విమర్శిస్తున్నారు. గతంలో టీడీపీ నాయకులే ఎర్రచందనం దుంగల్ని హెరిటేజ్ వాహనాల్లో తరలిస్తూ పోలీసులకు పట్టుబడటం నిజం కాదా..? నువ్వు అధికారంలో ఉండగానే నారావారి పల్లెలో ఎర్రచందనం దుంగల్ని పట్టుకున్నది నిజం కాదా..? మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్కుమార్ రెడ్డి పెద్ద ఎర్రచందనం స్మగ్లరని నువ్వే ప్రతీ మీటింగ్లోనూ చెబుతావు కదా..? మరి, ఇప్పుడు నీ పార్టీకొచ్చాక ఆయన మంచోడై పోయాడా...? స్మగ్లింగ్, దోపిడీల్లో నిన్ను మించినోళ్లు ఎవరూ లేరనేది వాస్తవం. కుంభకోణాలతో రూ. కోట్లు కొల్లగొట్టాడు చంద్రబాబు రాజకీయ జీవితమంతా దోచుకోవడం, దాచుకోవడమే.. అధికారంలో ఉన్నప్పుడు అనేక కుంభకోణాలకు తెరదీసి రూ. కోట్లు కొల్లగొట్టాడు. హైదరాబాద్లో రూ.600 కోట్లతో నువ్వు ప్యాలెస్ కట్టుకోలేదా..? అమరావతి కేపిటల్ పేరుతో భూకుంభకోణానికి తెరదీసి.. ఇన్నర్రింగ్రోడ్ మాయలో కోట్లు కొట్టేసి, స్కిల్ స్కామ్లోనూ ప్రభుత్వ ఖజానా సొమ్మును కాజేసింది నువ్వుకాదా..? నీ మీద కేసులు పడితే కోర్టులకెళతావు. స్టేలు తెచ్చుకుంటావు. అలాంటి మోసగాడివి నువ్వు చంద్రబాబు. నన్ను, మా పార్టీ నేతల్ని విమర్శించే అర్హత నీకు లేదు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా నియోజకవర్గానికీ.. చిత్తూరు జిల్లా అభివృద్ధికి ఏం చేశావో చెప్పుకునే దమ్ముందా..? ఎస్సీని డిప్యూటీ సీఎం చేసిన మహానుభావుడు జగన్ ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ సమానత్వం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారి ఆశీస్సులతో ఎస్సీ ఎమ్మెల్యేగా ఉన్న నేను డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నాను. మరి, నువ్వు నీ హయాంలో ఏ దళిత నేతకు డిప్యూటీ సీఎం పదవిచ్చావు..? నా నియోజకవర్గంలో ప్రజలకు నవరత్నాల పథకాల సంక్షేమాన్ని అందిస్తూనే.. 70 ఏళ్లుగా జరగని అభివృద్ధిని నేను చూపించాను. రెండు 50 పడకల ఆస్పత్రులు పెట్టించాను. రూ.250 కోట్ల వ్యయంతో నియోజకవర్గంలో రోడ్లు నిర్మాణం చేయించాను. దాదాపు 80 ఏళ్లుగా జీర్ణోద్ధారణకు నోచుకుని దేవాలయాల్ని కూడా నేనొచ్చాక వాటిని మరలా అభివృద్ధి చేశాను. అలాంటి నన్ను విమర్శిస్తారా..? ఒక మహోన్నత వ్యక్తిగా అంబేద్కర్ ఆశయాలతో నడుస్తోన్న జగన్ గారి నేతృత్వంలో నేను డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నానంటే చాలా గర్వపడుతున్నాను. చంద్రబాబూ.. నీకు నేను సవాల్ చేస్తున్నాను. నువ్వొస్తే.. నేను చేసిన నా నియోజకవర్గ అభివృద్ధిని చూపిస్తానని సవాల్ విసురుతున్నాను. చంద్రబాబు పక్కనున్నోళ్లంతా అభివృద్ధి నిరోధకశక్తులే నిత్యం అబద్ధాల్ని వల్లె వేస్తూ ఏమీ చేయకున్నా చేసినట్లు బిల్డప్ ఇచ్చుకుంటున్న చంద్రబాబును ప్రజలు 2019లోనే తిరస్కరించి మూలనబెట్టారు. ఆయన బతుకంతా అబద్ధాల ప్రపంచమేనని చిన్న పిల్లోడిని కదిలించినా చెబుతాడు. చంద్రబాబు అబద్ధాలతో పుట్టి.. అబద్ధాలతో బతికి.. అబద్ధాలతోనే చివరికి చనిపోతాడేమో.. గతంలో ఆయన అధికారంలో ఉండగా ప్రజలకు చేసిన మేలు ఏదీ లేనందునే .. ఇప్పుడు చెప్పుకోలేక పోతున్నాడు. పైగా, ఆయన చెప్పిన అబద్దాల్నే మళ్లీ మళ్లీ చెబుతుండటం కూడా ప్రజలకు పూర్తిగా అర్ధమైంది. కనుకే, టీడీపీ రా.. కదలి రా.. సభలకు ప్రజల స్పందన కరువైంది. ఆయనతో తిరిగే వారంతా అభివృద్ధి నిరోధకులేనని చెప్పుకోవాలి. ఎల్లో మీడియాకు బుద్ధిచెప్పే బాధ్యత ప్రజలే తీసుకుంటారు చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్కళ్యాణ్లు పెత్తందార్లకు ప్రతినిధులే.. కాబట్టే, పేదలకు మేలు చేస్తున్న ప్రభుత్వాన్ని పదేపదే తప్పుబడుతున్నారు. అదే జగన్ గారు పేద కుటుంబాల్లో వెలుగులు నింపే పెద్దబిడ్డగా పేరుతెచ్చుకుంటున్నారు. అయితే, ఎల్లోమీడియా మాత్రం పనిగట్టుకుని ఈ ప్రభుత్వం మీద పదేపదే బురదజల్లుతుంది. ఈనాడు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5లు కూడా చంద్రబాబు పక్కనజేరి అబద్ధాల్ని ప్రచారంలోకి తెస్తున్నారు. పనిగట్టుకుని మరీ లేనివాటిని కల్పన చేస్తూ జగన్ గారి కుటుంబంలోనూ చిచ్చును రాజేస్తున్నారు. ఇంత చేస్తున్నా కూడా .. జగన్ గారు మాత్రం ఎక్కడా స్పందించకుండా, సింహంలా ఉన్నారు. పేదవాడి తలరాతను మార్చే బాధ్యతను అలుపెరుగని వీరుడిలా జగన్ గారు నెరవేరుస్తున్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆయనకు నీరాజనాలు పలుకుతుంటే.. ఈ ఎల్లోమీడియా మాత్రం చంద్రబాబుకు తొత్తులుగా పనిచేస్తున్నారు. రేపటి ఎన్నికల్లో చంద్రబాబు, ఆయన పక్కన తిరిగే పవన్కళ్యాణ్కు.. ఈ ఎల్లోమీడియాకు తగిన బుద్ధి చెప్పే బాధ్యతను ప్రజలే తీసుకుంటారు. -
చంద్రబాబు, షర్మిల ఒకటే చంద్రబాబు మోదీ కాళ్లు పట్టుకుంటున్నాడు..!
-
ఎల్లో మీడియా నా మీద కుట్రతో తప్పుడు ... ప్రచారం చేస్తోంది
-
ఏపీకి ఎవరొచ్చినా సీఎం జగన్ ను ఏమీ చేయలేరు: నారాయణ స్వామి
-
సీఎం జగన్ దళిత నాయకులకు చాలా గౌరవం ఇస్తారు
-
‘ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం పనిచేసేది సీఎం జగన్ ఒక్కడే’
సాక్షి, బద్వేల్: ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ, బీసీల కోసం పని చేసే ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కడేనని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో సోమవారం జరిగిన వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికర బస్సుయాత్రలో నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సీఎం జగన్ కోసం పనిచేసే కూలీ అని అన్నారు. ‘టీడీపీ పెట్టినపుడు ఎన్టీఆర్కు చంద్రబాబు వ్యతిరేకంగా పోటీ చేశారు. ఓడిపోవడంతో లక్ష్మీ పార్వతి కాళ్ళు పట్టుకొని టీడీపీలో చేరారు. దేశంలో ఎంఎల్ఏలను కొనే సంప్రదాయానికి తెరలేపిందే చంద్రబాబే. ఎన్టీఆర్ను సీఎం సీట్లో నుంచి దించి ఆయన మరణానికి బాబు కారణం అయ్యాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రక్తం టీడీపీ రక్తమే. రేవంత్రెడ్డి ఏ పార్టీలో ఉన్నా చంద్రబాబు కోసం ఆలోచిస్తాడు. బాబు తన కోవర్టులు సీఎం రమేష్ను బీజేపీకి, రేవంత్రెడ్డిని కాంగ్రెస్ పంపాడు. పవన్ కళ్యాణ్ ప్యాకేజి కోసం పార్టీ పెట్టాడు. ఆయన కేవలం జగన్పై విమర్శల కోసమే పని చేస్తాడు’ అని నారాయణస్వామి విమర్శించారు. ఇదీచదవండి..పతనావస్థ దిశగా ప్యాకేజీ స్టార్ పరుగులు -
కడపలో ప్రజా చైతన్యం
సాక్షి ప్రతినిధి, కడప/ కడప కార్పొరేషన్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సాధించిన సామాజిక సాధికారత కడప నగరంలో పాటలై పొంగింది. గురువారం నగరంలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర వేలాది ప్రజలతో జైత్రయాత్రలా సాగింది. గురువారం ఉదయం నుంచే కడప నగరంలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. నృత్యాలు, పాటలు, జై జగన్ నినాదాలతో యాత్ర అంగరంగ వైభవంగా సాగింది. మధ్యాహ్నం 3.25 గంటలకు యూఎస్ మహల్ నుంచి బస్సు యాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. స్థానిక ప్రజలు, మహిళలు పూలు, గజమాలలు, మంగళ హారతులు, బాణసంచాతో అడుగడుగునా యాత్రకు బ్రహ్మరథం పట్టారు. పాత బస్టాండులో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి వైఎస్సార్సీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అశేష జనవాహిని మధ్య జరిగిన సభలో మంత్రులు, పలువురు మంత్రులు సీఎం జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సాధించిన సాధికారతను వివరించారు. ప్రసంగాల్లో జగన్ పేరు వచ్చిన ప్రతిసారీ ప్రజల హర్షాతిరేకాలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. వైఎస్సార్ జిల్లా కడపలో నిర్వహించిన సభలో పాల్గొన్న జనవాహినిలో ఓ భాగం సంఘ సంస్కర్త సీఎం జగన్: మంత్రి సురేష్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్రామ్, జ్యోతిరావు పూలే ఆలోచనలు కలగలిపిన పాలనతో సీఎం వైఎస్ జగన్ సామాజిక సంఘ సంస్కర్తగా నిలిచారని మంత్రి ఆదిమూలపు సురేష్ అభివర్ణించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలోని ఉప కులాలను కూడా సీఎం వైఎస్ జగన్ ఉన్నత స్థితికి తెస్తున్నారని తెలిపారు. ఆగ్రకులాల సరసన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ విద్యార్థులు చదువుకునేలా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం తెచ్చారన్నారు. మన ఆత్మగౌరవం నిలిపిన జగనన్నకు అండగా నిలవాలని కోరారు. జగనన్న ఆలోచనకు అండగా నిలుద్దాం: ఎమ్మెల్సీ రవిబాబు అణచివేతకు గురైన బిడ్డలను సామాజికంగా, రాజకీయంగా ఎదిగేలా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అండగా నిలవాలని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు కోరారు. 40 ఏళ్లుగా పేదల శ్రమశక్తి, ఆలోచన విధానాన్ని దోపిడీ చేసిన చంద్రబాబు రూ.6 లక్షల కోట్లకు ఎదిగారన్నారు. చంద్రబాబు వళ్లంతా అవినీతి మచ్చే : డిప్యూటీ సీఎం నారాయణస్వామి సీఎంగా సుదీర్ఘకాలం పని చేసిన చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం వీసమెత్తు కూడా పనిచేయలేదని తెలిపారు. బాబు వళ్లంతా అవినీతి మచ్చే ఉందని ఎద్దేవా చేశారు. మూడు తరాల క్రితమే వైఎస్ కుటుంబం సామాజిక న్యాయం పాటించిందని తెలిపారు. జగనన్న సర్కార్లో స్కావెంజర్ బిడ్డకు కూడా కార్పొరేట్ విద్య అందుతోందన్నారు. పేదల ఉన్నతికి అనుక్షణం తపించే సీఎం వైఎస్ జగన్ను మన జాతి కోసం మరోమారు గెలిపించుకోవాలని కోరారు. సామాజిక న్యాయం నినాదం కాదు..విధానం: డిప్యూటీ సీఎం అంజాద్బాషా స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సామాజిక న్యాయం నినాదంగానే ఉండేదని, ఇప్పుడు సీఎం జగన్ పాలనలో అది ఓ విధానమైందని డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్బాషా చెప్పారు. సీఎం వైఎస్ జగన్ సామాజిక సాధికారితను ఆచరణలో చూపెట్టి దేశంలోనే ఆదర్శంగా నిలిచారన్నారు. కడప ప్రజలు తనను రెండు సార్లు అత్యధిక మెజార్టీతో అసెంబ్లీకి పంపితే, సీఎం వైఎస్ జగన్ డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి ఆయన సరసన కూర్చోబెట్టుకున్నారని చెప్పారు. సంక్షేమం, సామాజిక న్యాయం సమపాళ్లలో..: ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో సామాజిక న్యాయానికీ అంతే ప్రాధాన్యత ఇచ్చారని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి అన్నారు. కేబినెట్లో 70 శాతం మంత్రులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలేనని చెప్పారు. రాజ్యసభ సభ్యులు, నామినేటెడ్ పోస్టుల్లోనూ ఈ వర్గాలకే సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ఈ సమావేశంలో శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానమ్, ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, ఎంవీ రామచంద్రారెడ్డి, పోతుల సునీత, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధ, మాజీ ఎంపీ బుట్టా రేణుక, కడప మేయర్ సురేష్బాబు, వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ ఆకేపాటి అమర్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జీవితంలో పవన్ కల్యాణ్ సీఎం కాలేడు: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
-
లిక్కర్ కంపెనీలకు అనుమతులు ఇచ్చింది టిడిపి ప్రభుత్వమేనని మరోసారి స్పష్టం చేసిన మంత్రి
-
జగన్ తో పోటీ చేసిన ఎవడికి డిపాజిట్ కూడా రాదు
-
సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగింది: మంత్రి కారుమూరి
సాక్షి, చిత్తూరు/కృష్ణా: వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర అయిదో రోజు కొనసాగుతోంది. ఉత్తరాంధ్రలో అనకాపల్లి జిల్లా మాడుగుల, కోస్తాలో అవనిగడ్డ, రాయలసీమలో చిత్తూరు జిల్లాల్లో బస్సుయాత్ర సాగుతోంది. కృష్ణాజిల్లా అవనిగడ్డలో బస్సు యాత్ర ఓటు వేసిన వారికి, వేయని వారికి సంక్షేమ పథకాలు అందించామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగింది. 56 కార్పొరేషన్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్దేనని ప్రశింసించారు. రావాలి జగన్.. కావాలి జగన్ అని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. టీడీపీ హయాంలో 36 వేల కోట్లతో కత్తెరలు,ఇస్త్రీ పెట్టెలు ఇచ్చి తిరిగి డబ్బు కట్టించుకున్నారని విమర్శించారు. లక్ష కోట్లతో తిరిగి చెల్లించే అవసరం లేకుండానే సీఎం సాయం చేశారని ప్రస్తావించారు. ► 65 వేల కోట్లతో నాడు-నేడు పనులతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారు: మంత్రి కారుమూరి ►పేద పిల్లల నుంచి ఐఏఎస్ లు, ఐపీఎస్లు రావాలని ఆకాంక్షించిన వ్యక్తి సీఎం జగన్. ►పేదరికాన్ని 6%కి తగ్గించిన మహానేత వైఎస్ జగన్ ►పోషకాహార లోపాన్ని అధిగమించేలా పిల్లలకు పౌష్టికాహారం అందించిన మనసున్న నేత ►చంద్రబాబు జీవిమంతా స్కాములే ►జగన్ మోహన్ రెడ్డి పాలనలో స్కీములు ►చంద్రబాబు కలెక్టర్ల మీటింగ్లలో మా వాళ్లకే చేయమని చెప్పాడు. ►సీఎం జగన్ పార్టీలు, కులాలను చూడకుండా మేలు చేయాలని చెప్పారు. ►సీఎంకు రెడ్డికి వ్యతిరేక ఓటనేదే లేదు ►మా నినాదం వై నాట్ 175 ►చంద్రబాబు, పవన్కు ఈ ఎన్నికల్లో చరమగీతమే ఎమ్మెల్సీ,మర్రి రాజశేఖర్ ►మ్యానిఫెస్టోలో చెప్పివన్నీ అమలు చేసిన వ్యక్తి సీఎం జగన్. ►రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఇది. ►అన్ని వర్గాలకు మేలు చేసిన ప్రభుత్వం ఇది. ►చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ►డ్వాక్రా మహిళలు, రైతులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. ►ధైర్యంగా ప్రతీ ఇంటికీ ఓటు అడిగే హక్కు సీఎం జగన్ మాకు కల్పించారు. ►ప్రతీ ఇంటికీ లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం ఇది. ►గత 75 ఏళ్లలో సచివాలయాలు, వెల్ నెల్ సెంటర్లు ఏ గ్రామంలోనూ చూడలేదు. ►ప్రజలు సామాజికంగా,ఆర్ధికంగా వృద్ధి చెందాలన్నదే సీఎం ఆలోచన మోపిదేవి వెంకట రమణ ►గత ప్రభుత్వంలో బీసీ వర్గాలు ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితమయ్యారు. ► సీఎం జగన్ పాలనలో బీసీలకు ఎంతో మేలు జరిగింది. ►బీసీ, ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలు తలెత్తుకు తిరిగేలా చేసిన వ్యక్తి సీఎం జగన్. ► 2 లక్షల 38కోట్లతో నేరుగా లబ్ధిదారులకు మేలు జరిగింది. ►భూతద్ధం పెట్టి వెతికినా సంక్షేమం అందలేదనే వ్యక్తి కనిపించడం లేదు. ►గత ప్రభుత్వంలో బిసిలకు రాజ్యసభ సీటు ఇచ్చిన పరిస్థితి లేదు. ►చరిత్రలో బీసీలకు పెద్ద పీట వేసిన ఒకే ఒక్క నేత జగన్ మోహన్ రెడ్డి . ►జగన్ మోహన్ రెడ్డి బీసీ,ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ వర్గాలకు ఆర్ధికంగా, రాజకీయంగా సాధికారత కల్పించారు. మంత్రిమేరుగ నాగార్జున ►సామాజిక సాధికార యాత్ర ఎందుకు అవసరమో మనం తెలుసుకోవాలి. ►అనేక మంది ఉద్ధండులు సామాజిక రుగ్మతలు పోవాలని ఉద్యమాలు చేశారు. ►ఏపీ చరిత్రలో సామాజిక విప్లవానికి తెరతీసిన వైఎస్ జగన్. ►చంద్రబాబు ఎస్సీలను ఘోరంగా అవమానించాడు. ►మాకు జరిగిన అవమానాన్ని మేం ఎన్నటికీ మర్చిపోం. ►పేదలకు ఇళ్లు ఇస్తుంటే సామాజిక అసమానతలు వస్తాయన్న మాట మర్చిపోం. ►దళితుల వెలివేతలు మర్చిపోం. ►పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్న వ్యక్తి సీఎం జగన్. ►చంద్రబాబు 14 ఏళ్లలో ఏనాడైనా వైఎస్ జగన్ సంక్షేమం చేశాడా? ►చంద్రబాబు ఎందుకు వద్దో.. జగన్ఎందుకు కావాలో చెప్పేందుకే ఈ సాధికార యాత్ర ►చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ►జగన్ మోహన్ రెడ్డిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ►బీసీ, ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలు ఐక్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ►మనమంతా కలిసి చంద్రబాబు రధ చక్రాలు ఊడగొడదాం. ►చంద్రబాబు ఆరోగ్యం బాలేదని...బయటికి వచ్చి రాజకీయ వ్యాపారం చేస్తున్నాడు. ►రాజకీయ వ్యాపారం చేస్తున్న చంద్రబాబు అంతు చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. ►జగన్ మోహన్ రెడ్డికి మనమంతా అండగా నిలవాలి. ►అవననిగడ్డలో సింహాద్రి రమేష్ బాబును.. రాష్ట్రంలో జగన్ను గెలిపించుకోవాల్సిన అవసరం మనపై ఉంది. చిత్తూరులో సామాజిక సాధికార బస్సు యాత్ర చిత్తూరులో ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగింది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, అంజాద్ భాషా తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 2:45 గంటలకు విలేకర్ల సమావేశంలో నేతలు పాల్గొన్నారు. సూర్య ప్రతాప కళ్యాణమండపం నుంచి బైక్, ఆటో ర్యాలీ చేశారు. అనంతరం 4 గంటలకు నాగయ్య కళాక్షేత్రం వద్ద బహిరంగ సభలో నేతలు ప్రసంగించారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ►సీఎం జగన్ పాలన సంక్షేమానికి చిరునామా. ► అన్ని వర్గాలకూ న్యాయం చేసిన నాయకుడు సీఎం జగన్ ► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అండగా నిలిచిన నాయకుడు వైఎస్ జగన్ ►పేదల తలరాత మార్చాలంటే సామాజిక న్యాయంతోనే సాధ్యం ►చంద్రబాబు ఏ రోజూ వెనుకబడిన వర్గాలను పట్టించుకోలేదు ►దళితులను అవమానించిన నీచుడు చంద్రబాబు ►ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నది ఎవరు? ►దళితులను అవమానించిన నీచుడు చంద్రబాబు ►ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అన్నది ఎవరు? ►బీసీలను చంద్రబాబు ఎప్పుడైనా పట్టించుకున్నారా ►సామాజిక న్యాయం నినాదాన్ని గత ప్రభుత్వం ఓటు బ్యాంకుగానే వాడుకుంది. ►ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన నాయకుడు సీఎం జగన్. -
ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నది ఎవరు?
-
పేదల దేవుడు మన సీఎం జగన్
-
నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పై డిప్యూటీ సీఎం ఘాటు వ్యాఖ్యలు
-
చంద్రబాబు లాయర్లకు కోట్లు ఖర్చు చేస్తున్నారు: నారాయణ
-
పుంగనూరు ఘటన చంద్రబాబుకి శాపం అయింది...
-
చంద్రబాబు నాయుడు అభివృద్ధి నిరోధకుడు: డిప్యూటీ సీఎం
-
పురందేశ్వరిపై సంచలన కామెంట్స్ చేసిన ఏపీ డిప్యూటీ సీఎం
-
చంద్రబాబు లాయర్లు కూడా టెర్రరిస్ట్ ల తయారయ్యారు..!
-
పురంధేశ్వరిపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఫైర్
-
మోత్కుపల్లి.. చంద్రబాబుని ఏమన్నావో గుర్తుందా?
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవినీతిపరుడంటూ గతంలో అనేక ఆరోపణలు చేసిన తెలంగాణ నేత మోత్కుపల్లి నర్సింహులు.. ఇప్పుడు ఉన్నట్టుండి బాబుపై ఎక్కడలేని ప్రేమను ఒలకబోస్తుండడంపై ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి నిప్పులు చెరిగారు.ఒకప్పుడు ఎన్టీఆర్ని చంపించింది చంద్రబాబు నాయుడేనని మాట్లాడిన మోత్కుపల్లి ఇప్పుడు డబ్బు, ప్యాకేజీ కోసం చంద్రబాబుని పొగుడుతున్నారని విమర్శలు గుప్పించారు. అవినీతి చేసి అరెస్టైన చంద్రబాబుకు మద్దతుగా దీక్షకు దిగిన మోత్కుపల్లిపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘చంద్రబాబు నాయుడు పెద్ద అవినీతి పరుడని, నయవంచకుడని గతంలో విమ్మర్శలు చేసిన మోత్కుపల్లి ఇప్పుడు ఆయనేదో నీతిపరుడన్నట్లు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్ని చంపించింది చంద్రబాబు నాయుడేనని మాట్లాడిన మోత్కుపల్లి.. ఇప్పుడు డబ్బు, ప్యాకేజీ కోసం చంద్రబాబుని పొగుడుతున్నాడన్నారు. ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించం అని మోత్కుపల్లిని వారించారాయన. అసలు అవినీతిని కనిపెట్టిందే చంద్రబాబు నాయుడని.. స్కిల్ స్కామ్లో కోట్లు కొల్లగొట్టాడని ఈరోజు ఆయన పాపం పండి కటకటాల పాలయ్యాడని అన్నారు. ఇక బీజేపీ నేత పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిలా కాకుండా టీడీపీ అధ్యక్షురాలిలా వ్యవహరిస్తోందని, ఆరోజు డబ్బు కోసం, పదవి కోసం ఆశపడి పురందేశ్వరి ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచిందని అన్నారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే చంద్రబాబు అవినీతిపరుడని చెబుతుంటే.. పురందేశ్వరి మాత్రం ఆయనేదో సత్యహరిశ్చంద్రుడన్నట్టు మద్దతిస్తున్నారన్నారు. మద్యం షాపుల్లో నగదు, ఆన్లైన్ పేమెంట్లు రెండూ తీసుకుంటున్నారని.. పురందేశ్వరి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడవద్దని హెచ్చరిస్తూనే ఆమె ఏమైనా ఆడిటరా..? అని చురకలంటించారు. ఇది కూడా చదవండి: CBN: ఇంటరాగేషన్లో కాలయాపన.. ప్రశ్నలకు జవాబులు దాటవేత -
‘నాడు అవినీతి పరుడు అన్న నోటితోనే నేడు పొగడ్తలు’
సాక్షి, విజయవాడ: చంద్రబాబు నాయుడు అవినీతీ పరుడు, నయవంచకుడు అని గతంలో విమర్శించిన సీనియర్ నేత మోత్కపల్లి నర్సింహులు.. నేడు అదే నోటితో పొగడటంపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. ‘చంద్రబాబు అవినీతి పరుడు, నయవంచకుడు అని మోత్కుపల్లి గతంలో చెప్పాడు. ‘ఎన్టీఆర్ని చంపించింది చంద్రబాబు నాయుడే అని మోత్కుపల్లి అన్నాడు. ఇప్పుడు డబ్బు, ప్యాకేజీ కోసం చంద్రబాబు నాయుడు ఒక పెద్ద మనిషి అంటూ పొగుడుతున్నాడు. మోత్కుపల్లి నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించం. అవినీతిని కనిపెట్టిందే చంద్రబాబు.. స్కిల్ స్కామ్లో కోట్లు కొల్లగొట్టాడు. పురందేశ్వరి టీడీపీ అధ్యక్షురాలా? బీజేపీ అధ్యక్షురాలా?, డబ్బు కోసం, పదవి కోసం ఎన్టీఆర్ని పురందేశ్వరి వెన్నుపోటు పొడిచింది. ప్రధాని మోదీనే చంద్రబాబు అవినీతి పరుడని చెప్తే పురందేశ్వరి మద్దతిస్తోంది’ అంటూ నారాయణస్వామి ధ్వజమెత్తారు. -
చంద్రబాబు పేరు చెప్పగానే అవినీతి గుర్తొస్తుంది: డిప్యూటీ సీఎం
-
అల్లకల్లోలం సృష్టించేందుకు టీడీపీ కుట్ర: మంత్రి నారాయణస్వామి
సాక్షి, తిరుపతి: రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని, పుంగనూరు ఘటనలో చంద్రబాబే మొదటి ముద్దాయి అంటూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, లోకేష్, అయ్యన్నపాత్రుడు క్యారెక్టర్ లేనివాళ్లు. మంత్రి పెద్దిరెడ్డి గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు దారుడు గుర్తుకు వస్తాడు. పవన్ కల్యాణ్ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడని మంత్రి దుయ్యబట్టారు. ‘‘ప్రజలకు మంచి చేస్తాం అని టీడీపీ నేతలు చెప్పడం లేదు.. పిచ్చి కుక్కలు మాదిరిగా రోడ్లపై తిరుగుతున్నారు. రౌడీ రాజ్యం తేవాలని చూస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు. ఏ ఊరికి వెళ్లిన సీఎం జగన్ సంక్షేమ పథకాలు గుర్తుకు వస్తాయి. మంత్రి పెద్దిరెడ్డి చాలా సహనంతో ఉన్నారు. మొన్న పుంగనూరులో జరిగిన ఘటనపై కోర్టులు సుమోటోగా స్వీకరించాలి’’ అని మంత్రి నారాయణ స్వామి కోరారు. చదవండి: ‘చంద్రబాబూ.. ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?’ -
రౌడీ రాజకీయాలను ప్రేరేపిస్తున్న బాబు, లోకేశ్
తిరుపతి సిటీ: చంద్రబాబు, లోకేశ్ పాదయాత్రల పేరుతో చంపుతాం.. అంతు చూస్తాం.. అంటూ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం రౌడీ రాజకీయాలను ప్రేరేపించడమేనని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన శుక్రవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి మేలు చేస్తామని ఒక్క మాట కూడా లోకేశ్ తన పాదయాత్రలో మాట్లాడకపోవడం దారుణమన్నారు.పుంగనూరులో టీడీపీ కుట్ర ప్రజలకు అర్థమైందన్నారు. కులపిచ్చి, వెన్నుపోటు రాజకీయాలు తప్ప ప్రజాప్రభుత్వం రావాలనే ఆకాంక్ష టీడీపీ వారికి లేదన్నారు. రామోజీ గ్రూపునకు చెందిన మార్గదర్శి సంస్థ మోసాలను సీఎం వైఎస్ జగన్ బయటపెట్టడంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. పదవులు పోవడంతో మతిభ్రమించి బొండా ఉమ, అయ్యన్నపాత్రుడు రాక్షసుల్లాగా మాట్లాడుతున్న తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఉచ్చపోయిస్తాం.. అంటున్న లోకేశ్ లెట్రిన్, బాత్రూమ్లు కట్టే పనిలో ఉన్నారా.. అని ప్రశ్నించారు. లోకేశ్ అందుకు కూడా పనికిరాడని ఎద్దేవా చేశారు. -
పవన్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఫైర్
-
బాబును ప్రజలు నమ్మొదు..!
-
విజయవాడలో వైభవంగా శ్రీ మహాలక్ష్మి యజ్ఞం
-
ఎస్సీ కుటుంబాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా మేలు జరుగుతోంది
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలో వైఎస్సార్సీపీ ఎస్సీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ స్వామి, మేరుగు నాగార్జున, విశ్వరూప్, ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు. రాష్ట్రంలో ఎస్సీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై చర్చించారు. ఈ భేటీలో సజ్జల రామాకృష్ణారెడ్డి, చెవిరెడ్డి, గురుమూర్తి కూడా పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో మసిపూసి మారేడుకాయ చేసినట్లు ఎస్సీలకు కొన్ని పథకాలు పెట్టి అవి కేవలం టీడీపీ కార్యకర్తలకు అందేలా చేసి అవినీతికి పాల్పడిన పరిస్థితి ఉందని, వాటన్నింటినీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం సరిదిద్దిందని తెలిపారు. 'ఈరోజు ఎస్సీ కుటుంబాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా మేలు కల్గించేలా సంస్థాగత మార్పులు, సంస్కరణలు చేస్తూ ప్రధానంగా విద్య, వైద్యం వంటి అంశాల్లో గత నాలుగు సంవత్సరాలుగా సీఎం జగన్ అందించిన పరిపాలన మీద ఈరోజు చర్చించాం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సంక్షేమ పథకాల మీద ప్రతిపక్షాలు వక్రభాష్యంతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి. వాటిని తిప్పికొట్టి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించాలని ఈరోజు తీర్మానించాం. ప్రధానంగా ఈ ప్రభుత్వం మూల సూత్రాలు జవాబుదారీతనం, పారదర్శకత, అవినీతి రహిత పాలనను నాలుగు సంవత్సారాలుగా ఏ విధంగా అందిస్తున్నారనే విషయంపైనా చర్చించాం. రాబోయే రోజుల్లో ఎస్సీ కుటుంబాలు ఏకతాటిపైకి వచ్చి తమకు అందుతున్న సంక్షేమ పథకాలు భవిష్యత్తులోనూ కొనసాగాలంటే జగన్ను మరోసారి సీఎం చేయాల్సిన అవసరంపై కూడా చర్చించాం.' అని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. పార్టీల తీరు మారాలి: సజ్జల సజ్జల మాట్లాడుతూ.. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పార్టీల తీరు మారాలన్నారు. మన ఆలోచనలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. చదవండి: జగనన్న కాలంలో ఏపీ వైద్యారోగ్యానికి స్వర్ణయగం: మంత్రి రజిని -
రాష్ట్ర వ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం
-
పలాస ఎప్పటికీ వైఎస్సార్సీపీ అడ్డానే: మంత్రి సీదిరి అప్పలరాజు
సాక్షి, అమరావతి: 175 అసెంబ్లీ స్థానలకు 175 గెలవాలనే లక్ష్యంతో పనిచేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పినట్లు తాడేపల్లి మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. సీఎం చాలా సానుకూల ధృక్పథంతో ఉన్నారని, మరింత ప్రజలకు చేరువ కావాలని సూచించారని చెప్పారు. ‘మొన్న మంత్రి పదవి తీసేస్తారని ప్రచారం చేశారు. ఈరోజు ఎమ్మెల్యేగా పీకేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారు. పలాస ఎప్పటికీ వైఎస్సార్సీపీ అడ్డానే. సాఫ్ట్ టార్గెట్తో మరింత ఉత్సాహంగా పనిచేస్తా. పలాసలో ఏం జరిగినా అప్పలరాజే కారణమని టీడీపీ ప్రచారం చేస్తోంది’ అని విమర్శించారు. ఆగస్టు నాటికి గడపగడపకు కార్యక్రమం పూర్తి చేయాలని సీఎం జగన్ చెప్పారని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి గడప గడపకు వెళ్లాలని సీఎం సూచించారని తెలిపారు. ఏప్రిల్ 7 నుంచి 21 వరకు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ఉంటుందని, దీనిపై సీఎం దిశానిర్ధేశం చేశారన్నారు. ప్రతిపక్షాలు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని సీఎం స్పష్టం చేశారని చెప్పారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. రామోజీరావు ధృతరాష్టుడిగా మారిపోయాడు పేదల కోసం చంద్రబాబు, రామోజీ ఆలోచించారా అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రశ్నించారు. పేదల రక్తమాంసాలతో వ్యాపారం చేసిన వ్యక్తులు చంద్రబాబు, రామోజీరావు అంటూ ధ్వజమెత్తారు. తమకు ఓటేసినా.. వేయకపోయినా ఇంటింటికీ వెళ్లి పథకాలు అందిస్తున్నామని తెలిపారు. రామోజీరావు ధృతరాష్టుడిగా మారిపోయి, గాంధారిలా కళ్లకు గంతలు కట్టుకున్నాడని విమర్శించారు. చంద్రబాబు రూపొందించిన బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారానే ఈరోజుకీ తెలుగు రాష్ట్రాల్లో మద్యం సేల్స్ జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఈ విషయం రామోజీరావుకి తెలియదా అని నిలదీశారు. ‘మద్యపానం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, రామోజీరావుకి లేదు. పేదల రక్తం తాగి ఈరోజు రామోజీరావు వార్తలు రాస్తున్నాడు. ఏ రోజైనా పేదల గురించి రామోజీరావు, రాధాకృష్ణ వార్తలు రాశారా. పచ్చళ్లు, ఊరగాయలు అమ్ముకునే రామోజీరావు ఈరోజు వేల కోట్లకు ఎలా అధిపతి అయ్యాడు. మార్గదర్శి అక్రమాలపై ఈడీ విచారణకు పిలిచింది. మార్గదర్శి అక్రమాలపై పేపర్లో రాశాడా. స్కిల్స్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు దొరికినా ఏనాడైనా రాశాడా. ఈనాడులో రాసేవన్నీ పచ్చి అబద్ధాలు’ అని నారాయణ స్వామి దుయ్యబట్టారు. -
‘అందులో ఈనాడు రామోజీరావు పాత్ర ఉంది’
సాక్షి, చిత్తూరు: ఈనాడు,రామోజీపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్కిల్ స్కాంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారన్నారు. ‘‘అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ ఆధారాలు బయటపెట్టారు.. కానీ ఈనాడు పత్రికలో ప్రచురించలేదు. నవరత్నాలు గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కానీ ఏనాడు ఈనాడులో ఒక్క మంచి వార్త కూడా రాలేదు’’ అని నారాయణ స్వామి దుయ్యబట్టారు. ‘‘ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు. అందులో రామోజీరావు పాత్ర ఉంది. అను నిత్యం సీఎం జగన్పై విషం చల్లుతున్నారు. రామోజీరావు తాటాకు చప్పుళ్లకు వైఎస్ జగన్ భయపడరు’’ అని డిప్యూటీ సీఎం అన్నారు. చదవండి: డబ్బున్నవాళ్లే పేదల్ని ఆదుకోవాలా? -
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న పవన్ కళ్యాణ్
సాక్షి,అమరావతి/గంగాధరనెల్లూరు: ప్రజాస్వామ్యమంటే ఏంటో తెలియని పవన్కళ్యాణ్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని.. బూతులు మాట్లాడి ప్రజల్ని రెచ్చగొడుతున్నారని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మండిపడ్డారు. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు డైరెక్షన్లో పవన్కళ్యాణ్ పనిచేస్తున్నారన్నారు. 14ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబును కాపుల కోసం ఏమి చేశారని పవన్ ఏనాడైనా అడిగారా అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ తెచ్చింది దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అని గుర్తుచేశారు. దాని గడువు ముగిసిన వెంటనే జగన్ మరో 20ఏళ్లు పొడిగించారని దీనిపై పవన్ ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో అర్థంకావడంలేదన్నారు. ఆ ఆర్హత పవన్కు లేదు: హనుమంత్ నాయక్ ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలుపై సదస్సు పెట్టే అర్హత పవన్ కళ్యాణ్కు లేదని వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరాజోత్ హనుమంత్ నాయక్ అన్నారు. తాడేపల్లిలో గురువారం ఆయన మాట్లాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సబ్ ప్లాన్ చట్టం ప్రకారం బడ్జెట్ లో ఎస్టీల అభివృద్ధికి 2020–23లో రూ.6,822.65 కోట్లను కేటాయించిందని చెప్పారు. గిరిజనుల నిధులను దారి మళ్లించి గిరిజనుల అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించిన నాటి టీడీపీ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ ఆనాడు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. -
అయ్యన్నపాత్రుడుకి మతి భ్రమించింది: నారాయణ స్వామి కౌంటర్
సాక్షి, చిత్తూరు: టీడీపీ అయ్యన్నపాత్రుడిపై డిప్యూటీ నారాయణ స్వామి సీరియస్ అయ్యారు. అయ్యన్నపాత్రుడు మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. సంస్కారం లేని వ్యక్తి అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కాగా, నారాయణ స్వామి మాట్లాడుతూ..‘రాబోయే ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ గల్లంతవడం ఖాయం. అయ్యన్నపాత్రుడు సంస్కారం లేని వ్యక్తి. ఓడిపోతామనే భయంతో మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. తాను కాబోయే హోం మంత్రిని అంటూ గొప్పలు చెప్పుకుంటున్నాడు. అయ్యన్నపాత్రుడు తన భాషను మార్చుకోవాలి. లేకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు అంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు.. అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలపై నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ కూడా ఆగ్రహ వ్యక్తం చేశారు. ఆయన ఒక సైకో, శాడిస్డు అని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్లు పెద్ద సైకోలు అని ధ్వజమెత్తారు. అయ్యన్నపాత్రుడు చరిత్ర అందరికి తెలుసని, నర్సీపట్నంను గంజాయి అడ్డాగా మార్చిన చరిత్ర ఆయనదని విమర్శలు గుప్పించారు. అయ్యన్న కంటే మేము బూతులు మాట్లాడగలము. అయ్యన్న నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. -
చంద్రబాబుపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఫైర్
-
ఏపీని నార్కోటిక్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం : డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
-
సారా, అక్రమ మద్యం కట్టడికి కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: నాటు సారా, అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలని ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి అధికారులను ఆదేశించారు. దశాబ్దాలుగా సారా తయారీయే వృత్తిగా జీవిస్తున్నవారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన ‘పరివర్తనం’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో గురువారం నిర్వహించిన ఎక్సైజ్ శాఖ సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అక్రమాలకు పాల్పడినవారి నుంచి సంబంధిత మొత్తాన్ని వసూలు చేసేందుకు ఆర్ ఆర్ చట్టం ప్రయోగించాలని ఆదేశించారు. అంతర్రాష్ట్రస్థాయి గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు విస్తృతంగా తనిఖీలు చేపట్టాలన్నారు. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, కమిషనర్ వివేక్ యాదవ్, రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ డి.వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రామోజీ.. తప్పుడు రాతలొద్దు
సాక్షిప్రతినిధి, తిరుపతి: ‘రామోజీరావుగారూ.. తప్పుడు రాతలు రాసి మామధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నావు. మీ రాతలను ఎవ్వరూ నమ్మరు. నమ్మేరోజులు పోయాయి..’ అని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు. తాను వైఎస్సార్సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడినంటూ ఈనాడులో గురువారం అసత్య, తప్పుడువార్త రాశారని మండిపడ్డారు. ఆయన గురువారం తిరుపతిలో విలేకరులతో మాట్లాడారు. చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని యువకుడు, ఎమ్మెల్సీ భరత్కి ఇవ్వటం చాలా ఆనందంగా ఉందన్నారు. భరత్ మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. సీఎం వైఎస్ జగన్ దళితులకు పెద్దపీట వేశారని చెప్పారు. సీఎం సహకారంతో ఎన్నో ఉన్నత పదవులు అలంకరించిన తాను జిల్లా అధ్యక్ష పదవి కోసం పోటీపడే వ్యక్తిని కాదని తేల్చిచెప్పారు. దళితులను కించపరిచేవిధంగా మరోసారి తప్పుడు రాతలు రాస్తే క్షమించేదిలేదన్నారు. -
జన సైకోలు.. ప్లాన్ ప్రకారమే మంత్రులపై దాడి
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: విశాఖ ఎయిర్పోర్టు వద్ద జనసేన కార్యకర్తలు వీరంగంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యే, నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎయిర్పోర్టు దగ్గర మంత్రుల కార్లపై జనసేన కార్యకర్తల దాడిని ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ తక్షణమే స్పందించి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అసలేం జరిగిందంటే.. విశాఖ ఎయిర్పోర్టు వద్ద గర్జన సభ నుంచి ఒకే కారులో ఎయిర్పోర్టు వెళ్తున్న వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేష్పై జనసేన కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. కర్రలు, రాళ్లతో దాడి చేశారు. మంత్రి రోజా సహాయకుడికి, జోగిరమేష్ అనుచరులకు గాయాలయ్యాయి. జనసేన కార్యకర్తల విధ్వంసంతో ఎయిర్పోర్టులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. జనసేన చిల్లర రాజకీయాలు చేస్తోంది. గర్జనకు వచ్చిన స్పందనను చూసి ఓర్వలేకపోతున్నారు. పిల్ల సేనలు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. పవన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మేం కన్నెర్ర చేస్తే.. మీరు రోడ్లపై తిరగలేరు. -మంత్రి ఆర్కే రోజా జనసేన కార్యకర్తలు అల్లరి మూకల్లా ప్రవర్తించారు. జనసేనకు విధి విధానమంటూ లేదు. -వైవీ సుబ్బారెడ్డి ఎయిర్పోర్టు వద్ద జరిగిన దాడి ఉన్మాద చర్య.. ఇది రాజకీయ పార్టీనా.. రౌడీ మూకనా?. విశాఖ గర్జన ప్రశాంతంగా జరిగింది. గర్జనకు భారీగా ప్రజలు తరలివచ్చారు. భారీ వర్షాన్ని కూడా జనం లెక్కచేయలేదు. గర్జనకు వచ్చిన స్పందన చూసి ఓర్వలేకపోతున్నారు. మంత్రులపై దాడి కాదు.. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలపై దాడి. దాడిని పవన్ సమర్థిస్తున్నారా?. జనసేనకు లక్ష్యం, సిద్దాంతమంటూ ఏమీ లేదు. జనసేన కార్యకర్తలది సైకో చర్య. -స్పీకర్ తమ్మినేని సీతారాం. చదవండి: ‘జనసేన’ సైకో చర్య.. దాడి ఘటనపై మంత్రి జోగి రమేష్ హెచ్చరిక జన సైనికులుకాదు.. జన సైకోలు.. ఎయిర్పోర్టు వద్ద దాడి ఘటనకు పవన్ బాధ్యత వహించాలి. మంత్రులపై కావాలనే దాడి చేశారు. పథకం ప్రకారమే మంత్రులపై దాడులు జరిగాయి. దాడి ఘటనకు బాధ్యత వహించి పవన్ క్షమాపణ చెప్పాలి. గర్జనను పక్కదారి పట్టించేందుకే కుట్రలు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.. -మంత్రి గుడివాడ అమర్నాథ్ వీధి రౌడీల్లా దాడికి పాల్పడ్డారు. జనసేన కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. విశాఖ గర్జన విజయవంతం కావడం తట్టుకోలేకపోతున్నారు. ప్రజల నుంచి మద్దతు లేకపోవడంతో మంత్రులపై దాడి చేశారు. ఏదో రకంగా ప్రభుత్వంపై బురదజల్లాలనేది వారి లక్ష్యం. మీడియా ముందు హల్చల్ చేయాలని చూస్తున్నారు. మంత్రులపై దాడి ఘటనకు పవన్ బాధ్యత వహించాలి. జనసేన కార్యకర్తల దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం. -హోంమంత్రి తానేటి వనిత జన సైనికులా.. సైకోలా? అసూయా ద్వేషాలకు ప్రతిరూపాలుగా ప్రవర్తిస్తున్న వపన్ కళ్యాణ్ అభిమనులని చెప్పుకునే ఉన్మాదుల దుశ్చర్యలు రోజురోజుకూ హద్దుమీరి పోతున్నాయి. విశాఖలో వైఎస్సార్ సీపీ నాయకుల మీద దాడి హేయమైనది. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలి. -మంత్రి వేణు గోపాల కృష్ణ చెల్లుబోయిన జనసైనికులా? సైకో లా?? అసూయా ద్వేషాలకు ప్రతిరూపాలుగా ప్రవర్తిస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులని చెప్పుకునే ఉన్మాదుల దుశ్చర్యలు రోజురోజుకూ హద్దుమీరి పోతున్నాయి. విశాఖ లో వైఎస్సార్సీపీ నాయకుల మీద దాడి హేయమైనది. దీనిని నేను తీవ్రం గా ఖండిస్తున్నాను. పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. — VenuGopalaKrishna Chelluboina (@chelluboinavenu) October 15, 2022 ఆవు చెన్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా?. ఈ పవన్ కల్యాణ్ కనీసం ఒక చోటైనా గెలిచి ఉంటే క్రమశిక్షణ, విలువలు తెలిసుండేది. ఇతనికే క్రమశిక్షణ లేనప్పుడు ఇక ఇతని అభిమానులకు ఉంటుందా? ఎయిర్ పోర్టు దగ్గర జరిగిన ఘటనకు బాధ్యత వహించి పవన్ తక్షణమే సమాధానం చెప్పాలి. -మంత్రి నారాయణ స్వామి ఆవు చెన్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ఈ @PawanKalyan కనీసం ఒక చోటైనా గెలిచి ఉంటే క్రమశిక్షణ, విలువలు తెలిసుండేది. ఇతనికే క్రమశిక్షణ లేనప్పుడు ఇక ఇతని అభిమానులకు ఉంటుందా? ఎయిర్ పోర్టు దగ్గర ఘటనకు బాధ్యత వహించి పవన్ తక్షణమే క్షమాపణ చెప్పాలి#JanaSenaGoons pic.twitter.com/qp0pVCpJFQ — Narayanaswamy Kalathuru (@NSwamy_Official) October 15, 2022 మొన్న కోనసీమ జిల్లాలో మంత్రి ఇంటిపై దాడికి తెగబడ్డారు. నేడు విశాఖలో అల్లర్లు సృష్టిస్తున్నారు. తమ ఓపికకు ఒక హద్దు ఉంటుంది. అయినా బాధ్యతాయుతమైన అధికార పార్టీగా సంయమనంతో, ఓపికతో ముందుకుపోతున్నాం. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఏమాత్రం చోటులేదు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి.2/2 — Malladi Vishnu (@malladiysrcp) October 15, 2022 I strongly condemn the attack by @JanaSenaParty goons on @yvsubbareddymp garu, @JogiRameshYSRCP garu & @RojaSelvamaniRK garu in Vizag. This incident clearly Shows the true character of Janasena party today. Such misdemeanour acts are against to democratic values in the country. pic.twitter.com/okztqTdx23 — Maddila Gurumoorthy (@GuruMYSRCP) October 15, 2022 -
చంద్రబాబు విశ్వాస ఘాతకుడు: మంత్రి నారాయణ స్వామి
-
ఏబీఎన్ రాధాకృష్ణ.. చంద్రబాబు బినామీ: నారాయణ స్వామి
సాక్షి, చిత్తూరు: ఏబీఎన్ రాధాకృష్ణ.. చంద్రబాబు బినామీ అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏబీఎన్ రాధాకృష్ణ, చంద్రబాబు ఇద్దరూ దొంగలేనని ధ్వజమెత్తారు. ఎంపీ గోరంట్ల మాధవ్పై తప్పుడు వీడియోలు ప్రసారం చేశారని, రాజకీయ లబ్ధి కోసమే జరిగిందన్నారు. ఆ వీడియో ఇప్పుడు ఫేక్ అని తేలిందన్నారు. చంద్రబాబుతో కలిసి రాధాకృష్ణ ఎన్ని కుట్రలు చేసినా ఉపయోగం ఉండదన్నారు. చదవండి: అందుకే వారికి కడుపు మంట: సీఎం జగన్ బీసీలకు చంద్రబాబుతో పాటు రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. తన గురించి తప్పుడు కథనాలు ప్రసారం చేసిన రాధాకృష్ణ నా సవాల్ స్వీకరించలేదన్నారు. ఏబీఎన్ రాధాకృష్ణకు దమ్ముంటే ఇప్పటికైనా తన సవాల్ స్వీకరించాలని నారాయణస్వామి అన్నారు. -
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాల్
సాక్షి, చిత్తూరు: ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ తనపై తప్పడు వార్తలు రాయించారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విజయవాడలో తనకు మద్యం షాప్ల బినామీలు ఉన్నట్లు ఆరోపణలను ఆయన ఖండించారు. రాధాకృష్ణకు దమ్ముంటే తన బినామీలు ఎవరో బయటపెట్టాలని నారాయణస్వామి సవాల్ విసిరారు. చదవండి: ఆ విషయంలో టీడీపీ ఎందుకు మౌనం దాల్చింది? ‘‘రాధాకృష్ణ నీచపు బుద్ధి మానుకోవాలి. ఆంధ్రజ్యోతిలో వచ్చిన తప్పుడు కథనంపై పరువునష్టం దావా వేస్తా. ఈ-వేలం ద్వారా బార్లకు లైసెన్స్లు పొందుతున్నారు. నిబంధనలు ప్రకారం వేలం జరుగుతుంటే రాధాకృష్ణ ఓర్వలేకపోతున్నారు. ఆంధ్రజ్యోతి నిజమని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ నారాయణస్వామి విసిరారు. -
‘వరద ప్రాంతాల్లో సీఎం జగన్లా మరే ముఖ్యమంత్రి పర్యటించలేదు’
సాక్షి, అమరావతి: వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాగా మరే సీఎం పర్యటించలేదని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. సీఎం వైఎస్ జగన్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో మంగళవారం పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా నారాయణ స్వామి మాట్లాడుతూ.. ట్రాక్టర్, పడవలు, బురదలో సీఎం జగన్ పర్యటించారని ప్రశంసలు కురిపించారు. రామోజీరావు, రాధాకృష్ణ, ఎల్లో మీడియా మనిషి జన్మ ఎత్తితే దీనిని చూపించాలని సవాల్ విసిరారు. చంద్రబాబుకి మానవత్వం లేదని, రోజూ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని నారాయణ స్వామి విమర్శించారు. చంద్రబాబు, ఎల్లో మీడియాకు కులపిచ్చి తప్ప వేరే ఆలోచన లేదని మండిపడ్డారు. ఎల్లో పత్రికలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో కల్తీ మద్యం ఎక్కడ లేదని స్పష్టం చేశారు. టీడీపీనే కల్తీ పార్టీ అని, ఎన్టీఆర్ పార్టీ తీసుకున్న కల్తీ నాయకుడు చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు. ‘టీడీపీ ఆఫీసు ఓ బార్లా తయారైపోయింది. టీడీపీ నేతలు తాగి మాట్లాడుతున్నట్టు వాగుతున్నారు. కల్తీ నిరూపించమంటే నిరూపించలేకపోతున్నారు. గతంలో మద్యం షాపులన్నీ టీడీపీ నేతలు పెట్టుకున్నవే. ఇప్పుడు ప్రభుత్వం బెల్టు షాపులను పూర్తిగా తొలగించింది. మద్యం వినియోగం గతం కంటే బాగా తగ్గింది’ అని నారాయణ స్వామి తెలిపారు. చదవండి: వాలంటీర్లు బాగా పనిచేశారు.. సీఎం జగన్తో వరద బాధితులు -
అయ్యన్న పాత్రుడి పై తీవ్రస్థాయిలో మండిపడ్డ నారాయణ స్వామి
-
సంక్షేమ పథకాలై విక్రమ్ ను గెలిపిస్తాయి
-
టీడీపీది..నయవంచక మహానాడు: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
-
ప్రజా ప్రతినిధుల ఇళ్లను తగలబెట్టడం హేయమైన చర్య
-
గడపగడపలో వేడుక
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: అడుగడుగునా ఆత్మీయ పలకరింపులు.. ఇంటింటా ఆశీర్వచనాలు.. ఎదురేగి స్వాగతాలు.. అందరి నోటా ప్రశంసల మధ్య పండగ వాతావరణంలో బుధవారం ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ప్రారంభమైంది. మూడేళ్లలో సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా చేసిన మంచిని వివరించి.. ఏవైనా సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరించి.. ప్రజల ఆశీర్వాదం తీసుకోవడానికి ప్రజాప్రతినిధులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం చేసిన విషయం తెలిసిందే. అసని తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో మినహా మిగిలిన నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు నూతనోత్సాహంతో ప్రారంభించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గాల ఇన్చార్జ్లు, అధికారుల బృందానికి ఊరువాడ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గడప గడపకూ వెళ్లిన ప్రజాప్రతినిధులకు.. ప్రతి నెలా ఒకటో తారీఖునే ఠంచనుగా ఉదయమే రూ.2,500 చొప్పున పెన్షన్ ఇచ్చి, మనవడిలా సీఎం వైఎస్ జగన్ ఆదుకుంటున్నారని వృద్ధులు కృతజ్ఞతలు తెలిపారు. సొంత అన్నలా, తమ్ముడిలా సీఎం వైఎస్ జగన్ అమ్మ ఒడి కింద రూ.15 వేలు ఇస్తుండటం వల్ల పిల్లలను బాగా చదివించుకోగలుగుతున్నామని అక్కచెల్లెమ్మలు ప్రజాప్రతినిధులకు వివరించారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆర్థిక సహకారం అందించడం వల్లే ఒక్క రూపాయి కూడా అప్పు చేయకుండా ఉన్నత చదువులు చదివించుకోగలిగామని.. అధిక వేతనంతో కూడిన ఉద్యోగాలు కూడా వస్తున్నాయని సంతోషంతో వివరించారు. ఇంటి స్థలంతోపాటు ఇల్లు కూడా కట్టిస్తూ సొంతింటి కలను నెరవేస్తున్న సీఎం వైఎస్ జగన్ వెంటే నడుస్తామని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమం ప్రారంభమైన రోజునే అన్ని వర్గాల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడంతో.. ‘ప్రజలకు ఇంత మంచి చేశాం అని సగర్వంగా కాలరెగరేసి చెప్పే పరిస్థితిని సీఎం వైఎస్ జగన్ మాకు కల్పించారు’ అని ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. అడుగడుగునా ఆదరణ ఎన్నికల మేనిఫెస్టో, మూడేళ్లలో అమలు చేసిన హామీలు.. ఇంటి యజమానురాలైన అక్కచెల్లెమ్మలకు సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖను ప్రతి ఇంటి వద్దకూ వెళ్లి ప్రజాప్రతినిధులు అందజేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ, ఎక్కడా లేని రీతిలో మూడేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా ఆ ఇంట్లో కుటుంబ సభ్యులకు చేకూర్చిన ప్రయోజనాన్ని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో మూడేళ్లలోనే 95 శాతం అమలు చేశామని గుర్తు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి ముంగిటకే ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఇంటి స్థలాల పంపిణీ మొదలు.. పిల్లలకు ఇంగ్లిష్ మీడియంలో చదువులు చెప్పించే వరకు.. జిల్లాల పునర్ వ్యవస్థీరణ నుంచి పరిపాలన వికేంద్రీకరణ, సమతుల అభివృద్ధి కోసం మూడు రాజధానుల ఏర్పాటు వరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరించారు. వీటన్నింటిపై న్యాయస్థానాల్లో కేసులు వేసి మారీచుల్లా అడ్డుకుంటున్న టీడీపీ.. దుష్ఫ్రచారం చేస్తున్న ఎల్లో మీడియా వ్యవహార శైలినీ ప్రజలకు వివరించారు. మూడేళ్లలో దేవుడి దయ, మీ అందరి చల్లని చూపులతో మంచి చేశామని.. ఇక ముందు కూడా ఇంకా మంచి చేస్తామని, సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. మనందరి ప్రభుత్వానికి ఎప్పుడూ మా మద్దతు ఉంటుందని అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముళ్లు తెగేసి చెప్పారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే చెప్పాలని అడిగి మరీ.. వాటిని అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులకు ప్రజాప్రతినిధులు ఆదేశాలు జారీ చేయడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇంటింటా ఘన స్వాగతం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంటింటికీ తిరిగారు. చిరు జల్లుల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో ప్రజలతో మమేకమయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ప్రజాప్రతినిధులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి, అక్కడికక్కడే పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో చిరుజల్లుల మధ్య కార్యక్రమం కొనసాగింది. ప్రజాప్రతినిధులు ఒకవైపు ప్రజలతో మమేకమవుతూనే, మరోవైపు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పండుగ వాతావరణంలో కొనసాగింది. డ్వాక్రా రుణమాఫీ, సున్నా వడ్డీ పథకం, వైఎస్సార్ చేయూత, రైతు భరోసా, పింఛన్ పథకాల ద్వారా తన కుటుంబానికి రూ.1.50 లక్షకు పైగా లబ్ధి కలిగినట్లు సురేంద్రనగరానికి చెందిన శ్యామల అనే మహిళ చెప్పారు. నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ ఆనందోత్సాహాల మధ్య ఈ కార్యక్రమం కొనసాగింది. మూడేళ్ల పాలన పట్ల ప్రజలందరూ సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. పలు చోట్ల వర్షం పడుతున్నప్పటికీ ప్రజలు ప్రజా ప్రతినిధుల కోసం వేచి చూసి.. ఘనంగా స్వాగతం పలికారు. -
పేదల అభివృద్ధిని చూసి బాబు ఓర్వలేకపోతున్నాడు: నారాయణ స్వామి
సాక్షి, తాడేపల్లి: నిరుపేదల కోసం సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి నవరత్నాలు ప్రవేశపెట్టారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదల అభివృద్ధిని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడని మండిపడ్డారు. సంక్షేమ పధకాలని నిరుపేదల అందించడమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన చేస్తున్నారని అన్నారు. శంకరన్ అనే ఐఎఎస్ కృషితో దేశంలో 20 సూత్రాలు అమలయ్యాయని పేర్కొన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్, వైఎస్సార్లు పేదల సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన చేశారని గుర్తుచేశారు. మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, పీవీ రమేష్ ఆరోపణలని నారాయణ స్వామి తీవ్రంగా ఖండించారు. ఈ ఇద్దరు ఐఎఎస్లు పేదవాళ్లకి ఆగర్బ శత్రువులగా కనపడుతున్నారని తెలిపారు. చంద్రబాబు మాదిరిగా పోలవరం ప్రాజెక్ట్ను ఎలా ఏటిఎంలా ఉపయోగించుకున్నారో చూశామని తెలిపారు. చంద్రబాబుకి పొరపాటున ఓటేస్తే ఈ సంక్షేమ పధకాలని ఆపేస్తామని స్పష్టం చేసినట్లు కనిపిస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు అప్పులు చేసినపుడు ఎల్వీ సుబ్రమణ్యం, పీవీ రమేష్లు ఏం చేశారని నిలదీశారు. చంద్రబాబు ప్రజల కోసం ఏ రోజూ తపన పడలేదని అన్నారు. చంద్రబాబుకు ఎందుకు ఈ ఇద్దరు అధికారులు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఒక్క ప్రాజెక్టునైనా కట్టి చూపించారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో నిర్మాణమైన రోడ్లు వర్షాలకి కొట్టుకుపోవడం లేదా? అని నిలదీశారు. చంద్రబాబు చేసిన అప్పులు దేనికి ఖర్చు చేశారో ఈ ఇద్దరు అధికారులు చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు ఒంటరిగా పోటీ చేయగలరా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. పేదలకోసం సీఎం వైఎస్ జగన్ ఖర్చు చేస్తే వృధా ఖర్చా? చంద్రబాబు ఎలా ఖర్చు చేసినా మాట్లాడరా? అని నారాయణ స్వామి ధ్వజమెత్తారు. -
డిప్యూటీ సీఎంగా నారాయణ స్వామి బాధ్యతలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా నారాయణస్వామి బాధ్యతలు చేపట్టారు. సచివాలయం నాలుగో బ్లాక్లోని ఆయన చాంబర్లో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఎక్సైజ్శాఖలో ఇటీవల మరణించిన ఇద్దరు ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ రీయింబర్స్మెంట్ను విడుదల చేస్తూ మొదటి సంతకం చేశారు. తమది బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వమని... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలతో తామంతా ముందుకెళ్తామన్నారు. చదవండి: ఉంగరం దొంగలు మీరేనా? రాజకీయ నేపథ్యం: 1981లో చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం అన్నూరు సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1981–86 వరకు కార్వేటినగరం సమితి ప్రెసిడెంట్గా పనిచేశారు. 1987లో కార్వేటినగరం మండలాధ్యక్షుడు అయ్యారు. 1989–94 వరకు పీసీసీ సభ్యుడిగా వ్యవహరించారు. 1994, 1999ల్లో సత్యవేడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2004లో సత్యవేడు నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో ఓటమి చెందారు. 2014, 2019 ఎన్నికల్లో గంగాధరనెల్లూరు నుంచి వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 నుంచి 2022 వరకు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు రెండోసారి మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. -
రామరాజ్యంలా సీఎం వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
-
కె నారాయణ స్వామి అనే నేను..