Ambati Rambabu
-
ప్రచారం కోసం కాదు.. జగన్ పర్యటనపై టీడీపీ కుట్ర
-
వైఎస్ జగన్ భద్రతపై కూటమి కుట్ర.. పోలీసులు ఎక్కడ?: అంబటి
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరు పర్యటనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu). ఎన్నికల కోడ్ అంటూ వైఎస్ జగన్ను ఇబ్బంది పెట్టే ప్లాన్ చేస్తున్నారని అన్నారు. మిర్చి యార్డ్ పర్యటనకు ఎన్నికల కోడ్ వర్తించదు. కాబట్టి, ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన సెక్యూరిటీని వైఎస్ జగన్కు ఇవ్వాల్సిందేనని చెప్పారు.వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్ జగన్(YS Jagan) గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనపై కుట్ర జరుగుతుంది. ఎన్నికల కోడ్ వంక పెట్టి వైఎస్ జగన్ పర్యటనలో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కానీ, వాళ్లే ఇబ్బంది పడతారు. ఎన్నికల కోడ్ అమలులో ఉంది. మేము ఆ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేదు.. ప్రచారం చేయడం లేదు. కనీసం మిర్చి యార్డులో మైకు కూడా వాడటం లేదు. వైఎస్ జగన్ మిర్చి యార్డ్ పర్యటనకు ఎన్నికల కోడ్ వర్తించదు. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ వైఎస్ జగన్కు ఇచ్చి తీరాల్సిందే. పోలీస్ అధికారులు ఇది గుర్తుపెట్టుకోవాలి.కూటమి సర్కార్ పాలనలో మిర్చి ధర సగానికి సగం పడిపోయింది. మిర్చి రైతుల గోడు వినటానికి వైఎస్ జగన్ గుంటూరు(Guntur Mirchi Yard) మిర్చి యార్డుకు వస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో విఫలమైంది. వైఎస్సార్సీపీ హయాంలో గిట్టుబాటు ధర లేని పంటలకు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేసింది’ అని చెప్పుకొచ్చారు. అనంతరం, పోలీసుల తీరుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అంబటి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ భద్రతలో పోలీసుల తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. జడ్ ప్లస్ కేటగిరీ ఉన్నా పోలీసులు పట్టించుకోలేదు. గుంటూరు మార్కెట్ యార్డు వద్ద ఒక్క పోలీసు కూడా కనిపించడం లేదు. ఉద్దేశపూర్వకంగా జగన్కు భద్రతా సమస్యలు సృష్టించాలనే కుట్ర జరుగుతోంది. ప్రభుత్వం తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతుల గోడు బయటకు రాకూడదనే ప్రభుత్వం కుట్ర చేస్తోంది. భద్రత లేకుండా చేసి సమస్యలు సృష్టించాలని చూస్తోంది. ప్రభుత్వం తీరు చాలా అరాచకంగా ఉంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కావాలనే వైఎస్ జగన్కు భద్రతను కుదిస్తున్నారు. పాడైపోయిన బుల్లెట్ ఫ్రూఫ్ కార్లు ఇచ్చారు. కనీసం రివ్యూ చేయకుండానే ఉన్న ఫళంగా జగన్ భద్రతను కుదించేశారు. జిల్లాల్లో ఆయన పర్యటనల సమయంలోనూ ఇదే తీరు కనిపిస్తోంది అంటూ వ్యాఖ్యలు చేశారు. -
కూటమి ప్రభుత్వంలో రైతులకే కన్నీళ్లే
సాక్షి,గుంటూరు : కూటమి ప్రభుత్వంలో ధరలు తగ్గడంపై మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మద్దతు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులను ఓదార్చేందుకు బుధవారం గుంటూరు మిర్చి యార్డ్లో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. రైతుల్ని ఓదార్చనున్నారు. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. మిర్చి రైతుల గోడు వినడానికి వైఎస్ జగన్ రేపు (బుధవారం) మిర్చి యార్డుకు వస్తున్నారు.రైతుల కష్టనష్టాలను తెలుసుకుంటారు. మిర్చి ధరలు తగ్గిపోవడంతో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కూటమీ అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది. రైతుల పంటలకు గిట్టుబాటు ధర లేదు. ధాన్యాన్ని రూ.1300 రూపాయలకే అమ్ముకున్నారు. పత్తి నాలుగు వేల రూపాయలకు కొనే దిక్కు లేదు.వైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వం నేరుగా రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేసింది. ధరల స్థిరీకరణ కోసం రూ.3000 కోట్లు కేటాయించాం. పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంపై సిఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలి. రైతుల పక్షాన ఉద్యమం చేస్తాం. ఇది దుర్మార్గపు ప్రభుత్వం. చేతకాని ప్రభుత్వం.మేము అధికారంలో ఉన్నప్పుడు గిట్టుబాటు ధరలేని ప్రతి పంట మా ప్రభుత్వం కొనుగోలు చేసింది’ అని వ్యాఖ్యానించారు.ప్రభుత్వం నోరు మెదపదేం మిర్చికు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతుల్ని కలుసుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డ్కి వస్తున్నారు. మిర్చి రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారు. ఎకరానికి లక్షకు పైగా రైతు అప్పులు ఊబిలో కూలిపోయాడు.దీనిపైన ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు. మిర్చిపైన ఎందుకు మంత్రులు మాట్లాడట్లేదు’అని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. -
‘డీజీపీ అపాయింట్మెంట్ ఇచ్చారు.. కానీ వచ్చాక కలవలేదు’
మంగళగిరి: వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారని, ఇది కూటమి ప్రభుత్వం కుట్రపూరిత చర్య అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. అసలు వంశీని ఎందుకు అరెస్ట్ చేశారో సరైన కారణం చెప్పలేదని, ఓ తప్పుడు కేసు పెట్టి వంశీని ఇరికించే ప్రయ త్నం చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. వంశీ అరెస్టుపై డీజీపీని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చిన అంబటి మీడియాతో మాట్టాడారు. ‘వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారు.. ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కావడం లేదు. తప్పుడు కేసు పెట్టి ఇరికించారు. వంశీ టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి రావడం వల్ల చంద్రబాబు, లోకేష్లు కక్ష గట్టారు. ఎన్నోసార్లు అరెస్ట్ చేయాలిన ప్రయత్నించినా కోర్టుకు వెళ్లి ప్రొటక్షన్ తెచ్చుకున్నాడు వంశీ. ఇది తప్పుడు కేసు అని అందరికీ తెలుసు కనీసం వంశీని భార్య కలవడానికి కూడా ఎన్నో ఆంక్షలు పెట్టారు పోలీసులు.దీనిపై డీజీపీకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాం. డీజీపీ ఆఫీస్ కు అపాయింట్ మెంట్ ఇస్తే వచ్చాం.. అయినా వారిని కలవలేదు. రిప్రజెంటేషన్ఇ వ్వడానికి ఈరోజు(గురువారం) సాయంత్రం 4.35కి అపాయింట్ మెంట్ ఇచ్చారు. మేము 4.30కే డీజీపీ ఆఫీస్ కి వచ్చాం. అప్పుడు డీజీపీ ఉన్నారు.. కానీ కాసేపటికి వెళ్లిపోయారని చెప్పారు. మరి మా రిప్రంజటేషన్ ఎవ్వరూ తీసుకోలేదు. ఇదేంటో అర్థం కావడం లేదు. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత డీజీపీపై ఉంది. మేము ఇచ్చే రిప్రజెంటేషన్ తీసుకోవడానికి డీజీపీ ఎవరినైనా పంపిస్తారా? లేక మేమే మళ్లీ వచ్చి కలవాలా? అని అంబటి మీడియా ముఖంగా ప్రశ్నించారు. -
Ys Jagan: మంచిపాలన చేస్తే ప్రజలు ఆదరిస్తారు...
-
తిరుమల లడ్డూ వ్యవహారం నుంచి బయటపడటానికి బాబు యత్నిస్తున్నారు
-
‘లడ్డూ’ వివాదంలో అందుకే అరెస్టులు: అంబటి రాంబాబు
సాక్షి,గుంటూరు:తిరుమల లడ్డూపై ఆరోపణలు చేసి చంద్రబాబు ఇరుక్కుపోయారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ విషయమై సోమవారం(ఫిబ్రవరి10) అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.‘తిరుపతి లడ్డూ వ్యవహారం నుంచి బయటపడడానికి బాబు ప్రయ యత్నిస్తున్నారు. రాజకీయంగా లబ్ధి పొందడానికే చంద్రబాబు తిరుపతి లడ్డూపై ఆరోపణలు చేశారు. లడ్డూలో జంతువుల కొవ్వు ఉందని అబద్ధం చెప్పారు. తిరుమల లడ్డూకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది.తిరుమల లడ్డూల తయారీకి నెయ్యి సరఫరాకు ఒక పద్ధతి ఉంది.ఏఆర్ డెయిరీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే నెయ్యి సరఫరా ప్రారంభించారు.టెస్టుల్లో ఫెయిలైన ట్యాంకర్లను వెనక్కి పంపుతారు.వైఎస్ జగన్హయాంలోనూ ట్యాంకర్లను వెనక్కి పంపారు.దైవాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నారు’అని అంబటి రాంబాబు అన్నారు.అంబటి రాంబాబు ఇంకా ఏమన్నారంటే..చంద్రబాబు నాయుడు అత్యంత దుర్మార్గుడు నీచుడుపవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నాడునిబంధనల ప్రకారం వెనుక్కు పంపించిన నెయ్యి పైన అరెస్టులు జరుగుతున్నాయిచంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఎక్కడా స్వామివారి ప్రసాదాలలో కల్తీ జరగలేదుచంద్రబాబు నాయుడు ఆరోపణలపై విచారణ జరుగుతోంది2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 15 సార్లు నెయ్యి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని వెనక్కి పంపారువైఎస్ జగన్ ప్రభుత్వంలో నిబంధనల ప్రకారం 18సార్లు నెయ్యి వెనుక్కు పంపారుచంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పి ఇరుక్కుపోయాడు కాబట్టే ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నాయిస్వామివారి ప్రసాదంపైన జరగని విషయాన్ని జరిగినట్టు ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు ఇరుక్కుపోయాడులడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని విష ప్రచారం చేస్తే పవన్ కళ్యాణ్ మెట్లు తుడిచి హంగామా చేశాడువాడని నెయ్యిని వాడినట్టు వాటిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు చంద్రబాబు నాయుడు ప్రచారం చేశాడుతిరుమల నెయ్యి కల్తీ అయిందన్న ఆరోపణలు ఆధారాలు లేవుచంద్రబాబు పాలనలోనే ఏఆర్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నెయ్యి పంపిణీ చేసిందిచిరంజీవి రాజకీయాలకు పనికొచ్చే వ్యక్తి కాదుప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో కలిపినట్లే జనసేనను బీజేపీలో కలుపుతారాచిరంజీవి మాటలు వింటే అదే అర్థమవుతోందిప్రజారాజ్యం రూపాంతం చెంది జనసేన అయిందన్న చిరంజీవి మాటల వెనుక బీజేపీలో జనసేనను కలుపుతారు ఏమో అని చెక్ చేసుకోవాలి -
బాబు, లోకేష్ పై అంబటి సెటైర్లు
-
హామీలు అమలు చేయకుండా ఆరోపణలా?: అంబటి రాంబాబు
సాక్షి,గుంటూరు:తొమ్మిది నెలల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు విమర్శించారు. గుంటూరులో అంబటి రాంబాబు శుక్రవారం(ఫిబ్రవరి7) మీడియాతో మాట్లాడారు.‘అధికారంలోకి వచ్చేందుకు కూటమి నేతలు అసత్యాలు చెప్పారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇప్పుడు వైఎస్ జగన్పై ఆరోపణలు చేస్తున్నారు. హామీల అమలులో 40 ఏళ్ల నారా చంద్రబాబు అనుభవం ఏమైంది. కూటమి పాలనలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోయింది. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మాపై ఆరోపణలు చేస్తున్నారు’అని అంబటి రాంబాబు మండిపడ్డారు.అంబటి రాంబాబు ఇంకా ఏమన్నారంటే..కూటమి అసమర్ధ పాలనపై వైఎస్ జగన్ ప్రజలకు వివరించి చెప్పారుప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను వివరంగా వివరించారు8 మాసాల కూటమి పాలనలో అన్ని మోసాలు, దాడులు, అరాచకాలే 40 ఏళ్ల అనుభవం కలిగి నాలుగుసార్లు సీఎంగా చేసిన చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారు.వైఎస్ జగన్ అమలుకు సాధ్యం కానీ హామీలను ఇవ్వరుచంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా సాధ్యం కాదు అని చెప్తున్నారువైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేక పోతున్నారు..జగన్ హాయంలో 14 లక్షల కోట్ల అప్పులు అని అబద్ధం చెప్పారుబడ్జెట్లో 6 లక్షల కోట్లు అని చూపించారుఎల్లో మీడియా కోసం తప్పుడు లెక్కలు, అబద్ధాలు చెపుతున్నారు2.73 లక్షల కోట్లు డైరెక్ట్ గా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు వైఎస్ జగన్ వేశారు.ఎన్నికల ముందు సంపద సృష్టిస్తా అన్నారుమంచంలో ఉన్న ముసలి ఆమె కూడా నొక్కుతుంది బటన్ అన్నారుచంద్రబాబు ముసలి వాడే కదా బటన్ ఎందుకు నొక్కలేక పోతున్నారుఆయన వల్ల కాకపోతే ఆయన తనయుడు నారా లోకేష్ యువకుడే కదా ఆయనతో నొక్కించ వచ్చు కదా బటన్ఏ మాత్రం ప్రమేయం లేని మిథున్ రెడ్డి గారికి లిక్కర్ స్కాం అంట కడుతున్నారుప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీకు జీతాలు అన్నారుఒక్క నెల మాత్రమే 1వ తేదీ ఇచ్చారుదావోస్ పర్యటనలో ఏపీకి పెట్టుబడులు రాలేదురెడ్బుక్ అంటే పరిశ్రమలు ఎలా వస్తాయికూటమి ప్రజా ప్రతినిధులకు దమ్ము, ధైర్యం ఉంటే నిన్న వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలిటీడీపీ నేతల రాజకీయ బతుకు అంతా అబద్ధాలు, మోసంచెత్త వాగుడు, కారుకూతలు పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలిగుంటూరుకు మూడు ఆర్వోబీలు వచ్చాయి అని గొప్పలు చెపుతున్నారుకాగితాల మీద చాలా అవుతాయి. రియాల్టీ లో అవ్వాలిగ్యారెంటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ జ్వరం, వెన్నుపూసలో నొప్పి అని ఇంట్లో పడుకున్నాడుబటన్ నొక్కమంటే విషం కక్కుతున్నాం అంటే ఎలా.రోడ్ల గుంతలు పూడ్చటానికి రూ. 26 వేల కోట్లు అప్పు చేశారు.డొక్కా మీద నేను మాట్లాడాల్సిన అవసరం లేదుపవన్ కళ్యాణ్ నిజంగా సిక్ అయ్యాడా..? షూటింగ్లో ఉన్నాడా తెలీదు.పవన్ కళ్యాణ్ ,చంద్రబాబు, నారా లోకేష్ మీద అలకపునాడు ఏమో నాకు తెలీదుచంద్రబాబు రెడ్ బుక్ ఓపెన్ చేసిన తరువాత కేసులు నమోదు అవుతాయి.నా మీద ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు -
బాబు అక్రమాలు.. పవన్ నోటికి ప్లాస్టర్: అంబటి
సాక్షి, గుంటూరు: ఏపీలో టీడీపీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేవన్నీ దొంగ మాటలేనని ఆరోపించారు. చంద్రబాబు అక్రమాలపై మాట్లాడలేని పిరికి వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దుర్మార్గాలను చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ కూడా ప్రోత్సహిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు.. మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలపై స్పందించారు. ఈ క్రమంలో అంబటి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘స్టాండింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ నాటికి మా బలం 33 మంది కార్పొరేటర్లు. ప్రలోభాలకు గురి చేసి కొంత మందిని చేర్చుకున్నారు. దీంతో మాకు 28 వాళ్ళకు 28 కార్పొరేటర్ల మద్దతు ఉంది. క్రాస్ ఓటింగ్కు పాల్పడటం మమ్మల్ని తీవ్రంగా కలిచి వేసింది. నలుగురు కార్పొరేటర్లు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి.టీడీపీ మూల్యం చెల్లించక తప్పదు. తిరుపతిలో కిడ్నాప్ చేసి, దాడి చేసి, ప్రలోభాలకు గురి చేసి పార్టీ మార్చుకున్నారు. గుంటూరు కార్పోరేషన్లో అవిశ్వాస తీర్మానం పెడితే ఎదుర్కోవటానికి సిద్దంగా ఉన్నాం. అవిశ్వాస తీర్మానానికి భయపడం.. ఎదుర్కొంటాం. చంద్రబాబు అన్ని దొంగ మాటలు చెబుతున్నారు. తిరుపతిలో ఒక్క సీటు గెలిచిన జనసేన ఎలా డిప్యూటీ మేయర్ అయ్యారు. ఇంత జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నాడు. పవన్ తన నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చొన్నాడు. చంద్రబాబు అక్రమాలపై మాట్లాడలేని పిరికి వ్యక్తి పవన్ కల్యాణ్. రాష్ట్రంలో దుర్మార్గాలను చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ ప్రోత్సహిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ సైలెంట్ మోడ్ వీడాలి’ అని హితవు పలికారు.నాలుగేళ్లు పూర్తయిన తర్వాత అన్ని మున్సిపాలిటీల్లో, కార్పోరేషనుల్లోనూ అవిశ్వాసం పెట్టడానికి సిద్దమవుతున్నారు. కార్పోరేషన్లలో వెలుగు చూసిన బుడమేరు స్కాంపై పోరాటం చేస్తాం. పెమ్మసానికి నేనెప్పుడూ ఫోన్ చేయలేదు. కష్టపడి సంపాదించాడు. ఆయన చాలా గొప్పవాడు. స్థాయి సంఘం ఎన్నికల్లో స్థాయి తగ్గించుకున్నాడు. రాజకీయాల్లోకి వచ్చి కార్పొరేటర్ల కోసం వేటాడుతున్నాడు అంటూ కామెంట్స్ చేశారు.మరోవైపు, మేయర్ కావటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ..‘కార్పోరేషన్లో వైఎస్సార్సీపీకి మెజారిటీ ఉన్నా స్టాండింగ్ కమిటీలోని ఆరు స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. ఇదేదో అతి పెద్ద విజయం అన్నట్లు కూటమి నేతలు మాట్లాడుతున్నారు. వైఎస్సార్సీపీ ఖాళీ అవుతుందని ప్రచారం చేస్తున్నారు. 2014లో వైఎస్సార్సీపీకి 63 సీట్లు వస్తే.. 2019లో 151 సీట్లు వచ్చాయి. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది.. దీనిపై సమీక్ష చేస్తాం. నేను చివరి వరకూ వైఎస్ జగన్ వెంటే ఉంటా.. పార్టీ మారే ఆలోచన లేదు’ అని స్పష్టంచేశారు.అలాగే, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు మాట్లాడుతూ..‘లోపాయికారీ ఒప్పందంతో కొంతమంది కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారు. మాతో పాటే ఉంటూ కొంత మంది వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడ్డారు. క్రాస్ ఓటింగ్కు పాల్పడిన వారిని ఉపేక్షించం. అధికారం కోసం అడ్డదారులు తొక్కడం టీడీపీ నేతలకు అలవాటు. మేము ప్రజల కోసం మాత్రమే పని చేస్తాం’ అని చెప్పుకొచ్చారు. -
దొంగ మాటలు.. దొంగ వ్యవహారాలు.. బాబుపై అంబటి ఫైర్
-
పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా... అంటా ముద్రగడ ఇంటిపై దాడి.. అంబటి రియాక్షన్
-
నిందితుడిది పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటా.. పవన్ నోరు మెదపరేం?
సాక్షి,గుంటూరు : ‘వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి చేసిన వ్యక్తి ‘నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా’ అని చెప్పుకుంటున్నాడు. ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నోరు మెదపాలి’ అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు.ముద్రగడ ఇంటిపై దాడి ఘటన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి చేశారు. ముద్రగడ ఇంటి గేటును ట్రాక్టర్లో ఢీకొట్టి.. పోర్టికోలో ఉన్న కారును ఢీకొట్టారు. ముద్రగడ, ఆయన కుమారుడి ఫ్లెక్సీలు ధ్వంసం చేసి అరాచకం సృష్టించారు.‘‘ఆ వ్యక్తి నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పుకుంటున్నాడు. ఇలాంటి ఘటనలను ప్రోత్సహించడం పిఠాపురం తాలూకా ఎమ్మెల్యేకి సరికాదు. తక్షణం ఈ ఘటనపై పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరువిప్పాలి. ఈ దాడిని ఖండించకపోతే మీరు ఇలాంటి దౌర్జన్యాలను ప్రోత్సహించినవారవుతారు. నివాసాలపైకి వెళ్లి దాడులు చేయడాన్ని కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని డిమాండ్ చేస్తున్నాం’ అని అంబటి అన్నారు. -
పెమ్మసానిపై అంబటి సీరియస్ కామెంట్స్
-
బాబు, పవన్ పై అంబటి సెటైర్లే సెటైర్లు
-
‘పవన్.. బాబు సూపర్ సిక్స్కు గ్యారంటీ నువ్వే కదా’
సాక్షి, అనకాపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు వైఎస్సార్సీపీ నేతలు. ఎనిమిది నెలల్లోనే సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేనని బాబు చేతులెత్తేశాడని వ్యాఖ్యలు చేశారు. అలాగే, అప్పులు చేసి కూడా పేదలకు చంద్రబాబు పథకాలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాల పేరుతో మోసం చేసిన టీడీపీ నేతలు ఎక్కడికక్కడ ప్రజల నిలదీయాలని పిలుపునిచ్చారు.అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా నేడు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ బాధ్యతల స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్ సహా భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. మాట ఇచ్చి మోసం చేయడం చంద్రబాబు సహజ గుణం. చెప్పింది చెయ్యడం.. చేయగలిగినదే చెప్పడం వైఎస్ జగన్ సహజ గుణం. ఎన్నికలకు ముందు ఒక్క అబద్దం చెప్పడానికి కూడా జగన్ ఒప్పుకోలేదు.. హామీల అమలు కోసం అడిగితే మొన్నే అధికారంలోకి వచ్చాం అంటున్నారు. మరి మొన్నే అధికారంలోకి వచ్చిన మీరు గ్రీన్ హైడ్రో ప్రాజెక్టు ఎలా తీసుకొచ్చారు?. బల్క్ డ్రగ్ పార్క్ ఎలా తీసుకొచ్చారు?. పథకాల విషయంలో మొన్నే అధికారంలోకి వచ్చాం అంటారా?. ప్రాజెక్టులు మాత్రం మేమే తీసుకొచ్చాం అంటారా?. ఇదెక్కడి న్యాయం’ అని ప్రశ్నించారు. కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఈ ప్రాంతంలో వైఎస్సార్సీపీ లక్కు.. అంబటి రాంబాబు అంటే వైఎస్సార్సీపీలో కిక్కు. చంద్రబాబు మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేశాడు. ఎనిమిది నెలల్లోనే సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేనని బాబు చేతులెత్తేశాడు. మోసం చేసిన టీడీపీ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలి. నాకు అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులుగా అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్కు ధన్యవాదాలు. అనకాపల్లిలో అన్ని అసెంబ్లీ స్థానాలు గెలవడంలో నా పాత్ర కీలకంగా ఉంటుందని నూకాంభిక అమ్మవారిపై ప్రమాణం చేస్తున్నాను అని అన్నారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ‘2019 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో అన్ని అసెంబ్లీ స్థానాలు గెలిచాం. వచ్చే ఎన్నికల్లో కూడా అదే ఫలితం రిపీట్ కావాలి. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని మంచి చేసిన సీఎంగా వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారు. రాష్ట్రంలో పోర్టులు, మెడికల్ కాలేజీలు కట్టిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది. అనకాపల్లిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్ది. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కూడా వైఎస్సార్సీపీ హయాంలోనే వచ్చింది.రాష్ట్రంలో వాట్సాప్ సేవలు తీసుకొచ్చింది వైఎస్ జగన్. వాలంటీర్ వ్యవస్థ వలన ప్రజలకు మంచి జరిగింది. కానీ, పార్టీకి కేడర్కు మధ్య గ్యాప్ పెరిగింది. మళ్ళీ అధికారంలోకి వచ్చాక పార్టీ కార్యకర్తల ద్వారానే అన్ని సేవలు అందుతాయి. ఇది పార్టీ మాటగా హామీ ఇస్తున్నాను. అన్ని వైఎస్ జగన్ను ప్రజలు ఓడించారు. ఇప్పుడు చంద్రబాబు ప్రజలకు మంచిగా బుద్ధి చెబుతున్నారు. ఇప్పుడు ఎందుకు చంద్రబాబు బటన్ నొక్కి డబ్బులు వేయలేకపోతున్నాడు. ప్రజలకు రెండు లక్షల 80వేల కోట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘ఉభయ రాష్ట్రాలలో మంచి పేరున్న నాయకుడు బొత్స సత్యనారాయణ. పార్టీ ఓడినా మండలి ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న వ్యక్తి బొత్స. 164 స్థానాలు ఎందుకు వచ్చాయో కూటమి నేతలకే అర్ధం కావడం లేదు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ పునఃనిర్మాణం జరుగుతుంది. ధర్మశ్రీని ఢిల్లీ పంపాలని జగన్ నిర్ణయించారు. ఓటమి నుంచే పట్టుదల పెరుగుతుంది. ఎనిమిది నెలల కాలంలో ఇంత వ్యతిరేకత మూటకట్టుకున్న ప్రభుత్వం లేదు. చంద్రబాబు సూపర్ సిక్స్కు పవన్ కళ్యాణ్ గ్యారంటీ ఇచ్చారు. బీజేపీ గ్యారంటీ ఇవ్వలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటానంటే ఆయన భార్య, కొడుకు ఒప్పుకునేలా లేరు. వైఎస్సార్సీపీ వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలవడానికి లోకేష్ ఒక్కడు చాలు. లోకేష్కు దండం పెట్టిన వాడికి మంత్రి పదవి ఇచ్చారు’ అని కామెంట్స్ చేశారు. -
పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫీజుపోరు పోస్టర్ రిలీజ్
-
పెమ్మసానికి లెఫ్ట్ అండ్ రైట్ వాయించిన అంబటి రాంబాబు
-
చంద్రబాబు అసమర్థతను అంగీకరించారు
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చను అని సీఎం చంద్రబాబు స్వయంగా ఆయన అసమర్థతను అంగీకరిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు చెప్పారు. ఆయన సోమవారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. నీతి ఆయోగ్ లెక్కలంటూ.., వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్థి క వ్యవస్థను విధ్వంసం చేశారంటూ ఏ హామీనీ అమలు చేయలేనని ప్రకటించడం చంద్రబాబు దివాలాకోరుతనానికి నిదర్శనమని అన్నారు. చంద్రబాబు హామీలను అమలు చేయలేరని ఆనాడే వైఎస్ జగన్ చాలా స్పష్టంగా చెప్పారన్నారు.అయినా చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్ల అప్పులు చేసిందంటూ విష ప్రచారం చేశారని, ఆ తర్వాత వారు ప్రవేశ పెట్టిన బడ్జెట్లోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పులు రూ.6,46,537 కోట్లు మాత్రమే అని తేల్చారని వివరించారు. అంటే చంద్రబాబు ఊహించిన దానికన్నా అప్పులు 50 శాతం తక్కువేనని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందన్న విషయం ఎవరికైనా అర్థమవుతుందని అన్నారు. అయినా ఆర్థి క పరిస్థితి అధ్వానంగా ఉందని, వైఎస్సార్సీపీ హయాంలో చేసిన అప్పులే కారణమని ఎలా చెబుతారని నిలదీశారు. చంద్రబాబు అసమర్థత వల్లే పెట్టుబడులు రాలేదు రాష్ట్రాన్ని పెట్టుబడుల వరద ముంచెత్తుతుందంటూ కుమారుడు, అధికారులతో కలిసి ఆర్భాటంగా దావోస్ వెళ్లిన చంద్రబాబు ఉత్త చేతులతో తిరిగొచ్చారని ఎద్దేవా చేశారు. కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు చేసినా ఒక్క ఎంఓయూ లేదని చెప్పారు. చంద్రబాబు అసమర్థతే ఇందుకు కారణమన్నారు. దానిని కప్పిపుచ్చుకోవడానికే దావోస్లో ఎంఓయూలు మిథ్య అంటూ చాలా గొప్పగా సెలవిచ్చారని, ఇలా చెప్పడం సిగ్గుచేటని అన్నారు. మరి ఎందుకు దావోస్ వెళ్లారని నిలదీశారు. చంద్రబాబు ఆరోగ్యరీత్యా కోటు వేసుకోలేరని, అయినా అంతగొప్ప చలిలో కూడా కోటు తొడుక్కోకుండా పెట్టుబడుల కోసం చంద్రబాబు ప్రయత్నించారంటూ ఎల్లోమీడియా దిగజారుడు రాతలు రాసిందన్నారు.సీఎంగా వైఎస్ జగన్ దావోస్కు వెళ్లి రూ.1.26 లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. టెక్ మహేంద్ర రూ.200 కోట్ల ప్లాంట్, అదానీ గ్రూప్ రూ.60 వేల కోట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు, కర్నూలు జిల్లాలో రూ.37వేల కోట్లతో గ్రీన్ కో కంపెనీ ప్రాజెక్టు, అరబిందో గ్రీన్ ఎనర్జీ రూ.28వేల కోట్ల ప్రాజెక్టు వంటివన్నీ వైఎస్ జగన్ తెచి్చనవేనని తెలిపారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను కోడిగుడ్డాయన అంటున్న లోకేశ్ పెద్ద పప్పుసుద్ద కాదా అని అన్నారు. లోకేశ్ ఎర్ర బుక్కుకు తన కుక్క కూడా భయపడదని, అక్రమ కేసులతో ఎంతమందిని జైలుకు పంపినా వైఎస్సార్సీపీ వెనుకంజ వేయదని స్పష్టం చేశారు. -
రెడ్బుక్కు మా ఇంటి కుక్క కూడా భయపడదు: అంబటి
సాక్షి,గుంటూరు : ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చను అని సీఎం చంద్రబాబు స్వయంగా తన అసమర్థతను అంగీకరిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరులోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారని, అందువల్లే ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన ఏ హామీని తాను అమలు చేయలేనని చంద్రబాబు ప్రకటించడం ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో విజనరీ, అనుభవం ఉన్న నేతగా తనను తాను గొప్పగా చిత్రీకరించుకునే చంద్రబాబు తాజాగా తన అబద్దాలతో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల అమలు నుంచి తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...నీతి అయోగ్ వెల్లడించిన లెక్కలను చూపుతూ తాజాగా సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలను బట్టి ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నాను అని అంగీకరించారు. దానికి కారణం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని సాకులు చూపుతుండటం ఆయన అసమర్థతకు నిదర్శనం. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయాలంటే, తాను ఊహించిన దానికన్నా కూడా చాలా ఎక్కువగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనం అయ్యిందని అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు అనేక వాగ్ధానాలు చేశారు. వాటిని అమలు చేస్తానని చెప్పారు. ఆనాడే వైఎస్ జగన్ చాలా స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు హామీలు అమలు చేయలేనివి, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందుకు అనుగుణంగా లేదని చెప్పారు. అయినా కూడా నేను అన్నీ చేయగలను అని చంద్రబాబు ప్రజలను నమ్మించి, మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు.రాష్ట్ర అప్పులపైనా అబద్దాలుఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని విష ప్రచారం చేశారు. ఎన్నికల తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బడ్జెట్ సందర్భంగా మీరే అధికారికంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు రూ. 6,46,537 కోట్లు మాత్రమే అని తేల్చారు. చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పిన అప్పుల కన్నా యాబై శాతం తక్కువగానే గత ప్రభుత్వం అప్పులు చేసింది అని తెట్టతెల్లం అయ్యింది. అంటే మీరు ఊహించిన దానికన్నా అప్పుల తక్కువగా ఉన్నాయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని ఎవరికైనా అర్థం అవుతుంది. ఈ వాస్తవాలను ఒకవైపు అంగీకరిస్తూనే, మరోవైపు ఎన్నికలకు ముందు మేం ఊహించిన దానికన్నా ఇప్పుడు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది, దానికి వైఎస్సార్ సీపీ హయాంలో చేసిన అప్పులే కారణం అని ఎలా చెబుతారు? చంద్రబాబు తన మాటలను తానే ఖండించుకుంటున్నారు. ఇలా గత ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడానికి సిగ్గు అనిపించడం లేదా?తన ప్రజంటేషన్ లోనూ తప్పుడు వాదనలుతాజాగా చంద్రబాబు నీతి అయోగ్ లెక్కల గురించి ఇచ్చిన ప్రజంటేషన్ లో మాట్లాడుతూ 2022-23లో సీఎం వైఎస్ జగన్ చేసిన పెట్టుబడి వ్యయం రూ.7,244 కోట్లు, అప్పులు రూ.67,985 కోట్లు అని చెప్పారు. ఇలా చేయడం అన్యాయం, అక్రమం అని చెప్పారు. 2024-25లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఈ ఏడు నెలల్లో చేసిన అప్పులు రూ.73,685 కోట్లు, పెట్టుబడి వ్యయం రూ.8,894 కోట్లు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చేసింది పోల్చుకుంటే ఎక్కడా పెద్ద తేడా కనిపించడం లేదు. మరి చంద్రబాబు దీనిని ఎలా సమర్థించుకుంటారు? చంద్రబాబు తన మీడియా సమావేశంలో ఇలా గతంలో జరిగిందంతా తప్పు, తాను చేస్తున్నవి మాత్రం అత్యుత్తమమైన ఒప్పు అని ఎటువంటి సిగ్గు లేకుండా చెబుతుంటే, ఈ మీడియా సమావేశంలో చంద్రబాబుకు భజన చేసే ఎల్లో మీడియా ప్రతినిధులు 'మీరు చాలా తక్కువగా చెబుతున్నారు, ఇంకా కొన్ని కలుపుకుంటే చాలా ఎక్కువ అప్పులు కనిపిస్తాయి' అంటూ చంద్రబాబు అబద్దాలకు తాళం వేస్తున్న పరిస్థితి చాలా దురదృష్టకరం. ఇటువంటి అబద్దాలను చెబుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగవేయాలన్నదే చంద్రబాబు లక్ష్యం.చంద్రబాబు అసమర్థత వల్లే పెట్టుబడులు రాలేదుఇటీవల చంద్రబాబు దావోస్ పర్యటనకు తన కుమారుడు లోకేష్తో పాటు పలువురు అధికారులతో తీసుకుని ఎంతో ఆర్భాటంగా పర్యటనకు వెళ్లారు. ఇంకేముందీ రాష్ట్రాన్ని పెట్టుబడుల వరద ముంచెత్తుతుందనే స్థాయిలో ఈ ప్రచారం జరిగింది. తీరా ఉత్తి చేతులతో చంద్రబాబు బృందం రాష్ట్రానికి తిరిగి వచ్చింది. ఒక్క ఎంఓయు లేదు, కోట్ల రూపాయల ప్రజాధనంను వ్యయం చేశారు. కనీసం దారి ఖర్చులు కూడా గిట్టుబాటు కాలేదు. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు మాట్లాడుతూ దావోస్లో ఎంఓయులు అనేవి ఒక మిథ్య అంటూ చాలా గొప్పగా సెలవిచ్చారు. దావోస్ వెళ్ళినంత మాత్రాన పెట్టుబడులు వస్తాయనేది ఒక భ్రమ అని కొత్త అంశాన్ని వెల్లడించారు. అలాంటప్పుడు చంద్రబాబు, ఆయన బృందం ఎందుకు దావోస్ వెళ్ళారు. చంద్రబాబు ఆరోగ్యరీత్యా ఆయన కోటు వేసుకోలేని స్థితిలో ఉన్నారు. దానిని కూడా ఎల్లో మీడియా అంతగొప్ప చలిలో కూడా కోటు తొడుక్కోకుండా పెట్టుబడుల కోసం చంద్రబాబు ప్రయత్నించారంటూ దిగజారుడు రాతలు రాసింది. అనుకూలంగా ఉంటే ఒకరకంగా, వ్యతిరేకం అయితే మరోరకంగా మాట్లాడటం చంద్రబాబుకు అలవాటు. టక్కుటమార విద్యలకు చంద్రబాబు ప్రసిద్ది. ఆయన చెప్పే ప్రతి విషయాన్ని భక్తితో పెద్ద ఎత్తున ప్రచారం చేయడమే ఎల్లో మీడియాకు తెలిసింది. 2014-19 హయాంలో గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ నిర్వహించారు. 328 ఒప్పందాల ద్వారా రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని ఆర్భాటంగా ప్రకటించారు. ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామని డబ్బా కొట్టుకున్నారు. ఇందులో ఎన్ని ఒప్పందాలు ఆచరణలోకి వచ్చాయి, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎంత మందికి ఉపాధి కల్పించారో చెప్పగలరా? సీఎంగా వైఎస్ జగన్ కూడా దావోస్కు వెళ్ళి రూ. 1.26 లక్షల కోట్ల రూపాయల ఎంఓయులపై సంతకాలు చేశారు. టెక్ మహేంద్ర సీఈఓ గుర్నానీ రూ.200 కోట్లతో ఇథనాల్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. ఆదానీ గ్రూప్ రూ.60 వేల కోట్లతో పెట్టుబడులతో వస్తే, భూములు కేటాయించి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరిగేందుకు చర్యలు తీసుకున్నారు. అలాగే 37వేల కోట్ల పెట్టుబడులతో కర్నూలు జిల్లాలో గ్రీన్ కో కంపెనీ పనులు కూడా మా హయాంలోనే ప్రారంభమయ్యాయి. అరబిందో గ్రీన్ ఎనర్జీ 28వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో వచ్చింది. ఇవ్వన్నీ జగన్ హాయంలో జరిగినవి.ఎల్లో మీడియా అండతో రెచ్చిపోతున్న చంద్రబాబుఒక పర్యాయం సీఎం వైఎస్ జగన్ దావోస్ పర్యటనకు వెళ్ళలేకపోతే చంద్రబాబుకు భజన చేసే ఎల్లో మీడియా ఈనాడు పత్రిక 'ఓసోస్ దావోస్ మనకెందుకూ' 'పెట్టుబడుల కోసం దావోస్ వెళ్ళలేరా?' అంటూ ఒక కథనాలను ప్రచురిస్తూ, సీఎం దావోస్ ఎందుకు వెళ్ళలేదు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. పొరుగు రాష్ట్రాల సీఎంలు దావోస్ కు వెళ్ళి పెట్టుబడులు తెచ్చుకుంటుంటే మీరు ఎందుకు స్పందించడం లేదు అంటూ తమ కథనాల్లో ప్రశ్నించారు. మరి నిత్యం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తుతూ స్వామిభక్తిని చాటుకునే ఇదే ఎల్లో మీడియాకు చెందిన ఈనాడు పత్రికకు ఉత్తి చేతులతో తిరిగి వచ్చిన చంద్రబాబు బృందం అసమర్థత కనిపించడం లేదా? దావోస్ వెళ్లినంత మాత్రాన పెట్టుబడులు వస్తాయా అంటూ చంద్రబాబు ప్రశ్నిస్తే సమంజసమే అన్నట్లుగా అనుకూల కథనాలను రాయడానికి ఏమాత్రం వెనకాడలేదు. అంటే వైఎస్ జగన్ దావోస్ వెళ్ళకపోతే పెట్టుబడులు అక్కరలేదా అని ప్రశ్నిస్తారు, అదే చంద్రబాబు తన అసమర్థత వల్ల పెట్టుబడులు తీసుకు రాలేకపోతే మరే ఫరవాలేదు అంటూ చంద్రబాబును సమర్థిస్తారు. ఇప్పుడు పొరుగు రాష్ట్రాల సీఎంలు లక్షల కోట్లు పెట్టుబడులతో తమ రాష్ట్రాలకు వచ్చారు, చంద్రబాబు ఒక్క రూపాయి కూడా ఎంఓయు కుదుర్చుకోకుండా వచ్చారు. ఇది ఎల్లోమీడియాకు కనిపించదు. ఇదీ ఎల్లో మీడియా, దానిని నిర్ధేశిస్తున్న చంద్రబాబు నిజస్వరూపం. నరంలేని నాలుకను ఎటువైపు అయినా తప్పి మాట్లాడటంలో ఎంతో ఘనుడు. ఈ విషయంలో చంద్రబాబు, ఆయనకు ప్రచారం చేసే ఎల్లో మీడియాను మించిన వారు లేరు.పగిలిన గ్లాస్ కథను ప్రచారంలోకి తెచ్చారుదావోస్ లో చంద్రబాబు ఎంత బాధ్యతతో వ్యవహరించారో ఆయనతో పాటు పర్యటనలో పాల్గొన్న ఒక అధికారి ఎల్లో మీడియాకు చెందిన ఒక చానెల్ కు తెలిపిన కథనాన్ని చాలా గొప్పగా ప్రసారం చేశారు. ఈ కథనంలో దావోస్ లో మైనస్ 12 డిగ్రీల చలిలో చంద్రబాబు బృందం నిద్రిస్తున్న గదుల్లో గ్లాస్ పగిలి, గడ్డకట్టించే చలిలో రాత్రంతా నిద్రలేకుండా గడిపారని, తెల్లవారుజామున వారు కొద్దిసేపు నిద్రించి ఆలస్యంగా లేచారట. సదరు అధికారులు తెల్లవారిన తరువాత లేచి చూస్తే చంద్రబాబు గదిలో లేరని, ఆయన గదిలో కూడా గ్లాస్ పగిలినా, గడ్డకట్టే చలిలో రాత్రంతా వణికిపోతూ నిద్ర లేకుండా గడిపి, ఉదయానే అలసటను కూడా పట్టించుకోకుండా దావోస్లోని మీటింగ్ హాల్కు వెళ్ళిపోయారట. అంతేకాదు మిగిలిన రాష్ట్రాల వారు ఇంకా తమ స్టాల్స్ ను ప్రారంభించక ముందే అందరికంటే ముందుగా చంద్రబాబు ఏపీ స్టాల్ కు వెళ్ళి, దానిని ప్రారంభించి, అప్పటికే అక్కడకు వచ్చిన కొందరు విదేశీ పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతూ కనిపించారట. అక్కడ ఉన్న విదేశీ పారిశ్రామికవేత్తలు కోట్లు, రగ్గులు కప్పుకుని ఉంటే, చంద్రబాబు మాత్రం తాను రోజూ ధరించే అదే ఖద్దరు దుస్తులతో వారితో మాట్లాడుతూ కనిపించారట. అది చూసి అధికారులు సిగ్గుతో చంద్రబాబు వద్దకు వచ్చి ఇంత చలిలో మీరు ఎందుకు అందరికంటే తొందరగా వచ్చారని వారిలోని ఒక అధికారి ప్రశ్నిస్తే, మనం ప్రభుత్వ సొమ్ముతో, వారు చెల్లించిన పన్నులతో విమానాల్లో ఇక్కడకు వచ్చాం, అందరికంటే ముందుగా ఇక్కడకు వస్తే కనీసం ముందుగా వచ్చే పారిశ్రామికవేత్తలతో మాట్లాడవచ్చు, వారిలో ఒకరిద్దరు అయినా పెట్టుబడులు పెడితే రాష్ట్రానికి మేలు జరుగుతుందనే బాధ్యతతో ఇక్కడకు వచ్చాను అని అన్నారట. అది విన్న సదరు అధికారి కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయని అత్యంత అద్భుతమైన ఒక కథను ప్రచారం చేశారు. ఈ మొత్తం కథను 2023 నవంబర్ 13వ తేదీన టీవీ5 అనే ఛానెలో లో ప్రజంటేటర్ మూర్తికి, సినీ నిర్మాత బండ్ల గణేష్ కు మధ్య జరిగిన సంభాషణ. ఇదే స్టోరీని అదే ఛానెల్ లో అదే ప్రజంటేటర్ మూర్తి 20.1.2025న తాజాగా జరిగినట్లు చెప్పడం చూస్తే వీరు ఎంతగా దిగజారిపోయారనేది ప్రజలకు అర్థమవుతుంది. ఈ కథనంను ప్రచురించి ఎల్లో మీడియా చానెల్ టీవీ5 మరెవరిదో కాదు ఇటీవలే చంద్రబాబు ఆశీస్సులతో టీటీడీ చైర్మన్ గా పదవిని దక్కించుకున్న బీఆర్ నాయుడిది. తనకు పదవి ఇచ్చినందుకు గానూ కృతజ్ఞతతో తన చానెల్ లో గత ఏడాది నవంబర్ లో సినీ నిర్మాత బండ్ల గణేష్ చెప్పిన కథను తాజాగా ఇప్పుడే జరిగింది అని చెప్పి, దానిని ప్రచారంలోకి తీసుకురావడం చూస్తే ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా? 2023న పగిలిన గ్లాసు కథను టీవీ5 మూర్తి 2025లో జరిగినట్లు చెప్పడం ఎంత దారుణం.చంద్రబాబు కుమారుడిగానే లోకేష్ కు గౌరవంవైయస్ఆర్ సీపీ హయాంలో మేం చేసుకున్న ఒప్పందాల్లో భాగంగానే ప్రాజెక్ట్ లను ఇప్పుడు ప్రారంభిస్తున్నారి మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్న మాటలను మీడియా నారా లోకేష్ వద్ద ప్రస్తావిస్తే అమర్ నాథ్ గురించి 'ఆ.. కోడిగుడ్డాయనా' అని ఎద్దేవా చేశాడు. లోకేష్ పెద్ద పప్పుసుద్ద కాదా? చంద్రబాబును చూసి ఆయనను గౌరవిస్తున్నారు. గుడివాడ అమర్ నాథ్ ఒక మాజీ మంత్రి కుమారుడు. ఆయన చనిపోయిన తరువాత కూడా అమర్ నాథ్ ప్రజల నుంచి గౌరవం పొందుతున్నాడు. కేవలం చంద్రబాబు సీఎంగా ఉండటం వల్లే లోకేష్ కు గౌరవం. ఇది నిజంగా లోకేష్ కు ఉన్న గౌరవం కాదు. లోకేష్ ఎర్ర బుక్కుకు నా కుక్క కూడా భయపడదు. ఎంతమందిని జైలులో అక్రమ కేసులతో జైలుకు పంపినా వైఎస్సార్సీపీ వెనుకంజ వేయదు.రిపబ్లిక్ డే ప్రసంగంలోనూ డొల్లతనంవైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటి రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ ప్రసంగం ద్వారా 1.03 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు, 2.7 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పాం. రూ.3000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, అమ్మ ఒడి ద్వారా లక్షలాధి మంది తల్లులకు అండగా నిలుస్తామని ఇలా పలు కార్యక్రమాల గురించి చెప్పాం. వాటిని తరువాత అదే తరహాలో ఆచరణలో కూడా చూపాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం తమ తొలి రిపబ్లిక్ డే నాడు ప్రసంగంలో ఒక్క కార్యాచరణపైన కూడా నిర్ధిష్టమైన విషయాలను చెప్పలేకపోయింది. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా ఇంకా గత ప్రభుత్వంపైనా, వైజగన్పైనా విమర్శలు చేయడంతోనే కాలం గడుపుతోంది. ఆంధ్రా బ్రాండ్ ను దావోస్ కు వెళ్లి పెంచామని సిగ్గులేకుండా చెబుతున్నారు. ఇప్పటికైనా మీరు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలి, లేనిపక్షంలో వైఎస్సాఆర్సీపీ నుంచి మిమ్మల్ని నిలదీస్తాం. సూపర్ సిక్స్ హామీల అమలు ఏదీ? తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు అమలు విస్మరించలేదా? తమ అసమర్థతను దాచుకుంటూ జగన్ గారి వల్ల అమలు చేయలేకపతున్నామని చెప్పడానికి తెగబడుతున్నారు.మీడియా ప్రశ్నలకు సమాధానం చెబుతూలోకేష్ రెడ్ బుక్ చూసి పారిపోలేదు, రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను అని విజయసాయిరెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. విజయసాయిరెడ్డిని అప్రూవర్ గా మారమని చాలా వత్తిడి తెచ్చారని ఆయనే చెప్పారు. ఇలా వత్తిడి తెచ్చిన వారు ఎవరో ఆయనే చెప్పాలి. జగన్ మీద పెట్టిన ఏ కేసులోనూ ఆధారాలు లేవు, రాజకీయ కక్షతోనే ఆయనను జైలుకు పంపారు. లోకేష్ వేధింపులపై ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. ఎర్ర పుస్తకంలో పిచ్చిరాతలు రాసుకుని, అందరి మీద కేసులు పెట్టి గందరగోళం చేస్తున్న దానికి ప్రతిఫలం లోకేష్ అనుభవించక తప్పదు. వైజాగ్ లో జగన్ హయాంలో నిర్మించిన అద్భుతమైన నిర్మాణాలను ఏం చేసుకోవాలో తెలియని అయోమయంలో లోకేష్ ఉన్నారు. జగన్ మించిన ప్రజాధరణ కలిగిన నాయకుడు ఈ రాష్ట్రంలో మరొకరు లేరు. రాజకీయపార్టీలు ఓటమి పాలైన తరువాత నాయకులు బయటకు వెళ్ళడం జరుగుతుంది. ఇది కేవలం వైఎస్ఆర్ సీపీకే పరిమితం కాదు. గతంలో చాలా మంది టీడీపీ నుంచి బయటకు వెళ్లారు. అంతమాత్రాన టీడీపీ అధికారంలోకి రాకుండా మిగిలిపోయిందా. పార్టీ నుంచి వెళ్ళడం అనేది వెళ్ళినవారి నైతికతకు సంబంధించిన విషయం. కష్టాలను తట్టుకునే శక్తి, నష్టాలను పూడ్చుకునే శక్తి కూడా వైఎస్సార్సీపీకి ఉంది. మళ్లీ అధికారంలోకి వచ్చేలా ప్రజలను మెప్పిస్తాం’అని అన్నారు. -
సందు దొరికితే చాలు వైఎస్ జగన్ పై బురద చల్లాలనే ప్రయత్నమే
-
అమిత్షా ఏం మాట్లాడారో మాకు తెలుసు: అంబటి రాంబాబు
సాక్షి,తాడేపల్లి:అందితే జుట్టు అందకపోతే కాళ్లు అనేది చంద్రబాబుకు తెలిసిన విద్య అని మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఆదివారం(జనవరి19) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.‘నాడు తిరుమల దర్శనానికి వచ్చినపుడు అమిత్షాపై రాళ్ల వర్షం కురిపించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయి. విభజన సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. ఇలాంటి సమయంలో చంద్రబాబు, పవన్కల్యాణ్ సమస్యల గురించి మాట్లాడకుండా విందులేంటో. సమస్యలన్నీ పక్కనపెట్టి వైఎస్ జగన్ ప్యాలెస్ల గురించి మాట్లాడుతున్నారు. అమిత్ షాతో చంద్రబాబు వైజాగ్ స్టీల్ప్లాంట్ విషయం మాట్లాడలేదు.లోకేష్ను అదుపులో పెట్టుకోమని అమిత్ షా వార్నింగ్..అమిత్షా ఏం మాట్లాడారో మాకు సమాచారం ఉంది. లోకేష్ను డిప్యూటీ సీఎం చేస్తానని చంద్రబాబు అమిత్షాను అడిగారట. లోకేష్ అన్ని శాఖల్లో వేలు పెడుతున్నారని, ఆయనను ముందు అదుపులో పెట్టుకోవాలని అమిత్షా చంద్రబాబును హెచ్చరించారు. లోకేష్ వసూళ్ల కార్యక్రమంలో నిమగ్నమైనందున స్పీడ్ తగ్గించుకోవాలని అమిత్ షా బాబుకు సూచించారు.అమిత్ షా సలహాలు బయటికి రాకుండా కథలు వండి వారుస్తున్నారు. గత్యంతరం లేకే చంద్రబాబు పవన్కల్యాణ్ను డిప్యూటీ సీఎం చేశారు. చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది.వైఎస్ జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరిగాయి’అని అంబటి తెలిపారు.అంబటి రాంబాబు ఇంకా ఏమన్నారంటే..చంద్రబాబు అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే రకంరాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయ్విభజన సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయిరాష్ట్రంలోని సమస్యలను వదిలేసి జగన్ ఆస్తుల గురించి అమిత్ షా అడిగారని ప్రచారం చేస్తున్నారుఆవు కథ మాదిరి వైఎస్ జగన్ పై బురదజల్లడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారుచంద్రబాబు నివాసముండేదే అక్రమ కట్టడంఅక్రమకట్టడంలోనే విందు ఇస్తున్నామని అమిత్ షాకు ఎందుకు చెప్పలేదుఆ ఇల్లు క్విడ్ ప్రోకోలో కొట్టేసిందని అమిత్ షాకు ఎందుకు చెప్పలేదుకృష్ణమ్మ వరద ముంచేసిన ఇంట్లోనే మీరు కూర్చున్నారని ఎందుకు చెప్పలేదుహైదరాబాద్లో ఇల్లు కట్టుకున్న చంద్రబాబు ఎవరికైనా చూపించాడాచంద్రబాబు మాదిరి జగన్ మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకోలో ఇళ్లు తీసుకోలేదులోకేష్ ను ఉపముఖ్యమంత్రిగా చేయాలని అమిత్ షా ను చంద్రబాబు అడిగారుమీ అబ్బాయి లోకేష్ స్పీడ్ ను తగ్గించుకోమని అమిత్ షా చెప్పారుఎక్కడపడితే అక్కడ వేలు పెడుతున్నాడు...కొంచెం తగ్గమని చెప్పారువైఎస్ జగన్ ఇళ్ల గురించి పాతచింతకాయ పచ్చడి కథలెందుకుపోలవరం రెండవ డయాఫ్రమ్ వాల్ పనులు నిన్న ప్రారంభించారుడయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి చంద్రబాబు అవివేకంటీడీపీలో చేసిన తప్పిదమే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందిచంద్రబాబు,దేవినేని ఉమా , టీడీపీ తప్పిదాన్ని జగన్ పై నెట్టడం తప్పువైఎస్ జగన్ హయాంలోనే పోలవరం పనులు అద్భుతంగా జరిగాయిస్పిల్ వే , కాఫర్ డ్యామ్ లు జగన్ హయాంలోనే పూర్తి చేశారుతిరుపతి ఘటన మానవతప్పిదంతిరుపతికి ఇప్పుడు రమ్మని చెప్పండి ఎన్డీయేనుతిరుపతి పై ఈ ప్రభుత్వం పూర్తిగా పట్టు కోల్పోయిందిలడ్డూలో కల్తీ నెయ్యి కలిపారని మాపై అభాండాలు వేశారుఆ పాపమే ఇప్పుడు కూటమి పాలనను వెంటాడుతోందిచెప్పేటందుకే చంద్రబాబు నీతులుచంద్రబాబు, ఆయన కుమారుడు ఒక్కొక్కరినే కంటారుపేదలు మాత్రం ఇద్దరు ముగ్గురు కనమంటున్నారుఏపీలో అసమర్ధపాలన సాగుతోందిలోకేష్ భజన తగ్గించాడు...పవన్ చంద్రబాబు భజన మొదలు పెట్టాడుఅలా భజన చేస్తున్నాడు కాబట్టే బాగా లబ్ధి పొందుతున్నాడుమళ్లీ మీరే ఉంటారని గ్యారంటీ ఇవ్వాలని కంపెనీలు లోకేష్ ను అడుగుతున్నాయంటున్నారు ఈ ప్రభుత్వం మీద పారిశ్రామికవేత్తలకు నమ్మకం లేదువైఎస్ జగన్ మళ్లీ రావడం ఖాయమని పారిశ్రామికవేత్తలకు అర్ధమైపోయిందిజగన్ హయాంలోనే పెట్టుబడులు పెడదామని పారిశ్రామిక వేత్తలు ఎదురు చూస్తున్నారుచంద్రబాబు అనుభవజ్ఞుడే అవ్వొచ్చు ...కానీ అసమర్ధుడు -
గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ తీరుపై అంబటి రాంబాబు ఆగ్రహం
-
‘కూటమి’ అరాచకాలను ప్రశ్నిస్తాం.. ఎదిరిస్తాం: అంబటి
సాక్షి, గుంటూరు: పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు(Namburu Sankara Rao) కార్యాలయంపై దాడి చేసిన టీడీపీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ ఎస్పీకి వైఎస్సార్సీపీ(YSRCP) నేతలు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆ పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు. కొందరు తన కార్యాలయంలోకి చొరబడి ఫ్లెక్సీలు చింపి, అక్కడ ఉన్న పార్టీ నాయకులు, కార్యాలయ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారని.. ఈ అంశంపై ఇవాళ(బుధవారం) జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినట్లు నంబూరు శంకర్రావు తెలిపారు.సహించం.. కచ్చితంగా తిప్పి కొడతాం: నంబూరు శంకర్రావు..మా కార్యాలయంపై దాడి చేసి తమ సిబ్బందిపై తిరిగి కేసులు పెట్టారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదు. గత కొన్ని నెలల క్రితం పెదకూరపాడులో వైఎస్సార్సీపీ నేత సాంబిరెడ్డి కాళ్లు నరికారు. మా పార్టీ, కార్యకర్తలపై పెదకూరపాడులో దాడులు జరుగుతున్నాయి. గతంలో కొమ్మలపాటి శ్రీధర్, కన్నా లక్ష్మీనారాయణ, నేను పనిచేశాం. ఇలాంటి ఘటనలను ఇకపై మేము సహించేది లేదు.. కచ్చితంగా తిప్పి కొడతాం.నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలను ఉపేక్షించేది లేదు. తప్పకుండా ప్రశ్నిస్తాం. ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. వచ్చిన పదవి అవకాశాన్ని మంచిగా ఉపయోగించాలి. నియోజకవర్గ అభివృద్ధిపై, ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలి’’ అని నంబూరు శంకర్రావు పేర్కొన్నారు.చంద్రబాబు ఇకనైనా కళ్లు తెరవాలి: అంబటి రాంబాబుమాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పోలీసులు రాజకీయ ఒత్తిడికి గురవుతున్నారని.. కూటమి నేతలు ఏడు నెలల్లో చేయకూడని అరాచకాలు చేశారని మండిపడ్డారు. ‘‘ఐదేళ్లు పాటు పెదకూరపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన శంకర్రావుపై దాడి చేస్తామంటున్నారు. గతంలో నియోజకవర్గంలో రైతులను పరామర్శించేందుకు వెళ్లగా ఆయన కారుపై దాడికి పాల్పడ్డారు.. ఇది సహించరాని ఘటన. కచ్చితంగా పెదకూరపాడు వెళ్తాం.. కార్యకర్తల సమావేశం నిర్వహిస్తాం. పోలీసులే మాకు రక్షణ కల్పించాలి.ఇదీ చదవండి: ఇదేం బ్రొమాన్స్ బాబోయ్.. మోదీ పగలబడి నవ్వింది అందుకే!..రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో అరాచక పాలన సాగుతుంది. చంద్రబాబు ఇకనైనా కళ్లు తెరవాలి. పిల్లిని గదిలో వేసి కొడితే పులి అవుతుంది ఆ విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో రోజు రోజుకీ సమస్యలు ముదురుతున్నాయి. పండుగ కూడా చేసుకోకుండా దాడులు చేస్తున్నారు. ఇలాంటి దాడులను ఎదిరించి, ధైర్యంగా నిలబడతాం. టీడీపీ చేసే ప్రతి దాడిని, దౌర్జన్యాన్ని ప్రజలకు వివరిస్తాం’’ అని అంబటి రాంబాబు తెలిపారు. -
ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? అధికారంలో ఉంటే మీ ఇష్టమా!
-
తిరుపతిలో టోకెన్ల కోసం తొక్కిసలాట జరగడం దురదృష్టకరం
-
తిరుపతి తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు హైడ్రామా: అంబటి
సాక్షి, గుంటూరు: ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన క్షేత్రంగా వున్న తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు తీసుకున్న చర్యలు హైడ్రామాను తలపిస్తున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన టీటీడీ చైర్మన్, ఈఓ, జేఈఓ, తిరుపతి ఎస్పీలపై చర్యలు తీసుకునే ధైర్యం చంద్రబాబుకు లేదని అన్నారు. వైఎస్సార్సీపీపై అక్రమ కేసులు బనాయించేందుకే ఈ నలుగురితో కూడిన క్రిమినల్ ముఠాను చంద్రబాబు తిరుమల తిరుపతిలో నియమించుకున్నారని.. ఈ ముఠాకు నాయకుడు చంద్రబాబేనని విమర్శించారు. తొక్కిసలాటకు బాధ్యులుగా కిందిస్థాయి ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం దారుణమని అన్నారు.ఇంకా ఆయన ఏమన్నారంటే..అంతర్జాతీయంగా తిరుమల తిరుపతి ఆలయానికి గొప్ప గుర్తింపు ఉంది. ఇక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా మొత్తం ప్రపంచం దీనిని గమనిస్తుంది. అటువంటి క్షేత్రంలో ప్రణాళికా లోపం కారణంగా వైకుంఠ ద్వార దర్శనంకు వచ్చిన భక్తులు తొక్కిసలాటకు గురై ఆరుగురు మృతి చెందడం చాలా పెద్ద ఘటనగా భావించాలి. కోట్లాధి మంది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం ఇది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చాలా సీరియస్గా చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ సీఎం చంద్రబాబు ఈ ఘటనపై వ్యవహరించిన తీరు అత్యంత అభ్యంతరకరం. డీఎస్సీ, గోశాల డైరెక్టర్ లను సస్పెండ్ చేయడంతో చేతులు దులుపుకున్నారు.క్రిమినల్ ముఠాను కాపాడుకునేందుకే చంద్రబాబు తిరుపతి పర్యటనతిరుపతిలో తొక్కిసలాట సంఘటన జరిగిన వెంటనే సీఎం చంద్రబాబు, హోం, రెవన్యూ, ఎండోమెంట్ మంత్రులతో కలిసి ఘటనా స్థలికి వెళ్లి అధికారులు, మృతుల కుటుంబాలు, క్షతగాత్రులతో మాట్లాడారు. దీనిపై చిత్తశుద్దితో చర్యలు తీసుకుంటారని అందరూ భావించారు. కానీ సీఎం మాత్రం తన అనుకూల అధికారులుగా, కావాలని తిరుమల తిరుపతిలో పోస్టింగ్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్న ఆ నలుగురిపై ఈగ కూడా వాలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అసలు చంద్రబాబు ఈ ఘటనపై హుటాహుటిన తిరుపతికి వెళ్ళింది బాధితులు, భక్తుల కోసం కాదు. తను పెంచి పోషిస్తున్న క్రిమినల్ ముఠాలోని నలుగురిని కాపాడుకునేందుకే.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ నలుగురూ వైయస్ఆర్ సీపీకి చెందిన వారిపై ఎలాంటి తప్పుడు కేసులు పెట్టాలా అనే ఆలోచనతోనే పనిచేస్తున్నారు. గత టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈఓ థర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను కేసుల్లో ఎలా ఇరికించాలా అనే లక్ష్యంతోనే పనిచేస్తున్నారు. దీనిలో భాగంగానే లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందీ, ఇవే లడ్డూలను అయోధ్యలోని రామాలయంకు కూడా పంపారంటూ అత్యంత దారుణమైన తప్పుడు ప్రచారానికి పాల్పడ్డారు.వైఎస్ జగన్ రాకుండా అడుగడుగునా ఆటంకాలుతొక్కిసలాటలో చనిపోయిన మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు తిరుపతికి వెళ్ళే క్రమంలో వైయస్ జగన్ గారికి కావాలనే అనేక అడ్డంకులు సృష్టించారు. చివరికి ట్రాఫిక్ క్లియర్ చేయకుండా ఆయన వాహనాలకు ఆటంకాలు కల్పించారు. వైఎస్ జగన్ కారు కాలినకడన వెళ్లి బాధిత కుటుంబాలను కలిసి, వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.ఇదీ చదవండి: బాబే మొదటి ముద్దాయి: వైఎస్ జగన్ముందు నుంచే జగన్.. తిరుపతిలో బాధిత కుటుంబాలను కలవకూడదనే కుట్రతోనే ప్రభుత్వం పనిచేసింది. ముందుగా సీఎం వెళ్లడం, తరువాత వేరుగా డిప్యూటీ సీఎం వెళ్ళడం ద్వారా సమయం లేకుండా చేయాలన్న లక్ష్యంతోనే దిగజారుడు రాజకీయం చేశారు. ఎక్కడ వైఎస్ జగన్ బాధితులను కలిసి, జరిగిన దానిపై వాస్తవాలు మాట్లాడతారో, ఎక్కడ ప్రజల్లో దీనిపై ఆగ్రహం వ్యక్తమవుతుందోనని ప్రభుత్వం భయపడింది. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన వ్యక్తులపై చర్యలు తీసుకోకపోతే భక్తులు సహించరు. ఆ భగవంతుడు కూడా క్షమించడు.పోలీసుల తప్పుడు కేసులను భయపడేది లేదుపిల్లి బాబూరావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై మాపై గుంటూరు పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారు. దీనిపై ఎల్లో మీడియాలో అంబటి సోదరులపై క్రిమినల్ కేసు అంటూ పెద్ద కథనాలను ప్రచురించారు. పిల్లి బాబూరావు నాకు తెలియదు. ఈ కేసుకు సంబంధించి సమాచారం తెలియగానే డీఎస్సీ, సీఐలతో మాట్లాడాను. ఈ కేసులో ఎప్పుడు మీరు విచారణకు పిలిచినా హాజరవుతాను, లేదా అరెస్ట్ చేసేందుకు వస్తామన్నా కూడా పూర్తిగా సహకరిస్తాను అని చెప్పాను. ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశాను. బాద్యుడైన పౌరుడిగా చట్టాన్ని గౌరవిస్తాను. దీనిపై భయంతో క్వాష్ కు, యాంటిసిపేటరీ బెయిల్ కు ప్రయత్నించను. చంద్రబాబు, లోకేష్ లు చెప్పారని అర్థరాత్రి పూట వచ్చి మా తలుపులు కొట్టవద్దు. ఎప్పుడ రమ్మని ఫోన్ చేసినా నేనే స్వయంగా పోలీస్ స్టేషన్ కు వస్తాను. ఇటువంటి తప్పుడు కేసులను భయపడేది లేదు. పారిపోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. -
టీటీడీ సేవ కాదు టీడీపీకి సేవ చేస్తున్నాడు ఓ సనాతనీ నోరు తెరువు
-
తిరుపతి తొక్కిసలాట ఘటన..ఆ పాపం వాళ్లదే
సాక్షి,తాడేపల్లి: తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు శ్రీవారి భక్తుల మృతికి చంద్రబాబు పాలనా వైఫల్యమే కారణమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తిరుపతి పర్యటనలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. చంద్రబాబు వల్లే శ్రీవారి సేవే పరమావధిగా పనిచేయాల్సిన టీటీడీ కాస్తా టీడీపీ సేవలకు పరిమితమయ్యిందని విమర్శించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి ఘోర ప్రమాదం జరిగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనంకు వచ్చే భక్తులకు టోకెన్లు జారీ చేసే కేంద్రాల వద్ద తొక్కిసలాటలో ఆరుగురు మరణించడం, పలువురు గాయపడటం బాధాకరం. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి తిరుమలపై ప్రతి అంశాన్ని వివాదంగా చేస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్ తిరుమల దర్శనం కోసం వస్తున్నారని తెలియగానే ఈఓ, జెఈఓలు పెద్ద పెద్ద బోర్డ్లు కట్టారు. ఆయన పర్యటన రద్దు అనగానే వెంటనే వాటిని తొలగించారు. కూటమి ప్రభుత్వం చెప్పినట్లుగా వారు పనిచేస్తున్నారు. శ్రీవారి ఆలయంలో పనిచేసే వారు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి. టీటీడీ ఛైర్మన్గా ఉన్న బీఆర్ నాయుడు వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తన టీవీ ఛానెల్లో పెద్ద ఎత్తున ఇచ్చిన ప్రచారానికి ప్రతిఫలంగా ఆయనకు ఈ పదవి దక్కింది. టీటీడీ ఛైర్మన్గా ఉండి కూడా జగన్పై రాజకీయపరమైన విమర్శలు చేశారు. ఆయనకు శ్రీవారి పట్ల నిజమైన భక్తి లేదు. ప్రతిసారీ తిరుమలపై వివాదాలను సృష్టించి, రాజకీయంగా వైఎస్సార్సీపీని అణచివేయడానికి బీఆర్ నాయుడు, ఈఓ, జెఈఓలు ప్రయత్నించారే తప్ప భక్తులకు సేవ చేయాలని ఏనాడు పనిచేయలేదు. వారి దుర్మార్గమైన ఆలోచనల వల్లే ఇటువంటి దుర్ఘటన జరిగింది. తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన కూడా ఒక ప్రహాసనంలా కనిపిస్తోంది. ఈ కేసులో తన వారిని కాపాడుకునేందుకు కిందిస్థాయి అధికారులపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు.సనాతన ధర్మాన్ని కాపాడే యోధుడు పవన్ కళ్యాణ్ ఇంత వరకు దీనిపై స్పందించలేదు. ఈ దేశంలో రాజకీయాలకు అతీతంగా సనాతన ధర్మాన్ని కాపాడేవారు అనేక మంది ఉన్నారు. అటువంటి వారు ఇటువంటి ఘటనలపై స్పందించాలి. ధర్మ పరిక్షణ కోసం ఏం చేయాలో చెప్పాలి. ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏం చేయాలో ఈ ప్రభుత్వానికి సూచించాలి. పీఠాధిపతులు, స్వామీజీలు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.తిరుపతి తొక్కిసలాటలో చనిపోయిన వారికి కోటి రూపాయలు చొప్పున ప్రభుత్వం నుంచి పరిహారం ఇవ్వాలి. క్షతగాత్రులకు కనీసం పాతిక లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రమాదం జరిగిన తరువాత కూడా వైద్యశాలకు వెళ్ళినటువంటి వారికి వైద్యం అందలేదు. గాయపడిన వారి పట్ల కనీసం బాధ్యత తీసుకోలేదు. చంద్రబాబు ఏరి కోరి తెచ్చుకున్న తిరుపతి ఎస్పీ ప్రజల కోసం కాకుండా కేవలం టీడీపీ కోసమే పనిచేస్తున్నారు. వైఎస్సార్సీపీపై తప్పుడు కేసులు బనాయించడంలోనే ఆయన మునిగిపోయాడు. ఈ ప్రమాదంపై తక్షణం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. -
ఎల్లోమీడియాకు అంబటి రాంబాబు వార్నింగ్
సాక్షి,గుంటూరు: ఎల్లోమీడియాకు మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు వార్నింగ్ ఇచ్చారు. గుంటూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం(జనవరి6) అంబటి మీడియాతో మాట్లాడారు. ‘పిచ్చి కథనాలు రాస్తే చూస్తూ ఊరుకోం.మళ్లీ మా చేతిలోకి పగ్గాలు వస్తాయి. అయినా మేం మీలా కక్ష సాధింపులకు పాల్పడం. గేమ్ చేంజర్ ప్రి రిలీజ్ ఈవెంట్కు వెళ్లి వస్తుండగా చనిపోయిన వారి కుటుంబాలను పవన్ ఎందుకు పరామర్శించలేదు. చనిపోయిన వారికి రూ.2 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలి.పుష్ప 2 ఘటనపై స్పందించిన పవన్ గేమ్చేంజర్ మృతుల కుటుంబ సభ్యుల దగ్గరికి ఎందుకు వెళ్లలేదు. సంఘటన ఎక్కడ జరిగిందనేది కాదు ఎవరివల్ల జరిగిందనేది ముఖ్యం. అభిమానుల ప్రాణాలకు విలువ లేనట్లుగా మాట్లాడుతున్నారు.రోడ్డుబాగాలేదని పవన్ చెప్పడం విడ్డూరంగా ఉంది’అని అంబటి రాంబాబు అన్నారు. -
‘పుష్ప’కేనా నీతులు.. గేమ్ చేంజర్కి పాటించరా?
అమరావతి: ‘పుష్ప’ కేమో నీతులు చెప్తారా!, గేమ్ చేంజర్కి(Game Changer) పాటించరా! అని ప్రశ్నించారు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్.. ఈ సంక్రాతి బరిలో నిలవడానికి సిద్ధమైంది. దీనిలో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ఈవెంట్ రాజమండ్రిలో శనివారం సాయంత్రం జరిగింది. ఆ ఈవెంట్కు వెళ్లి వస్తూ ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. రంగంపేట మండలం కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో ఐచర్ వ్యాన్ ఢీకొని మరణించారు. వారిద్దరిని కాకినాడకు చెందిన తోకడ చరణ్, ఆరవ మణికంఠగా గుర్తించారు. ఇదే విషయంపై అంబటి రాంబాబు(Ambati Rambabu) ‘ ఎక్స్’ వేదికగా స్పందించారు. "పుష్ప" కేమో నీతులు చెప్తారా !"గేమ్ చేంజర్' కి పాటించరా !@PawanKalyan— Ambati Rambabu (@AmbatiRambabu) January 6, 2025 గేమ్ ఛేంజర్ ఈవెంట్కు హాజరై తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు ఇద్దరు యువకులు. ఘటనా స్థలంలోనే ఆరవ మణికంఠ మృతి చెందగా.. తీవ్ర గాయాల పాలైన తోకడ చరణ్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశారు. తమ అభిమాన హీరోను చూసేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయారని మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. తాము ఆధారాన్ని కోల్పోయమంటూ బోరున విలపిస్తున్నారు.భర్త చనిపోవడంతో మణికంఠకు అన్ని తానే చదివించానని తల్లి రోదిస్తోంది,. తనతో కలిసి పండ్ల వ్యాపారం చేసుకుంటున్న చరణ్ను కోల్పోవడంతో తాము అన్నీ కోల్పోయినట్లే ఉందని అతని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.అల్లు అర్జున్ టార్గెట్గా వ్యవహారం నడిపారా?పుష్ప-2(Pushpa-2) బెనిఫిట్ షో సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు అందరికీ తెలిసిందే. ఆ సినిమా బెనిఫిట్ షోలో భాగంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతిచెందింది. అదే ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఫలితంగా దీనిపై పెద్ద వివాదమే చెలరేగింది. పుష్ప-2 హీరో అల్లు అర్జున్... సంధ్య థియేటర్కు బెనిఫిట్ షోకు రావడంతోనే ఇదంతా జరిగిందని అతనిపై కేసు కూడా నమోదైంది. ఒకవైపు ఈ కేసులో A-11గా ఉన్న అల్లు అర్జున్ విచారణ ఎదుర్కొంటున్నాడు. అల్లు అర్జున్కు రెగ్యులర్ బెయిల్ లభించినా ఈ కేసు వివాదం ఇంకా చల్లారలేదు. ప్రధానంగా అల్లు అర్జున్ టార్గెట్గా వ్యవహారం అంతా నడిచిందనే విమర్శలు కూడా వినిపించాయి.మరి గేమ్ ఛేంజర్ సంగతి ఏంటి?పుష్ప సినిమాకు సంబంధించి తెలంగాణలో ఒకరు ప్రాణాలు కోల్పోతే, గేమ్ ఛేంజర్ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే ఇద్దరు అసువులు బాసారు. ప్రీ రిలీజ్ ఈవెంట్కు వెళ్లి వస్తూ ఇద్దరు యువకులు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఒకవైపు ‘పుష్ప’ రచ్చ ఇంకా హాట్ హాట్గా ఉండగానే, గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను భారీగా జరపడాన్నిప్రశ్నిస్తున్నారు. గేమ్ ఛేంజర్ ఈవెంట్ సాయంత్రం సమయంలో జరగడంతో పాటు దానికి భారీగా ఫ్యాన్స్ సేకరణ జరిగిందనే అభిప్రాయాన్నివ్యక్తం చేస్తున్నారు పలువురు విశ్లేషకులు.పుష్ప ఘటన.. పవన్ మాటల్లో కొన్ని.. అల్లు అర్జున్ విషయంలో ఎక్కడో మానవతా ధృక్పథం లోపించిందన్నాడు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఘటన జరిగిన వెంటనే రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సింది. అది చేయకపోవడం వల్లే ఇంత జరిగింది. ఒకవేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోతే ఆయనపై కూడా ప్రజల్లో విమర్శలు వచ్చేవి. సీఎం హోదాలో రేవంత్ స్పందించారనే అనుకుంటున్నా. రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడే కాదు.. కింద స్థాయి నుంచి ఎదిగారు’ అని పవన్ అన్నారు.‘‘గేమ్ ఛేంజర్’ పరామర్శిస్తాడా?ఇ క్కడ కూడా విషాదమే చోటు చేసుకుంది. గేమ్ ఛేంజర్ ఆయా కుటుంబాల్ని పరామర్శిస్తాడా అనే ప్రశ్న తలెత్తోంది. ఆరోజు పవన్ మాటల్ని బట్టి చూస్తే.. రేవతి కుటుంబాన్ని అల్జు అర్జున్ పరామర్శించకపోవడాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఆ వివాదం పెద్ద అవడానికి కూడా అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడం కూడా ఒక కారణంగా చూపారు. మరి ఇప్పుడు రామ్ చరణ్ వెళ్లి. ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాల్సి పరామర్శించాలి కదా. వారి కుటుంబాలకైతే తక్షణ సాయం అయితే అందించారు కానీ వారి కుటుంబాల్ని వెళ్లి పరామర్శించాల్సిన బాధ్యత రామ్ చరణ్పై ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: ‘‘ఒరేయ్ పిచ్చోడా .. పవనన్న చెప్తాడంతే రా -
కేసు పెట్టింది అయ్యన్న పాత్రుడిపై.. పేరు మాత్రం వేరొకరిది..
-
హైకోర్టులో అంబటి వాదనలు
-
సోషల్ మీడియా పోస్టులపై అంబటి వాదనలు.. కౌంటర్పై పోలీసులకు ఆదేశాలు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియాలో వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ నాయకులు పెట్టిన పోస్టులపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు సవాల్ చేశారు. ఈ క్రమంలో ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేడు పిటిషన్పై విచారణ కొనసాగింది.ఈ సందర్బంగా హైకోర్టు అంబటి రాంబాబు తానే స్వయంగా వాదనలు వినిపించారు. వాదనల సందర్బంగా అంబటి..‘పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో సోషల్ మీడియాలో పెట్టిన అసభ్య పోస్టులపై ఐదుసారు ఫిర్యాదులు ఇచ్చాను. నా ఫిర్యాదులతో పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. దీంతో, పోలీసులు తరఫు న్యాయవాది వాదిస్తూ.. తమకు ఎలాంటి సమాచారం లేదని కోర్టుకు తెలిపారు. దీంతో, ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయమని పోలీసులు తరఫున న్యాయవాదిని ఆదేశించింది. నిన్న నాలుగు ఫిర్యాదులపై కేసు నమోదు చేసినట్లు సమాచారం ఇచ్చారని కోర్టుకు అంబటి రాంబాబు తెలిపారు.ఇదిలా ఉండగా.. అంబటి రాంబాబు పిటిషన్లోని కీలక అంశాలు ఇవే. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను కించపరుస్తున్నారు. నాపైన, నా కుటుంబ సభ్యులపైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టుల పైన పోలీసులకు వేరువేరుగా ఫిర్యాదులు ఇచ్చాను. నేను ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయలేదు. అధికార పార్టీ నేతలు ఫిర్యాదు చేస్తే ప్రతిపక్ష నాయకులపై వెంటనే కేసులు పెడుతున్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల పట్ల పోలీసుల వివక్షత చూపిస్తున్నారు. నా ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసేలా పోలీసులు ఆదేశించండి అని పేర్కొన్నారు. -
చంద్రబాబు మాటలకు అర్థాలే వేరులే: అంబటి
సాక్షి, గుంటూరు: చంద్రబాబు మాటలకు అర్థాలే వేరని.. ఆయన చెప్పేదొకటి చేసేదొకటి అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయాడు. అయినా నిజాయితీపరుడినని చెప్పుకుంటాడంటూ సెటైర్లు వేశారు‘‘ఆరు నెలల్లో లక్ష 20 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు. చంద్రబాబు విశ్వాస ఘాతకుడు. అబద్ధాలు చెప్పడంలో దిట్ట. అభివృద్ధిని పట్టించుకోకుండా ఆరు మాసాలుగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. పేర్ని నాని కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. మీ కక్ష సాధింపు చర్యలకు భయపడం. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు’’ అని అంబటి దుయ్యబట్టారు.‘‘నిప్పు లాంటి మనిషి అంటే తుప్పు లాంటి మనిషి అని అర్థం. ఎమ్మెల్యేను కొనడానికి చంద్రబాబు ప్రయత్నించిన విషయం అందరికి తెలిసిందే. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు కంటే గొప్ప నాయకుడు దేశంలోనే లేదు. విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. ఇచ్చిన హామీలను అమలు చేసే దాఖలాలు ఎక్కడైనా ఉందా?. సెకీ కేసులో ఏం లేదని తెలిసే చంద్రబాబు ఊరుకున్నారు. ఆరు మాసాల్లో కక్ష సాధింపు తప్పా అభివృద్ధి లేదు. ఐపీఎస్ల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అధికారం కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి చంద్రబాబు..గోడౌన్లో బియ్యం పోతే డబ్బులు కట్టించుకోవచ్చు. క్రిమినల్ కేసులు పెట్టడం ఏంటీ?. పేర్ని నాని భార్యను పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారించడం కక్ష సాధింపు కాదా..?. కక్ష సాధింపునకు భయపడే వ్యక్తులం కాదు. రెడ్బుక్లో పేర్లు రాసి అరెస్ట్ చేయడం కక్ష సాధింపు కాదా?. సెకి ఒప్పందం లడ్డూలా దొరికితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. సూపర్ సిక్స్ అట్టర్ ప్లాప్...చంద్రబాబు అబద్దాలన్నీ లెక్కిస్తే గిన్నీస్ బుక్ లో ఎక్కించవచ్చు. ధనవంతుడైన సీఎం చంద్రబాబు అని ఒక సంస్థ ప్రకటించింది. ఇది ఆయన అక్రమ సంపాదనకు నిదర్శనం. దేశంలో ఎక్కడా లేనంతగా ఎన్నికలను డబ్బుమయం చేసిన వ్యక్తి చంద్రబాబే’’ అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: ప్చ్.. Pawan Kalyan సీజ్ ద షిప్ -
‘చంద్రబాబు.. మీరు ఏనాడైనా ప్రాజెక్టుల గురించి పట్టించుకున్నారా?’
తాడేపల్లి : తన హయాంలో ఏనాడు ప్రాజెక్టుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu).. ఇప్పుడు కొత్తగా గోదావరి-బనకచర్లని కూడా తనదే అంటూ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu).ఈరోజు(మంగళవారం) తాడేపల్లి నుంచి మీడియాతో మాట్లాడిన అంబటి.. నదుల్లో ప్రవహించే ప్రతి నీటిబొట్టు భూమి మీదుకు రావాలని దివంగత మహానేత వైఎస్సార్ ఆశించారని, అందుకే పెద్ద ఎత్తున జలయజ్ఝాన్ని(Jalayagnam) ప్రారంభించారన్నారు. అటువంటింది ఇప్పుడు కొత్తగా గోదావరి-బనకచర్లని కూడా తనదే అంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. ఈ ప్రాజెక్టును మూడు దశల్లో పూర్తి చేయాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) ప్లాన్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా అంబటి గుర్తు చేశారు. కృష్ణా నదిలో నీరు సరిపడా రాకపోయినా గోదావరి నీటితో పల్నాడు, రాయలసీమకి ఉపయోగపడుతుందని జగన్ ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. దీనికి డీపిఅర్ కూడా జగన్ ప్రభుత్వమే తయారు చేసి కేంద్రానికి పంపిందన్నారు. కానీ చంద్రబాబు తానే చేసినట్టుగా ఏమాత్రం సిగ్గు పడకుండా చెప్పుకుంటున్నారని, చివరికి ఈ ప్రాజెక్టును కూడా ప్రయివేటు పరం చేయబోతున్నారని విమర్శించారు అంబటి.చివరికి సాగునీటి ప్రాజెక్టులను కూడా ప్రయివేటు పరం చేయటాన్ని ఇప్పుడే చూస్తున్నామన్నారు. ఇది జల హారతి కాదని, చంద్రబాబు హారతి అని అంబటి ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇప్పటికే పోర్టులు మెడికల్ కాలేజీలు, రోడ్లను ప్రయివేటు పరం చేశారన్నారు. రౌడీయిజం అంతా చంద్రబాబు మనుషులే చేస్తున్నారురాష్ట్రంలో రౌడీయిజం అంతా చంద్రబాబు మనుషులే చేస్తున్నారన్నారు. కొందరు పోలీసులు కూడా రౌడీయిజం చేస్తున్నారన్నారని అంబటి మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఎంతోకాలం నిలవదనే గుర్తు పెట్టుకోవాలన్నారు. చంద్రబాబు ధనిక ముఖ్యమంత్రి అని, రెండు ఎకరాల నుండి వేల కోట్లు ఎలా సంపాదించాడని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ప్రజా ఉద్యమాలు త్వరలో రావడం తథ్యమన్నారు. -
చంద్రబాబుని ఇమిటేట్ చేసిన అంబటి రాంబాబు
-
అంబటి సెటైర్లు.. ఇక కాసుకో చంద్రబాబు..
-
ఐటీడీపీ పోస్టులపై హైకోర్టులో అంబటి రాంబాబు పిటిషన్
అమరావతి, సాక్షి: ఐటీడీపీ అనుచిత పోస్టుల వ్యవహారంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని.. కేసులు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని ఆయన తన పిటిషన్లో న్యాయస్థానాన్ని కోరారు.‘‘ఐటీడీపీ(iTDP)లో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కించపరుస్తున్నారు. నాపై , నాకుటుంబ సభ్యులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేం ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు ఒక్క కేసు నమోదు చేయలేదు. మాపై వివక్ష ప్రదర్శిస్తున్నారు’’ అని అంబటి పిటిషన్లో పేర్కొన్నారు. తన పిటిషన్ ఆధారంగా.. కేసులు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలువ్వాలని పిటిషన్ ద్వారా అంబటి కోరారు. ఈ పిటిషన్పై స్వయంగా ఆయనే వాదనలు వినిపించనున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే.. ఐటీడీపీ, టీడీపీ అనుబంధ పేజీల్లో వైఎస్ జగన్(YS Jagan)పై, తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఆయన పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అయితే అటు నుంచి ఎలాంటి స్పందన ఉండడం లేదు. దీంతో తాజాగా ఆయన పట్టాభిపురం పీఎస్ వద్ద నిరసన తెలిపారు. అయితే న్యాయం చేయకపోగా.. అంబటిపైనే పోలీసులు తిరిగి కేసు నమోదు చేయడం గమనార్హం.ఇదీ చదవండి: ఉన్న ఉద్యోగం పీకేసి.. అయినవాళ్ల కోసం! -
‘నిరుద్యోగుల సంఖ్యను పెంచేస్తున్న చంద్రబాబు!’
గుంటూరు, సాక్షి: ఏపీ సీఎం చంద్రబాబు సంపద సృష్టించడం లేదు.. దోచుకుంటున్నారని, ప్రభుత్వ రంగంలోకి సంస్థలను అమ్మేసి దండుకుంటున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) అన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై మంగళవారం సాయంత్రం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘కూటమి నేతలు ఎన్నికల సమయంలో ఎన్నో హామీలిచ్చారు. ‘ఓటేయండి తమ్ముళ్లు’ అంటూ వేడుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారు. ప్రజలపై చంద్రబాబు కసి తీర్చుకున్నారు. ‘బాదుడే బాదుడు..’ అంటూ రూ. 15 వేల కోట్ల విద్యుత్ ఛార్జీలు భారం మోపారు. ఇదేనా సంపద సృష్టి.. ఇదేనా ఆదాయం పెంచడం?’’ అని అంబటి ప్రశ్నించారు . .. రాష్ట్ర ఆదాయం పడిపోయింది. రాజధాని పేరుతో 31 వేల కోట్ల అప్పులు చేస్తున్నారు. అప్పు కోసం చిప్ప పట్టుకుని తిరుగుతున్నారు. అప్పులతోనే చంద్రబాబు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఆనాడు స్మార్ట్ మీటర్లపై తప్పుడు ప్రచారం చేశారు. స్మార్ట్ మీటర్లను పగలగొట్టమని రెచ్చగొట్టారు. ఇప్పుడు మళ్లీ స్మార్ట్ మీటర్లు బిగించే కార్యక్రమం మొదలుపెట్టారు అని అంబటి మండిపడ్డారు... వైఎస్సార్సీపీ(YSRCP) హయాంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాం. మా హయాంలో 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాం. 1.34 లక్షల మందికి గ్రామ, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేశాం. కానీ, చంద్రబాబు అధికారంలోకి వస్తే ఉద్యోగాలు సృష్టించి ఇస్తామన్నారు. లేదంటే నిరుద్యోగ భృతిని ఇస్తామన్నారు. అయితే.. ఇప్పుడు చంద్రబాబు ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారు. వలంటీర్లను పక్కన పెట్టి.. వెల్త్ వర్కర్లను తొలగించారు. ఇప్పుడు ఫైబర్ నెట్ కార్పొరేషన్ నుంచి ఏకంగా 400 మందిని తొలగించారు. చంద్రబాబు ఏపీలో నిరుద్యోగుల సంఖ్యను పంచేస్తున్నారు. కానీ నిరుద్యోగ భృతిని మాత్రం ఇవ్వడం లేదు’’ అని అంబటి అన్నారు.ఇదీ చదవండి: మన కేసులు ఎత్తేద్దాం! -
ఇదేం బాదుడు బాబు...
-
‘హామీలు ఇచ్చి మర్చిపోవడం చంద్రబాబుకి అలవాటే’
సాక్షి,గుంటూరు : కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ చార్జీల పెంపు ద్వారా రాష్ట్ర ప్రజలపై ఏకంగా రూ.15,485 కోట్ల భారాన్ని మోపింది. ఛార్జీల పెంపునకు నిరసనగా వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ పోరుబాట కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి పార్టీ నేతలు వైఎస్సార్సీపీ పోరుబాట పోస్టర్ను ఆవిష్కరిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం గుంటూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో ‘విద్యుత్ చార్జీల బాదుడుపై వైఎస్సార్సీపీ పోరుబాట’ పేరుతో పోస్టర్ను ఆవిష్కరించింది. పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, నూరి ఫాతిమాలు పాల్గొన్నారు. పోస్టర్ ఆవిష్కరణ అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఈనెల 27న రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించనున్నాం. ఆరు నెలల క్రితం ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది. వైఎస్సార్సీపీ పాలనలో విద్యుత్ ఛార్జీలు పెంచారని తాము అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచమని చెప్పారు. ఛార్జీలు తగ్గిస్తామన్నారు. కానీ భారీ మొత్తంగా విద్యుత్ ఛార్జీలు పెంచారు. రెండు నెలల్లో రూ. 15484 కోట్ల భారం మోపారు. కూటమి నేతలకు రాష్ట్ర ప్రజలకు శఠగోపం పెట్టారు. ఏరు దాటాక తెప్ప తగలేయడం, ఎన్నికలకు ముందు హమీలివ్వడం.. ఆ తర్వాత వాటిని మర్చిపోవడం చంద్రబాబుకు అలవాటేనని ఎద్దేవా చేశారు.ప్రజలు అండగా వైఎస్సార్సీపీ పోరు బాట : భూమన వైఎస్సార్సీపీ పోరు బాట పోస్టర్ను ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. చంద్రబాబు ,పవన్ కళ్యాణలు ఎన్నికలకు ముందు విద్యుత్ భారాన్ని మోపమని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు. రెండు విడతలగా 15 వేల కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల భారం మోపారు. సూపర్ సిక్స్లో ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రతి నెలా డైవర్ట్ చేస్తున్నారు.ప్రతి పేదవాడి ఇంటికి 200యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి. అబద్దపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు ఒక్క హామీని నెరవేర్చలేదు. ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపి, ధరలు పెంచి వారి నడ్డివిరుస్తోంది కూటమి ప్రభుత్వం. ప్రజల పక్షాన పోరాడేందుకు వైఎస్సార్సీపీ ఉంటుంది. గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ విధంగా పోరాటాలు చేశారో.. అదే విధంగా మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం.మూడు లక్షల కోట్లు రూపాయలు ప్రజలకు నేరుగా అందించిన ఘనత వైఎస్ జగన్దే. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ఆందోళన చేపడతాం. డిసెంబర్ 27వ తేదీ విద్యుత్ కార్యాలయాల్లో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై వినతి పత్రాన్ని ఇస్తాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. -
YS జగన్ బర్త్ డే వేడుకలో అంబటి రాంబాబు
-
Ambati Rambabu: మాపై కక్ష తీర్చుకోవడానికే లోకేష్ ..
-
‘లోకేష్ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారా?’
గుంటూరు, సాక్షి: ఏపీలో పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్న పోలీసుల తీరును వైఎస్సార్సీపీ ఎండగడుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో అక్రమ అరెస్టులు చేస్తున్న ఖాకీలు.. వైఎస్సార్సీపీ ఫిర్యాదులను మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. సోషల్ మీడియా ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంబటి నిరసన చేపట్టారు. ‘‘మా ఫిర్యాదులపై చర్యలు తీసుకోరా?..’’ అంటూ ఫ్లెక్సీలు చేతిలో పట్టుకుని నేతలతో కలిసి పీఎస్ మెట్ల మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారాయన. తమ ఫిర్యాదులపై ఎప్పుటిలోగా కేసులు నమోదు చేస్తారో? చెప్పాలంటూ పోలీసులను కోరుతూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో.. వైఎస్సార్సీపీ నేతల డిమాండ్లతో దిగొచ్చిన పోలీసులు.. ఈ నెల 21లోగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో.. వైఎస్సార్సీపీ నేతలు తమ నిరసన విరమించుకున్నారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడారు.. ‘‘పట్టాభిపురం పీఎస్ ఎదుట నిరసన తెలియజేశాను. జగన్ తో పాటు నా కుటుంబంపై కూడా సోషల్ మీడియాలో ద్రుష్ప్రాచారం చేయడంపై ఫిర్యాదు చేశాం. మా ఫిర్యాదులపై కూడా ఇప్పటివరకు కేసులు నమోదు చేయలేదు. పోలీసులే చట్టాన్ని ధిక్కరిస్తున్నారు. లోకేష్ నుండి ఆదేశాలు కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. మా కార్యకర్త ప్రేమ్ కుమార్ ను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. మాపై కక్ష తీర్చుకోవడానికే లోకేష్ చట్టాలను ఉపయోగించుకుంటున్నారు. కానీ, చట్టం ప్రకారం పోలీసులు నడుచుకోవాలి. మా ఫిర్యాదులపై కేసులు నమోదు చేయకపోతే మరోసారి మా నిరసన తెలియజేస్తాం. మేము చట్టబద్దంగానే వ్యవహరిస్తున్నాం. న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. మాపై సోషల్ మీడియా లో పోస్టింగ్స్ పెట్టిన వారిపై చర్యలు తీసుకునేంత వరకూ మా పోరాటం ఆగదు. తిరిగి ఎప్పుడైనా నిరసన తెలియజేస్తాం అని హెచ్చరించారాయన. -
చంద్రబాబు అవగాహనాలేమి వల్లే పోలవరం ఆలస్యం: అంబటి రాంబాబు
సాక్షి,తాడేపల్లి:చంద్రబాబు అవగాహనారాహిత్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని వైఎస్సార్సీపీ సీనియర్నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. సోమవారం(డిసెంబర్16) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.‘పోలవరంపై చంద్రబాబు అసత్యాలు మాట్లాడుతున్నాడు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి అసలు కారణం ఎవరు. కాఫర్డ్యామ్ నిర్మించకుండా డయాఫ్రమ్వాల్ కడతారా? చంద్రబాబుకు పోలవరం ఏటీఎం అని ప్రధాని మోదీ అనలేదా. టీడీపీ అవినీతి చేసిందని సాక్షాత్తూ ప్రధాని మోదీ పార్లమెంట్లో అనలేదా. 2018లోనే చంద్రబాబు పోలవరం పూర్తి చేస్తామన్నారు..అప్పుడెందుకు పూర్తి చేయలేకపోయారు?కేంద్రం రూ.12,157 కోట్లు విడుదల చేయడానికి వైఎస్సార్సీపీయే కారణం లోయర్కాఫర్ డ్యామ్, అప్పర్ కాఫర్ డ్యామ్ పూర్తి చేసింది మేమే. పోలవరం కీలక పనులు మా హయాంలోనే పూర్తయ్యాయి’అని అంబటి చెప్పారు. -
అల్లు అర్జున్ చేసిన తప్పేంటి..? అరెస్ట్ పై అంబటి రియాక్షన్
-
ధాన్యం కొనుగోలుపై చేతులెత్తేసిన కూటమి
-
కలెక్టర్లపై అరవడం కాదు ..మీదేగా ప్రభుత్వం..పవన్ పై అంబటి ఫైర్
-
కూటమి ప్రభుత్వంలో ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు...
-
పోలీసుల పేరుతో అర్ధరాత్రి హల్చల్.. వైఎస్సార్సీపీ ప్రేమ్ కుమార్ ఎక్కడ?
సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో అక్రమ కేసుల్లో అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలను, సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా గుంటూరులో సోషల్ మీడియా కార్యకర్తను అర్ధరాత్రి తీసుకువెళ్లడం తీవ్ర కలకలం సృష్టించింది. దీనిపై పోలీసులు సమాచారం ఇవ్వాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా ట్విట్టర్ వేదికగా అరెస్ట్ వీడియోను షేర్ చేశారు. ఈ సందర్భంగా అంబటి..‘గుంటూరుకి చెందిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త కొరిటిపాటి ప్రేమ్ కుమార్ను ఎవరో తీసుకెళ్లారు. అర్ధరాత్రి మూడు గంటలకు వచ్చి పోలీసులు అని చెప్పి.. ప్రేమ్ కుమార్ను తమ వెంట లాక్కెళ్లారు. ఈ ఘటనపై తక్షణమే పోలీసు డిపార్ట్మెంట్ ప్రేమ్ కుటుంబానికి సమాచారం ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు.ఇక, ఈ వీడియోలో కొందరు వ్యక్తులు ప్రేమ్ కుమార్కు తీసుకువెళ్తున్నారు. వారిలో ఏ ఒక్కరూ పోలీస్ యూనిఫామ్ ధరించకపోవడం గమనార్హం. మరోవైపు.. ప్రేమ్ కుమార్ను తీసుకున్న సమయంలో ఆయన కుటుంబ సభ్యులు వారిని అడ్డుకున్నప్పటికీ వారు పట్టించుకోలేదు.ఈ సందర్బంగా తెలుగుదేశం నాయకులపైన పోస్టులు పెడతావా? అంటూ ప్రేమ్ కుమార్ను బలవంతంగా లాక్కెళ్లినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రేమ్ కుమార్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు అన్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో ప్రేమ్ కుమార్ను బలవంతంగా ఎవరో తీసుకువెళ్లారని పోలీసులకు ఫిర్యాదుకు చేశారు. ఆయనకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు.. ప్రేమ్ కుమార్కు వైఎస్సార్సీపీ నేతలు అండగా నిలిచారు. గుంటూరుకి చెందిన వైసిపి సోషల్ మీడియా కార్యకర్త కొరిటిపాటి ప్రేమ్ కుమార్ ని రాత్రి 3 గంటలకి పోలీసులని చెప్పి తీసుకువెళ్ళారు తక్షణమే పోలీసు డిపార్ట్మెంట్ ఆ కుటుంబానికి సమాచారం ఇవ్వాలి@Anitha_TDP @APPOLICE100 @dgpapofficial @police_guntur pic.twitter.com/k6kxGtOLqJ— Ambati Rambabu (@AmbatiRambabu) December 12, 2024ఇది కూడా చదవండి: మేడం చెప్పారు.. స్టేషన్కు రండి -
గుంటూరు జిల్లాలో ధాన్యాన్ని ఎక్కడ కొనుగోలు చేశారో చెప్పాలి: అంబటి
-
నాదెండ్ల.. కొల్లిపర ఎక్కడో తెలుసా?: అంబటి రాంబాబు
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి సర్కార్ పని తీరుపై మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పంట కొనుగోలు విషయంలో రైతులను మోసం చేస్తూ.. వారిని ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ప్రతి గింజా ప్రభుత్వమే కొంటుందన్న పౌర సరఫరా శాఖా మంత్రి ఏమైపోయారని ప్రశ్నించారు.ధాన్యం కొనుగోళ్ళ పనితీరుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఈ క్రమంలో అంబటి ట్విట్టర్ వేదికగా..‘నేను సందర్శించి తెలుసుకున్న సత్యం!. కొల్లిపర మండలంలో వరి సాగు విస్తీర్ణం 13,500 ఎకరాలు. ధాన్యం దిగుబడి 31వేల మెట్రిక్ టన్నులు. ప్రభుత్వం కొన్న ధాన్యం 1500 మెట్రిక్ టన్నులు. ప్రతీ గింజా ప్రభుత్వమే కొంటుందన్న పౌర సరఫరా శాఖా మంత్రి గారి నియోజకవర్గంలోనిదే ఈ కొల్లిపర!’ అంటూ కామెంట్స్ చేశారు.నేను సందర్శించి తెలుసుకున్న సత్యం!కొల్లిపర మండలం: వరి సాగు విస్తీర్ణం: 13,500 Acresధాన్యం దిగుబడి :31000 MTప్రభుత్వం కొన్న ధాన్యం : 1500 MTప్రతి గింజా ప్రభుత్వమే కొంటుందన్న పౌర సరఫరా శాఖా మంత్రి గారి నియోజకవర్గంలోనిదే ఈ కొల్లిపర !@ncbn @mnadendla— Ambati Rambabu (@AmbatiRambabu) December 10, 2024 -
అన్నదాతకు అండగా YSRCP పోస్టర్ విడుదల
-
అది పోయే ఇది పోయే అన్నదాత సుఖీభవపై అంబటి సెటైర్లు
-
‘అన్నదాతకు అండగా వైఎస్సార్సీపీ’..పోస్టర్ ఆవిష్కరించిన నేతలు
సాక్షి,తాడేపల్లి:అన్నదాతకు అండగా వైఎస్సార్సీపీ నినాదంతో ఈనెల 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి,రుహుల్లా తదితరులతో కలిసి అంబటి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ‘అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లకు వెళ్లి వినతిపత్రాలు ఇస్తాం. వరి రైతులను ఆదుకోవాలనేది మా నినాదం. రాష్ట్రంలో వరి వేసిన రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. మంగళగిరిలో రాసులుగా పోసిన ధాన్యాన్ని చూసి రైతులతో మాట్లాడా. ఈ ఏడాది అకాల వర్షాలతో రైతులు చాలా నష్టపోయారు.ధాన్యం దిగుబడి తగ్గిపోయింది. రైతులకు కనీస మద్దతుధర దక్కడం లేదు.మంత్రి నాదెండ్ల ప్రతీ గింజా ప్రభుత్వమే కొంటుందని చెప్పారు.ఒక్క మెసేజ్ పెడితే ధాన్యం కొనేస్తామన్నారు. రెండు రోజులైనా రైతులు హాయ్ పెట్టినా..ఫోన్లు చేసినా ఎవరూ స్పందించడం లేదు. ప్రభుత్వం ధాన్యం కొనడం లేదు.దళారులు ఎంటరైపోతున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకే ధాన్యం కొంటున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కనీస మద్దతు ధరకంటే ఎక్కువకే ధాన్యాన్ని కొన్నాం.ఈ ప్రభుత్వంలో కనీస మద్దతు ధర కూడా రావడం లేదు. వానల భయంతో రైతులు ఎంతో కొంతకు ధాన్యం అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. రైతులకు అండగా నిలవాలని వైఎస్ జగన్ ఆదేశించారు. చంద్రబాబు ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం.రైతులకు 20 వేలు ఇస్తామన్నారు కానీ నయాపైసా ఇవ్వలేదు. రైతుల వద్ద ధాన్యం కొంటే ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. ధాన్యం కొని రైతులను ఆదుకోవాలి’అని అంబటి డిమాండ్ చేశారు. -
ఏపీ పోలీసులపై అంబటి రాంబాబు ఫైర్
-
అయ్యన్న పాత్రుడు పై అంబటి రాంబాబు ఫైర్
-
మా ఫిర్యాదులపై చర్యలు తీసుకోరా?
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): కూటమి ప్రభుత్వంలో చట్టం టీడీపీ వారికి ఒకలా, వైఎస్సార్సీపీ వారికి మరోలా అన్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులతో పాటు తనపై, తన కుటుంబ సభ్యులపై మంత్రి లోకేశ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇతర టీడీపీ నేతల ప్రోద్బలంతో ఆ పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని, వాటిపై చర్యలు తీసుకోవాలని గత నెల పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కేసు నమోదు చేయాలి.. ‘బీఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం ఫిర్యాదు చేసిన 14 రోజుల్లో కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. అది తప్పుడు ఫిర్యాదు అయితే దానిని తప్పుడు ఫిర్యాదు అని ధ్రువీకరించాల్సి ఉంటుంది. కానీ, గుంటూరు పోలిసులు మా ఫిర్యాదులపై ఎలాంటి కేసులు నమోదుచేయకుండా చట్టాన్ని ఉల్లంఘించారు. జిల్లా ఎస్పీని కలిసి కిందిస్థాయి పోలీస్ సిబ్బంది మా ఫిర్యాదులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. మీరైన చర్యలు తీసుకోవాలని కోరాం.ఇక టీడీపీ నేతలు, కార్యకర్తలు ఫిర్యాదుచేస్తే దర్శకులు రాంగోపాల్వర్మ, పోసాని కృష్ణమురళిపై కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్లపైనా కేసులు నమోదుచేసి వారిని జైళ్లల్లో కూడా పెట్టారు. మాజీ మంత్రిని అయిన నేను స్వయంగా ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎందుకు పట్టించుకోవడంలేదు? దీనిపై కోర్టులను ఆశ్రయిస్తాం. పోలీసుల తీరును వ్యవస్థలు గమనించాలని శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యాం.ఈ నిరసన స్థానిక పోలీసుస్టేషన్ల వద్దగాని, ఎస్పీ కార్యాలయం వద్దగాని, డీజీపీ కార్యాలయం వద్దగాని ఉంటుంది. పోలీసులు మా ఫిర్యాదులపై స్పందించకపోతే మా ముఖ్య నాయకులతో కలిసి ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుత నిరసన తెలియజేస్తాం. అలాగే, చట్టబద్ధంగా పోరాటం చేస్తాం’ అని అంబటి చెప్పారు. సమావేశంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ గుంటూరు జిల్లా అధ్యక్షులు సీడీ భగవాన్, పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి పోలూరి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ ఫిర్యాదులపై పోలీసులు స్పందించరేం?.. అంత్యరమేంటి?: అంబటి
సాక్షి, గుంటూరు: లోకేష్ ఆధ్వర్యంలోనే వైఎస్ జగన్ ఫొటోలను మార్ఫింగ్ చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ సోషల్ మీడియాపై పట్టాభిపురం పీఎస్లో ఫిర్యాదు చేశానని తెలిపారు. టీడీపీ సోషల్ మీడియాలో నా కుటుంబ సభ్యులపై కూడా అసభ్యపోస్టులు పెట్టారని.. టీడీపీపై తాను ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసుల ఇప్పటివరకు స్పందించలేదన్నారు. వైఎస్సార్సీపీ ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు ఇప్పటివరకు కేసు రిజిస్టర్ చేయలేదని.. చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు. టీడీపీ నేతలు వైఎస్సార్సీపీపై ఫిర్యాదు చేస్తే పోలీసులు వెంటనే అరెస్టుల చేయడంలో అంత్యరమేంటి? అని ఆయన ప్రశ్నించారు. పోలీసుల తీరుపై శాంతియుతంగా నిరసన చేస్తామని అంబటి తెలిపారు.ఇదీ చదవండి: సెజ్ భూములు తిరిగిచ్చిన ఏకైక సీఎం జగన్ -
మంత్రి వంగలపూడి అనితకు అంబటి అదిరిపోయే కౌంటర్
-
సీమ రాజాను వదిలే ప్రసక్తే లేదు: Ambati Rambabu
-
చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది
-
దొడ్డిదారిన కేవీరావుకు కట్టబెట్టి.. ఎందుకీ డ్రామాలు?: అంబటి
సాక్షి, తాడేపల్లి: కాకినాడ సీపోర్టుపై చంద్రబాబు తన అనుకూల మీడియాతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని.. ఏదో జరిగిపోయిందంటూ కట్టు కథలు రాయిస్తున్నారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం అనేక వాగ్ధానాలు ఇచ్చారని.. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని దుయ్యబట్టారు.‘‘చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అబద్ధాలతో ప్రజలను నమ్మించాలని ప్రయత్నిస్తునారు. ఈనాడు మోసపూరిత పత్రిక. తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి ఫైనాన్స్పై కేసు నడుస్తోంది. చంద్రబాబు బ్లాక్మెయిల్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైఎస్ జగన్కు సన్నిహితంగా ఉన్నవాళ్లపై కక్ష సాధిస్తున్నారు.’’ అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.‘‘పవన్ కల్యాణ్ పీడీఎస్ రైస్ పట్టుకుంటానన్నారు.. ఎందుకు పట్టుకోలేదు. పవన్ను చంద్రబాబు వాడుకుంటున్నారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు బినామీ కేవీరావు అని పవన్ మాట్లాడారు. చెప్పింది చేయడం బాబుకు అలవాటు లేదు. బెల్టు షాపు తెస్తే బెల్టు తీస్తానన్నాడు.. గాలికొదిలేశాడు. ఏపీలో దోపిడీ రాజ్యం నడుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దోపిడీ చేయడమే పనిగా పెట్టుకున్నారు. కేవీరావును అడ్డుగా పెట్టుకుని దోపిడీ చేస్తున్నారు. దొడ్డిదారిన కేవీరావుకు పోర్టును కట్టబెట్టింది నిజం కాదా?. ఇప్పుడు కేవీరావును అడ్డంపెట్టుకుని డ్రామాలాడుతున్నారు.’’ అంటూ అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు.ఇదీ చదవండి: ఓరి మీ యేశాలో!.. కాకినాడ పోర్టు కబ్జాకు బాబు, పవన్ ఎత్తులు..రైతాంగ సమస్యలపై కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈనెల 11నుంచి 13కి వాయిదా వేశాం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. తిరుమల లడ్డూ విషయంలో రద్దాంతం చేసి టీడీపీ అభాసుపాలయింది. ఇప్పుడు కాకినాడ సెజ్ మీద పడ్డారు. వైవీ సుబ్బారెడ్డి కుమారుడు బెదిరించి పోర్టుని లాక్కున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పచ్చమీడియాలో ఇష్టం వచ్చినట్లు రాయించుకుంటున్నారు..కేవీరావు గొంతు మీద కత్తి పెట్టి పోర్టును రాయించుకున్నట్టు ఈనాడు కట్టు కథలు రాసింది. ఈనాడు పత్రిక మోసపూరితంగా పుట్టింది. అవినీతి పుత్రిక ఈనాడు. అలాంటి పత్రికలో సాయిరెడ్డి మీద దారుణమైన వార్తలు రాస్తున్నారు. చంద్రబాబుకు ఆస్తుల సంపాదనపై దాహం తీరలేదు. అందుకే ఇతరుల ఆస్తులను కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు చక్కగా వాడుకుంటున్నారు. గతంలో కేవీరావు గురించి పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అంటూ కామెడీ డైలాగు వేశారుచంద్రబాబు తన అధికారంతోపాటు వేలాది కోట్లను లోకేష్ కి అందించాలని చూస్తున్నారు. ఏపీలో అవినీతికి పాల్పడని టీడీపీ ఎమ్మెల్యేనే లేడు. ప్రతిపనిలోనూ అడ్డంగా దోచుకుంటున్నారు. కానీ చంద్రబాబు మాత్రం మీడియా ముందు భీకర మాటలు మాట్లాడుతున్నారు. అవినీతి జరిగితే సహించనంటూ బడాయి మాటలు మాట్లాడుతున్నారు. కానీ జరిగేదంతా అవినీతి, దోపిడీలే. పయ్యావులకేశవ్ వియ్యంకుడు కాకినాడ పోర్టులో రారైస్ బిజినెస్ చేస్తున్నారు. ఆ విషయాన్ని నిరూపించటానికి మేము సిద్ధం. ఆయన చేసే దోపిడీని కప్పిపుచ్చేందుకు పయ్యావుల కేశవ్ ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆయనకు చెందిన షిప్ని సైలెంట్గా వదిలేశారు..కాకినాడ పీర్టులో అరబిందో షేర్లు చట్టబద్దమైనవి. కానీ పోలీసులతో అక్రమ కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారు. గంజాయి మీద ఈగల్ దర్యాప్తు, బియ్యం మీద, తిరుపతి లడ్డూల మీద సిట్లు అంటూ చంద్రబాబు హడావుడి చేస్తున్నారు. అంతకుమించి రాష్ట్రంలో ప్రజాపాలనే జరగటం లేదు. లోకేష్ డబ్బులు లెక్కలేసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మీడియా ముందు హడావుడి చేస్తున్నారు. పోలీసులతో ప్రభుత్వాన్ని నడపటం కలకాలం జరగదు’’ అని అంబటి రాంబాబు నిలదీశారు. -
Ambati: DGP నుంచి SI వరకు YSRCPపై అక్రమ కేసులు పెడుతున్నారు
-
నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఫేక్ పోస్టులు: అంబటి రాంబాబు
సాక్షి,గుంటూరు: కూటమి ప్రభుత్వ పెద్దలపై మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఫైరయ్యారు. కూటమి నేతల ఆధ్వర్యంలో సోషల్మీడియాలో వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.శుక్రవారం(డిసెంబర్ 6)పట్టాభిపురం పోలీస్స్టేషన్ వద్ద అంబటి మీడియాతో మాట్లాడారు.‘టీడీపీ సోషల్మీడియాపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. లేదంటే కోర్టులను ఆశ్రయిస్తాం’అని అంబటి హెచ్చరించారు. అంబటి రాంబాబు ఇంకా ఏమన్నారంటే.. ఇవాళ గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో రెండు ఫిర్యాదులిచ్చాంనామీద, మా పార్టీ అధినేత వైఎస్ జగన్ గారి మీద టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా అసభ్యకర పోస్టులు పెడుతున్నారుజై టీడీపీ అనే ట్విట్టర్ పేజీలో వైఎస్ జగన్ గారి మార్ఫింగ్ చేసిన ఫోటోలు పెడుతున్నారుమా నాయకుడిని అవమానించే విధంగా పోస్టులు పెడుతున్నారుసీమరాజు అనే వ్యక్తి మా వైఎస్సార్సీపీ కండువా వేసుకొని మమ్ములను పచ్చి బూతులు తిడుతున్నారుఈ పోస్టింగులపై యాక్షన్ తీసుకోవాలని ఫిర్యాదు చేశాం.ఈ పోస్టులతో మా మనోభావాలు దెబ్బతింటున్నాయిడీజీపీ నుంచి ఎస్ఐ వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై అక్రమ కేసులు పెడుతున్నారుసీమరాజు ఇకనైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలినారా లోకేష్ సృష్టించిన రోబో సీమరాజునారా లోకేష్ ఆధ్వర్యంలోనే సీమరాజు ఇండస్ట్రీ మాదిరిగా స్టూడియో పెట్టుకొని సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీపై రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారువైఎస్ జగన్ గారు వారి సతీమణి భారతి గారి మీద కూడా అసభ్యంగా పోస్టులు పెడుతున్నారుతక్షణమే పోలీసులు సీమరాజు మీద యాక్షన్ తీసుకోకుంటే కోర్టుకు వెళ్తాం14 రోజుల అనంతరం ప్రైవేట్ కేసులు వేస్తాంహైకోర్టు, అక్కడ న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తాంభయపడి వెనకడుగు వేసే ప్రసక్తే లేదుచట్ట ప్రకారం వ్యవహరించాలని డీజీపీకి విజ్ఞప్తి చేస్తున్నాంచట్టాలు వాటి పని అవి చేసుకునే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉందిగత నెల 18, 19 తేదీలలో గుంటూరు నగరంలోని అనేక పోలీస్ స్టేషన్లలో సోషల్ మీడియా పోస్టులపై ఫిర్యాదులు చేశాంఇంతవరకు కేసులు నమోదు చేయలేదు.. మాకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది న్యాయం జరిగే వరకూ చట్ట ప్రకారం ముందుకు వెళ్తాం -
కూటమి నేతలపై అంబటి రాంబాబు ఫైర్
-
సజ్జల భార్గవ్ రెడ్డి డ్రైవర్ పై పోలీసులు తప్పుడు కేసులు.. అంబటి స్ట్రాంగ్ కౌంటర్
-
Ambati Rambabu: సీజ్ చేసిన షిప్ నే మల్లి సీజ్
-
‘నాదెండ్ల వాస్తవాలు తెలుసుకో.. పీడీఎస్ బియ్యం మంత్రి వియ్యంకుడిదే’
సాక్షి, గుంటూరు: కాకినాడలో పట్టుకున్న పీడీఎస్ బియ్యం మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడిదే.. మంత్రి నాదెండ్ల మనోహార్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టు గురించి అభద్రతా భావంతో మాట్లాడుతున్నారని కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ..‘సీజ్ చేసిన షిప్నే మళ్లీ సీజ్ చేయడమేంటి?. కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున బియ్యం ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి కాకినాడ పోర్టుకు బియ్యం వస్తుంది. కాకినాడ యాంకరేజ్ పోర్టుపై వేల కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. కాకినాడ పోర్టు నుంచి పీడీఎస్ బియ్యం తరలివెళ్లడం ఈనాటిది కాదు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టు గురించి అభద్రతా భావంతో మాట్లాడుతున్నారు.అక్రమాలను అడ్డుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. చంద్రబాబు హాయాంలోనే అక్రమాలు జరిగాయి. వైఎస్సార్సీపీపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పవన్, నాదెండ్ల మనోహర్ చేతకాని మాటలు మాట్లాడుతున్నారు. చెక్పోస్టులు ఉండగా.. పీడీఎస్ బియ్యం ఎలా తరలిపోతుంది?. అధికారం పవన్ కల్యాణ్ చేతిలోనే ఉంది కదా?. వైఎస్ జగన్పై బురద జల్లడానికి కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. కాకినాడలో పట్టుకున్న పీడీఎస్ బియ్యం మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడిదే. మంత్రి నాదెండ్ల మనోహార్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలి. పట్టాభి ఆగ్రో సంస్థ ద్వారా బియ్యం తరలి వెళ్తోంది. జనసేనకు చెందిన వారంతా పౌర సరఫరాల శాఖలోనే ఉన్నారు. జనసేన నేతలు కుమ్మకైపోయి అవినీతికి పాల్పడుతున్నారు’ అని ఆరోపించారు. -
చంద్రబాబుపై అంబటి రాంబాబు ఫైర్
-
ఇసుక ఫ్రీ ఫ్రీ ఫ్రీ..
-
Ambati Rambabu: లోకల్ ఎమ్మెల్యే టాక్స్.. క్యాష్ కొట్టందే పని కాదు
-
ఏపీ అంతటా కొత్తగా ఎల్ఎం ట్యాక్స్! లేకుంటే పని జరగదు!!: అంబటి
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, అవినీతి, దోపిడీలపైనే కూటమి నేతలంతా దృష్టి పెడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తాజా పరిణామాలపై శనివారం సాయంత్రం గుంటూరు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘సంపద సృష్టించడం కంటే సంపద సృష్టించుకుంటాం.. అంతా మేమే దోచుకుంటాం’’ అన్నట్లుంది వాళ్ల తీరు ఉందని సెటైర్లు వేశారు. ఈ క్రమంలో పవన్ కాకినాడ పోర్టు పర్యటనపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులు వచ్చాయి. మద్యం షాపులకు లాటరీలు పెట్టారు. కానీ, మద్యం షాపులు దక్కించుకున్న వారిని బెదిరించి వాటాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీ లేదు. కూటమి నేతలు ఇసుకను దోచుకుంటున్నారు. చివరకు బూడిద కోసం కూడా కొట్టుకుంటున్నారు. ఆది నారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి బూడిద కోసం కొట్టుకుంటున్నారు. అక్రమార్జన కోసం టీడీపీ నేతలు వెంప్లరాడుతున్నారు. అవినీతి చేయడానికి కూటమి నేతలు పోటీ పడుతున్నారు. నియోజకవర్గాల్లో ఎల్ఎం (లోకల్ ఎమ్మెల్యే) ట్యాక్స్ నడుస్తోంది. ప్రతీదానికి లోకల్ఎమ్మెల్యే ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఎవరైనా వ్యాపారం చేయాలన్నా.. ఏ పని జరగాలన్నా ట్యాక్స్ కట్టాల్సిందే. చివరకు.. కూటమి నేతలు అరాచకాలు చేస్తుంటే.. చంద్రబాబు పంచాయితీ పెట్టే స్థాయికి దిగజారారు. ఇన్నీ పాపాలు చేసే మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదు.పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టు పర్యటనపై అంబటి సెటైర్లు సంధించారు. ఆల్రెడీ కలెక్టర్ పట్టుకున్న రేషన్ బియ్యంను చూడడానికి పవన్ సాహసోపేతంగా వెళ్లారు. తీరా ఒడ్డుకు వచ్చాక విచిత్రమైన ఆరోపణలు చేశారు. రెండు నెలల నుంచి ఆయన అక్కడికి వెళ్తానంటే అధికారులు అడ్డుపడుతున్నారంట. అధికారులు సహకరించలేదు అంట. ఆయన అసలు ప్రభుత్వంలో ఉన్నారో లేదంటే ప్రశ్నించే పక్షంలో ఉన్నారో అర్థం కావడం లేదు. కాకినాడ పోర్టుకు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఎగుమతులు అవుతాయి. అందులో బియ్యం కూడా ఉంటుంది. అయితే ఆ బియ్యంలో పీడీఎస్ రైస్ కలిపి పంపించడమే స్కాం ఎప్పటి నుంచో నడుస్తోంది. గత ప్రభుత్వాలు కూడా కట్టడి చేసే ప్రయత్నాలు జరిగాయి. మరి అరికడతామని చెప్పిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. ఇప్పుడు ఆ బాధ్యత తీసుకుంటారా?. బియ్యం అక్రమ రవాణా అడ్డుకునే చిత్తశుద్ధి లేదు. ఇక.. అధికారులు తనను అడ్డుకుంటున్నారని పవన్ అంటున్నారు. బహుశా.. చంద్రబాబు, లోకేష్ చెబితేనే అధికారులు అలా చేశారేమో అనే అనుమానం కలుగుతోంది. అసలు డిప్యూటీ సీఎంకు అంతలా ప్రాధాన్యం ఇవ్వొద్దనే అధికారులు అలా ప్రవర్తించారేమో. ఇక్కడ ఇంకో విషయం.. కూటమి నేతల సహకారంతోనే ఈ స్కాం నడుస్తోంది. ఎమ్మెల్యే కొండ బాబుకు మామూళ్ళు లేకుండానే ఇదంతా జరుగుతుందా?. బియ్యం అక్రమ రవాణాకు బాధ్యత వహిస్తూ నాదెండ్ల మనోహర్, ఆ తర్వాత పవన్ ఇద్దరూ రాజీనామా చేయాలి. అంతేకాదు.. .. పవన్కు తన డైలాగ్కు తగ్గట్లే.. లెక్కలేనంత తిక్క ఉంది. అందుకే.. కాకినాడ పోర్టు నుంచి ఆర్డీఎక్స్ రావొచ్చని, కసబ్ లాంటోళ్లు వస్తారని, హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఉన్నారా ఇంకా ప్రశ్నించే ధోరణిలో ఉన్నారా?. పవన్ కల్యాణ్ పెద్ద అసమర్థుడు అని అర్థం అవుతుంది అని అంబటి చురకలంటించారు. -
టీడీపీ అసభ్యకరమైన పోస్ట్.. అంబటి వార్నింగ్
గుంటూరు, సాక్షి: సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీసినా.. తప్పులను ఎత్తి చూపినా.. అణచివేసే కార్యక్రమం ఏపీలో కొనసాగుతోంది. తప్పుడు కేసుల బనాయింపు.. అక్రమ నిర్బంధాలతో వేధిస్తోంది. అయితే గురివింద గింజ సామెతలాగా.. వాళ్లు మాత్రం ఇష్టానుసారం రెచ్చిపోతున్నారు. తాజాగా..ఈ మధ్యకాలంలో తెలుగు దేశం అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్ మరీ శ్రుతి మించిపోతోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ తాజా ప్రెస్మీట్ను ఉద్దేశించి.. ఓ అసభ్యకరమైన పోస్టు ఉంచింది. ఆ పోస్టుపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు.మా నాయకుడిపై(వైఎస్ జగన్) ఇలాంటి మార్ఫింగ్ పోస్టులు పెడుతూ.. నీతులు చెబుతూ.. కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారాయన. తామూ అలా చేయగలమని, తక్షణమే డిలీట్ చేయకపోతే చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారాయన. ఈ క్రమంలో ఏపీ పోలీసులను ట్యాగ్ చేశారాయన. ఈ విధంగా మార్ఫింగ్ చేసి మా నాయకుడిపై పోస్టులు పెడుతూ మాకు నీతులు చెప్తారు కేసులు పెడతారుమేము కూడా @ncbn @naralokesh నీ మార్ఫింగ్ చేసి ఫోటోలు పెట్టలేమా ?ఈ అసభ్యకర పోస్టుని తక్షణమే డిలీట్ చేయండి,లేదంటే చట్టపరమైన చర్యలకువెళ్తాం జాగ్రత్త ! @iTDP_Official @APPOLICE100 https://t.co/H1tG1NnswB— Ambati Rambabu (@AmbatiRambabu) November 29, 2024 -
లోకేష్ పై అంబటి సెటైర్లు
-
బ్రిటీషర్స్ కూడా ఇన్ని కేసులు పెట్టలేదు.. లోకేష్ పై విరుచుకుపడ్డ అంబటి
-
RGV పై అక్రమ కేసు.. లోకేష్ పై అంబటి రాంబాబు సెటైర్లు
-
Ambati Rambabu: పుష్ప రాజ్ ఇంటర్నేషనల్ స్టార్..
-
‘పుష్ప- 2పై కొందరికి జెలసీగా ఉంది’
గుంటూరు, సాక్షి: అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రంపై సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రోలింగ్పై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. గుంటూరులో సోషల్ మీడియా అరెస్టుల అంశంపై ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. పనిగట్టుకుని కొందరు ఆ చిత్రంపై పోస్టులు చేయడం గురించి ప్రస్తావించారు. ‘అల్లు అర్జున్ సినిమాను చూడకుండా ఎవరూ ఆపలేరు. అతనొక ఇంటర్నేషనల్ స్టార్. పుష్ప-2 అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను కూడా అడ్డుకోవాలనుకున్నారు. ఏమైంది?.. సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. పుష్ప-2 కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. .. నేను కూడా ఆ సినిమా చూడడానికి రెడీగా ఉన్నాను.మొదటి పార్ట్ అద్భుతంగా ఉంది.పుష్ప-2పై కొంతమందికి జెలసీగా ఉంది. అరచేతిని అడ్డుపెట్టుకుని ఒక సినిమా విజయాన్ని ఆపలేరు. ఎన్టీఆర్, అల్లు అర్జున్ చిత్రాలను అడ్డుకోవాలనుకోవడం అవివేకం’అని అంబటి అన్నారు.