Liquor policy
-
సీఎం కేజ్రీవాల్కు ఊరట దక్కేనా?
ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ను గురువారం(సెప్టెంబర్ 5) సుప్రీం కోర్టు విచారించనుంది. బెయిల్ పిటిషన్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయన్ ధర్మాసనం విచారించనుంది.మద్యం పాలసీ ఈడీ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పొందగా.. సీబీఐ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ పిటీషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. కాగా, ఢిల్లీ లిక్కర్ కేసులో ఇటీవలే మనీష్ సిసోడియా, కవిత సహా పలువురికి బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్ట్. ఇప్పట్లో లిక్కర్ కేసులో ట్రయల్ జరిగే పరిస్థితులు లేకపోవడంతో అత్యున్నత న్యాయ స్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో అరవింద్ కేజ్రీవాల్కు సైతం బెయిల్ వస్తుందని ఆప్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీబీఐ ఏం చెబుతుంది?మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వకూడదని సీబీఐ వాదిస్తుంది. కేజ్రీవాల్ ఆదేశాలతో మద్యం పాలసీ ద్వారా నిధుల్ని సేకరించి..ఆ మొత్తాన్ని గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ ఖర్చు పెట్టినట్లు చెబుతుంది. గోవాలో 40 నియోజకవర్గాలు ఉన్నాయని, ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో అభ్యర్థికి రూ.90 లక్షలు ఇస్తానని ఆయన హామీ ఇచ్చారని..చెప్పినట్లుగానే నిధుల్ని మళ్లించారని కోర్టుకు సీబీఐ ఆధారాల్ని అందించింది.తొలిసారి కేజీవాల్ అరెస్ట్ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తొలి సారి మార్చి 21న అరెస్ట్ చేసింది. అనంతరం కొద్దిరోజులకే కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ కోసం అప్లయి చేయగా.. ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. అదే కేసులో జూన్ 26న ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టులో సీబీఐ అతడిని అదుపులోకి తీసుకుని జూన్ 29న జ్యుడీషియల్ కస్టడీలో ఉంచింది. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం మే 10న ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నిబంధనల ప్రకారం.. జూన్ 2న తీహార్ జైల్లో లొంగిపోయారు. -
కవిత బెయిల్ పిటిషన్పై రేపు సుప్రీం కోర్టులో విచారణ
ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్ మంగళవారం (ఆగస్ట్20న) సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. జస్టీస్ బీఆర్ గవాయి, జస్టీస్ విశ్వనాథ్ ధర్మాసనం బెయిల్ పిటిషన్పై విచారించనుంది.ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిలు ఇవ్వాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. జూలై 1న న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దాన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 12న పిటిషన్పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కవిత తరుఫు న్యాయవాది ముకుల్ రోహత్గి మధ్యంతర బెయిల్ కోరారు. ‘అయిదు నెలల నుంచి కవిత జైల్లో ఉన్నారు. ఇప్పటికే చార్జిషీట్లు దాఖలు చేశారు. ఈ కేసులో 493 మంది సాక్షులు ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే మనీశ్ సిసోడియా, కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చారు. కవిత ఒక మహిళ.. మధ్యంతర బెయిల్ ఇవ్వండి’ అని కోరారు.కవిత తరపున వాదనలు విన్న అనంతరం.. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని తెలిపింది. ప్రతివాదులుగా ఉన్న దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్ట్ 20కి వాయిదా వేసింది. దీంతో రేపు కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. -
గత ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు తగ్గాయి: మంత్రి పార్థసారథి
సాక్షి, అమరావతి: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీని తీసుకురానున్నట్టు మంత్రి పార్థసారథి చెప్పుకొచ్చారు.కేబినెట్ భేటీ అనంతరం, మంత్రి పార్థసారథి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు తగ్గాయి. బీర్, లిక్కర్ అమ్మకాలు తగ్గిపోవడంతో 18వేల కోట్ల నష్టం వచ్చింది. ఈ ప్రభుత్వంలో మెరుగైన బ్రాండ్లు అందుబాటులోకి తెస్తాం. అందరికీ అందుబాటులో ఉన్న ధరలకు మద్యం తీసుకొస్తామన్నారు.అలాగే, భూములపై రెవెన్యూ గ్రామ సభలను మూడు నెలల పాటు నిర్వహిస్తాం. అందులో భాగంగానే మూడు నెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని నిర్ణయించినట్టు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పాటు పొడగిస్తున్నట్టు తెలిపారు. అలాగే, పశుసంవర్ధకశాఖ, మత్స్యశాఖలు విడుదల చేసిన 217, 144 జీవోలు రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. -
సీఎం కేజ్రీవాల్ పిటిషన్పై విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్ : తీహార్ జైల్లో ఉన్న తనకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరో రెండు అదనపు సమావేశాలకు అనుమతి ఇవ్వాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై ఇవ్వాళ ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది.ఈ సందర్బంగా కేజ్రివాల్ పిటిషన్ జైలు అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పందించాలని జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ధర్మాసనం కోరింది. కేజ్రీవాల్ పిటిషన్పై తదుపరి విచారణ జూలై 15 కు వాయిదా వేస్తూ తీర్పును వెలువరించింది. -
ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్కు దక్కని ఊరట
ఢిల్లీ : ఢిల్లీ మద్యం పాలసీ మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఊరట దక్కలేదు. కేజ్రీవాల్కు బెయిల్ ఇస్తూ రౌస్ అవెన్యూ కోర్టు (ట్రయిల్ కోర్టు) తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుపై ఈడీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ పిటిషన్పై మంగళవారం హైకోర్టు జస్టిస్ సుధీర్ కుమార్ జైన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ట్రయిల్ కోర్టు బెయిల్ ఇస్తూ తీర్పును వెలువరించగా.. ఆ తీర్పుపై స్టే విధించింది. ఈ సందర్భంగా సుదీర్ కుమార్ జైన్ ధర్మాసనం ..ట్రయిల్ కోర్టు ఇచ్చిన తీర్పులో లోపాల్ని ఎత్తి చూపింది. ఈడీ వాదనకు తగినంత సమయం ఇవ్వకపోవడం, మనీలాండరింగ్ నిరోధక చట్టంలో విడుదలకు సంబంధించిన షరతులను సరిగ్గా చర్చించడంలో విఫలమవడంతో పాటు ఇతర అంశాలు ఉన్నాయని స్పష్టం చేస్తూ కేజ్రీవాల్ బెయిల్పై స్టే విధించింది. దీంతో కేజ్రీవాల్కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలినట్లైందిDelhi HC allows Enforcement Directorate's plea to stay the trial court's bail order for Delhi Chief Minister Arvind Kejriwal in the money laundering case linked to the alleged money laundering excise scam.The bench of Justice Sudhir Kumar Jain stays the Arvind Kejriwal bail… pic.twitter.com/A4XL3FKdm1— ANI (@ANI) June 25, 2024కేజ్రీవాల్కు బెయిల్.. అంతలోనే అంతుకు ముందు తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ జూన్ 20న రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు కేజ్రీవాల్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్లో అరవింద్ కేజ్రీవాల్ ప్రమేయం నేరుగా ఉందని తెలిపేలా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టు ఆధారాల్ని అందించడంలో విఫలం కావడంతో రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసింది. సుప్రీం కోర్టులో రేపే విచారణ అయితే ట్రయిల్ కోర్టు తీర్పును ఈడీ సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ట్రయిల్ కోర్టు ఇచ్చిన తీర్పు హేతుబద్దంగా లేదని ఈడీ తరుపు న్యాయవాది అడిషినల్ సోలిసిటర్ జర్నల్ (ఏఎస్జీ) ఎస్వీ రాజు వాదించారు. ట్రయల్ కోర్టు తమ వాదనల్ని వినిపించేందుకు తగినంత సమయం ఇవ్వలేదని, వెంటనే ఆ ఉత్తర్వులపై స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే విచారణ చేపట్టాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ పిటిషన్పై బుధవారం విచారణ చేపట్టింది. ట్రయిల్ కోర్టు ఢిల్లీ సీఎంకు బెయిల్ ఇస్తూ తీర్పును వెలువరించిన విధానాన్ని తప్పుబట్టింది. కాగా, ట్రయిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించంపై కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్పై రేపు (జూన్ 26న) సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. -
కేజ్రీవాల్ కోర్టు వీడియో తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం
ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్.. కోర్టులో మాట్లాడిన వీడియోను సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి వెంటనే తొలగించాలని సునీతా కేజ్రీవాల్ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ను కోర్టులో ప్రవేశపెట్టినప్పడు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్.. కోర్టు ప్రొసిడింగ్స్ జరిగిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయంలో న్యాయవాది వైభవ్ సింగ్ వేసిన పిల్పై శనివారం ఢిల్లీ హైకోర్టు స్పందించింది. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో రికార్డింగ్.. కోర్టు ప్రొసిడింగ్స్ను ఉల్లంఘించనట్లు అవుతుందని కోర్టు పేర్కొంది. సునితా కేజ్రీవాల్ సంబంధిత వీడియోను డిలీట్ చేయాలని, అదే విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సైతం రీపోస్ట్ అయిన ఆ వీడియోను వెంటనే తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సునితా కేజ్రీవాల్తో పాటు వీడియో పోస్ట్ చేసిన మరో ఐదుగురికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ పిల్పై జూలై 9న విచారణ చేపడతామని ఢిల్లీ హైకోర్టు తెలిపింది.అరవింద్ కేజ్రీవాల్ను మార్చి 28 ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రవేశపెట్టారు. వీడియో కాన్ఫరెన్స్ను రికార్డ్ చేసిన సునితా కేజ్రీవాల్ ఆ వీడియోను సోషల్మీడియాలో పోస్ట్చేశారు. అయితే ఇలా చేయటం కోర్టు ప్రొసిడింగ్స్ను ఉల్లంగిండమవుతుందని ఢిల్లీ హైకోర్టు తప్పు పట్టింది. -
సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వానికి షాక్.. మంత్రి రాజీనామా
ఢిల్లీ, సాక్షి : మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్కు భారీ షాక్ తగిలింది. బుధవారం ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆప్ నుంచి బయటకు వెళ్తూ ఆ పార్టీపై, సీఎం కేజ్రీవాల్పై విమర్శలు గుప్పించారు. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా స్థాపించిన ఆమ్ ఆద్మీ ‘అవినీతిలో పాలుపంచుకున్న’ పార్టీగా పతనమైందని అన్నారు. ‘అవినీతిపై పోరాటంలో బలమైన సందేశాన్ని చూసిన తర్వాత నేను ఆప్లో చేరాను. నేడు, పార్టీ అవినీతి కార్యకలాపాల మధ్యలో కూరుకుపోయింది. అందుకే నేను వైదొలగాలని నిర్ణయించుకున్నాను’ అని గిరిజన శాఖ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ తెలిపారు. మద్యం పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలో జైలు శిక్షను అనుభవిస్తున్నారు. తాజాగా, ఆ పార్టీకి రాజ్కుమార్ ఆనంద్ రాజీనామాతో రానున్న రోజుల్లో ఆ పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. -
సీఎం కేజ్రీవాల్ ఇలా చేస్తారనుకోలేదు.. ‘సుప్రీం’ మాజీ న్యాయమూర్తి
సాక్షి, బెంగళూరు: ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టైన ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీరుపట్ల సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, మాజీ సొలిసిటర్ జనరల్ ఎన్ . సంతోష్ హెగ్డే అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2011లో ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే అవినీతి ( India Against Corruption) కి వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. అన్నా హజారే నేతృత్వంలో జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిలో కేజ్రీవాల్తో పాటు ఎన్.సంతోష్ హెగ్డేలు ఉన్నారు. అయితే నాడు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన కేజ్రీవాల్ నేడు లిక్కర్ కేసులో అరెస్ట్ కావడంపై హెగ్డే స్పందించారు. కేజ్రీవాల్ తీరుపై తీవ్ర నిరాశ చెందాను. ఆప్ (అధికారంలోకి వచ్చిన తర్వాత) అవినీతి లేని పరిపాలన కొనసాగిస్తుందని అనుకున్నాను. కానీ అది జరగలేదు.అధికారంతో భ్రష్టుపట్టించారని పీటీఐతో మాట్లాడారు. ఉద్యమం నుంచి బయటకు రావడానికి కారణం ‘‘ ఈరోజు రాజకీయాలు అవినీతి గుహగా మారాయి. ఏ రాజకీయ పార్టీ కూడా దాని నుండి విముక్తి పొందలేదు. అవినీతికి వ్యతిరేకంగా చేసే ఇండియా ఎగెనెస్ట్ కరప్షన్ ఉద్యమం నుంచి బయటకు రావడానికి కారణం కూడా అదే. రాజకీయాలకు దూరంగా ఉంటూ రాజకీయాలను ప్రక్షాళన చేయాలన్నదే మా సూత్రం. ఉద్యమం కాస్త రాజకీయ పార్టీగా కానీ ఆ తర్వాత కొంతమంది వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఆప్ను స్థాపించారు. అప్పుడే నేను ఉద్యమం నుంచి బయటకు వచ్చాను. పార్టీ పెట్టి అవినీతి నిర్మూల చేస్తానని అనుకోలేదు. అది జరగదు కూడా. అందుకు కేజ్రీవాల్ అరెస్టే ఉదాహరణ’’ అన్నారు. ఉద్యమం కొనసాగుతుండగానే ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపన జరిగింది. అందులో చేరాలంటూ కేజ్రీవాల్ తనని స్వయంగా ఇంటికి వచ్చి ఆహ్వానిస్తే అందుకు నేను ఒప్పుకోలేదని నాటి పరిస్థితుల్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విపక్షాల విమర్శల్లో అర్ధం లేదు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తుందని, వారిపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందన్న విపక్షాలు ఆరోపణలపై హెగ్డే తన అభిప్రాయాలను పంచుకున్నారు . ప్రతిపక్షాన్ని నాశనం చేయడం కోసమే అధికార పార్టీ ఇలా చేస్తోందంటూ ప్రతిపక్షాల ఆరోపణల్ని నేను నమ్మను. అవును.. ఎంపిక చేసి నేతల్ని దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేస్తున్నాయి. కానీ అది నేరం కాదు. ఎందుకంటే న్యాయ శాస్త్రంలో కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని సీబీఐ,ఈడీలు ఇలా చేస్తున్నాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, మాజీ సొలిసిటర్ జనరల్ ఎన్ . సంతోష్ హెగ్డే మద్దతు పలికారు. -
సీఎం కేజ్రీవాల్ అరెస్ట్.. ఢిల్లీలో టెన్షన్ టెన్షన్
-
ED: కవిత అరెస్ట్పై ఈడీ కీలక ప్రెస్నోట్ విడుదల
ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుపై ఎన్ఫోర్స్మెంట్ డైరేక్టరేట్ (ఈడీ) కీలక విషయాలు వెల్లడించింది. ఈ మేరకు ఈడీ సోమవారం కవిత అరెస్ట్పై అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈ నెల15న కవితను అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చిందని పేర్కొంది. ఈ నెల 23 తేదీ వరకు కవిత కస్టడికి తీసుకున్నట్లు ప్రకటనలో తెలిపింది. ‘ఢిల్లీ లిక్కర్ కేసులో 128.79 కోట్ల రూపాయల ఆస్తుల జప్తు చేశాం. ఆస్తుల జప్తును అడ్జుడికేటింగ్ అథారిటీ ఆమోదించింది. మద్యం విధానం రూపకల్పనలో కవిత ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేతలు సీఎం అరవింద్ కేజ్రీవాల్,మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో కలిసి కుట్ర చేశారు. ఈ వ్యవహారంలో ఆప్ పార్టీ నేతలకు 100 కోట్ల రూపాయలు ముడుపులు అప్పజెప్పడంలో కవిత క్రియాశీల పాత్ర పోషించారు. ఈ మొత్తాన్ని హోల్సేల్ వ్యాపారుల నుంచి ఇప్పించారు. తిరిగి ఆ డబ్బును లాభాలను రాబట్టుకునేందుకు మరిన్ని కుట్రలు పన్నారు. ఈ కేసులో మనిష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ సహా ఇప్పటివరకు 15 మందిని అరెస్టు చేశాం. 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాం. ఒక ప్రాసిక్యూషన్ కంప్లైంట్ ఐదు సప్లిమెంటరీ కంప్లైంట్స్ ఫైల్ చేశాం. కవిత ఏడు రోజుల ఈడి కస్టడీలో ఉంది. ఆమెను అరెస్టు చేసే సమయంలో బంధువులు మాకు ఆటంకం కలిగించారు. నిలకడగా కవిత ఆరోగ్యం: వైద్యులు ఈడీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవితకు డాక్టర్లు వైద్యపరీక్షలు చేశారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కవిత బీపీ సాధారణంగా ఉందన్న పేర్కొన్నారు. 24 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్కు బెయిల్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీ సీఎం 'అరవింద్ కేజ్రీవాల్'కు రూ.15,000 బెయిల్ బాండ్, రూ.లక్ష పూచీకత్తుపై ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. ఈడీ ఎనిమిది సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ విచారణకు హాజరు కాకపోవడంతో.. దర్యాప్తు సంస్థ ఢిల్లీ కోర్టు మెట్లెక్కింది. కోర్టుకు హాజరైన సీఎం అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. న్యాయస్థానం తనకు బెయిల్ మంజూరు చేసిన తరువాత న్యాయమూర్తి అనుమతితో కోర్టు నుంచి కేజ్రీవాల్ వెళ్లిపోయారు. ఢిల్లీ ఇప్పుడు రద్దు చేసిన ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆప్ అగ్రనేతలు.. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్లను ఈడీ అరెస్టు చేసింది. ఈడీ చార్జ్ షీట్లలో కేజ్రీవాల్ పేరు పలుమార్లు చోటు చేసుకుంది. ఎక్సైజ్ పాలసీ ముసాయిదా రూపకల్పన సమయంలో ఈ కేసులో నిందితులు ముఖ్యమంత్రితో టచ్లో ఉన్నారని ఏజెన్సీ తెలిపింది. -
ఢిల్లీ లిక్కర్ విధానం కేసు ఏంటి?
సాక్షి, న్యూఢిల్లీ: ఇంతకుముందు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఇప్పుడు కల్వకుంట్ల కవిత వంటి ప్రముఖుల అరెస్టులతో ఢిల్లీ లిక్కర్ విధానం కేసు కలకలం రేపుతోంది. అసలు ఈ కేసు ఏమిటన్నది అంతటా చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో మద్యం అమ్మకాలకు సంబంధించి అక్కడి ఆప్ ప్రభుత్వం 2021లో నూతన లిక్కర్ పాలసీని అమల్లోకి తెచ్చింది. సాధారణంగా ప్రభుత్వం టెండర్లు పిలిచి ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగిస్తుంది. ఇందుకోసం లైసెన్స్ ఫీజును, మద్యం అమ్మకాలపై పన్నులను వసూలు చేస్తుంది. అయితే ఢిల్లీ ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీలో.. మద్యం షాపుల లైసెన్సుల జారీ, పన్నుల్లో అపరిమిత రాయితీలు ఇచ్చింది. ఉదాహరణకు పాత విధానంలో ఒక 750 మిల్లీలీటర్ల మద్యం బాటిల్ హోల్సేల్ ధర రూ.166.71 అయితే.. కొత్త విధానంలో రూ.188.41కి పెంచారు. కానీ దానిపై ఎక్సైజ్ సుంకాన్ని రూ.223.89 నుంచి నామమాత్రంగా రూ.1.88కు, వ్యాట్ను రూ.106 నుంచి రూ.1.90కు తగ్గించారు. ఇదే సమయంలో షాపుల నిర్వాహకులకు ఇచ్చే మార్జిన్ (లాభం)ను రూ.33.35 నుంచి ఏకంగా రూ.363.27కు పెంచారు. బయటికి మద్యం ధరలు పెరిగినా.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం తగ్గి, షాపుల నిర్వాహకులకు అతి భారీ లాభం వచ్చేలా పాలసీ రూపొందింది. దీనికితోడు మద్యం హోం డెలివరీ, తెల్లవారుజామున 3 గంటల దాకా షాపులు తెరిచిపెట్టుకునే వెసులుబాటునూ ప్రభుత్వం కల్పించింది. ఈ పాలసీ కింద 849 మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులు/ కంపెనీలకు అప్పగించింది. ఇక్కడే ఆప్ ప్రభుత్వ పెద్దలు తమ సన్నిహితులకు భారీగా లాభం జరిగేలా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మద్యం పాలసీలో భారీగా అవకతవకలను గుర్తించిన ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం కేంద్రానికి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు ఫిర్యాదు చేసింది. దీనితో ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి. రూపకల్పన నుంచే అక్రమాలంటూ.. ఢిల్లీలో మద్యం పాలసీ రూపకల్పన సమయం నుంచే అక్రమాలు చోటు చేసుకున్నాయని ఈడీ, సీబీఐ తమ దర్యాప్తులో గుర్తించాయి. కొందరిని అరెస్టు చేసి విచారణ జరిపాయి. ఈ క్రమంలో పలువురు మద్యం దుకాణాలు తమకు వచ్చేలా చేసుకోవడం, భారీగా లాభాలు వచ్చేలా పాలసీని ప్రభావితం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని.. ఆప్ నేతలకు రూ.వందల కోట్లు ముడుపులు ఇచ్చారని వెల్లడైందని ఈడీ కోర్టులో దాఖలు చేసిన చార్జిషిట్లో పేర్కొంది. ఈ వ్యవహారంలో సౌత్ గ్రూపు పేరిట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు మరికొందరు భాగస్వాములు అయ్యారని ఆరోపించింది. వారి మధ్య పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగాయని, ఈ క్రమంలో మనీలాండరింగ్కు పాల్పడ్డారని పేర్కొంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు కవితను ప్రశ్నించిన ఈడీ.. తాజాగా అరెస్టు చేసింది. -
‘సీఎం కేజ్రీవాల్ ఈడీ నుంచి తప్పించుకోలేరు’
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానంలో అవకతవకలకు సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జారీ చేసిన సమన్ల నుంచి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తప్పించుకోలేరని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా మండిపడ్డారు. అయితే ఈడీ ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్కు వరుసగా మూడుసార్లు సమన్లు జారీ చేసిన విసయం తెలిసిందే. కాగా.. మూడోసారి జారీ చేసిన మమన్ల ప్రకారం కేజ్రీవాల్ 2024 జనవరి 3వ తేదీ ఈడీ ముందు హాజరుకావల్సి ఉంది. అరవింద్ కేజజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే ఈడీ ముందుకు రావటంలేదని వీరేంద్ర సచ్దేవా మండిపడ్డారు. ముడోసారి జారీ చేసిన సమన్ల నుంచి మాత్రం కేజ్రీవాల్ ఎట్టిపరిస్థితుల్లో తప్పించుకోలేరని అన్నారు. VIDEO | "Initially, he used the excuse of elections and then Vipassana, and now let's see what explanation he gives on January 3. He can't evade this for long, he has to appear before the agency," says BJP leader @Virend_Sachdeva on ED's summon to CM Arvind Kejriwal. pic.twitter.com/GObqIb6fL7 — Press Trust of India (@PTI_News) December 30, 2023 మొదటిసారి ఎన్నికలు, రెండోసారి విపాశన ధ్యానం పేరుతో కేజ్రీవాల్ దూరంగా ఉన్నారని దుయ్యబట్టారు. జనవరి 3న హాజరుకావాలన్న ఈడీ సమన్లపై ఎలాంటి వివరణ ఇస్తారో చూస్తామని తెలిపారు. అయితే సుదీర్ఘం కాలం మాత్రం ఈడీ సమన్ల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని అన్నారు. కచ్చితంగా కేజ్రీవాల్ ఈడీ ముందుకు హాజరు కావాల్సిందేనని తెలిపారు. ఇక సీఎం కేజ్రీవాల్కు ఈడీ మొదటిసారి నవంబర్ 2న, రెండోసారి డిసెంబర్18న, మూడోసారి డిసెంబర్ 21న సమన్లను జారీ చేసిన విషయం తెలిసిందే. రెండు సార్లు ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన సీఎం కేజ్రీవాల్ జనవరి 3న ఈడీ ముందుకు హాజరవుతారో? లేదో? అని పార్టీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. చదవండి: ‘రాముడు హిందువులకే దేవుడు కాదు.. అందరివాడు’ -
విచారణకు కేజ్రీ డుమ్మా!
న్యూఢిల్లీ: ఢిల్లీలో మద్యం విధానంలో అవకతవకల కేసులో గురువారం విచారణకు రావాలన్న ఈడీ సమన్లను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి బేఖాతరు చేసినట్టు సమాచారం. బుధవారమే ఆయన పంజాబ్లోని హోషియార్పూర్లో విపాసన ధ్యానం కోర్సులో చేరేందుకు వెళ్లినట్లు వార్తలొచ్చాయి. ‘‘ఆయన ఏటా చలికాలంలో విపాసనకు వెళ్తారని అందరికీ తెలుసు. అయినా ఈడీ కావాలనే ఇప్పుడు సమన్లు ఇచ్చింది’’ అని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. దీనిపై ఈడీ తదుపరి చర్యలేమిటనేది తెలియాల్సి ఉంది. నవంబర్ 2న కేజ్రీవాల్ను ఈడీ విచారణకు పిలవగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉందంటూ హాజరు కాలేదు. -
మందుబాబులకు తెలంగాణ సర్కార్ షాక్?
సాక్షి, హైదరాబాద్: మందు బాబులకు షాక్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోందా?. గత ప్రభుత్వాల నిర్ణయాలపై వరుస సమీక్షలతో గడుపుతున్న సీఎం రేవంత్రెడ్డి ఈ దిశగా అధికార యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఈ క్రమంలో.. తెలంగాణ వ్యాప్తంగా బెల్ట్ షాపుల మూసివేతకు తెలంగాణ సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే.. వైన్ షాపుల లిక్కర్ సేలింగ్ సమయాన్ని సైతం కుదించే దిశగా సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా 2,620 బెల్ట్ షాపులు ఉన్నాయి. మరోవైపు మద్యం రేట్ల విషయంలోనూ విధివిధానాల రూపకల్పన కోసం.. ఒక పాలసీ ఏర్పాటు యోచనలోనూ రేవంత్ సర్కార్ ఉన్నట్లు సమాచారం. మరో రెండు, మూడు రోజుల్లో ఈ అంశంపై ఒక స్పష్టమైన ప్రకటన వెలువడొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికప్పుడు అది అమలు కాకపోవచ్చనే అభిప్రాయమూ వ్యక్తం చేస్తున్నారు కొందరు అధికారులు. -
మొదలైన కొత్త మద్యం పాలసీ.. అప్పుడే 171 కోట్ల ఆదాయం!
మహబూబ్నగర్ క్రైం: రెండేళ్ల పాటు కొనసాగిన మద్యం పాలసీ గురువారంతో ముగిసింది. శుక్రవారం నుంచి కొత్త మద్యం పాలసీ విధానం అమల్లోకి రానుంది. పాత మద్యం దుకాణాలు నిర్వహించే వ్యాపారులకు 75శాతం రాకపోవడంతో ఇకపై ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారు. కొత్తగా దుకాణాలను సొంతం చేసుకున్న వారితో కొందరు వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్నారు. మరికొందరు తమ అనుచరులు, పనిచేసే వ్యక్తులతో టెండర్లు వేయించి దుకాణాలు దక్కేలా వేసిన ఎత్తుగడలు ఫలించాయి. మద్యం దుకాణాల్లో మళ్లీ లిక్కర్ కింగ్లదే పైచేయిగా మారింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆగస్టు 21న నిర్వహించిన టెండర్లలో మొత్తం 8,595 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.171.90కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి మద్యం దుకాణాలకు టెండర్లు రావడం ఆశ్చర్యం కల్గిస్తోంది. రోజురోజుకూ మద్యం వ్యాపారంపై చాలా మంది దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈసారి ఉమ్మడి జిల్లా వ్యాపారులతో పాటు ఆంధ్ర, కర్ణాటక నుంచి కూడా టెండర్లు దాఖలయ్యాయి. 2021 కంటే ఈసారి దరఖాస్తులు రెండింతలు పెరిగాయి. ప్రధానంగా మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాలో దరఖాస్తులు రెట్టింపయ్యాయి. బిజీబిజీ.. ఉమ్మడి జిల్లాలో కొత్త మద్యం దుకాణాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో గురువారం నుంచి హడావుడి మొదలైంది. 230 దుకాణాల్లో కొన్నింటిని అదే దుకాణాల్లో ఏర్పాటు చేసుకుంటుంటే.. మరికొన్ని దుకాణాలు కొత్తగా నిర్మాణం చేసుకుంటున్నారు. శుక్రవారం ఉదయం 10గంటల వరకు అన్నింటిని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వ్యాపారులు ఆయా దుకాణాల నిర్మాణ పనులు చేస్తూ బీజీబీజీగా కన్పించారు. లాభాలు ఉండటంతో.. మద్యం విక్రయాల వల్ల భారీగా లాభాలు ఉండటంతో మద్యం వ్యాపారులతో పాటు రాజకీయ నేతలు కూడా రంగప్రవేశం చేశారు. దుకాణం ఎవరి పేరుతో వచ్చినా అంతా కలిసే వ్యాపారం చేసుకోవాలని ముందుగానే ఒప్పందం చేసుకున్నారు. ఒక్కో దుకాణానికి ఒక్కొక్కరు 10మందికిపైగా బినామీ పేర్లతో దరఖాస్తు చేసుకున్నారు. వాళ్లలో ఏ ఒక్కరికి వచ్చినా అందరికీ లబ్ధి చేకూరేలా చేసుకున్నారు. మద్యం దుకాణాదారులే గ్రామాలు, వార్డుల్లో బెల్టు దుకాణాలకు మద్యం సరఫరా చేస్తుంటారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో రూ.4వేల కోట్ల వ్యాపారం సాగుతుండగా.. రానున్న రోజుల్లో విక్రయాలు మరింత పెరుగుతాయనే విశ్వాసంతో వ్యాపారులు ఉన్నారు. -
కేజ్రీవాల్కు ఏదో జరగబోతోంది
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఇరుకున పెట్టేందుకు పెద్ద కుట్ర జరగబోతోందని ఆప్ నేత సంజయ్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. మనీ ల్యాండరింగ్ కేసులో శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరైన అనంతరం కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడారు. ‘కేజ్రీవాల్ను ఇరికించేందుకు కుట్ర జరుగుతోంది. ఆయన్ను అరెస్ట్ చేయడం మాత్రమే కాదు. అంతకంటే మించి ఏదో చేయడమే ఆ కుట్ర’ అని అన్నారు. మద్యం విధానం కేసులో మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై విచారణకు రావాలంటూ ఈడీ పంపిన సమన్లకు కేజ్రీవాల్ స్పందించని విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించింది. -
AP: పురందేశ్వరికి ముందే తెలిసిపోయిందా?
ఈ మధ్య బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఏపీ ప్రభుత్వంపై మద్యం కుంభకోణం అంటూ ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఏమిటి.. ఈ మహిళా నేతకు మద్యం గోలేమిటి అనే సందేహం వచ్చింది. ఆమె వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పక్ష నేత విజయసాయిరెడ్డి, లోక్ సభ లో పార్టీ నేత మిధున్ రెడ్డిలపై కూడా కొన్ని విమర్శలు చేశారు. దానికి విజయసాయి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆమెకు సంబంధించిన పలు విషయాలు బహిర్గతం చేయవలసి వస్తుందని హెచ్చరించారు. అవేమిటో తెలియదు. ఇప్పుడు అసలు విషయం వెల్లడైంది. ఆమె ఎందుకు మద్యం కుంభకోణం అంటూ గగ్గోలు పెట్టారో అర్ధం అయింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మద్యం స్కామ్ కేసు రాబోతోందని ఆమెకు, చంద్రబాబు కుటుంబానికి, టీడీపీ ముఖ్యనేతలు కొందరికి సమాచారం ఉండి ఉండాలి. స్కిల్ స్కామ్ కేసులో అరెస్టు అయి జైలులో ఉన్న చంద్రబాబు నాయుడుకు స్వయానా ఆమె వదిన కావడంతో ఆ బంధుత్వాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ నేతలు ఆమె ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయించి ఉండాలి. ఎందుకంటే టీడీపీ నేతలు ఏ విమర్శలు చేసినా జనం పట్టించుకునే పరిస్థితి ఉండడం లేదు. అన్నీ అబద్దాలు ఆడుతున్నారనే భావన జనంలోకి వెళుతోంది. ఆమె ఒకటికి రెండుసార్లు మద్యం కుంభకోణం అనడం, కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేయడం.. ఇదంతా రాజకీయంలే అనుకున్నవారికి అసలు విషయం అర్ధం అయింది. ✍️చంద్రబాబుపై ఏపీ సీఐడీ మద్యం స్కామ్ కేసును నమోదు చేసింది. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.1,300 కోట్ల మేర నష్టం చేశారన్నది అభియోగం. ఈ విషయాలు జనంలోకి వెళ్లడానికి ముందుగానే ఎదురు దాడి చేయాలని పురందేశ్వరి బృందం అనుకుని అలా ప్రభుత్వంపై విమర్శలు చేశారని తేలుతోంది. ఇక ఈ కేసు విషయానికి వస్తే, నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డితో పాటు టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు,యనమల రామకృష్ణుడి బంధువులకు మద్యం కంపెనీల ఏర్పాటులో ప్రత్యేక రాయితీలు ఇచ్చారన్న ఆరోపణలను దర్యాప్తు సంస్థ మోపింది. రాష్ట్ర ప్రభుత్వ కమిటీ వాట్ తో పాటు ఆరుశాతంగా ఉన్న ప్రివిలేజ్ ఫీజ్ ను పది శాతం చేయాలని సూచిస్తే, ఈ కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసిందని సీఐడీ దర్యాప్తులో తేలింది. ఇదంతా క్విడ్ ప్రోకో ప్రకారం జరిగిందని అనుమానిస్తున్నారు. ఇవే విషయాలను ఏసీబీ కోర్టుకు సీఐడీ అధికారులు తెలియచేశారు. ఈ కేసులో ఏ పరిణామాలు సంభవిస్తాయో తెలియదు కాని, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో రూ. 338 కోట్ల మొత్తం చేతులు మారిందని ఆరోపణ వస్తేనే ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు గత ఆరునెలలుగా బెయిల్ రాలేదు. విచారణ పూర్తి కానందున ఇప్పటికీ బెయిల్ ఇవ్వడానికి వీలు లేదని సుప్రింకోర్టు స్పష్టం చేసింది. అదే సూత్రం చంద్రబాబు కేసులో కూడా వర్తిస్తే, ఆయనకు బెయిల్ రావడం కష్టమే కావచ్చన్నది ఒక అభిప్రాయంగా ఉంది. అందుకే కేసు మెరిట్స్ లోకి వెళ్లకుండా ఆయన న్యాయవాదులు 17-ఏ అనో, అనారోగ్యం అనో కారణాలు చూపుతూ మధ్యంతర బెయిల్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ లు వేశారు. ✍️చంద్రబాబు టైమ్ లో జరిగిన మద్యం స్కామ్ పై పురందేశ్వరి స్పందిస్తారో లేదో తెలియదు. టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్ మాత్రం తీవ్రంగా స్పందించారు. జగన్ ప్రభుత్వం కల్తీ మద్యం అమ్ముతోందని, ఆయనపై 35 లక్షల కేసులు పెట్టాలని చిత్రమైన విమర్శ చేశారు. మద్యం తాగి అనారోగ్యంపాలై 35 వేల మంది మణించారని కూడా ఆరోపించారు. దీనిపై చర్చకు సిద్దమా?అని ఆయన ప్రశ్నించారు. ఎవరి హయాంలో మద్యం దందా జరిగిందో తేల్చుకుందామని ఆయన అన్నారు. ✍️ఇలా అర్ధం ,పర్దం లేని అబద్దాల వల్లే చంద్రబాబు, లోకేష్ ల ప్రకటనలకు విలువ లేకుండా పోతోంది. చంద్రబాబుపై సీఐడీ పెట్టిన కేసు ఏమిటి? లోకేష్ చేస్తున్న ఆరోపణ ఏమిటి?. ముందుగా చంద్రబాబు పై వచ్చిన అభియోగాలు ఏ రకంగా వాస్తవం కాదో ప్రజలకు వివరించాలి కదా!. ఆ తర్వాత ఏ ఆరోపణ అయినా చేయవచ్చు. అది వేరే సంగతి. కాగ్ సైతం చంద్రబాబు టైమ్ లో మద్యం వ్యాపారంలో ఖజానాకు నష్టం కలిగిందని పేర్కొందా?లేదా?. 2014 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన ఎన్నికైన నంద్యాల నుంచి ఎన్నికైన ఎస్పివై రెడ్డికి.. ఢిల్లీ ఏపీ భవన్ లోనే పచ్చ కండువా కప్పి టిడిపిలోకి తీసుకున్నది అవాస్తవమా? ఆయనకు అప్పుడు ఇచ్చిన ఆఫర్ ఏమిటో జనానికి తెలియదా?. ఆ విషయం ఆ రోజుల్లో ఎస్పివై రెడ్డే అంతరంగికంగా చెబుతుండేవారని అంటారు. అప్పుడే ఆయన డిస్టిలరీని స్థాపించారు. దానికి చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడ ఇబ్బంది పెడుతుందో అని ఆయన పార్టీ మారినట్లు చెప్పేవారు. ఆ తర్వాత చంద్రబాబు ఇచ్చిన ఆఫర్ కూడా బాగానే కుదిరింది. ✍️నిజానికి ఆయన ఒక్కరికే కాదు. మరో ఇద్దరు వైఎస్సార్సీపీ ఎంపీలను కూడా టిడిపిలోకి లాగారు. ఇరవై మూడు మంది వైసిపి ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేశారని బహిరంగంగానే చెప్పుకునేవారు. కర్నూలు జిల్లా కొడుమూరుకు అప్పట్లో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఒక నేత తనకు ఎంత ఆఫర్ వచ్చింది ఓపెన్ గానే చెప్పడం కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాను అప్పుల్లో ఉన్నానని, వాటన్నింటిని టీడీపీ అధినాయకత్వం తీర్చి వేయడానికి ఒప్పుకుందని, అందుకే పార్టీ మారానని తన సన్నిహితులు పలువురికి చెప్పేవారు. మరో ఎమ్మెల్యేకి బెంగుళూరులో డబ్బు ఏర్పాటు జరిగిందని కూడా వార్తలు వచ్చాయి. వీటిలో కొన్నిటింకి టీడీపీ మద్దతు ఇచ్చే ఒక పత్రికాధిపతి కూడా మద్యవర్తిగా కూడా ఉన్నారని ప్రచారం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం జరగలేదని టీడీపీ నేతలు డబాయించవచ్చు. స్కిల్ కేసులో మాదిరి అసలు విషయం జోలికి వెళ్లకుండా అక్రమ కేసు అని బుకాయించవచ్చు. కాని, అసలు విషయాలన్ని బయటకు వస్తే టిడిపికి, చంద్రబాబుకు మరింత ఇబ్బంది అని భయపడుతున్నారనిపిస్తుంది. జగన్ అధికారంలోకి వచ్చాక ఒక కొత్త డిస్టిలరీ ఇవ్వకపోయినా,కొత్త బ్రాండ్లు ఏమీ రాకపోయినా చంద్రబాబు టైమ్ లో ఇచ్చిన లైసెన్స్ లన్ని,కొత్త బ్రాండ్లన్నీ ఇప్పుడే ఇచ్చినట్లు ప్రచారం చేయడం టీడీపీకి, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా కథనాలు ఇవ్వడం అలవాటుగా మారింది. ఈ క్రమంలోనే పురందేశ్వరి కూడా ముందుగానే వైఎస్సార్సీపీపై ఎదురు దాడి చేస్తే చంద్రబాబు పై ఉన్న స్కామ్ కు ప్రాధాన్యత తగ్గుతుందని అనుకుని ఉండాలి. అలాకాని పక్షంలో ఆమె చంద్రబాబు టైమ్ లో జరిగినట్లు సీఐడీ చెబుతున్న ఈ స్కామ్ పై స్పందించవలసి ఉంటుంది. స్కిల్ స్కామ్ కేసులోనే ఆమె చంద్రబాబుకు మద్దతు ఇస్తూ మాట్లాడి అభాసుపాలయ్యారు. అయినా ఆమె పార్టీ కన్నా, బంధుత్వానికే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ✍️ఒకప్పుడు దగ్గుబాటి కుటుంబానికి, చంద్రబాబుకు ఉప్పు-నిప్పుగా పరిస్థితి ఉన్నా.. చంద్రబాబు ఎలాగో వారిని తన దారిలోకి తెచ్చుకున్నట్లు అనిపిస్తుంది. లోకేష్ మద్య నిషేధం గురించి చెబుతున్నారు. బహుశా ఆయన బాగా చిన్నవాడై ఉండవచ్చు. 1994లో ఎన్.టి.రామారావు ప్రభుత్వంలోకి రాగానే మద్య నిషేధం అమలు చేశారు. ఆయనను కూలదోసి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తాను ఇంకా కఠినంగా మద్య నిషేధాన్ని అమలు చేస్తానని కొంతకాలం ఊదరగొట్టి, ఆ వెంటనే ఇది మనవల్ల కావడం లేదని చేతులెత్తేసి, ప్రజాభిప్రాయ సేకరణ అంటూ కొత్త డ్రామాకు తెరదీసి మధ్య నిషేదాన్నే ఎత్తివేశారు. మరి అందుకు ఆయనపై ఎన్ని లక్షల కేసులు పెట్టాలో కూడా లోకేష్ ఆలోచించుకోవాలి. ✍️1999 ఎన్నికల సమయంలో అనుకుంటా!మద్యం కంపెనీలకు సుమారు 400 కోట్లు చెల్లించిన వైనంపై ఆరోపణలు వచ్చాయి. వాటిపై కాంగ్రెస్ నేత,మాజీ మంత్రి పాల్వాయి గోవర్దనరెడ్డి కోర్టుకు వెళ్లారు. అప్పుడు ఎలా చంద్రబాబు ఆ కేసునుంచి బయటపడింది లోకేష్ తెలుసుకుంటే, ఆ అనుభవం బాగా ఉపయోగపడవచ్చు.చంద్రబాబు క్విడ్ ప్రోకో కారణంగా అప్పట్లో ఏడాదికి రూ. 1300 కోట్ల నష్టం ప్రభుత్వానికి వచ్చిందని సీఐడీ చెబుతోంటే దానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఈనాడు మీడియా నేరుగా చంద్రబాబుపై కక్షసాధింపుల పర్వంలో భాగంగా మద్యం కేసు పెట్టినట్లు చెప్పేసింది. ✍️అసలు వార్తను పక్కకు దోసి చంద్రబాబును ప్రభుత్వం వేధిస్తోందని పత్రికలో, టీవీలో ప్రచారం చేశారు. మరి గతంలో ఎమ్.పిగా ఉన్న వైఎస్ జగన్ పై పదకుండు కేసులు పెట్టినప్పుడు, ఒక చార్ఝీషీట్ పై మరో చార్జీషీట్ వేసినప్పుడు అదంతా సక్రమం అనిపించిన ఈనాడుకు.. ఇప్పుడు చంద్రబాబుపై అవినీతి అభియోగాలు వస్తే మాత్రం అంతా అక్రమం అని గగ్గోలు పెడుతోంది. అందుకే ఈనాడు రామోజీరావుకు, చంద్రబాబుకు మద్య బందం ఫెవీకాల్ వంటిదని అందరూ అంటుంటారు. ఇక మరో పత్రిక ఆంద్రజ్యోతి ఒకవైపు కేసు కక్ష అంటూనే, మరో వైపు అప్పటి ఇంకో అధికారి అజయ్ కల్లంపై ఎందుకు కేసు పెట్టలేదని స్టోరీ ఇచ్చింది. అంటే ముందుగా ఈ అక్రమం జరిగిందని ఆ పత్రిక ఒప్పుకుని , ఆ తర్వాత ఏమైనా రాసుకోవచ్చు. చంద్రబాబుపై కేసు పెడితే అక్రమం అయితే, మరి అజయ్ కల్లంపై కేసు పెట్టాలని ఎలా రాస్తారో తెలియదు. జగన్ ప్రభుత్వంపై మద్యం లో వేల కోట్ల కుంభకోణం జరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే, ప్రభుత్వం టీడీపీ హయాలో ఏదో జరిగిపోయిందని కేసు పెట్టిందని ఈనాడు తెగ బాధపడిపోయింది. ఈ ప్రభుత్వంపై ఏవైనా ఆరోపణలు ఉంటే ఆధారసహితంగా చేయాలి. దానికి ప్రభుత్వం సమాధానం ఇస్తుంది. అంతే తప్ప చంద్రబాబు ప్రభుత్వంలో ఎలాంటి అక్రమాలు జరిగినా వాటిపై కేసులే పెట్టవద్దని ఈనాడు వంటి మీడియా విచిత్రమైన వాదన చేయడం దేనికి సంకేతం అవుతుంది?. రామోజీరావు అవినీతికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నట్లు కాదా?. ఇప్పటికే వివిధ కేసులలో విలవిలలాడుతున్న చంద్రబాబుకు ఈ మద్యం స్కామ్ మరో దెబ్బే అని చెప్పాలి. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (55)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం సమన్లు జారీ చేసింది. నవంబర్ 2న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఆయనకు సమన్లు జారీ అయ్యాయి. ఇదే కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసిన కొద్ది గంటలకే ఈ పరిణామం చెటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి దాఖలు చేసిన చార్జిషీట్లలో కేజ్రీవాల్ పేరును ఈడీ ఇప్పటికే పలుసార్లు పేర్కొనడం తెలిసిందే. ఈ కేసు నిందితులంతా ఢిల్లీ మద్యం విధానం 2021–22 తయారీ, అమలుకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ కేజ్రీవాల్తో ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నట్టు అందులో చెప్పుకొచ్చింది. నవంబర్ 2న కేజ్రీవాల్ స్టేట్మెంట్ను ఈడీ నమోదు చేయనుందని సమాచారం. మద్యం కుంభకోణానికి సంబంధించి అవినీతి, నేరపూరిత కుట్ర అభియోగాల్లో కేజ్రీవాల్ను సీబీఐ ఏప్రిల్ 16న కూడా 9 గంటలపాటు ప్రశ్నించింది. మండిపడ్డ ఆప్ కేజ్రీవాల్కు ఈడీ సమన్లపై ఆప్ మండిపడింది. తమ పార్టీని ఎలాగైనా అంతం చేయడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్రలు పన్నుతోందని ఆరోపించింది. అందులో భాగంగానే ఈ తప్పుడు కేసులో తమ అధినేతను ఎలాగైనా ఇరికించేందుకు నరేంద్ర మోదీ సర్కారు ఎప్పట్నుంచో ప్రయతి్నస్తోందని ఆప్ నేత, మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. మరోవైపు, ఈ కేసులో సిసోడియా అవినీతికి సంబంధించి చాలినన్ని రుజువులున్నాయని సుప్రీం బెయిల్ నిరాకరణతో తేలిపోయిందని బీజేపీ పేర్కొంది. కనుక నైతిక బాధ్యత వహిస్తూ కేజ్రీవాల్ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ కేసులో అవినీతి జరిగినట్టు ఎలాంటి రుజువులూ లేవని కేజ్రీవాల్తో పాటు ఆప్ నేతలంతా ఇప్పటిదాకా చెప్తూ వచి్చందంతా పచ్చి అబద్ధమని రుజువైందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ అన్నారు. ఆది నుంచీ వివాదాలే ఢిల్లీ మద్యం విధానాన్ని 2021లో కేజ్రీవాల్ ప్రభుత్వం అమల్లోకి తెచి్చంది. మద్యం లైసెన్సుదారులకు నిబంధనలకు విరుద్ధంగా అనేక విధాలుగా కేజ్రీవాల్ సర్కారు లబ్ధి చేకూర్చిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో దీనిపై విచారణ జరపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నాటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. మద్యం విధానం తప్పుల తడక అని, ఎక్సైజ్ మంత్రిగా సిసోడియా తీసుకున్న నిర్ణయాల వల్ల ఖజానాకు కనీసం భారీ నష్టం జరిగిందని, ఆప్ నేతలు తదితరులు లైసెన్సుదారుల నుంచి పలు మార్గాల్లో లబ్ధి పొందారని సీఎస్ నివేదించారు. ఈ వివాదాలు, ఆరోపణల నేపథ్యంలో చివరికి 2022 జూలై 31న నూతన మద్యం విధానాన్ని కేజ్రీవాల్ సర్కారు రద్దు చేసింది. ఇందులో తీవ్ర అవకతవకలు జరిగాయంటూ 2022 ఆగస్టు 17న సీబీఐ కేసు నమోదు చేసింది. సిసోడియాతో పాటు 15 మందిని నిందితులుగా చేర్చింది. -
Delhi Liquor Policy Case: సిసోడియా బెయిల్పై 30న సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: ఢిల్లీలో మద్యం విధానంలో అవకతవకలు, మనీల్యాండరింగ్ కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 30వ తేదీన తీర్పు వెలువరించనుంది. ఈ కేసును సీబీఐ, ఈడీలు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో అరెస్టయిన సిసోడియా తిహార్ జైలులో కస్టడీలో ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్పై అక్టోబర్ 17వ తేదీతో వాదనలు ముగిశాయి. తీర్పు సోమవారం ఉదయం వెలువడుతుందని సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. -
‘మద్యం’పై మాట్లాడే అర్హత పురందేశ్వరికి లేదు
పుత్తూరు రూరల్: మద్యం పాలసీపై మాట్లాడే అర్హత ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి లేదని డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి అన్నారు. ఆదివారం తిరుపతి జిల్లా పుత్తూరులో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం తీసుకొస్తే.. ఆయన స్థాపించిన పార్టీని చంద్రబాబు లాక్కుని మద్య నిషేధం ఎత్తివేసినప్పుడు పురందేశ్వరి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. చంద్రబాబు పాలించిన 2014–19 కాలంలోనే ఏకంగా 7 డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చారని గుర్తు చేశారు. 2019లో ఏర్పడిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇప్పటివరకు ఒక్క డిస్టలరీకి గానీ, ఒక్క బ్రూవరీకి గాని అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. పీఎంకే డిస్టలరీ యనమల రామకృష్ణుడిదని, శ్రీకృష్ణ డిస్టలరీ ఆదికేశవులనాయుడిదని, స్పై డిస్టిలరీ ఎస్పీవై రెడ్డిదని, విశాఖ డిస్టిలరీ అయ్యన్నపాత్రుడిదని వివరించారు. ఇప్పుడున్న ప్రతి బ్రాండు చంద్రబాబు పాలనలో తీసుకొచ్చినవే అని, అందుకే వాటిని ‘సీ’ బ్రాండ్లు అంటున్నారని తెలిపారు. కేజీహెచ్లో గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో నెలకు సుమారు 20 మంది పాడైన లివర్, పాంక్రియాస్ రోగులు అడ్మిట్ అవడమనేది పదేళ్లుగా జరుగుతున్న విషయమేనని స్పష్టం చేశారు. మద్యపానం చేస్తే లివర్ చెడిపోవచ్చు బ్రాండుతో సంబంధం లేకుండా మద్యాన్ని 8 నుంచి 10 ఏళ్ల పాటు తీసుకుంటే లివర్ చెడిపోవచ్చని మంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు. దేశంలోనే మద్యం సేవించే వారి సంఖ్య 15 శాతానికి పెరిగిందని నిమ్హాన్స్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. చంద్రబాబు పాలనలో మద్య నిషేధాన్ని ఎత్తివేయడాన్ని సమర్థిస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తలు రాశాయని గుర్తు చేశారు. చంద్రబాబు తన అనుచర గణానికి 4,378 మద్యం షాపులను కట్టబెట్టడమే కాకుండా, 43 వేల బెల్ట్ షాపులు పెట్టి మద్యపానాన్ని ఏరులై పారించారని గుర్తు చేశారు. అందుకే పురందేశ్వరి మద్యం పాట పాడుతోంది పురందేశ్వరి తన మరిది చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ను కాపాడేందుకే మద్యం పాట పాడుతున్నారని మంత్రి నారాయణస్వామి ఎద్దేవా చేశారు. పురందేశ్వరి బీజీపీ అధ్యక్షురాలా? టీడీపీ అధ్యక్షురాలా అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబుతో కలిసి పురందేశ్వరి, ఆమె భర్త సైతం ఎన్టీఆర్ మృతికి కారకులయ్యారని, ఎన్టీఆర్ కూతురుగా చెప్పుకోవడానికి ఆమెకు అర్హత లేదని పేర్కొన్నారు. చంద్రబాబు ఆర్థిక నేరస్తుడని తొలిసారిగా చెప్పింది దేశ ప్రధాని నరేంద్ర మోదీ అని.. ఆ తరువాత చెప్పింది పవన్కళ్యాణ్ అని గుర్తు చేశారు. చంద్రబాబు అరెస్ట్ న్యాయపరంగానే జరిగిందని రాష్ట్ర ప్రజలు విశ్వసించారు కాబట్టే ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేక స్పందన రాలేదన్నారు. -
Fact Check: అవన్నీ మీ ‘బాబు’ బ్రాండ్లే
సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారం కోల్పోతేనే ఈనాడు రామోజీరావు గంగవెర్రులెత్తిపోతారు. అలాంటిది ఇక అవినీతి కేసుల్లో ఆధారాలతో సహా అడ్డంగా దొరికి తన ఆత్మబంధువు జైలుకెళ్తే ఇక రామోజీ మామూలుగా ఉంటారా.. కల్లు తాగిన కోతిలా తయారై తన కలంతో విషం కక్కుతారు. ఇప్పుడు ఆయన పూనకం వచ్చినట్లుగా అదే చేస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా అమలుచేస్తున్న దశలవారీ మద్య నియంత్రణ విధానంపై తెగ దుష్ప్రచారం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో రోజురోజుకు జనాదరణ పెంచుకుంటున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నాణ్యమైన మద్యం విక్రయించడంలేదని మరో అవాస్తవ కథనాన్ని ప్రచురించి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ఈనాడు ఎప్పటిలాగే మరోసారి బరితెగించింది. ఇటువంటి టీడీపీ, ఈనాడు దుష్ప్రచారాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగానే గతంలో ఎన్నోమార్లు సమర్థంగా తిప్పికొట్టింది. అయినప్పటికీ రామోజీ తన వంకర బుద్ధిని మార్చుకోకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విద్వేషాన్ని వెళ్లగక్కుతునే ఉన్నారు. అందుకే మరోసారి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ ఫ్యాక్ట్చెక్.. బాబు హయాంలోనే పచ్చ సిండికేట్ దోపిడీ.. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సిండికేట్ మొత్తం ఆ పార్టీ నేతల గుప్పెట్లోనే ఉండేది. బడి పక్కన, గుడి పక్కన అనే విచక్షణ కూడా లేకుండా ఎక్కడపడితే అక్కడ మద్యం దుకాణాలకు అనుమతులిచ్చేసి.. పర్మిట్ రూమ్ల పేరుతో అనధికారిక బార్లను తెరిచేసి.. మరో 43వేల బెల్డ్ దుకాణాలను ఏర్పాటుచేసి మరీ మద్యాన్ని ఏరులై పారించారు. ఈ మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ కంటే మద్యం బాటిల్పై రూ.10 నుంచి రూ.25 వరకు అధిక ధరకు విక్రయించినా అడిగే నాథుడే లేకుండాపోయారు. ఆనాడు మద్యం దందాపై కిమ్మనకుండా ఈనాడు సహకరించిందన్నది బహిరంగ రహస్యం. ఆ బ్రాండ్లన్నీ తెచ్చింది చంద్రబాబే.. నిజానికి.. రాష్ట్రంలో మద్యం బ్రాండ్లపై ఈనాడు ఇప్పుడు నీతులు చెబుతుండటం విడ్డూరంగా ఉంది. వివిధ మద్యం బ్రాండ్ల పేర్లను ఉదాహరిస్తూ వాటితో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని మొసలి కన్నీరు కారుస్తోంది. కానీ, అవన్నీ చంద్రబాబు బ్రాండ్లనే వాస్తవాన్ని రామోజీరావు ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతున్నారు. అప్పటివరకూ కనిపించని... వినిపించని మద్యం బ్రాండ్లన్నీ కూడా రాష్ట్రంలోకి తీసుకొచ్చింది చంద్రబాబే అన్నది నిఖార్సైన నిజం. సంధి ప్రేలాపనలు పేలుతున్న రామోజీ.. ఆ వివరాలు ఇవిగో.. ► ప్రెసిడెంట్ మెడల్, హైదరాబాద్ బ్లూడీలక్స్ బ్రాండ్ల విస్కీకి చంద్రబాబు సీఎంగా ఉండగానే 2017 నవంబరు 22న అనుమతిచ్చారు. ► గవర్నర్ రిజర్వ్, లెఫైర్ నెపోలియన్, ఓక్టోన్ బారెల్ ఏజ్డ్, సెవెన్త్ హెవెన్ బ్లూ బ్రాండ్ల పేరుతో విస్కీ, బ్రాందీ తదితర 15 బ్రాండ్లకు కూడా టీడీపీ ప్రభుత్వమే 2018 అక్టోబరు 26న ఒకేసారి అనుమతులిచ్చింది. ► హైవోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, ఎస్ఎన్జీ 10000, బ్రిటీష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటీష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్లతో బీరు విక్రయాలు సైతం చంద్రబాబు నిర్వాకమే. ఆ బ్రాండ్లకు టీడీపీ ప్రభుత్వం 2017 జూన్ 7న అనుమతి జారీచేసింది. ► రాయల్ ప్యాలెస్, న్యూకింగ్, సైన్ అవుట్ పేర్లతో విస్కీ, బ్రాందీ బ్రాండ్లకు కూడా రామోజీ పార్ట్నర్ చంద్రబాబే 2018 నవంబరు 9న అనుమతిచ్చారు. ► బిరా 91 పేరుతో మూడు రకాల బీర్ బ్రాండ్లకు అనుమతులు ఎప్పుడు ఇచ్చారో తెలుసా రామోజీ.. 2019 మే 14న మీ చంద్రబాబు ప్రభుత్వమే. అప్పటికి ఇంకా రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టలేదు. ► ఆ మర్నాడే టీఐ మ్యాన్షన్ హౌస్, టీఐ కొరియర్ నెపోలియన్ విస్కీ, బ్రాందీ బ్రాండ్లకూ టీడీపీ సర్కారే అనుమతినిచ్చిందన్నది పచ్చి నిజం. డిస్టిలరీలకు అనుమతులిచ్చింది ఆయనే రామోజీ.. ఇక రాష్ట్రంలో మద్యం తయారుచేస్తున్న డిస్టిలరీలన్నింటికీ అనుమతులిచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉంటే వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు సీఎంగా ఉండగానే అనుమతినిచ్చారు. మిగిలిన 6 డిస్టిలరీలకు అంతకుముందు ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. అంటే టీడీపీ నేతలకు చెందిన కంపెనీలకే చంద్రబాబు అనుమతులిచ్చారు. ప్రస్తుతం చంద్రబాబు సన్నిహితుల కంపెనీలే మద్యాన్ని తయారుచేస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ప్రస్తుతం కూడా ఆ డిస్టిలరీలు తయారుచేస్తున్న మద్యాన్నే రాష్ట్రంలో విక్రయిస్తున్నారు. అయినా సరే టీడీపీ అధికారంలో ఉంటే మద్యం నాణ్యమైనదీ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉంటే మద్యంలో నాణ్యతలేదని దుష్ప్రచారం చేయడం ఈనాడుకే చెల్లింది. ప్రతీ డిస్టిలరీకి సమాన అవకాశాలు.. అలాగే, మద్యం తయారీ కూడా అప్పట్లో మాదిరిగా ఒకే డిస్టిలరీకి 50శాతం ఆర్డర్ ఇచ్చేయకుండా ప్రతీ డిస్టిలరీకీ సమానంగా అవకాశం వచ్చేలాగా.. 4–6 శాతం ఉండేలా తయారీ ఆర్డర్లు ఇస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మీకు ఎక్కడ తప్పు కనిపిస్తోంది?.. ఎక్కడ నాసిరకం ఉంది రామోజీ? మద్యం డాన్ చంద్రబాబే.. రాష్ట్రంలో మద్యం డాన్ చంద్రబాబే అన్న వాస్తవాన్ని రామోజీరావు ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తున్నారు. రాష్ట్రంలో 20 డిస్టలరీలు ఉంటే.. అందులో 14 చంద్రబాబు హయాంలోనే అనుమతులిచ్చారు. మరి మద్యం డాన్ చంద్రబాబే కదా రామోజీ. పైగా.. రాష్ట్రంలోని ఈ డిస్టిలరీలన్నీ దాదాపుగా టీడీపీ కీలక నేతల కుటుంబాల చేతుల్లోనే ఉన్నాయి. పీఎంకే డిస్టిలరీ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేశ్కుమార్ది. ఆయన టీడీపీ నేత పుట్టా మధుసూదన్ యాదవ్కు కుమారుడు కూడా. ► శ్రీకృష్ణ ఎంటర్ప్రైజస్ టీడీపీ మాజీ ఎంపీ దివంగత డీకే ఆదికేశవుల నాయుడు కుటుంబానిది. ► ఎస్పీవై ఆగ్రో ప్రొడక్ట్స్ టీడీపీ నేత, మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబానిది. వైఎస్సార్సీపీ తరపున ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డిని నిబంధనలకు విరుద్ధంగా టీడీపీలో చేరినందుకు నజరానాగా ఆ డిస్టిలరీకి చంద్రబాబు అనుమతిచ్చారు. ► ఇక బాబు ప్రభుత్వం 2019 ఎన్నికలకు ముందు ఆగ మేఘాల మీద 2019, ఫిబ్రవరి 25న అనుమతినిచ్చిన విశాఖ డిస్టిలరీస్లో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వాటాదారుగా ఉన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో దశలవారీ మద్య నియంత్రణ.. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశల వారీగా మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలుచేస్తోంది. ఇందుకోసం... ► టీడీపీ హయాంలో ప్రైవేట్ మద్యం దుకాణాలు ఉ.10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విక్రయాలు సాగించేవి. అనధికారికంగా 24 గంటలూ విక్రయిస్తూ ఉండేవి. కానీ, ఇప్పుడు సమయాన్ని కుదించి కచ్చితంగా అమలుచేస్తున్నారు. ఉ.10 నుంచి రాత్రి 9 గంటల వరకే విక్రయాలకు అనుమతించారు. ► బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లు రద్దుచేశారు. చంద్రబాబు హయాంలో ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుబంధంగా 43 వేల బెల్ట్ దుకాణాలు ఉండేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే వాటన్నింటినీ పూర్తిగా తొలగించింది. అలాగే, గతంలో మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్లను అనుమతించారు. అవి అనధికారికంగా బార్లగా చలామణి అయ్యేవి. వాటినీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే రద్దుచేసింది. ► దుకాణాలనూ కుదించారు. టీడీపీ హయాంలో 4,380 మద్యం దుకాణాలు ఉండగా ఇప్పుడు 2,934కి తగ్గిపోయాయి. ఈ సంఖ్యను ఇంకా తగ్గించే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. ఇక బార్ల సంఖ్యను పెంచలేదు. 2019లో ఖరారుచేసిన 840 బార్లే ఉన్నాయి. కొత్త బార్లకు లైసెన్సులివ్వలేదు. ► షాక్ కొట్టేలా ధరలు పెంచారు. మద్యం విక్రయాలను నిరుత్సాహపర్చడమే తమ పార్టీ విధానమని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో చాలాసార్లు చెప్పారు. విక్రయాలను ప్రోత్సహించి సొమ్ము చేసుకోవడం తమ లక్ష్యం కాదని స్పష్టంచేశారు. అందుకే అధికారంలోకి వచ్చాక మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచారు. అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్ఈటీ) పన్నునూ విధించారు. దీంతో మద్యం ధరలు పెరిగాయి. మద్యపాన వ్యసనాన్ని నిరుత్సాహ పరిచేందుకు విధించిన ఏఆర్ఈటీ పన్నుతో రాబడి పెరుగుతున్నట్లు కనిపిస్తున్నా వాస్తవానికి మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. ఫలితంగా పేదలు ఈ వ్యసనానికి క్రమంగా దూరమవుతున్నారు. ► మరోవైపు.. అమ్మకాలూ భారీగా తగ్గాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయనడానికి ఇదే ఉదాహరణ. రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. టీడీపీ హయాంతో పోలిస్తే రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం విక్రయాలు సగానికి పడిపోయాయి. అందుకు గణాంకాలే తార్కాణం. మద్యం నాణ్యతపై ఈనాడు దుష్ప్రచారం ఈనాడు కుట్రపూరితంగా సాగిస్తున్న మరో దుష్ప్రచారం ఏమిటంటే...రాష్ట్రంలో మద్యం నాణ్యత లేదని.. విషపు అవశేషాలు ఉన్నాయని చెన్నైలోని ఎస్జీఎస్ ల్యాబొరేటరీ పేరిట ఓ అబద్ధపు నివేదికను ప్రచారంలోకి తీసుకొచ్చింది. కానీ, ఈనాడు కుట్ర బెడిసికొట్టింది. తాము అసలు అలాంటి నివేదికే ఇవ్వలేదని ఆ సంస్థ స్పష్టంచేసింది. తాము పరీక్షించిన మద్యం నమూనాల్లో అవశేషాలు పరిమితికి లోబడే ఉన్నాయని, అవి ప్రమాదకరంకాని సహజసిద్ధమైన మొక్కల నుంచి తయారైనవేనని స్పష్టంచేసింది. తమ నివేదికను తప్పుగా అన్వయించారని చెప్పింది. అయినా సరే రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ రాష్ట్రంలో మద్యం నమూనాలను హైదరాబాద్లోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ల్యాబ్లో పరీక్షించింది. ఆ నమూనాలన్నీ నిర్దేశిత ప్రమాణాల ప్రకారమే ఉన్నాయని నివేదిక ఇచ్చింది. మద్యం నాణ్యతపై ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చిచెప్పింది. రాష్ట్రంలో మద్యం తయారీకి డిస్టిలరీలు ఎప్పుడెప్పుడు అనుమతులు పొందాయంటే.. 1. కాంటినెంటల్ వైన్స్, ఆటోనగర్, విజయవాడ, 1971, ఆగస్టు 9 2. బీఆర్కే స్పిరిట్స్, కంకిపాడు, కృష్ణాజిల్లా, 1998, సెప్టెంబరు 15 3. పెర్ల్ డిస్టిలరీ లిమిటెడ్, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా, 1997, ఆగస్టు 14 4. సోరింగ్ స్పిరిట్స్ ప్రైవేట్ లిమిటెడ్, చేబ్రోలు, తూ.గోదావరి జిల్లా, 2007, నవంబరు 7 5. సెంటిని బయో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, గండేపల్లి, కృష్ణాజిల్లా 2010, జూన్ 9 6. బీవీఎస్ డిస్టిలరీస్, కంకిపాడు, కృష్ణాజిల్లా, 2017, జనవరి 2 7. శ్రావణి ఆల్కో బ్రూ ప్రైవేట్ లిమిటెడ్, గంపలగూడెం, కృష్ణాజిల్లా, 2017, సెప్టెంబరు 29 8. గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్, వంగూరు, ప.గోదావరి జిల్లా, 1997, నవంబరు 17 9. జీఎస్బీ అండ్ కో, కశింకోట, విశాఖపట్నం జిల్లా, 2008 10. బీడీహెచ్ ఆగ్రో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, కొప్పరం, తూ.గోదావరి జిల్లా, 2017, ఆగస్టు 25 11. విశాఖ డిస్టిలరీస్, కశింకోట, విశాఖపట్నం జిల్లా, 2019, ఫిబ్రవరి 25 12. పీఎంకే డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, కశింకోట, విశాఖపట్నం జిల్లా, 2017, అక్టోబరు 23 13. ఈగిల్ డిస్టిలరీస్, తాడిగొట్ల, కడప, 1974, అక్టోబరు 14. ఎస్వీఆర్ డిస్టిలరీస్, తిరుపతి, 1982 15. శ్రీకృష్ణా ఎంటర్ప్రైజెస్, తిమ్మ సముద్రం, చిత్తూరు జిల్లా, 1998, జులై 16. ఎస్ఎన్జే సుగర్స్, ప్రొడక్ట్స్, వెంకటాచలం, నెల్లూరు జిల్లా, 2018, మే 17. మోహన్ బేవరేజస్ అండ్ డిస్టిలరీస్ లిమిటెడ్, పల్లూరు, చిత్తూరు జిల్లా, 1978 18. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్, నంద్యాల, కర్నూలు జిల్లా, 2016, సెప్టెంబరు 19. ఖోడేస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, కుప్పం, చిత్తూరు జిల్లా, 1970 20. ప్రాగ్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, నల్లమిల్లి, తూ.గోదావరి జిల్లా, 1997, మార్చి 31. -
Fact Check: రామోజీ కలం ‘కిక్కు’తోంది..
సాక్షి, అమరావతి: కళ్ల ముందు కనిపిస్తున్న నిజాలను దాచి, అబద్ధాల కథనాలు రాసి పారేస్తే ప్రజలు నమ్మక ఏం చేస్తారు అన్న భ్రమల్లో ఉన్నారు ఈనాడు రామోజీరావు. అంకెలు అబద్ధాలు చెప్పవు.. నిజాలే చెబుతాయి కదా.. అందుకే ఈనాడు రామోజీరావు ఎప్పుడూ అంకెలు చెప్పరు, అబద్ధాలే చెబుతారు. అందులోనూ తన ఆత్మబంధువు చంద్రబాబు సీఎం కుర్చీలో లేకపోతే ఆయన కలం వెర్రితలలు వేస్తుంది. అబద్ధాలు, అభూత కల్పనలను రంగరించి మరీ విషం కక్కుతుంది. ప్రజల్ని మభ్యపెట్టడం, మోసగించడమే ఆ కలం నిత్యకృత్యం. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన మరోసారి విద్వేషాన్ని చిమ్మారు. ఓట్లడిగే ‘అర్హత’ కోల్పోయిన జగన్.. అంటూ ఈనాడు ఊగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వ మద్యం విధానంపై ఓ అబద్ధాల కథనాన్ని అచ్చేసింది. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు పాతరేసి ఎప్పటిలాగే దుష్ప్రచారానికి తెగబడింది. అందులో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానానికి వక్రభాష్యం చెబుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు రామోజీ పడరాని పాట్లు పడ్డారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మద్యం ఏరులై పారిన నిజాన్ని.. టీడీపీ నేతలు మద్యం సిండికేట్గా మారి పేదలను దోచుకున్న దోపిడీని చూసి పచ్చ పారవశ్యంతో పులకించిపోయిన రామోజీ ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుచేస్తున్న దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని విమర్శించేందుకు కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారు. కానీ, టీడీపీ ప్రభుత్వంలో మూడు బార్లు ఆరు దుకాణాలుగా మద్యం ఏరులై పారిందని.. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దశలవారీగా మద్య నియంత్రణ సుసాధ్యమవుతోందని రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు రాజకీయ ప్రాభవం ఇక ముగిసిందని.. తన ఆర్థిక అక్రమ సామ్రాజ్యం కుప్పకూలిందని 90 ఇయర్స్ రామోజీ ఇకనైనా గుర్తిస్తే మేలు. నిత్యం అబద్ధాలను వల్లెవేసే ఈనాడు విషపు రాతల బండారాన్ని బట్టబయలు చేస్తున్న పచ్చినిజం ‘ఏది నిజం’ ఇదిగో.. అప్పట్లో మూడు పర్మిట్ రూమ్లు.. ఆరు బెల్ట్ దుకాణాలు.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోటీడీపీ నేతల మద్యం సిండికేట్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మూడు పర్మిట్ రూమ్లు.. ఆరు బెల్ట్ దుకాణాలుగా మద్యం ఏరులై పారిందన్నది నిఖార్సైన నిజం. రామోజీకి గుర్తులేదేమోగానీ రాష్ట్ర ప్రజలు మాత్రం మరిచిపోలేదు. అప్పట్లో టీడీపీ నేతల గుప్పెట్లో ఉండే మద్యం మాఫియా యథేచ్ఛగా ప్రజలను దోపిడీ చేసింది. వేళాపాళా లేకుండా 24 గంటలూ మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగేవి. ఎమ్మార్పీ ధరల కంటే 25శాతం వరకు అధిక ధరలకు అమ్ముతున్నా సరే నాడు ఎక్సైజ్ శాఖ చేష్టలుడిగి చోద్యం చూడాల్సి వచ్చేది. మద్యం మాఫియా ఆట కట్టించిన సీఎం జగన్.. మద్యం మాఫియా అరాచకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్క విధాన నిర్ణయంతో తుడిచిపెట్టేశారు. రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని ఆయన రద్దుచేశారు. 2019, అక్టోబర్ 1 నుంచి మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వపరం చేసేశారు. దాంతో రాష్ట్రంలో మద్యం మాఫియా కోరలు పీకి తుదముట్టించారు. అందుకోసం.. మద్యం దుకాణాల వేళలు కుదింపు ప్రైవేటు వ్యక్తులైతే ఎంతగా మద్యం విక్రయాలు పెంచితే తమకు అంతటి లాభం వస్తుందని అనుకుంటారు. కానీ, ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని సీఎం జగన్ రద్దుచేశారు. ప్రస్తుతం మద్యం దుకాణాలు ప్రభుత్వానివే కాబట్టి మద్యం అమ్మకాలను ప్రోత్సహించాల్సిన అవసరమేలేదు. అంతేకాదు.. మద్యం విక్రయాల సమయాలను బాగా కుదించారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రైవేటు మద్యం దుకాణాలు ఉ.10గంటల నుంచి రాత్రి 11గంటల వరకు అధికారంగా విక్రయాలు సాగించేవి. అనధికారికంగా 24గంటలూ విక్రయిస్తూ ఉండేవి. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం దుకాణాల సమయాన్ని కుదించి ఉ.10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే విక్రయాలను అనుమతించారు. కచ్చితంగా అమలుచేస్తున్నారు కూడా. బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లు రద్దు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుబంధంగా రాష్ట్రంలో 43వేల బెల్ట్ దుకాణాలు ఉండేవి. కాలనీలు, వీధులు, సందుల్లో ఎక్కడపడితే అక్కడ బెల్ట్ దుకాణాలు విచ్చలవిడిగా మద్యాన్ని విక్రయించేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ 43వేల బెల్ట్ దుకాణాలను పూర్తిగా తొలగించింది. టీడీపీ ప్రభుత్వంలో మద్యం దుకాణాలకు అనుబంధంగా 4,380 పర్మిట్ రూమ్లకు అనుమతించారు. అంటే ఆ పర్మిట్ రూమ్లు అనధికారికంగా బార్లుగా చలమణి అయ్యేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ 4,380 పర్మిట్ రూమ్ల అనుమతులను సైతం రద్దుచేసింది. మద్యం దుకాణాలు క్రమంగా తగ్గింపు చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో 4,380 మద్యం దుకాణాలు ఉండేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాలను పూర్తిగా తొలగించి ప్రభుత్వపరం చేసింది. అంతేకాదు.. మద్యం దుకాణాలను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. 2019లో రాష్ట్రంలో 4,380 ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండగా ప్రస్తుతం 2,934 ప్రభుత్వ మద్యం దుకాణాలే ఉన్నాయి. అలాగే, టీడీపీ ప్రభుత్వం ఏటా బార్ల సంఖ్యను పెంచేది. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం బార్ల సంఖ్యను పెంచలేదు. 2019లో ఖరారుచేసిన 840 బార్లే ఉన్నాయి. కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వలేదు. విక్రయాలు తగ్గించేందుకే ధరల షాక్ మద్యం విక్రయాలను నిరుత్సాహపర్చడమే తమ పార్టీ విధానమని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లోనూ మేనిఫెస్టోలోనూ స్పష్టంగా చెప్పారు. పేదలను మద్యం వ్యసనానికి దూరం చేసేందుకే ఆ నిర్ణయమన్నారు. అంతేగానీ, మద్యం విక్రయాలను ప్రోత్సహించి సొమ్ము చేసుకోవడం తమ ప్రభుత్వ లక్ష్యం కాదని స్పష్టంచేశారు. ఆ మాటకు కట్టుబడుతూ అధికారంలోకి వచ్చాక మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచారు. అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్ఈటీ) పన్నునూ విధించారు. దాంతో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. మరోవైపు.. మద్యం వ్యసనాన్ని నిరుత్సాహ పరిచేందుకు విధించిన ఏఆర్ఈటీ పన్నుతో మద్యం రాబడి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వాస్తవాన్ని రామోజీ వక్రీకరిస్తూ రాష్ట్రంలో మద్యం విక్రయాలు పెరిగాయని ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తుండటం విడ్డూరంగా ఉంది. వాస్తవానికి రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. పేదలు మద్యం వ్యసనానికి క్రమంగా దూరమవుతున్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలతో ‘నవోదయం’.. దశాబ్దాలుగా నాటుసారా తయారీయే జీవనోపాధిగా చేసుకున్న కుటుంబాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. అందుకోసం ‘నవోదయం’ పేరుతో వినూత్న సంస్కరణలను తీసుకొచ్చి ఆ కుటుంబాల సామాజిక గౌరవాన్ని పెంచింది. 2022 ఏప్రిల్ నాటికి రాష్ట్రంలో 1,891 గ్రామాలను గుర్తించారు. ఆ గ్రామాల్లో ఇప్పటికే 1,552 కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం రూ.11.46 కోట్ల మేర సహాయం చేసింది. 99 శాతం మేనిఫెస్టో అమలు దశలవారీ మద్య నియంత్రణ అనే అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏమీ బుకాయించడంలేదు. తాము చేసిందే చెబుతున్నారు. అదే సమయంలో తమ పరిమితిని కూడా అంగీకరిస్తున్నారు. అందుకే ఆయన తమ మేనిఫెస్టోను 99 శాతం అమలుచేశామనే చెబుతున్నారు. మద్యం, ఉద్యోగుల విషయాల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి చాలావరకు చేశారు. కానీ, సాంకేతిక అంశాలు, ఇతరత్రా కారణాలతో ఆ రెండు అంశాల్లో అరశాతం చొప్పున మిగిలిపోయిందని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిజాయతీగా అంగీకరిస్తోంది. అందుకే తాము 99శాతం మేనిఫెస్టోను అమలుచేశామనే సీఎం జగన్ చెబుతుండటం ఆయన నిజాయతీ, నిబద్ధతకు నిదర్శనం. అంతేగానీ, ఆయన ప్రజల్ని మోసపుమాటలతో మాయచేయడంలేదు. 99 శాతం మేనిఫెస్టో అమలుచేశామని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ను రామోజీరావు పచ్చకావరంతో తప్పుబడుతున్నారు. కానీ, చంద్రబాబు 2014 ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోను ఏమాత్రం అమలుచేయలేదు. అధికారంలోకి రాగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారు. టీడీపీ అధికారిక వెబ్సైట్ నుంచి సైతం దానిని తొలగించారు. అయినాసరే అప్పట్లో రామోజీరావు నోరు పెగల్లేదు.. పెన్ను కదల్లేదు. మేనిఫెస్టోను ఎందుకు అమలుచేయడంలేదని ప్రశ్నించలేదు. ఎందుకంటే అప్పట్లో అధికారంలో ఉన్నది తన పార్ట్నర్ చంద్రబాబు కాబట్టి. తన అక్రమ ఆర్థిక సామ్రాజ్యానికి వెన్నుదన్నుగా ఉన్న చంద్రబాబు కాబట్టి. ప్రజలకు ఎంత నష్టం జరిగినా, రాష్ట్ర ప్రగతి దెబ్బతిన్నా సరే ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ, ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 99 శాతం మేనిఫెస్టోను అమలుచేసి.. ఆ విషయాన్ని నిజాయతీగా ప్రకటిస్తున్నా సరే రామోజీ తప్పుబడుతుండటం ఈనాడు ‘పచ్చ’కామెర్ల తత్వాన్ని బయటపెడుతోంది. ఆ పచ్చపైత్యం చంద్రబాబుకు కమ్మగా ఉంటుందేమోగానీ టీడీపీ కుట్రలను, ఈనాడు దుష్ప్రచారాన్ని రాష్ట్ర ప్రజలు తిప్పికొడుతున్నారు. ఇది నాలుగున్నరేళ్లుగా రుజువవుతూనే ఉంది. అర్హులందరికీ సంక్షేమం అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెన్నంటే ఉన్నామని తేల్చిచెబుతున్నారు. చంద్రబాబు, రామోజీ మద్యం బంధం వ్యాపార ప్రయోజనాల కోసం కుట్రపూరిత రాజకీయాలతో ప్రభుత్వ వ్యవస్థను భ్రష్టు పట్టించడంలో చంద్రబాబు, రామోజీరావు సిద్ధహస్తులు. వారి రాజకీయ బంధం మద్యంతో ముడిపడి ఉందన్నది బహిరంగ రహస్యం. 1989–94లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడం.. అప్పట్లో తమ పోటీ పత్రిక ‘ఉదయం’ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు రామోజీరావు సంపూర్ణ మద్య నిషేధం ఉద్యమాన్ని ప్రోత్సహించారు. ఎన్టీరామారావు అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్య నిషేధాన్ని విధించారు. ఆ తర్వాత ఎన్టీరామారావుకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయ్యారు. మద్య నిషేధాన్ని ఎత్తివేసి మద్యానికి తలుపులు బార్లా తెరిచారు. అయినాసరే.. రామోజీరావు కిమ్మనకుండా మద్దతు తెలిపారు. ఎందుకంటే అప్పుడే రామోజీ ఫిల్మ్సిటీ నిర్మాణం చేపట్టారు. అందులోని స్టార్హోటళ్లలో మద్యం విక్రయాల కోసం రామోజీరావు నిజంగా ప్రజల రక్తమాంసాలతో వ్యాపారం చేస్తున్నారు. కానీ, ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్లో మద్యం విక్రయాల గురించి శ్రీరంగ నీతులు చెబుతుండటం విడ్డూరంగా లేదూ? అక్రమ మద్యంపై ఎస్ఈబీ ఉక్కుపాదం అలాగే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అక్రమ మద్యం, నాటుసారాపై ఉక్కుపాదం మోపుతోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా సాగిన అక్రమ మద్యం, నాటుసారా దందాను సమర్థంగా కట్టడి చేస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటుచేయడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. ఎస్ఈబీ మూడు విధాలుగా అక్రమ మద్యం, నాటుసారాను అరికడుతోంది. అదెలాగంటే.. ► అక్రమ మద్యం, నాటుసారా తయారీ దశాబ్దాలుగా సాగుతున్న 147 గ్రామాలను గుర్తించి దాడులు నిర్వహిస్తోంది. ► గ్రామ వలంటీర్లు, వార్డు వలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా కచ్చితమైన సమాచారాన్ని తెప్పించుకుని అక్రమ మద్యం దందాను అడ్డుకుంటోంది. ► ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం స్మగ్లింగ్ను అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ► అంతర్రాష్ట్ర సమన్వయ సమావేశాలు నిర్వహిస్తూ.. పొరుగు రాష్ట్రాలతో కలిసి దాడులు నిర్వహిస్తోంది. -
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరోసారి కవిత పేరు..
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించింది. కవితకు సంబంధించిన వ్యక్తిగా స్కాంలో అరుణ్ పిళ్లై వ్యవహరించారని ఈడీ పేర్కొంది. ఈ కేసులో కవిత పాత్రపై సమగ్ర దర్యాప్తు వివరాలను కోర్టుకు ఈడీ సమర్పించింది. నాలుగవ సప్లమెంటరీ చార్జిషీట్లో 53 సార్లు కవిత పేరు ప్రస్తావనకు వచ్చింది. 278 పేజీల భారీ చార్జిషీట్లో అరుణ్ పిళ్లై, బుచ్చి బాబు సమీర్ మహేంద్ర కీలక స్టేట్మెంట్లలో కవిత పేరు ప్రస్తావనకు వచ్చింది. ఛార్జిషీట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ పాలసీ రూపకల్పనకు ముందే కవిత, ఆప్ విజయ్ నాయర్ మధ్య చర్చలు జరిగాయి. ఆ తర్వాత మద్యం పాలసీ ఖరారు చేసినట్లు పేర్కొన్న ఈడీ.. కవిత కాల్ డేటా రికార్డును సాక్ష్యంగా సమర్పించింది. ‘‘ఏప్రిల్ 8, 2022న కవిత అరుణ్ పిళ్లైలు వంద కోట్ల ముడుపుల సొమ్మును తిరిగి ఎలా రాబట్టుకోవాలనే అంశంపై విజయ్ నాయర్ దినేష్ అరోరాతో ఢిల్లీలోని ఉబెరాయ్ హోటల్లో చర్చించారు. సౌత్ గ్రూపునకు అనుకూలమైన విధానం రూపకల్పన చేసి ముడుపులు అందుకున్నారు. సౌత్ గ్రూప్ నుంచి విజయనాయర్ 100 కోట్ల ముడుపులు అందుకున్నారు. పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత కవిత, సమీర్ మహేంద్ర ఫేస్ టైం లో మాట్లాడుకుని బిజినెస్ బాగుందని అభినందనలు తెలుపుకున్నారు. ఇండో స్పిరిట్ ఎల్ వన్ దరఖాస్తు ఆలస్యం కావడంపై సమీర్ మహేంద్రతో కవిత చర్చలు జరిపింది’’ అని ఈడీ పేర్కొంది. బ్రిండ్ కో యజమాని అమన్ దల్ తమకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేస్తున్నారని సమీర్ వెల్లడించగా, అలాంటి సమస్యలుంటే తాను క్లియర్ చేస్తానని కవిత చెప్పినట్లు ఈడీ వెల్లడించింది. చదవండి: లిక్కర్ స్కాంలో సిసోడియాకు గట్టి దెబ్బ, ఆ వెంటనే.. ‘‘ఈ అంశంపై హైదరాబాద్లో జరిగిన సమావేశంలో కవిత భర్త అనిల్ కూడా పాల్గొన్నారు. తన తరఫున అరుణ్ వ్యాపారంలో ఉంటారని అవసరమైతే ఈ వ్యాపారాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించాలని కవిత సూచించింది. తాను కవితను రెండుసార్లు కలిశానని, ముడుపులు తిరిగి రాబట్టుకునే అంశంపై చర్చించానని విజయ్ నాయర్ స్టేట్మెంట్ ఇచ్చారు. 11.11.2022న ఈడీ ముందు అరుణ్ పిళ్ళై కీలక సాక్ష్యం ఇచ్చారు. కవితకు ఆప్కు మధ్య 100 కోట్ల రూపాయల డీల్ కుదిరింది అని అరుణ్ పిళ్లై స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే ఇండో స్పిరిరిలో ఆమెకు వాటాలు ఉన్నాయి’’ అని ఈడీ పేర్కొంది. కవిత తరపున తాను భాగస్వామిగా పనిచేశానని అరుణ్ పిళ్ళై వెల్లడించారని, పెర్నార్డ్ రికార్డు బిజినెస్ను ఇండస్పిరిట్కు ఇప్పించి, అందులో 65 శాతం వాటాలు పొందారని, ఈ వ్యాపారంలో కవితే అసలైన ఇన్వెస్టర్ అని, కవితకు ఆప్కు మధ్య సంపూర్ణమైన అవగాహన కుదిరింది’’ అని ఈడీ తెలిపింది. -
మద్యం విధానంపై ఈనాడు తప్పుడు వార్త