భారీ దోపిడీకి టీడీపీ ప్లాన్‌!: వైఎస్సార్‌సీపీ | YSRCP And Ambati Rambabu Key Comments Over Chandrababu Govt | Sakshi
Sakshi News home page

భారీ దోపిడీకి టీడీపీ ప్లాన్‌!: వైఎస్సార్‌సీపీ

Published Mon, Oct 7 2024 3:16 PM | Last Updated on Mon, Oct 7 2024 3:35 PM

YSRCP And Ambati Rambabu Key Comments Over Chandrababu Govt

సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి సర్కార్‌ భారీ దోపిడీకి తెర లేపిందని ఆరోపించింది వైఎస్సార్‌సీపీ. టీడీపీ ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు, బినామీలకే మద్యం దుకాణాలను కేటాయించేలా వ్యూహం రూపొందించి అమలు చేస్తున్నారని కామెంట్స్‌ చేసింది.

వైఎస్సార్‌సీపీ ట్విట్టర్‌ వేదికగా.. 
టీడీపీ భారీ దోపిడీకి తెర‌!
రాష్ట్రంలో మద్యం దందా ద్వారా అధికారికంగా భారీ దోపిడీకి తెర లేపిన టీడీపీ.
ముఖ్య నేత కనుసన్నల్లో జరుగుతున్న దుకాణాల కేటాయింపుల్లో టీడీపీ సిండికేట్‌కు రాచబాట పరుస్తున్నారు. 
టీడీపీ ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు, బినామీలకే మద్యం దుకాణాలను కేటాయించేలా వ్యూహం రూపొందించి అమలు చేస్తున్నారు అని ఆరోపించింది.

 

ఇదే సమయంలో పోలవరంపై కూడా వైఎస్సార్‌సీపీ కీలక వ్యాఖ్యలు చేసింది. పోలవరాన్ని పూర్తి చేస్తాం అంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు కేంద్రం రెండేళ్ల గడువిచ్చింది. ఈ గడువులోగా ఆయన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తారా? ఎప్పట్లానే మాట తప్పి నాలుక మడత వేస్తారా చూడాలి అంటూ వ్యాఖ్యలు చేసింది.

మరోవైపు.. ఉచిత ఇసుకపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. అంబటి ట్విట్టర్‌ వేదికగా.. నేతి బీరకాయలోని నెయ్యి ఎంతో..  ఉచిత ఇసుక లోని ఉచితం అంత! చంద్రబాబు.. అంటూ వ్యాఖ్యలు చేశారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement