breaking news
Ambati Rambabu
-
వచ్చే నెల 29న వినతి పాదయాత్ర చేస్తున్నాను: Ambati
-
వచ్చే నెలలో పాదయాత్ర చేస్తున్నా: అంబటి
సాక్షి, గుంటూరు: ఏపీలో పోలీసు వ్యవస్థ చంద్రబాబు జేబు సంస్థగా మారిందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సాయికృష్ణ కేసులో సాక్ష్యాలను మాయం చేశారు. ఏ తప్పు చేయకపోయినా తనను అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు. 18 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉంచారు. వచ్చే నెల 29న వినతి పాదయాత్ర చేస్తా అని అంబటి ప్రకటించారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఒత్తిడితోనే నాపై కేసులు నమోదు చేశారు. నా ఇంటిపై దాడి చేయడమే కాకుండా నాపై అక్రమంగా రెండు కేసులు పెట్టారు. నన్ను జైలులో ఉంచారు. రెండు కేసుల్లో ఏడేళ్ళ లోపు శిక్ష పడే సెక్షన్లే పెట్టారు. ఈ కేసులో ఇద్దరు సీఐలు, ఒక ఎస్ఐకి హైకోర్టు.. కోర్టు ధిక్కరణ కింద నోటీసులు ఇచ్చింది. వంశీధర్ అనే సీఐ, మధు అనే ఎస్ఐ ఇల్లీగల్గా నన్ను లోపలేశారు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లుకి హైకోర్టు నోటీస్ ఇచ్చింది. ఈ ముగ్గురు పోలీసులను కేంద్ర మంత్రి పెమ్మసాని పురిగొల్పి నన్ను అరెస్ట్ చేయించారు. డీజీపీ, ఐజీ, ఎస్పీ, డిఎస్పీలకు చెబుతున్నాను. నా ఇంటిపై దాడి చేసిన వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. అందుకే వచ్చే నెల 29వ తేదీన వినతి పాదయాత్ర చేస్తున్నాను.పోలీస్ వ్యవస్థ చంద్రబాబు జేబు సంస్థగా కొనసాగుతుంది. సాయికృష్ణ అంశంపై మేము పోరాడటానికి కారణం వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయనే. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఏడాది సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారు. ఏడాది నుండి పీఎస్లో నేరాలు జరుగుతున్నాయి. ఐజీ రవి ప్రకాష్ ఆధ్వర్యంలోనే సాక్ష్యాధారాలు మాయం చేశారు. సీఐ నాగరాజుతో బేరసారలాడారు. ఏ పోలీస్ పేరు చెప్పవద్దని సీఐ నాగరాజును బతిమలాడారు. ఏ తప్పు చేయకపోయినా నన్ను అరెస్టు చేసి జైలులో వేశారు. కానీ, సీఐ నాగరాజును లాకప్లో ఎందుకు వేయలేదు?. పోలీసులు ప్రజలను కాపాడలేరు. సీఎం, హోంమంత్రి విఫలమయ్యారు. పవన్ కల్యాణ్.. నాగరాజును జిందాబాద్ అంటారేంటి?. ఆయనకు సిగ్గు అనిపించడం లేదా?. పవన్ కల్యాణ్ ఆత్మవిమర్శ చేసుకోవాలి. హోంమంత్రి రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
సాక్ష్యాలు మాయం చేసి అరెస్ట్ చేశావ్... గుట్టు విప్పిన అంబటి
-
CCTV ఫుటేజ్ మాయం చేసింది CI నాగరాజు కాదు అంబటి సంచలన నిజాలు
-
జనసేన నేతలవి బుర్ర తక్కువ మాటలు: అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ కాపు నేతలంతా భేటీ అయితే చంద్రబాబు, పవన్ కల్యాణ్లకు ఉలిక్కిపాటు ఎందుకని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నిస్తున్నారు. గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు ఇండియాలోనే అరుదైన కేసుగా అభివర్ణిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారాయన. మంగళవారం గుంటూరులో అంబటి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను చాలా స్పష్టంగా చెబుతున్నా.. సాయికృష్ణను చంపేశారు. ఎవరో పెద్ద నేరస్థుడిని రక్షించేందుకు అతన్ని బలి చేశారు. సీబీఐ దర్యాప్తు జరిగితేనే నిజాలు బయటకు వస్తాయి అని అంబటి వ్యాఖ్యానించారు. ఇది దేశంలోనే అరుదైన కేసు. బుర్రలేని జనసేనవాళ్లు సాయికృష్ణను చంపడం కరెక్టేనని మాట్లాడుతున్నారు సాయికృష్ణ మీద 2 కేసులే ఉన్నాయి. కానీ, పవన్ కల్యాణ్ 22 కేసులు ఉన్నాయని అంటున్నారు. శిక్షించడానికి పోలీసులు ఎవరు? శిక్షలు చట్టబద్ధంగా ఉండాలి. నేను సాయికృష్ణను కొట్టారని ఫొటోలు ఇచ్చాను. ఒకవేళ అతను బతికి ఉంటే చెప్పండి.... సాయికృష్ణ లాకప్ డెత్ కేసును మేకప్ చేసే కార్యక్రమంలో ఉన్నారు. చట్ట ప్రకారం.. 18 నెలలపాటు సీసీటీవీ ఫుటేజీలు భద్రపరచాలి. కానీ, కృష్ణలంక పీఎస్లో సీసీ ఫుటేజీ మాయం కావడం ఆందోళనకరమైన విషయం. ఈ విషయాన్ని ఎల్లో మీడియా సైతం ప్రచురించింది. నిందిత పోలీసులను కాపాడటానికే సీసీటీవీ ఫుటేజీలు మాయం చేశారు. .. జనసేన నేతలు కల్లు తాగిన కోతుల్లా చిందులు వేస్తున్నారు. బుర్ర తక్కువ మాటలు మాట్లాడుతుంటారు. ఈ హత్యాకాండకు, సీఐ నాగరాజుకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఈ వ్యవహారంపై ఆ పార్టీలోని కాపు నేతలే ఎందుకు మాట్లాడుతున్నారు?. మిగతా కులాల నేతలు ఎందుకు మాట్లాడడం లేదు? అని అంబటి ప్రశ్నించారు... చంపడం, బూడిద చేయడం.. సాక్ష్యాధారాలు లేకుండా చేయడం.. ఇదేంటి?. ఎవరో పెద్ద నేరస్థుడిని కాపాడడానికే సాయికృష్ణను బలిచేశారు. చంద్రబాబు వేసిన సిట్తో ఏం ఒరగదు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసును సీబీఐకి అప్పగించాలి. సీబీఐ, ఎన్ఐఏ లాంటి దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. బాధితులకు న్యాయం జరుగుతుంది’’ అని అంబటి తేల్చి చెప్పారు. -
తాట తీస్తా.. నా కొడకా.. పవన్, పంతం నానాజీ వ్యాఖ్యలు.. అంబటి మాస్ వార్నింగ్
-
పవన్ కల్యాణ్పై అంబటి సంచలన వ్యాఖ్యలు..
సాక్షి, తాడేపల్లి: గాదె సాయికృష్ణ కేసుకు సంబంధించి పోలీసులు మూతికి ప్లాస్టర్ వేసుకున్నారా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పోలీసులు చిత్తశుద్ధితో విచారణ చేస్తే సీఐ నాగరాజును ఎందుకు అరెస్ట్ చేయరు?. సీఐ నాగరాజును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, పవన్ కల్యాణ్ ఉడత ఊపులకు వైఎస్సార్సీపీ భయపడదు. సమాజానికి పట్టిన చీడ పురుగు పవన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘సాయికృష్ణ లాకప్ డెత్, క్రాంతి కుమార్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా చర్చ అయ్యాయి. సాయికృష్ణను మార్కాపురం నుంచి టాస్క్ఫోర్స్ తీసుకొచ్చింది. సీపీ ఆదేశాలు లేకుండా టాస్క్ఫోర్స్ అడుగు కూడా ముందుకు వేయదు. సీపీ ప్రమేయంతోనే మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చారు. చట్టం ప్రకారం అరెస్ట్ చేస్తే కోర్టులో ప్రవేశపెట్టాలి. కోర్టులో ప్రవేశపెట్టకపోతే అక్రమంగా నిర్బంధించినట్టే అవుతుంది. టాస్క్ఫోర్స్ తీసుకొచ్చి హింసించి చంపారంటే గూడుపుఠాణి ఉందనుకోవాలి.సీబీఐ లేదా ఎన్ఐఏ విచారణ.. సీఐ నాగరాజే కాదు సాయికృష్ణ లాకప్ డెత్లో చాలా మంది ప్రమేయం ఉంది. ఈ కేసులో విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసును సీబీఐ లేదా ఎన్ఐఏ విచారణ చేయాలి. పోలీసులు చిత్తశుద్ధితో విచారణ చేస్తే సీఐ నాగరాజును ఎందుకు అరెస్ట్ చేయరు?. సీఐ నాగరాజును విచారిస్తే పెద్దల పేర్లు బయటకు వస్తాయని భయం. లాకప్ డెత్ కేసులో పోలీసులు నాటకాలు ఆడుతున్నారు. సీఐ నాగరాజును వెంటనే అరెస్ట్ చేయాలి. బాధ్యతల నుంచి సీఎం, హోంమంత్రి తప్పించుకోలేరు. విజయవాడ పోలీసు స్టేషన్లలో చట్టాలు అమలు కావడం లేదు. విజయవాడ సీపీని తక్షణమే విధుల నుంచి తప్పించాలి. సీపీని సస్పెండ్ చేసి విచారణ చేస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయి. సాయికృష్ణ కోసం వెళ్లి టాస్క్ఫోర్స్ పోలీసుల పేర్లు బయటపెట్టాలి.సాక్షులను బెదిరిస్తున్నారు..సాయికృష్ణ లాకప్ డెత్పై పోలీసులు మాట్లాడటం లేదంటే కుట్ర ఉందని అనుకోవాలి. పోలీసులు నేరం చేస్తే పోలీసులే విచారణ చేయమేంటి?. సాయికృష్ణ, క్రాంతి కుమార్ కుటుంబాలకు రక్షణ కల్పించాలి. సాయికృష్ణ కేసులో సాక్షులను బెదిరిస్తున్నారు. ఒకవైపు సీఎం చంద్రబాబు.. సాయికృష్ణ తల్లిని పిలిపించి మాట్లాడుతున్నారు. మరోవైపు.. సాయికృష్ణ క్రిమినల్ అంటూ పవన్ కల్యాణ్ మాట్లాడుతారు. కాపు నేతల సమావేశానికి ముందు మీటింగ్లో పవన్ నోటికొచ్చినట్టు మాట్లాడారు. అసలు కులం పేరు ఎత్తిందే పవన్. కాపులను క్రిమినల్స్గా ముద్రవేసే కుట్ర జరుగుతోంది.పవన్ కల్యాణ్కు ఏం తెలియదు..వైఎస్సార్సీపీలో గూండాలు లేరు.. జనసేలోనే గూండాలు ఉన్నారు. పవన్ కల్యాణ్ ఉడత ఊపులకు వైఎస్సార్సీపీ భయపడదు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో వ్యవహరించకు పవన్. రక్షించాల్సిన వారే భక్షించారు.. ఇలా చాలా పెద్ద తప్పు. పవన్ కల్యాణ్కు ఏం తెలియదు.. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సమాజానికి పట్టిన చీడ పురుగు పవన్. జనసేన నేత తాతాజీ.. వైఎస్ జగన్ గురించి ఏం మాట్లాడారో విన్నావా పవన్?. పవన్ కల్యాణ్కు బుర్రలేదు, సిగ్గులేదు. తాతాజీ, చింతమనేని ప్రభాకర్ ఇలాంటి వారిని ఏం చేయాలో చెప్పు పవన్. అడ్వకేట్ శ్రీనివాస్ ఇంటి మీద దాడి చేసి ఆయన మీదనే కేసు పెట్టారు. హోంమంత్రి అనితను కించపరిచే విధంగా పవన్ మాట్లాడారు. సీఎం చంద్రబాబు.. పవన్ కల్యాణ్కు హోంమంత్రి ఇవ్చొచ్చుగా. పవన్ మాటలు, చేష్టలు, వైఖరి.. ద్వంద్వ వైఖరితో ఉన్నాయి. పోలీసు స్టేషన్లో హత్యలు చేసి బూడిత చేసే హక్కు ఎవరికీ లేదు. పవన్ గుర్తుందా. పాకిస్తాన్ ఉగ్రవాది కసబ్ను చట్ట ప్రకారమే ఉరి తీశారు’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
సాయి కృష్ణ కేసు వెనుక ఉన్న బడా బాబులను కాపాడటం కోసం ఈ కేసుకు "మేకప్" వేస్తున్నారు
-
గుంటూరులో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ
సాక్షి, గుంటూరు: నగరంలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలపై సీబిఐ విచారణ జరపాలని డిమాండ్ వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. కొరిటపాడు లైబ్రరీ సెంటర్ నుండి లాడ్జి సెంటర్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘‘క్రాంతికుమార్ మరణ వాంగ్మూలం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికృష్ణ పోలీసు దెబ్బలకు తట్టుకోలేక చనిపోయారు. రక్షించాల్సిన పోలీసులే హతమార్చుతున్నారు. చంద్రబాబు.. సాయికృష్ణ కుటుంబానికి అండగా ఉంటాడట. 49 రోజుల క్రితం సంఘటన జరిగితే ఇప్పటిదాకా ఎందుకు పట్టించుకోలేదు?. హెబియస్ కార్పస్ పిటిషన్ వేయటం, వైఎస్ జగన్ వారి ఇంటికి వెళ్లేదాకా ప్రభుత్వం పట్టించుకోదా?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.‘‘పోలీసులు నమోదు చేసున కేసు కోర్టులో నిలబడదు. లోపభూయిష్టమైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గత నెల 28న విజయలక్ష్మి ఒక ఫిర్యాదు చేశారు. అదే ఫస్ట్ ఇన్ఫర్మేషన్. కానీ దాన్ని కాదని మొన్న హడావుడిగా ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తారు?. సీఐ నాగరాజును బలి చేయటానికి హడావుడిగా కేసు నమోదు చేశారు. జడా శ్రవణ్ కుమార్ చాలా స్పష్టంగా సాయికృష్ణ కేసు వివరించారు. సాయికృష్ణ హత్య సీపీ, డీజీపీకి తెలియకుండానే జరిగిందా?..క్రాంతికుమార్ ఆత్మహత్య కేసు కూడా నిలపడకుండా చేస్తున్నారు. ఈ రెండు కేసుల్లో పెద్దపెద్ద వారి ప్రమేయం ఉంది. 29న కోర్టులో సాయికృష్ణను హాజరు పరుస్తారా?. కనీసం బూడిద కూడా దొరక్కుండా చేశారు. నేరాంగీకారం జరిగితే తప్ప ఇది మర్డర్ కేసుగా నిలబడదు. కాపులను చంపి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారా?. కాపులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?’’ అంటూ అంబటి రాంబాబు నిలదీశారు.‘‘పోలీసు స్టేషన్కు వెళ్లాలంటేనే జనం భయపడే పరిస్థితి ఏర్పడింది. సాయికృష్ణ వ్యవహారం వెనుక ఉన్న బడా బాబులు బయటకు రావాలి. సీఐ నాగరాజు పాత్ర ఒక్కటే సాయికృష్ణ కేసులో లేదు. సీబిఐ విచారణలో మాత్రమే వాస్తవాలు బయటకు వస్తాయి. రాజమండ్రి ఎస్పీ విచారణలో వాస్తవాలు వెల్లడవ్వవు’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
ఫేక్ ఫొటోస్ అంటా.. ABN పేపర్ లో న్యూస్
-
Ambati: వీళ్ళందరూ హంతకులే..!
-
రూ.40 లక్షలు ఇప్పిస్తా, రాజీ చేసుకోండి అంటూ జనసేన నేతలు బెదిరించారు
-
హోటల్లో రెండు రోజులు చిత్రహింసలు పెట్టి CIకి అప్పగించారు..! అంబటి షాకింగ్ కామెంట్స్
-
‘సాయికృష్ణ కేసును చంద్రబాబు తొక్కేద్దామనుకున్నారు’
సాక్షి, తాడేపల్లి: సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలపై సీబీఐతో విచారణ జరపాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోలీసుల దుర్మార్గాలపై తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. సాయికృష్ణ ఇంటికి వైఎస్ జగన్ వెళ్లే వరకు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు అంటూ ప్రశ్నించారు.‘‘గత నెల 28నే అడ్వకేట్ కనకదుర్గ ఫిర్యాదు చేశారు. అయినా సరే పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదు?. వైఎస్ జగన్ వెళ్తేగానీ సీఐ మీద కేసు నమోదు చేయరా?. లాకప్ డెత్ జరిగినట్టు ప్రభుత్వం అంగీకరించింది. సాయికృష్ణ పిన్ని కనకదుర్గ హైకోర్టులో పిల్ వేశారు. ఇక్కడ్నుంచే అసలు కథ ప్రారంభమైంది. సీఐ నాగరాజు మీద కేసు నమోదు చేసి సస్పెండ్ చేస్తే సరిపోదు. పేరిపోగు క్రాంతికుమార్ కూడా సీఐ టార్చర్ వలనే ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాల వెనుక సీఐతోపాటు చాలామంది అధికారులు ఉన్నారు. వారందరిపై కూడా చర్యలు తీసుకోవాలి’’ అని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.‘‘సాయికృష్ణ చనిపోయిన ఫోటో, కాళ్ల మీద గాయాలు ఉన్న ఫోటోలు ఫేక్ అంటూ ప్రచారం చేస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి అవన్నీ ఫేక్ ఫోటోలు అంటున్నారు. అవి ఫేక్ ఫోటోలు అయితే సాయికృష్ణను చూపించండి. నేను చూపినవి ఫేక్ ఫోటోలైతే నా మీద కేసు పెట్టుకోవచ్చు. తాము జనసేన పార్టీ అని సాయికృష్ణ కుటుంబ సభ్యులే చెప్పారు. అలాంటి కార్యకర్త ఇంటికెళ్లి కనీసం పరామర్శించలేదు. పైగా రాజీ చేయాలని చూడటం సిగ్గుచేటు. ఆ తల్లి అడిగిన సాయికృష్ణ భస్మం అయినా ఇవ్వండి. జనసేన నాయకులుగా ఉండి ఏం ప్రయోజనం?’’ అంటూ అంబటి దుయ్యబట్టారు.‘‘మీకు చేతగాని పని మేము చేస్తే బురద జల్లుతారా?. సాయికృష్ణ కేసులో మిగిలిన పాత్రధారులంతా బయటకు రావాలి. పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబానికి కూడా న్యాయం చేయాలి. సాయికృష్ణ, క్రాంతి కుమార్ మరణాలపై సీబీఐ విచారణ చేయాలి. చంద్రబాబు.. సాయికృష్ణ కుటుంబాన్ని మాయ చేసి ఉండొచ్చు. కానీ పోలీసు వ్యవస్థ పనితీరు, ప్రభుత్వ పోకడలపై మా పోరాటం ఆగదు’’ అంటూ అంబటి రాంబాబు హెచ్చరించారు. -
రాజకీయాల కోసం కాదు ఆ తల్లి కన్నీరుని చూసి గుండెమండి.. అంబటి రాంబాబు ఎమోషనల్
-
జైల్లో ఖైదీలు చెప్పిన మాటలు వింటుంటే ...అంబటి సంచలనం
-
సాయి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన YSRCP నేతలు
-
‘వారికి తెలియకుండానే సీఐ ఇదంతా చేశారా?’
సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ దుర్ఘటన జరిగి చాలా రోజులైందని.. వెలుగులోకి రావడానికి చాలా రోజులు పట్టిందంటే వ్యవస్థలు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇవాళ(గురువారం) కృష్ణలంకలోని గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, వంగవీటి నరేంద్ర పరామర్శించారు.ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘‘గాదె సాయికృష్ణను మే 9వ తేదీన తీసుకొచ్చారు. మే 9వ తేదీ నుంచి సాయికృష్ణను కోసం తల్లి విజయలక్ష్మి తీవ్రంగా ప్రయత్నించారు. విజయలక్ష్మి చెల్లి దుర్గ డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. హ్యూమన్ రైట్స్ వద్దకు వెళితే అడ్డుపడ్డారు. హెబియస్ కార్పస్ వేయకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. జూన్ 15వ తేదీన కోర్టు ఆర్డర్ వచ్చాక మా దృష్టికి తెలిసింది. సాయికృష్ణ కుటుంబం మాకు బాగా తెలిసిన వారే..సాయికృష్ణ పై ఓ వర్గం మీడియా దుర్మార్గంగా ప్రచారం చేస్తోంది. కేసులున్నంత మాత్రాన చంపేస్తారా?. కసబ్ను కూడా విచారించాకే శిక్ష విధించారు. సాయికృష్ణ డెడ్బాడీ లేకుండా చేశారు. కనీసం బూడిదైనా ఇవ్వండని సాయికృష్ణ తల్లి వేడుకుంటోంది. సాయికృష్ణ కుటుంబం మా పార్టీ కాదు. అయినా మానవత్వంతో ఆ కుటుంబానికి అండగా ఉంటాం. మేం రాజకీయాలు చేయాలంటే చాలా అంశాలున్నాయి..సాయికృష్ణ అంశాన్ని రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. సాయికృష్ణ లాకప్ డెత్పై సీబీఐ విచారణ జరిపించాల్సిందే. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే. పార్టీలకు అతీతంగా అందరూ సాయికృష్ణ కుటుంబం కోసం కలిసిరావాలి. పోలీసుల దుర్మార్గపు చర్యలను నిలదీద్దాం. మేం ఆ కుటుంబానికి అండగా ఉంటాం. నేను విడుదల చేసిన ఫోటోలు సాయికృష్ణవి కాకపోతే అతన్ని తీసుకురండి. మానవసమాజం తలదించుకునే ఘటన ఇది.ఇలాంటి ఘటనలను పౌరసమాజం కచ్చితంగా స్పందించాలి. పోలీస్ కమిషనర్, డీజీపీ, హోంమంత్రి, ప్రభుత్వానికి తెలియకుండానే సీఐ ఇదంతా చేశారా?. అందరికీ తెలిసే సాయికృష్ణ మృతదేహాన్ని దహనం చేశారు. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే సీబీఐ విచారణ చేయించాలి. పోలీసు విచారణతో న్యాయం జరగదు. సీబిఐ విచారణతోనే న్యాయం జరుగుతుంది. సాయికృష్ణను చంపి బూడిద చేసినట్లే కేసును కూడా బూడిద చేయాలని చూస్తున్నారు. కేంద్రం స్థాయిలో ఈ అంశాన్ని తీసుకువెళతాం. సీఐ నాగరాజును సస్పెండ్ చేయడంతోనే నేరం సగం అంగీకరించారు’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
సాయి కృష్ణ ఫోటోలు నాకు ఎలా వచ్చాయో తెలుసా..
-
రెండు రోజులు సాయి కృష్ణ శవాన్ని స్టేషన్ లో పెట్టి ఏం చేశారో చెప్పమంటారా
-
సాయికృష్ణ కేసులో కూటమి ట్రిపుల్ గేమ్: అంబటి
సాక్షి, గుంటూరు: కాపు యువకుడు గాదె సాయికృష్ణను పోలీసులు వేధించారని వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అతని మృతిపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కేసును రాజీ చేసుకోవాలని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. సాయికృష్ణ చనిపోయిన విషయం చంద్రబాబు, వవన్ కల్యాణ్లకు తెలుసని అంబటి రాంబాబు అన్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై అంబటి రాంబాబు గుంటూరులో మాట్లాడారు. సాయి కృష్ణ వెతుకుతున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇటువంటి ఘటన గతంలో దేశంలో ఎక్కడా జరిగి ఉండదు. సాయి కృష్ణ మృతదేహాన్ని దహనం చేయడమనేది దారుణం అని రాంబాబు పేర్కొన్నారు. మేము దీన్నిరాజకీయం చేయాలని అనుకోవడం లేదు. ఒక తల్లి ఆవేదన చెబుతున్నాం. సాయి కృష్ణ రౌడీ అని తెలుగుదేశం అనుకూల మీడియా ప్రచారం చేస్తుంది. చంద్రబాబు సీరియస్ అంటూ రాస్తున్నారు. ఒక సీనియర్ ఐపిఎస్ చేత విచారణ ప్రభుత్వం అంటుంది. సాయికేష్ణ బ్రతికి లేడు. సీనియర్ ఐపిఎస్ విచారణలో ఏం తేలుస్తారో నేను చెబుతాను వినండి. సాయి కృష్ణ చాలా కేసులో నిందితుడిగా ఉన్నాడు. గ్యాంగ్ వార్ లో ఏమై పోయాడో తెలియదు అని నివేదిక ఇస్తారని అంబటి పేర్కొన్నారు. విజయవాడ నడిబొడ్డున కృష్ణలంక పిఎస్ లో జరిగింది. సాయికృష్ణ చంపిన తర్వాత ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు సి ఐ నాగరాజు చెప్పాడు. హోంమంత్రి, డిజిపి, సిపి అందరూ కలిసే మృతదేహాన్ని దహనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మొదటిది హత్య అయితే రెండో నేరం మృతదేహం దహనం చేయడం. పవన్ కల్యాణ్ అమాయకుడో నాకు తెలియదు. ఆయన సమక్షంలోనే సీనియర్ ఐపిఎస్ చేత విచారణ జరిపిస్తారా? చంద్రబాబుకు ఇది న్యాయమేనా అని అంబటి ప్రశ్నించారు. ఈ కేసును సిబిఐ విచారణ జరిపించాలని, విజయవాడ పోలీస్ కమీషనర్ ను సస్పెండ్ చేయాలి. ఈ కేసులో ఎవరెవరూ ఉన్నారో అందరికి శిక్షపడాలి. పవన్ కల్యాణ్ డూడూ బసవన్నలా తల ఊపుతున్నాడు. పవన్ కల్యాణ్ వాట్సప్ నంబర్ పంపితే ఆ తల్లి ఆవేదన పంపుతాను. చంద్రబాబుకి మనస్సు లేదు. పవన్ కల్యాణైనా స్పందిస్తాడని కుటుంబ సభ్యులు అనుకుంటున్నారని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
సీబీఐ విచారణ జరిపించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: విజయవాడ కృష్ణలంకలో గాదె సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. గుంటూరులో బుధవారం వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర, గాదె సాయికృష్ణ మేనమామ నవరంగ్తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడలో జరిగిన లాకప్డెత్ ఘటన, పోలీసులు వ్యవహరించిన తీరు దేశంలోనే అత్యంత దుర్మార్గపూరితమని మండిపడ్డారు.ఎక్కడైనా లాకప్డెత్ జరిగితే కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగిస్తారని, సాయికృష్ణ మృతదేహాన్ని పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా కాల్చి వేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. 23 ఏళ్ల యువకుడు సాయికృష్ణను అరెస్టు చేసిన కృష్ణలంక సీఐ.. చిత్రహింసలకు గురి చేయడం వల్లే అతను మృతి చెందాడని, ఆధారాలు లేకుండా చేసేందుకు శవాన్ని శ్మశానంలో దహనం చేశారని ఆరోపించారు. శాంతి భద్రతలను కాపాడి ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులు చేయాల్సిన పనేనా ఇది అని ప్రశ్నించారు. తల్లడిల్లిన కన్నపేగు గాదె సాయికృష్ణ కన్నతల్లి మాట్లాడిన తీరు వర్ణనాతీతమని, తన కొడుకును చంపేసి ఉంటే శవాన్ని అప్పగించాలని, బూడిద చేసి ఉంటే కనీసం చితాభస్మాన్ని అయినా అప్పగించాలని వేడుకున్న తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోందని అంబటి చెప్పారు. పోలీసులు ఏ ధైర్యంతో ఈ విధంగా సాయికృష్ణను చిత్రహింసలకు గురి చేసి చంపేశారని ప్రశ్మీంచారు. అతను రౌడీషీటర్ అని ఆరోపిస్తున్న పోలీసులు అతనిపై ఎన్నో కేసులు పెండింగ్లో ఉన్నట్లు చెబుతున్నారని, రౌడీషీటర్ అయితే చంపేస్తారా అని నిలదీశారు. సాయికృష్ణ తండ్రి, ఆయన అన్నదమ్ములది ఉమ్మడి కుటుంబమని, జనసేన పార్టీలో క్రియశీలకంగా కొనసాగుతున్నారని చెప్పారు.సాయికృష్ణను అరెస్టు చేసి, విజయవాడలో నడిరోడ్డుపై నడిపించిన ఘటనను ప్రజలంతా కళ్లారా చూశారని, హైకోర్టులో పోలీసుల తీరుకు వ్యతిరేకంగా హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఈనెల 29లోగా సాయికృష్ణను కోర్టు ఎదుట హాజరు పర్చాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారని చెప్పారు. హైకోర్టు జోక్యంతో పోలీసులు పాల్పడిన నేరం, పాశవికంగా చేసిన హత్య ఉదంతం వెలుగులోకి వస్తాయన్నారు. లాకప్డెత్కు పాల్పడిన సీఐపై మాత్రమే చర్య సరిపోదని, బాధ్యులైన పోలీసులందరిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనపై సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తే నిజా నిజాలు వెలుగు చూస్తాయన్నారు. సాయికృష్ణ కుటుంబానికి, అతని తల్లి విజయలక్ష్మీ కి అండగా నిలిచి, న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని చెప్పారు. డబ్బులు ఇస్తాం కేసు వెనక్కు తీసుకోవాలని పోలీసులు, వారి వెనుక ఉన్న టీడీపీ, జనసేన నేతలు సాయికృష్ణ కుటుంబంపై ఒత్తిడి తెస్తున్నారని, డబ్బులు ఇచ్చి హత్యా నేరాన్ని కడిగేసుకుంటారా అని నిలదీశారు.ఈ విషయంలో సరైన యాక్షన్ లేకపోతే ప్రజల రియాక్షన్ చూస్తారని హెచ్చరించారు. కాపు యువకుడిని చంపేసి, శవం కాల్చేసి మాయం చేయడమే కాకుండా.. అదే కాపు యువకుడి కుటుంబానికి డబ్బులిచ్చి రాజీ చేయడం కోసం మళ్లీ కాపు నేతను మధ్యవర్తిత్వం పంపడం దారుణమని కాపులంతా మండిపడుతున్నారని చెప్పారు. జనసేన కుటుంబ సభ్యుడికి అన్యాయం జరిగితే ఆ పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. మానవత్వంతో స్పందించాలి వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ.. గాదె కుటుంబానికి వంగవీటి కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పారు. గాదె సాయికృష్ణ నిందితుడని, అతడిని కోర్టు.. నేరస్తుడిగా తీర్పు చెప్పలేదన్నారు. జరిగిన ఘటనపై న్యాయం కోసం గళం విప్పిన అంబటి ప్రవేశంతో వైఎస్సార్సీపీ ముద్ర వేశారని, రాష్ట్రంలో కూటమి పాలన నరరూప రాక్షస పాలనను తలపిస్తోందన్నారు. లాకప్డెత్ ఘటనపై ప్రశ్మీస్తే, హోం మంత్రి ఈ విషయాన్ని డైవర్ట్ చేసి సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఒక తల్లి వేదనను రాజకీయ పార్టీలకు అంటగట్టడం దారుణం సాయికృష్ణ మేనమామ నవరంగ్ మాట్లాడుతూ.. కొడుకును పోగొట్టుకున్న సాయికృష్ణ తల్లి ఆర్తనాదంపై అధికార పక్షం స్పందించ లేదని, పైగా దీనిని రాజకీయ పార్టీలకు అంటగట్టడం దారుణమన్నారు. కృష్ణలంక పోలీసులు మార్కాపురం నుంచి గాదె సాయికృష్ణను తీసుకొచి్చ, దారుణంగా హింసించి చంపారని, అతడి తల్లి కన్నీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాము తొలి నుంచి వంగవీటి రంగా మద్దతుదారులుగా ఉన్నామని, వారి కుటుంబంతో తమకు ఏళ్ల తరబడి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. విజయవాడలోని రాజకీయ నేతలతో తమకు కుటుంబ బాంధవ్యాలు ఉన్నాయని అన్నారు. కాపు యువకుడిని పోలీసులు ఇంత దారుణంగా చంపేసి, మృతదేహాన్ని కనిపించకుండా తగులబెట్టిన ఘటనపై కాపు సామాజికవర్గ నేతలు మౌనంగా ఉండటం తగదన్నారు. -
కాల్చేసి బూడిద చేసి, కోర్టులో వెతుకుతున్నాం అని చెప్తున్నారే
-
‘సాయికృష్ణను లాకప్లోనే కొట్టి చంపేశారు’
సాక్షి,గుంటూరు: 23ఏళ్ల యువకుడు సాయికృష్ణను పోలీస్ స్టేషన్లో హత్య చేసి.. ఆనవాళ్లు లేకుండా చేసి డెడ్బాడీని దహనం చేశారు. ఈ అంశంలో జనసేన అధ్యక్షుడు పవన్ ఎందుకు మాట్లాడరని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.సాయికృష్ణ మృతిపై గుంటూరు వైఎస్సార్సీపీ కార్యాయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. సాయికృష్ణ లాకప్ డెత్ చర్చనీయాంశమైంది. గాదె సాయి కృష్ణ మేనమామ నవరంగ్ నా దగ్గరకు వచ్చారు. నేను జనసేన కార్యకర్తను అని నవరంగ్ చెప్పారు. సాయికృష్ణ తల్లి వేదన బాధ కలిగించింది. పార్టీలకు అతీతంగా ఉద్యమ రూపం ఇవ్వాలి. దేశంలోనే ఇటువంటి ఘటన ఎక్కడా జరగలేదు. ఎన్నో లాకప్ డెత్స్ జరిగాయి.కానీ ఇక్కడ చనిపోయితే శవాన్ని మాయం చేశారు. ఏపి పోలీస్ మర్డర్ చేసి శవాన్ని మాయం చేశారు.హెబియస్ కార్పస్ కేసు వేస్తే సాయికృష్ణ కోసం వెతుకుతున్నామని పోలీసులు చెబుతున్నారు.సాయికృష్ణ మృతికి పోలీసులే కారణంసాయికృష్ణ మృతిపై సీబీఐ ఎంక్వయిరీ వేసి న్యాయం చేయండి.పవన్ కల్యాణ్ కు రిక్వెస్ట్ చేస్తున్నాను. చేతులు జోడించి అడుగుతున్నాను పవన్ కల్యాణ్.. ఎంక్వయిరీ వేయండి.మనం మానవులు అన్నది గుర్తించాలి. మర్డర్ చేసి కాల్చేయడం చట్టం చేసే పనా. తమిళనాడు ఘటన కన్నా ఘోరమైన ఘటన. చట్టప్రకారం ఉరిశిక్ష వేయాలి. సాయికృష్ణను లాకప్డెత్ చేశారు. సీబీఐ ఎంక్వైరీ వేసి న్యాయం చేయండి. సాయికృష్ణను దహనం చేసి ఉంటే కనీసం బూడిదనైనా ఇవ్వమని అతని తల్లి కోరుతోంది. సీబీఐ విచారణ కోరుతున్నా. లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండని అంబటి రాంబాబు కోరారు. అనంతరరం సాయికృష్ణ మేనమామ నవరంగ్ మీడియాతో మాట్లాడారు. నవరంగ్, సాయి కృష్ణ మేనమామ సాయి కృష్ణ మృతిని పార్టికి ముడిపెట్టడం కరెక్ట్ కాదు. ఆ తల్లి బాధ చూసి అందరూ చలించిపోతున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే దాడి చేసి హత్య చేసి దహనం చేయడమా..సాధారణ వ్యక్తి చనిపోతే ఎవరూ స్పందించ కూడదా. ఆ తల్లి బాధ మరొకరికి రాకూడదు. .దారుణంగా చంపేశారు కాబట్టే న్యాయం చేయమని అడుగుతున్నాం.సాయి కృష్ణ మంచోడు కాదు. మరి మీరు హంతకులు కాదా’అని ప్రశ్నించారు.వంగవీటి నరేంద్రమానవతా దృక్పధంతో స్పందించాం.వంగవీటి కుటుంబంతో సంబంధ బాంధవ్యాలున్నాయి. రౌడీ షీట్ ఓపెన్ చేయడమే కాకుండా హత్య చేశారు.సాయికృష్ణపై ఒక్క కేసు ఉన్నా బయట పెట్టాలి. తల్లి అడిగినట్లు మృతదేహం అన్నా ఇవ్వాలి లేకపోతే బూడిదన్న ఇవ్వాలి.హోంమంత్రి... సాయికృష్ణ హత్య గురించి తప్ప అన్ని విషయాలు మాట్లాడారు. -
సాయిని చిత్రహింసలు పెట్టి చంపేశారు.. సంచలన ఫోటోలు రిలీజ్ చేసిన అంబటి
-
సాయికృష్ణను లాకప్లోనే కొట్టి చంపారు
సాక్షి ప్రతినిధి, గుంటూరు : గాదె సాయికృష్ణను విజయవాడ కృష్ణలంక పోలీసులు కొట్టి చంపేసి, శవాన్ని తగులబెట్టేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. సాయికృష్ణకు పెట్టిన చిత్రహింసలు, సాయికృష్ణ మృతదేహం∙ఫొటోలను ఆయన బయటపెట్టారు. ఇందుకు సంబంధించి ఒక సంచలన వీడియోను మంగళవారం రాత్రి విడుదల చేశారు. అందులో అంబటి ఏం చెప్పారంటే.. ‘23 ఏళ్ల గాదె సాయికృష్ణ కొంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న యువకుడు అని, అతనిపై కొన్ని కేసులు ఉన్నాయని మే 9న మార్కాపురం నుంచి విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు కస్టడీలోకి తీసుకుని స్టేషన్కు తీసుకువచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ప్రశ్నగా మిగిలింది. సాయికృష్ణ ఉన్నాడా? చనిపోయాడా? సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా అనేది ప్రశ్నగా మారింది. వాస్తవానికి గాదె సాయికృష్ణ మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన యువకుడు. ఆయన మేనమామ, వారి కుటుంబం రాధా, రంగాతో పనిచేశారు. ప్రస్తుతం జనసేన పార్టీ తరఫున చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే గాదె సాయికృష్ణ మీద కొన్ని కేసులు ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని కృష్ణలంకలో అతన్ని తీవ్రంగా హింసించారు. ఆ క్రమంలో గాదె సాయికృష్ణ చనిపోయాడని మాకు సమాచారముంది. సహజంగా లాకప్ డెత్ జరిగితే మసిపూసి మారేడు కాయ చేసి, కుటుంబ సభ్యులకు అప్పజెప్పి.. రాజీ కుదుర్చుకుని వెళ్లిపోతారు. ఇక్కడ దానికి భిన్నంగా మృతదేహాన్నే మాయం చేశారు. మృతదేహాన్ని కృష్ణలంక శ్మశాన వాటికకు తీసుకెళ్లి దహనం చేసేశారు. టూ వీలర్పై ముందు ఒక కానిస్టేబుల్.. వెనుక మరో కానిస్టేబుల్ కూర్చుని.. మధ్యలో శవాన్ని పెట్టుకుని వెళ్లారు. అక్కడ దహనం చేసి, బూడిద కూడా మాయం చేశారు. అయితే పోలీసులు.. కోర్టుకు మాత్రం మాకు తెలియదు, ఎక్కడో ఉన్నాడు.. వెతుకుతున్నాము. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వెతుకుతున్నామని చెబుతున్నారు. సాయికృష్ణ తల్లికి సీఐ నాగరాజు ‘మీ అబ్బాయ్ నాకు ఎదురు తిరిగాడు. వాడిని చంపేస్తాను. దండ రెడీ చేసుకో.. అని చెప్పి, మరీ చంపేసిన ఘటన ఇది. నీపై దాడిచేసి ఉండవచ్చు. అయితే పోలీసులు తీసుకొచ్చి చంపేస్తారా? రక్షకభట నిలయంలోనే భక్షణ చేసే కార్యక్రమం పోలీసులు చేస్తున్నారంటే ఏమిటి ధైర్యం? నేరం చేస్తే వారిని శిక్షించాల్సింది కోర్టులుఇటీవల తమిళనాడు మధురై కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. తండ్రీకొడుకులు.. ఇద్దరినీ తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేసి పోలీసులు చంపేస్తే, దానిపై న్యాయ విచారణ జరిపి తొమ్మిది మంది పోలీసులను దోషులుగా నిర్ణయించి, తొమ్మిది మందికి ఉరిశిక్ష వేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ఘటనలో బాధితుల కుటుంబానికి రూ.కోటి 40 లక్షలు నష్టపరిహారం చెల్లించారు. అలాంటి కఠిన నిర్ణయం కోర్టు తీసుకుంది. ఎందుకంటే పౌరుడికి జీవించే హక్కు ఉంది. నేరం చేస్తే వారిని శిక్షించాల్సింది పోలీసులు కాదు.. న్యాయస్థానాల అధికారాన్నీ పోలీసులు చేతుల్లోకి తీసుకుని వ్యవహరిస్తుంటే ఇది ధర్మమేనా? సాయికృష్ణ నేరస్తుడైనా కూడా శిక్షను కోర్టులు నిర్ణయించాలి తప్ప.. సీఐలు, ఎస్సైలు కాదు. సాయికృష్ణను చంపేశారు.. కాబట్టి తల్లిదండ్రులు, బంధువులతో బేరాలు ఆడుతున్నారు. కోటి రూపాయలు ఇస్తాం.. మీరు కేసు వెనక్కు తీసుకోండని బతిమాలుతున్నారు. రేటు కూడా పెంచుతున్నారు. పోలీసులు సఫలమవుతారో, విఫలమవుతారో చూడాలి. డీజీపీ నుంచి కమిషనర్ వరకు ఈ నేరం తెలిసే జరిగిందని బయట చర్చ జరుగుతోంది. ఎవరైతే పోలీసులు మనిషి ప్రాణాన్ని తీసేశారో ఆ పోలీసు అధికారులకు శిక్ష పడేంత వరకు సమాజం కూడా పోరాటానికి మద్దతు ఇవ్వాలి’ అని అంబటి కోరారు.సాయికృష్ణ ఉంటే చూపించండిపోలీసులు చంపేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు హోం మంత్రి సమాధానం చెప్పాలి...బాధ్యులపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడ కృష్ణలంకకి చెందిన గాదె సాయికృష్ణ కనిపించకుండాపోవడానికి బాధ్యులైన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు డీసీపీ కేజీవీ సరితను మంగళవారం కలిసి వినతిపత్రమిచ్చారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కొన్ని రోజులుగా సాయికృష్ణ కనిపించడం లేదని, పోలీసులే తీసుకెళ్లి చంపేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారని పేర్కొన్నారు. కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్న సాయికృష్ణ ఎక్కడ ఉన్నాడో తెలియజేయాలని, ఈ ఘటన వెనుక దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. విజయవాడ పోలీసులపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయని, సివిల్ సెటిల్మెంట్లు, స్టేషన్ సెటిల్మెంట్లతో వారు బిజీ అయిపోయారన్నారు. వాస్తవాలు తెలియాలి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. గాదె సాయికృష్ణ కనబడటం లేదని ఆయన తల్లి చెప్పిన మాటల ఆధారంగా వాస్తవాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. సాయికృష్ణను ఇంటినుంచి తీసుకెళ్లినట్టు తల్లి చెబుతోందన్నారు. పోలీసులు ఇష్టానుసారంగా కొట్టి చంపేశారని ఆమె,ఇతర కుటుంబ సభ్యులు చెబుతున్నారని వివరించారు. సాయికృష్ణ విషయంలో పోలీసులు మౌనం వీడాలని, రాష్ట్ర హోం మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నగరంలో పోలీసుల తీరుపై ఎన్నో విమర్శలు వస్తున్నాయన్నారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోలేరని చెప్పారు. వైఎస్సార్సీపీ తరఫున సాయికృష్ణ కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చల్లారావు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి తంగిరాల రామిరెడ్డి, తూర్పు నియోజకవర్గ పరిశీలకుడు సర్నాల తిరుపతిరావు, సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏకంగా ఎమ్మెల్యేలే ఇళ్ల మీదకు వెళ్లి దాడులు చేస్తున్నారు: అంబటి
తాడేపల్లి: ఏపీలో జంగిల్ రాజ్ పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ఏ నియంత పాలన కూడా ఇంతకంటే దారుణంగా లేదని చెప్పారు. ఎమ్మెల్యేలు రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా మారిపోయారని అన్నారు. సెటిల్మెంట్లు, మద్యం, ఇసుక.. అన్ని రకాల అక్రమాలు చేస్తున్నారని తెలిపారు.‘‘రెడ్ బుక్ చేతిలో పెట్టుకుని హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ఏకంగా ఎమ్మెల్యేలే ఇళ్ల మీదకు వెళ్లి దాడులు చేస్తున్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నేరుగా తమ నాయకుడి ఇంటిమీదకే వెళ్లి దాడి చేశాడు. విచిత్రం ఏంటంటే దాడి చేసిన ఎమ్మెల్యేని వదిలేసి, దాడికి గురైన ఈడ్పుగంటి శ్రీనివాసరావు మీద కేసు పెట్టారు’’ అని చెప్పారు.అతని మీద 94 కేసులు మందేసి, చిందేసిన ఎమ్మెల్యే చింతమనేనికి పోలీసులు మద్దతు ఇవ్వటం ఏంటని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ‘‘దీన్ని జంగిల్ రాజ్ అనరా? చికెన్ మీద కూడా ట్యాక్సులు వేసి దోచుకునే దుస్థితికి టీడీపీ ఎమ్మెల్యేలు చేరారు. మా ఇంటి మీద దాడి చేసిన వారిని వదిలేసి నాపై కేసు పెట్టారు. రాష్ట్రంలో పోలీసుల పనితీరు ఇలా ఉంది. చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులాగా రాష్ట్రం మీద వదిలేశారు. ఇప్పటికే అతని మీద 94 కేసులు ఉన్నాయి. అయినప్పటికీ చంద్రబాబు అతనిపై ఎలాంటి చర్యలూ తీసుకోవటం లేదు? దీనికి కూటమి నేతలు సిగ్గుతో తల దించుకోవాలి. తమ దోపిడీకి ఎవరు అడ్డొస్తే వారిపై దాడి చేస్తున్నారు. లాకప్ డెత్ లు గతంలో విన్నాం. ఇప్పుడు ఆ శవాలను కూడా పోలీసులు దహనం చేసే పరిస్థితికి వచ్చింది. పోలీసులే రౌడీలుగా మారతారా? అసలు ఏపీని ఎక్కడకు తీసుకెళ్తున్నారు? హోంమంత్రి ఏం సమాధానం చెప్తారు? లింగమనేని రమేష్ ఫ్లైట్ టిక్కెట్లు కొనటంతో జనసేన నేతలంతా ఢిల్లీ వెళ్లారు. అక్కడకు వెళ్లి తెలంగాణ గురించి మాట్లాడటం ఏంటో? ఏపీలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే పవన్ ఢిల్లీలో మీటింగులు ఎందుకు? పవన్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశం హాస్యాస్పదం. రిలీజ్ అయిన సినిమాని రీరిలీజ్ చేసినట్టుగా ఉంది. ఆల్రెడీ తెలంగాణలో పోటీ చేశారు కదా? ఇంకా జాతీయ రాజకీయాలు అంటుంటే నాకే సిగ్గుగా ఉంది. రాష్ట్రం కోసం త్యాగం చేశానంటున్న పవన్ రానున్న రోజుల్లో జనసేనని టీడీపీకి త్యాగం చేస్తారేమో?’’ అని నిలదీశారు. -
మందేసి... చిందేసి ఏంటది..? చింతమనేని ఘటనపై అంబటి మాస్ రియాక్షన్
-
లోకేష్ ఆల్ ఇండియా మోసగాడు, పవన్ ఆంధ్రా మోసగాడు..
-
‘లోకేష్ ఆలిండియా.. పవన్ ఆంధ్రా మోసగాడు’
సాక్షి, గుంటూరు: గుంటూరులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమం నిర్వహించారు. లాడ్జి సెంటర్లో అంబటి రాంబాబుని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, అంబటి రాంబాబుకు మధ్య వాగ్వాదం జరిగింది. అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కూటమి సర్కార్ వచ్చి రెండేళ్లయింది.. ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చలేదని మండిపడ్డారు.‘‘సూపర్ సిక్స్లో ముఖ్యమైనవి అసలు అమలు చేయలేదు. స్త్రీ నిధి ఇవ్వలేదు. ప్రధాన వాగ్ధానాన్ని వదిలేశారు. నిరుద్యోగి భృతి ఇవ్వలేదు. యువగళం గాలికి పోయింది. యాభై ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు పెన్షన్ అన్నారు. ముగ్గురు మోసగాళ్ల ప్రభుత్వం ఇది. చంద్రబాబు ప్రపంచ మోసగాడు. లోకేష్ ఆల్ ఇండియా మోసగాడు.. పవన్ కల్యాణ్ ఆంధ్రా మోసగాడు’’ అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు.డీఎస్సీపై మాట్లాడటం లేదు. లోకేష్ డీఎస్సీలో ఉద్యోగాలకు డబ్బులు తీసుకున్నాడు. చంద్రబాబ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తుంటే డీఎస్పీ అడ్డుకున్నారు. తెలుగుదేశం నాయకులు వైఎస్ జగన్ దిష్టి బొమ్మ తగులపెడితే పోలీసులు రక్షణ కల్పిస్తారు. గుంటూరు పోలీసులకు ఏం పోయేకాలం?. రాబోయేది జగన్ పాలనే. వచ్చే నెల 29 తేదీన వినతి పాదయాత్ర చేస్తాను’’ అని అంబటి రాంబాబు వెల్లడించారు. -
ఫస్ట్ పక్కకు జరుగు.. అంబటి VS పోలీస్
-
నా ఇంటిపై దాడి చేసిన వాడిని ఒక్కడినైనా అరెస్ట్ చేశారా..! ఛీ.. మీరు పోలీసులా..?
-
ఏపీలో జనసైనికులను ఎగిరెగిరి తన్నుతుంటే దిక్కులేదు తెలంగాణాలో మీటింగ్ పెడతాడంటా..!
-
చంద్రబాబు 20కోట్ల భారీ స్కాం, బయటపెట్టిన అంబేటి రాంబాబు
-
వైఎస్ జగన్, సజ్జలకు నోటీసులు అంబటి రియాక్షన్
-
రెండేళ్ల పాలనలో కూటమి సర్కార్ చేసిందేమీ లేదు
సాక్షి,అమరావతి: రెండేళ్ల పాలనలో కూటమి సర్కార్ చేసిందేమీ లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. శుక్రవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.‘ఈ రెండేళ్ల పరిపాలనతో చంద్రబాబు చేసిందేమీ లేదు. చేసింది చెప్పుకోవాలన్నా ఏమీ కనిపించడం లేదు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు పూర్తిగా ఎగ్గొట్టేశారు. ఈ రెండేళ్ల పరిపాలనతో చంద్రబాబు చేసిందేమీ లేదు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద బురద జల్లడం, అక్రమ కేసులు పెట్టడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు. వైఎస్ జగన్పై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. ఈ రెండేళ్లలో చంద్రబాబు చేసిందేమీ లేదు. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి మాత్రమే చంద్రబాబు పని చేస్తున్నారు.లిక్కర్ స్కాం జరగకున్నా.. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రతీ పైసా ప్రభుత్వ ఖజానాలోకి తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్ది. చంద్రబాబు గతంలో లిక్కర్ పేరుతో లెక్కలేనన్ని స్కాములు చేశారు. లిక్కర్లో చంద్రబాబు రూ.25వేల కోట్ల స్కాం చేశారు. చంద్రబాబు 40వేల బెల్టు షాపులు నడిపించారు. రాష్ట్ర ఖజానాకు రూ.5వేల కోట్లుకుపైగా నష్టం చేకూర్చారు. వ్యవస్థలు మేనేజ్ చేసి కేసులు క్లోజ్ చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. -
నీకు భజన చేయకపోతే కేసులా... ఏం చేస్తావో చేసుకో...
-
దద్దరిల్లిన గుంటూరు.. జగన్ నినాదాలతో YSRCP భారీ ర్యాలీ
-
దమ్ముంటే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టు..!
-
నిన్ను నీ కొడుకుని తగలపెట్టాలి అంబటి ఫైర్
-
CM గా ప్రమోషన్ కోసమే నారా లోకేష్ ఇలా చేశాడు..!
-
లోకేష్ కోసమే జూ.ఎన్టీఆర్ ని తొక్కేశాడు
-
‘కాంగ్రెస్తో చంద్రబాబు హాట్ రాజకీయాలు చేస్తున్నారు’
తాడేపల్లి: మోసపూరిత రాజకీయాలు చేయడంలో చంద్రబాబు నెంబర్ వన్ అని విమర్శించారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు. బహిరంగంగా బీజేపీతో ఉంటూ తెరచాటున కాంగ్రెస్తో ఉంటున్నారని అంబటి విమర్శించారు. కాంగ్రెస్తో చంద్రబాబు హాట్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు అంబటి. ఈరోజు(శుక్రవారం, మే 29వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి.. బీజేపీని చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారు. హైదరాబాద్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని కాంగ్రెస్ సీఎం ఆవిష్కరించడం సిగ్గుచేటు. కాంగ్రెస్ సీఎంకి టీడీపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. ఏపీలో చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీ బీ టీమ్. తెలంగాణలో కాంగ్రెస్కు టీడీపీ బీ టీమ్. ఇలాంటి అనైతిక రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట. చంద్రబాబు వైఖరిని బీజేపీ బాగా అబ్జర్వ్ చేస్తుంది. రాజ్యసభలో బీజేపీకి సీటు ఇవ్వనని చంద్రబాబు అనటం అందుకు సంకేతం. చీరలిచ్చి మహిళలను మహానాడుకు తీసుకెళ్లారు. డబ్బులిచ్చి జనాన్ని తీసుకెళ్లారంటే టీడీపీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహానాడులో చంద్రబాబును 25%, లోకేష్ ను 75% పొగిడారు. మెగా డీఎస్సీ పేరుతో పోస్టులు అమ్ముకున్న వ్యక్తి నారా లోకేష్. అసలు టీడీపీ పెట్టినప్పుడు చంద్రబాబు కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్ను వెన్నుపోటు పొడిచి టీడీపీలో చేరారు. తర్వాత ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి, నారా రామ్మూర్తి నాయుడుని కూడా రాజకీయాల కోసం వాడుకున్న నీచ చరిత్ర చంద్రబాబుది. జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, హరికృష్ణలను కూడా తొక్కేసిన దుర్మార్గుడు చంద్రబాబు. ఇంతకుమించిన వెన్నుపోటుదారుడు ఇంకెవరైనా ఉన్నారా?, అలాంటి వ్యక్తికి జగన్ మీద విమర్శలు చేసే అర్హత లేదు. అప్పట్లో మోదీని దూషించి ఇప్పుడు వంగి వంగి నమస్కారాలు పెడుతున్నారు. కేఎన్నార్ మీద ఎల్లోమీడియా నీచపు రాతలు రాస్తోంది. చంద్రబాబు ఆస్తి రెండు ఎకరాల నుండి లక్షల కోట్లు ఎలా సంపాదించారు?, సైకిల్ మీద తిరిగే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు ఎక్కడవి?, పచ్చళ్లు అమ్ముకునే రామోజీ, కిరణ్ లకు ఇప్పుడు వేల కోట్ల ఆస్తి ఎలా వచ్చింది?, వైఎస్ఆర్ సీపీని తొక్కేయటం ఎవరితరం కాదు. మా ఇంటి మీద దాడి, విధ్వంసం చేసిన వారిని ఇప్పటికీ ఎందుకు అరెస్టు చేయలేదు?, త్వరలోనే మళ్ళీ నా పోరాటం ప్రారంభిస్తా. మా ఇంటి నుంచి డీజీపీ ఆఫీసు వరకు ర్యాలీగా వస్తా. 29 కిలోమీటర్లు 'వినతి పాదయాత్ర' చేస్తా’ అని పేర్కొన్నారు. -
తెలంగాణలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి
-
వీళ్ళ బండారం ఎలా బయట పడిందంటే క్లుప్తంగా వివరించిన అంబటి
-
అబ్బబ్బబ్బా చంద్రబాబు వండిన చేపల పులుసు ఎంత రుచికరం..
-
ఒకసారి అద్దంలో చూసుకో.. ఏం పీకుతామో ఎన్నికల్లో చూపిస్తాం
-
చంద్రబాబుకు వైఎస్ జగన్ భయం పట్టుకుంది: అంబటి రాంబాబు
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్ర స్థాయిలో పెరిగిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అందుకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ కోసం వైఎస్సార్సీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్పై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని భయం చంద్రబాబుకు పట్టుకుందన్నారు. వైఎస్ ఫ్యామిలీ ఇప్పటివరకూ ఎన్నడూ పులివెందులలో ఓడిపోలేదన్నారు. గతంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ను ఓడించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన విషయం అంబటి రాంబాబు గుర్తుచేశారు. చంద్రబాబు నియంతలా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఇప్పటివరకూ మూడున్నర లక్షల కోట్లు అప్పు తెచ్చిన ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందన్నారు.కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీని తిట్టడం తప్ప ఏమైనా పాలన చేస్తుందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పంటలకు కనీసం గిట్టుబాటు ధర అందించడం లేదు. మెుక్కజొన్నకు ధరలు లేవని ప్రశ్నిస్తే గోడౌన్పై దాడులు జరుపుతున్నారు. యుద్ధం పేరు చెప్పి నిత్యావసర ధరలు పెంచితే కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా నిత్యావసరాల ధరలను తగ్గించే యత్నం చేసిందా చంద్రబాబు, లోకేష్ రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారన్నారని మాజీ మంత్రి మండిపడ్డారు. -
పెట్రో బాదుడు: వైఎస్సార్సీపీ పోరుబాటకు విశేష స్పందన
-
పిల్లల్ని కనడానికి వేలం పాటనా..? లోకేష్ కు ఎందుకు చెప్పలేదు
-
మంత్రికి ఆస్కార్ గ్యారంటీ.. యాక్టింగ్ ఇరగదీస్తున్నాడుగా..
-
తమిళనాడు కంటే APలో ₹10 ఎక్కువ దేశంలోనే అత్యధికం
-
వర్షం వస్తే మునిగిపోయే రాజధాని నాసిరకం నిర్మాణాలు
-
విజయ్ ని చూసి నేర్చుకో... నీ జన్మలో సీఎం కాలేవు!
-
నరేంద్ర.. రైతులపై దౌర్జన్యం చేస్తారా?: అంబటి ఫైర్
సాక్షి, గుంటూరు: ఏపీలో రైతులపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర దౌర్జన్యం చేస్తారా అని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మామిళ్లపల్లి ఘటనపై సిగ్గుపడాలి అని ఘాటు విమర్శలు చేశారు. రైతుల కాలి ధూళికి ధూళిపాళ్ల ఓడిపోతారు. ప్రశ్నించే వారిపైనే దాడులు చేస్తారా అంటూ మండిపడ్డారు.మొక్కజొన్న రైతులకు అండగా వైఎస్సార్సీపీ చలో మామిళ్లపల్లి పిలుపు నిలిచింది. మొక్కజొన్న రైతులపై దాడి, అక్రమ కేసులపై నిరసనలు చేపట్టింది. ఇందులో భాగంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘ఎమ్మెల్యే ధూళిపాళ్ల రైతుల గోడౌన్లు, ఇళ్లపై దాడులు చేయిస్తున్నారు. రైతులు దాచుకున్న మొక్కజొన్న గోడౌన్పై ధూళ్ళిపాళ్ల అనుచరులు దాడిచేశారు. మామిళ్ళపల్లి దాడితో సిగ్గు పడాలి. ప్రశ్నించే వారే లేరని దాడులు చేస్తున్నారా?. మా కుటుంబంపై, మా కులంపై, మా పార్టీపై కక్ష కట్టారా?. ఎన్నాళ్ళు మీకు అధికారం ఉంటుంది. అంతకుముందు ఓడిపోలేదా?.మూడేళ్ళ ముందే చెబుతాను రాసుకోండి.. వచ్చే ఎన్నికల్లో ధూళ్ళిపాళ్ల నరేంద్ర ఓడిపోవడం ఖాయం. గోడౌన్లు, ఇళ్లు, కార్యాలయాలపై దాడి చేస్తున్నారు. గుంటూరు ఐజి త్రిపాఠీ ఖాకీ డ్రెస్స్ వేసుకోవడం లేదు. పచ్చ డ్రెస్స్ వేసుకుంటున్నాడు. లోకేష్, పెమ్మసాని ఏది చెబితే అది చేస్తున్నాడు. అదే చేస్తున్నాడు. మీరు భయపడితే వంగవీటి మోహన్ రంగాలా చంపేస్తారు. తప్పు చేస్తే ఎంత పెద్ద అధికారి అయినా చట్ట ప్రకారం బట్టలు ఊడదీస్తాం. త్రిపాఠికి చెబుతున్నా.. తప్పుడు కేసు తొలగించాలి. అరెస్ట్ చేస్తే జైలు కొచ్చి కూర్చొంటాం. గోడౌన్లో ఉన్న మొక్కజొన్న వెంటనే రిలీజ్ చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
ఆ తండ్రీకొడుకులకు టైమ్ దగ్గర పడింది!
-
సిగ్గులేకుండా.. బానిస బతుకు బతుకుతున్నావ్.. నువ్వు నాకు చెప్పేదేంటి..?
-
నిమ్మల రామానాయుడు డ్రామాలొద్దు.. పని చెయ్!
-
సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్ప నీకు ఇంకేం వచ్చు? చేతకాని పాలనా.. అసమర్థుని పాలనా..
-
జగన్ పథకాలు ఆపేశారు.. పనికొచ్చే పథకం ఒక్కటీ లేదు
-
‘చంద్రబాబు బడాయి మాటలు తప్పితే చేసిందేమీ లేదు’
తాడేపల్లి : ఈ రెండున్నరేళ్ల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బడాయి మాటలు చెబుతూ మాత్రమే ప్రభుత్వాన్ని నడిపించారని, ప్రజలకు చేసేంది మాత్రం ఏమీ లేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ప్రజలకు ఏమీ చేయకపోవడంతో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్నారు. ఈరోజు(శనివారం, మే 9వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి రాంబాబు.. ‘ఒక్కో కాన్ఫరెన్స్ లో ఒక్కో అంశంపై బడాయి మాటలు చెప్పారు. కానీ ఈ ఏడు సమావేశాల్లో చెప్పిన ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. మోదీ కన్నా చంద్రబాబు పరిపాలనాదక్షుడు అని గొప్పలు చెప్పుకోవడం తప్ప చంద్రబాబు ఇంకేం చేశారు?, ప్రపంచానికి పాఠాలు చెప్తాననే చంద్రబాబు మంత్రులు బృందాన్ని సింగపూర్ ఎందుకు పంపారు?, సింగపూర్లో స్టడీ చేసి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారా?, ఇప్పుడు ఆ హామీలన్నీ ఎగ్గొట్టి సింగపూర్ లో ఏం చేశారు?, ఎన్నికలకు ముందు చూపించిన మేనిఫెస్టో ఇప్పుడు ఎక్కడుంది?, ఈ రెండేళ్లలో ఒక్క పేదోడికీ గజం స్థలం కూడా ఇవ్వలేదు. వార్డు, గ్రామ సచివాలయాలను సర్వ నాశనం చేశారు. ఏ పంటకీ గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడి పోతున్నారు. ఆరోగ్యశ్రీ, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, ఫీజు రియంబర్స్మెంట్ ఏమయ్యాయి?, సింగపూర్ పర్యటన కేవలం షికారు కోసమే. ఆర్భాటం తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఏ ఒక్కటీ చేయలేదు. ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఇది. జగన్ హయాంలో జరిగినంత వేగంగా పనులు జరగటం లేదు. ఇచ్చిన డబ్బులు కూడా ఎందుకు ఖర్చు చేయలేదని కేంద్రమే ప్రశ్నించింది. రాయలసీమ లిఫ్టును రేవంత్రెడ్డికి గిఫ్టుగా ఇచ్చారు. సోషల్ మీడియా పోస్టులపై మళ్ళీ అక్రమ కేసులు పెట్టటం దుష్ట సంప్రదాయం. ఎంతమందిని అరెస్టు చేసినా వెనక్కు తగ్గేదే లేదు. క్రిమినల్స్ని కంట్రోల్ చేయాల్సిన పోలీసుల్ని సోషల్ మీడియా వాళ్ల మీద ప్రయోగిస్తారా?, వెలిగొండలో మంత్రి రామానాయుడు చాలా డ్రామాలు చేస్తున్నారు. ఫోటోలకు స్టిల్ ఇవ్వటం తప్ప ప్రాజెక్టుకు ఎప్పుడు నీరు ఇస్తారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
సింగిల్ గా సింహంలా గర్జించాడు.. విజయ్ గెలుపు పై అంబటి రియాక్షన్
-
స్టేషన్ లో వాళ్ళు అడిగిన ప్రశ్నలు.. అంబటి రియాక్షన్
-
లోకేష్ రాసిపెట్టుకో... నా ప్రాణం పోయినా సరే అబ్బా కొడుకుకు అంబటి వార్నింగ్
-
అంబటిపై మరో కేసు.. పోలీస్ స్టేషన్ లో విచారణ
-
నేను అనుభవించినదానికి కంటే 10రేట్లు ఎక్కువ అనుభవించేలా చేయకపోతే
-
కూటమిని కూలుస్తాం.. జగన్ను మళ్లీ సీఎం చేస్తాం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తప్పుడు వాగ్దానాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని కూలదోసే దాకా తగ్గేదే లేదంటున్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు. తనపై బనాయించిన అక్రమ కేసుల విచారణలో భాగంగా గురువారం ఆయన జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన పని వైస్సార్సీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపింది. తొలుత గండి వీరాంజనేయ దేవస్థానానికి వెళ్లిన అంబటి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇడుపులపాయలోని వైఎస్సార్ఘాట్ను సందర్శించి మహానేత రాజశేఖర్రెడ్డికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా.. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలోనే కూలుస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. వైఎస్ జగన్ను మళ్లీ అధికారంలోకి తెచ్చే వరకూ అలుపెరగని పోరాటం చేస్తామని.. ఈ పోరాటంలో ఎన్ని కుట్రలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైనా ధైర్యంగా పోరాడతామని.. వైఎస్సార్ సాక్షిగా ఇదే నా ప్రతిజ్ఞ అని అన్నారాయన.ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అంబటి రాంబాబుపై అక్రమ కేసు బనాయించింది కూటమి ప్రభుత్వం. ఈ వ్యవహారంలో అంబటి తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకుని క్షమాపణలు కూడా చెప్పారు. అయినా కూడా వినకుండా టీడీపీ గూండాలు ఆయన ఇల్లు, ఆఫీస్పై దాడి చేసి విధ్వంసం సృష్టించాయి. ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయకపోగా.. టీడీపీ నేతల ఫిర్యాదు నేపథ్యంతో అంబటిపైనే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. రెండువారాల పాటు రాజమండ్రి జైల్లో ఉన్న ఆయన బెయిల్పై విడుదలయ్యారు. అప్పటి నుంచి దాడి చేసిన వాళ్లపై, కస్టడీలో తనను టార్చర్ చేసిన పోలీసు అధికారులపై చర్యలు కోరుతూ ధర్మ పోరాటం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కేసుల విచారణలో భాగంగా.. వేంపల్లి, పులివెందుల పోలీస్ స్టేషన్లలో ఇవాళ విచారణకు అంబటి హాజరవుతున్నారు. -
గుంటూరు కలెక్టరేట్ వద్ద రేపు భారీగా ధర్నా చేస్తాం
-
అన్న క్యాంటీన్పై రిపోర్టర్ ప్రశ్న,అంబటి అదిరిపోయే రిప్లై
-
అంబటిపై మరో కేసు
-
అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వ కుట్రలు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తాజాగా మరో అక్రమ కేసు నమోదు అయ్యింది. ఆయన ట్రాఫిక్కు అంతరాయం కలిగించారన్నది ఈసారి పోలీసుల వాదన. తన నివాసంపై దాడి చేసి విధ్వంసం చేసిన టీడీపీ గూండాలను అరెస్ట్ చేయాలని.. కస్టడీలో తనను హింసించిన పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఆయన శనివారం ఈ దీక్ష చేశారు. అయితే.. ఆయన అనుమతి తీసుకోలేదని.. పైగా ఆ దీక్ష వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలిగిందని పేర్కొంటూ నగరంపాలెం పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామంపై వైఎస్సార్సీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ‘‘నా ఇంటిపై దాడి చేసి నన్నే 18 రోజులు రాజమండ్రి జైలు పెట్టారు. అరెస్టు చేశాక పోలీస్ స్టేషన్లో(నల్లపాడు) నన్ను హింసించాలని ప్రయత్నించారు. మరి దాడి చేసినవాళ్లను 18 నిమిషాలైనా జైల్లో పెట్టారా?. పోలీసుల సమక్షంలోనే నా ఇంటిపై దాడి జరిగింది. గుంటూరులో ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదు. గుంటూరులో ఇళ్లపై దాడి చేసే సంస్కృతిని పెమ్మసాని తీసుకొచ్చారు. చంద్రబాబు, లోకేష్, పెమ్మసాని ఆదేశాలతోనే నా ఇంటిపై దాడి జరిగింది. వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. టీడీపీ నేతలు నన్ను భయపెట్టలేరు. టీడీపీ నేతల బెదిరింపులకు వైఎస్సార్సీపీ నేతలు భయపడరు. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి చట్టబద్దంగా తేలుస్తా. దాడిపై న్యాయ పోరాటం... ప్రజా పోరాటం చేస్తా. నేను చేస్తుంది ధర్మపోరాటం. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు’’ అని అంబటి రాంబాబు దీక్ష సందర్భంగా ప్రసంగించారు. -
‘మాకు అధికారం ఉంది..మేం తలచుకుంటే నరికేయగలం’
సాక్షి, రాజమహేంద్రవరం: ‘ఏంట్రా యదవల్లారా మీరు నరికేది. మేమే నరకగలం. మాకు అధికారం ఉంది. మేం తలచుకుంటే మిమ్మల్ని నరికేయగలం’ అని కాపునేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి రెచ్చిపోయారు. ఆదివారం రాజమహేంద్రవరంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ‘పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలితే అంబటి అయినా.. గిమ్మటి అయినా గుమ్మటం పట్టించేస్తాం. మా కార్యకర్తలు తలచుకుంటే గుమ్మం దాటి బయటకు రాలేరు. అసలు ప్రజాస్వామ్యం గురించి వైఎస్సార్సీపీకి తెలుసా?’ అంటూ మండిపడ్డారు. జగన్కి అమరావతిలో అభివృద్ధి జరగడం ఇష్టం లేదన్నారు. కాగా, రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం ఏ స్థాయిలో వెర్రితలలు వేస్తోందో చెప్పడానికి బుచ్చయ్యచౌదరి వ్యాఖ్యలే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై.. ప్రొటెం స్పీకర్గా.. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన బుచ్చయ్యచౌదరి ఈ స్థాయిలో దిగజారి దారుణమైన వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు నిదర్శనమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. -
‘ఏపీకి రాజధాని లేకపోవడానికి కారణం చంద్రబాబే’
గుంటూరు: ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు అవినీతే దీనికి కారణమని చెప్పారు. అవినీతి కోసమే అమరావతిని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. గుంటూరులో అంబటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు.‘రాజధాని పేరుతో చంద్రబాబు తన వారికి దోచిపెడుతున్నారు. రాజధాని నిర్మాణానికి రూ.2 లక్షల ఖర్చు పెడతామంటున్నారు. అమరావతి పేరుతో భయంకరమైన దోపిడీకి చంద్రబాబు తెరదీశారు. ఇప్పటివరకు రాజధాని కోసం రూ.45 వేల కోట్ల అప్పు తెచ్చారు. అప్పులు తెచ్చి రాజధాని నిర్మించాల్సిన అవసరం ఉందా?మావిగన్ ప్రతిపాదనతో ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మించవచ్చని జగన్ మావిగన్ ప్రతిపాదన తెచ్చారు. మావిగన్ ప్రతిపాదనతో టీడీపీలో భయం పట్టుకుంది. అందుకే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మావిగన్పై కొందరు కావాలనే ట్రోల్స్ చేస్తున్నారు’ అని అంబటి రాంబాబు చెప్పారు.అమరావతి అసాధ్యమనే మావిగన్ ప్రతిపాదనహైదరాబాద్, బెంగళూరు వంటి మహా నగరాల్లో ఏదైనా ఓ నిర్మాణం చేపట్టాలంటే గరిష్టంగా చదరపు అడుగుకు రూ.4500 ఖర్చవుతుందని అంబటి రాంబాబు అన్నారను. ‘తాడేపల్లి, గుంటూరు వంటి చోట్ల కట్టినా చదరపు అడుగుకు రూ.2500 అవుతుంది. పైస్టార్ హోటల్ లెక్కన కట్టినా చదరపు అడుగుకు విజయవాడ, గుంటూరుల్లోనూ రూ.3500 కంటే ఎక్కువ కాదు. కానీ అమరావతిలో మాత్రం చదరపు అడుగుకు రూ.14 వేల నుంచి రూ.16 వేలు ఖర్చు పెట్డడం దోపిడీ కాదా? అనేక సందర్భాల్లో ప్రభుత్వం దీనిపై సమాధానం చెప్పలేకపోతోంది. మేం దోచుకుంటాం, మీరు చూస్తూ ఉండండి అంటున్నారు. అమరావతిలో రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాయాల కోసమే రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్ధితి. ఇంత భయంకరమైన దోపిడీకి చంద్రబాబు అమరావతి పేరుతో తెర దీశారు. ఇప్పటికే రూ.75 వేల కోట్లు ప్రాథమిక వసతుల కోసం ఖర్చు పెట్టాలని అనుకున్నారు. ఇందులో రూ.45 వేల కోట్లు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చారు. ఆర్ధికంగా దెబ్బ తిన్న రాష్ట్రానికి లక్షల కోట్లు అప్పు తెచ్చి అమరావతి నిర్మించాల్సిన అవసరం ఉందా అని అడుగుతున్నాం. అందుకే జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనే ప్రతిపాదన తెచ్చారు. దీంతో చంద్రబాబు గుండెల్లో రాయిపడినట్లయింది. దీనిపై జనం ఆలోచించడం మొదలుపెట్టారు. అందుకే మావిగన్ మీద బూతులతో ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇవాళ అంతా రివర్స్ అయింది. వాళ్ల వాదన తప్పని తేలిపోయింది. మావిగన్ పై రాష్ట్రమంతా చర్చ జరుగుతోంది’ అని చెప్పారు. -
కాపు టైగర్ దీక్ష అంటే ఆ మాత్రం ఉండాలి..
-
KGF డైలాగుతో దడదడలాడించిన శ్యామల
-
అంబటి రాంబాబు నిరాహార దీక్ష విరమణ
గుంటూరు: వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు తన నిరాహార దీక్షను విరమించారు. తనను కస్టడీలో హింసించిన పోలీసులు సస్పెండ్ చేయాలని.. తన ఇల్లు, ఆఫీస్పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు(శనివారం) తెల్లవారుజామునుంచే జిల్లా కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షకు దిగారు అంబటి రాంబాబు. ఆ నిరాహార దీక్షను సాయంత్రం వరకూ అంబటి కొనసాగించారు. మాజీ హోంమంత్రి సుచరిత.. అంబటి రాంబాబు దీక్షను విరమింపజేశారు. అంబటి దీక్షకు వైఎస్సార్సీపీ నేతలు సంఘీభావం ప్రకటించారు. ఆయనకు మద్దతుగా వైఎస్సార్సీపీ శ్రేణులు దీక్షా శిబిరానికి తరలివచ్చాయి. దీనిలో భాగంగా సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. అంబటి ఇంటిపై దాడి హేయమని, 7 గంటల పాటు దాడులు జరిగినా పోలీసులు స్పందించకపోవడం దారుణమన్నారు. అంబటిని వేధించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. దాడి చేసిన టీడీపీ గూండాలను అరెస్ట్ చేయాలన్నారు. -
అంబటి రాంబాబు దీక్ష వద్ద జడ శ్రావణ్ స్పీచ్
-
మమ్మల్ని హింసించిన వారిని 2029 తరువాత కులం,మతం చూడకుండానే బొక్కలో వేస్తాం
-
అంబటి రాంబాబు దీక్ష వద్ద జోగి రమేష్ స్పీచ్
-
అంబటి రాంబాబు దీక్ష వద్ద విడదల రజిని స్పీచ్
-
వంగవీటి అడుగు జాడల్లో దీక్ష.. అంబటి అన్నకు మేమున్నాం
-
నా ప్రాణం పోయినా ఏ ఒక్కడిని వదలను.. అంబటి రాంబాబు ఉగ్రరూపం
-
అంబటి రాంబాబు నిరాహార దీక్ష
-
ఎవరినీ వదిలిపెట్టను: అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: కస్టడీలో తనను హింసించిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. ఇవాళ(ఏప్రిల్ 18, శనివారం) గుంటూరు కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నిరాహార దీక్ష చేపట్టారు. సాయంత్రం 6 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. అంబటి దీక్షకు వైఎస్సార్సీపీ నేతలు సంఘీభావం తెలిపారు. దీక్ష సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. తన ఇంటిపై దాడి చేసి నన్నే 18 రోజులు రాజమండ్రి జైల్లో పెట్టారని.. పోలీసుల సమక్షంలోనే తన ఇంటిపై దాడి జరిగింది. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలన్నారు.‘‘నా ఇంటిపై దాడి చేసిన వారిని వదలిపెట్టను. చంద్రబాబు, లోకేష్, పెమ్మసాని ఆదేశాలతోనే నా ఇంటిపై దాడి జరిగింది. గుంటూరులో ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదు. గుంటూరులో ఇళ్లపై దాడి చేసే సంస్కృతిని పెమ్మసాని తీసుకొచ్చారు. పెమ్మసాని ఓడిపోతే అమెరికాకు స్పెషల్ విమానంలో వెళ్లిపోతారు. చంద్రబాబు, లోకేష్, పెమ్మసానిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. టీడీపీ నేతలు నన్ను భయపెట్టలేరు. టీడీపీ నేతల బెదిరింపులకు వైఎస్సార్సీపీ నేతలు భయపడరు’’ అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు...నా ఇల్లు, ఆఫీసుపై అత్యంత దారుణంగా దాడి చేశారు. కార్లు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఇష్టం వచ్చినట్లు తిట్టారు. ఇదంతా పోలీసుల సమక్షంలో జరిగింది. నేను చంద్రబాబును దూషించానని అరెస్టు చేసి 18 రోజులు జైల్లో ఉంచారు. నా ఇంటిపై దాడి చేసిన వారిని 18నిమిషాలైనా జైలుకు పంపించారా?. ఇప్పటికైనా నా ఇల్లు, ఆఫీసుపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. నన్ను అరెస్టు చేసిన తర్వాత నల్లపాడు పోలీస్ స్టేషన్ లో నన్ను హింసించాలని ప్రయత్నించారు. కస్టోడియల్ టార్చర్పై చర్యలు లేవు...దాడి వెనుక లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. దాడికి పాల్పడిన వారినఎవరినీ వదిలిపెట్టను. దాడికి పాల్పడినవారిని జైలుకు పంపించే వరకూ పోరాటం ఆగదు. ఇళ్లపై దాడులు చేసే సంస్కృతి గుంటూరులో తీసుకొచ్చింది పెమ్మసాని చంద్రశేఖర్. ఇప్పటికైనా ఇద్దరు సీఐలను సస్పెండ్ చేయండి. అంబటిని భయపెట్టాలనుకుంటే మీది పొరపాటే. ఇప్పటికైనా చట్టబద్ధంగా వ్యవహరించండి. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి చట్టబద్దంగా తేలుస్తా. దాడిపై న్యాయ పోరాటం... ప్రజా పోరాటం చేస్తా. నేను చేస్తుంది ధర్మపోరాటం. పవన్ కళ్యాణ్ దుర్మార్గమైన పాలనకు మద్దతిస్తున్నారు’’ అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు. -
నిరాహార దీక్షకు దిగిన అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు శనివారం వేకువఝామున జిల్లా కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షకు దిగారు. తనను కస్టడీలో హింసించిన పోలీసులు సస్పెండ్ చేయాలని.. తన ఇల్లు, ఆఫీస్పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారాయన. అంబటి దీక్షకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఆయనకు మద్దతుగా వైఎస్సార్సీపీ శ్రేణులు దీక్షా శిబిరానికి తరలి వస్తున్నాయి. సాయంత్రం దాకా ఈ దీక్ష కొనసాగనుంది.ముఖ్యమంత్రి చంద్రబాబుపై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. టీడీపీ శ్రేణులు నవభారత్ నగర్లోని అంబటి నివాసం, కార్యాలయాన్ని ముట్టడించాయి. తన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చినా కూడా గుంపుగా వచ్చి ఇంటిపై రాళ్లు రువ్వి, అక్కడున్న వాహనాలను ధ్వంసం చేసి విధ్వంసంతో వీరంగం సృష్టించాయి. ఆపై నాటకీయ పరిణామాల నడుమ అంబటిని పోలీసులు అరెస్ట్ చేశారు(జనవరి 31న). అంబటి రాంబాబు అరెస్ట్ ఏపీలో రాజకీయ కలకలం రేపింది. ఆయన్ని బయటకు రానివ్వకుండా పలు కేసులను తెరపైకి తెచ్చింది కూటమి ప్రభుత్వం. చివరకు న్యాయ వ్యవస్థ జోక్యంతో ఆయన రెండు వారాల తర్వాత(ఫిబ్రవరి 18న) రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. -
ఈ రెండేళ్లలో మీ సరదాలన్ని తీర్చుకోండి ఒకొక్కడికి ఎలా ఉంటుందో చూస్తారు..
-
న్యాయం కోసం 12 గంటలపాటు నిరసన దీక్ష: అంబటి
సాక్షి, విజయవాడ: ఈ నెల 18వ తేదీన గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిరసన నిరాహార దీక్ష చేస్తున్నానని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నన్ను అరెస్ట్ చేసిన దగ్గర్నుంచి కోర్టులో ప్రవేశపెట్టే వరకూ పోలీసులు నాతో చట్టవ్యతిరేకంగా ప్రవర్తించారు. నన్ను హింసించాలని పోలీసులు ప్రయత్నం చేశారు. ఇదే విషయాన్ని కోర్టుకు కూడా చెప్పాను. నన్ను హింసించిన అధికారులపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని రిప్రజెంటేషన్ ఇచ్చాను’’ అని అంబటి తెలిపారు.‘‘నన్ను హింసించిన అధికారులను సస్పెండ్ చేసి విచారణ చేపట్టాలి. నాపై, నా ఇల్లు, నా ఆఫీస్, నా కుటుంబంపై దాడి చేసి చంపాలని చూసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నాపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించాలి. నాకు జరిగిన అన్యాయంపై పోరాటంలో భాగంగానే 12 గంటల పాటు నిరసన నిరాహార దీక్ష చేస్తున్నా.. నా దీక్షకు మద్దతు పలకాలని అందరినీ కోరుతున్నా. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసుల్లో నన్ను ఇరికించింది. అన్యాయంగా నన్ను 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్భంధించింది...నేను జైల్లో ఉన్నప్పుడు జడ శ్రావణ్ కుమార్ నాకు పూర్తి మద్దతు ఇచ్చారు. నా కుటుంబంతో పాటు జైల్లో ఉన్న నన్ను కలిసి జడ శ్రావణ్ కుమార్ ధైర్యం చెప్పారు. జడ శ్రావణ్ కుమార్కు ధన్యవాదాలు చెప్పేందుకు ఆయన్ని కలిశాను. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని పోలీసులు అక్రమంగా ఎత్తుకుపోయారు. కుప్పంలో సోషల్ మీడియా కేసు పెడితే రౌడీల్లాగా వచ్చి ఎత్తుకుపోయారు. పోలీసు వ్యవస్థ ఉన్నది దేనికి.. చంద్రబాబు, లోకేష్ చేతిలో ఆయుధంలా పనిచేయడానికేనా? ప్రభుత్వం, పోలీసులు ఉన్నది కక్ష సాధించడానికి కాదు’’ అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు.పూడి శ్రీహరి అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నా: జడ శ్రావణ్ కుమార్ అంబటి రాంబాబును ప్రభుత్వం వేధించిన తీరు అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. సాటి న్యాయవాదిగా నేను అంబటికి సంఘీభావం తెలిపాను. 2024 జూన్ 4 తర్వాత రాష్ట్రంలో అప్రజాస్వామ్యకమైన పాలన సాగుతోంది. పోలీసులు సీఆర్పీసీ, ఐపీసీని కాకుండా కూటమి నేతలు రాసిన రెడ్బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారు. లడ్డూపై తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో మతపరమైన అంశాలను చొప్పించాలని కూటమి నేతలు ప్రయత్నించారు.అంబటి రాంబాబు ఇంటిపై అత్యంత పాశవికంగా దాడి చేశారు. ఆ రోజు పరిస్థితిని తలుచుకుని నేటికీ అంబటి కుటుంబం వణికిపోతోంది. అంబటి ఇంటిపై దాడి చేసేందుకే మీకు 164 సీట్లు ఇచ్చారా అని లోకేష్ ను ప్రశ్నిస్తున్నా. అంబటి రాంబాబు ఇంటిపై దాడిని ఖండించకుండా లోకేష్ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు. కత్తి పట్టిన వాడు కత్తికే పోతాడు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నా.ఇది మీడియాపైన దాడిగానే జై భీమ్ పార్టీ భావిస్తోంది. అరెస్టుల ద్వారా మీ చిలిపి ఆనందాలు తీర్చుకోవాలని భావిస్తున్నారు. మీరు తీర్చుకోవాల్సిన చిలిపి ఆనందాలు ఏవైనా ఉంటే ఈ రెండేళ్లలో తీర్చేసుకోండి. ఆ తర్వాత మీ చిన్న చిన్న ఆనందాలు మీకు పెద్ద శాపాలుగా మారడం ఖాయం. నన్ను అరెస్ట్ చేయాలని కూటమి ప్రభుత్వం రకరకాలుగా ప్రయత్నిస్తోంది. కూటమి అన్యాయాల పై చేసే న్యాయ పోరాటాలకు నా మద్దతు కచ్చితంగా ఉంటుంది -
శ్రీహరినే బయపెట్టాలనుకుంటున్నారా అరెస్ట్ అంబటి రియాక్షన్
-
జెడ శ్రవణిను కలిసిన అంబటి రాంబాబు
-
పూడి శ్రీహరి అక్రమ అరెస్ట్.. అంబటి స్ట్రాంగ్ రియాక్షన్
-
ABN రాధాకృష్ణ కు సపోర్ట్ చేస్తూ వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు.. అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్
-
వెనుదిరిగే ప్రసక్తేలేదు: అంబటి రాంబాబు
సాక్షి, పుత్తూరు: పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోందని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రజాసమస్యలపై నిరసనలు తెలిపితే అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని తంబిరెడ్డిని కిడ్నాప్ చేసి, మూడు రోజుల తర్వాత పోలీసులు కేసు పెట్టారని తెలిపారు. పుత్తూరులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఇంటికి అంబటి రాంబాబు వెళ్లారు.ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పోలీసులతో అణచివేయాలని చూస్తే వెనుదిరిగే ప్రసక్తేలేదని అన్నారు. బలిజలు, కాపులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. పవన్ కల్యాణ్ స్పందించకుంటే కాపులను మోసం చేసినట్లేనని చెప్పారు.కాగా, కొన్ని రోజుల క్రితం పోలీసులు తిరుపతి మండలానికి చెందిన వైఎస్సార్సీపీ నేత సర్పంజరి తంబిరెడ్డిని గుంటూరుకు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. రెండు రోజులపాటు అజ్ఞాతంలో ఉంచి, చిత్రహింసలు పెట్టారు. కుటుంబ సభ్యులు తిరుపతిలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. తంబిరెడ్డి జాడకోసం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు కావడం.. ఈ వ్యవహారాన్ని న్యాయమూర్తి సీరియస్గా పరిగణించడంతో ఎట్టకేలకు గుంటూరు లాలాపేట పోలీసుల అదుపులో ఉన్నట్టు హైకోర్టుకు సమాచారం ఇచ్చారు.మరోవైపు, బాపట్లలో ఆదివారం (ఏప్రిల్ 12) చెరుకుపల్లి ఎస్సై అనిల్కుమార్ ఓవరాక్షన్ చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్త కృష్ణార్జునరెడ్డిని చితకబాదారు. వైఎస్సార్సీపీ నేతల పోస్టులను స్టేటస్ పెట్టుకున్నందుకు దాడి చేశారు. ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. -
నారాయణ స్వామి నివాసానికి అంబటి రాంబాబు
-
ABN రాధాకృష్ణపై కంప్లెంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీసుల తీరు.. కడిగిపారేసిన అంబటి..!
-
దమ్ము లేని దద్దమ్మ.. ఏబీఎన్ రాధాకృష్ణపై అంబటి ఫైర్
-
అంబటి VS పోలీస్ మాట్లాడకుండా ఇచ్చిపడేసాడు
-
మహిళలను రాధాకృష్ణ దారుణంగా అవమానించాడు: అంబటి
గుంటూరు: ఏబీఎన్ ఆఫీసుల వద్ద నిరసనలు చేస్తే అడ్డుకుంటారా? అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ శాంతియుతంగా నిరసన తెలిపింది. అయితే, వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల తీరుపై అంబటి రాంబాబు మండిపడ్డారు.‘నా ఇంటిని రౌడీ మూకలు ముట్టడిస్తే నో పోలీస్. మా ఇంటిపై పెట్రోల్ బాంబులు వేస్తే పోలీసులు ఆపలేదు. సందులో ఏబీఎన్ ఆఫీస్ వద్ద నిరసన తెలిపితే లాఠీఛార్జ్ చేస్తారా? మహిళలను ఏబీఎన్ రాధాకృష్ణ దారుణంగా అవమానించాడు. రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి’ అని అంబటి రాంబాబు అన్నారు.కాగా, గుంటూరులో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఏబీఎన్ ఆఫీస్ ఎదుట వైఎస్సార్సీపీ నేతల నిరసన తెలిపారు. ఆ సమయంలో మాజీ మంత్రి అంబటిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఏబీఎన్ ఆఫీస్ ఎదుట అంబటి రాంబాబు, పార్టీ నేతలు బైఠాయించారు. వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు ఓవరాక్షన్ చేశారు. పోలీసుల అరాచకంపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.మరోవైపు, ఏపీలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ చేపట్టిన ఆంధ్రజ్యోతి కార్యాలయాల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఏబీఎన్ రాధాకృష్ణకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ వచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఏబీఎన్ రాధాకృష్ణ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకోబోమని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు. -
క్షమాపణ చెప్తావా.. గంగలో దూకుతావా. ABN రాధాకృష్ణపై రెచ్చిపోయిన అంబటి
-
మావిగన్ పేరెత్తగానే ఎందుకు అంత భయపడుతున్నారు?
-
అమరావతి కాదు కమ్మరావతి.. రేణుకా చౌదరికి అంబటి అదిరిపోయే కౌంటర్
-
"పిలవరా కమ్మరావతి.." రేణుక చౌదరికి అంబటి కౌంటర్
-
‘మావిగన్’ ప్రతిపాదనతో టీడీపీలో వణుకు మొదలైంది’
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘మావిగన్’ ప్రతిపాదనకు టీడీడీలో వణుకు మొదలైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అంతులేని కథలా సాగుతున్న అమరావతిని పూర్తి చేయలేనని చంద్రబాబే ఇవాళ ప్రెస్ మీట్లో అంగీకరించారని, ప్రత్యామ్నాయంగా వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మావిగన్ ఆలోచనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రం అవుతుంది. అమరావతి కోసం రాష్ట్రాన్ని దివాళా తీయించడం మానుకోవాలని చంద్రబాబుకు ఆయన హితవు పలికారు.అమరావతికి 2 లక్షల కోట్లు ఖర్చుపెట్టినా పూర్తి కాదని, దానికి బదులు కేవలం 20 వేల కోట్లతో పూర్తయ్యే మావిగన్ ఆలోచనే సరైనదని అంబటి రాంబాబు తెలిపారు. దీనిపై ప్రజలు కూడా ఆమోదించే పరిస్ధితికి వస్తున్నారని అన్నారు. ఇది తట్టుకోలేకే ఎల్లో మీడియా, పసుపు పార్టీలు ట్రోలింగ్స్ నడుపుతున్నాయని, త్వరలోనే అవన్నీ పటాపంచలు అవుతాయన్నారు.ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు ఇంకేమన్నారంటే... జగన్ చెప్పిన మావిగన్పై రాష్ట్రంలో చర్చరెండు, మూడు రోజుల నుంచీ రాష్ట్రవ్యాప్తంగా మావిగన్ అనే పదం మీద చర్చ జరుగుతోంది. తెలుగు ప్రజలు ఉన్న ప్రతీ చోటా ఈ చర్చ జరుగుతోంది. అద్భుతమైన చర్చకు ప్రజలు ముందుకొచ్చారు. మావిగన్ అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారు. చంద్రబాబుకు డిక్షనరీలో ఈ పదం కనిపించడం లేదంట. ఉడా, తుడా, గుడా అంటే మాత్రం కనిపిస్తున్నాయా ?, మావిగన్ అనే ఓ కొత్త ఆలోచనను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం తెరపైకి తెచ్చారు. ఏ విధంగా ఆయన దీన్ని తెచ్చారో అంతా చూశారు. చంద్రబాబు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాడు.అది తెలియక చేస్తున్నాడో, మితిమీరిన తెలివితేటల వల్ల చేస్తున్నాడో అర్దం కాదు. ఓ సాధ్యం కాని ప్రతిపాదన పెట్టి అంతులేని కథలా లాగుతున్నాడు. ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు. చంద్రబాబు మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ముందు 50 వేల ఎకరాలు అన్నాడు, ఇప్పుడు లక్ష ఎకరాలు అంటున్నాడు. తన బంధుమిత్రులకు అమరావతిని దోచిపెట్టే కార్యక్రమం తప్ప రాజధానిని అభివృద్ధి చేసి గ్రోత్ ఇంజన్ గా తయారు చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదు. ఇవాళ చంద్రబాబు ప్రెస్ మీట్ చూస్తే ఆ విషయం ఇట్టే అర్దమవుతోంది.2029కి అమరావతి పూర్తి కాదని చంద్రబాబే ఒప్పుకున్నారు2028-29కి రాజధాని అమరావతి పూర్తి కాదనే విషయాన్ని చంద్రబాబు ఇవాళ ఒప్పుకున్నారు. గతంలోనూ ఇలాగే పూర్తి చేయకుండా అన్నీ తాత్కాలికం చేశారు. ఈ 2028-29కి కూడా ఆ ఏడు భవనాలు పూర్తి చేస్తే చేస్తాడు, లేకపోతే అవీ చేయడు. టీడీపీ వాళ్లు కూడా చంద్రబాబు ప్రెస్ మీట్ ను ఓసారి పరిశీలిస్తే ఇదే అర్థమవుతుంది.2028-29కి ఈ ఏడు బిల్డింగ్లు పూర్తి చేస్తామన్నారు. నవనగరాలు మాత్రం గాలికి పోయాయి. ఈ ఏడు బిల్డింగ్లు పూర్తి చేస్తే చాలన్న ప్రయత్నం చంద్రబాబు చేస్తున్న నేపథ్యంలో వైఎస్ జగన్ మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు కలిపి మావిగన్ గా తయారవుతుందని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రజలు కూడా దాన్ని ఆమోదించే దశకు వస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు అమరావతిని పూర్తి చేయలేడన్న విషయం అందరికీ అర్ధమైంది.ఆయన చెప్పిన తరహాలో చేయాలంటే 2 లక్షల కోట్లు కావాలి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? రాష్ట్ర ఆర్దిక పరిస్జితి ఎలా ఉంది ? ప్రభుత్వం చేయాల్సిన పనులకే డబ్బులు లేవు, ఇక రాజధాని ఎలా పూర్తవుతుంది ? కాబట్టి 2 లక్షల కోట్లు పెట్టి అమరావతి పూర్తి చేస్తానన్న మాట బూటకంలా ఉంది తప్ప వాస్తవంగా పూర్తి చేసే పరిస్ధితి లేదన్నది అర్దమవుతోంది. చంద్రబాబు ఏడు బిల్డింగ్ లు పూర్తి చేస్తాను అన్నాడు తప్ప మొత్తం రాజధాని పూర్తి చేస్తానన్న ధైర్యం చేయలేకపోతున్నాడు. అంటే అప్పులు తెస్తారు, కాంట్రాక్టులు ఇస్తాడు, కమిషన్లు తీసుకుంటాడు, కోట్లు కోట్లు తీసుకుంటాడు తప్ప రాజధాని మాత్రం పూర్తి చేయడు. ఇప్పటికీ ఏడు బిల్డింగ్ లు పూర్తి చేసి చేతులు దులుపుకునే పరిస్ధితుల్లో ఉన్నాడు. ఎందుకంటే భగవంతుడు దిగివచ్చినా దాన్ని పూర్తి చేయలేడు, చంద్రబాబు అంత పెద్ద ప్లాన్ వేశాడు మరి. 2 లక్షల కోట్లు ఖర్చుపెడిటే నీళ్లు, కరెంటు, డ్రైనేజీ, రోడ్లు వస్తాయి తప్ప నగరం ఏర్పడదు. నగరం నిదానంగా ఏర్పడితే అప్పటికి చంద్రబాబూ ఉండదు, ఎవరూ ఉండరు.మావిగన్ ట్రోలింగ్స్కు వైఎస్సార్సీపీ భయపడదుఅమరావతి తీర్మానం అసెంబ్లీలో తప్ప మండలిలో పెట్టలేదు. లోక్ సభ, రాజ్యసభలో బిల్లు తెచ్చారు. అమరావతి రాజధానిని మార్చే అవకాశమే లేదంటున్నారు. ఎందుకు లేదు ?, రాజ్యాంగాన్నే సవరిస్తుంటే, అసెంబ్లీలో ఒక చట్టం చేస్తే సవరించలేరా ?, ఇది కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే. ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి మావిగన్ ఆలోచనను తెరపైకి తెచ్చారు. దీంతో తండ్రీ కొడుకులకు భయం పట్టుకుంది. ఈ చర్చలోకి జనం వస్తున్నారు కాబట్టి ఏదో విధంగా గందరగోళం చేద్దామని వెయ్యి, రెండు వేల సోషల్ మీడియా పేజీల్ని, యూట్యూబ్ ఛానల్స్ కొనేసి ట్రోల్ చేస్తున్నారు.ఈ ట్రోలింగ్స్ కు మేం భయపడతామా ?, అందులో వాస్తవం ఉంటే ఈ ట్రోలింగ్స్ అన్నీ పటాపంచలైపోతాయి. మావిగన్ ఆలోచన తెచ్చాక ఆంధ్ర రాష్ట్రంలో బృహత్తర చర్చ జరుగుతోంది. అమరావతి ఎలాగో పూర్తి కాదు, అందులో పెట్టుబడులు పెట్టినా వృథా అనే నిర్ణయానికి చాలా మంది వచ్చేశారు. అందుకే ఏంటీ మావిగన్, అమరావతి ఏంటనే చర్చ జరుగుతోంది. గుంటూరు బస్టాండ్లో బస్సెక్కి అమరావతికి టికెట్ తీసుకుంటే అమరావతి గుడికి తీసుకెళ్తారు తప్ప ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియదు.20 వేల కోట్లతో పూర్తయ్యే గ్రోత్ ఇంజన్ మావిగన్ ఈ మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి 9536 చదరపు కిలోమీటర్ల మెగా విస్తీర్ణం. అమరావతి విస్తీర్ణం చూస్తే 217 చదరపు కిలోమీటర్లు మాత్రమే. కేవలం 20 వేల కోట్లతో మావిగన్ ను పూర్తి చేయొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మౌలిక సదుపాయాలు, భవనాలు, రోడ్లు ఉన్నాయి. కొత్తగా ఏదో చేయాల్సిన అవసరం లేదు. కానీ అమరావతిలో మాత్రం విద్యుత్, డ్రైనేజీ, మౌలిక సదుపాయాల కోసం భారీ ఖర్చు పెట్టాల్సిందే. మావిగన్ అనేది కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు మూడు జిల్లాలతో కూడుకున్నది. డైనమిక్ పవర్ హౌస్ లాంటిది. అమరావతి అనేది ఓ చిన్న ప్రాంతం. ఇప్పుడే అభివృద్ది చెందుతున్న ప్రాంతం. మావిగన్ 60 లక్షల జనాభా ఉన్న విస్తృతమైన కారిడార్. అమరావతిలో ఉన్నదీ పరిమితమైన ప్రజలు. మావిగాన్ విస్తరించిన అభివృద్ధి మోడల్. అమరావతి మాత్రం కేంద్రీకృతమైన మోడల్. తక్కువ రిస్క్ తో అభివృద్ధి చేసే ఎకో సిస్టమ్ మావిగాన్ పరిధిలో ఉంది. ఎక్కువ ఖర్చు లేకుండా అభివృద్ది చెందుతుంది. అమరావతి మాత్రం ఖరీదైన రిస్క్ ప్రాజెక్ట్. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పట్టణంలో నీళ్లు తోడి నదిలో పోసే పరిస్ధితి అమరావతిలో ఉంది. అంత లోతట్టు ప్రాంతాన్ని చంద్రబాబు ఎంచుకోవడం వెనుక ఆయన స్వార్ధ ప్రయోజనాలే ఉన్నాయి. కానీ మావిగాన్ అనేది భవిష్యత్తు వాగ్దానం. అనేక రకాల ఆదాయాన్ని అందించే మోడల్. అమరావతి కేవలం ఆ ఒక్క నగరంపైనే ఆధారపడిన మోడల్. మావిగాన్ లో మూడు నగరాల ఆదాయం ఉంది. అమరావతి పరిమిత పాలనా కేంద్రం మాత్రమే. కాబట్టి మావిగాన్ అనేది అద్భుతమైన ఆలోచన.చంద్రబాబే ఊసరవెల్లి2014లో రాష్ట్రం విడిపోతే ఇప్పటికీ పరిపూర్ణమైన రాజధాని లేని పరిస్ధితి వచ్చిందంటే అందుకు కారఇం చంద్రబాబే. గ్రీన్ పీల్డ్ రాజధాని కడతామని చెప్పి, రెండోసారి అధికారం ఇచ్చినా పూర్తి చేయలేని పరిస్దితిలో ఉన్నారు. ఇవాళ చంద్రబాబు ప్రెస్ మీట్లో కొత్తగా ఏమీ లేదు. ఈనాడులో ఆరేడు, పేజీల్లో ఉండే మ్యాటరే. అమరావతికి కులం రంగు పూశారంటున్న చంద్రబాబు.. నిన్న రేణుకా చౌదరి రాజ్యసభలో చెప్పిన మాటలు ఓసారి గమనించాలి. కులం రంగు పులుముకుంది మీరే, మేము కాదు. ఈనాడులో కిరణ్ జగన్మోహన్ రెడ్డి గురించి నయవంచన, ఈసరవెల్లి అని రాశారు. ఈ రాష్ట్రంలో ఊసరవెల్లి అంటే గుర్తుకొచ్చేది చంద్రబాబే. గతంలో ఎన్నో ఊసరవెల్లి వేషాలు వేశారు. బీజేపీతో సయోధ్య చేస్తారు, తిరిగి బీజేపీని వ్యతిరేస్తారు. మళ్లీ కాంగ్రెస్ తో సయోధ్య చేస్తారు, తిరిగి అదే కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తారు. జగన్ మాట మీద నిలబడే వ్యక్తి అనేది గుర్తుంచుకోవాలి. ఈనాడు కిరణ్ మనుషులు, చంద్రబాబు ముఠాతో కలిసి అమరావతిలో దోపిడీ చేస్తున్నారు. అందుకే జగన్ మీద బురద జల్లుతున్నారు. కానీ అమరావతిలో రెండు లక్షల కోట్లు పెట్టే శక్తీ లేదు, కనుచూపు మేరలో రాదు. కాబట్టి అమరావతి పూర్తయ్యే పరిస్దితి లేదు. అందుకే మావిగన్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మంత్రంగా మారుతుందని అంబటి రాంబాబు తేల్చిచెప్పారు. -
బొత్సకు అంబటి రాంబాబు పరామర్శ
-
ఒక్క మాటతో చంపేస్తావా..? పెమ్మసానికి గుబాపగిలేలా అంబటి కౌంటర్
-
వెళ్తూ వెళ్తూ ఎల్లో మీడియా రిపోర్టర్ కు ఇచ్చిపడేసిన అంబటి
-
ముద్రగడను కలిసిన అంబటి.. నా బలం జగన్.. నా ధైర్యం నా పార్టీ
-
ముద్రగడను కలిసిన మాజీ మంత్రి అంబటి
సాక్షి, కాకినాడ జిల్లా: కిర్లంపూడిలో వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభంను మాజీ మంత్రి అంబటి రాంబాబు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు, లోకేష్కు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. నాకు జరిగిన అన్యాయంపై న్యాయ స్థానం ద్వారా పోరాడతాను. ఇప్పటికే హై కోర్టులో రెండు రిట్ పిటిషన్లు వేశాను. త్వరలోనే మరో రెండు రిట్ పిటిషన్లు వేస్తాను’’ అని అంబటి పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ మా వెంట ఉన్నాడు.. ఇక కాపుల్ని ఏం చేసినా పర్వాలేదు అనుకుంటున్నారు. అంబటి రాంబాబును కొట్టినా పర్వాలేదు. ముద్రగడ కుటుంబాన్ని తిట్టిన పర్వాలేదు అనుకుంటున్నారు. ఇది తప్పు.. అక్రమం.. అన్యాయం.. ఈ అన్యాయాలను ఎదుర్కోవడానికి నా కులం, నా పార్టీ సిద్ధంగా ఉంది’’ అని అంబటి రాంబాబు చెప్పారు. -
నా రెండు కాళ్లు విడదీసి.. మిస్టర్ పెమ్మసాని.. గుర్తుపెట్టుకో..
-
‘నా ఇంటిపై దాడి ఘటనలో విచారణాధికారిని మార్చాలి’
గుంటూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి అంబటి రాంబాబు ఇవాళ (మార్చి 23) గుంటూరు జిల్లా ఎస్పీని కలిశారు. తన ఇంటిపై దాడి, నల్లపాడు పోలీస్ స్టేషన్లో హింసించడంపై విచారణ చేపట్టాలని ఎస్పీకి వినతిపత్రం ఇచ్చారు.‘నా ఇంటిపై దాడి ఘటనలో విచారణ అధికారిని మార్చాలి. నల్లపాడు పీఎస్లో టార్చర్ వ్యవహారంలో పూర్తి విచారణ చేయాలి. మా ఇంటిపై ఏడున్నర గంటలపాటు దాడి చేసి హత్యాయత్నం చేశారు. టీడీపీ నేతల దాడికి పోలీసులు సహకరించారు. ఇలాంటి ఘటనలో పోలీసులు కేసును సుమోటోగా నమోదు చేయాలి. పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు దారుణంగా వ్యవహరించారు. న్యాయం జరగకపోతే హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్తా. దాడులకు పాల్పడినవారిని, ప్రేరేపించినవారిని వదిలేదే లేదు’ అని అంబటి రాంబాబు అన్నారు. -
ఉగాది వేడుకల్లో YSRCP నేతలు
-
ఇది నా న్యాయపోరాటంలో మొదటి అడుగు
-
‘కోర్టు తీర్పులకు భిన్నంగా పోలీసులు వ్యవహరించారు’
సాక్షి, తాడేపల్లి: న్యాయ స్థానాల తీర్పులకు భిన్నంగా పోలీసులు వ్యవహరించారని.. తనపై పెట్టిన అక్రమ కేసులపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశానని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సత్తెనపల్లి, నల్లపాడు, పట్టాభిపురం పోలీస్ స్టేషన్లలో అక్రమ కేసులు నమోదు చేశారన్నారు.‘‘ఏడేళ్ల లోపు శిక్షలు పడే కేసులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాలి. నేను 18 రోజులు సెంట్రల్జైల్లో ఉండాల్సి వచ్చింది. ఏడు సంవత్సరాలకు లోబడి శిక్ష పడే కేసుల్లో ముద్దాయిని కోర్టులో ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని గత జడ్జిమెంట్లు చెబుతున్నాయి. చట్టాన్ని పోలీసులు ఉల్లంఘించారు. రాజకీయ ఒత్తిళ్లతో నన్ను ఎక్కువ రోజులు జైల్లో పెట్టేందుకు చిన్న కేసులో కూడా కోర్టులో ప్రవేశపెట్టారు. చంద్రబాబు, లోకేష్ చెప్తే పోలీసులు నన్ను కోర్టులో ప్రవేశపెట్టారు’’ అని అంబటి మండిపడ్డారు‘‘నా అరెస్టు, రిమాండ్ విధించిన వైనంపై న్యాయ పోరాటం చేస్తున్నా. సుప్రీంకోర్టు తీర్పులకు భిన్నంగా నన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులకు కోర్టులో హాజరుపరచాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు కోర్టు ఆదేశాలు అలాగే ఉంది. నా మీద ఉన్న కేసులన్నీ ఏడేళ్లలోపు శిక్ష పడేవే. అయినాసరే పోలీసులు రాజకీయ ఒత్తిడికి గురై ఎక్కువ కాలం జైల్లో ఉంచేందుకు ప్రయత్నించారు. దీనిపై నేను హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాను. కోర్టు అయినా రిమాండ్ విధించకుండా ఉండాల్సింది. ఈ విషయంపై కూడా హైకోర్టు రిజిస్టారుకి ఫిర్యాదు చేశాం’’ అని అంబటి పేర్కొన్నారు...మా ఇల్లు, కార్ల మీద దాడి ధ్వంసం చేసిన వారికి స్టేషను బెయిల్ ఇచ్చారు. ఈ వ్యవహారం పై కూడా న్యాయపోరాటం చేయబోతున్నా. నన్ను లాకప్ లో హింసించారు. ఈ కస్టోడియల్ టార్చర్ మీద కూడా న్యాయపోరాటం చేస్తా. ప్రజాస్వామ్యంలో అలా జరగటానికి వీల్లేదు. రాష్ట్రంలో పోలీసులు, దొంగలు కలిసిపోయినట్టుగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ ఒక్కటే మార్గం. చట్టం మీద గౌరవం పెంచటానికే న్యాయపోరాటం చేస్తున్నా. 7 గంటల 25 నిమిషాల పాటు నా ఇంటి మీద దాడి జరిగింది. మరి పోలీసులు ఏం చేస్తున్నట్టు?. నాపై దాడిని ఎందుకు అడ్డుకోలేదు?..ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ లేదని ఆ సంఘటన నిరూపించింది. నా ఇల్లు, కార్లు ధ్వంసం చేయడానికి పోలీసులు సహకరించారు. తమ కళ్ల ముందు జరుగుతున్న దాడులను అడ్డుకోని పోలీసులు కూడా నేరస్థులే. ఇలాగే పోలీసులు వ్యవహరిస్తే వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుందా?. పోలీసు వ్యవస్థ సరైనదారిలో నడవాలంటే న్యాయవ్యవస్థ స్పందించాలి. దీనిపై ఎంతదూరం వెళ్లటానికైనా సిద్ధమే...రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలం అయ్యాయన్న సంగతి అందరికీ తెలిసి పోయింది. పోలీసులను మేనేజ్ చేస్తే ఏమైనా చేయొచ్చని జనం అనుకుంటే అరాచకం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగటానికి వీల్లేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే. ప్రజలకు మాత్రం దుర్మార్గమైన ప్రభుత్వం. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేదే లేదు. ఉన్నదంతా ఆటవిక సమాజమే. పవన్ కళ్యాణ్ ఇంటిపై కూడా ఇలాంటి దాడి జరిగితే అప్పుడు తెలుస్తుంది’’ అని అంబటి రాంబాబు అన్నారు. -
నా ఇంటిపై దాడిని సీఎం, ఆయన కుమారుడు మానిటర్ చేశారు
-
ఎర్రబుక్లు, పిచ్చిబుక్లు మమ్మల్ని ఏమీ చేయలేవు: అంబటి
సాక్షి, విశాఖపట్నం: తన ఇంటిపై దాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మానిటర్ చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. పోలీసుల సాక్షిగా తన ఇంటిపై దాడి జరిగిందన్నారు. కులాలను రెచ్చగొట్టి ఏం సాధించాలనుకుంటున్నారు? అని ప్రశ్నించారు. భగవంతుడి దయ వల్ల తనను చంపలేదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో కాపు నేతల బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరిగింది. విశాఖలోని కరణం ధర్మశ్రీ నివాసంలో విశాఖ కాపు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఇటీవల పరిణామాలపై కాపు నేతలు చర్చించారు. అలాగే, కూటమి ప్రభుత్వ అక్రమ కేసులు, అరెస్ట్లపై కాపు నేతలు చర్చించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు, ఉమ్మడి విశాఖ జిల్లా కాపు నేతలు పాల్గొన్నారు.అనంతరం, మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీకి చెందిన వారు నా ఇంటిపైకి వచ్చారు.. కులం పేరుతో దూషించారు. కులాలను రెచ్చగొట్టి ఏం సాధించాలనుకుంటున్నారు?. గుంటూరు నడి బొడ్డున నా ఇంటిపై దాడి చేశారు. నా ఇంటిపై దాడిని టీవీ చానెల్స్ లైవ్ ఇస్తున్నా ప్రభుత్వం తెలియనట్టుగా ఉంది. భగవంతుడి దయ వల్ల నన్ను చంపలేదు. రెడ్బుక్ను మా కుక్క లెక్కచేయదంటే లోకేష్కు కోపం వచ్చిందేమో.నేను సెంటర్ జైల్లో ఉన్నప్పుడు నా మీద ఎంతో ప్రేమ అభిమానం చూపించారు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు తరలి వచ్చారు. నా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నాపై దాడి చేసి అక్రమంగా జైలుకు పంపారు. నన్ను 18 రోజులు అక్రమంగా జైల్లో పెట్టారు. నాపై జరిగిన దాడి ఒక కులంపై మరొక కులం చేసిన దాడిగా భావించాలి. చరిత్రలో ఎన్నడు ఎప్పుడు జరగని దాడి నాపై జరిగింది. టీడీపీ గుండాలకు అలుపు వచ్చే వరకు దాడి చేశారు. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 12 గంటలకు దాడి జరిగింది. చంద్రబాబు పతనం ప్రారంభమైంది. నాపై చేసిన దాడికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నాను. ఎర్రబుక్కులు, పిచ్చిబుక్కులు మమ్మల్ని ఏమీ చేయలేవు.కులాలను రెచ్చగొట్టే రాజకీయం చేస్తున్నారు. టీడీపీ గూండాలు వంగవీటి రంగాను దారుణంగా చంపారు. పోలీసులు సహకారంతో రంగాను హత్య చేశారు. అదేవిధంగా పోలీసులను అడ్డం పెట్టుకొని నాపై దాడి చేశారు. కాపులను బీసీల్లో చేర్చుతామని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చిన హామీ కోసం ముద్రగడ ఉద్యమం చేశారు. కాపుల కోసం ఉద్యమం చేసిన ముద్రగడను జైల్లో పెట్టారు, చంపాలని చూశారు. పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నాడు కాబట్టి కాపులు మా వైపు ఉన్నారనుకుంటే అది మీ భ్రమ’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
అంబటి రాంబాబును కలిసిన కొడాలి నాని
-
అంబటి రాంబాబు హీరో.. లోకేష్.. గుర్తుపెట్టుకో.. పిచ్చిపిచ్చి వేషాలేస్తే..
-
‘2029లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం’
సాక్షి,గుంటూరు: 2029లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని మాజీ మంత్రి కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల కూటమి ప్రభుత్వం వేధింపులకు గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని ఆదివారం కొడాలి నాని, ఇతర వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు.అనంతరం, కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ‘కూటమి బెదిరింపులకు వైఎస్సార్సీపీ శ్రేణులు భయపడరు. కూటమి ప్రభుత్వం అంబటి కుటుంబసభ్యుల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. టీడీపీ నేతలు కావాలనే అంబటి రాంబాబును రెచ్చగొట్టారు.అంబటి రాంబాబు క్షమాపణలు చెప్పిన టీడీపీ నేతలు ఆయన ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశారు.పోలీసుల సమక్షంలో అంబటి ఇంటిపై దాడి జరిగింది. లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగానికి వైఎస్సార్సీపీ భయపడదు. 2029లో వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం’అని స్పష్టం చేశారు. -
అంబటికి మళ్ళీ నోటీసులు
-
రెడ్ బుక్ లో జగన్ పేరు..! అంబటి మాస్ రియాక్షన్
-
రెడ్బుక్ పేరుతో ఏపీని సర్వ నాశనం చేస్తున్నారు: అంబటి
సాక్షి, గుంటూరు: ‘‘నన్ను 100 సార్లు జైలుకు పంపినా.. నాపై 1000 కేసులు పెట్టినా.. మా ఇంటి కుక్క కూడా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడదు’’ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతోమాట్లాడుతూ.. జనసేన ఆఫీసులో రెండు వాహనాలపై దాడి చేస్తే క్షణాల్లో పరుగులు తీసుకుంటూ వెళ్లి విచారించిన గుంటూరు ఎస్పీ, ఐజీ.. మా ఇంటి పై ఏడు గంటల పాటు దాడి జరిగితే స్పందించలేదంటూ ప్రశ్నించారు.చంద్రబాబుకు దమ్ముంటే మా ఇంటి పై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు చర్యలు తీసుకోకపోతే మా ఇంటిపై దాడిలో ఆయన ప్రోద్బలం ఉన్నట్టు భావించాల్సి వస్తుంది. మా ఇంటి పై జరిగిన దాడి వ్యవహారంలో న్యాయపరంగా పోరాడతాం. లోకేష్ రెడ్ బుక్ పేరుతో ఈ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్నాడు. రెడ్ బుక్ పేరుతో చేసిన ప్రతి అరాచకానికి కచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదుప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచివి కాదు: నూరిఫాతిమాగుంటూరు నగర వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ వ్యవహారంలో విష ప్రచారం చేసి ప్రజలకు అడ్డంగా దొరికిపోయారని... ప్రజల దృష్టిని మళ్లించడానికి టీడీపీ గుండాలు అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారని మండిపడ్డారు. ‘‘ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచివి కాదు. ఇలా దాడులు చేస్తూ భవిష్యత్తు తరాల వారికి ఏం మెసేజ్ పంపిస్తున్నారంటూ ఆమె ప్రశ్నించారు.రెడ్బుక్ పాలన పేరుతో అరాచకం: మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజురాష్ట్రంలో రెడ్ బుక్ పాలన పేరుతో అరాచకం జరుగుతుంది. రాష్ట్రంలో ఏ వర్గం సంతృప్తిగా లేదు. రెడ్బుక్ ఎలా ఉందో మీరు చూపిస్తున్నారు. డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో మీకు అర్థం కావట్లేదు. అక్రమ కేసులు, దాడులు, హత్యలు, హత్యాచారాలతో కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది. -
అంబటిని పరామర్శించిన వంశీ
-
అన్నింటికి సిద్దపడే జైలుకు వెళ్ళా... కానీ పొన్నవోలు మాత్రం అంబటి ప్రశంసలు
-
మీకు బ్లాక్ బస్టర్ సినిమా చూపిస్తాం.. పొన్నవోలు మాస్ వార్నింగ్
-
ధైర్యానికి మారు పేరు అంబటి
-
Guntur: అంబటిని పరామర్శించిన YSRCP నేతలు
-
చంద్రబాబు కాపులను వేధిస్తున్నారు
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్)/ఇబ్రహీంపట్నం: కాపుల వల్లే రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు వారిపైనే దాడులు చేయిస్తూ అవమానాలు, వేధింపులకు గురిచేస్తున్నారని కాపు ఉద్యమ నేత, వైఎస్సార్సీపీ నాయకులు ముద్రగడ పద్మనాభం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులంతా బానిసలుగా బతకాలని చంద్రబాబు కోరుకుంటున్నారని, అది జరగదని మండిపడ్డారు. సోమవారం ఆయన గుంటూరు సిద్ధార్థనగర్లోని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి మేరుగు నాగార్జునతో కలిసి వచ్చారు. అంబటిని పరామర్శించారు.ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ముద్రగడ మాట్లాడుతూ గతంలో తనపైనా, తన కుటుంబంపైనా దాడి చేయించారని, ఇప్పుడు అంబటి రాంబాబు కుటుంబంపైనా దాడి చేయించారని చంద్రబాబుపై మండిపడ్డారు. ‘అయ్యా చంద్రబాబు నీకు, మీ సతీమణి, మీ కుమారుడు, కోడలికి అవమానం జరిగితే మీ ఫీలింగ్స్ ఏమిటి?’ అని ముద్రగడ ప్రశ్నించారు. మాజీ మంత్రుల నివాసాలపై దాడులు చేయించటం అత్యంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు అబద్ధాలు వల్లించడం హాస్యాస్పదమన్నారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ అరెస్టులు, అక్రమ కేసులకు వైఎస్సార్సీపీ నేతలు భయపడరని స్పష్టం చేశారు.ఇప్పటికైనా అబద్ధాలు ఆపి దేవదేవుడికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను సోమవారం ముద్రగడ పద్మనాభం పరామర్శించారు. దాడి జరిగిన తీరును జోగి రమేష్ ఆయనకు వివరించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కూడా జోగి రమే‹Ùను పరామర్శించారు. కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ నగర గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, వైఎస్సార్సీపీ భీమవరం నియోజకవర్గం ఇన్చార్జ్, ఉమ్మడి గోదావరి జిల్లాల కాపు సంఘం అధ్యక్షుడు చిలిమిలి వెంకటరాయుడు, పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి తోట రామకృష్ణ పాల్గొన్నారు. -
నన్ను, నా కుటుంబాన్ని కాల్చేయమని.. బాబు, లోకేష్ పై అంబటి సంచలన కామెంట్స్
-
‘నా ఇంటిపై దాడికి చంద్రబాబు, లోకేష్ ఆదేశాలే కారణం’
గుంటూరు: తన ఇంటిపై జరిగిన దాడికి చంద్రబాబు, లోకేష్ ఆదేశాలే కారణమని మరోసారి పునరుద్ఘాటించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సాయంత్రం ఐదునుంచి రాత్రి పన్నెండు గంటలవరకూ తన ఇంటిపై దాడి జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని, ఇది చంద్రబాబు, లోకేష్ల కుట్ర కాదా? అని ప్రశ్నించారు. ఈ రోజు(సోమవారం, ఫిబ్రవరి 23వ తేదీ) మీడియాతో మాట్లాడిన అంబటి.. ‘ రాజమండ్రి జైలు నుంచి విడుదలైనప్పటినుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు వచ్చి సంఘీభావం ప్రకటించారు. వారందరికీ నా ధన్యవాదాలు. నేను జైలులో ఉన్నప్పుడు మా అధినేత జగన్ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. 18 రోజులు జైలులో ఉండి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు వివరించే ప్రయత్నం చేశాను.నన్ను అరెస్టు చేసి తీసుకెళ్ళిన తర్వాత నా ఆఫీసు, ఇల్లు తగలబెట్టాలని నిర్ణయించుకున్నారు. మా ఇంట్లోనుంచి నా భార్య, కూతుర్లు వెనుకనుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకు సీఎం చంద్రబాబే బాధ్యుడు. ఏడు గంటలు పోలీసులు నిర్వీర్యంగా ఉండడానికి చంద్రబాబు, లోకేష్ ఆదేశాలే కారణం. మీరు కాదని చెప్పండి.. ఆవేశంలో దాడులు చెయ్యడం చూశాం. కానీ సాయంత్రం ఐదునుంచి రాత్రి పన్నెండు గంటలవరకూ పోలీసులు పట్టించుకోలేదు. ఇది మీ కుట్ర కాదా చంద్రబాబు.మాజీ మంత్రి ఇంటిపై దాడి చేస్తుంటే ఎందుకు నిర్యీర్యంగా ఉన్నారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
‘చంద్రబాబు.. అరెస్టు చేస్తే భయపడుతారు అనుకోవద్దు’
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబును వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు. అంబటి ఇంటిపై దాడి చేసి.. ఆయన్నే అరెస్ట్ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అరెస్టు చేస్తే భయపడుతారు అనుకోవద్దని హెచ్చరించారు. రాంబాబు ఇంటిపై దాడి బాధాకరమని అన్నారు. మాజీ మంత్రి అంబటిని కలిసిన వారిలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం ఉన్నారు.అనంతరం, మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ..‘అంబటి రాంబాబు ఇంటిపై ఏడు గంటలపాటు దాడి చేశారు. చెరపకురా చెడేవు అన్న సామెత గుర్తుపెట్డుకోండి. దాడులపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారు?. ముద్రగడ లాంటి వ్యక్తులపై కూడా దాడి చేశారు. మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు అందరి లెక్కలు సరిచేస్తామని హెచ్చరించారు.ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ..‘రాంబాబు కుమార్తె ఫైర్ బ్రాండ్ మౌనికను పలకరించడానికి వచ్చాను. భవిష్యత్తులో మమతా బెనర్జీ స్థాయికి మౌనిక వెళ్లాలి. మాజీ మంత్రి ఇంటిపై దాడి బాధాకరం. రెండు సార్లు కాపుల సాయంతో చంద్రబాబు సీఎం అయ్యారు. చంద్రబాబు.. నన్ను నా కుటుంబాన్ని వేధించారు. మాకు జరిగిన అవమానాలు మీకు మీ భార్య, కొడుకు, కోడలికి జరిగితే ఎలా ఉంటుంది?. మేం బానిసలం కాదు. తిరుమల లడ్డుపై రోజూ అబద్దాలు ఆడుతున్నారు. మీ అబద్దాలను ఇకనైనా ఆపి క్షమాపణలు చెప్పండి. క్షమాపణ లేకపోయినా ఫరవాలేదు.. మాట్లాడడం ఆపేయండి. మీ ఉద్దేశం ఏంటి? అందరినీ జైలులో పెట్టాలనా?. ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు.. సద్వినియోగం చేసుకోండి. మా ఇళ్లపై దాడిచేసే కార్యక్రమాలకు స్వస్తి పలకండి అని హెచ్చరించారు.మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. ‘అరెస్టు చేసి జైలులో పెట్టడం ఎంతవరకు సమంజసం. అరెస్టు చేస్తే భయపడుతారు అనుకోవద్దు. అంబటి రాంబాబు, జోగి రమేష్, చెవిరెడ్డిని అరెస్టు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేశారు. మీరు ఏం చేస్తానన్నా మేం బయటకు వస్తాం. నాలుగుసార్లు సీఎం అయిన చంద్రబాబుకు ఏ విధంగా పాలించాలో తెలియదా?. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తుకు గట్టి పునాది వేస్తున్నారు. అరెస్టులు ఇప్పటికైనా ఆపండి. తిరుమల లడ్డులో కల్తీ లేదని తేలింది అంటూ వ్యాఖ్యలు చేశారు. -
ఆ రోజు రాత్రి 12 గంటల వరకు.. లోకేష్ రెడ్ బుక్ కు కుక్కలు కూడా లెక్క చెయ్యవు
-
తప్పు చేసిన వారు వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి ఆహుతి కాక తప్పదు
-
నాపై దాడిని బీజేపీ, జనసేన నేతలు ఖండించారు.. ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప
-
చంద్రబాబూ.. ప్రజలు గమనిస్తున్నారు: అంబటి రాంబాబు
సాక్షి, తిరుపతి: లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘నా ఇల్లు, ఆఫీస్పై దాడి చేశారు. 5 గంటలు నుంచి 12 గంటలు వరకు దాడి జరుగుతూనే ఉంది. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు’’ అని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘జిల్లా ఎస్పీ కనీసం పట్టించుకోలేదు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు, వైవిధ్యాలు ఉంటాయి. పోలీసులను ఏవిధంగా ఉపయోగిస్తున్నారో చంద్రబాబు ప్రజలు గమనిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలు ఆలోచించమని కోరుతున్నా.. ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితులు సరికాదు. బీజేపీ, సీపీఐ, జనసేన పార్టీ నాయకులు స్పందించారు. పార్టీలకు అతీతంగా నా అరెస్ట్పై స్పందించారు. జనసేన పార్టీ అధినేత స్పందించలేదు.లడ్డూ వివాదంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఛార్జిషీట్ ఫైల్ చేశాక మీకు తొందర ఎందుకు? వాస్తవాలు చెప్పారు కదా.. భగవంతుడ్ని అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు. వెంకటేశ్వర స్వామి కోపాగ్నికి బలికాక తప్పదు’’ అని అంబటి పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీ నేతలపై కొనసాగుతున్న ప్రభుత్వ కక్ష సాధింపు
రాజమండ్రి: వైఎస్సార్సీపీ నేతలపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి ఈనెల 19వ తేదీన రాజమండ్రి నుండి గుంటూరుకు అంబటి రాంబాబు బయల్దేరిన సమయంలో సెక్షన్ 30 నోటీసులు అందజేశారు పోలీసులు. అంబటి కాన్వాయ్కు అడగడుగునా అడ్డు తగిలిన పోలీసులు.. సెక్షన్ 30 కింది అంబటి రాంబాబుకి, జక్కంపూడి రాజాకు నోటీసులు ఇచ్చారు. దాంతో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలపై కూడా కేసులు నమోదు చేశారు ప్రకాశ్ నగర్ పోలీసులు.కాగా, మంగళవారం(ఫిబ్రవరి 19వ తేదీ) రాజమండ్రి నుంచి గుంటూరుకు బయల్దేరిన అంబటి రాంబాబుకు అడగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. అంబటి కాన్వాయ్ను పదే పదే అడ్డుకున్నారు. ప్రతి వంద మీటర్లకు ఒకసారి కాన్వాయ్ లో అంబటి వాహనం వెనకాల ఉన్న వాహనాలను నిలిపి వేశారు పోలీసులు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంబటి.. అనుమతిస్తే కారులో వెళతానని, అలాకాకుండా తన వెనకాల నుంచి వచ్చే వాహనాలను నిలిపి వేస్తే మాత్రం.. పాదయాత్రగా వెళ్తానని అంబటి స్పష్టం చేశారు. తన కాన్వాయ్ అడ్డుపడటమే కాకుండా, సెక్షన్ 30 కింద నోటీసులు ఇవ్వడాన్ని అప్పుడే అంబటి తీవ్రంగా ఖండించారు. తన ఇంటిపై దాడి చేసినప్పుడు రాని సెక్షన్ 30, ఇప్పుడు తాను కాన్వాయ్లో బయల్దేరితే వచ్చేసిందా అంటూ మండిపడ్డారు. -
ఏ రాజకీయ నాయకుడు చెప్పుడు.. అది అంబటి సంస్కారం..
-
నాకు కొడుకులు లేరని ఎప్పుడూ.... కూతురు మౌనిక పై అంబటి ప్రశంసలు
-
ఆమెని చూసి సిగ్గు తెచ్చుకోండి... జనసేన రజినీ పై అంబటి ప్రశంసలు
-
ఈ అంబటి అనే కుక్కకు కూడా... అంటే అర్ధం ఏంటో తెలుసా పవన్...ఏకిపారేసిన అంబటి
-
నన్ను రాత్రి 2 గంటలకు నిద్రలేపి ఇద్దరు కానిస్టేబుల్ లు వచ్చి సంచలన నిజాలు బయటపెట్టిన అంబటి
-
నీవు తీసిన సినిమాలో నేనే హీరో.. పెమ్మసానికి గుబాపగిలేలా అంబటి కౌంటర్
-
చంపితే చస్తా కానీ.. తగ్గేదేలే... మరో సారి అంబటి మాస్ వార్నింగ్
-
ఏం బెదిరిస్తున్నావా...? నీ కన్నా గట్టిగా అరవగలను... అంబటి Vs పోలీస్
-
తొందరేమీ లేదు.. అన్నింటికీ సమయం వస్తుంది: అంబటి
సాక్షి, గుంటూరు: తొందరేమీ లేదు.. అన్నింటికి మూల్యం చెల్లించుకునే సమయం వస్తుందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పర్మిషన్ తీసుకునే నల్లపాడు వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్లాను. టీడీపీ నేతలు కర్రలు, రాడ్డులు తీసుకుని నా కారు మీదకు వచ్చారు. టీడీపీ నేతలు కట్టిన ఫ్లైక్సీని చించలేదు. ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పా. గూండాలు 4 గంటల పాటు బీభత్సం సృష్టిస్తే పోలీసులు ఏం చేశారు?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.‘‘పోలీసులు, గూండాలు ఏకమై దారుణంగా ఇంటిపై దాడి చేశారు. ఆ మాట అనడాన్ని నా అంతరాత్మ ఒప్పుకోలేదు.. నేను బాధపడ్డాను. టీడీపీ నేతలు తిడుతున్నారనే ఉద్దేశంతో మాట అన్నాను. బ్యాచ్లుగా బ్యాచ్లుగా నా ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో నా పిల్లలు, నా మనవళ్లు ఉన్నారు. పోలీసులు సాక్షిగానే నా ఇంటి మీద దాడి చేశారు. నాలుగు గంటల పాటు నా ఇంటి మీద కరాళ నృత్యం చేశారు. పోలీసులు రక్షణ కల్పించలేక పారిపోండి అన్నారు...నేను అనని మాటలను అన్నట్లు రిపోర్ట్లో పెట్టారు. నా అల్లుళ్లు ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. కమ్మ సామాజిక వర్గాన్ని నేను అనని మాటలను అన్నట్లు రిపోర్ట్లో పెట్టారు. నా ఇంటి మీద దాడి చేసింది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే. పెమ్మసాని నాకు సినిమా చూపిస్తానని చెప్పారు. అవును నాకు పెమ్మసాని సినిమా చూపించారు. పెమ్మసాని సినిమాలో హీరో ఎవరు?’’ అంటూ అంబటి వ్యాఖ్యానించారు...31 అర్ధరాత్రి నల్లపాడు పోలీసులు అరెస్టు చేస్తే కోర్టు తీర్పుతో మొన్న విడుదల అయ్యాను. ఈ 18 రోజులు నాకు మాట్లాడే అవకాశం లేదు. నా కుటుంబం, నా కూతురు అన్నీ అర్థమయ్యేవిధంగా చెప్పారు. ఇక్కడే అన్ని విషయాలు మాట్లాడాలని అనుకున్నాను. టీడీపీ కట్టిన ఫ్లెక్సీ వద్దకు వెళ్ళి ఇది మంచి పద్దతి కాదని చెప్పాను. కానీ చించివేయలేదు. మరుసటి రోజు గుళ్లలో పూజలు చేయమని పార్టీ పిలుపు ఇచ్చింది. పర్మిషన్ తీసుకుని వెళ్లాను. నల్లపాడు సీఐ అడిగితే ఫ్లెక్సీ వద్దకు వెళ్లనని చెప్పాను. తిరిగి వస్తుంటే కారు అడ్డుకుని అమ్మ, అక్క అంటూ తిట్టారు. అప్పుడు నేను తిట్టాను. అది ఆ సమయంలో జరిగింది. తర్వాత ఇంటికొచ్చి ఆలోచిస్తే నా అంతరాత్మ ఒప్పుకోలేదు...నేను చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడలేదు. నేను ఈ వయసులో తిట్టి ఉండాల్సింది కాదనుకున్నాను. పశ్చాత్తాపాన్ని మించింది ఏదీ లేదు. ఐదు గంటలకు నా ఇంటివద్దకు పలు నియోజకవర్గాలనుంచి జనం వచ్చారు. నా ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు, మనవళ్లు ఉన్నారు. ఏడు గంటల పాటు కరాళనృత్యం చేశారు. పోలీసుల అండతో రెచ్చిపోయారు. ఎక్కడైనా పోలీసులు, గూండాలు ఒక్కటవుతారా? ఇది ధర్మమేనా? వైఎస్సార్సీపీ వారిని రానివ్వకుండా అడ్డుకున్నారు. సీఐ గంగా వెంకటేశ్వర్లు పారిపోవాలని చెప్పారు. పారిపోవడం కన్నా చచ్చిపోవడం మేలని చెప్పాను...ఇంత దారుణం.. అన్యాయం జరిగితే స్పందించరా? పోలీసులు తీసుకెళ్లి లాకప్లో పెట్టారు. రాత్రి 2గంటలకు స్టేషన్పైకి తీసుకెళ్ళి కొట్టడానికి ప్రయత్నించారు. కానీ ఎందుకో కొట్టలేదు. దీనిపై న్యాయ పోరాటం చేస్తా. నల్లపాడు సీఐ వంశీ రిమాండ్ రిపోర్ట్లో కమ్మవారిని తిట్టానని పేర్కొన్నారు. నా ఇద్దరు అల్లుళ్లు కమ్మవారే. కులాల పేరుతో రెచ్చగొడుతుంది మీరే. అసహ్యంగా మాట్లాడినందుకే దాడులు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. పశ్చాత్తాప పడ్డా. పవన్ కళ్యాణ్ మీరు ఎప్పుడూ అసహ్యంగా మాట్లాడ లేదా? వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అని వేదికపై చెప్పు తీశావు...నేను అప్పుడు ఎమ్మెల్యేనే కదా. నా కొడకా అంటే అర్థం తెలుసా. ఇప్పటికైనా పశ్చాతాపం పడ్డావా.. అన్యాయాన్ని అన్యాయం అనలేని నువ్వు ఏం డిప్యూటీ సీఎంవు. అంబటి కాపు కాదా. సందర్భం వచ్చినప్పుడు కాపుల కోసం గొంతెత్తా. నేను కమ్మ ద్వేషిని కాదు. నా కులం తరపున మాట్లాడా.. చిరంజీవి వచ్చి కాపులకు మద్దతుగా మాట్లాడారు. వంగవీటి రంగాను కోల్పోయాం... ముద్రగడను కోల్పోవడానికి సిద్ధంగా లేమన్నారు. అప్పుడు నాగబాబు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు? అంటూ అంబటి ప్రశ్నించారు.‘‘చంద్రబాబుకమ్మని ప్రభుత్వానికి పవన్ కాపు కాస్తున్నాడు. నేను తగ్గను, చావనైనా చస్తా, తగ్గదేలేదు. నన్ను ఎమిలినేట్ చేయాలని రెడ్బుక్లో రాసుకున్నారట. చంపేస్తే సమాధి అయ్యి సాధిస్తా. పోలీసులతో హత్యలు చేయించడం చంద్రబాబుకు అలవాటే. ఆ అలవాటే లోకేష్కు వచ్చింది’’ అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. -
కూటమికి దడ పుట్టిస్తున్న అంబటి వారసురాలు
-
జగన్ ను కలిసిన అంబటి రాంబాబు
-
వైఎస్ జగన్ను కలిసిన అంబటి రాంబాబు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ మంత్రి అంబటి రాంబాబు కలిశారు. తాడేపల్లిలోని నివాసంలో వైఎస్ జగన్ను కలిసి అంబటి మాట్లాడారు. అయితే, అక్రమ కేసులో అరెస్ట్ అయిన అంబటి రాంబాబు.. గురువారం బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు.. తనపై టీడీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, టీడీపీ రౌడీ మూకలు తన ఇంటిని ధ్వంసం చేసిన తీరు, హత్యాయత్నం, పోలీసుల నిర్లిప్త వైఖరి, కొంతమంది పోలీసు అధికారుల ఓవర్ యాక్షన్ వంటి అంశాలను వైఎస్ జగన్కు వివరించారు. ఈ క్రమంలో తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొందామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసు అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజల పక్షాన, ప్రజల తరపున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులు ధీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుద్దామని, పార్టీ నాయకులు, కేడర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ భేటీలో అంబటితో పాటు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఉన్నారు. -
అంబటికి విడదల రజిని పరామర్శ
-
అంబటికి స్వాగతం పలికిన భార్య, కూతుర్లు
-
నా ఇంటికి నేను వెళుతుంటే అడ్డుకుంటారా.. అంబటి మాస్ వార్నింగ్
-
పోలీసుల అత్యుత్సాహం.. కాన్వాయ్ ఆపుదాం అని చూసారు దెబ్బకి ఇచ్చిపడేసిన అంబటి


