breaking news
Ambati Rambabu
-
చంద్రబాబు గ్రాఫ్ పడిపోయింది: అంబటి రాంబాబు
సాక్షి, తాడేపల్లి: టీడీపీ ఎమ్మెల్యేలు దోపిడీ కార్యక్రమాల్లో మునిగిపోయారని నిన్నటి పొలిట్ బ్యూరో సమావేశానికి 56 మంది గైర్హాజరు అయ్యారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసి 15 మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో విహరిస్తున్నారని మండిపడ్డారు. ఇసుక దోపిడీ చేస్తూ, మద్యం కమిషన్లు దండుకుంటూ వారంతా బిజీగా ఉన్నారు. అబద్దాలను నిజం చేయటానికి ఎల్లోమీడియా ద్వారా విషం చిమ్ముతున్నారు’’ అంటూ అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.2014-2019 మధ్య జనాన్ని మోసం చేసినందునే 2019 ఎన్నికలలో చంద్రబాబు ఓటమి పాలయ్యారు. రైతు రుణమాఫీ సహా ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. అందుకే జనం ఓడించారు. 2024లో గెలిచాక కూడా మళ్ళీ జనాన్ని మోసం చేస్తున్నారు. జగన్ ఖజానాని ఖాళీ చేశారనీ అందుకే సంక్షేమాలను అమలు చేయలేదని అబద్దాలు మొదలు పెట్టారు. పెద్ద పెద్ద కాంట్రాక్టులన్నీ లోకేష్ కమీషన్లు తీసుకుని టెండర్లు పిలుస్తున్నారు. రెండు లక్షల కోట్లు అప్పు చేసి అమరావతి నిర్మాణం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. ఈ ఒక్క ఏడాదే దుర్మార్గపు పాలన చేశారు. రానున్న రోజుల్లో ఇంకా పరమ దుర్మార్గపు పాలన చేస్తారు’’ అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు.‘‘గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతోంది. మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి. కుప్పంలోనే ఒక మహిళను చెట్టుకు కట్టేసి కొడితే ఏం చేశారు?. డైలాగులు చెప్పినంత సీరియస్గా పరిపాలన చేయటం లేదు. లోకేష్ కు సిగ్గు ఉంటే టెన్త్ మూల్యాంకనం తప్పిదాలకు బాధ్యత వహించి రాజీనామా చేయాలి. లోకేష్కు అలాంటి సిగ్గు లేదు. చంద్రబాబు చేతిలో పాలన లేదు.. అంతా లోకేషే. ఇన్నేసి దుర్మార్గాలు చేస్తూ సుపరిపాలన అని ఎలా చెప్తారు?’’ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.‘‘జగన్ అంటే చంద్రబాబుకు విపరీతమైన ఈర్ష్య, భయం. కూటమి ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోతోందని ఎల్లో మీడియానే చెప్తోంది. ఎమ్మెల్యేలేమో చంద్రబాబు గ్రాఫే పడిపోయిందని చెప్తున్నారు. ఒక్క సంవత్సరంలోనే ఈ స్థాయిలో గ్రాఫ్ పడిపోవటం ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడానికే పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నారు. ఎండీయూ వాహనాలు, వాలంటీర్లను తొలగించి సామాన్యులను కూడా వేధిస్తున్నారు. చంద్రబాబు మాటలను ఆయన పార్టీ వారే వినిపించుకోవటం లేదు. చంద్రబాబుకు తెలియకుండా 15 మంది ఎమ్మెల్యేలు విదేశాలకి వెళ్లిపోయారంటే ఆయనకు పార్టీ మీద ఏమాత్రం పట్టు లేదని తేలిపోయింది..జగన్ నెల్లూరు వెళితే టీడీపీ వారికి ఏంటి ఇబ్బంది?. హెలికాఫ్టర్ కాకపోతే కారులోనో లేదంటే నడుచుకుంటూ అయినా వెళ్తారు. జగన్కు 40 నుండి 60 శాతం ఆదరణ పెరిగింది. ఇది టీడీపీ సర్వేలోనే తేలిందని చంద్రబాబు, లోకేష్, పవన్ మాటలు వింటుంటేనే అర్థం అయింది. అందుకే జగన్ పర్యటనలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుకే ఊడిగం చేస్తానని పవన్ అంటున్నారు. వ్యతిరేకత పెరిగితే కూటమికైనా ఓటమి తప్పదు. జగన్ని కట్టడి చేయటానికే ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోవటం నీచ సంస్కృతి’’ అంటూ అంబటి రాంబాబు దుయ్యబట్టారు. -
జగన్ కు కృతజ్ఞతలు.. గుంటూరు వెస్ట్ లో వైఎస్సార్సీపీ జెండా ఎగరేస్తాం
-
సింగయ్య మృతిపై తాము రాసిన నోట్ పై సంతకం చేయాలని పోలీసులు ఒత్తిడి చేశారు
-
సింగయ్య ఘటనపై ఎల్లో మీడియా క్షుద్ర రాజకీయాలు: అంబటి
సాక్షి, గుంటూరు: ఈ రాష్ట్రంలో ఆంధ్రజ్యోతి, ఈనాడు సంస్థలు ప్రజలకు వాస్తవాలను చెప్పడానికి బదులు చంద్రబాబుకు దాసోహమై నిత్యం తన అబద్దపు రాతలతో వైఎస్ జగన్ వ్యక్తిత్వహననమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైయస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో సింగయ్య అనే అభిమాని చనిపోతే, ఆ మరణంపై ఏ మాత్రం మానవత్వం లేకుండా ఎల్లో మీడియా క్షుద్రరాతలతో వైఎస్సార్సీపీపై విషం చిమ్ముతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పర్యటనలకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో వున్న కూటమి ప్రభుత్వ కుట్రలకు ఎల్లో మీడియా కూడా భాగస్వామిగా మారిందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటన సందర్భంగా దురదృష్టవశాత్తు వెంగళాయపాలేనికి చెందిన సింగయ్య అనే వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోగా, సత్తెనపల్లిలో జయవర్ధన్రెడ్డి అనే యువకుడు వడదెబ్బ కారణంగా గుండెపోటుకు గురై మృతిచెందారు.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాహనం కానీ, ఆయన కాన్వాయ్ వాహనాలు కానీ సింగయ్యను ఢీకొట్టలేదని ఎస్పీ స్వయంగా వెల్లడించారు. కాన్వాయ్కి ముందు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో ఆయన ప్రమాదానికి గురైనట్టు ఎస్పీ ధ్రువీకరించారు. దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదాన్ని కూడా రాజకీయం చేయాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది. వైఎస్ జగన్ పర్యటన కోసం సింగయ్యతో పాటు మరో 40 మందిని మా పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాలసాని కిరణ్ కుమార్ తీసుకొచ్చినట్టుగా రాసిన స్టేట్మెంట్ మీద సంతకం పెట్టమని సింగయ్య మృతదేహానికి పోస్టుమార్టం సమయంలో ఆయన భార్యను పోలీసులు ఒత్తిడి చేశారు.పోలీసులు రాసి తీసుకొచ్చిన తప్పుడు స్టేట్మెంట్పై ఆ సమయంలో అక్కడే ఉన్న పార్టీ నాయకులమంతా అడ్డం తిరగడంతో పోలీసులు సింగయ్య భార్య, ఆమె బంధువులు ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డు చేసుకుని వెళ్లిపోయారు. లేదంటే దీన్ని హత్యకేసుగా చిత్రీకరించి ఎవరో ఒకర్ని ఇరికించాలన్న కుట్ర అప్పుడే జరిగింది.వైఎస్ జగన్ని ఇబ్బంది పెట్టాలన్నదే వారి లక్ష్యంరాష్ట్రంలో ఏ మూలన ఏ సంఘటన జరిగినా పోలీసుల కన్నా ముందే ఈనాడు, ఆంధ్రజ్యోతి దర్యాప్తు చేసి రిపోర్టును ప్రింట్ చేస్తున్నాయి. వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననమే ఎజెండాగా ఈ రెండు పత్రికలు ఏ చిన్న సంఘటన జరిగినా దానిని చిలువలు వలవులుగా చేసి మా నాయకునికి నేరాన్ని ఆపాదించే కుట్రలు చేస్తున్నారు. సింగయ్య మరణం ప్రమాదవశాత్తు జరిగిందని అందరికీ తెలిసిన సత్యం. చంద్రబాబు పర్యటనల్లోనూ చాలాసార్లు ఇలాంటి సంఘటనలు జరిగాయి. తొక్కిసలాటల్లో కూడా అమాయకులు బలయ్యారు. ఈ వాస్తవాలను పక్కనపెట్టి ఈనాడు, ఆంధ్రజ్యోతి వక్రీకరించి తప్పుడు కథనాలు రాస్తున్నారు.'జగన్ వాహనానికి సింగయ్య బలి', 'సింగయ్యను బలి తీసుకున్న జగన్ వాహనం' అంటూ ఈ రెండు పత్రికలు ప్రమాదాన్ని హత్యగా చూపించాలని క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారు. తన వాహనమే కాదు, ఆయన కళ్లముందు ఏదైనా ప్రమాదం జరిగినా వారిని ఆస్పత్రి చేర్చేవరకు ఆయన ఊరుకోరు. అలాంటిది జగనే స్వయంగా కారేసుకెళ్లి సింగయ్యను గుద్ది చంపాడు అన్నంతలా దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరికో ప్రమాదం జరిగితేనే తట్టుకోలేని జగన్, మా కార్యకర్త సింగయ్య చనిపోతే ఎలా వదిలేస్తారనుకున్నారు? ఆయన కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. ఇప్పటికే వారి కుటుంబాన్ని పరామర్శించి రూ. 10 లక్షల చెక్కును పార్టీ తరఫున వారి కుటుంబానికి అందజేయడం కూడా జరిగింది.చనిపోయిన వ్యక్తుల గురించి నీచంగా రాస్తున్నారువైయస్ జగన్ పర్యటన విజయవంతం కావడంతో ఓర్వలేక క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారు. వైఎస్ జగన్ ఎప్పటికీ బయటకు రావొద్దనే లక్ష్యంతో ప్రభుత్వం తప్పుడు కథనాలు రాయించి, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సత్తెనపల్లి పర్యటన విజయవంతం కావడంతో దాని మీద ఇప్పటికే మా నాయకులు గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద కేసులు పెట్టారు. నాకు కూడా నిన్న రాత్రి నోటీసులు ఇచ్చి వెళ్లారు. చంద్రబాబుని జైల్లో పెట్టామనే కక్షతో ఇప్పుడు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులందర్నీ లోకేష్ జైళ్లకు పంపుతున్నాడు. ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. -
వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య మృతి.. 10 లక్షల సాయం అందజేత
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా వెంగళాయపాలెనికి చెందిన పార్టీ కార్యకర్త సింగయ్య ప్రమాదం కారణంగా మృతిచెందారు. ఈ నేపథ్యంలో పార్టీ వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, బలసాని కిరణ్ కుమార్, నూరి ఫాతిమా వెంగళాయపాలెంలో సింగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం, పార్టీ తరఫున సింగయ్య కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కు అందజేశారు.ఈ సందర్బంగా మాజీ మంత్రి, పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘సింగయ్య వైఎస్సార్సీపీ కార్యకర్త. వైఎస్ జగన్ అభిమాని. వైఎస్ జగన్ పర్యటనలో కారు ప్రమాదం కారణంగా సింగయ్య మృతిచెందాడు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది. విషయం తెలుసుకోగానే వైఎస్ జగన్.. వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును సింగయ్య భార్యకు అందించాం. సింగయ్య మృతుని కూడా కూటమి ప్రభుత్వం రాజకీయం చేయాలని చూసింది.వైఎస్ జగన్ పర్యటనలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసులు పెడుతున్నారు. పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా ఎవరూ భయపడరు. వాటిపై న్యాయపోరాటం చేస్తాం. కానీ, వైఎస్సార్సీపీ నాయకుల్ని గాని కార్యకర్తలు గాని పోలీసులు అక్రమంగా నిర్బంధిస్తే చూస్తూ ఊరుకోం. వైఎస్ జగన్ పర్యటనకు ప్రజలు రానివ్వకుండా చేయాలని ప్రభుత్వం పోలీసులు ద్వారా కుట్ర పన్నింది. ఆ కుట్రను ఛేదించుకుంటూ వేలాది మంది జనం తరలివచ్చారు.మాజీ ఎంపీ మోదుగులు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..‘సింగయ్య వైఎస్సార్సీపీకి కరుడుగట్టిన కార్యకర్త. ప్రమాదంలో ఆయన చనిపోవడం బాధాకరం. ఈ విషయం తెలుసుకోగానే వైఎస్ జగన్ మమ్మల్ని అందరినీ సింగయ్య ఇంటికి వెళ్లి ఆ కుటుంబానికి అండగా ఉండమని ఆదేశించారు. వైఎస్ జగన్ పంపిన 10 లక్షలు ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును ఆ కుటుంబానికి అందించాం. సింగయ్య కుటుంబానికి పార్టీ అన్నివేళలా అండగా ఉంటుంది.పత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బాలసాని కిరణ్ కుమార్ మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య యాక్సిడెంట్లో చనిపోవడం బాధాకరం. ఆయన కుటుంబానికి ఎప్పుడు పార్టీ అండగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు. -
టార్గెట్ వైఎస్సార్సీపీ.. అంబటి సహా పలువురిపై కేసులు
సాక్షి, పల్నాడు: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం కేసులు పెడుతూనే ఉంది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా పార్టీ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.పల్నాడులో అనుమతులకు విరుద్ధంగా నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ చేశారని, ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించారంటూ వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, మాజీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొర్లకుంట వెంకటేశ్వర్లు తోపాటు మరికొంతమందిపై సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూడా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా కట్టెంపూడిలో బారికేడ్లు తొలగించి, పోలీసుల విధులకు ఆటంకం కలిగించి వారి పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ అంబటిపై కేసు ఫైల్ చేశారు. -
Sattenapalli: పోలీసులపై అంబటి విశ్వరూపం
-
రేపు రెంటపాళ్లకి వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: కూటమి ప్రభుత్వం వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడిన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల ఉపసర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని ఈనెల 18న మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించనున్నట్లు మాజీ మంత్రి, ఆ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు వెల్లడించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెంటపాళ్లలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని కూడా వైఎస్ జగన్ ఆవిష్కరిస్తారని తెలిపారు.వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. శాంతిభద్రతల పేరుతో పోలీసుల ద్వారా వైఎస్ జగన్ పర్యటనపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వైఎస్ జగన్ చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నా కూడా ఈ ప్రభుత్వం జీరి్ణంచుకోలేకపోతోంది.అసలు వైఎస్ జగన్ ఇంటి గడప దాటి బయట కాలు పెడితేనే చంద్రబాబు, లోకేశ్కి వణుకు పుడుతోంది. నిద్ర పట్టడం లేదు. పొగాకు రైతులను పరామర్శించడానికి పొదిలి వెళితే అలజడి సృష్టించడానికి కొంతమంది మహిళలను అడ్డుపెట్టుకుని రాళ్ల దాడికి దిగారు. మా కార్యకర్తలు, అమాయక రైతుల మీద టీడీపీ గూండాలతో దాడులు చేయించారు. తిరిగి మా నాయకులపైనే అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేశారు’ అని చెప్పారు. పర్యటనను అడ్డుకోవాలని చూస్తే ఊరుకోం ‘ఇటీవలే వ్యాపారి గుత్తా లక్ష్మీనారాయణ పోలీసుల వేధింపులు భరించలేక విషం తాగి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక మా నాయకులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతుంటే వారికి భరోసా ఇచ్చేందుకు వైఎస్ జగన్ వెళ్తున్నారు. ఆయన వెళ్లి పరామర్శిస్తే కూటమి దుశ్చర్యలు ప్రపంచానికి తెలిసిపోతాయనే భయంతో వైఎస్ జగన్ పర్యటనలపై ఆంక్షలు విధించి అడ్డుకోవాలని చూస్తున్నారు.ఇది అప్రజాస్వామికం. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు చంద్రబాబు, లోకేశ్ కుట్రలు పన్నుతున్నారు. పర్యటనలను అడ్డుకోవాలని చూస్తే సహించబోం. ప్రతిపక్ష నేత పర్యటనలను అడ్డుకోవడం, అలజడి సృష్టించేందుకు యతి్నంచడం కూటమి ప్రభుత్వానికే మంచిది కాదు.’’ అని అంబటి హితవు పలికారు. -
పోలీసులతో మమల్ని అణచలేరు: అంబటి రాంబాబు
గుంటూరు: వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులతో అణచలేరని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు జైలు నుంచి విడుదలైన తర్వాత అంబటి రాంబాబు మాట్లాడారు. ‘సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు బెయిల్ పై విడుదల కావడం జరిగింది..సుప్రీంకోర్టులో జరిగిన వాదనలు అనంతరం ఆయనను విడుదల చేయాలని సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆదేశించింది..కేసు నమోదు చేసిన తుళ్లూరు పోలీసుల పట్ల సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది..ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడాన్ని కోర్టు తప్పు పట్టింది. కేవలం చంద్రబాబుకు అనుకూలంగా వార్తలు రావటం లేదు అని కొమ్మినేని శ్రీనివాసరావు పై లక్ష్యకట్టి అరెస్ట్ చేశారు..చీమకి కూడా హాని చేయకుండా కలం కోసం పని చేస్తున్న జర్నలిస్ట్ను జైలులో పెట్టడం దుర్మార్గం. పోలీసుల అదుపులో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు పై అరమరావతి రాజధాని ప్రాంత ప్రజల ముసుగులో టీడీపీ గుండాలు దాడికి ప్రయత్నం చేశారు..రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత కేవలం మైక్ ముందే హోం మంత్రి.. ఇకపై డిబేట్లు పెట్టే అవకాశం లేదు అంటూ హోం మంత్రి అనిత మాట్లాడడం సిగ్గుచేటు. చీకటి పడిన తరువాత కొమ్మినేని శ్రీనివాసరావును విడుదల చేయాలని చంద్రబాబు, లోకేష్ జైలు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు..పోలీసులతో మమల్ని అణచలేరు’ అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. -
జగన్ గుంటూరు పర్యటనపై నారా లోకేష్ కుట్ర..
-
అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, గుంటూరు: చంద్రబాబు బెదిరింపు రాజకీయాలకు ఇక భయపడేదని వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ పర్యటనల విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై హాట్ కామెంట్స్ చేశారాయన. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి మాట్లాడుతూ..వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలను అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ నెల 18వ తేదీన రెంటపాళ్ల పర్యటనకు ఆటంకాలు కలిగిస్తోంది. జనాలను పంపి హింసకు ప్రేరేపించాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారు. ఈ క్రమంలోనే.. అనుమతి పేరిట విచిత్రమైన ఆంక్షలు పెడుతున్నారు. రెంటపాళ్లలో వైఎస్సార్సీపీ నేత నాగమల్లేశ్వరరావు పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. అతని కుటుంబ సభ్యుల పరామర్శకు జగన్ వెళ్తుంటే.. ప్రభుత్వం పిచ్చి చేష్టలకు దిగుతోంది. చనిపోయిన ఓ వ్యక్తి కుటుంబాన్ని పరార్శించడానికే జగన్ వెళ్తున్నారు. తమ కార్యకర్త చనిపోతే.. పార్టీ అధినేత పరామర్శించటం తప్పా?. మేమేమీ బహిరంగ సభలకు వెళ్లటం లేదు. కానీ పోలీసుల వ్యవహారశైలి చూస్తుంటే జగన్ అసలు బయటకు రావటానికి వీల్లేదన్నట్టుగా ఉంది. పొదిలిలో కూడా రైతుల మీద అక్రమంగా కేసులు పెట్టి రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. బందోబస్తు ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత పోలీసులదే. అంతేకానీ జగన్ను పర్యటించొద్దని అనడం కరెక్టు కాదు. జగన్ పర్యటనలో హింస సృష్టించేందుకు చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారు. అధికారం ఉందని అతిగా ప్రవర్తించద్దని ఆ తండ్రీకొడుకులకు చెప్తున్నాం. జనాన్ని పెట్టి కోడిగుడ్లు, టమోటాలు వేయించాలనుకోవటం దారుణం. జనాన్ని అణచి వేయాలనుకుంటే కుదరదు. చంద్రబాబు హెచ్చరికలు ఏపాటివో మా చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాం. ఆయన రాజకీయాలను చూసి మేము భయపడేది లేదు’’ అని అంబటి అన్నారు. -
తండ్రి, కొడుకులని ఏకిపారేసిన అంబటి రాంబాబు
-
చంద్రబాబు, లోకేష్ చెప్పేవన్నీ అబద్ధాలే: అంబటి
సాక్షి, గుంటూరు: ఏడాది కూటమి పాలనలో సూపర్ సిక్స్ను అమలు చేసేశాం అంటూ నిసిగ్గుగా సీఎం చంద్రబాబు ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరులోని క్యాంప్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడిన ఆయన, సూపర్సిక్స్తో పాటు 143 హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేని అసమర్థ పాలన చూస్తున్నామని ఆక్షేపించారు. అయినా ఎల్లో మీడియాలో అద్భుతమని పొగిడించుకోవడం, గొప్ప పాలకుడని డప్పు కొట్టించుకోవడం చూసి ప్రజలు ఏవగించుకుంటున్నారని గుర్తు చేశారు. చివరకు తల్లికి వందనం పథకంలోనూ ఏకంగా 30 లక్షల మందిని తగ్గించారని అంబటి రాంబాబు గుర్తు చేశారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:నిస్సిగ్గుగా ఆత్మస్తుతి:కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా చంద్రబాబు పెద్దపెద్ద ప్రకటనలు ఇచ్చారు. జాతీయ మీడియాలో సక్సెస్ స్టోరీలు రాయించారు. హైదరాబాద్ నుంచి ఎల్లో మీడియా ఛానళ్లను పిలిపించుకుని, ప్రత్యేక ఇంటార్వ్యూలు ఇచ్చి భజన చేయించుకున్నారు. ఆ మూడు ఎల్లో మీడియా సంస్థల ప్రతినిధులు చంద్రబాబే సిగ్గుపడే స్థాయిలో ఆయనను ప్రశంసించారు. అద్భుతమైన పొగడ్తలతో డప్పు కొట్టే కార్యక్రమం చేశారు. అంత నిస్సిగ్గుగా చంద్రబాబు ఆత్మస్తుతి కొనసాగింది.తల్లికి వందనంలోనూ వంచన:సూపర్సిక్స్లో తల్లికి వందనం పథకాన్ని తొలి ఏడాది ఎగ్గొట్టేశారు. ఈ ఏడాది ఇస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, తాను అధికారంలోకి వస్తే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ తల్లికి వందనం చొప్పున ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. మా ప్రభుత్వంలో 84 లక్షల మంది పిల్లలకు అమ్మ ఒడి ఇచ్చాం. కానీ, ఈరోజు చంద్రబాబు కేవలం 58 లక్షల మందికే ఇస్తున్నారు. అంటే 30 లక్షల మంది పిల్లలకు ఎగ్గొట్టేశారు. వైఎస్ జగన్ రూ.15 వేలు ఇస్తూ, టాయిలెట్లు, స్కూల్స్ నిర్వహణ కోసం రూ.2 వేలు మినహాయించారు. దాన్ని ఆనాడు నారా లోకేష్ పెద్ద ఎత్తున విమర్శిస్తూ రెండు వేలు లాగేశారు. రూ.13 వేలు మాత్రమే ఇచ్చారని చెప్పరాని భాషలో తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.కానీ, ఇప్పుడు కూడా అవే రూ.13 వేలు ఇచ్చారు. స్కూళ్ల కోసం, విద్యా రంగం కోసం మిగిలిన మొత్తం వ్యయం చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అంటే మేం చేస్తే తప్పు, మీరు చేస్తే మాత్రం అది ఒప్పు అవుతుందా? ఇలా ఊరసవెల్లిలా మాట్లాడటానికి నారా లోకేష్కు సిగ్గుందా?. తల్లికి వందనంపై ఒకవైపు తండ్రి సీఎం చంద్రబాబు మొత్తం బడ్జెట్ రూ.10,091 కోట్లు అంటుంటే, మరోవైపు ఆయన కొడుకు మంత్రి నారా లోకేష్ మాత్రం రూ.8,745 కోట్లు అని చెబుతున్నారు. మరి ఇలా ఇద్దరు వేర్వేరుగా ఎందుకు తప్పుడు లెక్కలు చెబుతున్నారో అర్థం కావడం లేదు.సూపర్ సిక్స్కు రూ.81 వేల కోట్లు కావాలి:సూపర్ సిక్స్తో పాటు 143 హామీలను ఇచ్చి, వాటిని నెరవేరుస్తామని మాట ఇచ్చి, ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారు. తరువాత అన్ని హామీలను గాలికి వదిలేశారు. వాటికి కావాల్సిన నిధులను కూడా కేటాయించలేకపోతున్నారు. సూపర్ సిక్స్ అమలు చేయాలంటే రూ.81 వేల కోట్లు అవసరం. వాటి అమలు లేదు. మరోవైపు ఈ ఒక్క ఏడాదిలోనే ఏకంగా రూ.1,58,604 కోట్లు వివిధ సంస్థల నుంచి రికార్డు బ్రేక్ చేస్తూ అప్పులు తెచ్చారు.ఈ సొమ్ము ఏం చేశారో తెలియదు. కూటమి పాలన ఇంత దౌర్భాగ్యంగా ఉంటే, తమ పాలన అద్భుతం అని ఎల్లో మీడియాలో చెప్పుకోవడానికి సిగ్గు పడాలి. తల్లికి వందనంలో దగా, మోసం. విద్యాశాఖ మంత్రి లోకేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అమలు చేసిన అమ్మ ఒడి లెక్కలు తనకు అర్థం కావడం లేదంటూ అమాయకంగా మాట్లాడుతున్నాడు. ఆ మాత్రం అర్థం కాని మొద్దు అబ్బాయినని లోకేష్ అంగీకరిస్తున్నారా?.నాడు పథకాలకు రూ.4.58 లక్షల కోట్లు:వైఎస్సార్సీపీ కేవలం నాలుగు పేజీల మేనిఫేస్టోను విడుదల చేసి, వాటిలో ఏడాదిలోనే 90 శాతం అమలు చేసింది. తొలి ఏడాదిలోనే 3.58 కోట్ల మంది లబ్ధిదారులకు మేలు చేసింది. రూ.40,627 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశాం. అయిదేళ్ళలో ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) కింద రూ.2,73,756.17 కోట్లు లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశాం. నాన్ డీబీటీ కింద రూ.1,84,604.32 కోట్లు ప్రయోజనం చేకూర్చాం. అలా మొత్తం రూ.4,58,360.43 కోట్లతో అయిదేళ్ళలో ప్రజలకు వివిధ పథకాల కింద ప్రయోజనం కలిగించాం.మహిళలకు ఇచ్చిన హామీల అమలు ఏదీ?:ఆడబిడ్డ నిధి ప్రకారం 18 ఏళ్లు నిండిన మహిళలు రాష్ట్రంలో 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 59 ఏళ్ళ వారు 1.80 కోట్ల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.1500 చొప్పున ఇవ్వాల్సి వస్తే ఏడాదికి రూ.32,400 కోట్లు అవసరం. గత ఏడాది పూర్తిగా ఈ పథకం ఎగ్గొట్టారు. ఈ ఏడాది ఇస్తారో లేదో తెలియదు. దీపం పథకం కింద 1,59,20,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.ఒక్కో కుటుంబానికి మూడు సిలెండర్లు ఇవ్వాలంటే ఒక్కో సిలెండర్ రూ.850 చొప్పున మొత్తం ఏడాదికి రూ.4,083.48 ఖర్చు చేయాల్సి ఉంది. కానీ చంద్రబాబు కేవలం ఒక్క సిలెండర్ మాత్రమే ఉచితంగా ఇచ్చి, దానికి చేసిన వ్యయం రూ.865 కోట్లు మాత్రమే. దీపం పథకాన్ని అమలు చేసేశామని చెప్పుకున్నారు. ఈ పథకంలో మొత్తం రూ.3218.48 కోట్లు ఎగ్గొట్టారు. ఉచిత బస్సు అన్నారు. ఈ పథకం అమలు చేస్తే ఏడాదికి రూ.3500 కోట్లు అవసరం. గత ఏడాది పూర్తిగా దీనిని ఎగ్గొట్టేశారు.హామీల అమలుకు కేటాయింపులు ఏవీ?:యాబై ఏళ్ళకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ అన్నారు. రాష్ట్రంలో ఈ కేటగిరిలో మొత్తం 20 లక్షల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.4000 చొప్పున పెన్షన్ ఇవ్వాలంటే ఏడాదికి రూ.9600 కోట్లు ఇవ్వాలి. గత ఏడాది ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3000 భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. అలా ఇవ్వాల్సి వస్తే రూ.7200 కోట్లు కేటాయించాల్సి ఉంది. కానీ, ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అలాగే రైతుభరోసా కింద కేంద్రంతో సంబంధం లేకుండా ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వీరికి ఏడాదికి రూ.1,716 కోట్లు ఇవ్వాల్సి ఉంటే, దానికీ పంగనామాలు పెట్టేశారు.సాక్షి కార్యాలయాలపై దాడులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి:కొమ్మినేని శ్రీనివాసరావు వంటి సీనియర్ జర్నలిస్ట్ను కక్ష సాధింపుతో అరెస్ట్ చేసిన ఘటనపై సుప్రీంకోర్డు మొట్టికాయలు వేసింది. అయినా గుంటూరులో తెలుగుదేశం పార్టీ మహిళలు వైయస్ భారతమ్మ క్షమాపణలు చెప్పాలని ధర్నా చేశారు. అంతకు ముందు టీడీపీ కార్యకర్తలు పలుచోట్ల సాక్షి మీడియాపై విషం చిమ్మారు. కార్యాలయాలపై దాడులు చేశారు. తక్షణం వీటికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.సభ్యత, సంస్కారంతో వ్యవహరించాలని చంద్రబాబు, లోకేష్ను హెచ్చరిస్తున్నాం. ప్రశ్నించే ప్రతి ఒక్కరిని తప్పుడు కేసులతో భయపెట్టాలని చూస్తున్నారు. వైఎస్సార్సీపీని భూ స్థాపితం చేయాలని చంద్రబాబు కలలు కంటున్నారు. తెలుగుదేశం తప్ప ఈ రాష్ట్రంలో మరే రాజకీయ పార్టీ ఉండకూడదని ఆయన అనుకుంటున్నారు. కానీ, అది ఏ మాత్రం సాధ్యం కాదు. నిజానికి రాబోయే రోజుల్లో చంద్రబాబు మళ్లీ రాష్ట్రం వదిలి పారిపోయే పరిస్థితి వస్తుందని అంతా అంటున్నారని అంబటి రాంబాబు చెప్పారు. -
గుంటూరు జిల్లాలో YSRCP లీగల్ సెల్ మీటింగ్
-
Ambati Rambabu: నాకు అంత దమ్మూ లేదు.. డబ్బూ లేదు...
-
‘వైఎస్సార్సీపీ లీగల్ సెల్ పనితీరు అద్భుతం’
గుంటూరు: తమ పార్టీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం అక్రమంగా బనాయిస్తున్న కేసుల విషయంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అద్భుతంగా పనిచేస్తోందని మాజీ మంత్రి, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ప్రశంసించారు.ఈరోజు(శుక్రవారం, జూన్ 13) గుంటూరులో జిల్లా వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సదస్సు నిర్వహించారు. ఇందులో అంబటి రాంబాబు, పోతిన మహేష్, మాజీ ఎంపీ మాదుగుల వేణుగోపాల్రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, సుదర్శన్రెడ్డిలతో పాటు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు పాల్గొన్నారు. వీరితో పాటు ఏడు నియోజకవర్గాల నుంచి న్యాయవాదులు భారీ స్థాయిలో తరలివచ్చారు. దీనిలోభాగంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు నాయకులు పై తప్పుడు కేసులో బనాయిస్తోంది. ఒక్కొక్కరి పైన 10 కేసులు తక్కువ పెట్టడం లేదు. పార్టీ నాయకుల్ని కార్యకర్తలని వేధించాలన్న లక్ష్యంతోనే అక్రమ కేసులతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ప్రభుత్వం బనాయించే అక్రమ కేసులపై వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అద్భుతంగా న్యాయపోరాటం చేస్తుంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు, నాయకులకు లీగల్ సెల్ అండగా ఉండి మేమున్నాము అనే భరోసా కల్పిస్తోంది. గుంటూరు జిల్లా లీగల్ సెల్ అద్భుతంగా పనిచేస్తుంది వారికి అభినందనలు’ అని పేర్కొన్నారు.రాష్ట్రంలో హక్కులను ప్రభుత్వం కాలరాస్తోంది.. రాష్ట్రంలోని ప్రజల హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాస్తోందని వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఆస్తులు ధ్వంసం చేశారు. ప్రభుత్వం పథకం ప్రకారమే అక్రమ కేసులు బనాయిస్తోంది. ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులపై వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రతినిధుల న్యాయపోరాటం అద్భుతం’ అని కొనియాడారు.ఇవి పథకం ప్రకారం చేసే దాడులుకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక పథకం ప్రకారం.. వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు చేస్తోంది. యాక్టివ్గా ఉన్న కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తోంది. సోషల్ మీడియా వారి పైన కూడా ఒక్కొక్కరిపై 10కి తగ్గకుండా కేసులు పెట్టి రాష్ట్రమంతా తిప్పారు. ప్రభుత్వమే వ్యవస్థీకృత నేరానికి పాల్పడుతోంది. ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులపై వైఎస్సార్సీపీ లీగల్ సెల్ వైఎస్ జగన్ ఆదేశాలతో న్యాయపోరాటం చేస్తుంది. పార్లీ నాయకుల్ని, కార్యకర్తల్ని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కాపాడుకుంటుంది. పార్టీకి కష్టకాలంలో పనిచేసిన వారందరినీ పార్టీ కచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది’ అని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్రెడ్డి స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే అరాచకం మొదలుపెట్టారుకూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అరాచకం మొదలుపెట్టిందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు సుదర్శన్రెడ్డి ధ్వజమెత్తారు. ‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులు చేశారు. చాలామంది కార్యకర్తలు ఊర్లు వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పుడప్పుడు వాళ్లు తిరిగి ఫంక్షన్లకు వచ్చిన వాళ్లపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారు. లీగల్ సెల్ .. పార్టీ కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటుంది.. రక్షిస్తుంది. కూటమి నేతలు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయట్లేదు అని ప్రశ్నించినందుకు సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు నమోదు చేశారు. ఒక్కొక్కరిపై 15 నుంచి 20 కేసులు నమోదు చేసి రాష్ట్రమంతా తిప్పారు. కష్ట కాలంలో పనిచేసిన ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తిస్తుంది’ అని ఆయన తెలిపారు. -
కొమ్మినేనిపై సుప్రీం తీర్పు.. అంబటి రియాక్షన్
-
Ambati: పోలీసుల వేధింపులు తట్టుకోలేక లక్ష్మీనారాయణ ఆత్మహత్యాయత్నం చేశారు
-
లోకేష్ పర్యవేక్షణలోనే పొదిలి ఘటన: అంబటి
సాక్షి, గుంటూరు: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పొదిలి పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఉద్రిక్తతలపై వైఎస్సార్సీపీ స్పందించింది. ఇదంతా ఆర్గనైజ్డ్గా వ్యవహారమని, మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..జగన్ పొదిలి వెళ్లింది పొగాకు రైతులకు మద్దతు తెలిపేందుకు. గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడిపోతున్నారు. జగన్ రాక నేపథ్యంలో జనం భారీగా తరలి వచ్చారు. నలుగురైదుగురు మహిళలను పెట్టి నిరసన చేయించింది టీడీపీ నాయకులే. తెనాలి పర్యటన సమయంలోనూ ఇలాగే చేశారు. జగన్ పర్యటనల్లో నిరసనలు జరిగేలా మంత్రి నారా లోకేష్ చేస్తున్నారు. పొదిలి వ్యవహారాన్ని లోకేష్ దగ్గరుండి పర్యవేక్షించారు. నల్లబెలూన్లు ఎగరేయడం, చెప్పులు విసిరించడం ఆర్గనైజ్డ్ కాదా? జగన్ పర్యటనలు చేయకూడదా?. మీరు అధికారంలో శాశ్వతంగా ఉంటారా? అని అంబటి ప్రశ్నించారు. .. పోలీస్ వ్యవస్థ టీడీపీ నాయకులకు అండగా ఉంది. వైఎస్సార్సీపీ నేతలపై, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తోంది. ఇదంతా లోకేష్ ఆధ్వర్యంలోనే నడుస్తోంది ఆ వేధింపులు, బెదిరింపులు భరించలేక కొందరు బలవన్మరణానికి ప్రయత్నిస్తున్నారు. రాజుపాలెం మండలం పెదనెమలిపురికి చెందిన లక్ష్మీనారాయణ వైఎస్సార్సీపీ కార్యకర్త. ఆయన్ని గత కొన్ని రోజులుగా సివిల్ మ్యాటర్లో పోలీసులు వేధిస్తున్నారు. లక్ష్మీ నారాయణను సత్తెనపల్లి డీఎస్పీ బూతులు తిట్టారు. ఆ వేధింపులు భరించలేకనే ఆయన సెల్ఫీ వీడియో తీసి సూసైడ్కు ప్రయత్నించారు. ఆ వేధింపులు ఏస్థాయిలో ఉన్నాయో ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది.... ప్రస్తుతం లక్ష్మీ నారాయణ గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ రేపు(గురువారం, జూన్ 12) వస్తున్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంపై జనం తిరగబడతారు. తూటాలు ఉపయోగించే పరిస్థితి కూడా రావొచ్చు’’ అని అంబటి జోస్యం పలికారు. -
కిర్రాక్ ఆర్పీ, సీమ రాజాపై ఫిర్యాదు చేస్తే చర్యలు ఉండవు: అంబటి
-
కొమ్మినేని అరెస్ట్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగం: అంబటి రాంబాబు
-
‘కొమ్మినేనిపై చంద్రబాబు కక్ష గట్టారు.. సాక్షి ఆఫీస్పై ఉన్మాదపు చర్య’
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని.. కూటమి ప్రభుత్వం దానిని అసలే పట్టించుకోదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీనియర్ పాత్రికేయుడు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యత కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ నేపథ్యంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.కూటమి ప్రభుత్వం అక్రమ కేసుల్లో కొత్త సంప్రదాయానికి తెర లేపింది. కిర్రాక్ ఆర్పీ, సీమ రాజాలాంటిళ్లు దారుణంగా మాట్లాడుతున్నారు. వాళ్లపై ఫిర్యాదులు చేసినా చర్యలు ఉండవు. ఎల్లో చానెల్స్ దారుణంగా మాట్లాడుతున్నాయి. అయినా పట్టించుకోరు. సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని అరెస్ట్ అప్రజాస్వామికం. చంద్రబాబు ఆయనపై కక్ష గట్టారు. కొమ్మినేనిని దారుణంగా తిడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. పోగేసుకొచ్చిన జనాలతో సాక్షి ఆఫీస్ మీద జరిపారు. మరి దీనిని ఏమనాలి?. ఇది ఉన్మాదపు చర్య కాదా?.. అని అంబటి ప్రశ్నించారు.కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్(Kommineni Srinivasa Rao Arrest) అక్రమం. డైవర్షన్ పాలిటిక్స్కు ఇదొక ఉదాహరణ. అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. లేని అంశాన్ని ఉన్నట్లుగా చూపేందుకు చంద్రబాబు,ఆయన అనుకూల మీడియా ప్రయత్నం చేస్తోంది. కొమ్మినేని శ్రీనివాసరావు ఎంతో సీనియర్ జర్నలిస్ట్. చంద్రబాబు తప్పుల్ని ఖండించే ప్రయత్నం చేసినందుకు ఎన్టీవీ పై ఒత్తిడి తెచ్చి కొమ్మినేని లైవ్ షో ఆపేశారు. కొమ్మినేనిని తీసేస్తేనే ఛానల్ ప్రసారాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఎన్టీవీలో తీసేస్తేనే కొమ్మినేని సాక్షిలో చేరారు. తన డిబేట్లలో కొమ్మినేని నిక్కచ్చిగా మాట్లాడతారు. మా సామాజికవర్గమై మమ్మల్నే విమర్శిస్తావా అని కొమ్మినేని పై చంద్రబాబు కక్ష కట్టాడు. టివి5,ఏబీఎన్ లో జరిగే డిబేట్లకు ఆ ఛానల్ యాజమాన్యాలు బాధ్యత వహిస్తాయా?. తోటి జర్నలిస్ట్ ఒకడు ‘ఒరేయ్’ అని సంభోదిస్తాడు. ఏ కుక్క బిస్కెట్లు తిని మాట్లాడుతున్నారు టీవీ5,ఏబీఎన్లో?. కృష్ణంరాజు వ్యక్తం చేసిన అభిప్రాయం తప్పు కావొచ్చు. దానికి ఛానల్కి, కొమ్మినేనికి ఏం సంబంధం?. చంద్రబాబు దేశంలోని అన్ని మీడియాలను మభ్యపెట్టినా... సాక్షిని మభ్యపెట్టలేకపోయాడు. అందుకే సాక్షి పై కక్ష కట్టి బురద జల్లుతున్నాడు. చంద్రబాబు ప్రేమ అమరావతి రైతుల మీద కాదు...అమరావతిలో తాను దోచుకునే భూముల మీద. జగన్ మోహన్ రెడ్డి, భారతిపై చాలా దారుణంగా పోస్టులు పెట్టిన వాళ్ల పై చర్యలు లేవు. నేనే స్వయంగా కిరాక్ ఆర్పీ,సీమ రాజా మీద ఫిర్యాదు చేశా.. కనీసం పట్టించుకోలేదు. కానీ కొమ్మినేని వంటి వారిని మాత్రం హైదరాబాద్ వెళ్లి అరెస్ట్ చేశారు. ఇదెక్కడి ధర్మం?. బెయిల్ రాకుండా చేసేందుకే కొమ్మినేని పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. సాక్షి ఛానల్ను ఆపాలని చంద్రబాబు, కాంగ్రెస్ కలిసి కుట్రలు పన్నారు. కేసులుపెట్టి ఛానల్ ను ఆపాలని ప్రయత్నించారు...కానీ తట్టుకుని సాక్షి నిలబడింది. టీవీ ఛానల్స్ లో కొన్ని వందల డిబేట్లు నడుస్తాయి...దానికి ఆ ఛానల్ ను బాధ్యుల్ని చేస్తారా?. సాక్షి కార్యాలయాల పై దాడులు చేస్తారా. ఒక పథకం ప్రకారం మొదట టీడీపీ, తర్వాత లోకేష్, ఆ తర్వాత చంద్రబాబు, ఆ వెంటనే పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తారు. నేనూ అనేక డిబేట్లలో పాల్గొన్నా. డిబేట్లకు వచ్చిన వ్యక్తులు మాట్లాడితే ఆ ఛానల్స్ కు ఆపాదిస్తారా?. రాష్ట్రంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయ్. కానీ కొమ్మినేని అరెస్ట్ ఒక్కటే తమకు ముఖ్యమైన పనిలాగా చంద్రబాబు పనిచేస్తున్నారు. చంద్రబాబు చాలా దారుణమైన కార్యక్రమానికి పూనుకున్నారు.బాధ్యత కలిగిన టీడీపీ నాయకులు కూడా సాక్షి కార్యాలయం పైకి దాడులకు వెళతారు. సాక్షి కార్యాలయాలపై దాడులకు జనాన్ని పోగేసుకొచ్చారు. సందుదొరికింది కదా అని సాక్షి పైనో మరో కార్యాలయం పైనో దాడులు చేయడం కరెక్టేనా?. ఇలాగైతే సమాజం ఎటుపోతుంది. మాకూ వ్యతిరేకంగా ఉన్న మీడియాలకు కార్యాలయాలున్నాయ్ కదా!. అక్రమ కేసులుపెట్టి అరెస్ట్ చేస్తారు, జైల్లో వేస్తారు అంతకంటే ఏం చేయగలరు?. ఇప్పటికే చాలామందిని జైల్లో పెట్టారు కదా. పరిపాలన చేతకాని వారే ఇలా అరెస్టులతో కాలక్షేపం చేస్తారు. అరెస్టుల పైన పెట్టిన శ్రద్ధ ప్రజల సమస్యల పై పెడితే బాగుంటుంది అని అంబటి రాంబాబు చంద్రబాబుకి హితవు పలికారు. -
ఈ పతనం ఏ లోతుల్లోకి?
కమ్మ కులంలో పుట్టిన వ్యక్తి వైసీపీలో ఎలా ఉంటాడు? ఇది చట్ట విరుద్ధమైన చర్యగా కనిపించింది ఒక డీఎస్పీకి. ఇటువంటి సంఘ విద్రోహ చర్యలను అస్సలు క్షమించలేని సదరు డీఎస్పీ అటువంటి ఒక వ్యక్తికి తనదైన ట్రీట్మెంట్ ఇప్పించారు. పల్నాడు జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ అనే ఆ వ్యక్తి పోలీసు వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు.గుంటూరులో పని చేసే ఒక పోలీసు ఇన్స్పెక్టర్కు ప్రతిపక్ష రాజకీయ నేతల ముఖాల్లో శత్రుదేశం సైనికులు కనిపిస్తారట! ఆ నేత ఏ స్థాయి వాడైనా సరే! మొన్న ఏదో నిరసన కార్యక్రమంలో వైసీపీ నేత అంబటి రాంబాబు ఆ ఇన్స్పెక్టర్కు ఎదురుపడ్డారు. శత్రు సైనికుడిని చూసిన ఆగ్రహం ఆ పోలీసును ఆవహిం చింది. తక్షణమే పళ్ళు పటపట కొరుకుతూ, గుడ్లను గుర్రున ఉరుముతూ రాంబాబుపై ఆ పోలీసాయన లంఘిస్తున్న విజు వల్స్ టీవీల్లో కనిపించాయి.తెనాలి ఘటన తెలిసిందే! ఓ మఫ్టీ కానిస్టేబుల్కూ, ముగ్గురు యువకులకూ ఏదో ఒక చిన్న వివాదం జరిగింది. ఈ మఫ్టీ కానిస్టేబుల్ మీద ఆ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ జవాన్లందరికీ ప్రత్యేకమైన అభిమానం ఉంటుందట! ఈ మఫ్టీ బ్యాచ్ సివిల్ డ్రెస్లో ఉంటూనే, లా అండ్ ఆర్డర్ను చక్కబరుస్తూ, పోలీసు సహచరులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తుంటారట! అటువంటి మఫ్టీ కానిస్టేబుల్ను అనామక యువకులు ప్రశ్నించ డమేమిటి? అందులో దళితులు! ఆ యువకులు కట్టు తప్పారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వాళ్లకు బుద్ధి చెప్పాలని నిర్ణయానికి వచ్చారు. భారత న్యాయ సంహితలోని తమకు తోచిన సెక్షన్లన్నింటితో కేసులు పెట్టారు. నడిరోడ్డు మీద వారిని పడుకోబెట్టి అరికాళ్ళపై బెత్తాలతో చావబాది ఆటవిక న్యాయాన్ని అమలు చేసిన తీరు నాగరిక సమాజాన్ని నివ్వెర పరిచింది.కూటమి ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని ప్రైవేటు సైన్యంగా మార్చేసిన ఫలితం ఇది. స్వామికార్యంతో పాటు స్వకార్యం చక్కబెట్టుకోవచ్చు అనుకునే కొందరు పోలీసులకు ఈ విధానం బాగా నచ్చినట్టుంది. పొలిటికల్ బాసులను సంతృప్తి పరుస్తూనే సొంత పనులు చేసుకుంటున్నారు. పొలిటికల్ బాసులు ఏం చేసినా, ఏం చెప్పినా చిత్తం అనే స్థాయికి కొందరు దిగజారిపోయారు. అనంతపురం జిల్లాలో ఒక దళిత బాలికను బెదిరిస్తూ 14 మంది పాలక పార్టీ అనుయాయులు ఆరు మాసా లుగా అత్యాచారం చేస్తున్న పైశాచిక ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సాక్షి మీడియా ద్వారా ఈ దారుణం వెలుగు చూసేంత వరకు పోలీసులు కళ్ళు మూసుకుని కూర్చో వడం క్షమించరాని నేరం. ఇప్పుడు కూడా కేసును పలుచన చేసేటందుకు పొలిటికల్ బాసులు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే ఈ కేసు పోలీసు యంత్రాంగానికి ఒక శీలపరీక్ష లాంటిదే! వైఎస్సార్ జిల్లాకు చెందిన ఓ మంత్రి సతీమణి పోలీసులను అడిగి మరి సెల్యూట్ కొట్టించుకుంటున్నదనే వార్తలు కూడా విన్నాము. పోలీసు యంత్రాంగం పట్ల కూటమి నేతల ప్రవర్తన అది.ఏడాది కూటమి పాలనలోని అవినీతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో! గల్లీగల్లీలో గంజాయి, చీప్ లిక్కర్ల కంపుతో అవినీతి పోటీపడుతున్నది. కడప జిల్లా టీడీపీ నాయకుడు ఒకరు బహిరంగ సమావేశంలో మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలయ్యింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ఛోటామోటా అధికార పదవుల్లో ఉన్నవాళ్లు తమ ఖాళీ లెటర్ హెడ్పై సంతకం చేసి ఇచ్చినందుకు పాతిక, ముప్పై వేల నుంచి ఐదు లక్షల వరకు వసూలు చేస్తున్నారని ఆ నాయకుడు ఆరోపించారు. చిన్నచిన్న రికమండేషన్లకు కూడా వెలకట్టి వసూలు చేస్తున్న సంస్కృతిని రాష్ట్రమంతటా ప్రవేశ పెట్టారట! ఆ మధ్య ఓ యెల్లో పత్రికలోనే ఇటువంటి వార్త ఒకటి వచ్చింది. గోదావరి జిల్లాలోని ఒక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మార్వోకు తన లెటర్ హెడ్ పుస్తకాన్ని ఇచ్చి, దీని ద్వారా తిరుపతి దర్శనం రికమండేషన్లు అమ్మి తనకు నెలకో లక్ష రూపాయలు జమ కట్టాలని ఆర్డర్ వేశారని ఆ పత్రిక రాసింది. ప్రజా ప్రతినిధులు తమ ప్రాంతంలోని రెవెన్యూ, పోలీసు అధికారులకు టార్గెట్లు పెట్టి మరీ నెల మామూళ్లు వసూలు చేసి ఇవ్వాలని వేధిస్తున్న ఒక విచిత్ర పరిణామం ఈ ఏడాదిలో ఏపీ అంతటా వ్యాపించింది. ప్రజలకు సేవకులుగా ఉండాల్సిన ప్రతినిధులు ప్రతి చిన్న పనికీ, ప్రతి చిన్న రికమండేషన్కూ కూడా వెలకట్టి వసూలు చేస్తున్న ప్రజాస్వామ్యం రాష్ట్రంలో అమలవుతున్నది.నాయకుని స్థాయిని బట్టి అవినీతిస్థాయి కూడా పెరుగు తుంది. ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ ఎక్కడ చూసినా కనిపిస్తున్నది. మద్యం మామూళ్లు ప్రజాప్రతినిధులకు హక్కు భుక్తంగా మారాయి. ఇవి చాలదన్నట్టు దర్జాగా భూకబ్జాలు అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతున్నాయి. విజయవాడ నగరం నడిబొడ్డున అర్ధ శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన శాతవాహన కాలేజీ స్థలం ఆక్రమణ కోసం జరుగుతున్న రౌడీయిజం తాజా ఉదాహరణ. సాక్షాత్తూ పాలక పార్టీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా తనను కిడ్నాప్ చేశారని కళాశాల ప్రిన్సిపాల్ ఆరోపించారు. అయినా చట్టం స్పందించలేదు. అర్ధరాత్రి పూట బందిపోటు దొంగల మాదిరిగా కళాశాల షెడ్లను కూల్చివేశారు. లాఠీలు కదల్లేదు. ప్రతిపక్ష కార్యకర్తల మీద, సామాన్య ప్రజల మీద జులుం చూపిస్తున్న పోలీసు యంత్రాంగం, అధికార పార్టీ పెద్దలు బడిని మింగినా, గుడిని మింగినా చోద్యం చూడటానికే పరిమితమైపోతున్నారు. పోలీసు యంత్రాంగాన్ని ప్రైవేట్ సైన్యంగా దిగజార్చిన పర్యవసానం కనిపిస్తున్నది.ఇక అత్యున్నత స్థాయి ప్రభుత్వ పెద్దల అవినీతి వేలు లక్షల ఎకరాలు, వందల వేల కోట్ల టెండర్ల కొలమానంలో వెలిగి పోతున్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమరావతి పేరుతో చేస్తున్న ఆర్భాటపు ప్రణాళికల వెనుక అంతులేని అవినీతి వ్యూహం తప్ప, వాస్తవికత ఇసుమంత కూడా లేదని వారు బల్లగుద్ది చెబుతున్నారు. రాజధాని కోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న 55 వేల ఎకరాలకు తోడు మరో 45 వేల ఎకరాలను సేకరించాలన్న ప్రతిపాదనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందులో ఐదు వేల ఎకరాలు సరికొత్తగా నిర్మించబోయే అంతర్జాతీయ విమానాశ్రయానికి కావాలట! ఇప్పుడు అందుబాటులో ఉన్న గన్నవరం విమానా శ్రయం సంగతి ఏమిటి? గన్నవరంలో 2024–25 సంవత్సరంలో 9,279 విమానాలు ల్యాండ్ అయ్యాయని రికార్డులు చెబుతున్నాయి. దాని వైశాల్యం 1,265 ఎకరాలు, కోల్కతా విమానాశ్రయం వైశాల్యం సుమారు 1,600 ఎకరాలు. ఇదే కాలంలో అక్కడ ల్యాండ్ అయిన విమానాల సంఖ్య ఒక లక్షా నలభై ఆరు వేల పైచిలుకు. గన్నవరం విమానాశ్రయం కోసం తలపెట్టిన అదనపు భూసేకరణను కూడా దృష్టిలో పెట్టుకుంటే ఎయిర్ ట్రాఫిక్ ఇరవై రెట్లు పెరిగినా గన్నవరం ఎయిర్పోర్ట్ నిక్షేపంగా సరిపోతుంది. అమరావతిలో ఇప్పటికే టెండర్లు పిలిచిన పరిపాలనా భవనాల ఆర్భాటపు అంచనాలు కూడా ఈ కోవలోనివే!ఎన్ని పాలనా భవనాలను నిర్మించినా, ఎన్ని సంస్థలను రప్పించినా అక్కడ నివసించవలసిన జనాభా ఏ విధంగా పెరుగుతుంది? ఎన్ని లక్షల మందికి ఉపాధిని, వసతిని అందు బాటులోకి తేగలరన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్ని భవనాలను నిర్మించగానే జనం బిలబిలమంటూ వచ్చి నిండి పోరు కదా! ఇటువంటి ఆర్భాటాలతోనే అంచనా లేకుండా నిర్మించిన కొన్ని చైనా నగరాలు ఘోస్ట్ సిటీలుగా మిగిలిపోయిన ఉదంతాలను పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. వేలకోట్ల రూపా యల అప్పు తెచ్చి ఖర్చు చేస్తున్న అమరావతి మరో ఘోస్ట్ సిటీగా మిగిలిపోతే పెద్దలకు గిట్టుబాటు కావచ్చునేమో గాని కొన్ని తరాల వరకు ఆంధ్ర ప్రజలు దానికి మూల్యం చెల్లించ వలసి ఉంటుంది. వడ్డే శోభనాద్రీశ్వర రావు వంటి తొలితరం తెలుగుదేశం నాయకులు కూడా అమరావతి ఊహల పందిరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.విచ్చలవిడి అవినీతి, వ్యవస్థల విధ్వంసం, అమరావతి పేరుతో జరుగుతున్న ప్రమాదకర క్రీడలు ఒకపక్క సామాన్య ప్రజలను గడ్డిపోచల కింద జమ కట్టే పెత్తందారీ పోకడ మరోపక్క... ఈ పాలనా రథానికి మోహరించి దౌడు తీస్తున్నాయి. భారత రాజ్యాంగం ఈ దేశంలో పుట్టి పెరిగే పౌరులందరినీ జాతి సంపదకు సమాన వాటాదారులుగా పరిగ ణిస్తున్నది. కానీ ఆంధ్రప్రదేశ్ పాలకులు మాత్రం సామాన్య ప్రజలను బిచ్చగాళ్ళుగా భావిస్తున్నారు. విద్యా, వైద్య రంగాల్లో గత ప్రభుత్వం వారికి నాణ్యమైన అవకాశాలను ఉచితంగా కలుగజేస్తే, ప్రస్తుత ప్రభుత్వం వాటిని తొలగించింది. ‘ఫ్యామిలీ డాక్టర్’ వంటి వ్యవస్థలను ఎత్తేసింది. ప్రభుత్వ రంగంలో నిర్మించిన వైద్య కళాశాలలు, అనుబంధ ఆసుపత్రు లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నది. పేద కుటుంబాల విద్యార్థులకు జగన్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఆధు నిక బోధన పద్ధతులను రద్దు చేసింది.ఇప్పుడు తాజాగా కార్మికులు, కర్షకులు పనిచేయవలసిన సమయాన్ని ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలకు పెంచుతూ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేసింది. 8 గంటల పని కోసం జరిగిన దశాబ్దాల పోరాటాలనూ, షికాగో వీధుల్లో చిందిన కార్మిక రుధిరాన్నీ అవహేళన చేసింది.ఇంత తక్కువ కాలంలో, ఇన్ని రకాలుగా పతనమవుతున్న ప్రభుత్వానికి ప్రజాదరణ తగ్గిపోవడంలో ఆశ్చర్యమేమున్నది! కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తవుతున్న వేళ కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు సర్వేలు చేస్తున్నాయట! ఈ సర్వేలన్నింటి సారాంశం ఈ ప్రభుత్వానికి ప్రజాదరణ తగ్గిందనే! ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 11 మంది మంత్రులు సహా 78 మంది కూటమి ఎమ్మెల్యేలు ఓడిపోతారని సగటు అంచనా వేశారు. వాస్తవ పరిస్థితి మాత్రం ఇంకా తీవ్రంగా ఉన్నది. ఇప్పటికే ప్రభుత్వ ప్రతిష్ఠ పాతాళానికి పడిపోయింది. దిగజార డానికి ఇంతకంటే లోతుల్లేకపోవచ్చు. కంటి తుడుపు కోసం ప్రభుత్వం కూడా ఐ.వి.ఆర్.ఎస్. ద్వారా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటున్నదట! నూటికి నూరు శాతం మంది ప్రభు త్వాన్ని భేష్ అంటున్నారని ఆ సర్వే వివరాలను ప్రభుత్వం కూడా ప్రకటించుకోవచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
‘48 గంటల తర్వాత కానీ పరిస్థితి చెప్పలేమన్నారు’
గుంటూరు: సత్తెనపల్లి పోలీసులు వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గుంటూరు రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి పరామర్శించారు. ఈ క్రమంలోనే లక్ష్మీనారాయణ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘ లక్ష్మీనారాయణ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు అడిగి తెలుసుకున్నాం. 48 గంటలు అబ్జర్వేషన్లో ఉంటే గాని పరిస్థితి ఏంటో చెప్పలేము అని డాక్టర్లు చెబుతున్నారు. లక్ష్మీనారాయణ పెద్ద నెమలిపురిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. పోలీసులు తనను ఎలా వేధించారో లక్ష్మీనారాయణ సెల్ఫీ వీడియో ద్వారా సూసైడ్ నోట్లో వివరంగా చెప్పాడు. ఒక సివిల్ మ్యాటర్ లో పోలీసులు జోకింగ్ చేసుకుని లక్ష్మీనారాయణ వేధించడం మంచి పద్ధతి కాదు. దీనికి కారకులైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం’ అని అంబటి పేర్కొన్నారు.కాగా, పల్నాడు జిల్లాలో టీడీపీ నాయకులు, పోలీసుల వేధింపులు భరించలేక లక్ష్మీ నారాయణ అనే వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. లక్ష్మీనారాయణకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు.ఆత్మహత్యాయత్నం చమయంలో సెల్పీ వీడియో రిలీజ్ చేశాడు లక్ష్మీనారాయణ,. ఆ వీడియోలో టీడీపీ ప్రభుత్వం, పోలీసుల అరాచకాలపై మండిపడ్డారు. ఈ పోలీసుల అరాచకాలకు చెక్ పెట్టాలి. వైఎస్సార్సీపీ అంటేనే ప్రభుత్వం పెద్దల అండతో పోలీసులు టార్చర్ పెడుతున్నారు. నాలాగా మరొకరు బలి కాకూడదు’ అని పేర్కొని ఆత్మహత్యాయత్నం చేశాడు. -
Ambati Rambabu: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది
-
పోలీసుల ప్రవర్తనపై అంబటి రియాక్షన్..
-
Ambati: ఈనాడు CI కి సపోర్ట్, CI కి లోకేష్ సపోర్ట్
-
‘లోకేష్ బంధువని సీఐ పొగరు, తలబిరుసుతో మాట్లాడారు’
తాడేపల్లి: వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినం కార్యక్రమానికి జనం నుంచి అద్భుతమైన స్పందన లభించిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించినా, దాన్ని అధిగమించి ప్రజలు సక్సెస్ చేశారనే విషయం కూటమి ప్రభుత్వం గ్రహించాలన్నారు. ఈరోజు(గురువారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి.. ఇప్పటికైనా చంద్రబాబు పాలన గురించి ఆలోచించాలని హితవు పలికారు. ‘ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన మోసపూరితంగా ఉందని వైసీపీ వెన్నుపోటు దినం నిర్వహించాం.వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినం కార్యక్రమానికి జనంనుంచి అద్బుతమైన స్పందన లభించింది.వెన్నుపోటు దినం కార్యక్రమం అడ్డుకునేందుకు పోలీసులతో ప్రయత్నించారు.ఏడాదిగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై వందలాది తప్పుడు కేసులుపెట్టి వేధించారు.సోషల్ మీడియా యాక్టివిస్టులను జైళ్లకు పంపించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పండగలా నిర్వహించాలని పిలుపునిస్తే పెద్దగా స్పందన రాలేదు.ఇప్పటికైనా కూటమి నేతలు బుద్ది తెచ్చుకోవాలి. దోచుకునే బ్యాచ్కే పండుగ. చంద్రబాబు ఇప్పుడైనా తన పాలన గురించి ఆలోచించాలి .రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండో ఏడాది పూర్తైన సమయంలో వెన్నుపోటు-2 సమయానికి జనం తిరగబడొచ్చు.వెన్నుపోటు దినం కార్యక్రమానికి వెళ్తున్న నన్ను పట్టాభిపురం సీఐ అడ్డుకున్నారు. సీఐకి మంత్రి లోకేష్ సపోర్ట్. బెదిరించి, భయపెట్టాలని చూశారు. అనివార్య పరిస్థితుల్లో ఎదురుతిరగాల్సి వచ్చింది. నేను చేసిన రెండు ఫిర్యాదుల గురించి అడిగితే సీఐ దురుసుగా మాట్లాడారు. లోకేష్ బంధువని సీఐ పొగరు, తలబిరుసుతో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. నాపై కేసు నమోదు చేశారు’ అని అంబటి స్పష్టం చేశారు. -
బాబు,పవన్ పై నిప్పులుచెరిగిన అంబటి
-
మాజీ మంత్రి అంబటిపై కేసు
-
పోలీసు జులుం.. మాజీ మంత్రి అంబటిపై కేసు
లక్ష్మీపురం(గుంటూరు ఈస్ట్): మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుపై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా అంబటి రాంబాబు సిద్ధార్థ్నగర్లోని తన నివాసం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీగా కలెక్టరేట్కు బయల్దేరగా పోలీసులు అడుగడుగునా అడ్డుకోబోయారు. ర్యాలీ స్థంబాలగరువు, పట్టాభిపురం మీదుగా మూసేసిన జూట్ మిల్లు వద్దనున్న సబ్ స్టేషన్కు చేరుకోగా.. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్ఐ, సిబ్బంది అడ్డుకునే యత్నం చేశారు. దీంతో అంబటి రాంబాబు స్పందించారు.ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వెళ్తుంటే అడ్డుకోవడం సరికాదని చెప్పారు. అంతమాత్రానికే సీఐ వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అయిన అంబటి రాంబాబుతో దురుసుగా ప్రవర్తించారు. ర్యాలీగా వెళ్లడానికి వీల్లేదని, ర్యాలీగా నువ్ ఎలా వెళ్తావో చూస్తా అంటూ మీదమీదకు వెళ్లి గట్టిగా మాట్లాడడం ప్రారంభించారు. ‘మర్యాదగా మాట్లాడు’ అని అంబటి సూచించగా.. ‘నువ్వు పళ్లు కొరుకుతున్నావ్’ అంటూ అంబటికి వేలు చూపించారు. ఏకవచనంతో వాగ్వాదానికి దిగారు. దీంతో సిబ్బంది కలుగజేసుకుని అంబటి, సీఐకి సర్దిచెప్పి పంపించారు. అనంతరం రాంబాబు పార్టీ నాయకులతో కలిసి కంకరగుంట ఓవర్ బ్రిడ్జి మీదుగా కలెక్టరేట్కు చేరుకుని వినతిపత్రం అందజేశారు. కాగా, మాజీ మంత్రి అంబటి పట్ల సీఐ వ్యవహరించిన తీరు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో స్పష్టంగా కనిపించింది. ఎల్లో మీడియాలో మాత్రం కలెక్టరేట్లోకి అనుమతించలేదని సీఐతో అంబటి దురుసుగా ప్రవర్తించారంటూ దుష్ప్రచారం చేశారు. ఘటన జరిగింది జూట్ మిల్లు వద్ద అయితే కలెక్టరేట్ ముందు అని బురదజల్లాలని చూశారు. చివరకు పోలీసు విధులకు ఆటంకం కలిగించారని, అనుమతి లేకుండా ర్యాలీ తీశారంటూ పలు సెక్షన్లతో అంబటిపై కేసు నమోదు చేయడం గమనార్హం. నిబంధనలను అతిక్రమించిన పోలీస్ అధికారిని వదిలేసి అంబటిపై కేసు పెట్టడాన్ని విశ్లేషకులు తప్పుపడుతున్నారు. -
గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబును అడ్డుకున్న పోలీసులు
-
Ambati: ఏడాదైనా ఒక్క సంక్షేమ పథకాన్నీ అమలు చేయని చంద్రబాబు
-
దమ్ముంటే ఆపు .. అంబటి VS పోలీసులు
-
అంబటి రాంబాబుపై సీఐ జులుం
సాక్షి,గుంటూరు: వైఎస్సార్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు ఓవరాక్షన్ చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి దగ్గర నుంచి కలెక్టరేట్కు వెళ్తుండగా టీజేపీఎస్ కాలేజీ వద్ద అంబటి రాంబాబును పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు అడ్డుకున్నారు. అయితే,తాము నిరసన కార్యక్రమానికి అనుమతి తిసుకున్నా ఎందుకు అడ్డుకున్నారని సీఐని అంబటి రాంబాబు ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన సీఐ.. అడ్డుకుంటాం అంటూ అంబటిపై దౌర్జన్యానికి దిగారు. అంబటి రాంబాబుకు వేలు చూపిస్తూ దురుసుగా ప్రవర్తించారు. అంబటి రాంబాబుని ఏంటి పళ్ళు కోరుకుతున్నావ్ అంటూ అంబటి రాంబాబుకు మీదకు వెళ్లారు. ప్రస్తుతం సీఐ వెంకటేశ్వర్లు దురుసు ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
అయ్యా నారా వినపడుతుందా.. ఏకిపారేసిన అంబటి..
-
కాపు సామాజికవర్గంపై చంద్రబాబుకు ఎందుకంత కక్ష ..?
-
కాపులపై చంద్రబాబుకు ఎందుకంత కోపం?: అంబటి
సాక్షి, తాడేపల్లి: కాపులపై చంద్రబాబుకు ఎందుకంత కోపం? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కోర్టు కొట్టేసిన కేసును మళ్లీ తిరగతోడితే కాపు సమాజం తరపున ఒక కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. కాపులను బీసీల్లోకి చేర్చుతానని 2014 ఎన్నికలకి ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాలని ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేశారు. ఆయన పిలుపుతో అన్ని రాజకీయ పార్టీల్లోని కాపులు మద్దతు తెలిపారని అంబటి రాంబాబు వివరించారు.‘‘తుని సభ సమయంలో రైలు తగులపడితే కాపులే నిప్పు పెట్టారని కేసులు పెట్టారు. ముద్రగడ కుటుంబ సభ్యులు మీద దాడి చేసి, ఆయన్ని నిర్బంధించారు. అప్పుడు నేను, దాసరి నారాయణరావు, చిరంజీవి, రామచంద్రయ్య తదితరులంతా హైదరాబాదులో సమావేశం అయ్యాం. ముద్రగడ పద్మనాభం ఒంటిరి కాదు. ఆయన వెనుక మా కాపుజాతి అంతా ఉంది. కాపు ఉద్యమ కారుల మీద పెట్టిన కేసులను జగన్ తొలగించారు. కోర్టు సైతం కేసులను కొట్టేసింది. అలాంటి కేసులను తిరగదోడటం వెనుక చంద్రబాబుకు దురుద్దేశం ఉంది’’ అని అంబటి రాంబాబు మండిపడ్డారు.‘‘దీనిపై మేమంతా సమావేశం నిర్వహించి ఒక కార్యాచరణను రూపొందిస్తాం. చంద్రబాబు, హోంమంత్రికి తెలియకుండా జీవో వచ్చిందా?. అలా వచ్చి ఉంటే వారంత అసమర్థులు మరెవరు ఉండరు. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు మోసం చేశారు. తనది డేగ కన్ను అని చెప్పుకున్న చంద్రబాబుకు తెలియకుండానే జీవో వచ్చిందా?. చంద్రబాబుది డేగ కన్ను కాదు, గుడ్డికన్ను. తన ప్రభుత్వంపై తానే విచారణ జరిపించుకోవటం చంద్రబాబుకు సిగ్గుచేటు. కాపు సమాజానికి చంద్రబాబు సమాధానం చెప్పాలి’’ అని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. -
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి సర్కార్ విస్మరిస్తోంది
-
‘బాబు మహానుబావుడు.. అధికారంలోకి వచ్చాడు లక్షల ఉద్యోగాలు పీకేశాడు’
సాక్షి,గుంటూరు: తాజాగా కోనసీమ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు తనది డేగకన్ను, తప్పు చేసిన వారు తన నుంచి తప్పించుకోలేరంటూ పిట్టలదోరలా మాట్లాడారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను అపహాస్యం చేస్తూ తెనాలిలో పోలీసులు నడిరోడ్డుపై పట్టపగలు ముగ్గురు దళిత, మైనార్టీ యువకులను హింసిస్తే చంద్రబాబు డేగ కన్నుకు కనిపించలేదా అని ప్రశ్నించారు. వారిపై చర్య తీసుకుంటే తాను చట్టవిరుద్దంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వైయస్ఆర్సీపీ శ్రేణులపై పెట్టిస్తున్న తప్పుడు కేసులు, వేధింపులను పోలీసులు ప్రశ్నిస్తారనే భయంతోనే చంద్రబాబు నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. పోలీసుల హింసకు గురైన బాధితులను పరామర్శించేందుకు ఈనెల 3వ తేదీన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెనాలికి వెడుతున్నారని వెల్లడించారు.ఇంకా ఆయనేమన్నారంటే..తెనాలి అయితానగర్కు చెందిన జాన్ విక్టర్, దోమా రాజేష్,షేక్ బాబూలాల్ అనే యువకులు చిరంజీవి అనే కానిస్టేబుల్పై దాడి చేశారని వారిపై 307 కేసు పెట్టారు. చట్టప్రకారం వారిని అరెస్ట్ చేసి కోర్ట్కు పంపాల్సింది పోయి, వారిని పట్టుకుని నడిరోడ్డుపై లాఠీలతో చావబాదారు. వారంతా దళిత, మైనార్టీ వర్గాలకు చెందిన వారు. ఈ హింసను చూస్తుంటే అసలు ప్రజస్వామ్యం ఈ రాష్ట్రంలో ఉందా అనే అనుమానం కలుగుతోంది. దీనిని మానవ హక్కుల సంఘాలు ప్రశ్నిస్తే, వారిపై రౌడీషీట్లు ఉన్నాయని, రౌడీలకు సపోర్ట్ చేస్తారా అని ఎదురుదాడి చేస్తున్నారు. చట్టాన్ని పోలీసులే చేతుల్లోకి తీసుకుంటే ఇక కోర్ట్లు ఎందుకు? విచారణలు ఎందుకు? శిక్షలు ఎందుకు? ప్రజాస్వామిక వ్యవస్థలో తప్పు చేసిన వారిని శిక్షించేందుకు చట్టాలు ఉన్నాయి, కోర్ట్లు ఉన్నాయి. వాటికి అనుగుణంగా పోలీసుల పనిచేయాలే తప్ప, తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడానికి వీలు లేదు. తనది డేగ కన్ను అని చెప్పుకునే సీఎం చంద్రబాబుకు ఈ దారుణం కనిపించలేదా? పోలీసులను మందలించడానికి ఎందకు భయపడుతున్నారు? ఇటువంటి ఘటనలు సమాజానికి తప్పుడు సంకేతాలను పంపుతాయి.ఏడాది తరువాత పాలనలో ఏ గేర్ మారుస్తారు?అవినీతిపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. నిత్యం లంచాల సొమ్మతో సూట్కేసులు మోయడమే ఆయన తనయుడు లోకేష్ చేస్తున్న పని. కోససీమ జిల్లా చేయ్యూరు ప్రజావేదికలో పాల్గొని పెన్షన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలు నవ్వు తెప్పిస్తున్నాయి. ఈ నెల పన్నెండో తేదీతో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతుందని, ఇకపై పాలనలో గేర్ మారుస్తానని చంద్రబాబు అన్నారు. ఏం గేరు మారుస్తారో మాకు మాత్రం అర్థం కాలేదు. చంద్రబాబు అనే వ్యక్తి పచ్చి అబద్దాలను కూడా అవలీలగా చెబుతాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎటువంటి అబద్దాలనైనా సరే లైవ్ డిటెక్టర్కు కూడా దొరకకుండా చెప్పగల నేర్పరి. 'అవినీతి లేని వ్యవస్థకు శ్రీకారం, అధికారులు పేదల కోసం పనిచేయాల్సిందే, లంచాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోను, నాది డేగ కన్ను, ఎవరూ తప్పించుకోలేరు. ఎవరైనా తప్పు చేస్తే ఛండశానసనుడిని అవుతాను' ఇవీ చంద్రబాబు తాజాగా చెప్పిన సుభాషితాలు. అసలు అవినీతి సమాజానికి అంకురార్పణ చేసిందే చంద్రబాబు. ఈ ఏడాది పాలనలో రాష్ట్రంలో భయంకరమైన అవినీతి జరుగుతోంది. దానికి చంద్రబాబు కుమారుడు లోకేష్ ఈ అవినీతి సొమ్మును వసూలు చేసుకునే పనిలో ఉన్నారు. సీఐల బదిలీల నుంచి అన్ని పోస్టింగ్లకు ఒక రేటును పెట్టి, లంచాలు దండుకుంటున్నది నారా లోకేష్ అనేది సత్యం. అధికారంలోకి వచ్చి ఏడాది అయినా ప్రజలను మోసం చేసిన వైనంను ప్రశ్నిస్తూ ఈనెల 4న రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంను నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. పత్తి, మిర్చి, పొగాకు, ధాన్యం ఇలా ఏ పంట పండిచే రైతుల గురించి కూడా పట్టించుకోవడం లేదు. పబ్లిసిటీ స్టంట్ కోసం చేసే ప్రయత్నం తప్ప ప్రజలను నిజంగా మేలు చేయాలనే ఆలోచనే చంద్రబాబుకు లేదు. వైఎస్సార్సీపీ నిరసనలతో ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తాం.అవినీతిపై బెల్ట్ తీసే సీఎంకు బెల్ట్షాప్కు కనిపించవా?చంద్రబాబు తనది డేగ కన్ను అంటున్నాడు, బెల్ట్ షాప్లు పెడితే బెల్ట్ తీస్తాను అని కూడా హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాప్లు కనిపిస్తున్నాయి. ఆయనది డేగ కన్ను ఎలా అవుతుంది? ఆ షాప్లు ఎందుకు కనిపించడం లేదు? బడులు తెరవగానే అమ్మ ఒడి ఇస్తానని చెబుతున్నాడు. ఏడాది కిందట కూటమి పార్టీ ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు బడులే తెరవలేదా? ఈ ఏడాదే బడులు తెరుస్తున్నారా? ప్రతి విద్యార్ధికి రూ.పదిహేను వేలు అంటూ ఎన్నికల ముందు తెలుగుదేశం వారు చేసిన హామీలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఏవీ ఆ పదిహేను వేలు అంటూ తల్లులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఏ వర్గం సంతోషంగా ఉంది? విద్యార్ధులు, యువకులు, ఉద్యోగులు, వ్యవసాయదారులు, పారిశ్రామికవేత్తలు, కనీసం అమరావతి రైతులు సైతం సంతోషంగా లేరు. ఒక దుర్మార్గమైన పాలనను ఈ ఏడాది కాలంలో ప్రజలు చవిచూశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని అయిదేళ్లు, చంద్రబాబు ఏడాది పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలి. ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం మాది, ఉన్న ఉద్యోగాలను పీకేసే ప్రభుత్వం కూటమిది. అధికారంలోకి రాగానే వాలంటీర్లకు నెలకు పదివేలు ఇస్తానంటూ నమ్మించి దాదాపు 2.60 లక్షల మందిని రోడ్డుపాలు చేశారు. ఏపీ ఫైబర్నెట్, బేవరేజెస్, ఏపీఎండీసీల్లో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల మంది ఉద్యోగాలను తొలగించారు.ఎండీయులతో 72 నెలల ఒప్పందాన్ని కొనసాగించాలిఈ రోజు రేషన్ వాహనాలపై ఆధారపడిన ఎండీయు ఆపరేటర్ల ఉద్యోగాలను కూడా తొలగించారు. 9260 మందికి ఎండీఓ వాహనాలను లోన్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చింది. వారితో పాటు ఒక హెల్పర్తో కలిపితే మొత్తం ఇరవై వేల మందికి ఉపాధి కల్పించాం. కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే వారిని రోడ్డుపాలు చేశారు. ఇదే ఎండీయులతో గత ప్రభుత్వం 72 నెలల పాటు కొనసాగేలా అగ్రిమెంట్ ఉంది. అది పూర్తి కాకుండానే వారిని తొలగించారు. ఇది చట్ట విరుద్దం. వారిపై ఇంత కక్షసాధింపు ఎందుకు? బుడమేరు వరదల్లో వారు కష్టపడి పనిచేసిన కూడా వారిని నమ్మించి గొంతుకోశారు. చట్టవిరుద్దంగా తమను తొలగించారంటూ ఇప్పటికే కొందరు ఎండీయులు న్యాయస్థానాలకు కూడా వెళ్ళారు.మంత్రి నాదెండ్ల మనోహరే పీడీఎస్ బియ్యం స్మగ్లర్వారిని తొలగించే సమయంలో చంద్రబాబు ఎండీయులను గురించి చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణం. ఎండీయుల ద్వారా పనిచేసే వారంతా స్మగ్లర్లని, కాకినాడ పోర్ట్కు రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటున్నారని సంచలనమైన ఆరోపణలు చేశారు. వారంతా సంఘవిద్రోహశక్తులు అని మాట్లాడారు. చంద్రబాబు చుట్టూ ఉన్నవారు, ఆయన పార్టీలోని ఎమ్మెల్యేలు స్మగ్లర్లుగా మారారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా ద్వారా ఎమ్మెల్యేలకు వాటాలు అందుతున్నాయి. కాకినాడ నుంచి ఆఫ్రికాదేశాలకు వెళ్ళే బియ్యం అంతా స్థానిక ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే అక్రమ రవాణా జరుగుతోంది. మట్టి, ఇసుక, ఉద్యోగాల బదిలీలు, పీడీఎస్ బియ్యంను అడ్డం పెట్టుకుని అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్నారు. ఎండీయుల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది. సివిల్ సప్లయిస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ అక్రమ పీడీఎస్ రవాణా వ్యవహారంలో మొదటి స్మగ్లర్. తరువాత మంత్రి నారా లోకేష్. మీరు అక్రమాలు చేస్తూ, ఎండీఓలపై ఆరోపణలు చేయడం దారుణం. -
జగన్, కేసీఆర్ పై నర్సిరెడ్డి కామెంట్స్.. ఏకిపారేసిన అంబటి రాంబాబు
-
ఆ ఆలోచన జనాల్లో మొదలైంది: అంబటి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీపై అక్కసుతోనే కడపలో మహానాడు నిర్వహించారని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారో చెప్పలేకపోయారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మూడు రోజుల మహానాడులో బూతులు, భజనలు తప్ప మరేమీ లేదని.. కడపలో మహానాడు పెట్టటం ద్వారా తమకు బలం ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేశారని అంబటి అన్నారు.‘‘మహానాడులో చంద్రబాబు పూర్తిగా అభద్రతాభావంతో ఉన్నారు. మూడు రోజుల కార్యక్రమంలో తాము ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పలేకపోయారు. ఏ పథకాన్ని ఎప్పుడు అమలు చేసేదీ చెప్పలేదు. ఏ ఒక్క హామీని అమలు చేయని మీరు హీరోలా? వంద శాతం హామీలు అమలు చేసిన జగన్ గొప్పవాడా..?. జగన్ను దూరం చేసుకున్నామన్న ఆలోచన జనాల్లో మొదలైంది’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.‘‘రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి చంద్రబాబే. డబ్బుతో ఓట్లు కొనాలి అనే ఒక పద్ధతిని తీసుకువచ్చింది చంద్రబాబే. సింగిల్గా ఎన్నికల్లో పోటీ చేసి ఒక్కసారి కూడా చంద్రబాబు గెలవలేదు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన తర్వాత ఆయన చంద్రబాబు గురించి ఏం మాట్లాడారో అందరూ చూశారు. జామాతా దశమ గ్రహం అంటూ ఎన్టీఆర్ చంద్రబాబును పోల్చారు. నందమూరి వంశం నుంచి స్టేజ్ మీద ఒక్కరు కూడా లేరు. నందమూరి కుటుంబ మహానాడు కాస్తా నారావారి మహానాడులా మారిపోయింది...అధికారంలో లేనప్పుడు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి అంటారు. ఇప్పుడు ఎన్డీఏలో కీలకంగా ఉన్న మీరు ఇప్పుడు ఆ ప్రతిపాదన చేయొచ్చు కదా?. కడప మహానాడు తుస్సుమంది. ప్రజలను డైవర్ట్ చేయటానికి కామెడీ ఆర్టిస్ట్లను తీసుకువచ్చారు. మాట్లాడితే తల్లి, చెల్లి అంటారు. గృహ ప్రవేశానికి చంద్రబాబు తన చెల్లెళ్లను పిలిచారా..?. లోకేష్కి ముందుంది ముసళ్ల పండగ.. ఆయన అనుభవం లేకుండా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు’’ అని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
చంద్రబాబు, లోకేష్ చెప్పినట్లు కొందరు పోలీసులు పని చేస్తున్నారు
-
చంద్రబాబు నీచ రాజకీయాలపై అంబటి ఆగ్రహం
సాక్షి,గుంటూరు: పోలీసుల్ని అడ్డు పెట్టుకొని చంద్రబాబు దారుణమైన నీచ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మాచర్ల నియోజకవర్గంలో ఆధిపత్య పోరులో ఇద్దరు టీడీపీ నేతలు దారుణ హత్యకు గురయ్యారు. అయితే, ఈ హత్యను మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడికి అంటగట్టడంపై అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ శ్రేణులపై కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్న కుట్రలపై అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. నిన్న (శనివారం) పల్నాడులో దురదృష్టకరమైన ఘటన జరిగింది. తెలంగాణలో హుజూర్ నగర్ జిల్లాలో ఓ వివాహానికి హాజరై బైక్పై గ్రామానికి తిరిగి వెళ్తున్న జవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్య, అతని సోదరుడు జవిశెట్టి కోటేశ్వరరావు వెల్దుర్తి మండలం బొదిలవీడు సమీపంలో ఓ స్కార్పియో కారు వీరి బైక్ను వేగంగా ఢీకొట్టి దారుణంగా హత్య చేశారు.ఆధిపత్య పోరుతోనే హత్య జరిగిందని స్వయంగా పల్నాడు ఎస్పీ తెలిపారు. ఇరు వర్గాల వారు ఒకే పార్టీకి చెందిన వారేనని ఎస్పీ చెప్పారు. అయితే, టీడీపీలో రెండు వర్గాల ఆధిపత్య పోరుతో జరిగిన హత్యను మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడుకి అంట గట్టారు.హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన స్కార్పియోపై జేబీఆర్ అని ఉంది. జేబీఆర్ అంటే జూలకంటి బ్రహ్మారెడ్డి. హత్యకు గురైన వారి బంధువులు కూడా తెలుగుదేశం నాయకులే చంపారని చెప్పారు. కానీ ఈ హత్యలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిని ఇరికించడం దారుణం.జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రోద్బలంతోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ అనుకూల మీడియా సైతం టీడీపీలో ఆధిపత్య పోరువల్లే ఈ డబల్ మర్డర్ జరిగాయి’ అని వార్తలు రాశాయి. టీడీపీ నాయకుల హత్యలకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏంటి సంబంధం?డెడ్ బాడీలు దొరికితే వైఎస్సార్సీపీ నేతలపైన పోలీసులు హత్య కేసులు నమోదు చేస్తారని నేను మొదటి నుంచి చెప్తున్నా. ఇవాళ అదే జరిగింది. ఆదిపత్య పోరు కారణంగా జవిశెట్టి సోదరులు హత్యకు గురైతే.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పైన పోలీసులు అక్రమంగా కేసులు బనాయించారు. దాచేపల్లి పోలీస్ స్టేషన్లో ఇటీవలే హరికృష్ణ అనే వైసీపీ కార్యకర్తపై అక్రమ కేసు నమోదు చేసి, కొట్టి చిత్రహింసలకు గురి చేశారు. గురజాల డీఎస్పీ జగదీష్ నీతి, నిజాయితీతో పని చేస్తే తాము చెప్పిన మాట వినలేదని ట్రాన్స్ఫర్ చేశారు. పోలీసులు టీడీపీకి జేబు సంస్థగా పని చేస్తున్నారు. అక్రమ కేసులు నమోదు చేసే పోలీసులు తగిన మూల్యం చెల్లించక తప్పదు’ అని హెచ్చరించారు. -
YSRCP హరికృష్ణ ను చంపడానికి ప్రయత్నం
-
ఇంత దారుణంగా హింసిస్తారా..?.. హరికృష్ణ అక్రమ అరెస్ట్పై వైఎస్సార్సీపీ ఫైర్
పల్నాడు జిల్లా: గురజాల సబ్ జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్త ఉప్పుతల హరికృష్ణను ములాఖత్ ద్వారా ఆ పార్టీ నాయకులు అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, డాక్టర్ చింతలపూడి అశోక్, కె.వి.మురళీధర్ రెడ్డి. పరామర్శించారు. దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత ఉప్పుతల యల్లయ్య కుమారుడు హరికృష్ణని దాచేపల్లి సీఐ పి.భాస్కరరావు దారుణంగా కొట్టి అనంతరం న్యాయమూర్తి ముందు హాజరుపరచడం, గురజాల సబ్జైల్కు రిమాండ్కు పంపిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు గురజాల సబ్ జైల్లో హరికృష్ణను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఈ రోజు ఉదయమే వైఎస్ జగన్ ఫోన్ చేసి హరికృష్ణ విషయం మాట్లాడారు. మేం గురజాల వచ్చి సబ్జైల్లో ఉన్న హరికృష్ణను, చల్లా ప్రేమ్కుమార్ ఇద్దరినీ పరామర్శించాం. హరికృష్ణను కొట్టిన విషయంలో కొన్ని విషయాలు మీడియా ముందు చెప్పాలంటే సిగ్గుగా ఉంది. పోలీసులు దారుణంగా చిత్రహింసలు పెట్టారు. చెప్పుకోలేని చోట అతి క్రూరంగా హింసించారు. ఉదయం 4 గంటలకు పోలీసులు టీడీపీ నాయకుడు జానీ బాషా కారులో తంగెడ వెళ్ళి పోలీస్ స్టేషన్కు రమ్మని బలవంతంగా దాచేపల్లి తీసుకొచ్చి సీఐ భాస్కర్ దారుణంగా కొట్టాడు.పోలీసులు కేసులు పెట్టాలి కానీ ఇంత దారుణంగా హింసిస్తారా.. గతంలో పాలేటి క్రిష్ణవేణిని ఇలాగే ఇబ్బందులు పెట్టాడు. తంగెడ నుంచి హరికృష్ణ తెలంగాణ వెళ్లిపోయి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు, కానీ పండుగ రోజని ఇక్కడికి వస్తే ఇలా దారుణంగా హింసించి చివరికి జైలుకు పంపారు. హరికృష్ణకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలి. మేం ఉన్నత న్యాయ స్థానానికి వెళ్ళి న్యాయం జరిగేలా చూస్తాం. సీఐ పొన్నూరు భాస్కర్ ఇంత దారుణంగా వ్యవహరిస్తాడా.. అతనికి ఇది కొత్తకాదని తెలిసింది.ఖాకీ బట్టలు వేసుకుంటే రౌడీలా ప్రవర్తిస్తావా. భాస్కర్ ముందు నీపై 307 కేసు పెట్టాలి, నీపై కూడా ప్రైవేట్ కేసు వేస్తాం. పోలీస్ శాఖ తక్షణమే ఆయన్ను సస్పెండ్ చేయాలి, డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోకపోతే మేం చట్టపరంగా ఏం చేయాలో అది చేస్తాం. తేలుకుట్లకు చెందిన చల్లా ప్రేమ్కుమార్ పక్క రాష్ట్రంలో ఉంటే సారా అమ్ముతున్నాడని అక్రమ కేసుపెట్టి జైల్లో వేశారు. ఇలాంటి కేసులకు భయపడేది లేదు. పోలీసుల్లో భాస్కర్ లాంటి తలబిరుసు సీఐలకు చెబుతున్నాం. చిలకలూరిపేటలో సుబ్బనాయుడు ఇలాగే వ్యవహరిస్తున్నాడు, మేం అధికారంలోకి రాగానే మీ సంగతి చూస్తాం, ఇలాంటి కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. అవసరమైతే సుప్రింకోర్టుకు వెళతాం.నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. మా పార్టీ కార్యకర్త హరికృష్ణను దాచేపల్లి సీఐ భాస్కరరావు క్రూరంగా హింసించాడు, ఒక పశువులాగా సీఐ వ్యవహరించాడు, సిగ్గుతో తలదించుకోవాలి, మీరు తప్పులు చేస్తే కేసులు పెట్టి కోర్టులో హాజరుపరచాలి అంతేకానీ ఇదంతా ఎందుకు చేశారు, సీఐ భాస్కరరావును తక్షణమే సస్పెండ్ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, జనం తిరగబడే సమయం వచ్చింది, పోలీస్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి, హరికృష్ణ విషయంలో హైకోర్టుకు కూడా వెళతాం. తప్పుడు కేసులు పెట్టి టీడీపీ నాయకులు వేధిస్తున్నారు, పైగా కేసులు మాఫీ కావాలంటే లక్షల రూపాయలు ఇవ్వాలంటూ బెదిరిస్తున్నారు. మా నాయకుడు వైయస్ జగన్ గారి సూచనల మేరకే మేమంతా ఇక్కడికి వచ్చాం, పోలీస్ వ్యవస్ధకే సీఐ భాస్కర్ మచ్చలాంటి వాడు.వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి రోజూ దారుణాలు జరుగుతూనే ఉన్నాయి, ప్రజలను కాపాడాల్సిన పోలీసులే ప్రజలను చిత్రహింసలు పెట్టడం ఎక్కడా చూడలేదు, సీఐ భాస్కర్, హరికృష్ణను బూటు కాళ్ళతో తొక్కుతూ పైశాచిక ఆనందం పొందాడు. సీఐ భాస్కర్ ను తక్షణమే సస్పెండ్ చేయాలి. ఏపీలో రెడ్ బుక్ పాలనను పక్కనపెట్టకపోతే పోరాటం తప్పదు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ భయపడరు, మేం చట్టపరంగా కేసులు ఎదుర్కుంటాంసత్తెనపల్లి వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతోంది, హరికృష్ణపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, గతంలో పాలేటి క్రిష్ణవేణిని కూడా ఇలాగే ఇబ్బంది పెట్టారు, పోలీస్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సీఐను సస్పెండ్ చేయాలి, సీఐ భాస్కర్కు ఇది కొత్త కాదు, కాబట్టి ఆయనపై వెంటనే చర్య తీసుకోవాలి. వైఎస్సార్సీపీ వారెవరూ భయపడాల్సిన అవసరం లేదు, మీకు పార్టీ అండగా ఉంటుంది, మనమంతా కలిసి పోరాడుదాంహరికృష్ణ తండ్రి ఉప్పుతల యల్లయ్య మాట్లాడుతూ.. మా అబ్బాయిని, నన్ను పోలీసులు బలవంతంగా దాచేపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు, సీఐ రాగానే నన్ను మా అబ్బాయిని పోలీసులు పట్టుకున్నారు, నా కుమారుడిని నా ముందే పోలీసులు చిత్రహింసలు పెట్టారు, కాళ్ళ మీద ఇద్దరు కూర్చుంటే సీఐ, ఇద్దరు పోలీసులు తీవ్రంగా కొట్టారు, నేను దండం పెట్టి బతిమిలాడినా వదలకుండా కొట్టారు. నేను తట్టుకోలేక పోయాను, అంత దారుణంగా కొట్టారు.హరికృష్ణ భార్య భార్గవి మాట్లాడుతూ.. నా భర్తను పోలీసులు యూనిఫామ్ లేకుండా వచ్చి బలవంతంగా తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టి దారుణంగా కొట్టారు, నా భర్తకు ఏమైనా జరిగితే మా కుటుంబం అంతా రోడ్డునపడుతుంది, ఏ తప్పు చేయని నా భర్తని ఇంత దారుణంగా చిత్రహింసలు పెట్టే అధికారం పోలీసులకు ఎక్కడిది. నాకు ముగ్గురు పిల్లలు, నా భర్తను కాపాడాలని కోరుకుంటున్నాను. -
YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu
-
రెడ్బుక్ రాజ్యాంగానికి ఇది పరాకాష్ట
సాక్షి, అమరావతి/సాక్షి,నెట్వర్క్: ఎన్నికల హామీలు అమలుచేయకపోవడం.. రాజకీయ కక్ష సాధింపులతో టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని.. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్కు మరోసారి తెరతీశారని వైఎస్సార్సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెడ్బుక్ రాజ్యాంగానికి ఇది పరాకాష్టని.. దాని అమలులో భాగంగానే గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపైనా కక్ష సాధిస్తున్నారని భూమన కరుణాకరరెడ్డి, సాకే శైలజానాథ్, అంబటి రాంబాబు, గడికోట శ్రీకాంత్రెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి, వరుదు కళ్యాణి, మార్గాని భరత్రాం శనివారం వేర్వేరుచోట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. రానున్న రోజుల్లో కూటమి నేతలకు ప్రజలు తగిన బుద్ధిచెబుతారని వారు హెచ్చరించారు. ఎవరెవరు ఏమన్నారంటే..ప్రజల దృష్టి మరల్చేందుకే అక్రమ అరెస్టులు..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీని నాశనం చేయాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రిటైర్డ్ అధికారులను అక్రమంగా అరెస్టుచేసింది. వైఎస్ జగన్ను బలహీనపరచాలనే దురుద్దేశంతోనే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. దీనికి పరాకాష్టగా అసలు జరగని మద్యం స్కాంలో రిటైర్డ్ అధికారులు ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డిలను అరెస్టుచేయడం విడ్డూరం. నిజాయితీపరులైన అధికారులను జైళ్లకు పంపిన చంద్రబాబు సర్కారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. – భూమన కరుణాకర్రెడ్డి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి లిక్కర్ స్కాంలో అసలు దోషి బాబే..లిక్కర్ స్కాంలో అసలు దోషి చంద్రబాబే. ఆధారాలతో సహా సీఐడీకి దొరికిన ఆయన, సీఎం కాగానే కేసు దర్యాప్తును అడ్డుకున్నారు. ప్రివిలేజ్ ఫీజు రద్దుతో అప్పట్లో బార్లకు చంద్రబాబు మేలు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ కుంభకోణం జరగకపోయినా జరిగినట్లు తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి రిటైర్డ్ అధికారులు కె. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిని అక్రమంగా అరెస్టుచేశారు. 2014–19 మధ్య చంద్రబాబు పాలనలోనే భారీ లిక్కర్ స్కాం జరిగింది. అందులో చంద్రబాబు నిందితుడు. బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దుచేసి, వాటి యజమానులకు దాదాపు రూ.1,300 కోట్ల లాభం చేకూర్చారు.2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు కూడా అదే స్థాయిలో మద్యం స్కాం జరుగుతోంది. ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న లిక్కర్ స్కాంలో ఇలాంటిది ఉందా? ఇక మద్యం షాపులను ప్రభుత్వం నడిపిస్తే ఆదాయం వస్తుందా? ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఆదాయం వస్తుందో టీడీపీ నేతలు చెప్పాలి. ఏపీలో ఉన్న అన్ని డిస్టిలరీలకు అనుమతులిచ్చింది చంద్రబాబే. అంతేకాక.. 69 శాతానికి పైగా ఆర్డర్లు నాలుగైదు డిస్టిలరీలకే ఇచ్చారు. ఇదంతా స్కాం కాదా? పైగా.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం నడిపే మద్యం షాపులను తిరిగి ప్రైవేటు వ్యక్తులకే అప్పగించారు. – సాకే శైలజానాథ్, మాజీమంత్రి జైలు అధికారుల మార్పులో బాబు కుట్ర..విజయవాడ జైలు అధికారులను హఠాత్తుగా మార్చడం వెనుక చంద్రబాబు భారీ కుట్ర ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసుల్లో అరెస్టయిన వారంతా విజయవాడ జైలులో ఉన్నందున వారిని వేధించేందుకే తాము చెప్పినట్లు నడుచుకునే అధికారులను అక్కడ నియమించారు. ఒకవైపు సంబంధంలేని అంశాల్లో కొందరు ప్రభుత్వాధికారులపై తప్పుడు కేసులు బనాయించడం, అక్రమ అరెస్టులతో వారిని జైలులో హింసించాలన్నదే చంద్రబాబు కుతంత్రంగా కనిపిస్తోంది. 2018–19లో లిక్కర్ ఆదాయం దాదాపు రూ.16,900 కోట్లు అయితే.. 2023–24లో అది రూ.24,700 కోట్లు. నిజంగా, చంద్రబాబు చెబుతున్నట్లుగా వైఎస్సార్సీపీ హయాంలో లిక్కర్ స్కాం జరిగితే ప్రభుత్వానికి లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయం ఎలా పెరిగింది? వైఎస్సార్సీపీ హయాంలో లిక్కర్ అమ్మకాలు తగ్గి ఆదాయం పెరిగింది. అదే ఇప్పుడు బాబు హయాంలో లిక్కర్ సేల్స్ పెరిగి ఆదాయం తగ్గింది. దీని మతలబు ఏమిటో చంద్రబాబే చెప్పాలి. ఈ తగ్గిన ఆదాయం ఎవరి జేబుల్లోకి పోతోంది? ఇది స్కాం కాదా? – మార్గాని భరత్, వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ అణిచివేయాలనుకుంటే మరింత బలోపేతమవుతాం..వైఎస్సార్సీపీని అణిచివేయాలని చూస్తే మరింత బలోపేతమవుతాం. గతంలో ఒకసారి వైఎస్సార్సీపీని అణగదొక్కాలని కాంగ్రెస్తో చంద్రబాబు జట్టు కట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ నామరూపాలు లేకుండాపోయింది. అధికారంలోకి వచ్చిఏడాదైనా ఎన్నికల హామీలను అమలుచేయడంపై చంద్రబాబు దృష్టిపెట్టలేదు. మాజీ సీఎం వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై కక్ష సాధింపు చర్యలకే పరిమితమయ్యారు. వైఎస్ జగన్ బలహీనపరిచేందుకు లిక్కర్ స్కామ్ సృష్టించారు. – అంబటి రాంబాబు, మాజీ మంత్రిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అక్రమ అరెస్టులు..చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయలేకపోవడంతోపాటు పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకే రాజకీయ కక్ష సాధింపు చర్యలకు, అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో బెల్ట్ షాపులు పూర్తిగా రద్దుచేసి, మద్యం షాపులు, అమ్మకాలు తగ్గిస్తే స్కాం జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబుకి దమ్ముంటే ఆయనపై నమోదైన ఇన్నర్ రింగ్రోడ్డు స్కాం, లిక్కర్ కుంభకోణం, ఏపీ ఫైబర్నెట్ స్కాం, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాలపై విచారణకు సిద్ధం కావాలి.– ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుబాబు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు..రాష్ట్రంలో రెడ్బుక్ రాజకీయ అరాచకం ఎక్కువైంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాజకీయ నాయకులపైనే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్లపై కూడా అక్రమ కేసులు పెడుతున్నారు. కొందరు అధికారులకు పోస్టింగ్స్ ఇవ్వకుండా వేధిస్తున్నారు. సర్వీస్లో ఉన్న వారినే కాకుండా రిటైర్డ్ అధికారులనూ అరెస్టు చేస్తున్నారు. ఒక్క ఆధారం లేకపోయినా లిక్కర్ స్కాం జరిగిందంటూ తప్పుడు సాక్ష్యాలు సృష్టించి అక్రమ అరెస్టులు చేస్తున్నారు. చివరకు హైకోర్టు న్యాయమూర్తులు అక్షింతలు వేసినా సిగ్గులేకుండా ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోంది. వైఎస్ జగన్ను నైతికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. – గడికోట శ్రీకాంత్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబు లిక్కర్ స్కాం రూ.10వేల కోట్లు..మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో రూ.3,200 కోట్ల మేర లిక్కర్ స్కాం జరిగిందంటూ అనవసర యాగీ చేస్తున్న టీడీపీ కూటమి పెద్దలు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి చెప్పడంలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఘాటుగా విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ప్రతి బ్రాందీ షాపు నుంచి పోలీస్స్టేషన్కు, ఎక్సైజ్ స్టేషన్కు మామూళ్లు అందుతున్నాయని, తమ ప్రభుత్వంలో మామూళ్ల ప్రస్తావనే లేదన్నారు. ప్రస్తుతం ప్రతి మద్యం షాపు యజమాని ఎక్సైజ్ శాఖకు రూ.70 వేలు, పోలీస్స్టేషన్కు రూ.30 వేలు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా చెల్లిస్తున్నారని, కిందిస్థాయి నుంచి అమరావతి వరకు ఎవరి వాటా వారికి చేరుతోందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. తద్వారా నెలకు సుమారు రూ.100 కోట్ల వరకు మద్యం మామూళ్లు యువరాజు లోకేశ్కు అందుతున్నాయని ఆరోపించారు. నెలకు రూ.100 కోట్ల చొప్పున ఏడాదికి రూ.1,200 కోట్ల అవినీతి జరుగుతోందన్నారు. ఇక డిస్టలరీల నుంచి నేరుగా చంద్రబాబుకు ఏడాదికి రూ.1,000 కోట్లు అందుతోందన్నారు. నక్కలు, తోడేళ్లు కలిసి రూ.1,000 కోట్లు తింటే.. సింహం ఏకంగా రూ.1,000 కోట్లు ఆర్జిస్తోందన్నారు. ఇలా కూటమి ప్రభుత్వంలో మద్యం పాలసీకి సంబంధించి రూ.10వేల కోట్లకు పైగా అవినీతి జరుగుతుంటే.. జగన్ ప్రభుత్వంలో రూ.3,200 కోట్లు అవినీతి జరిగిందని చెబుతున్నారన్నారు.ఇదే అత్త కోడలికి సుద్దులు చెప్పడం అని రాచమల్లు ఎద్దేవా చేశారు. ఆరు పథకాలను అమలుచేయలేని చంద్రబాబు 60 కేసులు పెట్టి 60 మందిని జైలుకు పంపాడని, ఇచ్చిన హామీలను అమలుచేయలేకపోతున్నాడన్నారు. మద్యం పాలసీకి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వానిది అంతా దోపిడీ అని, ఐదేళ్లలో రూ.10వేల కోట్ల అవినీతి జరుగుతుందని, టీడీపీ నేతలకు దమ్ముంటే ఎవరైనా దీనికి సమాధానం చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. – మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి..అరాచక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం దిగిపోయే రోజులు దగ్గరపడ్డాయి. రాజ«దాని పేరుతో కూటమి ప్రభుత్వం రూ.వేల కోట్లు దోచుకుంటోంది. హామీల అమలును విస్మరించి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు. – ఆకేపాటి అమరనాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేరాష్ట్రంలో శాంతిలేదు..రాష్ట్రంలో ఎక్కడా శాంతి లేదు.. ప్రజలకు భద్రత అసలు లేదు. ఏపీలో పోలీస్ వ్యవస్థ చంద్రబాబు కబంధ హస్తాల్లో చిక్కుకుపోయింది. శనివారం అనంతపురం జిల్లా రాప్తాడులో దంపతులను టీడీపీ రౌడీమూకలు చంపినట్లు ప్రాథమిక సమాచారం ఉంది. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలోనే ఈ హత్యలు జరిగి ఉంటాయి. – గోరంట్ల మాధవ్, వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ -
అరెస్ట్ చేసే ముందు చెప్పండి బట్టలు సర్దుకుని రెడీగా ఉంటా
-
Ambati Rambabu: కేసులు పెట్టి వేధిస్తే మరింత స్ట్రాంగ్ అవుతాం
-
ఆ అరెస్ట్ల వెనుక కుట్ర కోణం: అంబటి
సాక్షి, గుంటూరు: కేసులు పెట్టి అరెస్ట్లు చేస్తే బెదిరిపోయేది లేదని.. వేధిస్తే మరింత స్ట్రాంగ్ అవుతామని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల క్రితం నాటి అంశాల్లో ఇప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. మరికొద్ది రోజుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తుంది. కూటమి ఏడాది పాలనలో అక్రమ అరెస్టులు తప్ప ఏమీ లేదన్నారు.‘‘రాజకీయ నాయకుల అరెస్టులే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కూడా అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టులు చేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో పని చేశారని ధనుంజయ రెడ్డి , కృష్ణమోహన్రెడ్డిలను అరెస్ట్ చేశారు. చంద్రబాబుకు నీచపు రాజకీయాలు కొత్త ఏమీ కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీతో జతకట్టి వైఎస్ జగన్ను అక్రమ కేసులతో జైలులో పెట్టి, ఇబ్బంది పెట్టారు. ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదు. న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తాం’’ అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.స్కిల్ స్కాంలో చంద్రబాబు జైలుకు వెళ్లాడనే కోపంతో వైఎస్సార్సీపీ నేతలను, గత ప్రభుత్వ హయాంలో పని చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపిస్తున్నారు. పులి మీద చంద్రబాబు, నారా లోకేష్ స్వారీ చేస్తున్నారు. ఆ స్వారీ చేయటం ఆపగానే ఆ పులి ఇద్దరిని మింగేస్తుంది. అమ్మ ఒడి వంటి పథకాలను ప్రజలు అడగకుండా చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడు. ధనుంజయ రెడ్డి,కృష్ణమోహన్రెడ్డి అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర కోణం ఉంది’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
చంద్రబాబు సూపర్ సిక్స్... అంబటి రాంబాబు మాస్ ర్యాగింగ్
-
‘వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే భయంతోనే.. అందుకే చంద్రబాబు ఇలా’
సాక్షి, గుంటూరు: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో రాష్ట్రం తిరోగమనంలో సాగుతోందిన మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకురాకపోగా, ఉన్న పరిశ్రమలపై కుట్రలు చేస్తూ, వారిని రాష్ట్రం వదిలి పారిపోయేట్లుగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న సజ్జన్ జిందాల్, నేడు వికాట్ ఫైనాన్స్ సెక్రటరీ గోవిందప్ప బాలాజీ వరకు ఈ వేధింపులు కొనసాగుతున్నాయని ధ్వజమెత్తారు. ఏడాది కూటమి పాలన రాష్ట్ర ప్రజలకు చీకటి రోజులనే మిగిల్చిందని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే...గత వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధి, పారదర్శక విధానాలు, ప్రజల కొనుగోలుశక్తి, రెవెన్యూ ఆదాయం, మూలధన పెట్టుబడి అంశాల్లో గణనీయమైన ప్రగతిని సాధించింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావోస్తోంది. ఈ ఏడాది పాటు చంద్రబాబు పాలనను చూస్తే బాధ కలుగుతోంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. సంపదను సృష్టించి, ప్రజల ఆదాయాలను పెంచడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చెందేలా చేస్తానంటూ నమ్మించారు.కానీ ఆయన పాలనను చూస్తే దయనీయమంగా కనిపిస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ జగన్పై ఏ విధంగా బురదచల్లాలి, ఏ విధంగా ఆయన వ్యక్తిత్వహననం చేయాలి, వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు ఎలా బనాయించాలి, పోలీసులను ప్రయోగించి ఎలా వేధించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. చంద్రబాబు తన మొత్తం సమయాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కోసమే వినియోగిస్తున్నారే తప్ప రాష్ట్రం గురించి, ప్రజల బాగోగుల గురించి కాదు.వికాట్ ఫైనాన్స్ సెక్రటరీ గోవిందప్ప బాలాజీపై తప్పుడు కేసులులేని మద్యం కేసును రంగంలోకి తీసుకువచ్చి, దానిలో వైఎస్ జగన్కి సన్నిహితులైన వారందరినీ బాధ్యులుగా చూపి, ఒక పథకం ప్రకారం కక్ష సాధింపులకు చంద్రబాబు తెగబడ్డారు. దీనిలో భాగంగానే అంతర్జాతీయ సంస్థ వికాట్లో ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేస్తున్న గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వికాట్ అనే సంస్థ 165 సంవత్సరాల కిందట ప్రారంభించిన సిమెంట్ కంపెనీ. యూరప్లోనే పేరు ప్రఖ్యాతలు సాధించిన ఈ సంస్థ 1967లో ప్రారంభమైంది. ఈ సంస్థ 2024లో మొత్తం 44,316 కోట్ల రూపాయలు సిమెంట్ అమ్మకాల ద్వారా ఆర్జించిందంటే ఎంత బలమైన సంస్థో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ జగన్ భారతీ సిమెంట్స్ను వరల్డ్ ఫస్ట్క్లాస్ టెక్నాలజీతో ప్రారంభించారు. దానిని 2010లో ఈ వికాట్ కంపెనీ టేకోవర్ చేసింది. 51 శాతం వాటాలు దీనికి ఉన్నాయి.ఈ వికాట్ కంపెనీనికి బాలాజీ గోవిందప్ప ఫుల్టైం ఫైనాన్స్ సెక్రటరీ. కేవలం వైఎస్ జగన్ ప్రారంభించిన కంపెనీలో ఈయన పనిచేస్తున్నారనే కారణంతోనే లేని లిక్కర్ స్కామ్ను సృష్టించి, దానిలో ఆయనను ఇరికించి, ఆయనను జైలుకు పంపారు. చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలకు ఈ అరెస్ట్ ఒక ఉదాహరణ. అలాగే సజ్జన్ జిందాల్ భారతదేశంలోనే పెద్ద వ్యాపార దిగ్గజ్జం. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభించి, పనులు ప్రారంభించారు.చంద్రబాబు అధికారంలోకి రాగానే ఒక సెకెండ్ గ్రేడ్ సినిమా ఆర్టీస్ట్ను అడ్డం పెట్టుకుని జిందాల్ను వేధింపులకు గురి చేశారు. ఇవి తట్టుకోలేక జిందాల్ కడప నుంచి వెళ్ళి మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. అలాగే ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కేసులు పెట్టారు. ఒక డీజీపీ ర్యాంక్లో ఉన్న పోలీస్ అధికారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇలా వైఎస్ జగన్పై కోపంతో, మరోసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందనే భయంతో పారిశ్రామికవేత్తలను చంద్రబాబు భయపెట్టాలని చూస్తున్నారు.కూటమి నేతల అరాచకాలతో పారిశ్రామికవేత్తలు బెంబేలుమరోవైపు కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలపై మామూళ్ల కోసం దాడులు చేస్తున్నారు. తాడిపత్రిలో ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ పై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఫిర్యాదులు చేశారు. తనకు రౌడీ మామూళ్ళు ఇవ్వడం లేదని కంపెనీకి ముడిసరుకుని ట్రాన్స్పోర్ట్ చేసే సంస్థలను ఇబ్బంది పెట్టారు. దీనితో సిమెంట్ ప్లాంట్నే మూసేసే పరిస్థితి వచ్చింది. ఒకవైపు ప్రధానమంత్రి మన దేశంలోనే మేకిన్ ఇండియాలో భాగంగా అన్నీ ఉత్పత్తి చేసుకోవాలని చెబుతుంటే, అదే బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తనకు రౌడీ మామూళ్ళు ఇవ్వడం లేదని ఏకంగా ఆల్ట్రాటెక్ సిమెంట్ ప్లాంట్నే మూయించే ప్రయత్నం చేశారు. ఇలా చేస్తుంటే పరిశ్రమలు వస్తాయా?గండికోట ప్రాంతంలో ఆదానీ హైడ్రోపవర్ పైనా బీజేపీ ఎమ్మెల్యే, ఆయన సోదరుడు తమకే మొత్తం కాంట్రాక్ట్లు ఇవ్వాలని ఆ కంపెనీ కార్యాలయంపైనే దాడి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఏపీలో ఏ పరిశ్రమ అయినా సరే కూటమి ఎమ్మెల్యేలకు కప్పం కట్టాల్సిందే, లేనిపక్షంలో ఆ సంస్థలు పనిచేయవు అనే విధంగా వ్యవహరిస్తున్నారు. పల్నాడులోని గురజాడలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తాను ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేశానని, ఆ డబ్బును భవ్య, చెట్టినాడు సిమెంట్ ప్లాంట్లు చెల్లించాలంటూ వారిని వేధించడంతో ఈ రెండు సిమెంట్ కంపెనీలు మూతపడ్డాయి.శ్రీకాకుళంలోని యూబీ బీర్ తయారీ ఫ్యాక్టరీపై నడికుదిటి ఈశ్వర్రావు అనే బీజేపీ ఎమ్మెల్యే బీర్ రవాణా చేసే ఒక్కో లారీకి వెయ్యి రూపాయలు ఇవ్వాలని బెదిరించాడు. ఈ లెక్కన నెలకు రూ.1.50 కోట్లు వారి నుంచి డిమాండ్ చేశాడు. పదివేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న యూబీ సంస్థపై ఇలాంటి వేధింపులకు పాల్పడటంతో ఆ సంస్థ ఎలా ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది? జాతీయ రహదారుల కాంట్రాక్ట్ల కోసం బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, బీజేపీ ఎంపీ సీఎం రమేష్లు పోటీపడి కొట్టుకునే పరిస్థితికి వచ్చారు. దాల్మియా సిమెంట్పై చంద్రబాబు కక్షసాధింపు ప్రారంభించారు. ఇప్పటి వరకు రూ.793 కోట్ల రూపాయలు జప్తు చేసే కార్యక్రమం చేశారు. టీవీ9 ను లొంగతీసుకోవాలని మైహోం రామేశ్వరరావుకు చెందిన సిమెంట్ కంపెనీకి గనుల నుంచి ముడిసరుకుని రానివ్వకుండా వేధిస్తున్నారు.అసమర్థ పాలనతో ప్రగతి శూన్యంచంద్రబాబు అద్భుతమైన సంపద సృష్టిస్తాను, పరిశ్రమలను తీసుకువస్తాను అని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఐదేళ్ల పాటు మంచి పాలనను అందించిన వైఎస్ జగన్ కాదని ఒక దుర్మార్గమైన పాలనను అనుభవిస్తున్నామని నేడు అన్ని వర్గాలు ఆవేదన చెందుతున్నారు. కాగ్ లెక్కల ప్రకారం చూసినా రాష్ట్రం తిరోగమనంలో ఉందని తెలుస్తుంది. 2023-24లో వచ్చిన ఆదాయం కంటే 2024-25లో వచ్చిన ఆదాయంలో తగ్గుదల రూ.5520 కోట్లు. ఇదేనా చంద్రబాబు సంపద సృష్టించడం? ఆయన సంపద పోగొడుతున్నాడు.అమ్మకంపన్ను, స్టాంప్ డ్యూటీ చూస్తే 2024-25లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే రూ.1,053 కోట్లు పడిపోయింది. రిజిస్ట్రేషన్లు లేవు, అమ్మకాలు లేవు, ప్రజల కొనుగోలు శక్తి సన్నగిల్లింది. ఇదీ అనుభవజ్ఞుడైన చంద్రబాబు పాలన. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం అంతకు ముందు ఏడాదితో పోలిస్తే రూ.705 కోట్లకు పడిపోయింది. ఇక పన్నేతర ఆదాయానికి వస్తే 2024-25లో రూ.842 కోట్లు తగ్గింది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రావాల్సిన డబ్బు 2024-25లో రూ.14,563 కోట్లు తగ్గింది. మూలధన వ్యయం రూ.4,413 కోట్లకు తగ్గిపోయింది. విద్యా, వైద్యం, సంక్షేమం తదితరాలకు చేసిన వ్యయం రూ.4696 కోట్లు తగ్గింది. కాగ్ రిపోర్ట్ ప్రకారం వచ్చిన లెక్కలు ఇవి.హామీల అమలులో పూర్తి వైఫల్యంచంద్రబాబు ఎల్లోమీడియాను అడ్డం పెట్టుకుని గొప్పగా తమను తాము ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు ఏదీ? ఈ హామీలను అమలు చేయడానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏడాదికి రూ.79,867 కోట్లు అవసరం. కానీ చంద్రబాబు బడ్జెట్లో కేటాయించింది చూస్తే రూ.7,282 మాత్రమే. దీనిలో ఖర్చు పెట్టింది రూ.865 కోట్లు మాత్రమే. చివరికి పెన్షన్లలోనూ మూడు లక్షల వరకు కోత పెట్టారు. ఉచిత బస్పు ఊసే లేదు.చివరికి తల్లికి వందనం కింద ఇచ్చేదానిని కూడా వాయిదాల ప్రకారం ఇస్తానంటున్నారు. గతంలో ఇలాగే రైతురుణమాఫీని కూడా ఎగ్గొట్టారు. ఇప్పుడు తల్లికి వందనంను కూడా ఇలాగే చేస్తున్నారు. ఇక నిరుద్యోగభృతి అమలు ఏమయ్యిందో తెలియదు. పాలన ద్వారా ప్రజలను మెప్పించి, మళ్ళీ అధికారంలోకి రావాలనే కోరికే చంద్రబాబుకు లేదు. చంద్రబాబ అసమర్థ పాలనతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి, జీఎస్టీ వసూళ్ళు తగ్గిపోయాయి.రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను తీవ్రంగా భ్రష్టు పట్టించారు. పోలీసులను రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటున్నారు. పోలీస్ వ్యవస్థ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. నిబంధనల ప్రకారం పనిచేయాలి. ఇటీవలే చిలుకలూరిపేటలో సీఐ వ్యవహరించిన తీరును ప్రజలు గమనించారు. న్యాయస్థానాలు పోలీసుల తీరుపై చాలా ఘాటుగానే విమర్శిస్తున్నా స్పందించడం లేదు. ఐపీఎస్ ఆఫీసర్లు చట్టాల ప్రకారం వ్యవహరించకపోతే భవిష్యత్తులో న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడాలి. కూటమి ప్రభుత్వం ఏం చెబితే గుడ్డిగా దానిని అనుసరించుకుంటూ పోతే దానికి వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కొందరు అధికారులు చట్టాలను అతిక్రమిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
Ambati: చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు బాధ పడుతున్నారు
-
కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వట్లేదు.. డీజీపీపై అంబటి ఫైర్
-
Ambati: అర్ధరాత్రి ఒక మహిళపై పోలీసులే దాడి.. రాష్ట్రంలో అసలేం జరుగుతోంది?
-
సీమ రాజాకు ఇక చుక్కలే. .. అంబటి సంచలన నిర్ణయం
-
నడిరోడ్డుపై ఒక మహిళను.. వీళ్లు పోలీసులేనా..!
-
వారిపై చర్యలు తప్పవు: అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: తన వ్యక్తిగత జీవితం, వైఎస్సార్సీపీ శ్రేణులపై కిరాక్ ఆర్పీ, సీమరాజు సోషల్ మీడియాలో పెడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. వాటిపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు తనపై కూడా చేసిన సోషల్ మీడియాలో పోస్టులపై ఫిర్యాదులు చేశాను. మొదట ఒక్క కేసు కూడా రిజిస్టర్ చేయలేదు.. న్యాయస్థానాల ద్వారా పోరాటంతో నాలుగు కేసులను రిజిస్టర్ చేశారు. మరొక కేసు రిజిస్టర్ చేయాల్సి ఉంది’’ అని అంబటి పేర్కొన్నారు.‘‘ఈ నెల 18వ తేదీన ఆ కేసుపై స్వయంగా నేనే హైకోర్టులో వాదనలు వినిపించనున్నాను. పోలీసులు రాజకీయ ఒత్తిడితో అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టులు చేస్తున్నారు. మహిళలను ఉదయం ఆరు లోపు అదుపులోకి తీసుకోకూడదని చట్టం చెబుతోంది. కానీ రాజకీయ ఒత్తిడికి గురై పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారు. చట్టాన్ని అతిక్రమించిన అధికారులపై రానున్న రోజుల్లో చర్యలు తప్పవు. కాంతేరులో దళిత ఆడబిడ్డను బలవంతంగా లాక్కెళ్లారు. బట్టలు మార్చుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం దుర్మార్గం.‘‘గుంటూరు సీఐడి కార్యాలయానికి రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వస్తే.. ఖాళీగా ఉన్న కుర్చీల్లో కూర్చుంటే వైఎస్సార్సీపీ శ్రేణులకు పోలీసులు రాచ మర్యాదలు అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ప్రచురించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైన్యం తగ్గడం లేదు.. మరింతగా పెరుగుతుంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది’’ అని అంబటి రాంబాబు చెప్పారు. -
ఏపీ పోలీసులకు అంబటి రాంబాబు వార్నింగ్
-
పట్టాభిపురం పిఎస్ లో సీమరాజు, కిర్రాక్ ఆర్పీపై ఫిర్యాదు
-
సీమ రాజా, కిర్రాక్ ఆర్పీలాంటోళ్లను చట్టం వదలదు: అంబటి
గుంటూరు, సాక్షి: తాము ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు స్పందించడం లేదని.. అందుకే న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సోషల్ మీడియాలో పార్టీ మీద, పార్టీ నేతల మీద తప్పుడు వ్యాఖ్యలు, ప్రేలాపనలు చేసే వాళ్లను వదలబోమని, చట్టం ముందు దోషులుగా నిలబెట్టి తీరతామని అన్నారాయన.సోమవారం పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ సోషల్ మీడియా వింగ్ వైఎస్సార్సీపీపై, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై, తనపైనా తప్పుడు ప్రచారం చేస్తోంది. అందుకే ఐటీడీపీపై ఫిర్యాదు చేశాం. అలాగే.. వైఎస్సార్సీపీ కండువా చేసి ప్రేలాపనలు చేసే సీమ రాజా అనే వ్యక్తిపైనా, మాజీ మంత్రి రోజా తదితరులపైనా వీడియోలు చేసే కిర్రాక్ ఆర్పీపైనా ఫిర్యాదు చేశాం.గతంలోనూ మేం ఫిర్యాదులు చేశాం. కానీ, పోలీసులు చర్యలు తీసుకోలేదు. అందుకే ఈసారి రసీదు తీసుకున్నాం. మేం ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదు. అందుకే టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగానే తప్పుడు కేసులు పెడుతున్నారు. పోలీస్ వ్యవస్థ టీడీపీ గుప్పిట్లో ఉంది. పోలీసులు చర్యలు తీసుకోకుంటే కోర్టులకు వెళ్తాం.ఐటీడీపీ పేరుతో చంద్రబాబు, లోకేష్ ప్రొత్సహంతో వైఎస్సార్సీపీ నేతలపై ప్రేలాపనలు చేస్తున్నారు. పోలీసులు వాళ్లపై చర్యలు తీసుకునేంతవరకు పోరాటాలు చేస్తాం. దోషులను చట్టబద్ధంగా శిక్షించే వరకు మా పోరాటం జరుగుతుంది. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తాం. పార్టీ ఇన్ పర్సన్గా నా ఆవేదనను నేనే స్వయంగా వినిపిస్తా. చట్టం సీమ రాజాను, కిర్రాక్ ఆర్పీ లాంటి వాళ్లను చట్టం వదలదు. ఎంత పెద్దవారు అయినా శిక్ష నుంచి తప్పించుకోలేరు. -
ఐటీడీపీపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ
-
అమరావతి నిర్మాణంలో చంద్రబాబు విఫలమయ్యారు
-
‘5000 కోట్లు.. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు?’
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతోందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు?. ఇప్పుడు మూడేళ్లలో ఎలా పూర్తి చేస్తారు? అని ప్రశ్నించారు. విభజన హామీలు అడగరు కానీ.. వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తారా? అంటూ మండిపడ్డారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు జిమ్మిక్కులను ప్రజలు అర్థం చేసుకోవాలి. గతంలో ప్రధాని మోదీ మట్టి, నీరు తీసుకొచ్చి మా ముఖాన కొట్టారని చంద్రబాబు అనలేదా?. మోదీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని గతంలో పవన్ విమర్శించలేదా?. మోదీ, చంద్రబాబు పరస్పర అవసరాల కోసం రాజధానిని వాడుకుంటున్నారు. అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. విభజన హామీలు అడగరు కానీ.. వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తారంట. ఒకరిని ఒకరు పొగుడుకోవడానికే సభ నిర్వహించినట్టు ఉంది.చంద్రబాబు విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతోంది. అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారు. అమరావతిపై ఇప్పటికే రూ.52వేల కోట్లు అప్పు చేశారు. ఈ అప్పులు ఎవరు తీర్చుతారు?. ఈ 52 వేల కోట్లను పారదర్శకంగా ఖర్చు పెడుతున్నారా?. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు?. అన్నీ తాత్కాలిక భవనాలనే నిర్మించారు కదా?. తాత్కాలికం అంటూనే రూ.5000 కోట్లు ఖర్చు చేశారు. చదరపు అడుగుకు రూ.11వేలు ఖర్చు చేసి, డబ్బులు గంగలో కలిపారు. రాజధాని నిర్మాణానికి 53వేల ఎకరాలు సరిపోదా.. మరో 45వేల కావాలంట!. గన్నవరం పక్కనే అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మిస్తారట. 2014-19 మధ్యలో పూర్తి చేయని రాజధానిని వచ్చే మూడేళ్లలో ఎలా పూర్తి చేస్తారు?’ అని ప్రశ్నించారు.అమరావతి పున:ప్రారంభ సభలో చంద్రబాబు, లోకేష్ అసత్యాలు చెప్పారు. అమరావతి ఒక అంతులేని కథ. అమరావతి నిర్మించడంలో చంద్రబాబు అట్టర్ ప్లాప్ అయ్యారు. అందుకే చంద్రబాబును చిత్తుచిత్తుగా ఓడించారు. పది సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా విభజన చట్టంలో అవకాశం కల్పించారు. చంద్రబాబును అక్కడ తంతే ఇక్కడికి వచ్చి పడ్డాడు. రాత్రికి రాత్రే ఎందుకు హైదరాబాద్ నుండి వచ్చేశారు?. అమరావతి పేరుతో చంద్రబాబు అందరినీ ముంచేశారు. అమరావతి విధ్వంసం చేసిన వ్యక్తి చంద్రబాబు. అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ నగరం అని చెప్తున్నారు. సెల్ఫ్ సస్టైనబుల్ నగరానికి 52 వేల కోట్లు ఎందుకు అప్పు చేశారు. వర్షం పడితే అమరావతి పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
Ambati: 17 మందిని కూడా లాగేసుకున్నావ్.. ఇది నీకు న్యాయమేనా బాబు..
-
చంద్రబాబు రోజురోజుకూ దిగజారిపోతున్నారు: అంబటి
గుంటూరు, సాక్షి: టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అడ్డదారులు తొక్కారు. 57 డివిజన్లకుగాను మా సంఖ్యా బలం 44. 17 మంది వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను బెదిరించి తీసుకుపోయారు. చంద్రబాబు రోజురోజుకూ దిగజారిపోతున్నారు. విప్ను ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకుంటాం. -
అమ్మా అనితా ఎందుకా అబద్ధాలు.. అంబటి మాస్ వార్నింగ్
-
చేబ్రోలు కిరణ్ను పెంచి పోషించేది చంద్రబాబే: అంబటి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ఏడాది కాలం పాలనలో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఏమీ చేయకపోయినా చంద్రబాబును హీరోలా చూపిస్తూ ఆయన అనుకూల మీడియా కథనాలు ప్రసారం చేస్తుందని.. చంద్రబాబు హీరో కాదు.. విలన్’’ అంటూ ఆయన దుయ్యబట్టారు. గతంలోనూ విలన్ లాగే వ్యవహరించారు. సోషల్ మీడియా సైకోల తోక కత్తిరిస్తానంటూ అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టేవారి కోరలు పీకేస్తామన్నారు. పిడి యాక్ట్ పెట్టి తాటతీస్తామన్నారు. చంద్రబాబు అసభ్యకరమైన పోస్టులు పెట్టే వారిని ప్రోత్సహిస్తూనే ఉన్నారు’’ అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.‘‘వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు. వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై చాలా దారుణమైన పోస్టులు పెట్టారు. తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చేబ్రోలు కిరణ్ను పెంచిపోషించింది చంద్రబాబు కాదా?. చేబ్రోలు కిరణ్ ఎంతో మందిపై చాలా దారుణంగా మాట్లాడాడు. చేబ్రోలు కిరణ్ను అరెస్ట్ చేసి వదిలేశారు. చేబ్రోలు కిరణ్ విడుదలైనంత తొందరగా సోషల్ మీడియా కేసులో అరెస్ట్ అయిన వారెవరూ విడుదల కాలేదు. వైఎస్సార్సీపీ నుంచి ఎవరు అరెస్ట్ అయినా వారిని పిటిషన్ వేసి కస్టడీకి తీసుకుంటున్నారు. కానీ చేబ్రోలు కిరణ్ను మాత్రం పోలీస్ కస్టడీకి తీసుకోలేదు. చంద్రబాబు పెంచి పోషించాడు కాబట్టే.. చేబ్రోలు కిరణ్ కేసులో 24 గంటల్లో విచారణ పూర్తయిపోయింది..చంద్రబాబు చేయించిన ఏ అరెస్ట్ లోనూ ఇంత త్వరగా విచారణ పూర్తికాలేదు. చంద్రబాబు డైరెక్షన్లో కొన్ని వందల మంది ఐ-టీడీపీలో పనిచేస్తున్నారు. ఎవరిని ఎక్కువ బూతులు తిడితే వారిని అంత పోషిస్తామని చెబుతున్నారు. చంద్రబాబు మాటలన్నీ దొంగమాటలు. స్వాతి రెడ్డి అనే సోషల్ మీడియా కార్యకర్త పేరు స్వాతి చౌదరి. వైఎస్ జగన్ ఫోటోలు మార్ఫింగ్ చేయించేది చంద్రబాబు, లోకేష్లే. టీడీపీని మేం ప్రశ్నిస్తే వాళ్లకంటే ముందు సీమ రాజా అనేవాడు స్పందిస్తాడు. వైఎస్సార్సీపీ కండువా వేసుకుని టీడీపీ తరపున మమ్మల్ని తిడతాడు. సీమరాజాపై ఒకసారి కేసుపెట్టా.. మళ్లీ పెడతా. కిరాక్ ఆర్పీ అనేవాడు రోజూ వైఎస్ జగన్ను, నన్ను, రోజాను తిడతాడు. చంద్రబాబుతో ఫోటోలు దిగుతాడు. వ్యక్తిత్వ హననం చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టి విద్య. ఎన్టీఆర్తో మొదలుపెట్టి ఇప్పటికీ ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూనే ఉన్నాడు..వ్యక్తిత్వ హననం చేసి చంద్రబాబు పైశాచికానందం పొందుతున్నాడు. సోషల్ మీడియాలో వారిని పెంచి పోషించేది వారికి డబ్బులిచ్చేది చంద్రబాబే. సోషల్ మీడియాలో పనిచేస్తే పేమెంట్ ఇస్తానని చెప్పింది చంద్రబాబు. ఎవరు బాగా తిడితే వారికి ఎక్కువ పేమెంట్ ఇస్తామని సాక్షాత్తూ చంద్రబాబే చెప్పారు. యూ ట్యూబ్లలో సైతం ఎంతో దుర్మార్గంగా.. దారుణమైన పోస్టులు పెడుతున్నారు. వెంకట కృష్ణ ఒక కీ ఇచ్చే బొమ్మ. వెనకుండి నడిపించేది రాధాకృష్ణ. మార్ఫింగ్ చేసిన పోస్టులు పెట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరు. చేబ్రోలు కిరణ్ వంటి వారిని పెంచి ప్రోత్సహిస్తూ.. మహిళలను ఏదైనా అంటే సహించేది లేదని బిల్డప్ ఇస్తున్నారు...చంద్రబాబుని మోసేది సీమరాజా, కిర్రాక్ ఆర్పీ వంటి వారే. ఇంత నీచమైన స్థితికి టీడీపీ దిగజారిపోవడం బాధాకరం. ఐ-టీడీపీ ద్వారా జరుగుతున్న నీచమైన ప్రచారాలకు చంద్రబాబు చెక్ పెట్టాలి. ఏ ఒక్కరినీ వదలం అందరిపైనా కేసులు పెడతాం. అనిత పేరుకే హోంమంత్రి. హోంశాఖ గురించి ఆమెకు తెలియదు.. హోంశాఖను నడిపించేది లోకేష్. మా ఫిర్యాదులపై పోలీసులు కేసులు రిజిస్టర్ చేయకపోతే న్యాయపరంగా పోరాడతా. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వికృతచేష్టలపై పోరాడతాం’’ అని అంబటి రాంబాబు హెచ్చరించారు. -
ఇది హీనాతి హీనమైన చర్య
-
Ambati: మాకు బుక్ ఎందుకు బుర్ర ఉంది...
-
అది మీ ఖర్మ.. జేఏసీకి YSRCP మద్దతు
-
Ambati: ఒక్క హామీ కూడా నెరవేర్చకోపోగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు
-
విజయసాయిరెడ్డి చంద్రబాబు చేతిలోకి వెళ్లారు: అంబటి
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వ అవినీతి పాలన నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, లిక్కర్ స్కాం అంటూ రాజ్ కేసిరెడ్డిలను అరెస్ట్ చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.సూట్కేస్ కంపెనీ ఉర్సుకు విశాఖలో రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కారుచౌకగా కట్టబెట్టారని, రాజధాని అమరావతిలో కోట్ల రూపాయల కమిషన్లు విలువైన పనులను కావాల్సిన వారికి కట్టబెట్టి కోట్లాధి రూపాయలు కమీషన్లుగా దండుకుంటున్నారని ఆరోపించారు. వీటిపై ప్రజల్లో జరుగుతున్న చర్చ నుంచి వారి దృష్టిని మళ్ళించేందుకే ఈ తాజా అరెస్ట్ల డ్రామాకు చంద్రబాబు తెరతీశారని మండిపడ్డారు. ఇటువంటి దుర్మార్గాలకు చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇంకా ఆయనేమన్నారంటే..తన అవినీతి, అసమర్థ పాలన నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు ఎంతకైనా తెగిస్తున్నారు. అరెస్ట్లకు ఎవరూ అతీతం కాదని చంద్రబాబు అంటున్నారు. తనకు నచ్చని వారిని ఎవరినైనా సరే అరెస్ట్ చేసేస్తాననే పద్దతిలో ఈ ప్రభుత్వం నడుస్తోంది. తాజాగా ఐపీఎస్ ఆఫీసర్ పీఎస్ఆర్ ఆంజనేయులును హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఆయన ఏపీలో అనేక చోట్ల పనిచేశారు. నీతీ, నిజాయితీ కలిగిన అధికారిగా గుర్తింపు పొందారు.పదోన్నతులతో డీజీపీ స్థాయికి వచ్చారు. డీజీపీ కావాల్సిన అధికారిని ఈ కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. గతంలో ఒక కేసులో ఆనాటి ఇన్వెస్టిగేటీవ్ ఆఫీసర్లుగా ఉన్న ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలపై కూడా ఎదురు కేసులు నమోదు చేశారు. వారిద్దరూ యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పీఎస్ఆర్ ఆంజనేయులు పనిచేస్తున్నారు. ఆయన కోర్టుకు వెళ్లలేదు, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోలేదు. ఈ రోజు హఠాత్తుగా ఆయనను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు.డైవర్షన్ పాలిటిక్స్లో చంద్రబాబు సిద్దహస్తుడుఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను అమలు చేయలేకపోతున్నాను, బడ్జెట్ చూస్తుంటే భయం వేస్తోందంటూ మాట్లాడుతున్నారు. ఆయన మాటలు చూస్తూ చంద్రబాబు అబద్దాల కోరు అని జనం చర్చించుకుంటున్నారు. ఒక్క హమీని కూడా నెరవేచ్చని దుర్మార్గమైన పాలన సాగుతోంది. దీనిపై ప్రజల దృష్టిని మళ్ళించేందుకు తాజాగా ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్ట్ చేశారు. ఉర్సు అనే కంపెనీకి విశాఖలో మూడు వేల కోట్ల రూపాయల ఆస్తిని కేవలం 99 పైసలకు ఎకరం చొప్పున ఇచ్చేశారు. ఇది దోపిడీ కార్యక్రమం కాదా?ఇది ప్రజలు చర్చించుకోకుండా పీఎస్ఆర్ ఆంజనేయులు, లిక్కర్ స్కాం అంటూ రాజ్ కసిరెడ్డిలను అరెస్ట్ చేసి, దానిపై పెద్ద హంగామా సృష్టిస్తున్నారు. మరోవైపు రాజధాని పేరుతో విపరీతంగా వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకువస్తున్నారు. ఆ సొమ్ముతో కాంట్రాక్ట్లకు ఇస్తూ, వారి నుంచి కమిషన్లు దండుకుంటున్నారు. ఈ పనులకు రెండో తేదీన అమరావతిలో రెండోసారి శంకుస్థాపనకు ప్రధానమంత్రిని ఆహ్వానించారు. విపరీతమైన దోపిడీతో రాష్ట్రం సతమతమవుతోంది.లిక్కర్, ఇసుక, మట్టి పేరుతో ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు. రాష్ట్రంలోని టీడీపీ నాయకులు, చంద్రబాబు, నారా లోకేష్లు విపరీతంగా దోచుకుంటూ, ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కేవలం పదకొండు నెలల్లో ఇంత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ప్రభుత్వం దేశంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం ఒక్కటే. ఏపీలో లిక్కర్ స్కాం అంటూ హడావుడి చేస్తున్నారు. ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతుంటే, దానిలో కుంభకోణం ఎలా జరుగుతుంది. ఒక్క కొత్త డిస్టలరీకి కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. గత ప్రభుత్వం కన్నా తక్కువ రేట్లకే మద్యం విక్రయించాం, బెల్ట్ షాప్లను తొలగించాం దీనికి ఎవరైనా లంచాలు ఇస్తారా? పర్మిట్ రూంలు ఎత్తేస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టలరీలకు అర్డర్లు ఇచ్చాం. దీనిలో ఏదో స్కాం జరిగిపోయిందంటూ చంద్రబాబు హంగామా చేస్తున్నారు.రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారుకూటమి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుని తప్పుడు కేసులతో ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయా? చంద్రబాబే శాశ్వతంగా సీఎంగా ఉంటారా? సీఎంలు మారితే ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేయవచ్చా? డీజీపీలుగా పనిచేసిన వారిని కూడా అరెస్ట్లు చేయవచ్చా? ఏమిటీ ఈ అన్యాయం? కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గాలపై న్యాయస్థానాలు వాతలు పెడుతున్నా వారికి బుద్ది రావడం లేదు. పోసాని కృష్ణమురళిపై బీఎన్ఎస్ 111 సెక్షన్ పెట్టినందుకు సదరు విచారణాధికారిని కోర్ట్ ఎదుట హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.ప్రేమ్కుమార్ అనే వ్యక్తి మీద ఎక్స్ట్రార్షన్ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తే, కోర్టు దానిని తీవ్రంగా ఆక్షేపించింది. అవసరమైతే డీజీపీని కోర్ట్కు పిలుస్తామని కూడా హెచ్చరించాయి. కలకాలం చంద్రబాబే సీఎంగా ఉండరని గుర్తుంచుకోవాలి. పరిపాలన చేయలేక, కక్షసాధింపులతో పనిచేస్తున్నారు. కూటమి పార్టీలకు ఓటు వేసిన వారు సిగ్గుపడేలా పరిపాలన చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని పాలన చేయాలనుకున్న వారు ఎవరూ మనజాలలేదు.గోరంట్ల మాధవ్ వ్యవహారంలో పదకొండు మంది పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. ఇది కక్షసాధింపు చర్యలు కావా? నిజంగా పోలీసులు తప్పు చేశారని నిర్ధారిస్తే దీనికి బాధ్యత వహించి హోమంత్రి రాజీనామా చేయాలి. డీజీపీ నుంచి కిందిస్థాయి అధికారుల వరకు పోలీసులు ఆలోచించాలి. మీ తోటి అధికారులను కక్షసాధింపుల్లో భాగంగా తప్పుడు కేసులతో మీతోనే అరెస్ట్ చేయించింది. ఇదే పద్దతి కొనసాగితే రేపు ప్రభుత్వాలు మారితే మీమ్మల్ని కూడా అరెస్ట్ చేసేయవచ్చు కదా? ఈ సంప్రదాయం వల్ల ఎవరికి నష్టం జరుగుతోంది? ప్రతి ఐపీఎస్ అధికారి దీనిపై ఆలోచించుకోవాలి.అణిచివేస్తే భయపడతామా?గతంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, ఇందిరాగాంధి, జయలలిత, వైయస్ జగన్ వంటి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా అరెస్ట్ చేసిన ఐపీఎస్ అధికారులపై వారి ప్రభుత్వాలు వచ్చిన తరువాత ఎక్కడైనా కేసులు నమోదయ్యాయా? చంద్రబాబును అరెస్ట్ చేశారనే కక్షతోనే ఇలా అరెస్ట్లు చేసుకుంటూ పోతున్నారు. రేపు చంద్రబాబు, లోకేష్లు మాజీలు కాకుండా పోతారా? ప్రభుత్వాలు మారి, మీరు ప్రతిపక్షంలోకి రాకుండా పోతారా? ఎవరు చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడితే వారిని అరెస్ట్ చేస్తారా?కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మరింత బలంగా ఈ అక్రమాలపై పోరాడేందుకు ముందుకు వచ్చే పరిస్థితిని కల్పిస్తున్నారు. మా పార్టీ నుంచి బయటకు వెళ్లిన విజయసాయిరెడ్డి ఇప్పుడు చంద్రబాబు చేతుల్లో ఉన్నారు. అందుకే ఆయన అలా మాట్లాడుతున్నారు. మూడున్నరేళ్ళ పదవీకాలాన్ని విజయసాయిరెడ్డి వదులుకున్నారు. కూటమి కోసం తన పదవిని వదిలేశారు. కూటమికి లాభం చేసే నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి వ్యక్తి మాటలకు, సాక్ష్యాలకు విశ్వసనీయత ఏముంటుందీ? వారి మాటలకు, వాదనలకు విలువ ఏముంటుందీ? -
వైఎస్సార్సీపీ నేతల పేర్లు చెప్పకపోతే వ్యభిచారం కేసు పెడతారా?
-
కృష్ణవేణిని అరెస్ట్ చేసి.. దాచేపల్లి సీఐ వేధింపులు: అంబటి
సాక్షి, గుంటూరు: ఒక మహిళ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందని పాలేటి కృష్ణవేణిని అరెస్ట్ చేసి ఆమెపై వ్యభిచారం కేసు పెడతానని బెదిరించడం ఏంటి? అని ప్రశ్నించారు.సోషల్ మీడియా కేసులో అరెస్టై గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న పాలేటి కృష్ణవేణిని ములాకత్ ద్వారా పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, దొంతి రెడ్డి వేమారెడ్డి, పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు. అనంతరం, మాజీ అంబటి మీడియాతో మాట్లాడుతూ..‘సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందని పాలేటి కృష్ణవేణిని అరెస్టు చేసి పోలీసులు దాచేపల్లి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లారు. దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్.. సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాదులో కృష్ణవేణిని అరెస్టు చేసి మరుసటి రోజు ఉదయం వరకు స్టేషన్లోనే ఉంచి కనీసం ఆహారం కూడా ఇవ్వలేదు.కృష్ణవేణి పట్ల సీఐ భాస్కర్ అసభ్యంగా మాట్లాడాడు. తాము చెప్పినట్టు వినకపోతే కృష్ణవేణి భర్తపై గంజాయి కేసు పెడతానని సీఐ బెదిరించాడని ఆమె చెబుతోంది. కృష్ణవేణిపై వ్యభిచారం కేసు పెడతానని సీఐ బెదిరించాడట. కృష్ణవేణి బంధువులు పోలీస్ స్టేషన్కు రాకుండా సీఐ స్టేషన్ గేట్లకు బేడీలు వేశాడు. తనను సీఐ భాస్కర్ వేధించారని కృష్ణవేణి మేజిస్ట్రేట్కి వాంగ్మూలం ఇచ్చింది. ఒక మహిళ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన దాచేపల్లి సీఐపై వెంటనే చర్యలు తీసుకోవాలి.సీమ రాజా, కిరాక్ ఆర్పీ.. మంత్రి నారా లోకేష్ పెంచుతున్న రోబోలు. మాపైన అసభ్యంగా పోస్టులు పెట్టినందుకు సీమ రాజా, కిరాక్ ఆర్పీపై మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కేసులు కట్టరు. వాళ్లని లోకేష్ పోషిస్తున్నాడు కనుక వాళ్లపై కేసులు కట్టడం లేదు. గతంలో పెద్దిరెడ్డి సుధారాణిని 50 రోజులకు పైగా జైలుకు పంపారు. పార్టీ నాయకుల పేర్లు చెప్పమని సీఐ తనను హింసించాడని కృష్ణవేణి చెప్తోంది. మహిళల జోలికి వస్తే ఒప్పుకోనని చెప్పే చంద్రబాబు ఇప్పుడేం చేస్తాడో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
ఇది తప్పు పోలీసులకు అంబటి వార్నింగ్
-
చేబ్రోలు కిరణ్ ఎపిసోడ్ పై అంబటి రియాక్షన్
-
‘చేబ్రోలు కిరణ్ కుమార్ను పెంచి పోషించింది ఐటీడీపీనే’
గుంటూరు,సాక్షి: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా చేబ్రోల్ కిరణ్ కుమార్ వైఎస్సార్సీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. కిరణ్ కుమార్ను ఐటీడీపీ పోషిస్తోంది. ఐటీడీపీని లోకేష్ పోషిస్తున్నాడని దుయ్యబట్టారు.మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కలిసేందుకు అంబటి రాంబాబు శుక్రవారం నల్లపాడు పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. గోరంట్ల మాధవ్ రాత్రి ఎలా ట్రీట్ చేశారో అని తెలుసుకునేందుకు వచ్చా. మాధవ్ను నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి నగరంపాలెం పోలీస్ స్టేషన్కు తరలిస్తామని చెప్పారు. కోర్టు ముందు ప్రవేశ పెట్టేటప్పుడు కలిసేందుకు అవకాశం ఇస్తామని పోలీసులు చెప్పినట్లు తెలిపారు.‘‘ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ను లోకేష్ పెంచి పోషించారని.. వైఎస్సార్సీపీ నేతలపై కిరణ్తో అనుచిత వ్యాఖ్యలు చేయించారు. చేబ్రోలు కిరణ్ కుమార్ ఏడాది నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. అప్పటినుంచి అతన్ని అరెస్ట్ చేయకుండా ఇప్పుడు ఎందుకు పోలీసులు అరెస్ట్ చేశారు.వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి భారతీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. దీంతో డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి కిరణ్ కుమార్ను అరెస్ట్ చేశారు. కిరణ్ కుమార్ను ఐటీడీపీ పోషిస్తోంది. ఐటీడీపీని లోకేష్ పోషిస్తున్నాడని ధ్వజమెత్తారు. -
గోరంట్ల మాధవ్ ని ఎక్కడ దాచిపెట్టారు? అరెస్ట్ పై అంబటి రియాక్షన్
-
గోరంట్ల మాధవ్ ఎక్కడ?.. పోలీసులు చెప్పడం లేదు: అంబటి
సాక్షి, గుంటూరు: గోరంట్ల మాధవ్ను ఎక్కడ ఉంచారో పోలీసులు చెప్పడం లేదని.. ఒక వేళ అరెస్ట్ చేస్తే 24 గంటల్లోపు కోర్టులో హాజరుపర్చాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గురువారం రాత్రి.. గోరంట్ల మాధవ్తో మాట్లాడేందుకు నగరపాలెం పీఎస్కు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి వెళ్లారు. కానీ గోరంట్ల మాధవ్ను ఎక్కడ ఉంచారో పోలీసులు చెప్పకపోవడంతో అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ను లోకేష్ పెంచి పోషించారని.. వైఎస్సార్సీపీ నేతలపై కిరణ్తో అనుచిత వ్యాఖ్యలు చేయించారని అంబటి రాంబాబు మండిపడ్డారు. చేబ్రోలు కిరణ్పై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తుతోందని.. దీంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం కిరణ్ను అరెస్ట్ చేయించి.. చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని అంబటి మండిపడ్డారు. -
జగన్ భద్రతపై అనిత వ్యాఖ్యలకు అంబటి దిమ్మదిరిగే కౌంటర్
-
జగన్ భద్రతపై అనిత వ్యాఖ్యలకు అంబటి దిమ్మదిరిగే కౌంటర్
-
‘అనిత మైకు ముందు మాత్రమే మంత్రి... తెరవెనుక నడిపించేదంతా లోకేషే’
సాక్షి, తాడేపల్లి: రామగిరిలో ఎంపీపీ ఎన్నికల్లో బలం లేకపోయినా టీడీపీ పోటీ చేసిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ నేతల నుంచే కాదు.. పోలీసుల నుంచి మా ఎంపీటీసీలను దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసులు.. టీడీపీకి కొమ్ముకాస్తున్నారంటూ మండిపడ్డారు.‘‘పోలీసుల అండతో టీడీపీ నేతలు స్థానిక ఎన్నికలను వాయిదా పడేలా చేశారు. పోలీసులను అడ్డంపెట్టుకుని టీడీపీ నేతలు రౌడీయిజం చేస్తున్నారు. ఎన్నో మోసాలు చేసిన చంద్రబాబు పెద్ద చీటర్. కూటమి ప్రభుత్వం వచ్చాక పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీశ్రేణులు గ్రామాలకు గ్రామాలే వదిలి వెళ్లిపోయారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఎస్ఐని కూడా ట్రాన్స్ఫర్ చేయలేని అనిత మీడియా ముందు అవాకులు, చవాకులు పేలుతున్నారు’’ అంటూ అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.‘‘రామగిరిలో గత నెల 27న ఎంపీపీ ఎన్నిక జరగాలి. రామగిరిలో 10 ఎంపీటీసీల్లో 9 వైఎస్సార్సీపీ, 1 టీడీపీ గెలిచింది. ఒక్క ఎంపీటీసీతో ఎలా ఎన్నికకు వెళ్థామనుకున్నారో అర్థం కాలేదు. ఎన్నిక నేపథ్యంలో ఇద్దరు ఎంపీటీసీలను టీడీపీ లాగేసుకుంది. మిగిలిన ఆరుగురుని గద్దల్లా తన్నుకుపోకుండా మేం కాపాడుకున్నాం. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలకు భద్రత కల్పించమని కోర్టు ఆదేశించింది. ప్రజాస్వామ్య యుతంగా గెలిచిన మా ఎంపీటీసీలను పోలీసులు, అధికారుల నుంచి కాపాడుకోవాల్సి వచ్చింది..30వ తేదీన లింగమయ్యను అతిదారుణంగా హతమార్చారు. ఇంత దారుణం జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. అన్ని ప్రలోభాలకు గురిచేసినా అత్తిలిలోనూ మా బలం 13 మంది. ఎన్నికకు వెళ్లకుండా మా నాయకులు కారుమూరి నాగేశ్వరరావు ఇంటిని టీడీపీ నేతలు ట్రాక్టర్లతో ముట్టడించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేసే టీడీపీ నేతలే క్రిమినల్స్. ఇచ్చిన హామీలను అమలు చేయలేని పెద్ద చీటర్ చంద్రబాబు. 2024 ఎన్నికల తర్వాత పల్నాడులో గ్రామాలను వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది..హోంమంత్రి అనిత మైకు ముందు మాత్రమే మంత్రి... తెరవెనుక నడిపించేదంతా లోకేషే. అనిత ఎస్ఐను కూడా ట్రాన్స్ఫర్ చేయించలేరు. మా నేతలను బెదిరించి.. భయపెట్టేవారికి పోస్టింగ్లు ఉంటాయి. నేనే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయలేదు. ఎందుకు కేసులు నమోదు చేయరని అడిగితే నాపైనే కేసు పెట్టారు. నేను కోర్టును ఆశ్రయిస్తే ఇప్పుడు నా ఫిర్యాదుపై కేసు నమోదు చేస్తున్నారు. కచ్చితంగా మళ్లీ మేం అధికారంలోకి వస్తాం. చట్టానికి వ్యతిరేకంగా ఓ వర్గానికి కొమ్ముకాస్తున్న వారిని కచ్చితంగా బట్టలిప్పి నుంచోబెడతాం..పోలీసులు సంఘవిద్రోహ శక్తులు అన్నది చంద్రబాబు కాదా. 1100 మంది పోలీసులను పెట్టామని హోంమంత్రి చెబుతున్నారు. ఏం చేయడానికి వచ్చారు అంతమంది అని ప్రశ్నిస్తున్నా. పలు మార్లు కోర్టులు అక్షింతలు వేసినందుకు డిఫ్యాక్ట్ హోం మంత్రి నారా లోకేష్ సిగ్గుపడాలి. చంద్రబాబు, లోకేష్కు జనం ఎగబడరు. కానీ జగన్ రోడ్డు మీదకు వస్తే వేలాది మంది వస్తారు. వేలాది మంది హెలీకాప్టర్ వద్దకు వస్తే పోలీసులు ఏం భద్రత కల్పించారు?..జగన్ ఇప్పటికి.. ఎప్పటికీ పులివెందుల ఎమ్మెల్యే. ఒక మాజీ సీఎం కుమారుడు.. మాజీ సీఎంగా చేసిన వ్యక్తి జగన్. అసాధారణమైన ప్రజాదరణ కలిగి గొప్ప నాయకుడు జగన్. అమ్మా హోంమంత్రి.. జగన్కు జడ్ ప్లస్ సెక్యూరిటీ నువ్వు, లోకేష్ ఇచ్చింది కాదు. ఆయనకు హక్కుగా వచ్చింది జడ్ ప్లస్ సెక్యూరిటీ. భద్రత ఇవ్వడం మీకు చేతకాకపోతే...ఇవ్వలేమని చెప్పండి. గుంటూరు మిర్చియాడ్కు వెళ్తుంటే.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సెక్యూరిటీని తొలగించారు. సెక్యూరిటీ ఇవ్వకుండా జగన్కు ఏమైనా జరిగితే ఆనందపడాలని మీ ఆలోచన అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..ఎన్నాళ్లు మీ అరాచకాలను సహించాలి. మా ఇళ్ల పై పడి దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?. ఐపీఎస్ అధికారులు స్ట్రిక్ట్గా ఉండకపోతే శాంతి భద్రతలు లోపిస్తాయి. వైఎస్ జగన్కి సెక్యూరిటీ కోసం మేం సైన్యాన్ని తయారు చేసుకోవాలా?. ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగానే భద్రత కల్పించడం లేదనే అనుమానాలున్నాయి. దయచేసి అక్రమాలు, అన్యాయాలకు మార్గాలు వేయకండి. ఎవరైతే చట్టప్రకారం వ్యవహరించరో.. టీడీపీకి కొమ్ముకాస్తారో... వారిని చట్టం ముందు యూనిఫాం విప్పి నిలబెడతాం. ఎంపీపీ ఎన్నిక కోసం నిండుప్రాణాన్ని తీసేస్తారా?. చంద్రబాబు, లోకేష్ మాటలు విని కావాలనే కుట్ర చేస్తున్నారు. ఇలాగే వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’’ అని అంబటి రాంబాబు హెచ్చరించారు. -
షర్మిల ఆరోపణలపై అంబటి రాంబాబు రియాక్షన్..
-
చంద్రబాబుతో కలిసి షర్మిల డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది: అంబటి రాంబాబు
-
చంద్రబాబుతో కలిసి షర్మిల డైవర్షన్ పాలిటిక్స్: అంబటి
సాక్షి, గుంటూరు: చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఏపీకి అన్యాయం జరుగుతుందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 2014లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. ప్రత్యేక హోదా ఎగిరిపోయింది. ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అంటూ చంద్రబాబు హోదాను తాకట్టు పెట్టారు. పోలవరాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు’’ అంటూ అంబటి రాంబాబు దుయ్యబట్టారు.‘‘పోలవరం ప్రాజెక్టు 47.72ను ఎత్తు నుంచి 41.15 ఎత్తుకు తగ్గించారు. చంద్రబాబు దీనికి ఒప్పుకున్నాడు. కేంద్ర జల శక్తి వార్షిక నివేదికలో కూడా ఇదే పేర్కొంది. పోలవరాన్ని41.15 తగ్గించి కేంద్రం 25 వేల నుంచి 30 వేల కోట్లు ఎగ్గొడుతుంది. లోకేష్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి చంద్రబాబు దీనికి ఒప్పుకున్నాడు. ఇది దారుణమైన అంశం. వైఎస్సార్సీపీపై విరుచుకుపడి కథనాలు రాసే ఆంధ్రజ్యోతి, ఈనాడు ఈ కథనాన్ని ఎందుకు రాయరు?’’ అంటూ అంబటి ప్రశ్నించారు.‘‘పోలవరం ఎత్తును తగ్గించారని నేను చెబుతున్న మాటలు తప్పయితే కేంద్ర మంత్రులు గాని రాష్ట్ర మంత్రులు చెప్పాలి. పోలవరం ఎత్తు తగ్గిస్తే మంత్రులు ఎందుకు మాట్లాడలేదు. షర్మిల చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్లో కీలక పాత్ర పోషిస్తుంది. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్లో షర్మిల సింహభాగం పాత్ర పోషిస్తుంది. కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు కలిసి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారు. అలాంటి కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరి, చంద్రబాబుతో కలిసి డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతుంది’’ అని అంబటి రాంబాబు మండిపడ్డారు.‘‘ఆస్తి తగాదాలుంటే కోర్టుకు వెళ్లి తేల్చుకోవాలి. చంద్రబాబుకి చెల్లెలు ఉన్నారు. వాళ్లకి హెరిటేజ్లో భాగం ఇవ్వమంటే ఇస్తాడా?. వైఎస్ జగన్ను దెబ్బతీయడానికి షర్మిలతో మాట్లాడిస్తున్నారు’’ అంటూ అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కొడాలి నాని ఆరోగ్యంపై లోకేష్ వ్యాఖ్యలకు అంబటి కౌంటర్
-
Ambati Rambabu: నారా లోకేష్ ఆయన స్థాయి ఏంటో తెలుసుకోవాలి
-
లోకేష్ నీ స్థాయేంటో తెలుసుకో
తాడేపల్లి,సాక్షి : అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి గురించి మంత్రి నారా లోకేష్ అనుచితంగా మాట్లాడటం సరికాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు హితువు పలికారు.రెడ్ బూక్ చూసి ఒకరు కిందపడ్డారని, మరొకరికి గుండెపోటు వచ్చిందని నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాంబాబు స్పందించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అధికారం శాశ్వతం కాదని లోకేష్ గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. రాజకీయాల్లో నేను ఎన్నోఎత్తుపల్లాలు చూశాను. అధికారం ఉంది కదా అని ఏనాడు హద్దు మీరలేదు. కానీ లోకేష్ అలా కాదు. అధికారం ఉందని వికటాట్టహాసం చేస్తున్నారు.వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కళ్ళు నెత్తి మీదకి ఎక్కి వాపును బలం అనుకుని లోకేష్ మాట్లాడుతున్నారు. లోకేష్ నీ స్థాయి ఏంటో తెలుసుకో. 2019లో పార్టీ ఒకటి పోవడానికి మీరు కూడా ఒక కారణం అని గుర్తుంచుకోండి. తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వస్తే మీరు ఓడిపోయారు. కూటమికి 164 సీట్లు వస్తే మీరు గెలిచారు.అబద్ధాలు ఆడటంలో చంద్రబాబు కన్నా లోకేష్ మించిపోయాడు. వైఎస్ జగన్ తెచ్చిన కంపెనీలను తానే తెచ్చానని లోకేష్ ప్రచారం చేసుకుంటున్నారు. వైఎస్ జగన్ తెచ్చిన కంపెనీలకు లోకేష్ శంకుస్థాపన చేస్తున్నారు. దావుస్ వెళ్లి చంద్రబాబు నాయుడు లోకేష్ ఏం కంపెనీలు తెచ్చారు.చంద్రబాబు నాయుడు 52 రోజులు పాటు జైలుకి వెళ్ళిన ప్రిజనరి అని లోకేష్ గుర్తుపెట్టుకోవాలి. మీ సహచర మంత్రివర్గ సభ్యులు నీ గురించి ఏం చెప్పుకుంటున్నారో ముందు తెలుసుకో. జగన్కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చామని లోకేష్ చెప్తున్నారు. అదే వైఎస్ జగన్ మిర్చి యార్డుకు వచ్చినప్పుడు పోలీసులు సెక్యూరిటీని కల్పించలేదు.వైఎస్ జగన్ ప్రజల్లోకి వస్తే మీ సెక్యూరిటీ ఆపలేదు అది గుర్తుపెట్టుకోండి.మద్దతు ధరతో మిర్చి ఒక బస్తా ప్రభుత్వం కొనుగోలు చేస్తే నేను మీకు నమస్కారం చేస్తాను.మద్యపాన ప్రియులంతా చంద్రబాబుని తిట్టుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేయండి. పెట్టుబడులు తెచ్చే ప్రయత్నం చేయండి. లోకేష్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. ఆయన స్థాయేంటో ఆయన తెలుసుకోవాలి. అధికార మదంతో లోకేష్కు కళ్లు నెత్తికెక్కాయి’అని ధ్వజమెత్తారు. -
నా కూతుర్లపై అసభ్యమైన పోస్టులు.. అంబటి సీరియస్ వార్నింగ్..
-
ఆ ఐదో ఫిర్యాదుపై కేసు ఎందుకు నమోదు చేయలేదు?: అంబటి
సాక్షి, విజయవాడ: సోషల్ మీడియాలో వైఎస్ జగన్, తన కుటుంబ సభ్యులపై ఐటీడీపీ అసభ్యంగా పోస్టులు పెట్టిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వేసిన రిట్ పిటిషన్పై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగ్లపై పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని అంబటి రాంబాబు కోర్టును ఆశ్రయించారు. తాను ఇచ్చిన ఫిర్యాదుపై ఇన్ పర్సన్గా హైకోర్టులో అంబటి రాంబాబు తన వాదనలను వినిపించారు.తాను ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేయలేదని పిటిషన్లో అంబటి రాంబాబు పేర్కొన్నారు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 5 ఫిర్యాదులు ఇచ్చాను. ఐదో ఫిర్యాదుపై పోలీసులు కేసులు నమోదు చేయలేదు. పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయడం లేదంటూ అంబటి ప్రశ్నించారు. ఐదో ఫిర్యాదుపై కూడా కేసు నమోదు చేసేలా ఆదేశాలివ్వాలని కోర్టును ఆయన కోరారు. దీనిపై కౌంటర్ దాఖలు చేస్తామని పోలీసుల తరఫు లాయర్ తెలిపారు. తదుపరి విచారణ రెండు వారాలకు కోర్టు వాయిదా వేసింది. -
కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై అంబటి రియాక్షన్..
-
కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై అంబటి రాంబాబు క్లారిటీ
సాక్షి, గుంటూరు: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆయన గుండె నొప్పితో బాధపడుతున్నారని.. ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారని.. ఈ వ్యవహారాన్ని టీడీపీ ట్రోల్ చేస్తూ వికృత ఆనందాన్ని పొందుతుందని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎవరు ఆయన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. హైదరాబాద్లో ఆపరేషన్ చేస్తే ఒత్తిడి పెరుగుతుందని భావంతో ఆయన్ను ముంబైకి తీసుకువెళ్లారని అంబటి వివరించారు.‘‘కొడాలి నానికి ఆపరేషన్ చేసే డాక్టర్ రమాకాంత్ పాండే సర్జరీలు చేయడంలో ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి. మా అమ్మ కూడా అక్కడే ఆపరేషన్ చేయించాం. ఇవాళో, రేపో నాని పరిస్థితిని పరిశీలించి డాక్టర్లు ఆపరేషన్ చేయడానికి డేట్ ఇస్తారు. ఆయన సంతోషంగా ఇంటికి వస్తారు.. అందులో ఎటువంటి సందేహం లేదు. టీడీపీ చేసే దుష్ప్రచారాలను నమ్మొద్దు’’ అని అంబటి రాంబాబు చెప్పారు.‘‘జైల్లో ఉన్న వంశీ జుట్టుకు రంగు వేయటం మానేశారు. దీంతో ఆయన ఏదో దిగులు పడిపోయినట్టు, కృంగిపోయినట్టు టీడీపీ నాయకులు ప్రచారం చేస్తూ వికృత ఆనందం పొందుతున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ ధైర్యం కోల్పోయే వ్యక్తులు కాదు. వాళ్లిద్దరూ క్షేమంగా వస్తారు.. టీడీపీని ఎదురిస్తారు. వాళ్ళిద్దరిని ట్రోల్ చేస్తూ టీడీపీ శ్రేణులు పైశాచిక ఆనందం పొందుతున్నాయి.’’ అని అంబటి రాంబాబు దుయ్యబట్టారు. -
KSR Live Show: అర్థమైందా రాజా.. మీ తండ్రి ఏం చేశారో గుర్తుచేసుకో
-
పవన్, లోకేష్ పై అంబటి రాంబాబు అదిరిపోయే కవిత్వం
-
పవన్ అసమర్థుడినని తానే ఒప్పుకున్నాడు: అంబటి
సాక్షి, గుంటూరు: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంపద సృష్టిస్తామన్నారు.. ఏమైంది? అని ప్రశ్నించారు. అలాగే, రాష్ట్రంలో తొమ్మిది నెలల కూటమి పాలనలో ఎంత సంపద సృష్టించారు చెప్పాలని డిమాండ్ చేశారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుది అంతా పబ్లిసిటీ స్టంట్. చంద్రబాబు పీ-4 పేరుతో ప్రజలందరినీ అడ్వాన్స్డ్ ఏప్రిల్ ఫూల్ చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు సంపద సృష్టిస్తామన్నారు.. సంపద ఏమైంది?. రాష్ట్రంలో తొమ్మిది నెలల కూటమి పాలనలో ఎంత సంపద సృష్టించారు. గత ప్రభుత్వ పథకాలను పాతరేశారు. కొత్త పథకాల ఊసేలేదు. రాష్ట్రంలోని పేద ప్రజలను మరింత పేదరికంలోకి నెడుతున్నారు. డబ్బులు ఉన్నోడికే మెడికల్ సీట్లు దోచిపెడుతున్నారు. నీతి, నిజాయితీకి మారు పేరు అంటే చంద్రబాబు ఎవరైనా నమ్ముతారా?. బంగారు కుటుంబం అని రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. పీ-4 అంటూ బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. పీ-4 పేరుతో కొత్త నాటకం..చంద్రబాబు నాయుడు పీ-4 పేరుతో కొత్త నాటకాన్ని ప్రారంభించాడు. పీ-4కు మార్గదర్శి బంగారు కుటుంబం అని కొత్త పేరు పెట్టాడు. ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలనకు పీ-4 దోహదం చేస్తుందని చంద్రబాబు చెప్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కొత్తగా టోల్ గేట్లు పెడతానని చెబుతున్నారు. మెడికల్ కాలేజీలు, పోర్టులు, గ్రామీణ ప్రాంత రోడ్డును చంద్రబాబు నాయుడు ప్రైవేటుపరం చేస్తున్నాడు. గత చంద్రబాబు ప్రభుత్వంలో 58 కార్పొరేషన్లను ప్రైవేటీకరణ చేశాడు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్, సంపద సృష్టిస్తానని చెప్పాడు. పేదరిక నిర్మూలన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.పేదరిక నిర్మూలన కావాలంటే విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలి. అంతేకానీ కాంట్రాక్టర్లను, డబ్బులు ఉన్నవారిని, బడా బాబుల్ని పీ-4 పేరుతో వేదికపైన కూర్చోబెడితే పేదరికం పోదు. ఈ రాష్ట్రంలో రెండే రెండు బంగారు కుటుంబాలు ఉన్నాయి. ఒకటి చంద్రబాబుది, రెండోది పవన్ కళ్యాణ్ది. ఈ రెండు బంగారు కుటుంబాలే. గతంలో చంద్రబాబు నాయుడు జన్మభూమి అన్నాడు.. శ్రమదానం అన్నాడు అవన్నీ పోయాయి. ఇప్పుడు పీ-4 పేరు చెప్పి ప్రచారం చేసుకుంటున్నాడు.చంద్రబాబు నాయుడు నేనేం తప్పు చేయనని డప్పు కొట్టుకుంటున్నాడు. ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన చేసేవన్నీ తప్పులే. ఎన్టీఆర్ దగ్గర పని చేశారని చంద్రబాబు చెప్తున్నాడు. ఆయన ఇందిరా గాంధీ దగ్గర పని చేశాడు.. ఎన్టీఆర్ పని పూర్తి చేశాడు. లోకేష్ లాంటి అసమర్ధుడిని ప్రజలపై రుద్దాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. రాష్ట్రంలో ఒక కోటి 40 లక్షల మంది వైట్ రేషన్ కార్డులు ఉన్నవాళ్లు ఉన్నారు. ఎనిమిది లక్షల అరవై వేల మంది ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉన్నారు. వీళ్లని వాళ్లతో ఎలా అనుసంధానం చేస్తాడు?.పవన్ ప్యాకేజీ స్టారే..పవన్ కళ్యాణ్ నేను అసమర్థున్ని అని మనసులో మాట బయటపెట్టారు. పవన్ మాటలను జనసేన కార్యకర్తలు, వీర మహిళలు ఆలోచించాలి. లోకేష్ డబ్బులు వసూలు చేసి పవన్కి ప్యాకేజీ ఇస్తున్నాడు. పేదల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడుకి లేదు. చంద్రబాబు నాయుడు సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను.. ఐటీ నేనే తెచ్చానని పిట్టలదొర మాటలు మాట్లాడుతున్నాడు. డబ్బులు కోసం పోలవరాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశాడు. పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని సాక్షాత్తు ప్రధాని మోదీనే చెప్పారు. పోలవరంపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు నేను సిద్ధం. చంద్రబాబు వచ్చినా.. ఆయన మంత్రులను పంపించినా చర్చకు నేను సిద్ధం. కేంద్రం కట్టాల్సిన పోలవరాన్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అని ఎప్పటినుంచో అడుగుతున్నాను. కానీ, తెలుగుదేశం నాయకులు గానీ చంద్రబాబు గానీ.. ఎవరు సమాధానం చెప్పడం లేదు ఎందుకు?. కూటమి ప్రభుత్వానికి రోజులు చెల్లాయి. చంద్రబాబు సర్కార్పై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరపడ్డాయి. చంద్రబాబు తెలిపి తక్కువ వల్లే పోలవరం ఆలస్యమైంది. పోలవరంపై చర్చకు ఎప్పుడైనా సిద్దమే. స్పిల్ వే, కాఫర్ డ్యామ్ పూర్తి చేసిన ఘనత వైఎస్సార్సీపీదే. కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్ వేస్తారా? అని ప్రశ్నించారు. -
‘శ్రీకృష్ణదేవరాయలు లాగా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి వైఎస్ జగన్’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు జరిగాయి. పండుగ సందర్భంగా పార్టీ నేతలు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.ఉగాది వేడుకల సందర్భంగా ప్రముఖ అవధాని నారాయణ మూర్తి పంచాంగ శ్రవణం చెప్పారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మళ్ళీ విజయ దుందుభి మోగిస్తారు. ఓడితే చాలా మంది భయపడతారు. కానీ, వైఎస్ జగన్ అలా బయటపడలేదు. మిథున రాశి వారికి ఈ ఏడాది మంచి జరుగుతుంది. మిథున రాశిలో జన్మించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి. ఆవేశంలో ప్రజలు చేసిన తప్పులకు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. శ్రీ కృష్ణదేవరాయలులాగా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి వైఎస్ జగన్. సాంఘికంగా ఔన్నత్యాన్ని పొందుతారు. ముఖ్యమంత్రి కుర్చీలో మళ్ళీ తిరిగి వైఎస్ జగన్ కూర్చుంటారు’ అని చెప్పుకొచ్చారు.ఇక, ఉగాది వేడుకల్లో పార్టీ కార్యాలయ ఇన్ఛార్జ్ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ అధికార ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
లోకేష్ రాజా... తొందర పడకు ముందుంది అసలైన పంగడ : Ambati
-
విర్రవీగుతున్నావా లోకేష్ రాజా?.. రెడ్బుక్పై అంబటి సెటైర్లు
సాక్షి, గుంటూరు: నందమూరి తారక రామారావు మరణంతోనే తెలుగుదేశం పార్టీ చనిపోయిందని, ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనిది వెన్నుపోటు నుంచి పుట్టిన పార్టీయేనని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నాడో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కుని, అవకాశవాద రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన ఘనుడు చంద్రబాబు అని మండిపడ్డారు. ఇంకా అంబటి రాంబాబు ఏమన్నారంటే... ఆయన మాటల్లోనే..తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినం సందర్భంగా సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్లు సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చారు. టీడీపీ అధికారం కోసం పుట్టినది కాదని, ఆవేశంలో పుట్టినదని, ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతో పుట్టిన పార్టీ అని చెప్పారు. ఆనాడు ఎన్టీఆర్ ఈ పార్టీని స్థాపించినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నాడు? కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని ప్రారంభిస్తే, ఆదే కాంగ్రెస్ పార్టీలో ఉండి, కాంగ్రెస్ అధినేత్రి ఇందిరాగాంధీ ఆదేశిస్తే ఎన్టీఆర్పైనే పోటీ చేస్తానంటూ ఆనాడు చంద్రబాబు బీరాలు పలికిన విషయం మరిచిపోయారా? ఈ రోజు టీడీపీని చంద్రబాబే స్థాపించినట్లుగా మాట్లాడటం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది.ఏనాడైన తెలుగుదేశం జెండా ఒంటరిగా ఎగిరిందా?తమది పేదల కోసం ఎగిరేజెండా అని చంద్రబాబు చాటుకుంటున్నారు. ఏనాడైనా తెలుగుదేశం జెండా ఒంటరిగా ఎగిరిందా? ఎర్రజెండాలు, బీజేపీ, బీఎస్పీ ఆఖరికి కాంగ్రెస్, జనసేన జెండాలను కూడా తమ పక్కన పెడితే కానీ ఆయన జెండా ఎగరలేదు. ఎన్నికలకు ఒంటరిగా వెళ్ళే ధైర్యంలేని పార్టీ చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీది. దాని గురించి ఆయన గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ చేయాలని అనుకున్నాం, కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత చూస్తే చేయలేకపోతున్నామని అంటున్నారు.దీనినే రేవుదాటిన తరువాత తెప్ప తగలేయడం అనేది. చంద్రబాబు చరిత్ర అంతా కూడా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా మోసం చేయడమే. చంద్రబాబుకు ఊసరవెల్లి ఆదర్శం. సిద్దాంతాలతో పనిలేకుండా అధికారమే పరమావధిగా ఎవరితోనైనా జత కడతారు. ఇది కార్యకర్తల పార్టీ, శాశ్వతంగా ఉండాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఇదే పార్టీలోని కార్యకర్తలను ఆయన ఈసడించుకుంటున్నారు. తన కుమారుడి పదవి కోసం ఈ పార్టీ శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నారు. అధికారం కోసం బీజేపీతో, తరువాత కమ్యూనిస్ట్ లతో, మళ్ళీ బీజేపీతో, ఇప్పుడు జనసేనతో జత కట్టారు. అవసరం తీరిన తరువాత ఆ పార్టీలను పక్కకుతోసేయడంలో చంద్రబాబు దిట్టరెడ్బుక్ అంటూ విర్రవీగుతున్న లోకేష్ రాజాచంద్రబాబు వారసత్వంను లోకేష్ రాజా పుణికిపుచ్చుకున్నారు. గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని విపరీతంగా సంపాదించారు. ఇప్పుడు మళ్ళీ మంత్రి అయిన తరువాత అధికార మదంతో మాట్లాడుతున్నారు. తన రెడ్బుక్ చూసి రాష్ట్రంలో అందరూ వణికిపోతున్నారని విర్రవీగుతున్నాడు లోకేష్ రాజా. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు జైలు వెళ్ళకుండా విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరికి చంద్రబాబు రాజమండ్రి జైలుకు వెళ్ళినప్పుడు వణికిపోతూ మాట్లాడిన మాటలు మరిచిపోయావా లోకేష్ రాజా.జైలులో చంద్రబాబుకు వెన్నుపూస కింద వరకు దద్దుర్లు వచ్చాయని, రాత్రిపూట దోమలు కుడుతున్నాయని, శరీరంపై పొక్కులు మొలుస్తున్నాయని వాపోయారు. 750 మంది డ్రగ్స్ తీసుకునే నేరచరిత్ర ఉన్న ఖైదీలున్న జైలులో మా నాన్నను వేశారంటూ లోకేష్ వణికిపోతూ మాట్లాడిన మాటలు మరిచిపోయారా? ఈ రోజు అధికారం ఉందని తన రెడ్బుక్ చూసి గుండెపోటు, బాత్రూమ్లో జారి పడిపోతున్నారంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్న లోకేష్ రాజాకు ముందుంది ముసళ్ళ పండుగ. ఈ రోజు నీవల్ల వేధింపులకు గురవుతున్న ప్రతి ఒక్కరూ తమ బుక్కుల్లో లోకేష్ పేరు రాసుకుంటున్నారు రాజా. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎగతాళి దినోత్సవంగా మారుస్తూ మాట్లాడుతున్న దానికి ఏదో ఒకరోజు జవాబు దొరుకుతుంది రాజా. హామీలు అమలు చేయని మీ అసమర్థతపై సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిపై మీరు పెడుతున్న కేసులపై న్యాయస్థానాల స్పందన చూసిన తరువాత అయినా సిగ్గు తెచ్చుకోవాలి. రెడ్బుక్ రాజ్యాంగం, వాగ్దానాల అమలు చేయకుండా పారిపోయే మోసగాళ్ళు మీరు. పార్టీ ఆవిర్భావం మీది కాదు, నందమూరి తారక రామారావుది. ఆయన పార్టీని మీరు మోసపూరితంగా వెన్నుపోటు పొడిచి లాక్కున్నారు. అవకాశవాద రాజకీయాలతో బతుకుతున్న పార్టీ. వాపుచూసి బలం అనుకుంటోంది, శక్తిలేని పార్టీ. తెలుగుదేశం ఒక పేకమేడ లాంటివి. వారినీ వీరిని అడ్డంపెట్టుకుని బతుకుతున్న రాజకీయ జీవితాలు.దోపిడీనే చంద్రబాబు నైజంతాజాగా విజయం సాధించగానే సంపద సృష్టించి ప్రజలకు పంచుతాను అన్నారు. సూపర్ సిక్స్ ను అమలు చేస్తానని అన్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా అమరావతి నిర్మాణానికి హుండీలు పెట్టారు, చందాలు ఇవ్వమని అడిగారు, ఇటుకలు అమ్ముకున్నారు. అమరావతికి రెండు గాజులు ఇచ్చి అమరావతిని దోచుకున్నారు. ఇప్పుడు 26వేల కోట్లు అమరావతి అంటున్నారు. దీనిలోనూ దోపిడీ.కాంట్రాక్టర్ల కోసం పోలవరంను తాకట్టుపెట్టారు. డయాఫ్రం వాల్ వేసేసిన తరువాత జగన్ కాఫర్ డ్యాంలను క్లోజ్ చేయలేదంటూ అర్థంలేని మాటలు మాట్లాడారు. సింపుల్గా ఇన్వెస్ట్ చేయడం.. భారీగా బాగుపడటం చంద్రబాబు నైజం. రెండెకరాల నుంచి ప్రారంభించారు, నేడు వేల కోట్లు సంపాధించారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తి చంద్రబాబు. అధికారంను అడ్డం పెట్టుకుని దోచుకోవడం, జనానికి పంచడం, ఓట్లు కొనుగోలు చేయడం చంద్రబాబుకు అలవాటు. -
‘అబద్ధాల్లో అందరి కంటే పెద్ద.. నిజాల్లో అందరి కంటే చిన్న’
గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పడంలో అందరికన్నా పెద్దవారని, నిజాలు చెప్పడంలో అందరికన్నా చిన్నవాడంటూ మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు అంశానికి సంబంధించి గుంటూరు నుంచి ప్రెస్ మీట్ లో మాట్లాడిన అంబటి.. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి పోలవరం వెళ్ళారని,. చంద్రబాబు అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు పరుగులు తీస్తుందని ఆయన అనుకూల పత్రికలు రాసిన విషయాన్ని అంబటి గుర్తు చేశారు. ‘2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని 2018కి పూర్తి చేస్తామని అప్పటి మంత్రులు చెప్పారు. వైఎస్ జగన్ పాలనలో పోలవరం నత్తనడకన నడిచిందని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు అవకాశం వచ్చినప్పుడల్లా వైఎస్ జగన్ పై బురుద జల్లుతున్నారు. 2019లో మళ్లీ మేము అధికారంలోకి వచ్చినట్లయితే 2020- 21లో పోలవరాన్ని పూర్తిచేసే వాళ్ళమని ఆయన చెప్పటం విడ్డూరంగా ఉంది. అసలు పోలవరాన్ని సర్వనాశనం చేసింది విధ్వంసం చేసింది చంద్రబాబు నాయుడు. వైఎస్ జగన్ హయాంలో పోలవరం పనులు శరవేగంగా నడిచాయి. చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పటంలో అందరికన్నా పెద్దవాడు. నిజాలు చెప్పటంలో అందరికన్నా చిన్నవాడు. జగన్ పాలనలో పోలవరం నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళించారని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. పోలవరం నిధులు ప్రభుత్వానికి మళ్ళించినట్లు రుజువు చేస్తే చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారం చేస్తాను. పోలవరం నిర్మాణ సమయంలో చంద్రబాబు చేసుకున్న ఒప్పందం ఏంటో తెలుసా?, ముందు రాష్ట్ర ప్రభుత్వం పోలవరం కోసం డబ్బులు ఖర్చు పెడుతుంది ఆ డబ్బులను కేంద్రం తర్వాత రీయింబర్స్ చేస్తుంది. అలాంటప్పుడు నిధులు మళ్ళించడం ఎలా సాధ్యమవుతుంది?, పోలవరం రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పోలవరానికి అన్ని అనుమతులు తీసుకువచ్చారు. అసలు కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన పోలవరాన్ని చంద్రబాబు నాయుడు మేమే కడతావని ఎందుకు ఒప్పందం చేసుకున్నారు’? అని అంబటి ప్రశించారు. -
పోసాని జైలు నుండి విడుదలపై అంబటి రియాక్షన్
-
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమం.. అంబటి రాంబాబు సెటైర్లే సెటైర్లు
-
‘చంద్రబాబు శకుని పాత్ర వేస్తే బాగుండేది’
సాక్షి,గుంటూరు : విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఏపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సాంస్కృతి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు శకుని పాత్ర వేస్తే బాగుండేదని, ఆయన ఆ పాత్రకు బ్రహ్మాండంగా సరిపోతారని మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.ఏపీ బడ్జెట్ సమావేశాలపై అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ‘‘2025 బడ్జెట్ సమావేశాలు 16 రోజుల పాటు జరిగాయి. ప్రతిపక్షం లేని శాసన సభ సమావేశాలు చప్పగా సాగాయి. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సభకు వెళ్ళలేదు. వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక భయంతో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. సమావేశాలు కూటమి నేతలు ఒకరినొకరు పొగుడుకోవడానికే సరిపోయింది. శాసన మండలిలో ప్రతిపక్షం ప్రశ్నలు సంధించింది. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను మండలిలో మా సభ్యులు ఎండగట్టారు.ఒక్క క్వింటా మిర్చిని ఈ ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. బెల్ట్ షాపులు ఊరూరా ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఎంతో దౌర్భాగ్యపు స్థితిలో పని చేస్తుందో స్వంత పార్టీ సభ్యులే శాసన సభలో చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు దొంగచాటుగా సంతకం చేయాల్సిన అవసరం ఏముంది. ప్రతిపక్షం హోదా ఇవ్వండి. స్పీకర్ అయన్నపాత్రుడు వైఎస్ జగన్ గురించి ఏవిధంగా మాట్లాడారో అందరూ చూశారు. అచ్చెన్నాయుడు ఏటువంటి వ్యాఖ్యలు చేశారో అందరికి తెలుసు. ప్రజా సమస్యలపై పోరాటం మాకు ముఖ్యం. స్పీకర్,డిప్యూటీ స్పీకర్ శాసన సభకు పవిత్రత లేకుండా చేశారు. వైఎస్సార్ జిల్లాను వైఎస్సార్ కడప జిల్లాగా మార్చి శునకానందం పొందుతున్నారు.మంచి మిత్రుడు అని వైఎస్ గురించి చంద్రబాబు చెబుతాడు. మరి ఆయన పేరుపై ఎందుకంత కోపం. శాసన సభ్యుల వేసిన స్కిట్స్లో కూడా జగన్ పేరు మర్చిపోలేకపోయారు. ఆ స్కిట్లో చంద్రబాబుకు శకుని పాత్ర ఇస్తే బాగుండేది. ఆయన శకుని పాత్రకు బ్రహ్మాండంగా సరిపోతారు’ అని సెటైర్లు వేశారు. -
పవన్ కళ్యాణ్ పై అంబటి రాంబాబు కామెంట్స్
-
Ambati Rambabu: జనసేన పార్టీకి దశదిశ లేదు
-
బాలినేని కామెంట్స్ కు అంబటి కౌంటర్
-
‘బాలినేని ఆస్తులు ఎక్కడ పోగొట్టుకున్నారో అందరికీ తెలుసు’
సాక్షి, తాడేపల్లి: పిఠాపురం జయకేతనం సభలో పవన్ ఏం మాట్లాడారో ఆయనకే తెలియలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. జనసేన పార్టీకి దిశదశ లేదని.. పవన్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబుకు ఊడిగం చేయడానికే పవన్ జనసేన స్థాపించారని.. పవన్ ప్రజల కోసం పోరాడే వ్యక్తి కాదు.. కుటుంబం కోసమే పోరాటం చేస్తారు’’ అంటూ అంబటి దుయ్యబట్టారు.‘‘కాపు సామాజికవర్గంపై చంద్రబాబు అనేక దుశ్చర్యలు చేశారు. జనసేన నిర్వహణను చూసేది చంద్రబాబే. జనసేనలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు చంద్రబాబు మనుషులే. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఏమైంది?. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై పిఠాపురంలో పవన్ ఎందుకు మాట్లాడలేదు?. గతంలో బీజేపీ నేతలపై పవన్ అనేక విమర్శలు చేశారు. పవన్ ఊసరవెల్లిలా ప్రవర్తిస్తున్నాడు. రాష్ట్రంలో జనసేన నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. పవన్ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకమని.. పవన్ ఆయన అన్నకు ఎమ్మెల్యే సీటు ఇప్పించుకున్నారు’’ అంటూ అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.అధికారం కోసం పార్టీలు మారే వ్యక్తి బాలినేని..బాలినేని శ్రీనివాస్రెడ్డి వ్యాఖ్యలకు అంబటి కౌంటర్ ఇస్తూ.. బాలినేని శ్రీనివాస్రెడ్డి చరిత్ర ఏంటి?. అధికారం కోసం పార్టీలు మారే వ్యక్తి బాలినేని.. ఆయన ఆస్తులు ఎక్కడ పోగొట్టుకున్నారో అందరికీ తెలుసు. జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచిన బాలశౌరి కూడా ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ అసెంబ్లీకి రావటానికి 16 ఏళ్లు పట్టింది. అదికూడా అన్ని పార్టీలు కలిస్తేనే ఆ అవకాశం వచ్చింది. వైఎస్ జగన్ ఢిల్లీని ఢీకొట్టి, పోరాటం చేసి పదేళ్లకే సీఎం అయ్యారు’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.‘‘టీడీపీ కోసం పుట్టిన పార్టీ జనసేన. చంద్రబాబును కాపులు నమ్మరు. కాబట్టి జనసేన పార్టీని పవన్ చేత ఏర్పాటు చేయించారు. జనసేనను నడిపేదంతా చంద్రబాబే. రెండు పార్టీల మద్దతుతో పవన్కు 21 సీట్లు వచ్చాయి. వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. జనసేనలో ఉన్నవారంతా చంద్రబాబు మనుషులు, వైఎస్సార్సీపీ బహిష్కరించిన వారే..రాష్ట్ర ప్రజలకు ఏం మేలు చేయబోతున్నారో చెప్ప లేదు. ఎర్రకండువా నుండి కాషాయ రంగు వేసుకునే వరకు పవన్ వచ్చారు. అసలు ఎప్పుడు ఏ వేషం వేస్తారో జనానికి అర్థం కావటం లేదు. ఏ వ్యూహం, సిద్దాంతం లేకుండా మారిపోతున్న వ్యక్తి పవన్. జనసేన నేతలంతా ఇసుక, మద్యం దోపిడీలో మునిగి పోయారు. బియ్యం, విజిలెన్స్, దాడులు, డబ్బులు.. ఇదే పనిలో ఒక మంత్రి ఉన్నారు. ఇంత దోపిడీ చేస్తుంటే పవన్ ఏం చేస్తున్నారు?అధికారం, సినిమా గ్లామర్ ఉన్నందున జనం వస్తారు. అంతమాత్రానికే ఏదేదో ఊహించుకోవద్దు. పవన్ సీఎం అయ్యే అవకాశం లేదని కాపులకు సినిమా క్లయిమాక్స్ లో తెలుస్తుంది. నాగబాబుకు కొత్తగా ఎమ్మెల్సీ వచ్చేసరికి ఏవేవో కలలు కంటున్నారు. ఎన్నికలలో అవసరం తీరాక వర్మను తరిమేశారు. వర్మకి కనీసం మర్యాద అయినా ఇవ్వండి. పిఠాపురాన్ని మీ అడ్డా అనుకోవద్దు. ఉత్తరాది అహంకారం అంటూ అవకాశం వాద రాజకీయాలు చేయటం పవన్కే చెల్లింది’’ అని అంబటి రాంబాబు దుయ్యబట్టారు. -
గుంటూరు జైలులో పోసాని కృష్ణమురళికి అంబటి రాంబాబు పరామర్శ
-
కూటమి ప్రభుత్వం నన్ను చంపేస్తుందేమో.. జైల్లో పోసాని
సాక్షి,గుంటూరు : కూటమి ప్రభుత్వం తనని చంపేస్తుందేమోనని రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి భయపడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.గురువారం గుంటూరు జైల్లో ఉన్న పోసానితో అంబటి రాంబాబు ములాకత్ అయ్యారు.అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోసానిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది.పోసానిపై ప్రభుత్వం 17 కేసులు బనాయించింది. అన్ని కేసుల్లో బెయిల్ వస్తుందన్న నేపథ్యంలో సిఐడి వారు పిటి వారెంట్ దాఖలు చేసి పోసాని ని గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టారు.ఆయనపై సీఐడీ 111 సెక్షన్ నమోదు చేశారు. 111 సెక్షన్ పోసానికేసుకు వర్తించదు అని న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.మేజిస్ట్రేట్ సైతం 111 సెక్షన్ను తిరస్కరించారు. ఎప్పుడో మీడియాలో మాట్లాడితే ఇప్పుడు పోసానిపై కేసులు పెట్టడం దారుణం.జైల్లో పోసాని కృష్ణ మురళి భయపడుతున్నారు.ప్రభుత్వం నన్ను చంపేస్తుందేమో అని ఆవేదన వ్యక్తం చేశారు.తన కుమారులని ఏమైనా చేస్తారేమో అని పోసాని కంగారు పడుతున్నారని’ ఆవేదన వ్యక్తం చేశారు. -
ఒరేయ్ పిచ్చోల్లారా.. ఎన్ని కేసులు పెట్టినా మేము భయపడం!
-
పచ్చి అబద్ధాలు.. నిరుద్యోగ భృతి ఏది.. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ
-
‘యువత పోరుకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం’
గుంటూరు: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న యువత పోరు కార్యక్రమానికి అందరూ మద్దతు ఇవ్వాలని పార్టీ నాయకులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు. ఈరోజు(ఆదివారం) గుంటూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో యువత పోరు పోస్టర్ ను ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో కలిసి అంబటి రాంబాబు ఆవిష్కరించారు. దీనిలో భాగంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 12వ తేదీన యువత పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వసతి దీవెన బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. విద్యార్థులు చదువుకునేందుకు ఇబ్బందలు పడుతున్నారు. పేద విద్యార్థులు వ్యవసాయ బాట పట్టే విషమ పరిస్థితిని కల్పించారు. బకాయిలు తీర్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ వరకూ ర్యాలీ చేస్తాం. ఈ ప్రభుత్వంలో సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెన్ లేదు. నిరుద్యోగ భృతి అంశాన్ని పక్కన పెట్టేశారు. ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మెడికల్ కాలేజ్ లను ప్రభుత్వం రంగం నుండి ప్రవేటు రంగానికి మార్చేసి పప్పు బెల్లాల్లా అమ్ముకునేందుకు సిద్దం మయ్యారు. పెట్టుబడి దారులకు అమ్ముకుంటున్నారు. యువత పోరుకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం’ అని అంబటి స్పష్టం చేశారు. -
Ambati Rambabu: చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా మోసం
-
‘ఇది మోసపూరిత బడ్జెట్.. చంద్రబాబు చేతులెత్తేశారు’
తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబుది మోసపూరిత బడ్జెట్ అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నారనే విషయాన్ని తమ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఆధారాలతో బయటపెట్టారన్నారు. ఈరోజు(గురువారం) చంద్రబాబు మోసపూరిత బడ్జెట్ పై వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి.. ‘ సూపర్ సిక్స్ సహా 143 హామీలు అమలు చేయలేక చంద్రబాబు చేతులెత్తేశారు. జగన్ రూ. 14 లక్షల కోట్లు అప్పు చేసినట్లు చంద్రబాబు విష ప్రచారం చేశారు. చివరకు గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర అప్పు రూ. 6 లక్షల కోట్లే అని తేల్చారు. అంటే ఇచ్చిన హామీల అమలను ఎగ్గట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఆడబిడ్డ నిధి కింద చంద్రబాబు రూ. 36 వేల కోట్లు ఎగ్గొట్టారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా చంద్రబాబు వ్యాఖ్యలునిరుద్యోగులకు రూ.52 వేల కోట్లు బకాయి పెట్టారు. తల్లికివందనం కింద రూ.13,050 కోట్లు అవసరమైతే రూ.8 వేల కోట్లి మాత్రమే కేటాయించారు. అంటే ఇది ఎగ్గొట్టే ఉద్దేశం కాదా? , అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేల కోట్లు ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీ మహిళలకు రూ. 45 వేల కోట్లు ఎగ్గొట్టారు. దీపం పథకం కింద అరకొర నిధులే కేటాయించారు. పెన్షన్ కూడా ఇప్పటికే 4 లక్షల మందికి కట్ చేశారు . అమరావతి అద్బుతదీపం అన్నారు. వేల కోట్లు అప్పు తెచ్చి కడుతున్నారు. టీడీపీ వారికి తప్ప ఇంకెవరికీ పనులు చేయవద్దంటూ ప్రజాస్వామ్య విరుద్ధంగా మాట్లాడారు. ఆయన మాటలు చూస్తుంటే చంద్రబాబు బుర్ర పని చేయటం లేదనిపిస్తోంది.పవన్ అధికారాన్ని వదిలేసి ప్రతిపక్ష హోదా తీసుకో.. పవన్ కళ్యాణ్ అధికారాన్ని వదిలేసి ప్రతిపక్ష హోదా తీసుకోవాలి. జగన్ ఎవరి దయాదాక్షణ్యంతో రాజకీయాలలోకి రాలేదు. ఢిల్లీ కోటని ఢీకొట్టి మరీ వచ్చారు. లోకేష్ లాగా తన తండ్రిని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి రాలేదు. చంద్రబాబు అంత నీచుడు, 420 మరెవరూ లేరని ఎన్టీఆర్, హరికృష్ణ, నారా రామ్మూర్తి ఆత్మలు ఘోషిస్తున్నాయి. లోకేష్ చేస్తున్న దుర్మార్గాలకు ఈసారి ఘోర ఓటమి తప్పదు. నాదెండ్ల మనోహర్ బియ్యం దొంగ, లంచాల కోరు. పీడిఎస్ బియ్యం అమ్ముకుంటున్న దొంగ నాదెండ్ల మనోహర్. తనిఖీల పేరుతో బెదిరించి కోట్లకు కోట్లకు వసూలు చేస్తున్నారు. మాది పోరాటం చేసి, రాటు తేలిన రాజకీయ పార్టీసూపర్ సిక్స్ హామీల అమలుకు రూ.79,876 కోట్లు అవసరమా? కాదా?, మరి మీరు కేటాయించినది ఎంత? అనేదానికి సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ మీద కాపులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎంతోమంది బీసీలు, కాపులను వదిలేసి తన అన్నకు పదవులు ఇవ్వటం కరెక్టు కాదు. నమ్ముకున్న వారిని నట్టేట ముంచవద్దని పవన్ కళ్యాణ్ ని కోరుతున్నాను. చంద్రబాబు కుట్రల మీద దగ్గుబాటి వెంకటేశ్వరరావు గతంలో పుస్తకం రాశారు. ఇప్పుడు ఇద్దరూ ఒకే వేదిక మీదకు వచ్చారు. మా పార్టీ నేతలపై పెట్టే అక్రమ కేసులు నిలపడవు. సోనియా గాంధీ ఎన్ని కేసులు పెట్టినా జగన్ నిలపడ్డారు. మాది పోరాటం చేసి, రాటు తేలిన రాజకీయ పార్టీ. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటానికి మేము సిద్దమే. బూతులు తిట్టే అయ్యన్నపాత్రుడు స్పీకర్ అంట’ అని ధ్వజమెత్తారు. -
పవన్ కళ్యాణపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్
-
తమ్ముడికి శుభాకాంక్షలు.. పవన్పై అంబటి రాంబాబు సెటైర్లు
సాక్షి, తాడేపల్లి: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ‘‘అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.కాగా, శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును ఆ పార్టీ అధ్యక్షుడు పవన్కళ్యాణ్ ఖరారు చేశారు. ఈ మేరకు బుధవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘నాగబాబు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పార్టీకి సేవలందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు పార్టీ సమాచారం ఇచ్చింది. పార్టీ పరంగా కూడా నామినేషన్కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పవన్కళ్యాణ్ ఆదేశించారు.’ అని తెలిపింది. కాగా, ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.అయితే, నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై టీడీపీలో కొందరు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా సోషల్ మీడియా వేదికగా నాగబాబును విపరీతంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే.. పదేళ్లుగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని వ్యక్తిని.. ఇలా ఎమ్మెల్సీ కోటాలో మంత్రిని చేయడం ఏంటంటూ పోస్టులు పెట్టారు. గతంలో నారా లోకేష్ను టార్గెట్ చేసుకుని నాగబాబు చేసిన పోస్టులను కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు. ఆ పోస్టుల వెనుక.. మంత్రి నారా లోకేష్ ఉన్నాడనే చర్చ కూడా నడిచింది.2024 ఎన్నికల కోసం టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుగా వెళ్లాయి. ఆ టైంలో అనకాపల్లి ఎంపీ పోటీ కోసం నాగబాబు తెర వెనుక ప్రయత్నాలు చేసినప్పటికీ.. పొత్తు అడ్డం వచ్చింది. అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నించినా అదీ కుదరలేదు. ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఒక్కరోజు గడవకముందే.. టీటీడీ బోర్డు చైర్మన్ పదవి మెగా బ్రదర్కే అంటూ ఓ ప్రచారం నడిచింది. కానీ, చంద్రబాబు దాన్ని కూడా లాగేసుకున్నారు. ఆపై ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి నాగబాబుకే దక్కవచ్చనే చర్చా నడిచింది. అది జరగలేదు. మొత్తం మీద తమ్ముడి సాయంతో నాగబాబు త్వరలో ఏపీకి మంత్రి కాబోతున్నారమాట.. అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు!@NagaBabuOffl @PawanKalyan— Ambati Rambabu (@AmbatiRambabu) March 6, 2025 -
పవన్ పై అంబటి రాంబాబు కామెంట్స్
-
‘లోకేష్.. అదే మాట మిర్చి యార్డు ముందు చెప్పగలరా?’
తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఏసీ గదిల్లో కూర్చుని మిర్చి వ్యాపారులు, బ్రోకర్లతో మీటింగ్ పెడితే ఏం లాభం. మిర్చి యార్డ్కు వచ్చి మా పరిస్థితి చూసి మా బాధలు వింటే అర్ధమవుతోంది. ప్రభుత్వం ప్రకటించిన రేటు వల్ల మిర్చి రైతు మరింత కష్టాల్లో పడతాడు. క్వింటా మిర్చి రూ.19,000 నుంచి రూ. 20,000తో ప్రభుత్వం కొనుగోలు చేయాలి’ అనేది మిర్చి రైతుల డిమాండ్.మరి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ..చంద్రబాబు వలనే మిర్చి మద్దతు ధర రూ.11,781 అంటూ రైతులపై ప్రేమను కురిపించే యత్నం చేశారు. ఇదే ఎక్కువ అని, ఇంతకుమించి అనవసరం అన్న రీతిలో లోకేష్ ఏదో బిల్డప్ ఇచ్చే యత్నం చేశారు. దీనిపై మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. అదే మాట గుంటూరు మిర్చి యార్డు ముందు చెప్పగలరా? అంటూ సవాల్ చేశారు. ఈ మేరకు అంబటి రాంబాబు తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’ వేదికగా నారా లోకేష్ కు చాలెంజ్ విసిరారు. చంద్రబాబు వల్లే క్వింట మిర్చి మద్దతు ధర 11,781 రూపాయలు అన్న లోకేష్ అదే మాటగుంటూరు మిర్చి యార్డు ముందు చెప్పగలవా?@naralokesh @ncbn— Ambati Rambabu (@AmbatiRambabu) February 25, 2025 నషాళానికి పొలిటికల్ మిర్చి ‘ఘాటు’ -
రైతులకు ఇవ్వాల్సినవన్నీ గంగలో కలిపేశాడు.. చంద్రబాబుపై అంబటి ఫైర్
-
‘చంద్రబాబు మిర్చి రైతులను పచ్చిమోసం చేస్తున్నారు’
గుంటూరు రాష్ట్రంలో ధరలు పతనమై తీవ్రంగా నష్టపోతున్న మిర్చిరైతులను ఆదుకోకుండా సీఎం చంద్రబాబు డ్రామాలతో కాలం గడుపుతున్నారని వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర పరిధిలోని మార్క్ ఫైడ్ నుంచి మిర్చి కొనుగోళ్ళు చేయించకుండా, కేంద్రప్రభుత్వం కొనుగోళ్ళు చేయాలని చంద్రబాబు కోరడం అర్థరహితమని అన్నారు. ఇప్పటి వరకు ఒక్క క్వింటా కూడా కూటమి ప్రభుత్వం మద్దతుధరకు కొనుగోలు చేయలేదని, దీనిని బట్టే మిర్చి రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యం తెట్టతెల్లమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇంకా ఆయన ఏమన్నారంటే... రాష్ట్రంలో మిర్చి ధర దారుణంగా పతనమైంది. జనవరిలో హార్టీకల్చర్ విభాగం మిర్చి పంటకు సంబంధించిన నివేదికను ముందుగానే ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో మిర్చిరైతులు సంక్షోభంలో ఉన్నారు, పెట్టుబడి వ్యయాలు పెరిగాయి, దిగుబడి తగ్గుతోంది, మిర్చి రేటు కూడా పడిపోతోంది, మార్కెట్ ఇంట్రవెన్షన్ లేకపోతే రైతులు దెబ్బతింటారు అని చాలా స్పష్టంగా ప్రభుత్వానికి నివేదించింది. అయినా కూడా సీఎం చంద్రబాబు స్పందించలేదు. చివరికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్ గారు మిర్చి రైతుల బాధలను తెలుసుకుని, వారికి భరోసా కల్పించేందుకు గుంటూరు మిర్చియార్డ్ కు వెళ్ళడంతో రాష్ట్ర ప్రభుత్వం గత్యంతరం లేని స్థితిలో స్పందించింది. కనీసం ఇప్పటికైనా మిర్చిరైతుల సమస్యను గుర్తించి మద్దతుధరకు కొనుగోళ్ళు చేస్తుందని అందరూ భావించారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం తరుఫున ఒక్క క్వింటా మిర్చి కూడా కొనుగోలు చేయలేదు. పైగా మిర్చి రైతులను ఆదుకుంటున్నామంటూ సీఎం చంద్రబాబు డ్రామాలు ప్రారంభించారు.నాఫెడ్ ఎప్పుడైనా మిర్చికొనుగోళ్ళు చేసిందా?శివరాజ్ సింగ్ చౌహాన్ కు సీఎం రాసిన లేఖలో గత ప్రభుత్వంలో క్వింటా మిర్చి రూ.27వేల వరకు అమ్ముడుపోయింది. నేడు మిర్చిధర దారుణంగా పతనమైంది. వెంటనే కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సీఎం కోరారు. అసలు మిర్చి కొనుగోళ్ళకు కేంద్రప్రభుత్వానికి ఏం సంబంధం? నాఫెడ్ ఎప్పుడైనా కొనుగోళ్ళు చేసిందా? మార్క్ ఫెడ్ ద్వారా మిర్చి కొనుగోళ్ళు చేయించడానికి ఉన్నా కూడా సీఎం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఒకవేళ కేంద్రం స్పందించి ముందుకు వస్తే మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన మిర్చీని వారికి విక్రయించండి.వైఎస్సార్సీపీ హయాంలో మార్కెట్ ఇంట్రవెన్షన్2021లో వైఎస్సార్సీపీ హయాంలో మిర్చిరేటు పడిపోయినప్పుడు క్వింటాకు రూ.7వేలు మద్దతుధర ప్రకటించాం. ఈ రోజు ఉన్న రేట్ల ప్రకారం మిర్చికి కనీసం రూ.14 నుంచి 15వేల రూపాయల వరకు మద్దతుధరను ప్రకటించాల్సి ఉంది. ఆనాడు వైయస్ జగన్ గారు రైతులపక్షన నిలబడి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోళ్ళు చేయించారు. రూ. 65వేల కోట్లను వెచ్చించి ధాన్యంను కొనుగోలు చేశాం. ఇతర పంటలకు సంబంధించి రూ.7800 కోట్లతో కొనుగోలు చేశాం. రూ.3000 కోట్లు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం. కరోనా సమయంలో అరటి, గుమ్మడికాయలను కూడా కొనుగోలు చేశాం. వ్యవసాయరంగంలో వైయస్ జగన్ గారు విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అండగా ఉండేలా రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఆర్బీకే వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేశారు. రైతుల పట్ల నిర్లక్ష్యదోరణితో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. చంద్రబాబు, లోకేష్ చేతుల్లో కీలుబొమ్మల్లా ఐపీఎస్ అధికారులురేటులేక నష్టపోతున్న రైతులను పరామర్శించడానికి వెళ్ళిన మాజీ సీఎం వైయస్ జగన్ గారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ పోలీసులు కుంటిసాకులు చెబుతున్నారు. కష్టాల్లో ఉన్న మిర్చి రైతులను పరామర్శించేందుకు సీఎం, వ్యవసాయ మంత్రులకు ఎన్నికల కోడ్ అడ్డం వస్తే, కనీసం ఎందుకు అధికారులను అయినా పంపించలేదు? రైతుల పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు? రైతుల పక్షనా వారి బాధను అర్థం చేసుకునేందుకు వైయస్ జగన్ గారు గుంటూరు వెడితే ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ ఆయనపై తప్పుడు కేసులు నమోదు చేశారు. ఇదే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న విజయవాడలో మ్యూజికల్ నైట్ నిర్వహిస్తే దానికి సీఎం చంద్రబాబు, మంత్రులు హాజరైనా దానికి కోడ్ వర్తించదా? రైతుల కోసం వెళ్ళిన వైయస్ జగన్, ఇతర వైయస్ఆర్సీపీ నేతలపైనా కేసులు పెట్టడం కక్షసాధింపు కాదా? భారతదేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఒక మాజీ సీఎంకు ఉన్న జెడ ప్లస్ కేటగిరి సెక్యూరిటీని రైతులను పరామర్శించేందుకు వెళ్ళిన రోజున ఉపసంహరించారు. కుట్రపూరితంగానే భద్రతను తొలగించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం. ఇందుకు రాష్ట్ర డీజీపీ బాధ్యత వహించాలి. చంద్రబాబు, లోకేష్ చేతుల్లో కీలుబొమ్మలా ఐపీఎస్ అధికారులు వ్యవహరిస్తున్నారు. రైతుల కోసం ఎన్ని కేసులు పెట్టినా భరించడానికి మేం సిద్దంగా ఉన్నాం.’అని అంబటి స్పష్టం చేశారు. -
ప్రచారం కోసం కాదు.. జగన్ పర్యటనపై టీడీపీ కుట్ర
-
వైఎస్ జగన్ భద్రతపై కూటమి కుట్ర.. పోలీసులు ఎక్కడ?: అంబటి
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరు పర్యటనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu). ఎన్నికల కోడ్ అంటూ వైఎస్ జగన్ను ఇబ్బంది పెట్టే ప్లాన్ చేస్తున్నారని అన్నారు. మిర్చి యార్డ్ పర్యటనకు ఎన్నికల కోడ్ వర్తించదు. కాబట్టి, ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన సెక్యూరిటీని వైఎస్ జగన్కు ఇవ్వాల్సిందేనని చెప్పారు.వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్ జగన్(YS Jagan) గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనపై కుట్ర జరుగుతుంది. ఎన్నికల కోడ్ వంక పెట్టి వైఎస్ జగన్ పర్యటనలో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కానీ, వాళ్లే ఇబ్బంది పడతారు. ఎన్నికల కోడ్ అమలులో ఉంది. మేము ఆ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేదు.. ప్రచారం చేయడం లేదు. కనీసం మిర్చి యార్డులో మైకు కూడా వాడటం లేదు. వైఎస్ జగన్ మిర్చి యార్డ్ పర్యటనకు ఎన్నికల కోడ్ వర్తించదు. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ వైఎస్ జగన్కు ఇచ్చి తీరాల్సిందే. పోలీస్ అధికారులు ఇది గుర్తుపెట్టుకోవాలి.కూటమి సర్కార్ పాలనలో మిర్చి ధర సగానికి సగం పడిపోయింది. మిర్చి రైతుల గోడు వినటానికి వైఎస్ జగన్ గుంటూరు(Guntur Mirchi Yard) మిర్చి యార్డుకు వస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో విఫలమైంది. వైఎస్సార్సీపీ హయాంలో గిట్టుబాటు ధర లేని పంటలకు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేసింది’ అని చెప్పుకొచ్చారు. అనంతరం, పోలీసుల తీరుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అంబటి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ భద్రతలో పోలీసుల తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. జడ్ ప్లస్ కేటగిరీ ఉన్నా పోలీసులు పట్టించుకోలేదు. గుంటూరు మార్కెట్ యార్డు వద్ద ఒక్క పోలీసు కూడా కనిపించడం లేదు. ఉద్దేశపూర్వకంగా జగన్కు భద్రతా సమస్యలు సృష్టించాలనే కుట్ర జరుగుతోంది. ప్రభుత్వం తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతుల గోడు బయటకు రాకూడదనే ప్రభుత్వం కుట్ర చేస్తోంది. భద్రత లేకుండా చేసి సమస్యలు సృష్టించాలని చూస్తోంది. ప్రభుత్వం తీరు చాలా అరాచకంగా ఉంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కావాలనే వైఎస్ జగన్కు భద్రతను కుదిస్తున్నారు. పాడైపోయిన బుల్లెట్ ఫ్రూఫ్ కార్లు ఇచ్చారు. కనీసం రివ్యూ చేయకుండానే ఉన్న ఫళంగా జగన్ భద్రతను కుదించేశారు. జిల్లాల్లో ఆయన పర్యటనల సమయంలోనూ ఇదే తీరు కనిపిస్తోంది అంటూ వ్యాఖ్యలు చేశారు. -
కూటమి ప్రభుత్వంలో రైతులకే కన్నీళ్లే
సాక్షి,గుంటూరు : కూటమి ప్రభుత్వంలో ధరలు తగ్గడంపై మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మద్దతు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులను ఓదార్చేందుకు బుధవారం గుంటూరు మిర్చి యార్డ్లో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. రైతుల్ని ఓదార్చనున్నారు. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. మిర్చి రైతుల గోడు వినడానికి వైఎస్ జగన్ రేపు (బుధవారం) మిర్చి యార్డుకు వస్తున్నారు.రైతుల కష్టనష్టాలను తెలుసుకుంటారు. మిర్చి ధరలు తగ్గిపోవడంతో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కూటమీ అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది. రైతుల పంటలకు గిట్టుబాటు ధర లేదు. ధాన్యాన్ని రూ.1300 రూపాయలకే అమ్ముకున్నారు. పత్తి నాలుగు వేల రూపాయలకు కొనే దిక్కు లేదు.వైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వం నేరుగా రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేసింది. ధరల స్థిరీకరణ కోసం రూ.3000 కోట్లు కేటాయించాం. పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంపై సిఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలి. రైతుల పక్షాన ఉద్యమం చేస్తాం. ఇది దుర్మార్గపు ప్రభుత్వం. చేతకాని ప్రభుత్వం.మేము అధికారంలో ఉన్నప్పుడు గిట్టుబాటు ధరలేని ప్రతి పంట మా ప్రభుత్వం కొనుగోలు చేసింది’ అని వ్యాఖ్యానించారు.ప్రభుత్వం నోరు మెదపదేం మిర్చికు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతుల్ని కలుసుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డ్కి వస్తున్నారు. మిర్చి రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారు. ఎకరానికి లక్షకు పైగా రైతు అప్పులు ఊబిలో కూలిపోయాడు.దీనిపైన ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు. మిర్చిపైన ఎందుకు మంత్రులు మాట్లాడట్లేదు’అని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. -
‘డీజీపీ అపాయింట్మెంట్ ఇచ్చారు.. కానీ వచ్చాక కలవలేదు’
మంగళగిరి: వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారని, ఇది కూటమి ప్రభుత్వం కుట్రపూరిత చర్య అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. అసలు వంశీని ఎందుకు అరెస్ట్ చేశారో సరైన కారణం చెప్పలేదని, ఓ తప్పుడు కేసు పెట్టి వంశీని ఇరికించే ప్రయ త్నం చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. వంశీ అరెస్టుపై డీజీపీని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చిన అంబటి మీడియాతో మాట్టాడారు. ‘వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారు.. ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కావడం లేదు. తప్పుడు కేసు పెట్టి ఇరికించారు. వంశీ టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి రావడం వల్ల చంద్రబాబు, లోకేష్లు కక్ష గట్టారు. ఎన్నోసార్లు అరెస్ట్ చేయాలిన ప్రయత్నించినా కోర్టుకు వెళ్లి ప్రొటక్షన్ తెచ్చుకున్నాడు వంశీ. ఇది తప్పుడు కేసు అని అందరికీ తెలుసు కనీసం వంశీని భార్య కలవడానికి కూడా ఎన్నో ఆంక్షలు పెట్టారు పోలీసులు.దీనిపై డీజీపీకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాం. డీజీపీ ఆఫీస్ కు అపాయింట్ మెంట్ ఇస్తే వచ్చాం.. అయినా వారిని కలవలేదు. రిప్రజెంటేషన్ఇ వ్వడానికి ఈరోజు(గురువారం) సాయంత్రం 4.35కి అపాయింట్ మెంట్ ఇచ్చారు. మేము 4.30కే డీజీపీ ఆఫీస్ కి వచ్చాం. అప్పుడు డీజీపీ ఉన్నారు.. కానీ కాసేపటికి వెళ్లిపోయారని చెప్పారు. మరి మా రిప్రంజటేషన్ ఎవ్వరూ తీసుకోలేదు. ఇదేంటో అర్థం కావడం లేదు. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత డీజీపీపై ఉంది. మేము ఇచ్చే రిప్రజెంటేషన్ తీసుకోవడానికి డీజీపీ ఎవరినైనా పంపిస్తారా? లేక మేమే మళ్లీ వచ్చి కలవాలా? అని అంబటి మీడియా ముఖంగా ప్రశ్నించారు. -
Ys Jagan: మంచిపాలన చేస్తే ప్రజలు ఆదరిస్తారు...
-
తిరుమల లడ్డూ వ్యవహారం నుంచి బయటపడటానికి బాబు యత్నిస్తున్నారు
-
‘లడ్డూ’ వివాదంలో అందుకే అరెస్టులు: అంబటి రాంబాబు
సాక్షి,గుంటూరు:తిరుమల లడ్డూపై ఆరోపణలు చేసి చంద్రబాబు ఇరుక్కుపోయారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ విషయమై సోమవారం(ఫిబ్రవరి10) అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.‘తిరుపతి లడ్డూ వ్యవహారం నుంచి బయటపడడానికి బాబు ప్రయ యత్నిస్తున్నారు. రాజకీయంగా లబ్ధి పొందడానికే చంద్రబాబు తిరుపతి లడ్డూపై ఆరోపణలు చేశారు. లడ్డూలో జంతువుల కొవ్వు ఉందని అబద్ధం చెప్పారు. తిరుమల లడ్డూకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది.తిరుమల లడ్డూల తయారీకి నెయ్యి సరఫరాకు ఒక పద్ధతి ఉంది.ఏఆర్ డెయిరీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే నెయ్యి సరఫరా ప్రారంభించారు.టెస్టుల్లో ఫెయిలైన ట్యాంకర్లను వెనక్కి పంపుతారు.వైఎస్ జగన్హయాంలోనూ ట్యాంకర్లను వెనక్కి పంపారు.దైవాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నారు’అని అంబటి రాంబాబు అన్నారు.అంబటి రాంబాబు ఇంకా ఏమన్నారంటే..చంద్రబాబు నాయుడు అత్యంత దుర్మార్గుడు నీచుడుపవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నాడునిబంధనల ప్రకారం వెనుక్కు పంపించిన నెయ్యి పైన అరెస్టులు జరుగుతున్నాయిచంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఎక్కడా స్వామివారి ప్రసాదాలలో కల్తీ జరగలేదుచంద్రబాబు నాయుడు ఆరోపణలపై విచారణ జరుగుతోంది2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 15 సార్లు నెయ్యి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని వెనక్కి పంపారువైఎస్ జగన్ ప్రభుత్వంలో నిబంధనల ప్రకారం 18సార్లు నెయ్యి వెనుక్కు పంపారుచంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పి ఇరుక్కుపోయాడు కాబట్టే ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నాయిస్వామివారి ప్రసాదంపైన జరగని విషయాన్ని జరిగినట్టు ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు ఇరుక్కుపోయాడులడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని విష ప్రచారం చేస్తే పవన్ కళ్యాణ్ మెట్లు తుడిచి హంగామా చేశాడువాడని నెయ్యిని వాడినట్టు వాటిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు చంద్రబాబు నాయుడు ప్రచారం చేశాడుతిరుమల నెయ్యి కల్తీ అయిందన్న ఆరోపణలు ఆధారాలు లేవుచంద్రబాబు పాలనలోనే ఏఆర్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నెయ్యి పంపిణీ చేసిందిచిరంజీవి రాజకీయాలకు పనికొచ్చే వ్యక్తి కాదుప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో కలిపినట్లే జనసేనను బీజేపీలో కలుపుతారాచిరంజీవి మాటలు వింటే అదే అర్థమవుతోందిప్రజారాజ్యం రూపాంతం చెంది జనసేన అయిందన్న చిరంజీవి మాటల వెనుక బీజేపీలో జనసేనను కలుపుతారు ఏమో అని చెక్ చేసుకోవాలి -
బాబు, లోకేష్ పై అంబటి సెటైర్లు
-
హామీలు అమలు చేయకుండా ఆరోపణలా?: అంబటి రాంబాబు
సాక్షి,గుంటూరు:తొమ్మిది నెలల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు విమర్శించారు. గుంటూరులో అంబటి రాంబాబు శుక్రవారం(ఫిబ్రవరి7) మీడియాతో మాట్లాడారు.‘అధికారంలోకి వచ్చేందుకు కూటమి నేతలు అసత్యాలు చెప్పారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇప్పుడు వైఎస్ జగన్పై ఆరోపణలు చేస్తున్నారు. హామీల అమలులో 40 ఏళ్ల నారా చంద్రబాబు అనుభవం ఏమైంది. కూటమి పాలనలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మాపై ఆరోపణలు చేస్తున్నారు’అని అంబటి రాంబాబు మండిపడ్డారు.అంబటి రాంబాబు ఇంకా ఏమన్నారంటే..కూటమి అసమర్ధ పాలనపై వైఎస్ జగన్ ప్రజలకు వివరించి చెప్పారుప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను వివరంగా వివరించారు8 మాసాల కూటమి పాలనలో అన్ని మోసాలు, దాడులు, అరాచకాలే 40 ఏళ్ల అనుభవం కలిగి నాలుగుసార్లు సీఎంగా చేసిన చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారు.వైఎస్ జగన్ అమలుకు సాధ్యం కానీ హామీలను ఇవ్వరుచంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా సాధ్యం కాదు అని చెప్తున్నారువైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేక పోతున్నారు..జగన్ హాయంలో 14 లక్షల కోట్ల అప్పులు అని అబద్ధం చెప్పారుబడ్జెట్లో 6 లక్షల కోట్లు అని చూపించారుఎల్లో మీడియా కోసం తప్పుడు లెక్కలు, అబద్ధాలు చెపుతున్నారు2.73 లక్షల కోట్లు డైరెక్ట్ గా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు వైఎస్ జగన్ వేశారు.ఎన్నికల ముందు సంపద సృష్టిస్తా అన్నారుమంచంలో ఉన్న ముసలి ఆమె కూడా నొక్కుతుంది బటన్ అన్నారుచంద్రబాబు ముసలి వాడే కదా బటన్ ఎందుకు నొక్కలేక పోతున్నారుఆయన వల్ల కాకపోతే ఆయన తనయుడు నారా లోకేష్ యువకుడే కదా ఆయనతో నొక్కించ వచ్చు కదా బటన్ఏ మాత్రం ప్రమేయం లేని మిథున్ రెడ్డి గారికి లిక్కర్ స్కాం అంట కడుతున్నారుప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీకు జీతాలు అన్నారుఒక్క నెల మాత్రమే 1వ తేదీ ఇచ్చారుదావోస్ పర్యటనలో ఏపీకి పెట్టుబడులు రాలేదురెడ్బుక్ అంటే పరిశ్రమలు ఎలా వస్తాయికూటమి ప్రజా ప్రతినిధులకు దమ్ము, ధైర్యం ఉంటే నిన్న వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలిటీడీపీ నేతల రాజకీయ బతుకు అంతా అబద్ధాలు, మోసంచెత్త వాగుడు, కారుకూతలు పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలిగుంటూరుకు మూడు ఆర్వోబీలు వచ్చాయి అని గొప్పలు చెపుతున్నారుకాగితాల మీద చాలా అవుతాయి. రియాల్టీ లో అవ్వాలిగ్యారెంటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ జ్వరం, వెన్నుపూసలో నొప్పి అని ఇంట్లో పడుకున్నాడుబటన్ నొక్కమంటే విషం కక్కుతున్నాం అంటే ఎలా.రోడ్ల గుంతలు పూడ్చటానికి రూ. 26 వేల కోట్లు అప్పు చేశారు.డొక్కా మీద నేను మాట్లాడాల్సిన అవసరం లేదుపవన్ కళ్యాణ్ నిజంగా సిక్ అయ్యాడా..? షూటింగ్లో ఉన్నాడా తెలీదు.పవన్ కళ్యాణ్ ,చంద్రబాబు, నారా లోకేష్ మీద అలకపునాడు ఏమో నాకు తెలీదుచంద్రబాబు రెడ్ బుక్ ఓపెన్ చేసిన తరువాత కేసులు నమోదు అవుతాయి.నా మీద ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు -
బాబు అక్రమాలు.. పవన్ నోటికి ప్లాస్టర్: అంబటి
సాక్షి, గుంటూరు: ఏపీలో టీడీపీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేవన్నీ దొంగ మాటలేనని ఆరోపించారు. చంద్రబాబు అక్రమాలపై మాట్లాడలేని పిరికి వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దుర్మార్గాలను చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ కూడా ప్రోత్సహిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు.. మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలపై స్పందించారు. ఈ క్రమంలో అంబటి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘స్టాండింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ నాటికి మా బలం 33 మంది కార్పొరేటర్లు. ప్రలోభాలకు గురి చేసి కొంత మందిని చేర్చుకున్నారు. దీంతో మాకు 28 వాళ్ళకు 28 కార్పొరేటర్ల మద్దతు ఉంది. క్రాస్ ఓటింగ్కు పాల్పడటం మమ్మల్ని తీవ్రంగా కలిచి వేసింది. నలుగురు కార్పొరేటర్లు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి.టీడీపీ మూల్యం చెల్లించక తప్పదు. తిరుపతిలో కిడ్నాప్ చేసి, దాడి చేసి, ప్రలోభాలకు గురి చేసి పార్టీ మార్చుకున్నారు. గుంటూరు కార్పోరేషన్లో అవిశ్వాస తీర్మానం పెడితే ఎదుర్కోవటానికి సిద్దంగా ఉన్నాం. అవిశ్వాస తీర్మానానికి భయపడం.. ఎదుర్కొంటాం. చంద్రబాబు అన్ని దొంగ మాటలు చెబుతున్నారు. తిరుపతిలో ఒక్క సీటు గెలిచిన జనసేన ఎలా డిప్యూటీ మేయర్ అయ్యారు. ఇంత జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నాడు. పవన్ తన నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చొన్నాడు. చంద్రబాబు అక్రమాలపై మాట్లాడలేని పిరికి వ్యక్తి పవన్ కల్యాణ్. రాష్ట్రంలో దుర్మార్గాలను చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ ప్రోత్సహిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ సైలెంట్ మోడ్ వీడాలి’ అని హితవు పలికారు.నాలుగేళ్లు పూర్తయిన తర్వాత అన్ని మున్సిపాలిటీల్లో, కార్పోరేషనుల్లోనూ అవిశ్వాసం పెట్టడానికి సిద్దమవుతున్నారు. కార్పోరేషన్లలో వెలుగు చూసిన బుడమేరు స్కాంపై పోరాటం చేస్తాం. పెమ్మసానికి నేనెప్పుడూ ఫోన్ చేయలేదు. కష్టపడి సంపాదించాడు. ఆయన చాలా గొప్పవాడు. స్థాయి సంఘం ఎన్నికల్లో స్థాయి తగ్గించుకున్నాడు. రాజకీయాల్లోకి వచ్చి కార్పొరేటర్ల కోసం వేటాడుతున్నాడు అంటూ కామెంట్స్ చేశారు.మరోవైపు, మేయర్ కావటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ..‘కార్పోరేషన్లో వైఎస్సార్సీపీకి మెజారిటీ ఉన్నా స్టాండింగ్ కమిటీలోని ఆరు స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. ఇదేదో అతి పెద్ద విజయం అన్నట్లు కూటమి నేతలు మాట్లాడుతున్నారు. వైఎస్సార్సీపీ ఖాళీ అవుతుందని ప్రచారం చేస్తున్నారు. 2014లో వైఎస్సార్సీపీకి 63 సీట్లు వస్తే.. 2019లో 151 సీట్లు వచ్చాయి. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది.. దీనిపై సమీక్ష చేస్తాం. నేను చివరి వరకూ వైఎస్ జగన్ వెంటే ఉంటా.. పార్టీ మారే ఆలోచన లేదు’ అని స్పష్టంచేశారు.అలాగే, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు మాట్లాడుతూ..‘లోపాయికారీ ఒప్పందంతో కొంతమంది కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారు. మాతో పాటే ఉంటూ కొంత మంది వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడ్డారు. క్రాస్ ఓటింగ్కు పాల్పడిన వారిని ఉపేక్షించం. అధికారం కోసం అడ్డదారులు తొక్కడం టీడీపీ నేతలకు అలవాటు. మేము ప్రజల కోసం మాత్రమే పని చేస్తాం’ అని చెప్పుకొచ్చారు. -
దొంగ మాటలు.. దొంగ వ్యవహారాలు.. బాబుపై అంబటి ఫైర్
-
పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా... అంటా ముద్రగడ ఇంటిపై దాడి.. అంబటి రియాక్షన్
-
నిందితుడిది పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటా.. పవన్ నోరు మెదపరేం?
సాక్షి,గుంటూరు : ‘వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి చేసిన వ్యక్తి ‘నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా’ అని చెప్పుకుంటున్నాడు. ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నోరు మెదపాలి’ అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు.ముద్రగడ ఇంటిపై దాడి ఘటన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి చేశారు. ముద్రగడ ఇంటి గేటును ట్రాక్టర్లో ఢీకొట్టి.. పోర్టికోలో ఉన్న కారును ఢీకొట్టారు. ముద్రగడ, ఆయన కుమారుడి ఫ్లెక్సీలు ధ్వంసం చేసి అరాచకం సృష్టించారు.‘‘ఆ వ్యక్తి నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పుకుంటున్నాడు. ఇలాంటి ఘటనలను ప్రోత్సహించడం పిఠాపురం తాలూకా ఎమ్మెల్యేకి సరికాదు. తక్షణం ఈ ఘటనపై పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరువిప్పాలి. ఈ దాడిని ఖండించకపోతే మీరు ఇలాంటి దౌర్జన్యాలను ప్రోత్సహించినవారవుతారు. నివాసాలపైకి వెళ్లి దాడులు చేయడాన్ని కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని డిమాండ్ చేస్తున్నాం’ అని అంబటి అన్నారు. -
పెమ్మసానిపై అంబటి సీరియస్ కామెంట్స్
-
బాబు, పవన్ పై అంబటి సెటైర్లే సెటైర్లు
-
‘పవన్.. బాబు సూపర్ సిక్స్కు గ్యారంటీ నువ్వే కదా’
సాక్షి, అనకాపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు వైఎస్సార్సీపీ నేతలు. ఎనిమిది నెలల్లోనే సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేనని బాబు చేతులెత్తేశాడని వ్యాఖ్యలు చేశారు. అలాగే, అప్పులు చేసి కూడా పేదలకు చంద్రబాబు పథకాలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాల పేరుతో మోసం చేసిన టీడీపీ నేతలు ఎక్కడికక్కడ ప్రజల నిలదీయాలని పిలుపునిచ్చారు.అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా నేడు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ బాధ్యతల స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్ సహా భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. మాట ఇచ్చి మోసం చేయడం చంద్రబాబు సహజ గుణం. చెప్పింది చెయ్యడం.. చేయగలిగినదే చెప్పడం వైఎస్ జగన్ సహజ గుణం. ఎన్నికలకు ముందు ఒక్క అబద్దం చెప్పడానికి కూడా జగన్ ఒప్పుకోలేదు.. హామీల అమలు కోసం అడిగితే మొన్నే అధికారంలోకి వచ్చాం అంటున్నారు. మరి మొన్నే అధికారంలోకి వచ్చిన మీరు గ్రీన్ హైడ్రో ప్రాజెక్టు ఎలా తీసుకొచ్చారు?. బల్క్ డ్రగ్ పార్క్ ఎలా తీసుకొచ్చారు?. పథకాల విషయంలో మొన్నే అధికారంలోకి వచ్చాం అంటారా?. ప్రాజెక్టులు మాత్రం మేమే తీసుకొచ్చాం అంటారా?. ఇదెక్కడి న్యాయం’ అని ప్రశ్నించారు. కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఈ ప్రాంతంలో వైఎస్సార్సీపీ లక్కు.. అంబటి రాంబాబు అంటే వైఎస్సార్సీపీలో కిక్కు. చంద్రబాబు మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేశాడు. ఎనిమిది నెలల్లోనే సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేనని బాబు చేతులెత్తేశాడు. మోసం చేసిన టీడీపీ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలి. నాకు అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులుగా అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్కు ధన్యవాదాలు. అనకాపల్లిలో అన్ని అసెంబ్లీ స్థానాలు గెలవడంలో నా పాత్ర కీలకంగా ఉంటుందని నూకాంభిక అమ్మవారిపై ప్రమాణం చేస్తున్నాను అని అన్నారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ‘2019 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో అన్ని అసెంబ్లీ స్థానాలు గెలిచాం. వచ్చే ఎన్నికల్లో కూడా అదే ఫలితం రిపీట్ కావాలి. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని మంచి చేసిన సీఎంగా వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారు. రాష్ట్రంలో పోర్టులు, మెడికల్ కాలేజీలు కట్టిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది. అనకాపల్లిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్ది. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కూడా వైఎస్సార్సీపీ హయాంలోనే వచ్చింది.రాష్ట్రంలో వాట్సాప్ సేవలు తీసుకొచ్చింది వైఎస్ జగన్. వాలంటీర్ వ్యవస్థ వలన ప్రజలకు మంచి జరిగింది. కానీ, పార్టీకి కేడర్కు మధ్య గ్యాప్ పెరిగింది. మళ్ళీ అధికారంలోకి వచ్చాక పార్టీ కార్యకర్తల ద్వారానే అన్ని సేవలు అందుతాయి. ఇది పార్టీ మాటగా హామీ ఇస్తున్నాను. అన్ని వైఎస్ జగన్ను ప్రజలు ఓడించారు. ఇప్పుడు చంద్రబాబు ప్రజలకు మంచిగా బుద్ధి చెబుతున్నారు. ఇప్పుడు ఎందుకు చంద్రబాబు బటన్ నొక్కి డబ్బులు వేయలేకపోతున్నాడు. ప్రజలకు రెండు లక్షల 80వేల కోట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘ఉభయ రాష్ట్రాలలో మంచి పేరున్న నాయకుడు బొత్స సత్యనారాయణ. పార్టీ ఓడినా మండలి ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న వ్యక్తి బొత్స. 164 స్థానాలు ఎందుకు వచ్చాయో కూటమి నేతలకే అర్ధం కావడం లేదు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ పునఃనిర్మాణం జరుగుతుంది. ధర్మశ్రీని ఢిల్లీ పంపాలని జగన్ నిర్ణయించారు. ఓటమి నుంచే పట్టుదల పెరుగుతుంది. ఎనిమిది నెలల కాలంలో ఇంత వ్యతిరేకత మూటకట్టుకున్న ప్రభుత్వం లేదు. చంద్రబాబు సూపర్ సిక్స్కు పవన్ కళ్యాణ్ గ్యారంటీ ఇచ్చారు. బీజేపీ గ్యారంటీ ఇవ్వలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటానంటే ఆయన భార్య, కొడుకు ఒప్పుకునేలా లేరు. వైఎస్సార్సీపీ వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలవడానికి లోకేష్ ఒక్కడు చాలు. లోకేష్కు దండం పెట్టిన వాడికి మంత్రి పదవి ఇచ్చారు’ అని కామెంట్స్ చేశారు. -
పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫీజుపోరు పోస్టర్ రిలీజ్
-
పెమ్మసానికి లెఫ్ట్ అండ్ రైట్ వాయించిన అంబటి రాంబాబు
-
చంద్రబాబు అసమర్థతను అంగీకరించారు
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చను అని సీఎం చంద్రబాబు స్వయంగా ఆయన అసమర్థతను అంగీకరిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు చెప్పారు. ఆయన సోమవారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. నీతి ఆయోగ్ లెక్కలంటూ.., వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్థి క వ్యవస్థను విధ్వంసం చేశారంటూ ఏ హామీనీ అమలు చేయలేనని ప్రకటించడం చంద్రబాబు దివాలాకోరుతనానికి నిదర్శనమని అన్నారు. చంద్రబాబు హామీలను అమలు చేయలేరని ఆనాడే వైఎస్ జగన్ చాలా స్పష్టంగా చెప్పారన్నారు.అయినా చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్ల అప్పులు చేసిందంటూ విష ప్రచారం చేశారని, ఆ తర్వాత వారు ప్రవేశ పెట్టిన బడ్జెట్లోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పులు రూ.6,46,537 కోట్లు మాత్రమే అని తేల్చారని వివరించారు. అంటే చంద్రబాబు ఊహించిన దానికన్నా అప్పులు 50 శాతం తక్కువేనని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందన్న విషయం ఎవరికైనా అర్థమవుతుందని అన్నారు. అయినా ఆర్థి క పరిస్థితి అధ్వానంగా ఉందని, వైఎస్సార్సీపీ హయాంలో చేసిన అప్పులే కారణమని ఎలా చెబుతారని నిలదీశారు. చంద్రబాబు అసమర్థత వల్లే పెట్టుబడులు రాలేదు రాష్ట్రాన్ని పెట్టుబడుల వరద ముంచెత్తుతుందంటూ కుమారుడు, అధికారులతో కలిసి ఆర్భాటంగా దావోస్ వెళ్లిన చంద్రబాబు ఉత్త చేతులతో తిరిగొచ్చారని ఎద్దేవా చేశారు. కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు చేసినా ఒక్క ఎంఓయూ లేదని చెప్పారు. చంద్రబాబు అసమర్థతే ఇందుకు కారణమన్నారు. దానిని కప్పిపుచ్చుకోవడానికే దావోస్లో ఎంఓయూలు మిథ్య అంటూ చాలా గొప్పగా సెలవిచ్చారని, ఇలా చెప్పడం సిగ్గుచేటని అన్నారు. మరి ఎందుకు దావోస్ వెళ్లారని నిలదీశారు. చంద్రబాబు ఆరోగ్యరీత్యా కోటు వేసుకోలేరని, అయినా అంతగొప్ప చలిలో కూడా కోటు తొడుక్కోకుండా పెట్టుబడుల కోసం చంద్రబాబు ప్రయత్నించారంటూ ఎల్లోమీడియా దిగజారుడు రాతలు రాసిందన్నారు.సీఎంగా వైఎస్ జగన్ దావోస్కు వెళ్లి రూ.1.26 లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. టెక్ మహేంద్ర రూ.200 కోట్ల ప్లాంట్, అదానీ గ్రూప్ రూ.60 వేల కోట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు, కర్నూలు జిల్లాలో రూ.37వేల కోట్లతో గ్రీన్ కో కంపెనీ ప్రాజెక్టు, అరబిందో గ్రీన్ ఎనర్జీ రూ.28వేల కోట్ల ప్రాజెక్టు వంటివన్నీ వైఎస్ జగన్ తెచి్చనవేనని తెలిపారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను కోడిగుడ్డాయన అంటున్న లోకేశ్ పెద్ద పప్పుసుద్ద కాదా అని అన్నారు. లోకేశ్ ఎర్ర బుక్కుకు తన కుక్క కూడా భయపడదని, అక్రమ కేసులతో ఎంతమందిని జైలుకు పంపినా వైఎస్సార్సీపీ వెనుకంజ వేయదని స్పష్టం చేశారు. -
రెడ్బుక్కు మా ఇంటి కుక్క కూడా భయపడదు: అంబటి
సాక్షి,గుంటూరు : ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చను అని సీఎం చంద్రబాబు స్వయంగా తన అసమర్థతను అంగీకరిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరులోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారని, అందువల్లే ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన ఏ హామీని తాను అమలు చేయలేనని చంద్రబాబు ప్రకటించడం ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో విజనరీ, అనుభవం ఉన్న నేతగా తనను తాను గొప్పగా చిత్రీకరించుకునే చంద్రబాబు తాజాగా తన అబద్దాలతో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల అమలు నుంచి తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...నీతి అయోగ్ వెల్లడించిన లెక్కలను చూపుతూ తాజాగా సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలను బట్టి ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నాను అని అంగీకరించారు. దానికి కారణం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని సాకులు చూపుతుండటం ఆయన అసమర్థతకు నిదర్శనం. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయాలంటే, తాను ఊహించిన దానికన్నా కూడా చాలా ఎక్కువగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనం అయ్యిందని అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు అనేక వాగ్ధానాలు చేశారు. వాటిని అమలు చేస్తానని చెప్పారు. ఆనాడే వైఎస్ జగన్ చాలా స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు హామీలు అమలు చేయలేనివి, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందుకు అనుగుణంగా లేదని చెప్పారు. అయినా కూడా నేను అన్నీ చేయగలను అని చంద్రబాబు ప్రజలను నమ్మించి, మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు.రాష్ట్ర అప్పులపైనా అబద్దాలుఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని విష ప్రచారం చేశారు. ఎన్నికల తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బడ్జెట్ సందర్భంగా మీరే అధికారికంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు రూ. 6,46,537 కోట్లు మాత్రమే అని తేల్చారు. చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పిన అప్పుల కన్నా యాబై శాతం తక్కువగానే గత ప్రభుత్వం అప్పులు చేసింది అని తెట్టతెల్లం అయ్యింది. అంటే మీరు ఊహించిన దానికన్నా అప్పుల తక్కువగా ఉన్నాయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని ఎవరికైనా అర్థం అవుతుంది. ఈ వాస్తవాలను ఒకవైపు అంగీకరిస్తూనే, మరోవైపు ఎన్నికలకు ముందు మేం ఊహించిన దానికన్నా ఇప్పుడు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది, దానికి వైఎస్సార్ సీపీ హయాంలో చేసిన అప్పులే కారణం అని ఎలా చెబుతారు? చంద్రబాబు తన మాటలను తానే ఖండించుకుంటున్నారు. ఇలా గత ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడానికి సిగ్గు అనిపించడం లేదా?తన ప్రజంటేషన్ లోనూ తప్పుడు వాదనలుతాజాగా చంద్రబాబు నీతి అయోగ్ లెక్కల గురించి ఇచ్చిన ప్రజంటేషన్ లో మాట్లాడుతూ 2022-23లో సీఎం వైఎస్ జగన్ చేసిన పెట్టుబడి వ్యయం రూ.7,244 కోట్లు, అప్పులు రూ.67,985 కోట్లు అని చెప్పారు. ఇలా చేయడం అన్యాయం, అక్రమం అని చెప్పారు. 2024-25లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఈ ఏడు నెలల్లో చేసిన అప్పులు రూ.73,685 కోట్లు, పెట్టుబడి వ్యయం రూ.8,894 కోట్లు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చేసింది పోల్చుకుంటే ఎక్కడా పెద్ద తేడా కనిపించడం లేదు. మరి చంద్రబాబు దీనిని ఎలా సమర్థించుకుంటారు? చంద్రబాబు తన మీడియా సమావేశంలో ఇలా గతంలో జరిగిందంతా తప్పు, తాను చేస్తున్నవి మాత్రం అత్యుత్తమమైన ఒప్పు అని ఎటువంటి సిగ్గు లేకుండా చెబుతుంటే, ఈ మీడియా సమావేశంలో చంద్రబాబుకు భజన చేసే ఎల్లో మీడియా ప్రతినిధులు 'మీరు చాలా తక్కువగా చెబుతున్నారు, ఇంకా కొన్ని కలుపుకుంటే చాలా ఎక్కువ అప్పులు కనిపిస్తాయి' అంటూ చంద్రబాబు అబద్దాలకు తాళం వేస్తున్న పరిస్థితి చాలా దురదృష్టకరం. ఇటువంటి అబద్దాలను చెబుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగవేయాలన్నదే చంద్రబాబు లక్ష్యం.చంద్రబాబు అసమర్థత వల్లే పెట్టుబడులు రాలేదుఇటీవల చంద్రబాబు దావోస్ పర్యటనకు తన కుమారుడు లోకేష్తో పాటు పలువురు అధికారులతో తీసుకుని ఎంతో ఆర్భాటంగా పర్యటనకు వెళ్లారు. ఇంకేముందీ రాష్ట్రాన్ని పెట్టుబడుల వరద ముంచెత్తుతుందనే స్థాయిలో ఈ ప్రచారం జరిగింది. తీరా ఉత్తి చేతులతో చంద్రబాబు బృందం రాష్ట్రానికి తిరిగి వచ్చింది. ఒక్క ఎంఓయు లేదు, కోట్ల రూపాయల ప్రజాధనంను వ్యయం చేశారు. కనీసం దారి ఖర్చులు కూడా గిట్టుబాటు కాలేదు. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు మాట్లాడుతూ దావోస్లో ఎంఓయులు అనేవి ఒక మిథ్య అంటూ చాలా గొప్పగా సెలవిచ్చారు. దావోస్ వెళ్ళినంత మాత్రాన పెట్టుబడులు వస్తాయనేది ఒక భ్రమ అని కొత్త అంశాన్ని వెల్లడించారు. అలాంటప్పుడు చంద్రబాబు, ఆయన బృందం ఎందుకు దావోస్ వెళ్ళారు. చంద్రబాబు ఆరోగ్యరీత్యా ఆయన కోటు వేసుకోలేని స్థితిలో ఉన్నారు. దానిని కూడా ఎల్లో మీడియా అంతగొప్ప చలిలో కూడా కోటు తొడుక్కోకుండా పెట్టుబడుల కోసం చంద్రబాబు ప్రయత్నించారంటూ దిగజారుడు రాతలు రాసింది. అనుకూలంగా ఉంటే ఒకరకంగా, వ్యతిరేకం అయితే మరోరకంగా మాట్లాడటం చంద్రబాబుకు అలవాటు. టక్కుటమార విద్యలకు చంద్రబాబు ప్రసిద్ది. ఆయన చెప్పే ప్రతి విషయాన్ని భక్తితో పెద్ద ఎత్తున ప్రచారం చేయడమే ఎల్లో మీడియాకు తెలిసింది. 2014-19 హయాంలో గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ నిర్వహించారు. 328 ఒప్పందాల ద్వారా రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని ఆర్భాటంగా ప్రకటించారు. ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామని డబ్బా కొట్టుకున్నారు. ఇందులో ఎన్ని ఒప్పందాలు ఆచరణలోకి వచ్చాయి, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎంత మందికి ఉపాధి కల్పించారో చెప్పగలరా? సీఎంగా వైఎస్ జగన్ కూడా దావోస్కు వెళ్ళి రూ. 1.26 లక్షల కోట్ల రూపాయల ఎంఓయులపై సంతకాలు చేశారు. టెక్ మహేంద్ర సీఈఓ గుర్నానీ రూ.200 కోట్లతో ఇథనాల్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. ఆదానీ గ్రూప్ రూ.60 వేల కోట్లతో పెట్టుబడులతో వస్తే, భూములు కేటాయించి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరిగేందుకు చర్యలు తీసుకున్నారు. అలాగే 37వేల కోట్ల పెట్టుబడులతో కర్నూలు జిల్లాలో గ్రీన్ కో కంపెనీ పనులు కూడా మా హయాంలోనే ప్రారంభమయ్యాయి. అరబిందో గ్రీన్ ఎనర్జీ 28వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో వచ్చింది. ఇవ్వన్నీ జగన్ హాయంలో జరిగినవి.ఎల్లో మీడియా అండతో రెచ్చిపోతున్న చంద్రబాబుఒక పర్యాయం సీఎం వైఎస్ జగన్ దావోస్ పర్యటనకు వెళ్ళలేకపోతే చంద్రబాబుకు భజన చేసే ఎల్లో మీడియా ఈనాడు పత్రిక 'ఓసోస్ దావోస్ మనకెందుకూ' 'పెట్టుబడుల కోసం దావోస్ వెళ్ళలేరా?' అంటూ ఒక కథనాలను ప్రచురిస్తూ, సీఎం దావోస్ ఎందుకు వెళ్ళలేదు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. పొరుగు రాష్ట్రాల సీఎంలు దావోస్ కు వెళ్ళి పెట్టుబడులు తెచ్చుకుంటుంటే మీరు ఎందుకు స్పందించడం లేదు అంటూ తమ కథనాల్లో ప్రశ్నించారు. మరి నిత్యం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తుతూ స్వామిభక్తిని చాటుకునే ఇదే ఎల్లో మీడియాకు చెందిన ఈనాడు పత్రికకు ఉత్తి చేతులతో తిరిగి వచ్చిన చంద్రబాబు బృందం అసమర్థత కనిపించడం లేదా? దావోస్ వెళ్లినంత మాత్రాన పెట్టుబడులు వస్తాయా అంటూ చంద్రబాబు ప్రశ్నిస్తే సమంజసమే అన్నట్లుగా అనుకూల కథనాలను రాయడానికి ఏమాత్రం వెనకాడలేదు. అంటే వైఎస్ జగన్ దావోస్ వెళ్ళకపోతే పెట్టుబడులు అక్కరలేదా అని ప్రశ్నిస్తారు, అదే చంద్రబాబు తన అసమర్థత వల్ల పెట్టుబడులు తీసుకు రాలేకపోతే మరే ఫరవాలేదు అంటూ చంద్రబాబును సమర్థిస్తారు. ఇప్పుడు పొరుగు రాష్ట్రాల సీఎంలు లక్షల కోట్లు పెట్టుబడులతో తమ రాష్ట్రాలకు వచ్చారు, చంద్రబాబు ఒక్క రూపాయి కూడా ఎంఓయు కుదుర్చుకోకుండా వచ్చారు. ఇది ఎల్లోమీడియాకు కనిపించదు. ఇదీ ఎల్లో మీడియా, దానిని నిర్ధేశిస్తున్న చంద్రబాబు నిజస్వరూపం. నరంలేని నాలుకను ఎటువైపు అయినా తప్పి మాట్లాడటంలో ఎంతో ఘనుడు. ఈ విషయంలో చంద్రబాబు, ఆయనకు ప్రచారం చేసే ఎల్లో మీడియాను మించిన వారు లేరు.పగిలిన గ్లాస్ కథను ప్రచారంలోకి తెచ్చారుదావోస్ లో చంద్రబాబు ఎంత బాధ్యతతో వ్యవహరించారో ఆయనతో పాటు పర్యటనలో పాల్గొన్న ఒక అధికారి ఎల్లో మీడియాకు చెందిన ఒక చానెల్ కు తెలిపిన కథనాన్ని చాలా గొప్పగా ప్రసారం చేశారు. ఈ కథనంలో దావోస్ లో మైనస్ 12 డిగ్రీల చలిలో చంద్రబాబు బృందం నిద్రిస్తున్న గదుల్లో గ్లాస్ పగిలి, గడ్డకట్టించే చలిలో రాత్రంతా నిద్రలేకుండా గడిపారని, తెల్లవారుజామున వారు కొద్దిసేపు నిద్రించి ఆలస్యంగా లేచారట. సదరు అధికారులు తెల్లవారిన తరువాత లేచి చూస్తే చంద్రబాబు గదిలో లేరని, ఆయన గదిలో కూడా గ్లాస్ పగిలినా, గడ్డకట్టే చలిలో రాత్రంతా వణికిపోతూ నిద్ర లేకుండా గడిపి, ఉదయానే అలసటను కూడా పట్టించుకోకుండా దావోస్లోని మీటింగ్ హాల్కు వెళ్ళిపోయారట. అంతేకాదు మిగిలిన రాష్ట్రాల వారు ఇంకా తమ స్టాల్స్ ను ప్రారంభించక ముందే అందరికంటే ముందుగా చంద్రబాబు ఏపీ స్టాల్ కు వెళ్ళి, దానిని ప్రారంభించి, అప్పటికే అక్కడకు వచ్చిన కొందరు విదేశీ పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతూ కనిపించారట. అక్కడ ఉన్న విదేశీ పారిశ్రామికవేత్తలు కోట్లు, రగ్గులు కప్పుకుని ఉంటే, చంద్రబాబు మాత్రం తాను రోజూ ధరించే అదే ఖద్దరు దుస్తులతో వారితో మాట్లాడుతూ కనిపించారట. అది చూసి అధికారులు సిగ్గుతో చంద్రబాబు వద్దకు వచ్చి ఇంత చలిలో మీరు ఎందుకు అందరికంటే తొందరగా వచ్చారని వారిలోని ఒక అధికారి ప్రశ్నిస్తే, మనం ప్రభుత్వ సొమ్ముతో, వారు చెల్లించిన పన్నులతో విమానాల్లో ఇక్కడకు వచ్చాం, అందరికంటే ముందుగా ఇక్కడకు వస్తే కనీసం ముందుగా వచ్చే పారిశ్రామికవేత్తలతో మాట్లాడవచ్చు, వారిలో ఒకరిద్దరు అయినా పెట్టుబడులు పెడితే రాష్ట్రానికి మేలు జరుగుతుందనే బాధ్యతతో ఇక్కడకు వచ్చాను అని అన్నారట. అది విన్న సదరు అధికారి కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయని అత్యంత అద్భుతమైన ఒక కథను ప్రచారం చేశారు. ఈ మొత్తం కథను 2023 నవంబర్ 13వ తేదీన టీవీ5 అనే ఛానెలో లో ప్రజంటేటర్ మూర్తికి, సినీ నిర్మాత బండ్ల గణేష్ కు మధ్య జరిగిన సంభాషణ. ఇదే స్టోరీని అదే ఛానెల్ లో అదే ప్రజంటేటర్ మూర్తి 20.1.2025న తాజాగా జరిగినట్లు చెప్పడం చూస్తే వీరు ఎంతగా దిగజారిపోయారనేది ప్రజలకు అర్థమవుతుంది. ఈ కథనంను ప్రచురించి ఎల్లో మీడియా చానెల్ టీవీ5 మరెవరిదో కాదు ఇటీవలే చంద్రబాబు ఆశీస్సులతో టీటీడీ చైర్మన్ గా పదవిని దక్కించుకున్న బీఆర్ నాయుడిది. తనకు పదవి ఇచ్చినందుకు గానూ కృతజ్ఞతతో తన చానెల్ లో గత ఏడాది నవంబర్ లో సినీ నిర్మాత బండ్ల గణేష్ చెప్పిన కథను తాజాగా ఇప్పుడే జరిగింది అని చెప్పి, దానిని ప్రచారంలోకి తీసుకురావడం చూస్తే ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా? 2023న పగిలిన గ్లాసు కథను టీవీ5 మూర్తి 2025లో జరిగినట్లు చెప్పడం ఎంత దారుణం.చంద్రబాబు కుమారుడిగానే లోకేష్ కు గౌరవంవైయస్ఆర్ సీపీ హయాంలో మేం చేసుకున్న ఒప్పందాల్లో భాగంగానే ప్రాజెక్ట్ లను ఇప్పుడు ప్రారంభిస్తున్నారి మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్న మాటలను మీడియా నారా లోకేష్ వద్ద ప్రస్తావిస్తే అమర్ నాథ్ గురించి 'ఆ.. కోడిగుడ్డాయనా' అని ఎద్దేవా చేశాడు. లోకేష్ పెద్ద పప్పుసుద్ద కాదా? చంద్రబాబును చూసి ఆయనను గౌరవిస్తున్నారు. గుడివాడ అమర్ నాథ్ ఒక మాజీ మంత్రి కుమారుడు. ఆయన చనిపోయిన తరువాత కూడా అమర్ నాథ్ ప్రజల నుంచి గౌరవం పొందుతున్నాడు. కేవలం చంద్రబాబు సీఎంగా ఉండటం వల్లే లోకేష్ కు గౌరవం. ఇది నిజంగా లోకేష్ కు ఉన్న గౌరవం కాదు. లోకేష్ ఎర్ర బుక్కుకు నా కుక్క కూడా భయపడదు. ఎంతమందిని జైలులో అక్రమ కేసులతో జైలుకు పంపినా వైఎస్సార్సీపీ వెనుకంజ వేయదు.రిపబ్లిక్ డే ప్రసంగంలోనూ డొల్లతనంవైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటి రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ ప్రసంగం ద్వారా 1.03 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు, 2.7 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పాం. రూ.3000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, అమ్మ ఒడి ద్వారా లక్షలాధి మంది తల్లులకు అండగా నిలుస్తామని ఇలా పలు కార్యక్రమాల గురించి చెప్పాం. వాటిని తరువాత అదే తరహాలో ఆచరణలో కూడా చూపాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం తమ తొలి రిపబ్లిక్ డే నాడు ప్రసంగంలో ఒక్క కార్యాచరణపైన కూడా నిర్ధిష్టమైన విషయాలను చెప్పలేకపోయింది. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా ఇంకా గత ప్రభుత్వంపైనా, వైజగన్పైనా విమర్శలు చేయడంతోనే కాలం గడుపుతోంది. ఆంధ్రా బ్రాండ్ ను దావోస్ కు వెళ్లి పెంచామని సిగ్గులేకుండా చెబుతున్నారు. ఇప్పటికైనా మీరు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలి, లేనిపక్షంలో వైఎస్సాఆర్సీపీ నుంచి మిమ్మల్ని నిలదీస్తాం. సూపర్ సిక్స్ హామీల అమలు ఏదీ? తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు అమలు విస్మరించలేదా? తమ అసమర్థతను దాచుకుంటూ జగన్ గారి వల్ల అమలు చేయలేకపతున్నామని చెప్పడానికి తెగబడుతున్నారు.మీడియా ప్రశ్నలకు సమాధానం చెబుతూలోకేష్ రెడ్ బుక్ చూసి పారిపోలేదు, రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను అని విజయసాయిరెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. విజయసాయిరెడ్డిని అప్రూవర్ గా మారమని చాలా వత్తిడి తెచ్చారని ఆయనే చెప్పారు. ఇలా వత్తిడి తెచ్చిన వారు ఎవరో ఆయనే చెప్పాలి. జగన్ మీద పెట్టిన ఏ కేసులోనూ ఆధారాలు లేవు, రాజకీయ కక్షతోనే ఆయనను జైలుకు పంపారు. లోకేష్ వేధింపులపై ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. ఎర్ర పుస్తకంలో పిచ్చిరాతలు రాసుకుని, అందరి మీద కేసులు పెట్టి గందరగోళం చేస్తున్న దానికి ప్రతిఫలం లోకేష్ అనుభవించక తప్పదు. వైజాగ్ లో జగన్ హయాంలో నిర్మించిన అద్భుతమైన నిర్మాణాలను ఏం చేసుకోవాలో తెలియని అయోమయంలో లోకేష్ ఉన్నారు. జగన్ మించిన ప్రజాధరణ కలిగిన నాయకుడు ఈ రాష్ట్రంలో మరొకరు లేరు. రాజకీయపార్టీలు ఓటమి పాలైన తరువాత నాయకులు బయటకు వెళ్ళడం జరుగుతుంది. ఇది కేవలం వైఎస్ఆర్ సీపీకే పరిమితం కాదు. గతంలో చాలా మంది టీడీపీ నుంచి బయటకు వెళ్లారు. అంతమాత్రాన టీడీపీ అధికారంలోకి రాకుండా మిగిలిపోయిందా. పార్టీ నుంచి వెళ్ళడం అనేది వెళ్ళినవారి నైతికతకు సంబంధించిన విషయం. కష్టాలను తట్టుకునే శక్తి, నష్టాలను పూడ్చుకునే శక్తి కూడా వైఎస్సార్సీపీకి ఉంది. మళ్లీ అధికారంలోకి వచ్చేలా ప్రజలను మెప్పిస్తాం’అని అన్నారు. -
సందు దొరికితే చాలు వైఎస్ జగన్ పై బురద చల్లాలనే ప్రయత్నమే
-
అమిత్షా ఏం మాట్లాడారో మాకు తెలుసు: అంబటి రాంబాబు
సాక్షి,తాడేపల్లి:అందితే జుట్టు అందకపోతే కాళ్లు అనేది చంద్రబాబుకు తెలిసిన విద్య అని మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఆదివారం(జనవరి19) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.‘నాడు తిరుమల దర్శనానికి వచ్చినపుడు అమిత్షాపై రాళ్ల వర్షం కురిపించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయి. విభజన సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. ఇలాంటి సమయంలో చంద్రబాబు, పవన్కల్యాణ్ సమస్యల గురించి మాట్లాడకుండా విందులేంటో. సమస్యలన్నీ పక్కనపెట్టి వైఎస్ జగన్ ప్యాలెస్ల గురించి మాట్లాడుతున్నారు. అమిత్ షాతో చంద్రబాబు వైజాగ్ స్టీల్ప్లాంట్ విషయం మాట్లాడలేదు.లోకేష్ను అదుపులో పెట్టుకోమని అమిత్ షా వార్నింగ్..అమిత్షా ఏం మాట్లాడారో మాకు సమాచారం ఉంది. లోకేష్ను డిప్యూటీ సీఎం చేస్తానని చంద్రబాబు అమిత్షాను అడిగారట. లోకేష్ అన్ని శాఖల్లో వేలు పెడుతున్నారని, ఆయనను ముందు అదుపులో పెట్టుకోవాలని అమిత్షా చంద్రబాబును హెచ్చరించారు. లోకేష్ వసూళ్ల కార్యక్రమంలో నిమగ్నమైనందున స్పీడ్ తగ్గించుకోవాలని అమిత్ షా బాబుకు సూచించారు.అమిత్ షా సలహాలు బయటికి రాకుండా కథలు వండి వారుస్తున్నారు. గత్యంతరం లేకే చంద్రబాబు పవన్కల్యాణ్ను డిప్యూటీ సీఎం చేశారు. చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది.వైఎస్ జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరిగాయి’అని అంబటి తెలిపారు.అంబటి రాంబాబు ఇంకా ఏమన్నారంటే..చంద్రబాబు అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే రకంరాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయ్విభజన సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయిరాష్ట్రంలోని సమస్యలను వదిలేసి జగన్ ఆస్తుల గురించి అమిత్ షా అడిగారని ప్రచారం చేస్తున్నారుఆవు కథ మాదిరి వైఎస్ జగన్ పై బురదజల్లడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారుచంద్రబాబు నివాసముండేదే అక్రమ కట్టడంఅక్రమకట్టడంలోనే విందు ఇస్తున్నామని అమిత్ షాకు ఎందుకు చెప్పలేదుఆ ఇల్లు క్విడ్ ప్రోకోలో కొట్టేసిందని అమిత్ షాకు ఎందుకు చెప్పలేదుకృష్ణమ్మ వరద ముంచేసిన ఇంట్లోనే మీరు కూర్చున్నారని ఎందుకు చెప్పలేదుహైదరాబాద్లో ఇల్లు కట్టుకున్న చంద్రబాబు ఎవరికైనా చూపించాడాచంద్రబాబు మాదిరి జగన్ మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకోలో ఇళ్లు తీసుకోలేదులోకేష్ ను ఉపముఖ్యమంత్రిగా చేయాలని అమిత్ షా ను చంద్రబాబు అడిగారుమీ అబ్బాయి లోకేష్ స్పీడ్ ను తగ్గించుకోమని అమిత్ షా చెప్పారుఎక్కడపడితే అక్కడ వేలు పెడుతున్నాడు...కొంచెం తగ్గమని చెప్పారువైఎస్ జగన్ ఇళ్ల గురించి పాతచింతకాయ పచ్చడి కథలెందుకుపోలవరం రెండవ డయాఫ్రమ్ వాల్ పనులు నిన్న ప్రారంభించారుడయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి చంద్రబాబు అవివేకంటీడీపీలో చేసిన తప్పిదమే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందిచంద్రబాబు,దేవినేని ఉమా , టీడీపీ తప్పిదాన్ని జగన్ పై నెట్టడం తప్పువైఎస్ జగన్ హయాంలోనే పోలవరం పనులు అద్భుతంగా జరిగాయిస్పిల్ వే , కాఫర్ డ్యామ్ లు జగన్ హయాంలోనే పూర్తి చేశారుతిరుపతి ఘటన మానవతప్పిదంతిరుపతికి ఇప్పుడు రమ్మని చెప్పండి ఎన్డీయేనుతిరుపతి పై ఈ ప్రభుత్వం పూర్తిగా పట్టు కోల్పోయిందిలడ్డూలో కల్తీ నెయ్యి కలిపారని మాపై అభాండాలు వేశారుఆ పాపమే ఇప్పుడు కూటమి పాలనను వెంటాడుతోందిచెప్పేటందుకే చంద్రబాబు నీతులుచంద్రబాబు, ఆయన కుమారుడు ఒక్కొక్కరినే కంటారుపేదలు మాత్రం ఇద్దరు ముగ్గురు కనమంటున్నారుఏపీలో అసమర్ధపాలన సాగుతోందిలోకేష్ భజన తగ్గించాడు...పవన్ చంద్రబాబు భజన మొదలు పెట్టాడుఅలా భజన చేస్తున్నాడు కాబట్టే బాగా లబ్ధి పొందుతున్నాడుమళ్లీ మీరే ఉంటారని గ్యారంటీ ఇవ్వాలని కంపెనీలు లోకేష్ ను అడుగుతున్నాయంటున్నారు ఈ ప్రభుత్వం మీద పారిశ్రామికవేత్తలకు నమ్మకం లేదువైఎస్ జగన్ మళ్లీ రావడం ఖాయమని పారిశ్రామికవేత్తలకు అర్ధమైపోయిందిజగన్ హయాంలోనే పెట్టుబడులు పెడదామని పారిశ్రామిక వేత్తలు ఎదురు చూస్తున్నారుచంద్రబాబు అనుభవజ్ఞుడే అవ్వొచ్చు ...కానీ అసమర్ధుడు -
గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ తీరుపై అంబటి రాంబాబు ఆగ్రహం
-
‘కూటమి’ అరాచకాలను ప్రశ్నిస్తాం.. ఎదిరిస్తాం: అంబటి
సాక్షి, గుంటూరు: పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు(Namburu Sankara Rao) కార్యాలయంపై దాడి చేసిన టీడీపీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ ఎస్పీకి వైఎస్సార్సీపీ(YSRCP) నేతలు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆ పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు. కొందరు తన కార్యాలయంలోకి చొరబడి ఫ్లెక్సీలు చింపి, అక్కడ ఉన్న పార్టీ నాయకులు, కార్యాలయ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారని.. ఈ అంశంపై ఇవాళ(బుధవారం) జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినట్లు నంబూరు శంకర్రావు తెలిపారు.సహించం.. కచ్చితంగా తిప్పి కొడతాం: నంబూరు శంకర్రావు..మా కార్యాలయంపై దాడి చేసి తమ సిబ్బందిపై తిరిగి కేసులు పెట్టారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదు. గత కొన్ని నెలల క్రితం పెదకూరపాడులో వైఎస్సార్సీపీ నేత సాంబిరెడ్డి కాళ్లు నరికారు. మా పార్టీ, కార్యకర్తలపై పెదకూరపాడులో దాడులు జరుగుతున్నాయి. గతంలో కొమ్మలపాటి శ్రీధర్, కన్నా లక్ష్మీనారాయణ, నేను పనిచేశాం. ఇలాంటి ఘటనలను ఇకపై మేము సహించేది లేదు.. కచ్చితంగా తిప్పి కొడతాం.నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలను ఉపేక్షించేది లేదు. తప్పకుండా ప్రశ్నిస్తాం. ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. వచ్చిన పదవి అవకాశాన్ని మంచిగా ఉపయోగించాలి. నియోజకవర్గ అభివృద్ధిపై, ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలి’’ అని నంబూరు శంకర్రావు పేర్కొన్నారు.చంద్రబాబు ఇకనైనా కళ్లు తెరవాలి: అంబటి రాంబాబుమాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పోలీసులు రాజకీయ ఒత్తిడికి గురవుతున్నారని.. కూటమి నేతలు ఏడు నెలల్లో చేయకూడని అరాచకాలు చేశారని మండిపడ్డారు. ‘‘ఐదేళ్లు పాటు పెదకూరపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన శంకర్రావుపై దాడి చేస్తామంటున్నారు. గతంలో నియోజకవర్గంలో రైతులను పరామర్శించేందుకు వెళ్లగా ఆయన కారుపై దాడికి పాల్పడ్డారు.. ఇది సహించరాని ఘటన. కచ్చితంగా పెదకూరపాడు వెళ్తాం.. కార్యకర్తల సమావేశం నిర్వహిస్తాం. పోలీసులే మాకు రక్షణ కల్పించాలి.ఇదీ చదవండి: ఇదేం బ్రొమాన్స్ బాబోయ్.. మోదీ పగలబడి నవ్వింది అందుకే!..రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో అరాచక పాలన సాగుతుంది. చంద్రబాబు ఇకనైనా కళ్లు తెరవాలి. పిల్లిని గదిలో వేసి కొడితే పులి అవుతుంది ఆ విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో రోజు రోజుకీ సమస్యలు ముదురుతున్నాయి. పండుగ కూడా చేసుకోకుండా దాడులు చేస్తున్నారు. ఇలాంటి దాడులను ఎదిరించి, ధైర్యంగా నిలబడతాం. టీడీపీ చేసే ప్రతి దాడిని, దౌర్జన్యాన్ని ప్రజలకు వివరిస్తాం’’ అని అంబటి రాంబాబు తెలిపారు. -
ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? అధికారంలో ఉంటే మీ ఇష్టమా!
-
తిరుపతిలో టోకెన్ల కోసం తొక్కిసలాట జరగడం దురదృష్టకరం
-
తిరుపతి తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు హైడ్రామా: అంబటి
సాక్షి, గుంటూరు: ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన క్షేత్రంగా వున్న తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు తీసుకున్న చర్యలు హైడ్రామాను తలపిస్తున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన టీటీడీ చైర్మన్, ఈఓ, జేఈఓ, తిరుపతి ఎస్పీలపై చర్యలు తీసుకునే ధైర్యం చంద్రబాబుకు లేదని అన్నారు. వైఎస్సార్సీపీపై అక్రమ కేసులు బనాయించేందుకే ఈ నలుగురితో కూడిన క్రిమినల్ ముఠాను చంద్రబాబు తిరుమల తిరుపతిలో నియమించుకున్నారని.. ఈ ముఠాకు నాయకుడు చంద్రబాబేనని విమర్శించారు. తొక్కిసలాటకు బాధ్యులుగా కిందిస్థాయి ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం దారుణమని అన్నారు.ఇంకా ఆయన ఏమన్నారంటే..అంతర్జాతీయంగా తిరుమల తిరుపతి ఆలయానికి గొప్ప గుర్తింపు ఉంది. ఇక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా మొత్తం ప్రపంచం దీనిని గమనిస్తుంది. అటువంటి క్షేత్రంలో ప్రణాళికా లోపం కారణంగా వైకుంఠ ద్వార దర్శనంకు వచ్చిన భక్తులు తొక్కిసలాటకు గురై ఆరుగురు మృతి చెందడం చాలా పెద్ద ఘటనగా భావించాలి. కోట్లాధి మంది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం ఇది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చాలా సీరియస్గా చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ సీఎం చంద్రబాబు ఈ ఘటనపై వ్యవహరించిన తీరు అత్యంత అభ్యంతరకరం. డీఎస్సీ, గోశాల డైరెక్టర్ లను సస్పెండ్ చేయడంతో చేతులు దులుపుకున్నారు.క్రిమినల్ ముఠాను కాపాడుకునేందుకే చంద్రబాబు తిరుపతి పర్యటనతిరుపతిలో తొక్కిసలాట సంఘటన జరిగిన వెంటనే సీఎం చంద్రబాబు, హోం, రెవన్యూ, ఎండోమెంట్ మంత్రులతో కలిసి ఘటనా స్థలికి వెళ్లి అధికారులు, మృతుల కుటుంబాలు, క్షతగాత్రులతో మాట్లాడారు. దీనిపై చిత్తశుద్దితో చర్యలు తీసుకుంటారని అందరూ భావించారు. కానీ సీఎం మాత్రం తన అనుకూల అధికారులుగా, కావాలని తిరుమల తిరుపతిలో పోస్టింగ్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్న ఆ నలుగురిపై ఈగ కూడా వాలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అసలు చంద్రబాబు ఈ ఘటనపై హుటాహుటిన తిరుపతికి వెళ్ళింది బాధితులు, భక్తుల కోసం కాదు. తను పెంచి పోషిస్తున్న క్రిమినల్ ముఠాలోని నలుగురిని కాపాడుకునేందుకే.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ నలుగురూ వైయస్ఆర్ సీపీకి చెందిన వారిపై ఎలాంటి తప్పుడు కేసులు పెట్టాలా అనే ఆలోచనతోనే పనిచేస్తున్నారు. గత టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈఓ థర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను కేసుల్లో ఎలా ఇరికించాలా అనే లక్ష్యంతోనే పనిచేస్తున్నారు. దీనిలో భాగంగానే లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందీ, ఇవే లడ్డూలను అయోధ్యలోని రామాలయంకు కూడా పంపారంటూ అత్యంత దారుణమైన తప్పుడు ప్రచారానికి పాల్పడ్డారు.వైఎస్ జగన్ రాకుండా అడుగడుగునా ఆటంకాలుతొక్కిసలాటలో చనిపోయిన మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు తిరుపతికి వెళ్ళే క్రమంలో వైయస్ జగన్ గారికి కావాలనే అనేక అడ్డంకులు సృష్టించారు. చివరికి ట్రాఫిక్ క్లియర్ చేయకుండా ఆయన వాహనాలకు ఆటంకాలు కల్పించారు. వైఎస్ జగన్ కారు కాలినకడన వెళ్లి బాధిత కుటుంబాలను కలిసి, వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.ఇదీ చదవండి: బాబే మొదటి ముద్దాయి: వైఎస్ జగన్ముందు నుంచే జగన్.. తిరుపతిలో బాధిత కుటుంబాలను కలవకూడదనే కుట్రతోనే ప్రభుత్వం పనిచేసింది. ముందుగా సీఎం వెళ్లడం, తరువాత వేరుగా డిప్యూటీ సీఎం వెళ్ళడం ద్వారా సమయం లేకుండా చేయాలన్న లక్ష్యంతోనే దిగజారుడు రాజకీయం చేశారు. ఎక్కడ వైఎస్ జగన్ బాధితులను కలిసి, జరిగిన దానిపై వాస్తవాలు మాట్లాడతారో, ఎక్కడ ప్రజల్లో దీనిపై ఆగ్రహం వ్యక్తమవుతుందోనని ప్రభుత్వం భయపడింది. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన వ్యక్తులపై చర్యలు తీసుకోకపోతే భక్తులు సహించరు. ఆ భగవంతుడు కూడా క్షమించడు.పోలీసుల తప్పుడు కేసులను భయపడేది లేదుపిల్లి బాబూరావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై మాపై గుంటూరు పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారు. దీనిపై ఎల్లో మీడియాలో అంబటి సోదరులపై క్రిమినల్ కేసు అంటూ పెద్ద కథనాలను ప్రచురించారు. పిల్లి బాబూరావు నాకు తెలియదు. ఈ కేసుకు సంబంధించి సమాచారం తెలియగానే డీఎస్సీ, సీఐలతో మాట్లాడాను. ఈ కేసులో ఎప్పుడు మీరు విచారణకు పిలిచినా హాజరవుతాను, లేదా అరెస్ట్ చేసేందుకు వస్తామన్నా కూడా పూర్తిగా సహకరిస్తాను అని చెప్పాను. ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశాను. బాద్యుడైన పౌరుడిగా చట్టాన్ని గౌరవిస్తాను. దీనిపై భయంతో క్వాష్ కు, యాంటిసిపేటరీ బెయిల్ కు ప్రయత్నించను. చంద్రబాబు, లోకేష్ లు చెప్పారని అర్థరాత్రి పూట వచ్చి మా తలుపులు కొట్టవద్దు. ఎప్పుడ రమ్మని ఫోన్ చేసినా నేనే స్వయంగా పోలీస్ స్టేషన్ కు వస్తాను. ఇటువంటి తప్పుడు కేసులను భయపడేది లేదు. పారిపోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. -
టీటీడీ సేవ కాదు టీడీపీకి సేవ చేస్తున్నాడు ఓ సనాతనీ నోరు తెరువు
-
తిరుపతి తొక్కిసలాట ఘటన..ఆ పాపం వాళ్లదే
సాక్షి,తాడేపల్లి: తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు శ్రీవారి భక్తుల మృతికి చంద్రబాబు పాలనా వైఫల్యమే కారణమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తిరుపతి పర్యటనలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. చంద్రబాబు వల్లే శ్రీవారి సేవే పరమావధిగా పనిచేయాల్సిన టీటీడీ కాస్తా టీడీపీ సేవలకు పరిమితమయ్యిందని విమర్శించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి ఘోర ప్రమాదం జరిగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనంకు వచ్చే భక్తులకు టోకెన్లు జారీ చేసే కేంద్రాల వద్ద తొక్కిసలాటలో ఆరుగురు మరణించడం, పలువురు గాయపడటం బాధాకరం. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి తిరుమలపై ప్రతి అంశాన్ని వివాదంగా చేస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్ తిరుమల దర్శనం కోసం వస్తున్నారని తెలియగానే ఈఓ, జెఈఓలు పెద్ద పెద్ద బోర్డ్లు కట్టారు. ఆయన పర్యటన రద్దు అనగానే వెంటనే వాటిని తొలగించారు. కూటమి ప్రభుత్వం చెప్పినట్లుగా వారు పనిచేస్తున్నారు. శ్రీవారి ఆలయంలో పనిచేసే వారు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి. టీటీడీ ఛైర్మన్గా ఉన్న బీఆర్ నాయుడు వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తన టీవీ ఛానెల్లో పెద్ద ఎత్తున ఇచ్చిన ప్రచారానికి ప్రతిఫలంగా ఆయనకు ఈ పదవి దక్కింది. టీటీడీ ఛైర్మన్గా ఉండి కూడా జగన్పై రాజకీయపరమైన విమర్శలు చేశారు. ఆయనకు శ్రీవారి పట్ల నిజమైన భక్తి లేదు. ప్రతిసారీ తిరుమలపై వివాదాలను సృష్టించి, రాజకీయంగా వైఎస్సార్సీపీని అణచివేయడానికి బీఆర్ నాయుడు, ఈఓ, జెఈఓలు ప్రయత్నించారే తప్ప భక్తులకు సేవ చేయాలని ఏనాడు పనిచేయలేదు. వారి దుర్మార్గమైన ఆలోచనల వల్లే ఇటువంటి దుర్ఘటన జరిగింది. తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన కూడా ఒక ప్రహాసనంలా కనిపిస్తోంది. ఈ కేసులో తన వారిని కాపాడుకునేందుకు కిందిస్థాయి అధికారులపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు.సనాతన ధర్మాన్ని కాపాడే యోధుడు పవన్ కళ్యాణ్ ఇంత వరకు దీనిపై స్పందించలేదు. ఈ దేశంలో రాజకీయాలకు అతీతంగా సనాతన ధర్మాన్ని కాపాడేవారు అనేక మంది ఉన్నారు. అటువంటి వారు ఇటువంటి ఘటనలపై స్పందించాలి. ధర్మ పరిక్షణ కోసం ఏం చేయాలో చెప్పాలి. ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏం చేయాలో ఈ ప్రభుత్వానికి సూచించాలి. పీఠాధిపతులు, స్వామీజీలు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.తిరుపతి తొక్కిసలాటలో చనిపోయిన వారికి కోటి రూపాయలు చొప్పున ప్రభుత్వం నుంచి పరిహారం ఇవ్వాలి. క్షతగాత్రులకు కనీసం పాతిక లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రమాదం జరిగిన తరువాత కూడా వైద్యశాలకు వెళ్ళినటువంటి వారికి వైద్యం అందలేదు. గాయపడిన వారి పట్ల కనీసం బాధ్యత తీసుకోలేదు. చంద్రబాబు ఏరి కోరి తెచ్చుకున్న తిరుపతి ఎస్పీ ప్రజల కోసం కాకుండా కేవలం టీడీపీ కోసమే పనిచేస్తున్నారు. వైఎస్సార్సీపీపై తప్పుడు కేసులు బనాయించడంలోనే ఆయన మునిగిపోయాడు. ఈ ప్రమాదంపై తక్షణం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.