కాలుష్య కుంపటి | Dumping Yard In Public Area Anantapur | Sakshi
Sakshi News home page

కాలుష్య కుంపటి

Published Tue, Jul 17 2018 7:33 AM | Last Updated on Tue, Jul 17 2018 7:33 AM

Dumping Yard In Public Area Anantapur - Sakshi

అనంతపురం : ఇదీ జిల్లా కేంద్రంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన కమలానగర్‌ దుస్థితి. నాలుగేళ్ల పాలనపై స్థానిక ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి శ్వేతపత్రం పేరిట గొప్పలకు పోయారు. కార్పొరేషన్‌ మేయర్‌ స్వరూప అనంతపురం రూపురేఖలు మార్చేశామంటూ ఇటీవల హడావుడి చేశారు. వీరి పాలన ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇదో మచ్చుతునక. చారిత్రక చిహ్నమైన టవర్‌క్లాక్‌కు సమీపంలో వేలాది మంది ప్రజలు రాకపోకలు సాగించే కమలానగర్‌లో కాలుష్య కుంపటి నిత్యం రగులుతోంది.

ఓ ఖాళీ ప్రదేశం డంపింగ్‌ యార్డును తలపిస్తోంది. జిల్లా కేంద్రంలోనే నెలకొన్న ఈ పరిస్థితి చూసి ప్రజలు తాము చేసిన తప్పు తెలుసుకుని ‘ముక్కు మూసుకుని’ ముందుకు కదులుతున్నారు. చెత్త పేరుకుపోయిన ప్రతిసారీ చుట్టుపక్క నివాసితులు, వ్యాపారులు నిప్పు రాజేస్తుండటంతో ఈ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగించే ప్రజలు పరుగులు తీస్తున్నారు. ఇదే సమయంలో ఇక్కడ తిష్టవేసిన పందుల గుంపుతో స్థానికుల     అవస్థలు వర్ణనాతీతం. ఇక్కడే ఓ చిన్నపిల్లల ఆసుపత్రి కూడా ఉంది. ఈ కాలుష్య కుంపటి వెదజల్లే పొగతో వ్యాధుల బారిన పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. అభివృద్ధి ముసుగులో పబ్బం గడుపుకునే నాయకులు ఇప్పటికైనా మేల్కొని ప్రజారోగ్యాన్ని     కాపాడాలని కోరుతున్నారు.– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement