dumping yard
-
ఇక్కడ ఇలా.. అక్కడ అలా.. చెత్త ఎలా?
సాక్షి, హైదరాబాద్: విస్తరిస్తున్న నగరంతో పాటే చెత్త సమస్యలూ పెరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ నుంచి గతంలో రోజుకు 3,500 మెట్రిక్ టన్నుల చెత్త వెలువడగా.. ప్రస్తుతం 7,500 మెట్రిక్ టన్నుల చెత్త వస్తోంది. దీని నిర్వహణ కోసం జవహర్నగర్ డంప్ యార్డుకు తరలిస్తున్నారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్తతో ఎంతో కాలంగా అక్కడి పరిసర గ్రామాల ప్రజలు తల్లడిల్లుతున్నారు. చెరువుల కాలుష్యం తగ్గించేందుకు లీచెట్ ట్రీట్మెంట్ వంటి పనులు జరుగుతున్నా తమ ఆరోగ్యానికి ముప్పేనని అక్కడి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని చెత్త మొత్తం ఒకేచోట పోగు పడకుండా ఉండేందుకు నగరానికి నాలుగు వైపులా డంపింగ్ యార్డులు, చెత్త నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వాలు ఎప్పటి నుంచో ప్రకటిస్తున్నాయి. దశాబ్దం క్రితం నుంచే ఆ దిశగా చర్యలు ప్రారంభమైనా, స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత, నిరసనలతో అవి ముందుకుసాగడం లేదు. తాజాగా సంగారెడ్డి జిల్లా పరిధిలోకొచ్చే నగర శివార్లలోని ప్యారానగర్లో ఏర్పాటు కానున్న చెత్త నిర్వహణ కేంద్రానికీ అదే పరిస్థితి ఎదురవుతోంది. పనులకు సాగనీయకుండా గత నాలుగు రోజులుగా పరిసర గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. బతుకులు బలి చేస్తారా? అక్కడ అత్యాధునిక సాంకేతికతతో యూరోపియన్ దేశాల్లోని చెత్త నిర్వహణ పద్ధతుల్ని పాటిస్తామని, దాని వల్ల పరిసరాల్లో ఎలాంటి కాలుష్యం వ్యాపించదని చెబుతున్న జీహెచ్ఎంసీ అధికారుల మాటల్ని ప్రజలు విశ్వసించడం లేదు. నగరంలోని చెత్తతో తమ బతుకులు బలి చేస్తారా? అని ప్రశి్నస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు పరిస్థితి ఏం కానుందన్నది మున్ముందు తేలనుంది. అక్కడ ఏర్పాటు కానున్న చెత్త నిర్వహణ కేంద్రం గురించి జీహెచ్ఎంసీ అధికారులేమంటున్నారంటే.. ⇒ అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీతో ఏర్పాటు కానున్న ప్లాంట్లో అడ్వాన్స్డ్ డ్రై అనరోబిక్ బయోమిథనేషన్ టెక్నాలజీ (డీఏబీటీ)తో తడిచెత్త నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది. కంపోస్టు ఎరువు తయారవుతుంది. ⇒ఆర్డీఎఫ్(రెఫ్యూజ్ డిరైవ్డ్ ఫూయెల్) ప్రాసిసెంగ్ తో పొడిచెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ⇒ జవహర్నగర్లో పుష్కరకాలంగా పేరుకుపోయిన చెత్తతో దుర్వాసన, కాలుష్యం వంటి సమస్యలుండగా, ప్యారానగర్ ప్లాంట్లో అలాంటి సమస్యలుండవు. ⇒ చెత్త అనేది అసలు నిల్వ లేకుండానే ఎప్పటికప్పుడు ప్రాసెస్ అవుతుంది. చెత్త బహిరంగంగా కనిపించదు. ⇒ డీఏబీటీతో వెలువడే బయోగ్యాస్ను ఇంధనంగా లేదా విద్యుత్ ఉత్పత్తికి వినియోగించవచ్చు. ఆర్డీఎఫ్ను విద్యుత్ తయారీకి ఉపయోగిస్తారు. ⇒ ఈ ప్లాంట్లో పనులన్నీ భూమిలోపల బంకర్లలో, మూసివేసిన షెడ్లలో జరుగుతాయి. చెత్త రవాణా సైతం ఆయిల్ ట్యాంకర్ల మాదిరిగా పూర్తిగా మూసి ఉండే వాహనాల ద్వారా జరుగుతుంది. గాలిని కూడా బయో ఫిల్టర్ల ద్వారా శుద్ధి చేయడం వల్ల ఎలాంటి దుర్వాసనలు రావు. ⇒ డ్రై డైజెసన్ టెక్నాలజీ వల్ల లీచెట్ (విష జలాల) సమస్య ఉండదు. చెత్త నిర్వహణలో పర్యావరణపరంగా మేలైనది. అక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్ స్థానిక అవసరాలకు సరిపోతుంది. ⇒ రోజుకు 2 వేల మెట్రిక్ టన్నుల చెత్తతో 15 మెగావాట్ల విద్యుత్, 270 టన్నుల బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది. చెత్తను మోయలేని జవహర్నగర్ నగరం నుంచి ప్రస్తుతం వెలువడుతున్న దాదాపు 7,500 మెట్రిక్ టన్నుల చెత్తతో పాటు శివార్లలోని మున్సిపాలిటీల చెత్త అక్కడికే వెళ్తోంది. జవహర్నగర్ఫై పడుతున్న ఈ భారాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా నలువైపులా చెత్త నిర్వహణ ఏర్పాటు కేంద్రాలకు ఎప్పటినుంచో ఆలోచనలున్నాయి. జీహెచ్ఎంసీలో ఒక వ్యక్తి నుంచి రోజుకు వెలువడుతున్న చెత్త 2019లో 500 గ్రాములు 2024లో 733 గ్రాములుజవహర్నగర్ డంపింగ్ యార్డుకు తరలుతున్న చెత్త 2014లో 3,500 మెట్రిక్ టన్నులు 2024లో 7,500 మెట్రిక్ టన్నులు పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ చెత్త 9వేల మెట్రిక్ టన్నులకు పెరుగుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. నగరానికి నాలుగువైపులా డంపింగ్ కేంద్రాలు, చెత్త నిర్వహణ కేంద్రాల ఏర్పాటుతో జవహర్నగర్పై భారం తగ్గుతుంది. -
20 ఏళ్లుగా ఉంటున్నాం.. మీరెవరు పొమ్మనడానికి..
-
ఇళ్లు వదిలి పోండి..
-
మాంబట్టు సెజ్లో భారీ అగ్నిప్రమాదం
తడ (తిరుపతి జిల్లా): పరిశ్రమల్లో లభించే పాత వస్తువులను సేకరించే ఒక సంస్థ నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలకు సమీపంలో నెలకొలి్పన డంపింగ్ యార్డులో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా తడలోని మాంబట్టు ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నిల్వ ఉంచిన చెత్తకు నిప్పు అంటుకోవడంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో పొగ ఆకాశాన్ని అంటుకుని చీకట్లు కమ్మేయడంతో సమీప పరిశ్రమల్లోని కార్మికులు ఆందోళన చెందారు.నాయుడుపేట సీఐ శ్రీనివాసులురెడ్డి, సూళ్లూరుపేట సీఐ మధుబాబు, తడ, సూళ్లూరుపేట ఎస్ఐలు నరశింహారావు, రహీంరెడ్డి తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సూళ్లూరుపేట, అపాచీ పరిశ్రమలకు చెందిన రెండు ఫైరింజన్లు మంటలు అదుపు చేసేందుకు శ్రమించాయి. మంటలతోపాటు మంటల్లో నుంచి భారీ శబ్దాలతో పేలుళ్లు వస్తుండటంతో పోలీసులు ఆ దారిన రాకపోకలు అడ్డుకుని ఇతర మార్గాల్లో వాహనాలు మళ్లించారు.కాగా పరిశ్రమలకు సమీపంలో ఎలాంటి జాగ్రత్తలు లేకుండా ఉన్న డంపింగ్ యార్డు వల్ల తీవ్ర ఇబ్బందులు జరుగుతాయని ఏడాది క్రితం సూళ్లూరుపేట ఫైర్ అధికారులు తిరుపతికి చెందిన స్థల యజమాని హర్షవర్ధన్, చెత్త సేకరించి నిల్వ చేసుకునేందుకు స్థలాన్ని లీజుకు తీసుకున్న షేర్ అలీ అనే వ్యక్తులకు సమాచారం ఇచ్చినా వారు పెడచెవిన పెట్టారని ఫైర్ సిబ్బంది తెలిపారు. డంపింగ్ యార్డులో పనికి రాని చెత్త మాత్రమే కాలిపోగా ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఆనుకుని ఉన్న అల్యూమినియం క్యాస్టింగ్ కంపెనీ తీవ్రంగా నష్టపోయింది. -
ఆనంద్ మహీంద్రాను బాధించిన వీడియో.. అందులో ఏముందంటే..?
ముంబయి: సోషల్ మీడియాలో చురుకుగా ఉండే మహీంద్రా గ్రూప్ ఛైర్మెన్ ఆనంద్ మహీంద్రా తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో కొందరు వ్యక్తులు వ్యర్థాలను సముద్రంలో పడేస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. ఈ వీడియో తనను ఎంతగానే బాధించినట్లు ఆనంద్ మహీంద్రా ఆవేదన వ్యక్తం చేశారు. గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద సముద్రంలో కొందరు వ్యక్తులు వ్యర్థాలను పడేశారు. కార్లలో వచ్చి బస్తాల్లో తీసుకొచ్చిన వ్యర్థాలను సముద్ర నీటిలో వేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. పర్యావరణాన్ని కలుషితం చేయడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలింపు చేపట్టారు. నగర మున్సిపాలిటీ అధికారులు నిందితులకు రూ.10,000 జరిమానా కూడా విధించారు. The Good Citizens of Mumbai Early Morning at Gateway of India pic.twitter.com/FtlB296X28 — Ujwal Puri // ompsyram.eth 🦉 (@ompsyram) November 21, 2023 సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. ఈ వీడియోలోని దృశ్యాలు తనను ఎంతగానో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణం పట్ల ప్రజల అభిప్రాయం మారకపోతే.. జీవన నాణ్యతా ప్రమాణాలు పెరగబోవని పేర్కొంటూ ట్వీట్ చేశారు. కాగా.. ఈ వీడియోపై నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయితే.. నగరాన్ని శుభ్రంగా ఉంచడం కష్టమని అభిప్రాయపడ్డారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరారు. ఇదీ చదవండి: 'అలా అయ్యుంటే టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్లో గెలిచేది! -
‘ప్లాస్టిక్ అడవి’లో ఏనుగులు
ఎటు చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తా చెదారం మధ్య ఏనుగుల గుంపు కనిపిస్తోందా? అంతటి కలుషిత, ప్రమాదకర పదార్థాల మధ్య ఆ ఏనుగులు ఆహారాన్ని వెతుక్కుంటున్నాయి. అభివృద్ధితోపాటు వస్తున్న కాలుష్య ప్రమాదానికి ఇదో సంకేతమని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలను తీసుకెళ్లి అడవుల సమీపంలో డంపింగ్ చేస్తుండటం కేవలం పర్యావరణానికి మాత్రమేకాదు వన్య ప్రాణులకు ఎంతో చేటు చేస్తున్న దారుణ పరిస్థితిని ఇది కళ్లకు కడుతోంది. శ్రీలంకలోని తూర్పు ప్రావిన్స్లో లలిత్ ఏకనాయకే అనే ఫొటోగ్రాఫర్ ఈ చిత్రాన్ని తీశారు. నేచర్ ఇన్ఫోకస్ సంస్థ ఇచ్చే ఫొటోగ్రఫీ అవార్డుల్లో ‘కన్సర్వేషన్ ఫోకస్’ విభాగంలో ఇది ఉత్తమ చిత్రంగా నిలిచింది. –సాక్షి సెంట్రల్ డెస్క్ -
యాభై ఏళ్లలో చేయనోళ్లు.. ఇప్పుడు అభివృద్ధి చేస్తారట!
సాక్షి, మేడ్చల్ జిల్లా: యాభై ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయనివాళ్లు.. ఇప్పుడు అవకాశమిస్తే ఎలా చేస్తారని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు ప్రతిపక్షాలను సూటిగా ప్రశ్నించారు. జవహర్నగర్ డంపింగ్ యార్డులో రూ.251 కోట్లతో 2000 కేఎల్డీ సామర్థ్యం కలిగిన లీచెట్ ప్లాంట్ను కార్మిక మంత్రి మల్లారెడ్డి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి , రాంకీ సంస్థ ప్రతినిధులతో కలసి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో 3,619 మంది స్థానిక లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ జవహర్నగర్ డంప్ యార్డ్ నుంచి ఉత్పత్తి అయ్యే లీచెట్ కారణంగా కలుషితమవుతున్న మల్కారం చెరువుతో పాటు యార్డు చుట్టుపక్కల చెరువుల్లో ఉన్న లీచెట్ శుద్దీకరణ ప్రక్రియను వచ్చే ఏడాది ఏప్రిల్ లోపు పూర్తి చేస్తామని ప్లాంట్ నిర్వాహకులు హామీ ఇచ్చారని తెలిపారు. దేశానికే హైదరాబాద్ ఆదర్శ నగరం కాబోతోంది.. హైదరాబాద్ మహానగరంలో రోజుకు దాదాపు 2వేల ఎంఎల్టీ ( 2వేల మిలియన్ లీటర్ల) మురికినీరు ఉత్పత్తి అవుతోందని, 100 శాతం ఎస్టీపీలతో జూలై కల్లా దేశంలోనే మొట్టమొదటి నగరం కాబోతుందని కేటీఆర్ తెలిపారు. ఇందుకోసం రూ.4 వేల కోట్లు ఖర్చుపెడుతున్నట్లు వెల్లడించారు. జపాన్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ చూశానని అక్కడ పైన పార్కు, కింద ప్లాంట్ ఉందని, ఏ మాత్రం వాసన లేదని వివరించారు. జవహర్ నగర్, నాగారం, దమ్మాయిగూడలను ఆ విధంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ హామీనిచ్చారు. 3 వేల మెట్రిక్ టన్నుల యార్డ్... 8 వేల మెట్రిక్ టన్నులైంది జవహర్నగర్ డంపింగ్ యార్డ్ మొదలుపెట్టినప్పుడు హైద రాబాద్ నుంచి 3వేల మెట్రిక్ టన్నుల చెత్త వస్తుందని డిజైన్ చేశారని, కానీ ఇప్పుడు 8 వేల మెట్రిక్ టన్నుల చెత్త వస్తోందన్నారు. ప్రస్తుతం జవహర్ నగర్కు వచ్చే చెత్తలో తడి చెత్త నుంచి ఎరువు ఉత్పత్తి చేసి, రైతులకు అమ్ముతున్నామని కేటీఆర్ తెలిపారు. రూ.550 కోట్లతో దక్షిణ భారతదేశంలోనే పెద్దదైన ఈ చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తి చేసే యూనిట్ను ప్రారంభించి 20 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నామన్నారు. రెండోదశలో మరొక రూ.550 కోట్లతో 28వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని త్వరలో స్థాపించనున్నట్టు కేటీఆర్ తెలిపారు. దీంతో ఒక్క జవహర్నగర్ నుంచే 48 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తవుతుందన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే మొత్తం చెత్తతో 100 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. మూడో రకం చెత్తతో సిమెంట్, బ్రిక్స్ తయారీ తడి,పొడి చెత్త కాకుండా, ఇళ్లు కట్టినప్పుడు, కూలగొట్టినప్పుడు వచ్చే కంకర రాళ్లు, మట్టితో మూడో రకం చెత్త వస్తోందని కేటీఆర్ తెలిపారు. నిర్మాణం, శిథిలాల నుంచి వచ్చే ఈ వ్యర్థాలను పునరుత్పత్తి చేసి.. పునర్వినియోగం చేసి.. వాటి నుంచి సిమెంట్, బ్రిక్స్, ఫుట్పాత్ల మీద వేసే టైల్స్ తయా రు చేస్తున్నామన్నారు. ఈ రకమైన ప్లాంట్లను ఒకటి ఫతూల్గూడలో, రెండోది జీడిమెట్లలో పెట్టినట్లు వివరించారు. ఈ రెండూ కూడా ఒక్కోటి 500మెట్రిక్ టన్నుల కెపాసిటీతో నడుస్తున్నాయని, మరో రెండు కూడా త్వరలో పెట్టబోతున్న ట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కార్యక్రమంలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు, జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎం.సుదీర్రెడ్డి, కలెక్టర్ అమయ్కుమార్, మేయర్లు మేకల కావ్య, జక్కా వెంకట్రెడ్డి, జిల్లా గ్రంధాలయం చైర్మన్ దయాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, అడిషనల్ కలెక్టర్ నర్సింహారెడ్డి, ఆర్డీఓ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పంట నేల కాస్త విషం కక్కుతుంటే..
కరోనా కాదు.. అయినా జనాలు బయట అడుగుపెట్టాలంటే వణికిపోతున్నారు. తలుపులు, కిటికీలు గట్టిగా బిగించేసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు. పోలీసులు సైతం జనాలు అనవసరంగా బయట తిరగడంపై నిఘా పెట్టారు. ఒకవేళ.. అత్యవసరానికి బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్లు ధరిస్తున్నారు. గత వారంగా ఇదే పరిస్థితి చోటు చేసుకుంది అక్కడ. లాక్డౌన్ లాంటి పరిస్థితులకు కారణం ఒక పే... ద్ద చెత్తకుప్ప!. కొన్నేళ్ల కిందటి వరకు అది సారవంతమైన నేల.. వ్యవసాయ భూమి. కానీ, కాలక్రమంలో అదొక చెత్త కుప్పగా మారింది. ఆ చెత్త కుప్పనే వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్గా మార్చేయాలని ప్రభుత్వం భావించి ప్రయత్నాలు మొదలుపెట్టింది. చుట్టుపక్కల జిల్లాల నుంచి ఈ ప్లాంట్కు చెత్త వచ్చి చేరుతుంటుంది. కానీ, ఆ చెత్తే ఇప్పుడు ప్రజల ప్రాణాల మీదకు వచ్చింది. నిర్వాహణ లోపం, నిర్లక్ష్యం కారణంగా టన్నులకు పైగా చెత్తకు నిప్పంటుకోవడంతో.. ఆ పరిసరాలు విషవాయువులతో నిండిపోయింది. కేరళ కొచ్చి సిటీలోని బ్రహ్మపురం ప్రాంతంలోని డంప్ యార్డ్.. జనాలకు ప్రాణాంతకంగా మారింది. చెత్త కుప్ప భారీ ఎత్తున్న తగలబడి.. అందులో ప్లాస్టిక్, మెటల్, ఇతరత్ర వస్తువులు కాలిపోయి విషపూరితమైన వాయువులు వెలువడుతున్నాయి. మంటలు వెలువడిన రెండోరోజునే ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. 30 బృందాలు నిరంతరం ఆ కుప్ప దగ్గరే ఉండి.. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. అయినప్పటికీ దట్టమైన పొగ వెలువడుతూనే ఉంది. విష వాయువులతో ఆ ప్రాంతమంతా కలుషితమైపోయింది. మరోవైపు బయటకు రావొద్దని స్థానికులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ బయటకు వెళ్లినా.. ఎన్95 మాస్క్లు ధరించాలని సూచిస్తున్నారు. గ్యాస్ ఛాంబర్ అంటూ.. బ్రహ్మపురం డంప్ యార్డ్ అగ్నిప్రమాదంపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. నగరం గ్యాస్ ఛాంబర్గా మారుతుంటే ఏం చేస్తున్నారని కొచ్చి మున్సిపల్ విభాగంపై మండిపడింది. అగ్ని ప్రమాదానికి కారణాలతో పాటు యాక్షన్ ప్లాన్ను వివరించాలని ఆదేశించింది కూడా. ఇబ్బందులతో ఆస్పత్రులకు.. వేస్ట్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లోని కాలనీవాసులు నరకం అనుభవిస్తున్నారు. విషపు వాయువుల పొగ కారణంగా.. రకరకాల ఇబ్బందులో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అక్కడా వాళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస కోశ సమస్యలు, ఇతర అనారోగ్యాలు ఉన్నవాళ్లను అసలు బయటికే రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. డంప్ యార్డ్లో 70 శాతం పొగ తగలబడిపోయిందని, మిగతా చెత్తకు మంటలు అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు అంటున్నారు. మార్చి 2వ తేదీన బ్రహ్మపురం సాలిడ్వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్లో మంటలు అంటుకున్నాయి. ప్రమాదానికి కారణాలపై స్పష్టత లేకున్నా.. అధిక ఉష్ణోగ్రతతోనే మంటలు చెలరేగి ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు ప్రతిపక్షాలు ఆ అంశం ఆధారంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. వేస్ట్ మేనేజ్మెంట్లో విఫలం కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని మండిపడుతోంది. అయితే.. చెత్త నుంచి ప్లాస్టిక్, ఇతర కారకాలను తొలగిస్తూనే ఉన్నామని, అయినా పొరపొరలుగా పేరుకుపోయిన వ్యర్థాల వల్లే తీవ్ర కాలుష్యం చోటు చేసుకుందని ప్రభుత్వం అంటోంది. ప్లాంట్ కథాకమామీషు కొచ్చికి వ్యర్థాల తొలగింపు ఎప్పుడూ పెద్ద సమస్యగా ఉంది. 1998లో నగరానికి 17 కిలోమీటర్ల దూరంలోని బ్రహ్మపురం వద్ద కొచ్చి కార్పొరేషన్ 37 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసింది. అక్కడ వ్యర్థాల శుద్ధి కర్మాగారాన్ని నిర్మించేందుకు 2005లో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సమయంలో ఈ ప్రాజెక్టుపై నిర్వాసితుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. ► చివరికి.. 2007లో 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చిత్తడి నేలను పునరుద్ధరించి ఆ ప్రాంతంలో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను నిర్మించారు. రోజుకు 250 టన్నుల సామర్థ్యంతో 2008లో వేస్ట్ ప్లాంట్ను ప్రారంభించారు. కానీ, ఏడాదిన్నర వ్యవధిలోనే ప్లాంట్ దెబ్బతింది. నిర్మాణ లోపాల వల్లే ఇది జరిగిందని గుర్తించిన అధికారులు.. పరిశోధనలు ప్రారంభించారు. కానీ, ఫలితం తేలలేదు. ► ఆపై డిమాండ్ మేరకు కొచ్చి కార్పొరేషన్ మరింత ఎక్కువ భూమిని సేకరించవలసి వచ్చింది. ఇవాళ.. బ్రహ్మపురం వ్యర్థాల కర్మాగారం అనేది కొచ్చి నగరంలోని ప్రధాన ఐటీ పార్కుల సమీపంలో 110 ఎకరాల స్థలంలో విస్తరించింది. ► కొచ్చి కార్పొరేషన్తో పాటు కళమస్సెరీ, ఆళువా, అంగమళి, త్రిక్కకారా, త్రిపునితారా మున్సిపాలిటీలతో పాటు చెరానల్లూరు, వడవుకోడ్ పుథాన్కురిష్ పంచాయితీల చెత్త కూడా ఈ ప్లాంట్కే వచ్చి చేరుతోంది. ► ప్రతిరోజూ సుమారు 400 టన్నుల చెత్త ఈ ప్లాంట్కు వస్తుంది. అందులో నలభై శాతం ప్లాస్టిక్, నాన్బయోడీగ్రేడబుల్ చెత్త ఉంటోంది. ► 2012లో భారత్ ట్రేడర్స్ అనే కంపెనీతో కొచ్చి కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం.. బ్రహ్మపురం ప్లాంట్ నుంచి చెత్త సేకరణలో భాగంగా ప్లాస్టిక్ కేజీకి రూపాయిన్నర చెల్లిస్తుంది. అయితే.. అది రీసైక్లింగ్ ప్లాస్టిక్కు మాత్రమే. దీంతో మిగతా వేస్ట్ అంతా అక్కడే ఉండిపోతోంది. ► ఇక ఇక్కడే చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తికి ఒక ప్లాంట్ ఏర్పాటు చేయాలనే ప్రయత్నం జరిగింది. 2011లో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో ప్లాంట్కు శంకుస్థాపన చేయాలనుకున్నారు. 2015లో ఒప్పందం జరిగి.. మూడేళ్ల తర్వాత ప్లాంట్కు శంకుస్థాపన రాయి కూడా పడింది. కానీ, నిధులు లేక 2020లో ఆ ఒప్పందం రద్దు అయ్యింది. ► బ్రహ్మపురం వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు సైతం జోక్యం చేసుకున్నాయి. అయినప్పటికీ.. కొచ్చి కార్పొరేషన్ దాని పని తీరును మెరుగుపర్చలేదు. ఇంకో విషయం ఏంటే.. తాజా ఘటన నేపథ్యంలో కొచ్చి కార్పొరేషన్కు కేరళ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దాదాపు రూ.15 కోట్ల జరిమానా విధించింది. అయితే.. కార్పొరేషన్ ఈ ఆదేశాలపై హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంది. నాటకీయ పరిణామాల నడుమ.. బ్రహ్మపురం డంప్ యార్డ్ అగ్నిప్రమాదం నేపథ్యంలో.. గత వారం రోజులుగా అందులోని ఇతర ప్రాంతాల నుంచి చెత్తను అనుమతించడం లేదు. అలాగే.. ప్లాంట్ బయట ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు కూడా బైఠాయించారు. ఈ క్రమంలో.. శుక్రవారం అర్ధరాత్రి దాటాక 40 లారీల్లో చెత్త కుప్ప ప్లాంట్కు చేరింది. ఆ సమయంలో కాంగ్రెస్ సభ్యులు అడ్డగించే యత్నం చేయగా.. పోలీసులు వాళ్లను బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు. ఆపై లారీలను లోపలికి అనుమతించారు. విశేషం ఏంటంటే.. అగ్నిప్రమాద ఘటన తర్వాత ప్లాస్టిక డంపింగ్ను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా.. అందుకు విరుద్ధంగా కొచ్చి కార్పొరేషన్ చెత్తను లోపలికి అనుమతించడం. -
డంపింగ్ గ్రౌండ్లతో మృత్యు ఘోష.. పదేళ్లలో 1,877 మంది మృతి
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో చెత్తవేసే డంపింగ్ గ్రౌండ్ల సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. 13 ఏళ్ల నుంచి గోవండీలో ఉన్న డంపింగ్ గ్రౌండ్, బయో మెడికల్ చెత్తను నిర్వీర్యం చేసే ప్రక్రియ ప్రాజెక్టువల్ల వాతావరణం కాలుష్యమైపోతోంది. ఫలితంగా గోవండి ప్రాంత ప్రజలు వివిధ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. గడచిన పదేళ్లలో బీఎంసీకి చెందిన ఎం– తూర్పు వార్డు పరిధిలో 1,877 మంది క్షయ వ్యాధితో మృత్యువాత పడ్డారని సమాచార హక్కు చట్టం కింద సేకరించిన వివరాలను బట్టి తెలిసింది. అంతేగాకుండా గడచిన పదేళ్ల కాలంలో 45,051 మందికి క్షయ వ్యాధి సోకినట్లు ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో గోవండీ, పరిసరాల్లో భీతావహ వాతావరణం నెలకొంది. గోవండీలో ఉన్న డంపింగ్ గ్రౌండ్, బయో మెడికల్ చెత్త నిర్వీర్యం చేసే ప్రకియ ప్రాజెక్టు వల్ల కమలారమణ్ నగర్, డింపింగ్ రోడ్, డా.జాకీర్ హుస్సేన్ నగర్, రఫిక్ నగర్, బాబానగర్, బైంగన్ వాడి, శివాజీనగర్, పీఎంజీపీ కాలనీ, టాటా నగర్ కాలనీ, ఇండియన్ ఆయిల్ నగర్, దేవ్నార్ తదితర పరిసరాల్లో కాలుష్యం పెరిగిపోయింది. దీని ప్రభావం అక్కడుంటున్న స్థానిక ప్రజల ఆరోగ్యంపై పడసాగింది. దీంతో స్థానికుల నుంచి అనేక ఫిర్యాదులు రావడం మొదలయ్యాయి. కానీ వాటిని స్ధలాంతరం చేయడానికి బీఎంసీకి ప్రత్యామ్నాయ మార్గం కనిపించలేదు. దీంతో అక్కడే కొనసాగిస్తూ వస్తున్నారు. సామాజిక కార్యకర్త శేఖ్ ఫైయాజ్ ఆలం సమాచార హక్కు చట్టం ద్వారా బీఎంసీ ఎం–తూర్పు వార్డు పరిధిలో ఎంత మంది క్షయ రోగులున్నారో వారి వివరాలు సేకరించారు. అందులో 2013 నుంచి 2022 వరకు మొత్తం 45,051 మందికి క్షయ వ్యాధి సోకినట్లు తేలింది. అందులో 1,877 మంది చనిపోయినట్లు ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. కానీ క్షయ సోకిన వారు, మృతి చెందిన వారంతా బయో మెడికల్ చెత్త నిర్వీర్యం చేసే ప్రక్రియ ప్రాజెక్టు నుంచి వెలువడుతున్న విషవాయువుల వల్ల చనిపోయినట్లు నిర్ధారించాల్సిన అవరసం ఎంతైన ఉందని ఎస్ఎంఎస్ కంపెనీ అంటోంది. చెత్తను నిరీ్వర్యం చేసే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ముఖ్యంగా ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా ఈ ప్రాజెక్టును కొనసాగిస్తున్నామని తెలిపింది. కొందరు స్థానికులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కంపెనీ స్పష్టం చేసింది. -
హైదరాబాద్ లోయర్ ట్యాంక్బండ్ సమీపంలో భారీ పేలుడు
సాక్షి, హైదరాబాద్: గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోయర్ ట్యాంక్ బండ్ స్నో వరల్డ్ సమీపంలోని చెత్త డంపింగ్ యార్డ్లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న తండ్రీ కొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, గాంధీనగర్ సీఐ మోహన్రావు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. పేలుడుకు గల కారణాలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారు కర్నూలు జిల్లా నాంచార్ల గ్రామానికి చెందిన చంద్రన్న , ఆయన కుమారుడు సురేష్గా గుర్తించారు. సురేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చదవండి: కామారెడ్డి: గుహలో చిక్కుకున్న రాజు సురక్షితంగా బయటకి.. -
‘డంపింగ్ యార్డ్’కు ఢిల్లీ పాలిటిక్స్.. ఆప్, బీజేపీ పరస్పర విమర్శలు
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ)ఎన్నికలు ఈ ఏడాది చివర్లో లేదా 2023 తొలినాళ్లలో జరగనున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. అధికార ఆప్, భాజపా మధ్య తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి ఈ ఎన్నికలు. తాజాగా గాజీపూర్లోని డంపింగ్ యార్డ్ ఇరు పార్టీల మధ్య వివాదానికి తెరతీసింది. అక్కడి చెత్త డంపింగ్ యార్డ్ వద్దకు గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెళ్లగా.. భాజపా కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఆయనొక అబద్ధాలకోరు అంటూ నినాదాలు చేశారు. అందుకు కౌంటర్గా ఆప్ కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూడు స్థానిక సంస్థల విలీనానికి ముందు పదేళ్లకు పైగా ఎంసీడీ అధికారం భాజపా చేతిలోనే ఉంది. ఆ అంశాన్ని లేవనెత్తుతూ.. విమర్శలు గుప్పించారు కేజ్రీవాల్. ‘భాజపా విమర్శల్లో ఎలాంటి లాజిక్ లేదు. భాజపా నేతృత్వంలోని స్థానిక సంస్థలు ఏం చేశాయో తెలుసుకునేందుకే ఇక్కడకు వచ్చాను. ఢిల్లీని శుభ్రంగా ఉంచే పనిలో బీజేపీ పూర్తిగా విఫలమైంది. మేం నిర్మించిన పాఠశాలలు, మొహల్లా క్లినిక్లను చూసేందుకు భాజపా వస్తే.. మేం ఇలా నల్ల బ్యాడ్జీలతో నిరసనలు చేయం. మేం అధికారంలోకి వస్తే.. ఢిల్లీని శుభ్రం చేస్తాం. మిమ్మల్ని ఉచితంగా తీర్థయాత్రలకు తీసుకెళ్లిన కుమారుడికి ఓటు వేయాలని ఢిల్లీలోని మాతృమూర్తులకు చెప్పాలనుకుంటున్నాను.’ అని వెల్లడించారు కేజ్రీవాల్. ఈ సందర్భంగా రామాయణంలోని శ్రవణ కుమారుడి పాత్రతో తనను తాను పోల్చుకున్నారు. మరోవైపు.. కేజ్రీవాల్ వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. స్థానిక సంస్థలకు ఢిల్లీ సర్కార్ తగిన నిధులు ఇవ్వలేదని నిందించింది. ఇప్పుడు స్థానిక ఎన్నికల ముందు ప్రతిజ్ఞలు చేస్తోందని మండిపడింది. స్థానిక సంస్థల ఎన్నికలకు పారిశుద్ధ్య అంశాన్ని కేంద్ర సమస్యగా ఆప్ మార్చిందని, ఇతర ప్రాంతాలను చూపిస్తూ డంపింగ్ పర్వతాలను కప్పిపుచ్చుతోందని ఆరోపించింది. మరోవైపు.. ఎన్నికల తేదీలను ఇంకా ప్రకటించలేదు. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ గణాంకాల ప్రకారం.. నగరంలో నిత్యం 11వేల టన్నుల ఘన వ్యర్థాలు వస్తున్నాయి. వాటిల్లో 5 వేల టన్నులు ప్రాసెస్కు పంపగా.. మరో ఆరు వేల టన్నులు అక్కడి మూడు డంపింగ్యార్డులకు చేరుకుంటున్నాయి. ఇదీ చదవండి: ‘అదే మా లక్ష్యం’.. పీఓకేపై రక్షణ మంత్రి రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు! -
డంపింగ్ యార్డులో మూవీ సెట్ వేశాం : డైరెక్టర్
ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘నవాబ్’. రవిచరణ్ దర్శకత్వంలో నమో క్రియేషన్స్ పతాకంపై ఆర్ఎం నిర్మిస్తున్నారు. హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో రవిచరణ్ మాట్లాడుతూ – ‘‘నా మొదటి సినిమా ‘నల్లమల’కు మంచి ఆదరణ లభించింది. ఆ ఉత్సాహంతో ‘నవాబ్’ తెరకెక్కిస్తున్నాం. పూర్తిగా డంపింగ్ యార్డ్లో సాగే కథతో ఈ సినిమా ఉంటుంది. దీని కోసం పదెకరాల్లో డంపింగ్ యార్డ్ సెట్ వేశాం. మా హీరో ముఖేష్ గుప్తా తెలుగు కాదు. ఆర్నెళ్లు తెలుగు నేర్చుకుని అద్భుతంగా నటిస్తున్నారు’’ అన్నారు. ‘‘ఓ మంచి కథతో రూపొందుతున్న ‘నవాబ్’లో హీరోగా నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు ముఖేష్ గుప్తా. -
‘జవహర్నగర్లో కర్చీఫ్ లేకుండా తిరగలేం’
సాక్షి,మేడ్చల్జిల్లా: డంపింగ్ యార్డు కారణంగా జవహర్ నగర్ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మాటల్లో చెప్పలేమని బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్చార్జ్ మురళీధర్ రావు అన్నారు. హైదరాబాద్ నగరాన్ని న్యూయార్క్, డల్లాస్, వాషింగ్టన్, లండన్లా మారుస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారని, అయితే పక్కనే ఉన్న జవహర్నగర్ లో కర్చీఫ్ అడ్డం పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. సోమవారం దమ్మాయిగూడ ప్రజాసంగ్రామ యాత్ర సభలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ఎన్నికలు అంటే వరద సాయం అన్నారని, దుబ్బాక ఎన్నికలకు మరో పథకం, హుజురాబాద్ ఎన్నికల సమయంలో ‘దళిత బంధు’ మునుగోడు అంటే ‘గిరిజన బంధు’ పథకాలను తెరపైకి తెస్తున్నారన్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ విషయంపై గత కొంతకాలంగా బీజేపీ పోరాటం చేస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇక్కడి నుంచి డంపింగ్ యార్డును ఎత్తివేస్తామన్నారు. టీఆర్ఎస్ పాలనలో ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. కుటుంబ పాలన, అవినీతి, మాఫియా రాజ్యాన్ని అంతమొందించాలంటే బీజేపీని గెలిపించాలన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే నీతివంతమైన పాలన ప్రజలకు అందుతుందన్నారు. సభలో బీజేపీ రాష్ట్ర నేతలు చాడ సురేష్రెడ్డి, డాక్టర్ విజయరామారావు , మాజీఎమ్మెల్సీ దిలీప్కుమార్, కొల్లి మాధవి, కొంపెల్లి మోహన్రెడ్డి, జిల్లా నేతలు పి.హరీష్రెడ్డి, పటోళ్ల విక్రంరెడ్డి, జిల్లాల తిరుమల్రెడ్డి, అమరం మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ చెత్త రాజకీయం.. హిందూపురంలో బాలకృష్ణ ఇంటి వద్ద ఉద్రిక్తత
సాక్షి, హిందూపురం: డంపింగ్ యార్డు తరలింపునకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో టీడీపీ నాయకుల కవ్వింపు చర్యలు హిందూపురంలో ఉద్రిక్తతకు దారి తీసాయి. వివరాలు... పట్టణంలోని 21వ వార్డు మోత్కుపల్లి సమీపంలోని డంపింగ్ యార్డు సమస్యపై మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ సోమవారం రాత్రి వాట్సాప్ గ్రూపుల్లో హిందూపురం పార్లమెంట్ టీడీపీ మీడియా కో–ఆర్డినేటర్ చంద్రమోహన్ పోస్టు చేశాడు. దీనిపై 21వ వార్డు కౌన్సిలర్ మారుతీరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు గోపీకృష్ణ స్పందించారు. పట్టణాభివృద్ధిలో భాగంగా∙మోత్కుపల్లి డంపింగ్ యార్డును చిన్నగుడ్డంపల్లి వద్దకు తరలించేలా ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ చర్యలు చేపట్టారని, త్వరలో యార్డును చిన్నగుడ్డంపల్లి వద్దకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాధానమిచ్చారు. 37 ఏళ్లుగా టీడీపీ ఎమ్మెల్యేలు ఈ సమస్యపై ఏమి చేశారంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ సైతం పట్టించుకోలేదని కౌంటర్ వేశారు. దీనిపై బహిరంగ చర్చకు రావాలన్న టీడీపీ నేత సవాల్ను వైఎస్సార్సీపీ నేతలు స్వీకరించి మంగళవారం ఉదయం 11 గంటలకు చౌడేశ్వరీ కాలనీలోని బాలకృష్ణ ఇంటి వద్దకే వస్తామని ప్రకటించారు. మంగళవారం ఉదయం 10.23 గంటలకు వేదిక మారుస్తూ టీడీపీ పట్టణాధ్యక్షుడు రమేష్ వాట్సాప్ గ్రూప్ల్లో మెసేజ్లు పంపారు. అప్పటికే వైఎస్సార్సీపీ నేత గోపీకృష్ణ, కౌన్సిలర్లు మారుతీరెడ్డి, శివ, తదితరులు బాలకృష్ణ ఇంటి వద్దకు చేరుకున్నారు. చదవండి: (అర్హతే ప్రామాణికం) గత టీడీపీ హయాంలో హిందూపురంలో బాలకృష్ణ ఎలాంటి అభివృద్ధి చేశారో వచ్చి చెప్పాలంటూ టీడీపీ నాయకులను ప్రశ్నించారు. సమాధానం చెప్పలేక జై బాలయ్య అంటూ టీడీపీ నేతలు నినాదాలతో వాతావరణాన్ని వేడెక్కించారు. ప్రతిగా వైఎస్సార్సీపీ నాయకులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఇరు వర్గాలకు నచ్చచెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. చదవండి: (నటుడు నాని ఏ కిరాణా కొట్టు లెక్కలు లెక్కపెట్టారో: మంత్రి పేర్ని నాని) జనవరి నుంచి కొత్త డంపింగ్ యార్డుకు చెత్త జనవరి నుంచి చిన్నగుడ్డంపల్లి వద్దకు డంపింగ్ యార్డును మార్చనున్నట్లు హిందూపురం మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాలుగా మోత్కుపల్లి రోడ్డులో ఉన్న డంపింగ్ యార్డు వల్ల స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయంగా ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ స్పందించి పర్యావరణ శాఖ నుంచి ఎన్ఓసీ తెప్పించి ఇవ్వడంతో 2022, జనవరి నుంచి చెత్తను కొత్త డంపింగ్ యార్డుకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందు కోసం అన్ని చర్యలూ పూర్తి అయ్యాయన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా యార్డు చుట్టూ వందలాది మొక్కలు నాటిస్తున్నట్లుగా తెలిపారు. -
వ్యర్థాలే ‘పవర్’ ఫుల్!
సాక్షి, అమరావతి: వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీకి రంగం సిద్ధమైంది. డంపింగ్ యార్డులో కుప్పలుగా పడి పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఈ వ్యర్థాలు ఇకపై వెలుగులను వెదజల్లనున్నాయి. దీనికి గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నాయుడుపేటలో 15.50 ఎకరాల్లో ఏర్పాటు చేసిన కర్మగారం వేదికగా కానుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో జిందాల్ సంస్థ రూ.340 కోట్లతో ఈ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. గత సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8 వరకూ ప్రయోగాత్మకంగా ఇక్కడ విద్యుత్ను ఉత్పత్తి చేశారు. ఇది విజయవంతమవడంతో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్మాగారంలో విద్యుదుత్పత్తి జరిగే విధానంపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది.. ఇలా ఉత్పత్తి.. రోజుకు 1,200 మెట్రిక్ టన్నుల వ్యర్థాలతో 15 మెగా వాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడ, గుంటూరు, తాడేపల్లి–మంగళగిరి నగరపాలక సంస్థలతో పాటు సత్తెనపల్లి, చిలకలూరిపేట, నరసరావుపేట, పొన్నూరు, తెనాలి పురపాలక సంస్థల నుంచి వ్యర్థాలను ఇక్కడికి తీసుకొస్తారు. లారీల్లో వచ్చే చెత్తను కర్మాగారంలోని పిట్లో అన్లోడ్ చేస్తారు. చెత్తను నిల్వ చేసేందుకు 25 మీటర్ల వెడల్పు, 71 మీటర్ల పొడవుతో పిట్ను నిర్మించారు. పిట్లో ఉన్న వ్యర్థాలను గ్రాబ్ క్రేన్ సాయంతో ఫీడర్లో వేస్తారు. ఫీడర్ కింద అమర్చిన సోటకర్ నుంచి వెలువడే మంటలో వ్యర్థాలను మండిస్తారు. ఇవి మండినప్పుడు వచ్చే వేడికి బ్రాయిలర్లో స్టీమ్ వెలువడుతుంది. ఈ స్టీమ్.. టర్బైన్లను తిప్పినప్పుడు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 20 మెగా వాట్ల టర్బైన్ను అమర్చారు. ఉత్పత్తి అయిన విద్యుత్ను వెంగళాయపాలెంలోని విద్యుత్ సబ్ స్టేషన్కు సరఫరా చేసేందుకు వీలుగా కర్మాగారం నుంచి 32 కేవీ విద్యుత్ లైన్ను వేశారు. కర్మాగారంలో 11/33 కేవీ స్విచ్ యార్డు నెలకొల్పారు. కర్మాగారంలో ఉత్పత్తి అయిన విద్యుత్ను డిస్కమ్లకు యూనిట్కు రూ.6.16కు విక్రయిస్తారు. వ్యర్థాలు మండినప్పుడు బాటమ్ యాష్, ఫ్లైయాష్ అనే రెండు రకాలైన బూడిద వెలువడుతుంది. ఫ్లైయాష్ను నిర్మాణాలకు వాడే ఇటుకల తయారీకి వినియోగిస్తారు. బాటమ్ యాష్ను లోతట్టు ప్రాంతాల్లో పూడిక కోసం వినియోగించవచ్చు. ఇదే తరహాలో విశాఖలోనూ.. గుంటూరు తరహాలోనే విశాఖపట్నంలో 15 మెగా వాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం గల మరో కర్మాగారం నిర్మాణంలో ఉంది. 2016లో కర్మాగారాల ఏర్పాటుకు జిందాల్ సంస్థకు అనుమతులు లభించినా, అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో పనులు వేగంగా జరగలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఈ రెండు కర్మాగారాల ఏర్పాటుతో సుమారు 400 మందికి ఉపాధి లభిస్తోంది. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ కర్మాగారాలు దేశంలో ఇప్పటికే ఐదు ఉన్నాయి. ఢిల్లీలో మూడు, మధ్యప్రదేశ్లోని జబల్పూర్, హైదరాబాద్లో ఒక్కొక్కటి చొప్పున ఉండగా, ఏపీలో ఉన్న రెండింటితో కలిపి మొత్తం ఏడయ్యాయి. త్వరలోనే విద్యుదుత్పత్తి ప్రయోగాత్మక పరిశీలన విజయవంతమైంది. కమర్షియల్ ఆపరేషన్ డేట్(సీవోడీ) కోసం ఏపీసీపీడీసీఎల్కు దరఖాస్తు చేశాం. సీవోడీ మంజూరైతే విద్యుదుత్పత్తిని ప్రారంభిస్తాం. త్వరలోనే కర్మాగారంలో పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. – ఎంవీ చారి, జిందాల్ ఏపీ ప్రాజెక్ట్ల ప్రెసిడెంట్ -
హుస్సేన్సాగర్ని డంపింగ్ సాగర్గా మార్చారు..
సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున ఉన్న చారిత్రక హుస్సేన్సాగర్ను స్వచ్ఛమైన జలాలతో నింపాలన్న సర్కారు సంకల్పం కాగితాలకే పరిమితమవుతోంది. తాజాగా బహుళ అంతస్తుల సెక్రటేరియేట్ భవనాల కూల్చివేత ద్వారా వచ్చిన సుమారు రెండు లక్షల టన్నుల నిర్మాణ వ్యర్థాలను సాగర్లో డంపింగ్ చేశారంటూ పలువురు పర్యావరణ వేత్తలు జాతీయ హరిత ట్రిబ్యునల్ను ఆశ్రయించడంతో సాగరమథనంపై అందరి దృష్టి మళ్లింది. కాగా స్వచ్ఛ సాగర్గా మార్చేందుకు గత దశాబ్దకాలంగా చేసిన వరుస ప్రయోగాలు ఆశించిన మేర సత్ఫలితాలివ్వకపోవడంతో మిషన్ గాడి తప్పిందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. దశాబ్దకాలంగా సాగర ప్రక్షాళనకు సుమారు రూ.326 కోట్లు ఖర్చుచేసినా ఫలితం శూన్యమని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. వ్యర్థాల డంపింగ్పై ఎన్జీటీలో పిటీషన్.. పాత సచివాలయం భవనాల కూల్చివేత ద్వారా వచ్చిన రెండు లక్షల టన్నుల ఘన వ్యర్థాలను అధికారులు వేరొక చోటుకు తరలించినట్లు చెబుతున్నా..అవన్నీ హుస్సేన్సాగర్లో కలిపేశారని, దీంతో సాగర్ 35 మీటర్ల మేర కుంచించుకుపోయిందని ఆరోపిస్తూ సేవ్ అవర్ అర్బన్ లేక్స్ సంస్థ కన్వీనర్, పర్యావరణ వేత్త లుబ్నాసర్వత్ జాతీయ హరిత ట్రిబ్యునల్లో పిటీషన్ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించారు. దీనిపై సెప్టెంబరు 7న సమగ్ర విచారణ జరగనున్నట్లు ఆమె తెలిపారు. డంపింగ్పై వాస్తవాలు బయటపెట్టాలి: లుబ్నా సర్వత్ సచివాలయ కూల్చివేత వ్యర్థాలను హుస్సేన్ సాగర్లో కలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను ఎన్జీటీకి సమర్పించాం. ప్రభుత్వం ఈ విషయంలో వాస్తవాలు బయటపెట్టాలి. అందమైన హుస్సేన్ సాగర్ను ఇలా డంపింగ్ లేక్గా మార్చడం ఏమాత్రం సబబు కాదు. ఆస్ట్రియాలోని డాన్యుబ్ నది తరహాలో ప్రక్షాళన అవసరం సుమారు 900 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో విస్తరించిన హుస్సేన్సాగర గర్భంలో దశాబ్దాలుగా సుమారు 40 లక్షల టన్నుల ఘనవ్యర్థాలు పోగుపడినట్లు అంచనా. ప్రభుత్వం గత దశాబ్దకాలంగా సుమారు 5 లక్షల టన్నుల వ్యర్థాలను మాత్రమే తొలగించినట్లు సమాచారం. మిగిలిన 35 లక్షల టన్నుల ఘన వ్యర్థాలు సాగర గర్భంలోనే మిగిలిపోయాయి. ఈ ఘన వ్యర్థాలను కూడా డాన్యుబ్ నది తరహాలో ఆస్ట్రియా సాంకేతిక పరిజ్ఞానంతో తొలగించి మందమైన హెచ్డీపీఈ పైపుల్లో నింపి సాగరం చుట్టూ కట్టలా ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆస్ట్రియా నిపుణుల సహకారం, సాంకేతికతతో మాత్రమే ఈ పనులు చేయగలుగుతారని..ప్రస్తుతం మన వద్ద అందుబాటులో ఉన్న విధానాలతో అట్టడుగున ఉన్న ఘన వ్యర్థాలను తొలగించడం సాధ్యపడదని స్పష్టంచేస్తుండడం గమనార్హం. సాగర మథనం సాగుతోందిలా.. ► ప్రక్షాళనకు తీసుకున్న చర్యలు: 2006లో రూ.270 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం, ఘన వ్యర్థాల తొలగింపు ► 2014: రూ.56 కోట్లతో కూకట్పల్లి నాలా డైవర్షన్ పనులు ► 2015: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఎనిమిది కాళ్ల ఎక్స్కావేటర్తో వ్యర్థాలు తొలగింపు. ► 2017: హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో సాగర జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు కెనడాకు చెందిన ఎజాక్స్ కంపెనీ శాటిలైట్ ఆధారిత టెక్నాలజీ వినియోగం. (ఈ ప్రయోగాన్ని ఉచితంగానే చేశారు) ► హుస్సేన్సాగర్ ప్రక్షాళనకు దశాబ్దకాలంలో చేసిన వ్యయం: సుమారు రూ.326 కోట్లు చదవండి: ఇదేం రూల్ సారూ.. టులెట్ బోర్డుకు రూ.2 వేల జరిమానా! -
బాబోయ్ డంపు.. తట్టుకోలేక ప్రజలు..
సాక్షి, హైదరాబాద్: నిజాంపేట్లోని డంపింగ్ యార్డుతో స్థానికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. చాలాకాలం నుంచి దీనిని ఇక్కడ నుంచి తరలించాలని అధికారులను వేడుకుంటున్నా ఎవరూ స్పందించకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం బాచుపల్లిలోని సర్వే నెంబర్ 186లో ప్రభుత్వ స్థలంలో అధికారులు డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. అయితే నిత్యం యార్డు నుంచి వెలువడే దుర్వాసనలు, చెత్తను కాల్చడంతో ఎగసి పడుతున్న మంటలు, పొగలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సమస్య తీవ్రతను గుర్తించి ఇక్కడ నుంచి తరలించాలనే డిమాండ్ ప్రజల్లో ఊపందుకుంది. డంపింగ్ యార్డుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ► నిజాంపేట్ కార్పొరేషన్ బాచుపల్లిలోని సర్వే నంబర్ 186లో సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో చెత్త డంపింగ్ యార్డును గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో ఏర్పాటు చేశారు. ► రోజు రోజుకు పెరుగుతున్న జనాభాతో ఇళ్ల నుంచి సేకరించిన చెత్త టన్నుల కొద్దీ పెరుగుతోంది. ఇలా ప్రతి రోజు నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్ ప్రాంతాల్లోని 96 కాలనీల్లో, బస్తీలు, గేటెడ్ కమ్యూనిటీల నుంచి సుమారు 120 టన్నులకు పైగా చెత్తను సిబ్బంది సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ► అయితే ఇక్కడ చెత్తను ఇక్కడ వేరు చేసి జవహర్నగర్ డంపింగ్ యార్డుకు తరలించడం అసలు ఉద్దేశం. ► కానీ నేడు ఏకంగా ఇక్కడే డంపింగ్ యార్డు ఏర్పాటైంది. దీంతో డంపింగ్ యార్డును తరలించాలని స్థానికులు ముక్తకంఠంతో కోరుతున్నారు. విష వాయువులతో ఉక్కిరి బిక్కిరి... ► చెత్త తరచూ తగులబెడుతుండటంతో డంపింగ్ యార్డు రావణ కాష్టంలా నిత్యం మండుతూనే ఉంది. ► గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్తలో ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆసుపత్రి వ్యర్థాలు సైతం ఉంటున్నాయి. ► అయితే ఈ చెత్తను సిబ్బందే తగుల బెడుతున్నారా.? లేక ఏదైనా రసాయన చర్య వల్ల మండుతోందా.. అనేది మాత్రం అంతుచిక్కడం లేదు. ► ఈ మంటలతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ► అసలే దుర్వాసన ఆపై ఘాటైన పొగతో ప్రజలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ► మంటల మూలంగా వాతావరణంలో అనేక వాయువులు విడుదల అవుతున్నాయి. దీంతో ప్రజలు అనేక ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. ఆందోళనలో స్థానికులు.. ► డంపింగ్ యార్డు ఏర్పాటుతో తమకు ప్రశాంత జీవనం కరువైందని హిల్ కౌంటీ, సాయినగర్ కాలనీ, అదిత్య గార్డెన్, రాజీవ్ గృహకల్ప, బండారి లేఅవుట్, జర్నలిస్ట్ కాలనీల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక డంపింగ్ యార్డు పక్కనే నిర్మాణం పూర్తి చేసుకున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభైతే ముప్పు మరింత పెరిగే అవకాశం ఉంది. సమస్య తీవ్రతను గుర్తించి అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి త్వరితగతిన డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి తరలించాలని కోరుతున్నారు. విష జ్వరాల బారిన ప్రజలు... ► డంపింగ్ యార్డు కారణంగా రోజుల తరబడి చెత్త పేరుకుపోవడంతో దోమలు, ఈగలు వృద్ధి చెందుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు మలేరియా, డెంగీ లాంటి విషజ్వారా -
కంపుకొడుతున్న చెరువుకట్ట.. కారణం ఏంటంటే!
సాక్షి, సిరిసిల్ల(కరీంనగర్): సిరిసిల్ల మున్సిపల్ పరిధి చంద్రంపేటలోని ఈదుల చెరువు కట్ట పరిసర ప్రాంతాల్లో చెత్త, కోళ్ల వ్యర్థాలను పడవేస్తున్నారు. చెరువు చుట్టు పక్కల ప్రాంతంలో దుర్గంధం వెదజల్లుతుందోని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని చెత్తచెదారాన్ని, చికెన్సెంటర్ నిర్వాహకులు కోళ్ల వ్యర్థాలను చెరువుకట్ట చుట్టూ పక్కల డంప్ చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈదుల చెరువు మత్తడి దూకడానికి సిద్ధంగా ఉందని, చెరువు పరిసర ప్రాంతాల్లో చెత్తను డంప్ చేయకుండా, నీరు కలుషితం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
చెత్త సమస్యను చిత్తు చేసేలా ‘స్వచ్ఛ సంకల్పం’
సాక్షి, అమరావతి: గ్రామాల్లో పేరుకుపోతున్న చెత్త సమస్యను చిత్తు చేసే చర్యలు త్వరలో మొదలు కాబోతున్నాయి. పట్టణాల్లో మాదిరిగా గ్రామాల్లోనూ ప్రతి ఇంటినుంచీ చెత్తను సేకరించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకోసం జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరిట వంద రోజుల ప్రణాళిక రూపొందించింది. తద్వారా ప్రతి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేసి ప్రజారోగ్యాన్ని కాపాడాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించేలా గ్రామాల్లో ప్రతి 250 ఇళ్లకు ఒకరిని నియమించడంతో పాటు చెత్త సేకరణకు ఆటోలు, రిక్షాలు వంటివి ప్రభుత్వమే గ్రామ పంచాయతీలకు సమకూర్చనుంది. అలా సేకరించిన చెత్తను ఎక్కడికక్కడ ప్రాసెసింగ్ చేయటం ద్వారా వర్మీ కంపోస్టు తయారు చేస్తారు. ప్రాసెసింగ్ ద్వారా వేరు చేసిన పొడి చెత్తను ఫ్యాక్టరీలకు వెళ్లనుంది. ఇందుకు పంచాయతీరాజ్ శాఖ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యాచరణ సిద్ధం చేశాయి. గ్రామాల్లో రోజుకు 12,250 టన్నుల చెత్త గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వ్యక్తి రోజుకు సగటున 300 గ్రాముల చెత్తను పారబోస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఈ విధంగా కేవలం గ్రామీణ ప్రాంతాల నుంచే రోజుకు 500 లారీల్లో పట్టేంతగా 12,250 టన్నుల చెత్త పోగవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లపై చెత్తను శుభ్రం చేయడం గ్రామ పంచాయతీలకు, పంచాయతీరాజ్ శాఖకు, ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. గ్రామాల్లో పోగయిన చెత్తను రోడ్లకు ఇరువైపులా కుప్పలుగా పోసి తగులబెట్టడం వల్ల వచ్చే పొగ, వాసనతో స్థానిక గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం ఓ శాస్త్రీయమైన, సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. కనీసం చెత్తను తగులబెట్టే అవసరం లేకుండా నిత్యం పోగయ్యే చెత్తను ఎప్పటికప్పుడే ప్రత్యామ్నాయ అవసరాలకు వినియోగించుకునేలా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. 12 శాతం చెత్తతోనే అసలు సమస్య గ్రామీణ ప్రాంతాల్లో పోగయ్యే మొత్తం చెత్తలో 65 శాతం తడి చెత్త రూపంలో ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో వర్మీ కంపోస్టు తయారు చేయాలని నిర్ణయించారు. మరో 12 శాతం పొడి చెత్త (గాజు పెంకులు, కార్డు బోర్డు, ఒక రకమైన ప్లాస్టిక్) వల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికి సమస్యలొస్తున్నాయి. దీనిని విద్యుత్ ఉత్పత్తి, సిమెంట్ ఫ్యాక్టరీల్లో మండించడానికి ఉపయోగించేలా ప్రాథమిక కార్యాచరణ రూపొందించారు. మిగిలిన 23 శాతం చెత్తను రీసైక్లింగ్కు ఉపయోగించాలని ఆలోచన చేస్తున్నారు. నాలుగు ఫ్యాక్టరీలు ఎంపిక పొడి చెత్తతో గ్రామ స్థాయిలోనే వర్మీ కంపోస్టు తయారు చేసేలా రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి గ్రామంలో ఒక షెడ్ చొప్పున ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 9 వేలకు పైగా గ్రామాల్లో వీటి నిర్మాణం పూర్తయింది. రీ సైక్లింగ్కు ఉపయోగించే చెత్తను ఆ షెడ్లలోనే వేరుచేసి అక్కడే విక్రయిస్తారు. మిగిలిన 12 శాతం చెత్తను మండించేందుకు రాష్ట్రంలోని నాలుగు ప్రధాన ప్రాంతాల్లో నాలుగు ఫ్యాక్టరీలను ఎంపిక చేయనున్నారు. -
అమానవీయం: ప్రాణం లేదని.. చెత్తకుప్పలోకి
మహబూబ్నగర్: తల్లి గర్భంలోనే ఆ శిశువుకు నూరేళ్లు నిండాయి. ఆపరేషన్ ద్వారా వైద్యులు శిశువు మృతదేహాన్ని బయటకు తీయగా.. ఆ కుటుంబసభ్యులు మానవత్వం మరిచారు. పద్ధతి ప్రకారం అంత్యక్రియలు చేయకుండానే దారిలో చెత్తకుప్పలో ఆ ఆడ శిశువు మృతదేహాన్ని పడేసిన ఘటన గురువారం మహబూబ్నగర్లో కలకలం రేపింది. జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకిషన్ కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం బకారం గ్రామానికి చెందిన మహిళ మూడో కాన్పు కోసం మార్చి 29న నాగర్కర్నూల్ ఆస్పత్రికి వెళ్లింది. అప్పటికే గర్భసంచిలో పిండం మృతి చెందడంతో హైరిస్క్ కేసు కింద వారు మహబూబ్నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. మహబూబ్నగర్ ఆస్పత్రికి రాత్రి 11.30 వచ్చారు. రాత్రి 1.30 ప్రాంతంలో ఆపరేషన్ చేసి తల్లి గర్భంలో నుంచి మృతి చెందిన ఆడ శిశువును బయటకు తీశారు. తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో శిశువు మృతదేహాన్ని తండ్రికి అప్పగించి స్వగ్రామానికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. అయితే కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లకుండా పట్టణంలోని ఓ డ్రైనేజీ సమీపంలో ఉండే చెత్తకుప్పలో పడేశారు. గురువారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టూటౌన్ పోలీసులు శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం గదికి తరలించారు. శిశువు చేతిపై ఆస్పత్రి సిబ్బంది ఏర్పాటు చేసిన ట్యాగ్ ద్వారా ఎవరి శిశువు అనే విషయాన్ని అధికారులు గుర్తించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులను పిలిపించి అడిగితే తప్పు జరిగిందని ఒప్పుకున్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు. ప్రస్తుతం తల్లి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటం వల్ల ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. -
పోలవరంలో ఎన్జీటీ బృందం
పోలవరం రూరల్: పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మూలలంక ప్రాంతంలోని డంపింగ్ యార్డు మట్టి జారిపోకుండా తీసుకున్న చర్యలు, ఇంకా చేపట్టాల్సిన పనులను జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) బృందం మంగళవారం పరిశీలించింది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శేషశయనారెడ్డి నాయకత్వంలో బృంద సభ్యులు కోట శ్రీహర్ష, టి.శశిధర్, ఎస్.మన్నివరం, హెచ్డీ వరలక్ష్మి, డి.సురేష్ పోలవరం ప్రాజెక్టు డంపింగ్ యార్డులు, ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డంపింగ్ యార్డులను పరిశీలించి ప్రాజెక్టు సీఈ ఎం.సుధాకర్బాబు, ఎస్ఈ కె.నరసింహమూర్తిల నుంచి వివరాలు తెలుసుకున్నారు. బీసీ కాలనీ సమీపంలో ఉన్న 203 ఎకరాల డంపింగ్ యార్డు ఏమైనా జారిపోయిందా, మొక్కలు నాటారా.. కాలువ పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలను పరిశీలించారు. 902 హిల్ ప్రాంతంలోని స్పిల్ చానల్ మట్టిని పోస్తున్న రెండు ప్రదేశాలను కూడా చూశారు. హిల్ వ్యూ పై నుంచి స్పిల్ వే రేడియల్ గేట్ల అమరిక, ఎగువ కాఫర్డ్యామ్, ట్విన్టన్నెల్స్ పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బృందం సభ్యులు మూలలంక డంపింగ్యార్డు కోసం తీసుకున్న 203 ఎకరాల భూములకు పరిహారం చెల్లించారా లేదా అనే విషయాలను ఆరా తీశారు. 30 మంది రైతులు పరిహారం తీసుకోలేదని, వారికి సంబంధించిన సొమ్ము కోర్టులో జమచేశామని అధికారులు తెలిపారు. ఈ బృందం బుధవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో పబ్లిక్ హియరింగ్ నిర్వహించి ఆ ప్రాంత వాసుల నుంచి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుంటుంది. ఆర్డీవో వైవీ ప్రసన్నలక్ష్మి, తహసీల్దార్ బి.సుమతి, ఈఈ మల్లికార్జునరావు, మేఘ జీఎం ఎ.సతీష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఆటోతో ఢీకొట్టి, ఆస్పత్రిలో చేర్చకుండా...
సాక్షి, హైదరాబాద్: మానవత్వం మనుషుల్లో రాన్రాను కానరాకపోతోందనడానికి, ఆటోడ్రైవర్ పేరుకు మచ్చతెచ్చే ఓ మచ్చుతునక ఈ అమానుష ఘటన. రోడ్డుపై నడుస్తున్న వ్యక్తిని ఆటోతో ఢీ కొట్టి గాయపరచడమే కాకుండా అతడిని ఆస్పత్రిలో చేర్చాలన్న కనీస మానవత్వాన్ని మరిచి డంపింగ్ యార్డులో పడేసి ఆ వ్యక్తి మృతికి కారణమయ్యాడు ఓ ఆటోడ్రైవర్. ఘటన జరిగిన రెండు నెలల తర్వాత సెల్ఫోన్ సిగ్నల్స్, సీసీ ఫుటేజీ ఆధారంగా ఆటోడ్రైవర్ కిరాతకం బయటపడింది. ఈ ఘటన వివరాలను కూకట్పల్లి ఏసీపీ సురేందర్రావు మంగళవారం విలేకరులకు వెల్లడించారు. ఫైనాన్స్ డబ్బులు చెల్లించేందుకు వెళ్లి... మియాపూర్ జనప్రియనగర్కు చెందిన కాకర రామకృష్ణ జనవరి 7న ఇంటి నుంచి బయటకు వెళ్లి మియాపూర్ రత్నదీప్ మార్కెట్ వద్ద ఫైనాన్స్ డబ్బులు చెల్లించేందుకు గాను రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో హఫీజ్పేటకు చెందిన సయ్యద్ షేర్ అలీ (38) తన స్నేహితుడైన గౌస్కు చెందిన ఆటో (టీఎస్07యూసీ 7684నంబర్)ను తీసుకుని ఆటోతో రామకృష్ణను ఢీ కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలైన రామకృష్ణ రోడ్డుపై పడి సృహ కోల్పోయాడు. స్థానికులు గమనించి రామకృష్ణను ఢీ కొట్టిన ఆటోలోనే ఎక్కించి ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఆటో డ్రైవర్ సయ్యద్ షేర్ అలీకి సూచించారు. సరేనంటూ ఆటోలో బాధితుడిని ఎక్కించుకున్న ఆటో డ్రైవర్ షేర్ అలీ కొద్దిదూరం వెళ్లిన తరువాత బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని ఖైత్లాపూర్లోని డంపింగ్ యార్డులో పడవేసి వెళ్లిపోయాడు. రామకృష్ణ వద్ద ఉన్న సెల్ఫోన్తో పాటు రూ.3 వేల నగదును కూడా తీసుకుని వెళ్లిపోయాడు. మిస్సింగ్ కేసుగా నమోదు అదే నెల 8వ తేదీకి కూడా రామకృష్ణ ఇంటికి తిరిగిరాకపోవటంతో కుటుంబ సభ్యులు మియాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మరోవైపు 8వ తేదీనాడు సాయంత్రం నాలుగు గంటలకు ఖైత్లాపూర్ వద్ద ఉన్న జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డు వద్ద గుర్తుతెలియని శవం పడి ఉందన్న సమాచారంతో కూకట్పల్లి పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మియాపూర్లో రామకృష్ణ మిస్సింగ్ కేసు నమోదు కావడం, కూకట్పల్లి పోలీస్స్టేషన్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యం కావడంతో పాటు ఇద్దరి వివరాలు ఒకే విధంగా ఉండటంతో రామకృష్ణ కుటుంబసభ్యులను కూకట్పల్లి పోలీసులు పిలిపించగా..వారు మృతదేహాన్ని రామకృష్ణదిగా గుర్తించారు. మృతదేహంపై ఉన్న గాయాలను బట్టి ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును మొదలుపెట్టారు. ఆ క్రమంలో ముందుగా రామకృష్ణ రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొట్టడాన్ని సీసీ పుటేజీద్వారా గుర్తించారు. దీంతోపాటుగా రామకృష్ణ సెల్ఫోన్ను నిందితుడైన ఆటోడ్రైవర్ లతీఫ్ అనే వ్యక్తికి రూ.1000కి విక్రయించినట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో లతీఫ్ను విచారించగా నిందితుడు ఆటోడ్రైవర్ సయ్యద్ షేర్ అలీ అని తేలింది. మంగళవారం ఆటో డ్రైవర్ సయ్యద్ షేర్అలీని అదుపులోకి తీసుకుని విచారించగా..సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్తే బ్రతికేవాడేనని, ఆస్పత్రికి తీసుకెళ్లితే తనపై కేసు అవుతుందేమోనన్న భయంతో పాటు వైద్యం ఖర్చులు కూడా తానే భరించాల్సి వస్తుందన్న కారణంతో రామకృష్ణను డంపింగ్ యార్డులో పడేసినట్లు షేర్ అలీ ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు. -
సఫాయివాలా అవతారమెత్తిన హరీశ్రావు
సాక్షి, సిద్దిపేట: జిల్లాలోని బుస్సాపూర్ డంపింగ్ యార్డులోని తడి, పొడి చెత్తను వేరుచేసే యంత్రాన్ని మంగళవారం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుడి యూనిఫాం వేసుకుని అక్కడున్న కార్మికులతో కలిసి పనిచేశారు. మంత్రి మాట్లాడుతూ, వ్యర్థం అనుకున్న ప్రతి వస్తువును ఉపయోగకరంగా మార్చుకోవచ్చని చెప్పారు. సాక్షి, సిద్దిపేట: వ్యర్థ పదార్థాలు, మనకు ఇబ్బంది కరంగా ఉన్న చెత్త, చెదారాన్ని కాస్తా ఆలోచించి, కొద్దిపేట శ్రమను జోడిస్తే ఉపయోగకరమైన పదార్థాలుగా, ఎరువులుగా తయారు చేసుకోవచ్చని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్లో చెత్త రీసైక్లింగ్ యూనిట్ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిద్దిపేట పట్టణంలో రోజుకు 40 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందన్నారు. ఈ తడి, పొడి చెత్తనే వేరు చేసేందుకు రూ. 2.5 కోట్లతో మానవ ఘన వ్యర్థాల నిర్వాహణ(ఎఫ్ఎస్టీపీ) కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇటుకల తయారీని పరిశీలిస్తున్న ఆర్థిక మంత్రి హరీశ్రావు ఇప్పటికే సిరిసిల్లలో తొలుత నిర్మించామన్నారు. ఇలా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిదన్నారు. సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాన్ని ఎఫ్ఎస్టీపీకి అందజేయాలన్నారు. దీన్ని ప్రాస్సెస్ చేసిన తర్వాత 16వేల లీటర్ల నీటిని పార్కులోని మొక్కలకు అందజేస్తారన్నారు. అదేవిధంగా 800 కేజీల ఎరువు వస్తుందని, ఈ ఎరువును రైతులకు ఉచితంగా అందజేస్తామన్నారు. డంప్యార్డులోకి ఎంత చెత్త వస్తుందనే విషయం తెలుసుకునేందరు. రూ. 12లక్షలతో వే బ్రిడ్జి నిర్మించామన్నారు. అదేవిధంగా తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు రూ. 50లక్షలతో మిషన్ కొనుగోలు చేశామని తెలిపారు. వేరుచేసిన తడి చెత్త నుండి సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నామన్నారు. అదేవిధంగా రూ. 30లక్షలతో కొనుగోలు చేసిన యంత్రంతో పొడి చెత్తలోని ప్లాస్టిక్ నుంచి సిమెంట్ బ్రిగ్స్, ఇతర కుండీలు, అలంకరణ వస్తువులు తయారు చేస్తున్నామన్నారు. త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్ త్వరలో ఉద్యోగాల నోటిఫికేషన్ శుభవార్తను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పనున్నారని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కరోనాతో అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. త్వరలోనే రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలతో కూడిన నోటిఫికేషన్ రానుందని, అందుకోసం జిల్లాలో ప్రత్యేక శిక్షణ కేంద్రాలను యువతకు అందుబాటులో ఉంచడంతో పాటుగా, మెటీరియల్ను అందించనున్నట్లు తెలిపారు. దశల వారీగా ప్లాస్టిక్ రోడ్లు.. ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగకరంగా మార్చే ప్రక్రియలో భాగంగా సిద్దిపేటలో రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ రోడ్లు వేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ రోడ్ల నిర్మాణం జరుగుతుందని గుర్తు చేశారు. సిద్దిపేటలో కొంత భాగాన్ని ఎంపిక చేసుకొని ప్లాస్టిక్ రోడ్లు వేస్తామని, దాని ఫలితాలను బట్టి దశల వారీగా విస్తరిస్తామని తెలిపారు. -
గోదా‘వర్రీ’.. పవిత్ర జలాలు అపవిత్రం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : పవిత్ర గోదావరి జలాలు కలుషితమవుతున్నాయి. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే నీళ్లు మురుగును తలపిస్తున్నాయి. పరీవాహకం వెంట ఉన్న ఫ్యాక్టరీలు.. నగర శివారు ప్రాంతాల్లోని వ్యర్థాలన్నీ గోదావరిలో సమ్మిళితం కావడంతో నదీ పవిత్రతను కోల్పోతోంది. రాష్ట్రంలో నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రం వద్ద మహారాష్ట్ర నుంచి తెలంగాణలో ప్రవేశించే గోదావరి.. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన దివ్యక్షేత్రం భద్రాచలం వద్ద ఏపీలోకి వెళ్తోంది. ఈ మధ్య ప్రాంతంలో 465 కిలోమీటర్ల మేర ప్రవహించే గోదావరిలోకి పలు చోట్ల భారీగా చెత్తా చెదారం చేరుతోంది. మురుగు నీటిని నేరుగా గోదావరిలోకి వదులుతుండటంతో పవిత్ర జలాలు అపవిత్రం అవుతున్నాయి. గోదావరిలో కలిసే అన్ని ఉపనదులు దట్టమైన అటవీ ప్రాంతాల నుంచి ప్రవహిస్తూ వస్తుండటంతో ఔషధ విలువలు ఉండాల్సిన జలాలు కాస్తా కాలుష్యమయం అవుతున్నాయి. దీంతో పర్యా వరణానికి హాని కలుగుతుండటంతో పాటు జం తువులు, వన్యప్రాణులు సైతం ఆ నీరు తాగి మృత్యువాత పడుతున్నాయి. బాసర, ధర్మపురి, మంచిర్యాల, రామగుండం, మంథని, భద్రాచలం పట్టణాల నుంచి ప్రతిరోజూ మురుగునీటిని శుద్ధి చేయకుండానే నేరుగా గోదావరిలోకి వదులుతున్నారు. మారని పరిస్థితి.. గోదావరి జలాల్లోకి నేరుగా ఒక్క చుక్క మురుగు నీరు వదలొద్దని.. ఎన్ని కోట్లు ఖర్చయినా మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ గతంలో ఆదేశించారు. అయినప్పటికీ పరిస్థితి మారకపోగా మరింత అధ్వానంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తిపోతల పథకాలు నిర్మించి రివర్స్ పంపింగ్ చేస్తోంది. దీంతో కలుషిత నీరు బ్యారేజీల్లోకి చేరి నీటిలోని జలచరాలు అంతరించిపోయే పరిస్థితి నెలకొంది. అలాగే ఈ నీటిని తాగేందుకు ఉపయోగిస్తే ప్రమాదకరమైన జబ్బుల బారిన పడే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. ఇటువంటి పరిíస్థితుల్లో ఎస్టీపీల (మురుగునీటి శుద్ధి ప్రక్రియ ప్లాంట్లు) ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. పని చేయని ప్లాంట్లు.. రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ల తర్వాత అతిపెద్ద రామగుండం కార్పొరేషన్ నుంచి ప్రతిరోజూ 32 మిలియన్ లీటర్ల మురుగునీరు గోదావరిలో కలుస్తోంది. ఈ నీటిని ఏమాత్రం శుద్ధి చేయకుండా వదిలిపెడుతుండటంతో గోదావరి మురికికూపంగా మారుతోంది. రామగుండం శివారులో నిర్మించిన ఎస్టీపీ ప్లాంట్లో 4 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ ఫర్ డే) వ్యర్థ జలాలను శుద్ధి చేయాలి. అయితే అది పనిచేయడం లేదు. అలాగే 8 ఎకరాల్లో నిర్మించిన మల్కాపూర్ ఎస్టీపీ ప్లాంట్ ద్వారా ప్రతిరోజూ 14 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలను శుద్ధి చేయాలి.. ప్రస్తుతం అది కూడా పనిచేయడం లేదు. అలాగే కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన 14 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన సుందిళ్ల ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం మధ్యలోనే నిలిచింది. దీంతో ఇందుకు కేటాయించిన నిధులూ వృథా అయ్యాయి. రామగుండం కార్పొరేషన్ నుంచి వచ్చే వ్యర్థ జలాలతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర హానికరమైన రసాయన వ్యర్థాలు గోదావరిలో 18 మిలియన్ లీటర్లు కలుస్తున్నాయి. కాగా.. రూ.90 కోట్లతో 21 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీని ద్వారా శుద్ధి చేసిన నీటిని ఎన్టీపీసీకి అందించాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు. అయితే దీనికి ఇంకా అనుమతులు లభించలేదు. ఇక కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి నీటి రివర్స్ పంపింగ్ కారణంగా ముంపునకు గురవుతున్న మల్కాపూర్ ఎస్టీపీ ప్లాంట్ స్థానంలో రూ.15.80 కోట్లతో మరో ప్లాంట్ నిర్మించాలని రామగుండం కార్పొరేషన్ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులకు ప్రతిపాదించారు. దీనిపై ఎలాంటి ముందడుగు పడలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు.. రామగుండంలో 8 ఎంఎల్డీ, మల్కాపూర్ శివార్లలో 21 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన 2 ఎస్టీపీ ప్లాంట్లకు ప్రతిపాదనలు పంపాం. లేటెస్ట్ టెక్నాలజీ వాడేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం. టెండర్ల ప్రక్రియ నడుస్తోంది. – పి.ఉదయ్కుమార్, కమిషనర్, రామగుండం కార్పొరేషన్ రోజూ 11 టన్నుల చెత్త నదిలోనే.. భద్రాచలంలోని 64 కాలనీల నుంచి ప్రతిరోజూ ఉత్పత్తవుతున్న 11 టన్నుల తడి, పొడి చెత్తను దేవస్థానానికి సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక భాగంలో గోదావరి కరకట్ట లోపల నది పారుతున్న చోటే వేస్తున్నారు. దీంతో నదిలోని నీరు కాలకూట విషంలా మారుతోంది. భద్రాచలం పట్టణం మినహా మండలంలోని మిగిలిన గ్రామాలన్నీ పోలవరం ముంపు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కలిపారు. భద్రాచలం చుట్టూ ఏపీ గ్రామాలే ఉన్నాయి. చివరకు భద్రాచలం ఆలయ భూములు 950 ఎకరాలు సైతం ఏపీలోకే వెళ్లాయి. దీంతో పట్టణానికి డంపింగ్ యార్డుకు కూడా స్థలం లేకుండా పోయింది. ఈ క్రమంలో గోదావరికి ఇవతలి ఒడ్డున ఉన్న బూర్గంపాడు మండలం సారపాక పంచాయతీలోని భాస్కర్నగర్, గాంధీనగర్ వద్ద భద్రాచలం డంప్ యార్డ్ ఏర్పాటుకు అధికారులు ప్రయత్నాలు చేయగా.. సారపాక వాసులు వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల జరిగిన బూర్గంపాడు మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో పినపాక ఎమ్మెల్యే, విప్ రేగా కాంతారావు సైతం ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. దీంతో ప్రస్తుతానికి భద్రాచలం వద్ద గోదావరి నదీగర్భమే డంపింగ్ యార్డులా మారింది. ఇచ్చట చెత్త వేస్తే శిక్షార్హులని బోర్డు ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీయే ఆ బోర్డు వద్ద చెత్తను డంప్ చేస్తుండటం గమనార్హం. ఈ విషయమై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కొత్తగూడెం ఇన్చార్జ్ ఈఈ బి.శంకర్బాబును వివరణ కోరగా.. పరిశీలించి భద్రాచలం గ్రామపంచాయతీపై చర్యలు తీసుకుంటామన్నారు. సందట్లో సడేమియాలా.. రాష్ట్ర సరిహద్దులోని మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్లో ఉన్న పయనీర్ లిక్కర్ ఫ్యాక్టరీ వారు వ్యర్థాలను గోతుల్లో నిల్వ చేసి జూలైలో బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తిన సమయంలో సందట్లో సడేమియాలా వ్యర్థాలను గోదావరిలోకి వదులుతుంటారు. ఇక మంచిర్యాల జిల్లా కేంద్రం వద్ద ఉన్న 3 ఎస్టీపీ ప్లాంట్లు పనిచేయడం లేదు. దీంతో మురుగునీరు వాగుల ద్వారా నేరుగా గోదావరిలో కలుస్తోంది. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణం నుంచి మురుగు నీరు నేరుగానే గోదావరిలో కలుస్తోంది. ఇక్కడ ఎస్టీపీ ప్లాంట్ కోసం రూ.18 కోట్లతో ప్రభుత్వానికి ప్రతాపాదనలు పంపారు. ఇటు పెద్దపల్లి జిల్లా మంథని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణాల నుంచి కూడా మురుగునీరు శుద్ధి చేయకుండానే నేరుగా గోదావరిలో కలుపుతున్నారు. -
డంపింగ్ యార్డ్ చెత్త నుంచి విద్యుత్
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా జవహర్నగర్లోని డంపింగ్ యార్డ్ నుంచి వెలువడే మీథేన్ వాయువు ఆధారంగా విద్యుత్ను ఉత్పత్తి చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ హైకోర్టుకు చెప్పారు. రెండు నెలల్లో రెండు విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత మరో రెండు నెలల్లోగా మరో యూనిట్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. డంపింగ్ యార్డ్ వల్ల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు దోమలు, దుర్వాసన వంటి పలు సమస్యల్ని ఎదుర్కొనడంపై పత్రికల్లో వచ్చిన వార్తల ప్రతిని జత చేసి నగరానికి చెందిన సీతారాంరాజు రాసిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డిలతో కూడిన ధర్మాసనం గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు లోకేష్ కుమార్ సోమవారం హైకోర్టుకు హాజరయ్యారు. పత్రికల్లో డంపింగ్ యార్డ్ వల్ల సమస్యల గురించి వార్తలు వస్తున్నాయని, దుర్గంధం వల్ల అక్కడి ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతుంటే జీహెచ్ఎంసీ ఎలాంటి నివారణ చర్యలు తీసుకుందని ధర్మాసనం ప్రశ్నించింది. యార్డ్ 337 ఎకరాల్లో చెత్త ఉండేదని, 137 ఎకరాలకు తగ్గించామని, శాస్త్రీయ పద్ధతుల్లో చెత్తపై పాలిథిన్ కవర్లు మట్టిని వేస్తున్నామని, ఇదే మాదిరిగా పలు పొరలుగా వేస్తామని, దీని వల్ల దుర్వాసన బయటకు వెళ్లదని కమిషనర్ వివరించారు. డంపింగ్ యార్డ్లో చెత్త వేసే పరిధి తగ్గించవచ్చని, అయితే చెత్త వెలువడే దుర్వాసన తగ్గేలా ఎందుకు చేయలేక పోతున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ఒకేచోట చెత్త పేరుకుపోయి ఉంటే అందులోని దుర్గంధమైన నీరు భూమిలోకి చేరే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. చెత్తలో వానపాములు వేసి కొంతవరకూ సమస్యను పరిష్కరిం చేందుకు చర్యలు తీసుకుంటామని, చెత్తను ఎండబెట్టేలా చేసి నివారణ చర్యలు తీసుకుంటామని కమిషనర్ చెప్పారు. విచారణ అనంతరం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కమిషనర్ను ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది. -
రూ. 50 కోట్ల స్థలం మింగేశారు!
సాక్షి, రాజేంద్రనగర్: భూకబ్జాదారులు బరితెగిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ఏకంగా డంపింగ్ యార్డు స్థలానికి ఎసరు పెట్టారు. మొత్తం 22 ఎకరాల్లో దాదాపు 6 ఎకరాలను ప్లాట్లుగా మార్చి విక్రయించి యథేచ్ఛగా సొమ్ము చేసుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గండిపేట మండల పరిధిలోని గంధంగూడ సర్వేనంబర్ 43లో ప్రభుత్వానికి చెందిన 22.17 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలాన్ని గతంలో ప్రభుత్వం డంపింగ్ యార్డును ఏర్పాటు చేసేందుకు సిలికాన్ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించింది. నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన చెత్తాచెదారాన్ని ఇక్కడ డంప్ చేసి రీసైక్లింగ్ నిర్వహించేవారు. ఏడు సంవత్సరాల క్రితం ఈ డంపింగ్ యార్డు మూతబడింది. అంతకుముందు వేసిన చెత్తచెదారంతో ఆ ప్రాంతం ఓ గుట్టలా మారింది. అయితే, కొంతకాలంగా కొందరు స్థానిక నేతలు ఈ చెత్తను తొలగించి ప్లాట్లుగా మారి అమాయకులకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. చెత్తలోనే గుంతలు తీసి పిల్లర్లు వేసి ఇళ్లను నిర్మిస్తున్నారు. 120 నుంచి 180 గజాల వరకు ప్లాట్లుగా చేసి నిర్మాణాలను ప్రారంభించారు. ఈ నిర్మాణాలకు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. డంపింగ్ యార్డు స్థలంలోనే నిర్మాణాలను చేపడుతున్న ఇక్కడి కార్పొరేషన్, రెవెన్యూ అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఈ స్థలాన్ని గండిపేట మండల ఆర్ఐ, వీఆర్వోల ఆధ్వర్యంలో డిజిటల్ సర్వే నిర్వహించడం కొసమెరుపు. స్థానికుడు కృష్ణాగౌడ్ ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలంటూ ఇటీవల ఫిర్యాదు చేయడంతో ఈ సర్వే చేపట్టారు. ఈ సర్వే వివరాలను 3–4 రోజుల్లో వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ ఒక్కో ఎకరం దాదాపు రూ. 8 కోట్ల వరకు పలుకుతోందని స్థానికులు చెబుతున్నారు. అక్రమార్కులు దాదాపు రూ. 50 కోట్ల విలువైన స్థలాన్ని మింగేసినా యంత్రాంగం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆర్ఐ వాణిరెడ్డిని వివరణ కోరగా.. కొన్నిరోజుల్లో సర్వేకు సంబంధించిన రిపోర్టు వస్తుందని, దాని ద్వారా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
సాయంత్రమూ సాఫ్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో రోజురోజుకు చెత్త పెరిగిపోతోంది. జీహెచ్ఎంసీ 2012–13లో 2,200 మెట్రిక్ టన్నుల చెత్తను తరలించగా... ప్రస్తుతమది 5,000 మెట్రిక్ టన్నులను దాటిపోయింది. అయినప్పటికీ వాణిజ్య ప్రాంతా ల్లో, రహదారులపై ఎక్కడ పడితే అక్కడ చెత్త కనిపిస్తోంది. చెత్త తరలింపు కోసం జీహెచ్ఎంసీ ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా, రోడ్లపై వ్యర్థాలు వేయకుండా జరిమానాలు విధిస్తున్నా ఫలితం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ఉదయం చెత్త తరలించినప్పటికీ... తిరిగి చెత్త ఎక్కువగా పోగవుతున్న ప్రాంతాల్లో సాయంత్రం వేళల్లోనూ తరలించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. ఇందుకోసం 120 అద్దె వాహనాలను అందుబాటులోకి తెస్తోంది. వీటిని ఒక్కో సర్కిల్కు నాలుగు చొప్పున కేటాయించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ సోమవారం పేర్కొన్నారు. వీటితో పాటు ఒక్కో సర్కిల్కు రెండు చొప్పున 30 సర్కిళ్లకు మొత్తం 60 బాబ్కాట్లను కేటాయించారు. మరి డంపింగ్యార్డుకు.? అందుబాటులోకి రానున్న వాహనాలు ఆయా ప్రాంతాల్లోని చెత్తను రవాణా కేంద్రాలకు తరలిస్తాయి. అక్కడి నుంచి పెద్ద వాహనాలు (25 మెట్రిక్ టన్నులు, 10 మెట్రిక్ టన్నుల సామర్థ్యం) చెత్తను డంపింగ్యార్డుకు వెంటనే తరలించాల్సి ఉంది. లేని పక్షంలో రవాణా కేంద్రాల్లో సాయంత్రం వేసే చెత్తకు మళ్లీ ఉదయాన్నే వచ్చే చెత్త తోడైతేటన్నుల కొద్దీ పేరుకుపోతుంది. జీహెచ్ఎంసీలో అద్దెవి, సొంతవి కలిపి 25 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన వాహనాలు దాదాపు 130 ఉన్నాయి. అలాగే 10 మెట్రిక్ టన్నులవి జీహెచ్ఎంసీ వాహనాలే 7 ఉన్నాయి. తాజాగా వినియోగంలోకి రానున్న ఒక్కో వాహనం దాదాపు 3 మెట్రిక్ టన్నుల చెత్తను రవాణా కేంద్రానికి చేరుస్తుంది. ఇలా 120 వాహనాల ద్వారా 360 మెట్రిక్ టన్నుల చెత్త స్థానిక రవాణా కేంద్రాలకు చేరుతుంది. దీన్ని వెంటనే డపింగ్యార్డుకు తరలించని పక్షంలో రవాణా కేంద్రంలో సమస్యలు తలెత్తుతాయి. సమస్యలు పునరావృతం.. స్వచ్ఛ ఆటో టిప్పర్లను ప్రవేశపెట్టిన తొలినాళ్లలో ఇలాంటి సమస్యలే ఉత్పన్నమయ్యాయి. తొలి దశలో రెండు వేలు, ఆ తర్వాత 500 స్వచ్ఛ ఆటో టిప్పర్లను అందుబాటులోకి తెచ్చారు. వీటిల్లో దాదాపు 2,100 స్వచ్ఛ ఆటోలు చెత్త తరలిస్తున్నాయి. వీటి ద్వారా చెత్త ఇళ్ల నుంచి రవాణా కేంద్రాలకు చేరుతున్నప్పటికీ.. అక్కడి నుంచి డంపింగ్యార్డుకు వెళ్లకపోవడంతో రవాణా కేంద్రాల్లో చెత్త పేరుకుపోతోంది. అక్కడి నుంచి చెత్తను తరలించేంత వరకూ ఆలస్యంగా వచ్చే స్వచ్ఛ ఆటో టిప్పర్లు రోడ్డుపైనే బారులుతీరాల్సి వచ్చేది. నిర్ణీత సమయాలు కేటాయించి, ఇతరత్రా చర్యలు చేపట్టి ఆ సమస్యను పరిష్కరించినప్పటికీ... ఇప్పుడిక సాయంత్రం అదనంగా చేరే చెత్తతో తిరిగి సమస్య పునరావృతమయ్యే అవకాశం ఉంది. దీని పరిష్కారానికి చర్యలు తీసుకోని పక్షంలో సమస్యలు తప్పవు. బస్టాప్కు రెండు నగరంలోని అన్ని బస్టాప్ల వద్ద రెండు డస్ట్బిన్లను వారం రోజుల్లోగా ఏర్పాటు చేయాలని జీహెచ్ంఎసీ కమిషనర్ దానకిశోర్.. జోనల్, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. వీధి వ్యాపారులందరూ ఆగస్ట్ నెలాఖరులోగా ప్రత్యేక డస్ట్బిన్లను ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించే కార్మికులందరూ సేఫ్టీ పరికరాలను విధిగా ధరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. -
‘చెత్త’ మోత అద్దె వాత
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీకి చెత్త తరలింపు మహా భారంగా మారింది. చెత్త తరలింపు పనుల కోసం అవసరమైన వాహనాల అద్దెలకే ప్రస్తుతం ఏటా దాదాపు రూ.180 కోట్లు వ్యయమవుతోంది. తడి–పొడి చెత్త గురించి దాదాపు నాలుగేళ్లుగా ప్రచారం చేస్తున్నా, ఇంటింటికీ రెండు రంగుల చెత్త డబ్బాలు పంపిణీ చేసినా ప్రజల్లో మార్పు రాలేదు. అదే వచ్చి ఉంటే జీహెచ్ఎంసీ చెత్త రవాణా భారం ఎంతో తగ్గేది. ప్రజలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటం వల్ల జీహెచ్ఎంసీకి చెత్త తరలింపు భారం పెరుగుతోంది. గడచిన ఐదేళ్ల వివరాలను పరిశీలిస్తే గుండె గుభిల్లు మంటుంది. చెత్త తరలించేందుకు అవసరమైన అద్దె వాహనాలకే దాదాపు రూ.642 కోట్లు ఖర్చయింది. ఇందులో రూ.75 కోట్లు మాత్రం జీహెచ్ఎంసీ సొంత వాహనాల మరమ్మతుల కోసం ఖర్చు చేశారు. ఇక జీహెచ్ఎంసీ సొంత వాహనాలు, వాటి నిర్వహణ వ్యయం, ఇంధన వ్యయం అదనం. తడి–పొడి చెత్తను వేరు చేయడం దగ్గరనుంచి పెద్దమొత్తాల్లో చెత్తను వేరు చేసే హోటళ్లు వంటివి ఎక్కడికక్కడే తడిచెత్త నుంచి సేంద్రియ ఎరువును తయారు చేయడం వంటి నిబంధనల్ని కచ్చితంగా అమలు చేస్తే ఈ ఖర్చు తగ్గేది. కానీ జీహెచ్ఎంసీ ఆ పని చేయలేకపోయింది. ఐదేళ్లలో నగరంలో పెరిగిన జనాభా, కాలనీలతోపాటు గతంలో రెండు మూడు రోజులకు ఒకమారు తరలించే చెత్తను ప్రస్తుతం ప్రతిరోజూ తరలిస్తుండటం తదితరమైన వాటి వల్ల రవాణా భారం పెరగడం సహజమే అయినప్పటికీ, స్వచ్ఛ నగరం అమలులో భాగంగా తడి–పొడి చెత్తను ఎక్కడికక్కడే వేరు చేసి సేంద్రియ ఎరువు తయారీ చర్యలు పటిష్టంగా అమలు చేస్తే పొడి చెత్త మాత్రమే డంపింగ్ యార్డు వరకు తరలిస్తే సరిపోయేది. కానీ నేటికీ ఆ పని జరగడం లేదు. దీంతో చెత్త రవాణా భారం పెరుగుతోంది. ♦ ఇళ్ల వద్దే తడి–పొడి చెత్తను వేరు చేసేందుకని నాలుగేళ్లనుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకుగాను 43 లక్షల రెండు రంగుల చెత్త డబ్బాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. ఇందుకుగాను జీహెచ్ఎంసీ దాదాపు రూ.30 కోట్లు ఖర్చు చేసింది. దీనికి తోడు చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్లు పెరిగాయి. ఇళ్లవద్ద, ట్రాన్స్ఫర్స్టేషన్ల వద్ద కూడా పకడ్బందీగా తడి–పొడి వేరు చర్యలు అమలైతే రవాణా భారం తగ్గేది. ♦ ఇళ్ల వద్దే తడి–పొడి చెత్తవేరు చేసి తరలించేందుకని 2500 స్వచ్ఛ ఆటో టిప్పర్లు కొనుగోలు చేశారు. కానీ..అవి కూడా తడి–పొడి చెత్తను వేర్వేరుగా తీసుకెళ్లకుండా, రెంటినీ కలిపే తీసుకువెళ్తున్నాయి. తడి–పొడి వేరుగా తీసుకువెళితే ట్రాన్స్ఫర్ స్టేషన్ల నుంచి కేవలం పొడిచెత్తనే డంపింగ్యార్డుకు పంపేందుకు వీలుంటుంది. ♦ మరో వైపు రవాణా పేరిట సర్కిళ్లు, జోన్లలో అద్దె వాహనాల పేరిట అవకతవకలు జరుగుతున్నాయనే ప్రచారం ఉంది. ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షణ లేమి, జోనల్, సర్కిళ్లకే అధికారాన్ని బదలాయించడం, తదితర చర్యల వల్ల కూడా దుబారా జరుగుతోందనే ఆరోపణలున్నాయి. అవసరం లేని ప్రాంతాల్లో కూడా అద్దె వాహనాలు వినియోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అవకతవకలు తగ్గితే..ఖర్చు తగ్గుతుంది ఏటికేడు పెరిగే జనాభాతో పాటు చెత్త కూడా పెరుగుతుంది. అయితే అక్రమాలు, అవకతవకలకు తావులేకుండా ఉంటే వాహనాల నిర్వహణ, అద్దెల భారం తగ్గే వీలుంది. ఐదేళ్లలో దాదాపు రూ.100 కోట్ల పెంపు అంటే ఆలోచించాల్సిన అంశమే.– పద్మనాభరెడ్డి (ఫోరం ఫర్ గుడ్గవర్నెన్స్) -
మళ్లీ మండుతున్న డంప్యార్డు
కరీంనగర్కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలక సంస్థకు చెందిన డంప్యార్డులో మళ్లీ అగ్గి రాజుకుంది. రెండు రోజులుగా వీస్తున్నగాలి దుమారంతో మంటలు డంప్యార్డు మొత్తం విస్తరించాయి. గురువారం డంప్యార్డు మొత్తం మంటలు లేవడంతో సమీప ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండ వేడికితోడు డంప్యార్డు నుంచి దట్టమైన పొగ వస్తుండడంతో ఊపిరాడక విలవిలలాడుతున్నారు. కళ్ల మంటలతో ఇబ్బందులు పడుతున్నారు. మానేరు ఒడ్డున ఉన్న డంప్యార్డు బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉండడంతో పెద్దపల్లి బైపాస్పై వెళ్లే ప్రయాణికులకు రోడ్డు కనబడని పడని విధంగా పొగ కమ్మేసింది. గత ఏప్రిల్ నెలలో కూడా డంప్యార్డులో మంటలు అంటుకోవడంతో నగరపాలక సంస్థ అధికారులు, పాలకవర్గం స్పందించి చల్లార్చేందుకు చర్యలు చేపట్టింది. అధికార యంత్రాంగం రెండు రోజుల అక్కడే ఉండి కార్మికులు, ఫైరింజన్లు, మున్సిపల్ వాటర్ ట్యాంకర్లతో డంప్యార్డులో మంటలు ఆర్పేశారు. ప్రస్తుతం మంటలు ఆర్పేందుకు సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఒకచోట వాటర్ కొడితే మరో చోట మంటలు లేస్తున్నాయి. వేడి గాలులు వీస్తుండడంతో మంటలు ఆర్పడం తలకు మించిన భారంగా మారింది. ఒకే డంప్యార్డుతో సమస్యలు... కరీంనగర్ నగరపాలక సంస్థలో 78 వేల కుంటుంబాలు, 3.5 లక్షల జనాబా ఉంది. ప్రతిరోజూ 180 టన్నులు చెత్త వెలువడుతోంది. గత యాబై ఏళ్లుగా బైపాస్రోడ్డులోని మానేరు వాగు ఒడ్డున ఉన్న 9 ఎకరాల స్థలంలో చెత్తను డంపింగ్ చేస్తున్నారు. రోజు రోజుకూ నగరం విస్తరిస్తుండడం, జనాబా పెరుగుతుండడంతో చెత్త వేయడం సమస్యగా మారింది. చెత్త గుట్టలుగా పేరుకుపోవడంతో చిన్నగా మంటలు అంటుకున్నా త్వరగానే డంప్యార్డు మొత్తం విస్తరిస్తోంది. ఐదేళ్లుగా ఇతర ప్రాంతాల్లో డంప్యార్డు ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగినా ఫలించ లేదు. ఉన్న ఒక్క డంప్యార్డులోనే చెత్తను వేస్తున్నారు. తడి, పొడి వేరుచేయకుండానే.... తడి, పొడి చెత్తను వేరు చేస్తే డంప్యార్డుకు చెత్తను తగ్గించవచ్చు. అయితే నగరంలో వెలువడుతున్న చెత్తను తడి, పొడి వేరుచేయకుండానే డంప్యార్డుకు తరలిస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో ర్యాంకు కోసం సర్వే సమయంలో చెత్తను వేరు చేస్తున్నట్లు హాడావుడి చేయడం ఆ తర్వాత అటకెక్కించడం నగరపాలక సంస్థలో రివాజుగా మారింది. చెత్త మొత్తం ట్రాక్టర్లతో డంప్యార్డుకు తరలిస్తుండడంతో డంప్యార్డు గుట్టగా పేరుకు పోయి చెత్త డంపింగ్ చేసేందుకు స్థలం కరువవుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో మరింత సమస్య... నగరపాలక సంస్థలో వెలువడే చెత్తలో 50 శాతంపైగా ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. దీంతో చెత్త త్వరగా అంటుకుని మంటలు విస్తరిస్తున్నాయి. ప్లాస్టిక్ మండడం వల్ల విషవాయువులు వెలువడి, ప్రజలు అనారోగ్యాల పాలయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పొగతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరోవైపు కాలం చెల్లిన మందులు, ఆసుపత్రి వ్యర్థాలను సైతం చెత్తలోనే డంప్ చేస్తుండడంతో డంప్యార్డు వ్యర్థాలతో విషపూరితంగా మారుతోంది. డంప్యార్డు అంటుకున్న సమయంలో అందులో ఉన్న ఆసుపత్రి వ్యర్థాలు, ఇతర విషపూరిత రసాయనాలతో విషవాయువులు వెలువడుతున్నాయి. దీంతో ప్రజలు శ్వాసకోశ, చర్మవ్యాధులకు గురయ్యేప్రమాదం ఉంది. -
హరిత ట్రిబ్యునల్ సూచనల మేరకే
పశ్చిమగోదావరి, పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు డంపింగ్ యార్డు నిర్వహణ కోసం జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) సూచనల మేరకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలని కలెక్టర్ ప్రవీణ్కుమార్ అధికారులను ఆదేశించారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ కమిటీ సభ్యులతో కలిసి ఆయన మూలలంక ప్రాంతంలోని డంపింగ్యార్డును పరిశీలించి బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. జాతీయ కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు చెన్నైకి చెందిన శాస్త్రవేత్త సి.పాల్పండి, బెంగళూరుకు చెందిన కాలుష్య నియంత్రణ మండలి అదనపు సంచాలకులు ఎం.మధుసూదన్, జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్లు ఎన్వీ భాస్కర్, శివప్రసాద్, కలెక్టర్ ప్రవీణ్కుమార్ పోలవరం గ్రామంలోని సుజల సాగర అతిథి గృహంలో అధికారులు, బాధితులతో సమావేశం నిర్వహించారు. పర్యావరణానికి ప్రజలకు డంపింగ్యార్డు వల్ల ఎటువంటిఇబ్బందులూ తలెత్తకుండా చూడాలని పేర్కొన్నారు. మూలలంక ప్రాంతంలో వేసిన డంపింగ్యార్డుపై నుంచి మట్టి జారిపోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు సలహాదారుడు వీఎస్ రమేష్బాబును ఆదేశించారు. పర్యావరణానికి, ప్రజల జీవన విధానానికి ఎటువంటి విఘాతం కలగకుండా డంపింగ్ చేయాలన్నారు. డంపింగ్ యార్డు వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు, సమస్యలను, అభిప్రాయాలను పారదర్శకంగా తెలుసుకుంటామన్నారు. ఎన్జీటీ సభ్యుల వద్ద స్థానికుల ఆవేదన అల్లు జగన్మోహన్రావు, కోటం రామచంద్రరావు, షేక్ ఫాతిమున్నీసా తదితర స్థానికులు డంపింగ్ యార్డు వల్ల వచ్చే ఇబ్బందులు, సమస్యలపై ఎన్జీటీ బృందం సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. బీసీ కాలనీ, గణేష్ నగర్ కాలనీల సమీపంలో డంపింగ్ యార్డు ఉన్నందున భారీ వాహనాల రాకపోకలు, శబ్దాలకు ఇళ్లు బీటలు వారుతున్నాయని పేర్కొన్నారు. కొండకాలువల నీరు గోదావరిలో కలవకపోవడంతో వర్షాకాలం వస్తే తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. దుమ్ము, ధూళి లేచిపోయి ఇళ్లల్లోకి వస్తోందని, వంట సామగ్రి, దుస్తులకు మట్టి పడుతోందని వివరించారు. నిత్యం తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. భారీ ఎత్తున డంపింగ్చేయడం వల్ల మట్టి జారిపోయి కడెమ్మ కాలువ కూడా పూడుపోతోందని వివరించారు. పర్యావరణం, వాతావరణం కలుషితమవుతోందని, కనీసం ఈ ప్రాంతంలో ఎక్కడా వాటరింగ్ కూడా చేయడం లేదని తెలిపారు. దుము, ధూళి వల్ల పోలవరం ప్రాంత వాసులం అనారోగ్యాలపాలవుతున్నామని పేర్కొన్నారు. 83 ఎకరాలు తీసుకోవద్దు ఇదే ప్రాంతంలో డంపింగ్ చేసేందుకు మరో 83 ఎకరాలు తీసుకుంటామని డీఎం ప్రకటించారని, ఆ భూమిని తీసుకోవద్దని కలెక్టర్ దృష్టికి స్థానికులు తీసుకువచ్చారు. తామంతా సన్న , చిన్నకారు రైతులమని, ఇప్పటికే ప్రాజెక్టు పేరుతో తమ భూములు కోల్పోయామని, సాధ్యమైనంత వరకు అధికారులు పరిశీలన జరిపి ఈ 83 ఎకరాలు డంపింగ్ నుంచి మినహాయించాలని కోరారు. గతంలో ఎన్జీటీ బృందం సభ్యులు పరిశీలన చేసి ఇంజినీరింగ్ అధికారులకు సూచించినా వాటిని సరిగా అమలు చేయలేదని వివరించారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ పి.రామకృష్ణ, ప్రాజెక్టు సలహాదారుడు వి.ఎస్.రమేష్బాబు, ఆర్డీఓ కె.మోహన్కుమార్, డీఎస్పీ ఎ.టి.వి. రవి కుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ వెంకటేశ్వర్లు, పోలవరం ప్రాజెక్టు ఈఈ ఎన్.చంద్రరావు, తహసీల్దార్ చినబాబు, పోలవరం అటవీ రేంజ్ అధికారి ఎన్.దావీదురాజు పాల్గొన్నారు. -
డంపింగ్ యార్డ్కు అంబేడ్కర్ విగ్రహం
హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి అపచారం జరిగింది. విగ్రహాన్ని జీహెచ్ఎంసీ అధికారులు ధ్వంసం చేయించడమే కాకుండా దానిని చెత్తలారీలో డంపింగ్యార్డ్కు తరలించారు. మరో 24 గంటల్లో రాష్ట్రమంతటా అంబేడ్కర్ జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతుండగా గ్రేటర్ హైదరాబాద్లో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వివరాలు... శనివారం తెల్లవారుజామున కొందరు దళిత సంఘాల నేతలు పంజగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ స్ధలంలో విగ్రహం ఏర్పాటుకు అనుమతిలేదంటూ అధికారులు పోలీసుల సహాయంతో దానిని తొలగించారు. చెత్తలారీలో విగ్రహాన్ని జవహర్నగర్ డంపింగ్యార్డ్కు తరలించారు. విషయం తెలుసుకున్న దళితబహుజన సంఘాల నాయకులు లారీని అడ్డుకుని అందులో ఉన్న చెత్తను కింద పోయించారు. చెత్తతోపాటు ధ్వంసమైన అంబేడ్కర్ విగ్రహం కనిపించింది. దీంతో మాలమహానాడు రాష్ట్ర నాయకుడు పసుల రాంమూర్తి, జవహర్నగర్ దళిత సంక్షేమ సంఘంనేత మేడ రవితోపాటు పలువురు ప్రజాసంఘాల నాయకులు ఘటనాస్థలానికి చేరుకుని పెద్దఎత్తున నిరసన తెలియజేశారు. జవహర్నగర్ పోలీసులు వచ్చి జీహెచ్ఎంసీ లారీ డ్రైవర్ రాజును అదుపులోకి తీసుకుని చెత్తలారీని పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం దళిత సంఘాల నాయకులు అంబేడ్కర్ విగ్రహాన్ని నీటితో కడిగి పాలాభిషేకం చేశారు. అంబేడ్కర్ విగ్రహాన్ని చెత్తలారీలో తీసుకువచ్చి అవమానపరిచిన జీహెచ్ఎంసీ అధికారులపై చర్యలు తీసుకోవాలని దళిత బహుజన సంఘాల నేతలు సాయంత్రం మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మకు ఫిర్యాదు చేశారు. విగ్రహాన్ని జాగ్రత్తగా తరలించాం పంజగుట్ట కూడలిలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన విషయమై జీహెచ్ఎంసీ వారికి సమాచారం ఇచ్చాం. విగ్రహం ఏర్పాటుకు అనుమతి లేనందున దానిని తొలగించాలని కోరడంతో జాగ్రత్తగా దానిని తీసి ప్రైవేట్ లారీలో ఎస్కార్ట్తో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంకు తరలించాం. అక్కడ కూడా జాగ్రత్తగా అమర్చి వచ్చాం. – ఏసీపీ తిరుపతన్న ఐఏఎస్ అధికారితో విచారణ అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్ట అనంతరం జరిగిన సంఘటనలపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. ఈ ఘటనలపై విచారణ జరపాలని నగర పోలీస్ కమిషనర్ను కోరాం. జీహెచ్ఎంసీకి చెందిన ఐఏఎస్ అధికారితో కూడా పూర్తిస్థాయి విచారణ జరిపిస్తాం. యూసుఫ్గూడ నుండి విగ్రహం బయటకు రావడానికి బాధ్యులైన యార్డ్ ఆపరేటర్ బాలాజీని విధుల నుంచి తొలగించాం. – జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ రాత్రికి రాత్రే విగ్రహం ఏర్పాటు జీహెచ్ఎంసీ చెత్తలారీలో అంబేడ్కర్ విగ్రహం శనివారం తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో అంబేడ్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు గుడిమల్లి వినోద్కుమార్ ఆధ్వర్యంలో సుమారు 25 మంది దళిత సంఘాల నేతలు పంజగుట్ట కూడలి వద్దకు చేరుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి ఐదడుగుల దూరంలో సుమారు నాలుగడుగుల గొయ్యి తీశారు. కాంక్రీట్తో ఐదడుగుల దిమ్మె నిర్మించి, దానిపైన 9 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అరగంట వ్యవధిలో విగ్రహ ఏర్పాటు పూర్తి చేశారు. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ ఏసీపీ సుభాష్, సిబ్బంది అక్కడకు చేరుకుని విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదని, పోలీసులు దానిని తొలగించాలని కోరారు. దీంతో దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగాయి. పశ్చిమమండల పోలీసులు, టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, కేంద్ర బలగాలు వచ్చి వారిని అదుపులోకి తీసుకుని విగ్రహాన్ని డంప్యార్డుకు తరలించారు. -
అటకెక్కిన ‘సాలీడ్వేస్ట్’ ప్రాజెక్ట్
సాక్షి, కూసుమంచి: మండల కేంద్రంలో చెత్తా చెదారం, వ్యర్థాలు లేకుండా చేసేందుకు అధికారులు వినూత్నంగా చేపట్టాలనుకున్న సాలీడ్వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు అటకెక్కింది. దీనిలో భాగంగా పంచాయతీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటా డస్ట్బిన్లు (చెత్త డబ్బాలను) ఏర్పాటు చేసి సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తారు. అక్కడ వ్యర్థాలతో కంపోస్ట్ తయారు చేసేందుకు వీలుగా అధికారులు ప్రాజెక్టును రూపొందించారు. 2015లో ప్రతిపాదించిన ఈప్రాజెక్టు నేటికీ కార్యరూపం దాల్చలేదు. కేవలం కాగితాలకే పరిమితమైంది. ప్రస్తుతం మండల కేంద్రంలో నెలకు టన్నుల కొద్ది చెత్తా, వ్యర్థాలు తయారవుతున్నాయి. ఇళ్లలోని చెత్తతోపాటు బస్టాండ్ సెంటర్లో ఉన్న బడ్డీకొట్లు, చికెన్ సెంటర్లు, పండ్లు తదితర దుకాణాల నుంచి చెత్త టన్నుల కొద్ది వస్తోంది. వీటిని నేలకొండపల్లి వెళ్లే రహదారి పక్కన వేస్తున్నారు. దీంతో ఆరోడ్డు పై ప్రయాణించే వాహనదారులు, పాదాచారులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. ముక్కు మూసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. సాలీడ్వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు ఉంటే ఈ వ్యర్థాలతో ఎరువును తయారు చేయవచ్చు. పొడిచెత్తను వేరుచేసి విద్యుత్ ప్రాజెక్టుల్లో వినియోగించుకునేందుకు వీలుండేది. కాగా ఈప్రాజెక్టుకు నిధులు లేకపోవటంతో అది ప్రతిపాదనలకే పరిమితం అయింది. అధికారులు, ప్రభుత్వం ఈప్రాజెక్టుపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. పాలేరులోనూ అంతే... పాలేరు గ్రామ పంచాయతీలో కూడా చెత్త, వ్యర్థాలను నివాసాల దగ్గర లోనే రోడ్డు పక్కన పడవేస్తున్నారు. గ్రామంలోని చర్చి సమీపంలో వ్యర్థాలను వేస్తున్నారు. దీంతో అటుగా వెళ్లేవారు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. మురికి కూపంగా మారిన ఆప్రాంతలో నివాసస్థుల పరిస్థితి వర్ణణాతీతం. అధికారులు స్పందించి చెత్త తొలగించాలని కోరుతున్నారు. ప్రాజెక్టు కోసం కృషి చేస్తా మండల కేంద్రంలో సాలీడ్వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు అధికారులతో మాట్లాడి దాని అమలుకు కృషిచేస్తా. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలి. పంచాయతీ తరుపున చర్యలు చేపడతాం. – చెన్నా మోహన్, సర్పంచ్ -
ఆఖరికి చెత్తనూ వదల్లేదు..
సాక్షి, రాచర్ల (ప్రకాశం) : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో మండలంలోని ప్రతి పంచాయతీలో డంపింగ్యార్డుల (చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు) నిర్మాణాలను పూర్తి చేశారు. డంపింగ్యార్డు నిర్మాణాలను అధికార పార్టీ నాయకుల సొంతం చేసుకుని ఇష్టారాజ్యంగా పనులను పూర్తి చేశారు. మరికొన్ని చోట్ల అధికార పార్టీ నాయకుల వ్యవసాయ పొలాలకు అనుకూలంగా ఉండేలా డంపింగ్యార్డుల నిర్మాణాలు చేసుకున్నారు. భవిష్యత్తులో డంపింగ్యార్డుల నిర్మాణాలను ఆక్రమణ చేసుకుని వారి సొంత పనులకు వాడుకొనేలా ఏర్పాట్లు చేసుకున్నారు. మండలంలోని 14 పంచాయతీలుండగా 14 పంచాయతీల్లో డంపింగ్యార్డు నిర్మాణాలు పూర్తియ్యాయి. ఓబుల్రెడ్డిపల్లె గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు పాలకవీడు పంచాయతీలోని ఓబుల్రెడ్డిపల్లె గ్రామ సమీపంలోని తన వ్యవసాయ పొలం అనుకుని ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలం డంపింగ్యార్డు నిర్మాణం పూర్తి చేసుకుని తన సొంత పనులకు వినియోగించుకుంటున్నట్లు పలువురు విమర్శిస్తున్నారు. గుడిమెట్ట గ్రామంలో గ్రామానికి దాదాపు కిలోమీటరు దూరంలో డంపిండ్యార్డు నిర్మాణం చేశారు. చోళ్లవీడు గ్రామంలో ప్రైవేటు స్థలం పంచాయతీకి ఇవ్వకుండానే ఆ స్థలంలో డంపింగ్యార్డు నిర్మాణం చేశారు. డంపింగ్యార్డు నిర్మాణం పూర్తయిన చెత్త నుంచి సంపద తయారు చేయడం లేదు. ఆ డంపింగ్యార్డు భవిష్యత్తులో అధికార పార్టీ నాయకులు తన సొంత పనులకు వాడుకొనేందుకు సిద్ధం చేసుకుంటున్నట్లుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఓబుల్రెడ్డిపల్లెలో టీడీపీ నాయకుడి వ్యవసాయ పొలం పక్కనే నిర్మించిన డంపింగ్యార్డు ఇలా చేయాలి... నిర్మాణం పూర్తయిన తర్వాత సిబ్బందిని నియమించి, రిక్షాలను ఏర్పాటు చేయాలి. సిబ్బంది పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ప్రతి ఇంటి వద్ద నుంచి తడి, పొడి చెత్తను రిక్షాల ద్వారా షెడ్ వద్దకు తీసుకొచ్చి వేరు చేయాలి. తడి చెత్తను తొట్టెల్లో వేసి వానపాములను వదిలి సేంద్రియ ఎరువులను తయారు చేయాలి. పొడి చెత్తను ప్లాస్టిక్ ద్వారా రీసైక్లింగ్ చేయాల్సి ఉంది. ఇదంతా చేసేందుకు గ్రామ పంచాయతీలో 1000 మంది జనాభాకు ఒక్కరు చొప్పున గ్రీన్ అంబాసిడర్లతో పాటు ఒక్కో కేంద్రానికి ఒక వాచ్మెన్ను నియమిస్తారు. వారికి స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా నెలకు రూ.6 వేల జీతం చెల్లిస్తారు. చేస్తున్నది ఇలా.. మండలంలోని 14 పంచాయతీలకు గానూ ఎట్టకేలకు 12 పంచాయతీల్లో డంపింగ్యార్డు నిర్మాణాలు పూర్తి చేశారు. 10 చోట్ల అధికార టీడీపీ నాయకులు తమకు సంబంధించిన వ్యక్తులకు గ్రీన్ అంబాసిడర్లుగా, వాచ్మెన్లుగా నియమించుకున్నారు. మండలంలో ఎక్కడ కూడ డంపింగ్యార్డుల్లో చెత్త నుంచి సేంద్రియ ఎరువులు తయారు చేయడం ప్రారంభిచలేదు. రాచర్ల, గుడిమెట్ట, సోమిదేవిపల్లె గ్రామాల్లో షో చేసేందుకు కొంత చెత్తను పోగు చేసి వదిలేశారు. ఏ ఒక్కరూ వారి పనులు చేయడం లేదు. మండలంలో డంపింగ్యార్డు నిర్మాణాలకు మంజూరైన నిధులు పంచాయతీ అంచనా మెత్తం (రూ.లక్షల్లో) ఆకవీడు రూ.7,41,735 అనుములపల్లె రూ.2,57,454 చినగానిపల్లె రూ.2,88,337 చోళ్లవీడు రూ.3,93,599 యడవల్లి రూ.3,92,860 గౌతవరం రూ.2,43,961 గుడిమెట్ట రూ.3,01,977 జేపీ చెరువు రూ.3,22,915 కాలువపల్లె రూ.2,78,362 ఒద్దులవాగుపల్లె రూ.2,57,509 పాలకవీడు రూ.3,54,797 రాచర్ల రూ.6,92,455 సత్యవోలు రూ.2,51,914 సోమిదేవిపల్లె రూ.2,81,335 -
ఈ చెత్తేంది నారాయణా!
నెల్లూరు సిటీ : మున్సిపల్ మంత్రి నారాయణ సొంత జిల్లాలో ఒక కార్పొరేషన్.. ఆరు మున్సిపాలిటీలున్నాయి. ఇక్కడ రోజుకు 400 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. దీనిని డంపింగ్ యార్డులకు తరలిస్తుండడంతో చెత్త కొండలు గుట్టలుగా పేరుకుపోతోంది. తడి, పొడి చెత్త సేకరణ అంతంతమాత్రంగానే ఉంది. చెత్తతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు కాగితాలకే పరిమితమైంది. నెల్లూరు నగరంలో చెత్త తరలింపులో అధికార పార్టీ నేతలు బినామీలను ఏర్పాటు చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. కార్పొరేషన్ ఖజానాకు తూట్లు పొడుస్తున్నారు. ఏడు లక్షలు జనాభా ఉన్న నెల్లూరు నగరంలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. పాలకులు చెబుతున్న స్మార్ట్ సిటీ ఇలాగే ఉంటుందేమో! అంటూ ప్రజలు విస్తుపోతున్నారు. కావలి పట్టణంలోని డంపింగ్ యార్డును మోర్లవారిపాళెంకు తరలించారు. రెండేళ్లుగా చెత్త పేరుకుపోతూనే ఉంది. దుర్వాసన వస్తుండడంతో పరిసర గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇక్కడ వాహనాలు మరమ్మతులైనా పాలకులు పట్టించుకోవడంలేదు. నాయుడుపేట, సూళ్లూరుపేట మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డులే లేవు. రహదారుల పక్కనే చెత్తను తరలిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నాయుడుపేటలో స్వర్ణముఖినది సైతం కంపోస్టు యార్డుగా మారిపోతోంది. చిట్టమూరు మండలంలో మూడు ఎకరాల్లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. గూడూరు పట్టణంలో రోజుకు 28 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. అయితే ఇష్టానుసారంగా డంప్ చేస్తున్నారు. వెంకటగిరి పట్టణంలో చెత్తసేకరణ గ్రామాల కంటే దారుణంగా తయారైంది. ప్రధాన వీధుల్లో మినహా మిగతా ప్రాంతాల్లో మూడు రోజులకోసారి చెత్తను సేకరిస్తున్నారు. పట్టణంలో ఇంటింటికీ తిరిగి చెత్తసేకరణ ఇంకా ప్రారంభం కాలేదు. 10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన డంపింగ్ యార్డుకు ప్రహరీ లేకపోవడంతో గాలికి చెత్త సమీప పొలాల్లో పేరుకుపోతోంది. దీంతో రైతులు అవస్థలు పడుతున్నారు. ఆరేళ్ల క్రితం సీ గ్రేడ్ మున్సిపాలిటీగా మారిన ఆత్మకూరులో చెత్త సేకరణ ఆరంభశూరత్వంగా మారింది. రెండునెలల పాటు చెత్తను తరలించారు. ఆ తర్వాత అంతంతమాత్రంగానే సేకరణ జరుగుతోంది. పట్టణంలోని చెత్తను శివారు ప్రాంతాలకు తరలిస్తుండడంతో పరిసర గ్రామాల ప్రజల అవస్థలు వర్ణనాతీతం. చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. చెత్తతో విద్యుత్ తయారీకి అనుమతులిచ్చింది. దేశవ్యాప్తంగా పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వీటిని ఏర్పాచేస్తున్నట్టు ప్రకటించింది. అందులో నెల్లూరు నగరం కూడా ఉంది. అప్పటి నెల్లూరు కమిషనర్ పీవీవీఎస్ మూర్తి ఓ ప్రైవేట్ సంస్థతో ప్రాజెక్ట్ ఏర్పాటు చేసుకునేందుకు ఒప్పందాలు జరిగాయి. నెల్లూరు నగరంతోపాటు కావలి, గూడూరు మున్సిపాలిటీల్లో ప్రతి రోజూ చెత్తను తరలించి తద్వారా విద్యుత్ ఉత్పత్తికి చేయాలని నిర్ణయించారు. దీంతో కొన్నేళ్లుగా చెత్త సమస్యకు విముక్తి కలిగిందని ప్రజలు భావించారు. అయితే ఇప్పటికీ ఆ ఊసేలేదు. కంపోస్టు యార్డుగా స్వర్ణముఖి నాయుడుపేట పట్టణ సమీపంలో ఉన్న స్వర్ణముఖి నదిలో ఇష్టారాజ్యంగా వ్యర్థాలను పడేస్తుండటంతో కంపోస్టు యార్డుగా తయారైంది. నదిపై ఉన్న కాజ్వేపై నుంచి వాహనాల్లో చెత్త నిల్వలు, భవనాలకు సంబంధించిన వ్యర్థాలను నదిలో వేస్తుండడంతో స్వర్ణముఖి నది రోజురోజుకూ రూపుకోల్పోతోంది. మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ కంపోస్టు యార్డు లేకపోవడంతో పట్టణవాసులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి లారీల్లో వ్యర్థాలను నదిలో పడేస్తున్నారు. అధికారులు కూడా పట్టించుకున్న దాఖలాల్లేవు.– నాయుడుపేట టౌన్ -
ఉక్రెయిన్లో భారీ పేలుడు
-
వామ్మో..నెల్లూరు!
నెల్లూరు నగరం నరకానికి ప్రతి రూపంగా మారింది. ఎటు చూసినా అధ్వానమైన రోడ్లు, కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన చెత్తాచెదారాలతో నగర ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారు. దూమ్ము, ధూళి, వానొస్తే రొచ్చు, రోడ్లు ఎక్కి పారుతున్న మురుగు నీటితో జనం రోడ్డు మీదకు వచ్చేందుకు వణికిపోతున్నారు. నెల్లూరు నగరానికి చెందిన పొంగూరు నారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా.. అబ్దుల్ అజీజ్ నగర పాలక సంస్థ మేయర్గా వెలగబెట్టుతున్నారు. వీరు నెల్లూరు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి పథంలో నిలబెట్టి రాష్ట్రంలోనే మొదటి ర్యాంక్లో, దేశంలోనే అగ్రస్థానంలో ఉంచుతామని బీరాలు పోతున్నారు. ఏడాదిన్నరగా నెల్లూరు ప్రజలకు ప్రత్యక్షంగా నరకాన్ని చూపిస్తున్న పాలకులు ఇంకొన్ని రోజులు కష్టపడాలంటూ హితబోధ చేస్తూ తమ అసమర్థను కప్పిపుచ్చుకుంటున్నారు. నెల్లూరు సిటీ: నెల్లూరు నగరం జిల్లా కేంద్రం. పెద్ద పెద్ద భవంతులు. విశాలమైన రోడ్లు. మధ్యలో సుందరంగా కనిపించే డివైడర్లు, సెంట్రల్ లైటింగ్. పైకి కనిపించకుండా పారే మురుగునీరు. ఎటు చూసినా సిమెంట్ రోడ్లు. రోడ్డుపై కనిపించని చెత్తా చెదారాలు. ఇలా గ్రామీణ ప్రజలు నెల్లూరును ఊహించుకుంటారు. కానీ నెల్లూరు నగరం ఇందుకు భిన్నంగా ఉంది. రోడ్డు ఎక్కితేకాని తెలియదు నగర వాసుల దుస్థితి. నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 1.70 లక్షలు కుటుంబాలు ఉన్నాయి. 7 లక్షల మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. నగరంలోని ప్రధాన రహదారులు అయ్యప్పగుడి నుంచి వేదాయపాళెం, దర్గామిట్ట, కేవీఆర్ పెట్రోల్ బంక్, వీఆర్సీ సెంటర్, గాంధీబొమ్మ, ఆత్మకూరు బస్టాండ్ వరకు రోడ్లు దుమ్ము, ధూళితో నిండిపోయాయి. మినీబైపాస్ రోడ్డులోని బీవీగనర్, కొండాయపాళెం గేటు మీదుగా ఆత్మకూరు బస్టాండు వరకు ఇదే పరిస్థితి నెలకొంది. వాహనచోదకులు రోడ్లపై వాహనాలను నడపలేనిపరిస్థితి ఏర్పడింది. కళ్లలో దుమ్ము పడుతుడడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. మరో వైపు చిన్నారులు దుమ్ముతో అనారోగ్యాల బారిన పడుతున్నారు. కార్పొరేషన్ అధికారులు రోడ్లపై దుమ్మును శుభ్రం చేసే ప్రయత్నాలు చేయడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి రోడ్లు శుభ్రం చేసే మిషన్లు కొనుగోలు చేసినా..ఫలితం లేకుండా పోయింది. అడుగుకొక గొయ్యి భూగర్భ డ్రెయినేజీ, తాగునీటి పైప్లైన్ పనుల నేపథ్యంలో సిమెంట్ రోడ్లను ధ్వంసం చేశారు. అయితే పనులు పూర్తయిన తర్వాత వెంటనే రోడ్లు వేస్తామని చెబుతున్న అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రోడ్లలో గుంతలు ఏర్పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఏ రోడ్డులో ఎప్పుడు పనులు జరుగుతాయో తెలియని పరిస్థితి. పొద్దున ఖాళీగా ఉన్న రోడ్డు.. మధ్యాహ్నం క్లోజ్ చేసి పనులు చేపడుతుంటారు. ఏ వీధిలో పని జరుగుతుందో ఆ వీధి చివర ప్రారంభంలో బోర్డులు ఏర్పాటు చేయడం లేదు. దీంతో వాహనచోదకులు రోడ్డు చివరి వరకు వచ్చి వాహనాలు వెళ్లేందుకు దారిలేక వెనుతిరిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో వీధిలోకి వెళ్లినా ఇదే పరిస్థితి. గుంతలు తవ్విన రోడ్డును పూర్తిస్థాయిలో పూడ్చకుండా పైపై పూతలు వేయడంతో గుంతల్లో వాహనాలు ఇరుక్కు పోతున్నాయి. వృద్ధులు, చిన్నారులు ప్రమాదాలకు గురవుతున్నారు. చిన్నపాటి వర్షాలకే రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ద్విచక్ర వాహనాలే కాదు.. పాదచారులు కూడా జారిపడి గాయపడిన ఘటనలు ఇటీవల కాలంలో కోకొల్లలుగా జరిగాయి. భారీ వర్షాలు కురిస్తే నగర వాసులకు అడుగుకొక గండం తప్పదు. నీటి కోసం తిప్పలు ఎన్నడూ లేని విధంగా నగరంలోని భూగర్భ జలాలు ఇంకిపోయాయి. ముఖ్యంగా బాలాజీనగర్, మూలాపేట, దర్గామిట్ట, వేదాయపాళెం, స్టౌన్హౌస్పేట ప్రాంతాల్లో నీళ్లు లేక అవస్థలు ఎదుర్కుంటున్నారు. కార్పొరేషన్ నుంచి సరఫరా అయ్యే నీరు సైతం కొన్ని ప్రాంతాల్లో వారాలు పాటు రాని పరిస్థితి ఉంది. భూగర్భ డ్రెయినేజీ, తాగునీటి పనుల నేపథ్యంలో వాటర్ పైప్లైన్లు పగిలిపోతున్నాయి. దీంతో ఇళ్ల యజమానులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. కార్పొరేషన్ అధికారులు మాకు సంబంధం లేదని, ప్రజారోగ్య శాఖ తమ పని కాదని ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం తప్ప పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేయడం లేదు. రెండు పథకాలకు సంబంధించి పనులను ఎల్అండ్టీ, మెగా కంపెనీలు సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించడంతో వారు ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం అడుగడుగునా ప్రతి వీధిలో ఇదే పరిస్థితి ఉంది. అనారోగ్యం బారిన ప్రజలు నగరాన్ని సుందరీకరణ చేస్తానన్న మంత్రి నారాయణ మాటలు ఏమో కానీ.. ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. రోడ్లపై వెళ్లే సమయంలో దుమ్ము దూళి వ్యాపించి కళ్ల సమస్యలు, ఇతర జబ్బులకు లోనవుతున్నారు. చెత్తాచెదారాలు పేరుకుపోవడంతో వీధుల్లో దుర్వాసన వెలువడుతోంది. దోమలు వ్యాప్తి చెంది విషజ్వరాలకు గురి చేస్తున్నాయి. తాగునీరు మురుగు మయమవడంతో నగర వాసులు అనేక సమస్యలతో సతమవుతున్నారు. ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. మరికొంత కాలంగా కొనసాగితే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కడి చెత్త అక్కడే మూలిగే నక్క పైన తాటికాయపడ్డట్టు నగర వాసుల పరిస్థితి మారింది. ఓ వైపు గుంతల రోడ్లు, దుమ్ము దూళితో అల్లాడిపోతుంటే మరో పక్క నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో ఎక్కడి చెత్త అక్కడే కుప్పలు కుప్పలుగా పేరుకుపోయింది. గత 22 రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు 279 జీఓకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నారు. సమ్మెను విరమింప చేయడం.. పరిస్థితిని చక్కదిద్దాల్సిన అధికారులు వైఫల్యం చెందుతున్నారు. పాలకవర్గం మాత్రం కార్మిక నాయకులతో చర్చలు కూడా జరపకపోవడంతో చెత్త తొలగించే నాథుడు కరువయ్యారు. దీంతో వీధులన్నీ చెత్తతో నిండిపోయి..దుర్గంధం వెదజల్లుతున్నాయి. చిన్నపాటి చినుకులకు చెత్త కుళ్లి వెదజల్లే దుర్గంధానికి స్థానిక నివాసితులు బతకలేని పరిస్థితి నెలకొంది. ఎండలకు వీచే గాలికి వీధుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాలు గాలికి ఎగిరి ఇళ్లల్లోకి చేరుతున్న దుర్భర స్థితి. మంత్రి నారాయణ, మేయర్ అజీజ్లు కారుల్లో నగర రోడ్లపై షికారు చేసి వెళ్లిపోతున్నారని, నేల మీద నడిస్తే, పరిస్థితులను పరిశీలిస్తే తమ బాధ ఏంటో అర్థమవుతుందని నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సీఎంగారు మాకూ జీవించే హక్కుంది: పవన్ కల్యాణ్
సాక్షి, భీమవరం: ముఖ్యమంత్రి గారు మీ కొడుకుకే కాదు మాకు కూడా ఆరోగ్యం కల్పించడంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభ్యర్ధించారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా శనివారం ఆయన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ వారు జనావాసాలకు సమీపంగా, అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన చెత్త డంపింగ్ యార్డ్ను పరిశీలించారు. అనంతరం డంపింగ్ యార్డ్ను ఇలా జనవాసాలకు దగ్గరగా ఏర్పాటు చేయడం వల్ల తీవ్రమైన దుర్గంధం రావడమే కాక.. పందులు, దోమలు విజృంభించి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేవలం ఆయన కొడుకు గురించే కాక రాష్ట్ర ప్రజల ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాలని కోరారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డ్ చుట్టు పక్కల ఉన్న పిల్లల చేత ‘ముఖ్యమంత్రి గారు మా అందరికి ఆరోగ్యం కల్పించండి’ అంటూ ప్రమాణం చేయించారు. తక్షణమే ఈ డంపింగ్ యార్డ్ను ఇక్కడ నుంచి తొలగించాలని పవన్ డిమాండ్ చేశారు. -
కర్నూలు శివారులోని డంప్ యార్డ్ వద్ద భారీ పేలుడు
-
కాలుష్య కుంపటి
అనంతపురం : ఇదీ జిల్లా కేంద్రంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన కమలానగర్ దుస్థితి. నాలుగేళ్ల పాలనపై స్థానిక ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్చౌదరి శ్వేతపత్రం పేరిట గొప్పలకు పోయారు. కార్పొరేషన్ మేయర్ స్వరూప అనంతపురం రూపురేఖలు మార్చేశామంటూ ఇటీవల హడావుడి చేశారు. వీరి పాలన ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇదో మచ్చుతునక. చారిత్రక చిహ్నమైన టవర్క్లాక్కు సమీపంలో వేలాది మంది ప్రజలు రాకపోకలు సాగించే కమలానగర్లో కాలుష్య కుంపటి నిత్యం రగులుతోంది. ఓ ఖాళీ ప్రదేశం డంపింగ్ యార్డును తలపిస్తోంది. జిల్లా కేంద్రంలోనే నెలకొన్న ఈ పరిస్థితి చూసి ప్రజలు తాము చేసిన తప్పు తెలుసుకుని ‘ముక్కు మూసుకుని’ ముందుకు కదులుతున్నారు. చెత్త పేరుకుపోయిన ప్రతిసారీ చుట్టుపక్క నివాసితులు, వ్యాపారులు నిప్పు రాజేస్తుండటంతో ఈ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగించే ప్రజలు పరుగులు తీస్తున్నారు. ఇదే సమయంలో ఇక్కడ తిష్టవేసిన పందుల గుంపుతో స్థానికుల అవస్థలు వర్ణనాతీతం. ఇక్కడే ఓ చిన్నపిల్లల ఆసుపత్రి కూడా ఉంది. ఈ కాలుష్య కుంపటి వెదజల్లే పొగతో వ్యాధుల బారిన పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. అభివృద్ధి ముసుగులో పబ్బం గడుపుకునే నాయకులు ఇప్పటికైనా మేల్కొని ప్రజారోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు.– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
వ్యర్థాలతో వెలుగులు!
సాక్షి, హైదరాబాద్: వివిధ అంశాల్లో అగ్రభాగాన ఉన్న హైదరాబాద్ చెత్త (మునిసిపల్ ఘనవ్యర్థాల ఎంఎస్డబ్లు్య) నిర్వహణలోనూ రికార్డు కెక్కనుంది. దేశంలో ఏ నగరంలో లేని అతి పెద్ద భారీ డంపింగ్ యార్డు జవహర్నగర్లోని వ్యర్థాల క్యాపింగ్ పనులు త్వరలో పూర్తి చేయనుంది. తద్వారా పరిసర గ్రామాల ప్రజలకు వాతావరణ, భూగర్భజల కాలుష్యం తగ్గనుంది. దాదాపు 135 ఎకరాల్లో పేరుకుపోయిన 12 మిలియన్ టన్నుల వ్యర్థాల నుంచి వెలువడుతున్న దుర్గంధం, కాలుష్యంతో పరిసర ప్రాంతాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. చెత్తకుప్పల నుంచి వెలువడే కలుషితాలు, వర్షం నీరు కలిసి వెలువడుతున్న కాలుష్యకారకద్రవాల (లీచెట్)తో భూగర్భ జలాలన్నీ కలుషితమయ్యాయి. ఈ సమస్య పరిష్కారానికి అమెరికా, జర్మనీ, జపాన్, బ్రిటన్ దేశాల మాదిరిగా అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానంతో చెత్త నిర్వహణ పనుల్ని రాంకీకి చెందిన ‘హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ మునిసిపల్ సాలిడ్ వేస్ట్ లిమిటెడ్’ చేపట్టింది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నెలాఖరులోగా క్యాపింగ్ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే క్యాపింగ్లోని ఆరు దశల్లో తొలిదశలో భాగంగా 150 మి.మీ. మందం మట్టితో కప్పే ప్రక్రియను 85శాతం పూర్తిచేసింది. వర్షాకాలం ముగిశాక అక్టోబర్లో రెండో దశ పనుల్ని చేపట్టనున్నారు. విషవాయువులు బయటికి వెళ్లేలా... క్యాపింగ్ అనంతరం డంప్యార్డ్పై బోరు బావుల మాదిరిగా పైపులను చొప్పించి విషవాయువులు పైకి వెళ్లే ఏర్పాట్లు చేస్తారు. వెలువడే గ్యాస్లోని వాయువుల్ని, వాటి పరిమాణాన్ని లెక్కించి, విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తారు. అందుకు అవకాశముంటే విద్యుత్ ఉత్పత్తికూడా చేస్తారు. విషవాయువులు, లీచెట్ను శుభ్రపరుస్తారు. ఇప్పటికే లీచెట్ శుభ్రపరిచే చర్యలు పైలట్గా చేపట్టారు. క్యాపింగ్ పనుల్లో టెర్రా సంస్థ సహకారాన్ని తీసుకుంటున్నారు. ఈ పనుల్ని నగర మేయర్ బొంతు రామ్మోహన్ సోమవారం పరిశీలించారు. క్యాపింగ్ ప్రాజెక్ట్ హెడ్ కృష్ణతో కలసి పనుల వివరాలను మీడియాకు వివరించారు. మార్చిలో విద్యుత్ ప్లాంట్ పనులు.. జవహర్నగర్ డంపింగ్ యార్డులో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ పనులు వచ్చే మార్చిలో ప్రారంభం కానున్నాయి. 19.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ఈ ప్లాంట్కు రోజుకు 1,600 మెట్రిక్ టన్నుల చెత్త అవసరం. ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్లు ఈ క్యాపింగ్ తదితర పనుల్ని పరిశీలిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 నగరాల్లోనే ఇంత పెద్ద డంపింగ్ యార్డులకు క్యాపింగ్ పనులు జరిగాయని ప్రాజెక్ట్ హెడ్ కృష్ణ తెలిపారు. చెత్త నిర్వహణలో ఆదర్శం: బొంతు దేశంలో ఆగ్రా, ముంబై వంటి నగరాల్లో డంపింగ్ యార్డులకు క్యాపింగ్ పనులు చేసినా, ఇంత పెద్ద విస్తీర్ణంలో, ఇంత పెద్ద చెత్తగుట్టలకు ఎక్కడా క్యాపింగ్ జరగలేదు. అనుకున్న ప్రకారం పనులన్నీ పూర్తయితే జవహర్నగర్ మోడల్ డంపింగ్ కేంద్రంగా, పర్యాటక ప్రాంతంగా మారుతుంది. తొలిదశలో మట్టితో కప్పేందుకు ఇప్పటివరకు 5.5 లక్షల క్యూబిక్ టన్నుల మట్టిని వినియోగించారు. లీచెట్ శుద్ధికి 4ఎంఎల్డీ సామర్ధ్యమున్న యంత్రాలతో పనులు చేస్తున్నారు. ఇప్పటికే 90 శాతం మేర దుర్గంధం తగ్గింది. ప్రాజెక్టు వ్యయం రూ.144 కోట్లు కాగా, సగం కాంట్రాక్టు సంస్థ, మిగతా సగం జీహెచ్ఎంసీ భరిస్తున్నాయి. ఇకపై గ్రేటర్లోని చెత్తనంతా జవహర్నగర్కే తరలించం. నగరం నలువైపులా వివిధ ప్రాంతాల్లో చెత్త డంప్ కేంద్రాలు ఏర్పాటు చేసి, నిర్వహణ చేపడతాం. దాదాపు 50–100 ఎకరాల మేర స్థలాల్ని ఎంపిక చేసి చుట్టూ గార్డెన్ను అభివృద్ధి చేసి, మధ్యలో ఘనవ్యర్థాల నిర్వహణ పనులు చేపడతాం. ఆటోనగర్లోనూ చెత్త నిర్వహణ కేంద్రాన్ని త్వరలో అందుబాటులోకి తెస్తాం. గ్రేటర్లోని 12 చెత్త రవాణా కేంద్రాలనూ ఆధునీకరిస్తాం. వాటి నిర్వహణ బాధ్యతల్ని అంతర్జాతీయ సంస్థలకు అప్పగిస్తాం. ఆరు దశల్లో పనులిలా.. ఆరు దశల్లో ఈ క్యాపింగ్ ప్రక్రియ పూర్తిచేస్తారు. తొలిదశలో డంప్ యార్డును మట్టితో కప్పి వర్షపు నీరు చెత్తలోకి చేరకుం డా చేస్తారు. అనంతరం మట్టిపొరపైన జియోసింథటిక్ క్లే లైనర్ వేస్తారు. తర్వాత జియో కంపోజిట్ లేయర్ ఏర్పాటు చేస్తారు. చివరగా మళ్లీ మట్టిపొరను దాదాపు ఒకటిన్నర అడుగు (45సెం.మీ.) మేర పరుస్తారు. దీనిపై అందంగా కనిపించేందుకు, ఆక్సిజన్ వెలువడేందుకు రంగు రంగుల మొక్కలు పెంచుతారు. -
ఎవరెస్ట్.. అత్యంత ఎత్తయిన చెత్త కుప్ప
-
ఎవరెస్ట్.. ఎ ‘వరెస్ట్’...
ఏటికేడూ హిమాలయాల్లోని మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించే వారి సంఖ్య పెరిగిపోతోంది. అదే స్థాయిలో వారు వదిలేస్తున్న వ్యర్థాల పరిమాణమూ పెరిగింది. వెరసి 8,848 మీటర్ల ఎవరెస్ట్ శిఖరం.. నేడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చెత్త కుప్పగా మారిపోయింది. చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ఎవరెస్ట్పై పరిస్థితిని వివరిస్తూ విడుదల చేసిన ఓ నివేదిక విస్మయానికి గురిచేస్తోంది. నిజానికి ఎవరెస్ట్పై చెత్త పేరుపోతుండటం ఇప్పటిదేం కాదు. ఏళ్ల తరబడి కొనసాగుతూ వస్తోంది. ఒకానోక దశలో పరిస్థితులు మరీ దారుణంగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో ఎవరెస్ట్ పై పోగయ్యే వర్థాలను తగ్గించేందుకు ఐదేళ్ల కిందట నేపాల్ ప్రభుత్వం సరికొత్త నిబంధన విధించింది. పర్వతారోహకుల బృందం పైకి ఎక్కేప్పుడు కొంత సొమ్మును డిపాజిట్ చేయాలి. ఒక్కో సభ్యుడు తిరిగి వచ్చేటప్పుడు ఎనిమిది కిలోల చొప్పున వ్యర్థాలను తెవాలి. అప్పుడు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. టిబెట్ వైపు నుంచి ఎక్కేవారు కచ్చితంగా ఎనిమిది కిలోల వ్యర్థాలను తేవాలి. గత ఏడాది నేపాల్ నుంచి వెళ్లిన పర్వతారోహకులు 25 టన్నుల చెత్తను - 15 టన్నుల మానవ విసర్జితాలను తెచ్చారని సాగర్ మాత పొల్యూషన్ కంట్రోల్ కమిటీ తెలిపింది. కానీ ఏటా ఎవరెస్ట్ పై పేరుకుపోతున్న వ్యర్థాలతో పోలిస్తే ఇది చాలా తక్కువన్నది తేలింది. అవినీతి దందా... ‘ఒక్కో బృందం ఎవరెస్ట్ పర్యటనకు రూ.14 లక్షల నుంచి రూ.68 లక్షల వరకు వెచ్చిస్తున్నారు. అంత మొత్తం చెల్లించినప్పుడు తిరిగి చెత్తను వెంటపెట్టుకుని రావటం ఏంటన్న భావనతో చాలా మంది అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పి తమ డిపాజిట్ సొమ్మును వెనక్కి తీసుకుంటున్నారు. ఇలా రెండు దశాబ్దాలుగా ఎవరెస్ట్ అధిరోహకుల సంఖ్య పెరిగి వ్యర్థాలను ఇష్టం వచ్చినట్టు పడేస్తుండటంతో టన్నుల మేర చెత్త పేరుకుపోయింది’ అని నేపాల్ పర్వతారోహకుల సంఘం మాజీ అధ్యక్షుడు నేపాలీ షెర్పా పెంబా డోర్జే ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో 30 మంది సభ్యుల బృందం 8.5 టన్నుల చెత్తను అతికష్టం మీద తీసుకొచ్చినట్లు ఆయన చెబుతున్నారు. అవగాహన సదస్సులు ఎన్ని నిర్వహిస్తున్నా.. అవినీతి దందాతో లాభం లేకుండా పోతోందని పెంబా డోర్జే ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ పరిణామాలపై పర్యావరణ వేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ‘ఎవరెస్ట్ పై పెద్ద ఎత్తున పెరిగిపోతున్న చెత్త సుందర హిహాలయాలను కలుషితం చేస్తోంది. ఎవరెస్ట్ పై పేరుకున్న వ్యర్థాలు మంచులో కలుస్తున్నాయి. మంచు కరిగినప్పుడు కలుషిత నీరు ఉత్పత్తి అవుతోంది. అది మహా ప్రమాదం’ అని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. -
ఇటువైపు ఒక అడుగు
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరిదే!ఆ తర్వాత మరిన్ని అడుగులు పడతాయి. వాటికి మరికొన్ని అడుగులు జత కలిస్తే అద్భుతాలు జరుగుతాయి. అలాంటి ఓ అద్భుతం జరగడం కోసం డంప్యార్డ్ వైపు ఒక అడుగు వేశారు డాక్టర్ జయశ్రీ కిరణ్. తర్వాత అడుగు మనది కావాలి. మనందరిదీ కావాలి. డాక్టర్ జయశ్రీ కిరణ్ లెక్చరర్. సైఫాబాద్ సైన్స్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్. ఉంటున్నది హైదరాబాద్లోని తార్నాక. గత ఐదు నెలలుగా ఆమె డంప్యార్డ్ల చుట్టూ ఉండే జనావాసాల్లోకి వెళ్లివస్తున్నారు. వాళ్లంతా డంప్యార్డే జీవనాధారం అయినవాళ్లు. డంప్యార్డ్కి వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జబ్బు చేస్తే క్రమం తప్పకుండా వాడాల్సిన మందుల గురించి ఆ సమీపంలోని ఇల్లిల్లూ తిరిగి, ముఖ్యంగా అక్కడి మహిళల్లో అవగాహన కల్పిస్తున్నారు. మున్సిపల్ అధికారులను కూడా కలిసి డంప్యార్డ్ వద్ద హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేయమని కోరుతున్నారు. తను కూడా హెల్త్క్యాంపులను పెట్టి, అనారోగ్యం బారిన పడకుండా ఉండటానికి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ‘దయచేసి డంప్యార్డ్ వైపు ఒకసారి చూడండి’ అని నగరవాసులను కూడా కోరుతున్నారు! ఎందుకిలా జయశ్రీ ఏరి కోరి ప్రమాదంలోకి వెళుతున్నారు? ఇదే మాటను ఆమెను అడిగితే.. ‘నేను వెళ్లడం.. అంటుంచండి. వాళ్లంతా ప్రమాదంలోనే కదా ఉంటున్నారు!’ అంటారు ఆవేదనగా. జబ్బుల దిబ్బలు! పగిలిపోయిన ట్యూబ్లైట్లు, గాజు బాటిళ్లు, గ్లాసు ముక్కలు చెత్తబుట్టలోనే వేస్తుంటాం. డయాబెటిస్ పేషెంట్స్ రోజూ తీసుకునే ఇన్సులిన్ ఇంజెక్షన్లూ అదే బుట్టలోనే. ఆడవాళ్లు వాడేసే శానిటరీ న్యాప్కిన్లు, ఉపయోగంలో లేని బ్యాటరీలు, డిజిటల్ వేస్టేజ్.. ఒకటేమిటి హానికరమైన ఎన్నో వస్తువులు చెత్తలోకి చేరుతుంటాయి. అవన్నీ డంప్యార్డ్కి చేర్చి, ఉపాధి కోసం వాటిలోనే తిరిగేవారికి ఆ గాజు ముక్కలు, ఇంజెక్షన్లు గుచ్చుకుని.. వ్యాధుల పాలిట పడుతున్నారు. వాడిపడేసిన బ్యాటరీలు ఒక్కోసారి పేలుతుంటాయి కూడా! ఇదంతా డంప్యార్డ్ వద్ద హెల్త్క్యాంప్ ఏర్పాటు చేశాక, అక్కడి వారి పరిస్థితులు ప్రత్యక్షంగా చూశాక జయశ్రీకి మరింతగా స్పష్టం అయ్యింది. అసలు ఈ జబ్బుల దిబ్బల్లోకి వెళ్లాలన్న ఆలోచన జయశ్రీకి ఎలా వచ్చింది? ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. మూడు రోజులు బండి రాలేదు ‘ఉద్యోగానికి కొంతకాలం సెలవు పెట్టి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు జరిగిందది! ఆ సమయంలో వరుసగా మూడు రోజుల పాటు చెత్త తీసుకువెళ్లే వాళ్లు రాలేదు. ఆ దుర్గంధాన్ని భరించలేకపోయాను. నాల్గవ రోజు చెత్త తీసుకెళ్లే ఆమె వస్తే ‘ఎందుకు రావట్లేదు?’ అని కోపగించుకున్నాను. ‘మా ఆయనకి ఒంట్లో బాగోలేదమ్మా! కడుపునొప్పి. పోయిన వారమే నాకూ ఆసుపత్రి ఖర్చు వెయ్యి రూపాయిలయ్యింది. ఇప్పుడు ఆయనకు..’ అంటూ లోపలికి వచ్చి చెత్త డబ్బా తీసుకెళ్లింది కుంటుకుంటూ. చెత్తను తను తెచ్చిన బండిలో వేసుకుని, చెత్తబుట్టను ఇవ్వడానికి తిరిగొచ్చింది. ‘నీకేమయ్యింది కుంటుతున్నావ్.. ’ అన్నాను. ‘కాలికి ఏదో గుచ్చుకుంది. ఇరవై రోజుల పైనే అయ్యింది. నొప్పి అస్సలు తగ్గడం లేదు’ అంది. ‘మీకిలా ఉంటే మీ పిల్లల్నెవరు చూస్తారు’ అన్నాను. ‘మా పిల్లోడికి ఐదేళ్లమ్మా! ఎక్కడేస్తే అక్కడే పడుంటాడు. పిలిచినా పలకడు. డాక్టర్లకు చూపిస్తే మెదడు ఎదుగుదల లేకుండానే పుట్టాడు అని చెప్పారు, ఏం చేస్తాం. మా తలరాత’ అంటూ ఆమె ఇంకో ఇంట్లో చెత్త తీసుకెళ్లడానికి వెళ్లబోయింది. ‘మీరెక్కడుంటారు.. ఈ చెత్తంతా ఎక్కడకు తీసుకెళతారు?’ అని అడిగాను. ‘డంప్యార్డ్ ఉందిగా అమ్మా! అక్కడకు తీసుకెళ్లి వేస్తాం.. మేం ఉండేది కూడా అక్కడి బస్తీలోనే’ అని చెప్పి, ముందుకు వెళ్లిపోయింది. నేరుగా డంప్యార్డుకే వెళ్లిపోయా! ఆ తర్వాత రోజు చెత్త తీసుకెళ్లడానికి ఆమె రాలేదు. మనసు మనసులో లేదు. ఏమై ఉంటుంది ఆమెకు. భర్తకు ఆరోగ్యం బాగోలేదు. పిల్లాడు ఎలా ఉన్నాడో.. ఆమె చెప్పిన స్థితి కళ్ల ముందు కదలాడుతోంది. ఇంట్లో ఉండబుద్ది కాలేదు. ఆమె చెప్పిన డంప్యార్డ్ ఎక్కడుంటుందో కనుక్కొని వెళ్లాను. ఇక్కడే ఉందన్నట్టు ముందుగా వచ్చిన దుర్వాసన చెప్పేసింది. వంద ఎకరాల్లో ఉండే ఆ డంప్యార్డ్ను కాసేపు అక్కడే ఉండే చూశా! కనుచూపుమేరంతా చెత్త. ముక్కులు పగిలిపోయే దుర్వాసన. భుజాలకు పెద్ద పెద్ద సంచులు వేసుకున్న కొందరు ఆడవాళ్లు, పిల్లలు, మగవాళ్లు చెత్తను కెలుకుతూ స్క్రాప్ని ఏరుకుంటున్నారు. వాళ్ల చేతులకు గ్లౌజులు లేవు. కొందరి కాళ్లకు చెప్పులు లేవు. పందులు, కుక్కలు ఆ ఏరియా మాదేనన్నట్టు తిరుగుతున్నాయి. అక్కడే ఉన్న ఒకట్రెండు చెట్లకు ఐదారు గుడ్డ ఊయలలు పసిపిల్లలను నిద్రపుచ్చుతున్నాయి. ఆ పిల్లల తల్లులు ఆ మురికి చేతుల్తోనే పిల్లలను ఎత్తుకుంటున్నారు. అలాగే పాలు పడుతున్నారు. అక్కడ వారికి చేతులు కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవు. వెంట తెచ్చుకున్న బాటిళ్ల నీళ్లతో గొంతులు తడుపుకుంటున్నారు. దాదాపు వందల మంది ఆ డంప్యార్డే ఆధారంగా జీవిస్తున్నారు. రెండు రోజులు ఇంట్లోని చెత్తను తీసుకెళ్లకపోతేనే విసుక్కుంటాం. అలాంటిది నిత్యం చెత్తలోనే బతుకుతున్న వారిని చూస్తుంటే కడుపులో దేవినట్టయ్యింది. నా భర్త కిరణ్కుమార్ డాక్టర్ కావడంతో నా ఆవేదనను వెంటనే అర్థం చేసుకున్నారు. హెల్త్ క్యాంపు ఏర్పాటులో తనూ ఓ చేయి కలిపారు. పర్మిషనిచ్చినా చాలు..! రోజూ వేల టన్నుల చెత్త ఒక డంప్యార్డ్కి చేరుతుందట! నగరంలో ఇలాంటి డంప్యార్డ్లు 24 ఉన్నాయి. వాటన్నింటినీ తిరిగాను. విదేశాలలో ఇళ్ల నుంచి చెత్తను సేకరించే పద్ధతులు, అక్కడ ప్రజలు తీసుకునే జాగ్రత్తలు, చెత్తను రీ సైక్లింగ్ చేసే విధానాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకున్నాను. వాటిలో మనం కనీసం 50 శాతం పాటించినా ప్రజల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందనిపించింది. అన్ని డంప్యార్డ్ల వద్ద హెల్త్క్యాంపుల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాను. రెండు రోజుల క్రితమే పటాన్చెరువు, మియాపూర్లలోని డంప్యార్డ్ల వద్ద హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశాం. తాగునీటి సౌకర్యం కోసం వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశాం. మిగతా డంప్యార్డ్ల వద్ద కూడా హెల్త్ క్యాంపులు పెట్టి, అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే, ఇందుకు తగినంత వైద్య సిబ్బంది, వాలంటీర్ల లేమి ఉంది. రాబోయేది వర్షాకాలం. ఈ కాలంలో ఆరోగ్య సమస్యల సంఖ్య ఇంకా ఎక్కువే. కాలుష్యం తగ్గడానికి డంప్యార్డ్ చుట్టూ ఔషధ మొక్కల పెంపకానికి చర్యలు తీసుకోవాలని, తాగునీటి వసతితో పాటు చేతులు, ఒళ్లు శుభ్రం చేసుకోవడానికి తగినన్ని నీళ్లను ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నాను. పర్మిషన్ ఇచ్చినా ఆ పనిని నేను కొద్ది కొద్దిగానైనా నెరవేర్చుకుంటూ వెళ్లగలననే నమ్మకం నాకుంది’’ అని చెప్పారు జయశ్రీ. ‘‘ఇన్నాళ్లు నేను చేసిన ఉద్యోగం పిల్లల భవిష్యత్తుకు మార్గం చూపేది. ఇప్పుడు డంప్యార్డ్ చుట్టూ పేరుకుపోయిన అనారోగ్య పరిస్థితుల్ని తొలగించడానికి నా చుట్టూ ఉన్న నలుగురిని తట్టిలేపాలని నిశ్చయించుకున్నాను’’ అంటున్నారు జయశ్రీ. ప్రతి ఇంటికీ బాధ్యత ఉంది మన దగ్గర తడి చెత్త–పొడి చెత్త అని, చెత్తను వేరు చేసే రెండు విధానాలు ఉన్నాయి. కానీ, వాటిని పట్టించుకునే వారే లేరు. ఇళ్ల వద్దే చెత్తను మనం చాలా రకాలుగా తగ్గించవచ్చు. తడి చెత్తను కంపోస్ట్ ఎరువుగా మార్చుకోవచ్చు. పొడి చెత్తలోనూ హానికారకమైన (సిరంజులు, సూదులు, గాజు ముక్కలు, బ్యాటరీల.. వంటివి) వస్తువులను విడిగా ఒక ప్యాకెట్లో వేసి ఇస్తే వాటిని వాళ్లు అంతే జాగ్రత్తగా తీసుకెళ్లగలరు. నివారణ మన ఇంటి నుంచి మొదలైతే సమాజ ఆరోగ్యం బాగుంటుంది. – జయశ్రీ – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
చెత్త కుంభకోణం
కర్నూలు నగరంలో చెత్త తరలించడానికి 12 ట్రాక్టర్లు, 2 టిప్పర్లు 4 కాంపాక్టర్లు ( భారీ స్థాయిలో చెత్త తరలించే వాహనాలు) ఉన్నాయి. ఇవి చాలదన్నట్లు అధికారులు ప్రైవేట్ చెత్త ట్రాక్టర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒక్కో ట్రిప్పుకు రూ.780 ప్రకారం ఏడాదికి కోటి రూపాయలకు పైగా కట్టబెట్టడం విమర్శలకు తావిస్తోంది. కర్నూలు (టౌన్): కర్నూలులో 5.50 లక్షల జనాభా ఉంది. ఇక్కడ 51 వార్డులను పారిశుద్ధ్య పరంగా 13 డివిజన్లుగా విభజించారు. ప్రతి రోజు 170 మెట్రిక్ టన్నుల చెత్త తరలించాల్సి ఉంది. వీటిని తరలించేందుకు నగరపాలక సంస్థకు సంబంధించిన ట్రాక్టర్లు ఉన్నా వినియోగించడం లేదు. ప్రైవేట్ ట్రాక్టర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎందుకంటే.. చెత్తను తరలించేందుకు ట్రిప్పుల విధానం అమలవుతోంది. ప్రభుత్వ ట్రాక్టర్లను ప్రతి రోజూ రెండు ట్రిప్పులు తిప్పుతున్నారు. వీటికి ఎలాంటి ఖర్చు ఉండదు. అయితే ప్రైవేట్ ట్రాక్టర్లకు ప్రతి రోజు ఐదు ట్రిప్పులు కేటాయించారు. ఒక్కో ట్రిప్పుకు రూ. 780ప్రకారం ఐదు ట్రిప్పులకు రూ. 3,900 నగరపాలక సంస్థ చెల్లిస్తుంది. ప్రతి రోజూ 13 ప్రైవేట్ ట్రాక్టర్లకు రూ. 49,400 చెల్లిస్తున్నారు. నెలకు. రూ. 14,80,000 ప్రకారం ఏడాదికి రూ.1,77,84,000 చెల్లిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ప్రైవేట్ ట్రాక్టర్లకు నిధులు చెల్లిస్తున్నా...కర్నూలులో పారిశుద్ధ్యం మెరుగుపడడం లేదు. ఇదిలా ఉండగా.. ప్రతి రోజూ రెండు ట్రిప్పులు తిప్పుతున్న ప్రభుత్వ ట్రాక్టర్లకు డీజీల్ ఖర్చు ఏటా రూ.1,20,00,000 అవుతున్న విషయం విదితమే. ప్రైవేట్ ట్రాక్టర్ల నుంచి మున్సిపల్ అధికారులు ట్రిప్పుకు ఇంత అని కమీషన్ తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డంపింగ్ యార్డు వద్దా ఇదే పరిస్థితి.. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజు 25కు పైగా ట్రాక్టర్ల ద్వారా వస్తున్న చెత్తను పాతబస్తీ జమ్మిచెట్టు వద్ద (ట్రాన్సిట్ పాయింట్)కు తరలిస్తున్నారు. ఇక్కడ నుంచి చెత్తను గార్గేయపురానికి తరలించాలి. ఇక్కడ కూడా ప్రభుత్వ ట్రాక్టర్లు ఉన్నాయి. టిప్పర్లు ఉన్నాయి. కాంపాక్టర్లు ఉన్నాయి. అయినా... వీటన్నింటినీ పక్కన పెట్టారు. ఇక్కడి నుంచి చెత్తను తరలించేందుకు రెండు ప్రైవేట్ టిప్పర్లకు అప్పగించారు. ఒక్కో ట్రిప్పుకు రూ. 2 వేల ప్రకారం చెల్లిస్తున్నారు. -
డంపింగ్ యార్డులు నిర్మించాలి
నల్లగొండ : గ్రామాల్లో డంపింగ్ యార్డులు నిర్మించాలని జెడ్పీ స్థాయీ సంఘం కమిటీ సభ్యులు కోరారు. గురువారం నల్లగొండలోని జెడ్పీ కార్యాలయంలో గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం స్థాయి సంఘం కమిటీల సమావేశం జరిగింది. జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలూనాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఆయా కమిటీల సభ్యులు, ఉమ్మడి జిల్లాకు చెందిన అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ.. గ్రామాల్లో రహదారుల వెంట చెత్తా చెదారం పేరుకుపోతోందని అన్నారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో డంపింగ్ యార్డులు నిర్మించి.. చెత్త నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. హరితహారంలో భాగంగా పంపిణీ చేస్తున్న మల్బరీ, వేప మొక్కలు నాసిరకంగా ఉంటున్నాయని.. మొక్కలు ఎదగడం లేదని సభ్యులు అన్నారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తూకం వేయడానికి కాంటాలు సరిపోవడం లేదని, అధనంగా కాంటాలు ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాలో ఎమ్మార్పీకి మించి మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, చింతపల్లి, మాడ్గులపల్లి ఏరియాల్లో కల్తీ మద్యం విక్రయిస్తున్నారని, జాతర్లు, పండుగలప్పుడు వ్యాపారులు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని సభ్యులు తెలిపారు. దీనిపై ఎక్సైజ్ శాఖ స్పందిచకపోతే.. ప్రజాప్రతినిధులుగా తామే జోక్యం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గురువారం జరిగిన సమావేశాలకు పలువురు అధికారులు హాజరు కాకపోవడంపై జెడ్పీ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా గైర్హాజరైన అధికారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. గత సమావేశాల్లో సభ్యులు కోరిన వివిధ అభివృద్ధి పనులను అధికారులు వీలైనంత త్వరగా పూర్తిచేయాలని చైర్మన్ సూచించారు. సమావేశంలో సభ్యులు, జెడ్పీ సీఈఓ హనుమానాయక్, డీఆర్డీఓ రింగు అంజయ్య, డీఈఓ జగిని చైతన్య, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. -
డంపింగ్ యార్డు తొలగించాల్సిందే..
కాకినాడ : డంపింగ్యార్డు సమస్యతో సతమతమవుతున్న లారీ యజమానులు ఒక్కసారిగా రోడ్డెక్కారు. లారీ యజమానుల సంఘ కార్యాలయం పక్కనే చెత్త వేసి తగలబెట్టడంతో వచ్చే కాలుష్యం వల్ల తమ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని వారు ఆదివారం నుంచి మెరుపు సమ్మెకు దిగారు. దీంతో ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోగా రేవు ద్వారా జరిగే రవాణా కార్యకలాపాలు కూడా స్తంభించిపోయాయి. కాకినాడ రాజీవ్ గృహకల్ప సమీపంలోని పర్లోపేట వద్ద ఎఫ్సీఐ గొడౌన్లను ఆనుకుని ఉన్న స్థలంలో చాలా కాలంగా చెత్త డంప్ చేస్తున్నారు. నగరానికి డంపింగ్యార్డు లేకపోవడంతో నిత్యం సేకరించే చెత్తను అక్కడకు తరలించి తగలబెడుతున్నారు. దీంతో ఇదే ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న లారీ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్తతోపాటు జంతు కళేబరాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆస్పత్రి వ్యర్థాలను తగలబెట్టడంతో విపరీతమైన దుర్వాసన, పొగ ఆవరించి ఆ ప్రాంతం మీదుగా వెళ్లలేని దుస్థితి నెలకొందంటూ చాలాకాలంగా అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. పైగా లారీ యజమానులు, డ్రైవర్లు, కార్మికులతో పాటు చుట్టుపక్కల ఉండే సంజయ్నగర్, పర్లోపేట, దుమ్ములపేట ప్రాంతవాసులు రోగాలు, వ్యాధులతో సతమతమవుతున్నామని గతంలో కూడా రెండుమూడుసార్లు ఆందోళనకు దిగగా అధికారులు, ప్రజాప్రతినిధులు నచ్చచెప్పడంతో వెనక్కి తగ్గారు. తాజాగా డంపింగ్ యార్డు కోసం సామర్లకోట సమీపంలో స్థలం కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, డంపింగ్ సమస్య మాత్రం యథావిధిగా కొనసాగడంపై లారీయజమానులు ఒక్కసారిగా నిరసన గళం విప్పారు. ఆగిన లారీలు... కాకినాడ లారీ అసోసియేషన్ పరిధిలోని దాదాపు 2,500 లారీలను ఆదివారం ఎక్కడికక్కడ నిలిపివేశారు. డంపింగ్యార్డు తరలింపుపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు బంద్ విరమించేదిలేదంటూ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రాజాన సూర్యప్రకాష్, ముత్యం తేల్చిచెప్పారు. పైగా డంపింగ్కు వాహనాలు వెళ్ళే రహదారి వద్ద లారీని అడ్డంగాపెట్టారు. కార్పొరేషన్ పారిశుద్ధ్య వాహనాలు వెళ్ళకుండా నిరోధించారు. దీంతో దిగివచ్చిన కార్పొరేషన్ యంత్రాంగం, పోలీసులు, ప్రజాప్రతినిధులు లారీ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చిస్తున్నారు. అయితే తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు నిర్ణయంలో మార్పులేదని స్పష్టం చేస్తున్నారు. మరో వైపు లారీ అసోసియేషన్ ద్వారా జరిగే రేవు కార్యకలాపాలపై బంద్ ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది. నిత్యం రేవు ద్వారా సుమారు 300లకు పైగా లారీల ద్వారా ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రాలకు బియ్యం, బొగ్గు, కెమికల్స్ వంటి వస్తువులను రవాణా చేస్తుంటారు. ఇప్పుడు ఇవన్నీ దాదాపు స్తంభించిపోయాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రవాణారంగంతోపాటు రేవు కార్యకలాపాలపై కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. -
మున్సిపల్ కార్మికురాలికి అభినందన
మెట్పల్లి: చెత్త కుప్పలో దొరికిన రూ.1.20లక్షలను పోగొట్టుకున్న వ్యక్తికి ఇచ్చి నిజాయితీని చాటుకున్న మున్సిపల్ పారిశుధ్య కార్మికురాలు మద్దెల లక్ష్మిని గురువారం పలువురు అభినందించారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ మర్రి ఉమారాణి, కమీషనర్ అయాజ్లు, బీసీ సంఘం నాయకులు అందె మారుతి, బొడ్ల రమేశ్లు సన్మానించారు. అలాగే 9వార్డులో కౌన్సిలర్ గైనీ లావణ్యతో పాటు స్థానికులు లక్ష్మీ దంపతులను అభినందించారు. -
ఇస్తావా.. చస్తావా!
ఈ ఫొటోలో మొక్కజొన్న తోట వద్ద నిలబడి ఉన్న రైతు పేరు అడబాల పద్మారావు.ఊరు పోలవరం. మూలలంక ప్రాంతంలో ఇతని పేరుతో 47 సెంట్లు, ఇతని భార్య కుమారి పేరుతో 50 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిపైనే ఆధారపడి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ భూమి మొత్తం పోలవరం డంపింగ్యార్డ్ కోసం ప్రభుత్వం సేకరిస్తోంది. ఇతనికి భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తెకు వివాహం చేయాలి. భూమిని ప్రభుత్వం తీసుకుంటే కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలో అర్థం కావటంలేదని పద్మారావు ఆవేదన చెందుతున్నారు. పోలవరం : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అవసరమైన డంపింగ్ యార్డు కోసం రైతుల నుంచి భూములు సేకరించే విషయంలో ప్రభుత్వ తీరు ఆందోళనకరంగా ఉంది. భూములు కలిగిన రైతులతో చర్చలు జరపకుండా, ఎంత నష్టపరిహారం ఇస్తారో తేల్చకుండా ఏకపక్షంగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ (డీఎన్) ప్రటించటం, నోటీసులు జారీ చేయటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బలవంతంగా భూములు తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయమైన ధర చెల్లించకపోతే భూములు ఇచ్చేదిలేదని చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు డంపింగ్యార్డ్ కోసం పోలవరం గ్రామంలోని మూలలంక ప్రాంతంలో 2016లో ప్రభుత్వం భూములు సేకరించింది. రెండో విడతగా ఈ ఏడాది మరికొన్ని భూములు సేకరించేందుకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. భూములు సేకరిస్తున్నామని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్తో మాట్లాడుకోవాలని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె.మోహన్కుమార్ చెప్పటం మినహా, రైతులతో రేటు విషయంలో ఏ విధమైన చర్చలు జరపలేదు. ఆందోళనకు గురైన రైతులు ఇటీవల పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి తమ భూములకు న్యాయమైన ధర ఇప్పించాలని కోరారు. సీఎం జిల్లా కలెక్టర్ భాస్కర్ను అడగ్గా పట్టిసీమ ఎత్తిపోతల పథకం భూములకు ఇచ్చిన ధర ఇస్తామంటూ స్పష్టం చేశారు. పట్టిసీమ భూములకు మూడేళ్ల కిందట ఎకరానికి రూ.19.53 లక్షలు చొప్పున నష్టపరిహారం చెల్లించారు. అప్పుడు ఇచ్చిన రేటే ఇప్పుడు కూడా చెల్లిస్తామని చెప్పటం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండో విడతగా డంపింగ్ యార్డ్ కోసం 52 మంది రైతులకు సంబంధించి 88 ఎకరాల భూములు సేకరించేందుకు ఆర్డీఓ మోహన్కుమార్ ఇటీవల రైతులకు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులను చాలా మంది రైతులు తీసుకోలేదు. మీ భూములకు ఎకరానికి రూ.15.39 లక్షలు రేటు నిర్ణయించామని, నోటీసు అందిన మూడు రోజుల్లోగా బ్యాంకు ఖాతా నంబర్తో పాటు ఆధార్కార్డు జిరాక్స్ను జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో దాఖలు చేయాలని పేర్కొన్నారు. లేకుంటే నష్టపరిహారం సొమ్ము రైతుల ఖాతాకు జమచేయటం వీలు పడదని పేర్కొన్నారు. పత్రాలు దాఖలు చేయకపోతే చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. భూములు కలిగిన రైతులతో చర్చలు జరపకుండా ఏకపక్షంగా భూములు సేకరించేందుకు చర్యలు చేపట్టటం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం వేల కోట్లు పెరుగుతున్నా, తమకు మాత్రం న్యాయం జరగటంలేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి, పోలవరం డంపింగ్ యార్డ్కు, నిర్వాసితుల పునరావాసానికి, పోలవరం కుడి ప్రధాన కాలువకు భూములు ఇచ్చామని ఇక సాగు చేసుకునేందుకు కూడా భూమిలేని పరిస్థితి ఏర్పడిందని విలవిల లాడుతున్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి, పోలవరం కుడి కాలువకు పెదవేగి, నూజివీడు, బాపులపాడు మండలాల్లో భూములకు చెల్లించిన ధర తమకు కూడా చెల్లించాలని కోరుతున్నారు. భూములు మొత్తం కోల్పోతున్నందున అవసరమైతే మిగిలిన ప్రాంతాల్లో ఇచ్చిన విధంగా జీఓ ఇచ్చి ఎకరానికి రూ.30 లక్షలు నష్టపరిహారం చెల్లించి తమకు న్యాయం చేయాలని రైతులు మిరియాల నాగమణి, ఓడపాటి సత్యన్నారాయణ, పంతులు గంగరాజు తదితరులు కోరుతున్నారు. -
కల్తీ మద్యం బుసబుస
తెనాలి: నకిలీ మద్యం కుంభకోణానికి ఇంకా తెరపడలేదు. ఖాళీ సీసాల్లో నకిలీ, చౌక మద్యం అమ్మకాల గుట్టు రట్టయి, నిందితులెవరో నిగ్గు తేలినప్పటికీ తవ్వేకొద్దీ అన్నట్టుగా కొత్త కేసులు వెలుగు చూస్తూనే వున్నాయి. ‘సాక్షి’ వరుస కథనాల్లోని అంశాలు పక్కా వాస్తవాలుగా బహిర్గతమవుతున్నాయి. ఆ క్రమంలోనే శుక్రవారం స్థానిక మార్కెట్ సెంటర్లోని బజారులో మూసి ఉంచిన కూరల దుకాణంలో కొత్త మూతల డంప్ పట్టుబడటం ఇందుకు నిదర్శనం. దుకాణం లోపల ఉంచిన వివిధ రకాల మద్యం బ్రాండ్లకు చెందిన వేలాది మూతలను అధికారులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నకిలీ మద్యం గుట్టు రట్టు రేపల్లె సమీపంలోని తుమ్మల పంచాయతిలోని గాదెవారిపాలెంలో ఒక ప్రైవేటు ఇంటిలో నడుస్తున్న నకిలీ మద్యం రాకెట్ జనవరి 16న బహిర్గతమైన విషయం తెలిసిందే. దీనికి కొన్ని నెలల ముందు నుంచి ఈ అక్రమ వ్యాపారం నడుస్తోంది. మ హారాష్ట్ర టు అదిలాబాద్, విజయవాడకు రెక్టిఫైడ్ స్పిరిట్ను తెప్పించి, రంగు కలిపి నకిలీ మద్యం తయారు చేయటం, ఖాళీ మద్యం సీసాల్లో నింపటం ఒకరకమైతే, మధ్య రకం ఖరీదు కలి గిన బ్రాండ్ల ఖాళీ సీసాల్లో చౌకమద్యం కలపటం మరో రకం. ముందే తెప్పించుకున్న కొత్త మూతల్ని క్యాప్ ఫిట్టింగ్ మిషనుతో సీలు వేస్తున్నారు. ‘ఎక్సైజ్’లోని ఆరితేరిన కొందరు ఉద్యోగులు, మద్యం లైసెన్సుదారులు కుమ్మక్కయి, తెనాలి డివిజనువ్యాప్తంగా ఈ అక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ‘సాక్షి’ కథనాలతో తెనాలికేసి చూపు గాదెవారిపాలెం కల్తీ మద్యం కేసులో ఎక్సైజ్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్, అతడి బంధువు సహా పలువురు నిందితులని తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెనాలి సమీపంలోని క్రాప, ఈమని గ్రామాల్లో పలు కేసులు వెలుగు చూశాయి. అయితే, పట్టించుకోకుండా అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నారు. అధికారుల కనుక మేల్కొంటే కల్తీ, నకిలీ వ్యవహారం ముందే వెలుగుచూసేదని అదే నెల 21న ‘సాక్షి’ కథనంలో పేర్కొనటంతో ఆ దిశగా దర్యాప్తుచేసిన అధికారులు కొత్త మూతల సరఫరాదారును గత నెల మొదటివారంలో అదుపులోకి తీసుకున్నారు. తమదైన ట్రీట్మెంట్తో ఇందులో భాగస్వాములైన లైసెన్సుదారుల పేర్లను వెల్లడించినట్టు తెలిసింది. సందేహాలకు తావిస్తున్న ‘ఎక్సైజ్’ గోప్యత ప్రొహిబిషన్, ఎక్సైజ్ పోలీసులు ఈ కేసులో గోప్యతను పాటిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. గత నెలలో పట్టుబడిన మూతల సరఫరాదారు వెల్లడించిన లైసెన్సుదార్లపై విచారించారా? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అనే అంశంపై అధికారులు మౌనాన్ని వీడటం లేదు. కీలకమైన రెక్టిఫైడ్ స్పిరిట్ను తన పేరుతో దిగుమతి చేసుకుంటూ కల్తీ మద్యం వ్యాపారం కేసులో నిందితుడైన తెనాలి ఎక్సైజ్ కార్యాలయం ఉద్యోగిని ప్రధాన నిందితుల్లో ఒకరుగా కాకుండా చివరి వరుసలోకి చేర్చి, పక్షపాతం చూపారనే విమర్శలున్నాయి. పక్కదారి పట్టించేందుకు ఎత్తుగడ మార్కెట్ సెంటర్లో పట్టుబడిన కొత్త మూతల డంప్ కేసు నీరుగార్చే ప్రయత్నంలో భాగమేనని విశ్వసనీయ సమాచారం. నిజానికి కూరగాయల దుకాణం యజమాని ఆకుల సత్యనారాయణ, అద్దెదారుకు వివాదం నడుస్తోంది. కొద్దినెలలుగా దుకాణం మూసివేసి ఉంటోంది. లోపల బూజు పట్టి వున్న దుకాణంలో మూతలు, వుంచిన సంచీ ఎలాంటి మట్టీమరకలు లేకుండా ఉండటం చూస్తుంటే, ఒకటి రెండురోజుల ముందే ఎవరో అక్కడ పడేసి వుంటారనీ, అందుకు మార్గం కూడా ఉందని చెబుతున్నారు. కేవలం కేసును పక్కదారి పట్టించేందుకు ఇప్పటికే ఆరోపణలున్న దుకాణం యజమానిపై నెట్టే ప్రయత్నంలో ఇదొక భాగమనీ, లైసెన్సుదార్లు తప్పించుకునే వ్యూహమన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో పెద్దఎత్తున డబ్బు చేతులుమారినట్టు మద్యం వ్యాపారవర్గాలు గుసగుసలాడుతున్నారు. మద్యం కల్తీ కోసం దాచిన మూతలు స్వాధీనం తెనాలి రూరల్ : మద్యం కల్తీ చేసి విక్రయించేందుకు దాచి ఉంచిన మూతలను ఎక్సైజ్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. పట్టణంలోని మార్కెట్ కూడలికి వెనుక వైపున ఉన్న షాపులో కల్తీ మద్యం ఉందన్న సమాచారంతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు దాడి చేశారు. మూసి ఉన్న షట్టర్ను తెరిచి చూడగా, శ్లాబుకు కన్నం వేసి ఉంది. దానికి ఆసరాగా ఉన్న నిచ్చెన సాయంతో శ్లాబు పైభాగంలో వెతకగా, మద్యంలోని వివిధ బ్రాండులకు చెందిన మూతలు ఉన్నాయి. సీసాల్లో మద్యం కల్తీ చేసి, వాటిని బిగిస్తారు. షాపు గత 15 సంవత్సరాలుగా ఆకుల సత్యనారాయణ అనే వ్యక్తి పేరున ఉన్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడుల్లో ఎక్సైజ్ ఏఈఎస్ అరుణకుమారి, సిబ్బంది పాల్గొన్నారు. మూతలు తెనాలికి సరఫరా ఇటీవల కొల్లూరు మండలం క్రాపలో పట్టుబడిన నకిలీ మూతలు తెనాలికి సరఫరా అవుతున్నట్లు గుర్తించామని ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ అరుణకుమారి తెలిపారు. సత్యనారాయణ దుకాణంలో ఈ నేపథ్యంలోనే సోదా చేసినట్టు వివరించారు. బ్రాండెడ్ మద్యాన్ని చీప్ లిక్కర్తో కల్తీ చేసి, వాటికి ఈ మూతల్ని బిగిస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించామని, సత్యనారాయణ కొలకలూరు, దుగ్గిరాల గ్రామాల్లో మద్యం వ్యాపారం చేస్తున్నాడని చెప్పారు. -
డంపింగ్ యార్డుల జాడేదీ ?
‘‘పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని.. తడి, పొడి చెత్తను వేర్వేరు చేసి ఇళ్ల వద్దకు వచ్చే రిక్షాల్లోనే వేయాలి అని.. పేర్కొంటూ గ్రామాల్లో ఆర్భాటంగా డంపింగ్యార్డుల నిర్మాణాలు ప్రారంభించారు. అంతవరకూ బాగానే ఉన్నా నెలలు గడుస్తున్నా నేటికీ మండలంలో నాలుగు గ్రామాల్లోనే అవి పూర్తికాగా.. కొన్ని గ్రామాల్లో స్థలాలు లేక, మరికొన్ని గ్రామాల్లో నత్తనడకన డంపింగ్యార్డుల నిర్మాణాలు సాగుతున్నాయి. దీంతో పారిశుద్ధ్యం పడకేసింది, చిన్నచింతకుంట : మండలంలోని ఆయా గ్రామాల్లో డంపింగ్యార్డుల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపడుతూ ఆరోగ్యకరమైన వాతావరణం గల గ్రామాలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం డంపింగ్యార్డుల నిర్మాణాలు నెలల కిందట చేపట్టింది. మండలంలోని 18 గ్రామాల్లో డంపింగ్యార్డు నిర్మాణ పనులు ప్రారంభించగా.. 4 గ్రామాలైన ఉంద్యాల, దాసర్పల్లి, ముచ్చింతల, అల్లీపూర్లో మాత్రం పూర్తయ్యాయి. డంపింగ్యార్డుల నిర్మాణాల కోసం ఈజీఎస్ అధికారులు స్థలాలు ఎంపిక చేశారు. అయితే, ఉపాధి కూలీలతో 8 గ్రామాలైన గూడూర్, నెల్లికొండి, వడ్డెమాన్, మద్దూర్, లాల్కోట, తిర్మలాపూర్ , అమ్మాపూర్, చిన్నచింతకుంటలో డంపింగ్యార్డు గుంతలను ఇప్పుడిప్పుడే తవ్వుతున్నారు. మిగిలిన 6 గ్రామాల్లో స్థలం లేక డంపింగ్ యార్డు పనులకు నోచుకోలేదు. పేరుకుపోతున్న చెత్తా చెదారం పట్టణంతో పాటు ఆయా గ్రామపంచాయతీలలో తడి, పొడి చెత్తలను ఎక్కడపడితే అక్కడ పారవేయడంతో పరిసర ప్రాంతాలన్ని దుర్భరంగా తయారవుతున్నాయి. గ్రామంలో పారిశుద్ధ్య వారోత్సవాల కార్యక్రమాల్లో తప్ప మిగిలిన రోజుల్లో అధికారులు పరిశుభ్రతపై శ్రద్ధ తీసుకోకపోవడంతో చెత్తకుప్పలు ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తున్నాయి. వీటితో పాటు తడిపొడి చెత్తలను తీసుకెళ్లడానికి ప్రభుత్వం ఇచ్చిన రిక్షాలు కూడా నిరుపయోగంగా మారాయి. అవి పంచాయతీ ఆవరణలకే పరిమితమయ్యాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆయా గ్రామాల్లో చెత్తనిల్వల కోసం డంపింగ్యార్డులను వెంటనే చేపట్టాలని పలువురు కోరుతున్నారు. అపరిశుభ్రంగా మారాయి గ్రామాల్లో డంపింగ్యార్డు పనులు నిలిచిపోవడంతో చెత్తా చెదారం రోడ్లపైనే పారబోస్తున్నారు. దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. పందుల సంచారం పెరిగింది. దీనితో పాటు ఈగలు, దోమలు వ్యాప్తిచెంది రోగాలబారిన పడే అవకాశం ఉంది. అధికారులు స్పందించి డంపింగ్యార్డులు త్వరగా పూర్తిచేయాలి. – చంద్రశేఖర్గౌడ్, అప్పంపల్లి త్వరలో పూర్తి చేస్తాం మండలంలోని అన్ని గ్రామాల్లో డంపింగ్యార్డుల నిర్మాణ పనులను వేగవంతంగా చేస్తాం. పర్దిపూర్, బండ్రవల్లి, పల్లమర్రి, కురుమూర్తి దమగ్నాపూర్,అప్పంపల్లి గ్రామాల్లో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాన్ని ఊరికి దూరంగా చూపించకపోవడంతో పనులు మొదలుపెట్టలేక పోయాం. త్వరలో స్థలాలు ఎంపిక చేసి పూర్తిచేస్తాం. – నవీన్కుమార్, ఏపీఓ -
నల్లమలలో మావోయిస్టుల డంప్
సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో కలకలం రేగింది. జిల్లాలోని నాగలూటీ చెంచు గూడెం వద్ద మావోయిస్టుల డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డంప్లో గ్రనేడ్, జిలెటిన్ స్టిక్సను గుర్తించారు. మావోయిస్టుల డంప్ లభ్యం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అటవీ ప్రాంతమంతా జల్లెడ పడుతున్నారు. -
విజయనగరంలో ఆపరేషన్ రెడ్
చిత్తూరు అర్బన్ : ఎర్రచందనం స్మగ్లింగ్ను అరి కట్టడానికి చిత్తూరు పోలీసు జిల్లాలో ఏర్పాటైన ఆపరేషన్ రెడ్ విభాగం విజయనగరంలో ఓ భారీ డంప్ను స్వాధీనం చేసుకుంది. రూ.కోట్లు విలువజేసే ఎర్రచందనం డంప్ను విజయనగరం జిల్లాలో గుర్తించిన చిత్తూరు పోలీసులు దాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీని వెనుక ఉన్న ఓ బడా స్మగ్లర్ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు సమాచారాన్ని రాబడుతున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు.. పూతలపట్టు సమీపంలో మూడు రోజుల క్రితం వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు ఓ మినీలారీలో ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. ఇందుకు సంబంధిం చి నిందితులను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా, ఎర్రచందనం స్మగ్లింగ్లో విజయనగరం జిల్లాకు చెందిన ఓ బడా వ్యక్తి పేరు బయటపెట్టారు. ఈ విషయంపై ఏ మాత్రం ఆలస్యం చేయొద్దని .. ఓ ప్రత్యేక బృందాన్ని విజయనగరం పంపుతూ చిత్తూరు ఎస్పీ రాజశేఖర్బాబు ఆదేశాలు జారీ చేశారు. పూతలపట్టులో పట్టుబడ్డ చోటా స్మగ్లర్ను వెంటపెట్టుకుని మంగళవారం తెల్లవారుజామున చిత్తూరు పోలీసులు విజయనగరం చేరుకున్నారు. అక్క డ భారీగా దాచి ఉంచిన ఎర్రచందనం దుంగల డంప్ను గుర్తించారు. టన్ను రూ.35 లక్షల వరకు పలికే ఏ–గ్రేడ్ ఎర్రచందనం దుంగలు డంప్లో ఉన్నట్లు సమాచారం. పట్టుబడ్డ ఎర్రచందనం దుంగల విలువ దాదాపు రూ.5 కోట్లకుపైగా ఉండొచ్చని సమాచారం. కాగా దుంగలు పట్టుబడ్డ డంప్ ప్రాంతంలో ముగ్గురిని చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఎర్రచంద నం దుంగలు దొరికిన స్థల యజమా నితో పాటు మరో ఇద్దరు స్మగ్లర్లు ఉన్నారు. అయితేఅనూహ్యంగా వీరి వెనుక ఓ అంతర్జాతీయ బడా స్మగ్లర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించా రు. అతడిని పట్టుకోవడానికి విజయనగరం పోలీసులతో కలిసి చిత్తూరు పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అక్కడున్న అన్ని ప్రధాన చెక్పోస్టులపై నిఘా ఉంచారు. మరో రెండు రోజుల పాటు అక్కడే ఉండి పట్టుబడ్డ డంప్తో పాటు నిందితులను చిత్తూరుకు తీసుకురానున్నారు. శేషాచలం అడవుల్లో భారీగా ఎర్రచందనం స్వాధీనం భాకరాపేట /తిరుపతి మంగళం : శేషాచలం అడవుల్లో భారీగా ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నట్లు భాకరాపేట ఫారెస్టు రేంజర్ రఘునాథ్ తెలిపారు. మంగళవారం భాకరాపేటలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ శేషాచలం అడవుల్లో అటవీ అధికారులు, సిబ్బంది, ప్రొటెక్షన్ వాచర్లు, పైర్ వాచర్లు కలసి నాలుగు రోజులుగా కూంబింగ్ చేస్తున్నారని, సోమవారం పెరుమాళ్లపల్లె బీట్ పరిధిలోని మేకలబండ ప్రాంతంలో ఎదురుపడ్డ తమిళ స్మగ్లర్లను చుట్టుముట్టే ప్రయత్నం చేయగా, వారు దుంగలు పడేసి పరారయ్యారని తెలిపారు. అక్కడ 60 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే మంగళవారం 50 దుంగలు ఉన్న డంప్ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. -
పసికందును అమ్మజూపి..ఆపై హత్య చేసి..
-
గ్రేటర్.. ఇండోర్ రూట్
సాక్షి,సిటీబ్యూరో: ఇండోర్ నగరాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు అక్కడి యంత్రాంగం కంకణం కట్టుకుంది. అక్కడ రోడ్డుపై చెత్త వేస్తే రూ.500 నుంచి రూ.1000 వరకు జరిమానా వసూలు చేస్తున్నారు. ఇలా సంవత్సరంలో రూ.1.5. కోట్లు వసూలు చేశారంటే ఎంత నిబద్ధతగా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. నగరమంతా రోడ్డుకు ఇరువైపులా ప్రతి 100 మీటర్లకు రెండు చెత్తడబ్బాలు ఏర్పాటు చేశారు. తడి–పొడి చెత్త ఇంటివద్దే వేరు చేయాల్సిందే. దుకాణాలు, హోటళ్లు, తదితర సంస్థల నుంచి ప్రతిరోజు వెలువడే చెత్త పరిమాణాన్ని బట్టి నెలవారీ చెత్త తరలింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. అలా తక్కువ చెత్త వెలువడే దుకాణాలకు రూ.500 వసూలు చేస్తుండగా, పెద్ద హోటళ్లకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇళ్ల నుంచి చెత్త తరలించే కార్మికులకు నెలకు రూ.60 చెల్లిస్తున్నారు. చెత్త తరలింపు బండ్లలో తడి,పొడికి వేర్వేరు అరలే కాక నాప్కిన్లకు మరో డబ్బా కూడా ఉంచారు. చెత్త రవాణా కేంద్రాల్లో బయో మెథనైజేషన్ చేస్తున్నారు. ఎక్కువ చెత్త ఉత్పత్తి చేసే సంస్థల నిర్వాహకులతో పాటు కాలనీ సంఘాలు తదితరులకు ఎక్కడికక్కడే సేంద్రియ ఎరువు యంత్రాలను వినియోగించాల్సిందిగా అవగాహన కల్పించారు. రోజుకు పది కేజీల కన్నా ఎక్కువ చెత్త వెలువడే ప్రాంతాల్లో ఈ యంత్రాలను ఉంచారు. పెద్ద హోటళ్లు, ఫంక్షన్హాళ్లలో వీటిని తప్పనిసరి చేశారు. పార్టీ ఇస్తే చార్జి చెల్లించాల్సిందే.. ఏదైనా ఫంక్షన్ హాల్లో గానీ, రోడ్డుపై టెంటు వేసి వేడుక ఏర్పాటు చేసి విందు ఇస్తే ఎంతమంది హాజరు కానున్నారో మనిషికి రూ.50 చొప్పున సదరు పార్టీ నిర్వాహకులు కార్పొరేషన్కు ముందుగానే చెల్లించాలి. వ్యర్థాల తరలింపునకు ఈ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఎవరైనా చెల్లించకుంటే పెనాల్టీగా రెట్టింపు చార్జీ వసూలు చేస్తున్నారు. ఇటీవల ఇండోర్లోని స్థానిక ఎమ్మెల్యే ఒకరు ముందస్తు ఫీజు చెల్లించనందుకు అతని నుంచి రూ.50 వేల పెనాల్టీ వసూలు చేశారని అధ్యయనం చేసి వచ్చిన గ్రేటర్ అధికారులు తెలిపారు. అంటే అక్కడ పరిశుభ్రతకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో.. నిబంధనలు ఎంత కఠినంగా అమలు చేస్తున్నారో తెలుస్తోంది. చెత్త తరలింపు పర్యవేక్షణకు కన్సల్టెన్సీ.. ఇంటింటి నుంచి చెత్త తరలింపు సక్రమంగా జరుగుతున్నదీ లేనిదీ పరిశీలించేందుకు ఇండోర్ కార్పొరేషన్ ఎన్విరాన్మెంట్ సర్వీసెస్ కన్సల్టెన్సీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అందుకుగాను ఒక్కో ఇంటికి నెలకు రూ.11 వంతున కార్పొరేషన్ చెల్లిస్తోంది. అక్కడ సేకరించిన చెత్తను రీసైకిల్ చేసి చెత్తడబ్బాలను తయారు చేశారు. తరిగి ఒక్కో డబ్బాను రూ.25లకు ప్రజలకు విక్రయించారు. టాయ్లెట్ల నిర్వహణ ఇలా.. ఒక్కో టాయ్లెట్ నిర్వహణకు ఇండోర్లో నెలకు రూ.15 వేలు ఖర్చు చేస్తున్నారు. ఇందులో రూ.7500 కేర్టేకర్కు చెల్లిస్తుండగా, రూ.7500 నిర్వహణకు వెచ్చిస్తున్నారు. అక్కడ ఔట్సోర్సింగ్ సిబ్బందిని తీసుకునేది 29 రోజులకే. ఆ ఒప్పందం ముగియగానే వారినే మళ్లీ తాజా ఒప్పందంతో తీసుకుంటారు. రెగ్యులర్ చేయాలనే డిమాండ్లు రాకుండా ఇండోర్లో ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. గతేడాది స్వచ్ఛ ర్యాంకింగ్లో దేశంలోనే నెంబర్–1గా నిలిచిన ఇండోర్లో స్వచ్ఛ కార్యక్రమాలు ఎలా అమలు చేస్తున్నారో పరిశీలించేందుకు జీహెచ్ఎంసీకి చెందిన అధికారులు ఇప్పటికే అక్కడ పర్యటించి వచ్చారు. వారు అధ్యయనం చేసిన వివరాలను ‘సాక్షి’కి వివరించారు. అధ్యయనం చేసి వచ్చిన వారిలో జోనల్ కమిషనర్లు శ్రీనివాసరెడ్డి, శంకరయ్య, హరిచందన, భారతి హొళికేరి, అడిషనల్ కమిషనర్ మనోహర్, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్రెడ్డి, శశికిరణాచారి తదితరులు ఉన్నారు. వారు తమ అధ్యయన నివేదికను కమిషనర్కు అందజేయనున్నారు. వాటిలో నగరానికి అనువైన వాటిని త్వరలో అమలు చేయనున్నారు. స్వచ్ఛతపై ప్రత్యేక శ్రద్ధ.. ఇండోర్ కార్పొరేషన్ జనాభా 35 లక్షలు. విస్తీర్ణం 150 చ.కి.మీ. కమిషనర్తో పాటు నలుగురు అడిషనల్ కమిషనర్లు స్వచ్ఛ కార్యక్రమాలపైనే ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారని జోనల్ కమిషనర్ శంకరయ్య తెలిపారు. గతేడాది నెంబర్–1గా నిలవడంతో దాన్ని తిరిగి నిలుపుకుందామంటూ ఎక్కడ చూసినా ‘ఫిర్ రహేంగే’ ప్రకటనలు కనిపిస్తున్నాయని సీసీపీ దేవేందర్రెడ్డి తెలిపారు. -
‘చెత్త’ చెరువు
అది పట్టణం నడిబొడ్డున ఉన్న చెరువు.. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది పట్టణవాసులకు ఆహ్లాద వాతావరణం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. మినీ ట్యాంక్బండ్ పేరుతో రూ.5.41కోట్లు కేటాయించి సుందరీకరణ పనులు చేపట్టింది. ఆహ్లాదం దేవుడెరుగు! కానీ ప్రస్తుతం చెత్తాచెదారంతో చెత్త చెరువుగా మారిపోయింది. అటువైపు నుంచి వెళ్తే దుర్గంధం వెదజల్లుతోంది.. ఇది నల్లచెరువు దైన్యం..! వనపర్తి : జిల్లా కేంద్రంలో సుమారు 70ఎకరాల విస్తీర్ణంలో నల్లచెరువు విస్తరించి ఉంది. దీని కింద 397.37ఎకరాల ఆయకట్టు ఉంది. ఏటా టన్నుల కొద్దీ ధాన్యం పండుతుంది. మినీ ట్యాంకుబండ్గా మార్చిన తర్వాత కేఎల్ఐ నీటితో చెరువును నింపి ఏడాది పొడవునా కృష్ణాజలాలు ఉండేలా ఆధునికీకరణ కోసం అధికారులు ప్రణాళికలు రూపొందించి రూ.5.41కోట్లు వెచ్చించారు. కానీ నిత్యం వనపర్తి పట్టణం నుంచి సేకరిస్తున్న చెత్తను చెరువుకు ఉత్తరం, దక్షిణం దిశలో డంప్ చేస్తున్నారు. మినీ ట్యాంకు అభివృద్ధి పనులు ప్రారంభమైన రెండు నెలల క్రితం కొంతమేర చెత్త వేయగా ప్రస్తుతం పూర్తిగా నిండిపోయింది. నల్లచెరువును నీటితో నింపితే ఇక్కడ ఉన్న నీరంతా కలుషితమవడం ఖాయం. అంతేకాకుండా జిల్లా కేంద్రంలోని ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి సేకరించిన వ్యర్థాలను ఇక్కడే పారబోస్తున్నారు. పట్టణవాసులకు ఆహ్లాదమైన వాతావరణం అందించేందుకు రూ.కోట్ల ప్రజాధనం వెచ్చించి అభివృద్ధి చేస్తున్న మినీ ట్యాంకుబండ్లో చెత్త వేయడంతో పరిసరాలు కంపుకొడుతున్నాయి. చెరువు కట్టమీది నుంచి వచ్చేవారు ముక్కు మూసుకుని వెళ్లాల్సి వస్తోంది. బోటుషికారుకు ఇబ్బందే మినీట్యాంకుబండ్లో చెత్త డంపింగ్ ఆపకుంటే మున్ముందు ఇక్కడ ఏర్పాటుచేసే బోటుషికారు మురుగు, కలుషితనీటిలో చేయాల్సిన వస్తుంది. ఒకవేళ పాడి ఆవులు, గేదెలు తాగినా పాల దిగుబడి తగ్గి, విషతుల్యం కానున్నాయి. బతుకమ్మల నిమజ్జనం కష్టమే.. ఏటా దసరా సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహించే బతుకమ్మలను నల్లచెరువులోనే నిమజ్జనం చేసే విధంగా అధికారులు ప్రత్యేక ఘాట్లను సిద్ధం చేస్తున్నారు. చెరువు భూభాగంలో చెత్త డంపింగ్ ఆపకపోతే ఘాట్ నిర్మాణం పూర్తిగా చెత్తతో నిండిపోనుంది. ప్రతిష్టాత్మక బతుకమ్మ సంబరాలను చెత్తకుప్పల మధ్య నిర్వహించుకోవాల్సి వస్తోందని పలువురు పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త డంపింగ్ యార్డుకు ప్రతిపాదనలు ఇంతకుముందు డంపింగ్యార్డు వివాదంలో ఉండడంతో కొత్తగా మరోచోట డంపింగ్ యార్డు నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అనుమతి రాగానే డంపింగ్ ప్రదేశాన్ని మార్చుతాం. ప్రస్తుతానికి చెరువు ప్రదేశంలో చెత్త వేయకుండా మరోచోట వేసేలా చర్య తీసుకుంటాం. – వెంకటయ్య, ఇన్చార్జి కమిషనర్, వనపర్తి మున్సిపాలిటీ -
స్కూల్ మానేసిన అబ్బాయిలు పెద్ద నేరం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో అత్యాచారాల సంఘటనలు జరుగుతునే ఉన్నాయి. ఓ యువతిపై ముగ్గురు యువకులు లైంగిక దాడి జరిగిన ఘటన మరువకముందే జహంగిపురి ప్రాంతంలో మరో మహిళపై సామూహిక లైంగిక దాడి జరిగింది. ఐదుగురు జువెనైల్స్ కలిసి ఓ మహిళను బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి తెలిసినవాళ్లే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఎవరికైనా చెబితే చంపేస్తాం అని బెదిరించారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ఐదుగురు జువెనైల్స్ జహంగిరి ప్రాంతంలోని మున్సిపల్ చెత్త డంపింగ్ యార్డ్ వద్ద భవనం వెనుకకు ఆమెను రాత్రి 10గంటల ప్రాంతంలో బలవంతంగా తీసుకెళ్లారు. ఆమె అరిచే ప్రయత్నం చేసినా గొంతు నొక్కిపట్లి అరిస్తే చంపేస్తామని చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించి కేసు నమోదు చేశారు. ఈ ఐదుగురు కూడా బాధితురాలు ఉండే ప్రాంతంలో ఉండేవారేనని, మధ్యలోనే స్కూల్ మానేసిన వీరు చెత్త డంపింగ్ యార్డ్లో పనులు చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. వారు బాల నేరస్తులు కాకుంటే కోర్టుకు తీసుకెళతామని చెప్పారు. -
భర్తను చంపి సెప్టిక్ ట్యాంక్లో దాచిన మహిళ
-
కనిపించకుండా పోయి.. శవమై తేలి..
సాక్షి, మేడ్చల్ : మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పంచాయతీ పరిధిలోని రాంకీ చెత్త డంపింగ్ యార్డ్లోని నీటి మడుగులో ఓ బాలుడి మృతదేహం కలకలం రేపింది. శాంతినగర్కు చెందిన కృష్ణ కుమారుడు రామకృష్ణ(4)గా అతడిని గుర్తించారు. పదిహేనేళ్ల క్రితం విజయవాడ నుంచి వలస వచ్చిన కృష్ణ, శాంతి నగర్లో నివసిస్తూ, చెత్తను సేకరించి జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి బాలుడు కనిపించకుండా పోయాడు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు బాలుడు డంపింగ్ యార్డ్కు చెందిన నీటి మడుగులో శవమై తేలాడు. మృత దేహాన్ని మేకలు కాసే వ్యక్తి గుర్తించి బస్తీ వాసులకు తెలపడoతో, వారు పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న జవహర్ నగర్ సీఐ ఉమా మహేశ్వరరావు తన సిబ్బంది తో సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ ను రప్పించిన తదనంతరం పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పటల్ కు తరలించారు. -
భార్య చనిపోయిందని డంపింగ్ యార్డుకు నిప్పు
-
చెత్తశుద్ధి కరువాయే.. భరించలేని బరువాయే
టన్నుల్లో పోగుపడి కొండల్లా పేరుకుపోతున్నచెత్త జిల్లాను వణికిస్తోంది. ఏళ్ల తరబడి డంపింగ్యార్డుల కోసం చేపట్టిన అన్వేషణ ఓ కొలిక్కిరావడం లేదు. దీంతో పాలకవర్గాలకు చెత్త నిర్వహణ తలనొప్పిగా మారింది. ఈలోగా పందులు, దోమల స్వైర విహారంతో ప్రజలు భయపడుతున్నారు. రోగాలు విజృంభిస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. స్వచ్ఛభారత్ అంటూ ప్రభుత్వాలు హడావుడి చేస్తున్నా టన్నుల్లో భారం.. కొంతైనా తరగడం లేదు. ప్రభుత్వానికి బొత్తిగా చెత్తశుద్ధిలేదంటూ ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. ఆ వివరాలు ఇలా.. నగరంలో కార్మికులపై ఒత్తిడి ఏలూరు(సెంట్రల్): నగరపాలకసంస్థ పరిధిలో మొత్తం 50 డివిజన్లలో సుమారు 55 వేల ఇళ్లు ఉన్నాయి. రోజూ సుమారు 80 టన్నుల చెత్తను పారిశుద్ధ్య కార్మికులు సేకరిస్తున్నారు. ఈ చెత్తనంతా నగర శివారు పొణింగ్ ప్రాంతంలోని 18 ఎకరాల్లో ఉన్న డంపింగ్ యార్డుకు 18 ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. 190 మంది పర్మినెంట్ సిబ్బంది ఉండగా 270 మంది కాంట్రాక్ట్ సిబ్బంది నగరంలో పారిశుద్ధ్య పనుల్లో పాల్గొంటున్నారు. ఏటా పారిశుద్ధ్య పనులకు నగరపాలక సంస్థ రూ.30 లక్షలు ఖర్చు చేస్తోంది. నగరంలో 2.12 లక్షల మంది జనాభాకు గాను చెత్త సేకరణకు ఇంకా 100 మంది అదనపు సిబ్బంది అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. యనమదుర్రు కాలువగట్టుపై.. భీమవరం టౌన్: మున్సిపాలిటీ పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చడంతో రోడ్లపై చెత్త తగ్గినప్పటికీ గొల్లవానితిప్ప రోడ్డులోని యనమదుర్రు కాలువగట్టుపై గుట్టలుగా సుమారు కిలోమీటరు దూరం దర్శనమిస్తోంది. మున్సిపాలిటీకి నిధుల కొరతలేనప్పటికీ డంపింగ్యార్డును సమకూర్చుకోలేని పరిస్థితి. 25.64 చ.కిమీ కలిగిన పట్టణంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 1,47,188 మంది జనాభా ఉన్నారు. రోజుకు 81 టన్నుల చెత్తపోగవుతోంది. 417 మంది పారిశుద్ద్య సిబ్బంది రోజుకు 78.50 టన్నుల వ్యర్థాలను తొలగిస్తున్నారు. డంపింగ్యార్డు లేకపోవడంతో సేకరించిన చెత్తను ట్రాక్టర్లలో గొల్లవానితిప్పరోడ్డులోని యనమదుర్రు కాలువగట్టుపై డంప్ చేస్తున్నారు. ఇటీవల కేంద్రం నిర్వహించిన స్వచ్చ సర్వేక్షణ సర్వేలో పట్టణానికి 87వ ర్యాంకు లభించింది. 2007లో యనమదుర్రు గ్రామంలో రూ.80 లక్షలతో 14.5 ఎకరాలను డంపింగ్యార్డు నిమిత్తం మున్సిపాలిటీ కొనుగోలు చేసింది. అయితే కొందరు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సమస్య పెండింగ్లో ఉంది. తడి పొడి.. మొక్కుబడి తణుకు : పట్టణంలో మొత్తం 34 వార్డుల నుంచి నిత్యం దాదాపు 50 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఈ చెత్తను డంపింగ్ యార్డుకు తరలించేందుకు 8 ట్రాక్టర్లు, నాలుగు ఆటోలను వినియోగిస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా తడి, పొడి చెత్తను సేకరించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. తడి, పొడి చెత్త సేకరణపై అవగాహన కల్పించడానికి పురపాలక సంఘం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా మొత్తం నాలుగు డివిజన్లలో ప్రయోగాత్మకంగా తడి, పొడి చెత్త సేకరణ కార్యక్రమం తలపెట్టారు. ఈ పరిస్థితుల్లో 2004లోనే తణుకు పట్టణంలో చెత్త నుంచి ఎరువు తయారు చేసేందుకు ప్రత్యేక యూనిట్ నెలకొల్పినప్పటికీ ప్రస్తుతం వినియోగంలో లేదు. ఇందుకోసం 9 ఎకరాల్లో డంపింగ్ యార్డు నెలకొల్పగా చెత్తను మాత్రం రీ సైక్లింగ్ చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కలగా విద్యుత్ ప్లాంట్ తాడేపల్లిగూడెం: సంవత్సరాలు గడుస్తున్నా గూడెం మున్సిపాలిటీకి డంపింగ్ కోసం స్థలం దొరకని పరిస్థితి. పట్టణంలో రోజుకు వచ్చే చెత్త 80 టన్నులు. ప్రస్తుతం చెత్తను విమానాశ్రయ భూములకు దగ్గరగా ఉన్న భూముల్లో దగ్గరగా డంప్ చేస్తున్నారు. 2014లో తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను ప్రాంతంలో మూడెకరాల 20 సెంట్ల భూమిని మున్సిపాలిటీ డంపింగ్ అవసరాల కోసం రూ.44 లక్షలు ప్రభుత్వానికి చెల్లించారు. వేస్టు ఎనర్జీ ప్లాంటు కోసం పట్టణంలో భూములను కేటాయించారు. అయినా అవి అమలులోకి రాలేదు. పైగా జిల్లాలో గుర్తించిన మునిసిపాలిటీల నుంచి చెత్తను గూడెం తరలించి, దాని నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న ప్రాజెక్టు పట్టాలు ఎక్కలేదు. ఏటా మున్సిపాలిటీ పారిశుద్ధ్య నిర్వహణకు రూ.80 లక్షలు ఖర్చు చేస్తోంది. యార్డులు ఉన్నా యాతన పాలకొల్లు సెంట్రల్: మునిసిపల్ పరిధిలో 31 వార్డులకుగాను సుమారు 80 వేల మంది జనాభా ఉన్నారు. రోజుకు 30 టన్నుల చెత్త డంపింగ్యార్డుకు చేరుతోంది. ఇక్కడ డంపింగ్యార్డులు స్థానిక యడ్లబజారు సెంటర్, రామయ్య హాలు ఏరియాల్లో ఉన్నాయి. రెండు డంపింగ్యార్డులు చెత్తతో కొండలా పేరుకుపోయాయి. ఈ చెత్తను ప్రక్షాళణ చేయడంలో అధికారులు చేతులెత్తేస్తున్నారు. చెత్తను సేకరించడానికి మునిసిపాలిటీకి 6 ట్రాక్టర్లు, 4 ఆటోలు ఉన్నాయి. పారిశుద్ధ్య పర్మినెంటు కార్మికులు 92, కాంట్రాక్ట్ కార్మికులు 77 మంది.. మొత్తం 169 మంది కార్మికులు పనిచేస్తున్నారు. జనాభా పెరుగుతున్నారు తప్ప కార్మికులు మాత్రం పెరగడంలేదు. ఇంకా వేరుకాని చెత్త జంగారెడ్డిగూడెం: నగర పంచాయతీ పరిధిలో రోజూ సుమారు 10 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. ఊరి వెలుపల ఉన్న డంపింగ్యార్డుకు దీనిని తరలిస్తున్నారు. అయితే తడిపొడి చెత్తలను ఇంకా వేరుచేయడం లేదు. పట్టణంలో 20 వార్డుల్లో చెత్తను సేకరించేందుకు మొత్తం 89 కార్మికులు ఉండగా వీరిలో 83 మంది ఔట్ సోర్సింగ్పై పనిచేస్తున్నారు. చెత్తను తరలించేందుకు 3 ట్రాక్టర్లు, ఒక ఆటో, 46 రిక్షాలు ఉన్నాయి. పారిశుద్ధ్య నిర్వహణకు నెలకు రూ.13 లక్షలు.. ఏటా రూ.కోటిన్నర వరకూ వ్యయం అవుతోంది. పట్టణంలో ఈ నెల 31 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహిస్తున్నారు. స్థలం దొరక్క ఇక్కట్లు నరసాపురం: నరసాపురంలో డంపింగ్యార్డ్ సమస్య దశాబ్దాలుగా ఉంది. 1956లో మునిసిపాలిటీ ఏర్పడింది. అప్పటి నుంచి డంపింగ్యార్డ్ లేదు. దీంతో నిబంధనలకు విరుద్దంగా గోదావరిగట్టునే చెత్తను డంప్ చేస్తున్నారు. డంపింగ్యార్డు స్థల సేకరణకు మునిసిపాలిటీ వద్ద నిధులు రూ.1.50 కోట్లు సిద్ధంగా ఉన్నాయి. రెవిన్యూ శాఖ స్థలం అన్వేషిస్తోంది. 11.275 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 31 వార్డులతో విస్తరించి ఉన్న పట్టణంలో 60 వేల జనాభా ఉంది. పట్టణంలో రోజూ 32 టన్నుల చెత్తసేకరణ జరుగుతోంది. ఇందులో 10 టన్నులు తడి చెత్త, 22 టన్నులు చెత్త లభ్యమవుతోంది. ప్రస్తుతం మునిసిపాలిటీలో శానిటరీ సెక్షన్లో 73 మంది శాశ్వత సిబ్బంది, మరో 91 మంది కాంట్రాక్ట్ వర్కర్లు పనిచేస్తున్నారు. క్రైస్తవ శ్మశానవాటికలో డంపింగ్ కొవ్వూరు: డంపింగ్యార్డు కోసం ఆరేళ్ల క్రితం నందమూరు శివారున సేకరించిన 1.96 ఎకరాల భూమి హైకోర్టు తీర్పుతో దక్కలేదు. పట్టణంలో రోజుకు సరాసరి 26 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. రాజీవ్ కాలనీలో ఉన్న ఎకరం స్థలాన్ని ప్రస్తుతం చెత్త డంపింగ్కు వినియోగిస్తున్నారు. ఆ స్థలం సరిపోవడం లేదు. దీంతో రహదారుల చెంతన, క్రిస్ట్రియన్ శ్మశాన వాటికలోను పారబోస్తున్నారు. ఏటా పారిశుద్ధ్య నిర్వహణకు సుమారు రూ.కోటి ఖర్చు చేస్తున్నారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రం రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొవ్వూరులో సేకరించే చెత్తను ఈ కేంద్రానికి తరలించాలని నిర్ణయించారు. ఈ ప్లాంటు ప్రారంభం కాకపోవడంతో సమస్యగా ఉంది. -
అన్ని పంచాయతీలకు డంప్ యార్డులు
- డీపీఓ పార్వతి - అయ్యలూరు డంప్యార్డు పరిశీలన నంద్యాలరూరల్: జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో డంప్యార్డులు నిర్మిస్తామని జిల్లా పంచాయతీ అధికారిణి పార్వతి అన్నారు. సాలిడ్æ వేస్ట్ మేనేజ్మెంట్ పథకం కింద దశల వారీగా నిర్మాణాలు చేపడతామని వెల్లడించారు. అయ్యలూరు డంప్యార్డును మంగళవారం ఆమె పరిశీలించారు. మిగిలి ఉన్న చిన్నచిన్న పనులను త్వరగా పూర్తి చేయించాలని సర్పంచ్ తప్పెట రామలక్ష్మమ్మకు సూచించారు. సాలిడ్æ వేస్ట్మేనేజ్మెంట్ పథకంతో పల్లెల్లో పారిశుధ్య సమస్య పరిష్కారమవుతుందన్నారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్త సేకరించి డంప్యార్డుకు తరలించి వర్మీ కంపోస్టు తయారు చేయిస్తామన్నారు. దీంతోపాటు సేకరించిన చెత్తలోని గాజు, ఇనుప ముక్కలు, పాత చెప్పులను వేరు చేసి డంప్యార్డు ద్వారా విక్రయించడం వల్ల పంచాయతీలకు ఆదాయం లభిస్తుందన్నారు. సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు అలసత్వం వహించకుండా డంప్యార్డుల నిర్వహణపై శ్రద్ధ పెట్టాలన్నారు. కర్నూలు డీఎల్పీఓ విజయ్కుమార్, అనంతపురం డీపీఎం బృందం, అయ్యలూరు డంప్యార్డు నిర్మాణ పనులను పరిశీలించి లోటుపాట్లపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారన్నారు. కార్యక్రమంలో ఈఓఆర్డీ మహ్మద్దౌలా, పీఎస్ అక్బర్వలి, గ్రామ నాయకులు శ్రీనివాసులు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం.. చెత్త కుప్పలో ఆధార్ కార్డులు
సాక్షి, రాజస్థాన్: అధికారుల నిర్లక్ష్యం ప్రజా సేవలకు ఎంత విఘాతం కలిగిస్తుందో మరోసారి బయటపడింది. అల్వార్ జిల్లాలోని ఓ చెత్తకుప్పలో వేల కొద్ది లెటర్లు, ఆధార్ కార్డులు దర్శనమిచ్చాయి. ఏడాదిగా వీటిని బట్వాడా చేయకుండా ఇలా పడేసినట్లు తెలుస్తోంది. గద్బసాయి అటవీ ప్రాంతంలోని డంప్ యార్డ్లో కొందరు వ్యక్తులు రెండు సంచులలో వీటిని తీసుకొచ్చి పడేశారు. అటుగా వెళ్తున్న కొందరు గ్రామస్థులు అది గమనించి థానా ఘజి పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. పోలీసులు సంచులను సోదా చేయగా వాటిలో 3000 వేల ఉత్తరాలు, 100కు పైగా ఆధార్ కార్డులు బయటపడ్డాయి. అందులోని లేఖలన్నీ సంఘనర్ గ్రామానికి చెందిన అడ్రస్లతో ఉన్నట్లు స్టేషన్ హెడ్ ఆఫీసర్ అమిత్ కుమార్ తెలిపారు. బట్వాడా చేయకుండా వీటిని పడేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఆయన అన్నారు. లేఖలు, ఆధార్ కార్డులతోపాటు పెళ్లి శుభలేఖలు కూడా అందులో ఉన్నట్లు తెలుస్తోంది. సరిస్కా ప్రాంతం పక్కనే ఉండటంతో బహుశా ఆ పోస్టల్ కార్యాలయం నుంచే ఇవి వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. విషయాన్ని పోస్టల్ ఉన్నతాధికారులకు చేరవేశామని అమిత్ వెల్లడించారు. కాగా, ఘటనపై స్పందించేందుకు పోస్టల్ శాఖ అధికారులు నిరాకరించారు. -
మియాపూర్లో నాటు బాంబు పేలుడు
హైదరాబాద్: మియాపూర్లోని డంపింగ్ యార్డులో సోమవారం మధ్యాహ్నం నాటుబాంబు పేలుడు కలకలం సృష్టించింది. డంపింగ్ యార్డులో ఒక గేదె మేత మేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు శబ్దం విన్న స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం, బాంబ్ స్క్వాడ్ లతో డంపింగ్ యార్డు పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రేపు స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోనున్న తరుణంలో నాటు బాంబు పేలుడతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు. నాటుబాంబు పేలుడును దృష్టిలో పెట్టుకుని నగరంలోని హోటళ్లు, రేల్వేస్టేషన్, బస్స్టేషన్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
చెత్తలో భారీగా రద్దైన నోట్లు
హైదరాబాద్: నగరంలోని నేరేడ్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలోని వాజ్పేయినగర్లో రైల్వేగేటు వద్ద చెత్తలో భారీగా రద్దైన నోట్లు బయటపడ్డాయి. చంద గంగుభాయి అనే మహిళకు గురువారం ఉదయం రూ. 16 లక్షల రద్దైన నోట్లు దొరికాయి. వాటిలో 1000, 500 రూపాయల నోట్లు ఉన్నాయి. ఈ విషయాన్ని ఆమె పోలీసులకు తెలిపింది. స్థానిక పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అక్కడ చెత్తవేస్తే రూ.50వేలు జరిమానా
న్యూఢిల్లీ: గంగా నది ప్రక్షాళన అంశంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రీన్ గంగా ప్రాజెక్టులో గంగా నది అంచు నుంచి 500మీటర్ల పరిధిలో ఎలాంటి చెత్తను డంప్ చేయడానికి వీల్లేదని ఆదేశించింది. అలాంటి వారికి భారీ జరిమానా విధించాల్సిందిగా గ్రీన్ ట్రిబ్యునల్ చీఫ్ జస్టిస్ స్వతంతర్ కుమార్ గురువారం ఆదేశించారు. లెదర్ పరిశ్రమలను కూడా గంగా నదికి దూరంగా తరలించాలని కూడా స్పష్టం చేసింది. హరిద్వార్-ఉన్నావ్కు మధ్య విస్తరించిన 100 మీటర్ల పరిధిలోని భూభాగాన్ని 'నో-డెవలప్మెంట్ జోన్'గా ప్రకటించింది. అంతేకాదు ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికపై రూ. 50వేల జరిమానా విధించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ సర్కార్ చేపట్టిన చర్యలతో వచ్చిన ఫలితం శూన్యమేనని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పవిత్ర గంగానది ప్రక్షాళనకు దాదాపు రూ. 7,304 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఫలితం శూన్యమని తన ఆదేశాల్లో వ్యాఖ్యానించింది. ఈ పథకం రూపకల్పన అమలులో ప్రాథమికంగానే లోపాలు ఉన్నాయి అని ఎన్జీటీ తెలిపింది. కాగా ఉత్తరాఖండ్లోని హరిద్వార్, ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ మధ్య గంగా నదిలోకి వెలువడుతున్న పారిశ్రామిక కాలుష్యాలకు సంబంధించిన నివేదికలను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలో తీసుకున్నారో తెలపాలని పర్యావరణ, అటవీ, జల వనరుల మంత్రిత్వశాఖలకు, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, ఇతర సంస్థలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
46 బోగీల్లోని ఉల్లిపాయలు మాయం
బెంగళూరు రూరల్ జిల్లాలో ఘటన దొడ్డబళ్లాపురం (కర్ణాటక): కర్ణాటకలో ఉల్లిపాయల లోడుతో వెళుతున్న 46 బోగీల గూడ్సు రైలు లూటీకి గురైంది. ఈ ఘటన బెంగళూరు రూరల్ జిల్లా నెలమంగల సమీపంలోని బసవనహళ్లి రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన బడా వ్యాపారులు ఉల్లిలోడును బీహార్కు తీసుకెళ్లారు. అవి నాసిరకంగా ఉండటంతో వాటిని కొనుగోలు చేసేందుకు అక్కడి వ్యాపారులు నిరాకరించారు. దీంతో ఆ ఉల్లిని గూడ్సురైలులో నెలమంగల వద్ద ఉన్న డంపింగ్ యార్డుకు తరలిస్తుండగా.. బసవనహల్లి రైల్వే స్టేషన్ వద్ద రెడ్ సిగ్నల్ పడింది. దీంతో రైలును నిలిపివేశారు. కాగా, ఉల్లిగడ్డలను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న సమీప గ్రామాల ప్రజలు తండోపతండాలుగా బసవనహల్లి రైల్వే స్టేషన్కు వచ్చారు. గూడ్స్ రైలు బోగీల తలుపులు తెరిచి ఆ ఉల్లిమూటలను బైక్లపై, ఇతర వాహనాల్లో తీసుకువెళ్లిపోయారు. -
ఖర్చు బారెడు ఫలితం జానెడు..
♦ పారిశుద్ధ్యం పేరుతో చేతివాటం ♦ నగరానికి డంపింగ్యార్డు కష్టాలు నెల్లూరు(పొగతోట): నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్యం మెరుగుకు కోట్లు ఖర్చుచేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉండడంలేదు. నగరంలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలు దరశనమిస్తున్నాయి. కార్పొరేషన్ పరిధిలో సరైన డంపింగ్యార్డు అందుబాటులో లేని కారణంగా నిత్యం టన్నుల కొద్ది చెత్త నగరంలో నిలిచిపోతోంది. అంతేకాక డంపింగ్యార్డు నగరానికి దూరంగా ఉండడంతో చెత్తను తరలించడంలో జాప్యం జరుగుతోంది. ఫలితంగా నగరంలోని ఆచారివీధి, పొగతోట, వేదా యపాళెం ప్రాంతాల్లో చెత్త కుప్పలు దర్శ నమిస్తున్నాయి. నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంతాలి వద్ద 12 ఎకరాల విస్తీర్ణంలో డంపింగ్యార్డు ఏర్పాటు చేశారు. నగరంలో ఉత్పత్తయిన చెత్తను రెండు దశల్లో డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో సుమారు 8 లక్షల మంది నివశిస్తున్నారు. దాదాపు 1.50 లక్షల నివాస గృహాలు ఉన్నాయి. వాటితో పాటు వందల సంఖ్యలో ఆస్పత్రులు, హోటళ్లు ఉన్నాయి. నిత్యం 350 ట న్నులకు పైగా చెత్త ఉత్పత్తి అవుతోంది. కాగా చెత్తను తరలించేందుకు 20 టి ప్పర్లు, 4 ట్రాక్టర్లు, 54 ఆటోలు, 5 డంపర్లను కార్పొరేషన్ అధికారులు వినియోగిస్తున్నారు. 1500 మంది పారిశుద్ధ్య కార్మికులు నిత్యం పని చేస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం రెండు డంపింగ్యార్డులను ఉపయోగిస్తున్నా రు. నగరంలో ఉత్పత్తయిన చెత్తను మొ దట వాహనాల ద్వారా బోడిగాడితోట లోని డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. అనంతరం అక్కడి నుంచి దొంతలిలో ఏర్పాటు చేసిన డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. ఇలా రెండు దశల్లో తరలిం చడం వల్ల ఖర్చులు అధికమవుతున్నా యి. వాహనాలకు డీజిల్, కార్మికులకు వేతనాలు తడిసి మోపెడవుతున్నాయి. కాగా చెత్త తరలింపులో అధికారులు చేతి వాటం ప్రదర్శించి నగదు స్వాహా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికులు పనికి రాకపోయిన వచ్చి నట్లు మస్టర్లు వేసి నగదు మింగేస్తున్నారు. అలాగే వినియోగించని వాహనాల నుంచి డీజిల్ డ్రా చేసి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో చెత్తను తరలించిన తర్వాత బ్లీచింగ్ చేయడంలేదు. ఫలితంగా దోమలు ఉత్పత్తై ప్రజలు రోగాల భారిన పడుతున్నారు. గతంలో ఆల్లీపురం సమీపంలో బైపాసురోడ్డుకు పక్కన డంపింగ్యార్డు ఏర్పా టు చేశారు. దానిని ప్రస్తుతం వినియోగించడంలేదు. అలాగే ఇంటింటా చెత్త సేకరణ ప్రక్రియ సక్రమంగా జరగడంలేదు. అరంభంలో ఆటోల్లో మైకులు పెట్టి ప్రచారం చేసి చెత్త సేకరించారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఇంటింటా చెత్తను సేకరించే పారిశుద్ధ్య కార్మికులు గృహాల యాజమానుల నుంచి నెలకు రూ.30 నుంచి 50 వసూలు చేస్తున్నారు. చెత్తను తరలించే వాహనాలు పాతవి కావడంతో వాటిలో వేసిన చెత్త జారీ రోడ్డుపై పడిపోతోంది. -
పోరాటం ఫలప్రదం
►ఫలించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి దీక్ష ►చర్చలకు ఎంపీ శివప్రసాద్ చొరవ మంత్రి, ఎంపీ, కలెక్టర్ చర్చలు ►జిందాల్ ప్లాంట్ రామాపురంపరిసరాల్లో ఏర్పాటు చేయం: మంత్రి అమరనాథరెడ్డి ►డంపింగ్ యార్డును తరలిస్తాం:జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ►ఎమ్మెల్యేతో దీక్ష విరమింపజేసిన రామాపురం మహిళలు కేసీపేట(తిరుపతి రూరల్): ప్రజామద్దతు తోడుగా అంకిత భావంతో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చేపట్టిన దీక్షకు ప్రభుత్వం స్పందించింది. ఏళ్ల తరబడి వేధిస్తున్న సమస్యను పరిష్కరిస్తామని మంత్రి అమరనాథరెడ్డి, ఎంపీ శివప్రసాద్, కలెక్టర్ ప్రద్యుమ్న ప్రకటించారు. జిందాల్ ప్లాంట్ను సైతం రామాపురం పరిసరాల్లో ఏర్పాటు చేసేది లేదని స్పష్టం చేశారు. చెత్త బాధిత గ్రామాల్లో వైద్య సేవలు మెరుగుపరస్తామని, మినరల్ వాటర్ అందిస్తామని, అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ఐదు రోజులుగా చేస్తున్న నిరవధిక నిరాహారదీక్షను గురువారం ఎంపీ శివప్రసాద్ సమక్షంలో రామాపురం మహిళలు నిమ్మరసం ఇచ్చి చెవిరెడ్డి చేత విరమింపజేశారు. డంపింగ్ యార్డు బాధిత గ్రామాల్లోఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. సమన్వయం చేసిన ఎంపీ శివప్రసాద్ డంపింగ్ యార్డును తరలించాలని, చెత్త ప్లాంట్ను రామాపురం పరిసరాల్లో ఏర్పాటు చేయవద్దని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డిని గురువారం ఉదయం ప్రభుత్వ వైద్యులు పరీక్షించారు. పరిస్థితి విషమంగా ఉందని ప్రకటించారు. దీంతో స్థానిక ఎంపీ డాక్టర్ శివప్రసాద్ స్పందించారు. మంత్రి అమరనాథరెడ్డి, కలెక్టర్, కమిషనర్తో మాట్లాడారు. దీక్ష శిబిరం వద్దకు వచ్చి చర్చలకు రావాలని ఎమ్మెల్యే చెవిరెడ్డిని ఒప్పించారు. గురువారం మధ్యాహ్నం తిరుపతి పద్మావతీ అతిథి గృహంలో ఎమ్మెల్యే చెవిరెడ్డితో మంత్రి అమరనాథరెడ్డి, ఎంపీ శివప్రసాద్, కలెక్టర్ ప్రద్యుమ్న, కమిషనర్ హరికిరణ్, అర్బన్ ఎస్పీ విజయారావు రెండు గంటల పాటు చర్చలు జరిపారు. డంపింగ్ యార్డు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారు రోడ్డెక్కి పోరాడడానికి కారణాలను మంత్రి, ఎంపీ, అధికారులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి వివరించారు. పరిష్కార మార్గాలను కూడా సూచించారు. డిమాండ్లకు మంత్రి, ఎంపీ, అధికారులు అంగీకరించారు. ఎమ్మెల్యే, బాధిత ప్రజలు డిమాండ్ చేసినట్లు చెత్త నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసే ప్లాంట్ను రామాపురం పరిసరాల్లో ఏర్పాటు చేయబోమని మంత్రి ప్రకటించారు. డంపింగ్ యార్డును వేరొక ప్రాంతానికి తరలిస్తామన్నారు. డంపింగ్ యార్డు వల్ల పూడిపోయిన కాలువను శుభ్రం చేయడమే కాకుండా శుభ్రమైన వర్షపు నీళ్లు చెరువుకు వెళ్లేలా చేస్తామన్నారు. -
నగరానికి ఏమైంది?
ఒకవైపు పొగ.. మరోవైపు కాలుష్యం తప్పుదు భారీ మూల్యం అనంతపురం సమీపంలోని గుత్తిరోడ్డు పక్కన ఉన్న డంపింగ్ యార్డుతో చుట్టుపక్కల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యార్డు నుంచి వచ్చే పొగ, కాలుష్యం ధాటికి ప్రజలు శ్వాసకోశవ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా గుత్తి రోడ్డులో ఎదురుగా వచ్చే వాహనాలు కనపడకపోవడంతో డ్రైవర్లు పగలు కూడా లైట్లు వేసుకుని వెళ్తున్నారు. అయినా పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న గోడౌన్లు, కళ్యాణమండపాలు, పొగ దెబ్బకు మూతపడుతున్నాయి. అధికారులు స్పందించి డంపింగ్ యార్డును మరో ప్రాంతానికి మార్చాలని ప్రజలు వాపోతున్నారు. - సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
జైలుకు పంపి.. ఏ మొహం పెట్టుకుని వచ్చారు?
సీరామాపురం(తిరుపతి రూరల్): ‘‘పచ్చని పల్లెల్లో అధికారులే చిచ్చు పెడుతున్నారు..అతి తెలివితో సమస్యను జఠిలం చేశారు.. ఊరినంతా రోడ్డుపైకి తీసుకువచ్చారు.. అర్ధరాత్రి ఇళ్లలోకి దూరి చిన్నా, పెద్ద, మహిళలు అనే తేడా లేకుండా అందరినీ జైలుకు పంపారు.. మా వారిని జైలుకు పంపి ఏ మొహం పెట్టుకుని ఊర్లోకి వచ్చా రు..’’ అంటూ రామాపురం డంపింగ్ యార్డు బాధిత గ్రామాల ప్రజలు కలెక్టర్ ప్రద్యుమ్నను నిలదీశారు. ‘మీరు ఏం చెప్పాలన్నా మాకోసం జైలుకు వెళ్లిన ఎమ్మెల్యే చెవిరెడ్డితో పాటు మావాళ్లు వచ్చాకే ఊర్లోకి వచ్చి చెప్పండి.. అప్పటి వరకు మీరు చెప్పేది మేం వినేది లేదు’ అంటూ అధికారుల ప్రసంగాలను అడ్డుకున్నా రు. డంపింగ్ యార్డును తొలగించాల ని, అక్రమంగా అరెస్ట్ చేసిన ఎమ్మెల్యే చెవిరెడ్డిని, గ్రామస్తులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రామాపు రం గ్రామానికి చెందిన మహిళలు రెండు రోజులుగా రిలే నిరాహారదీక్షలను చేపట్టి చెత్త వాహనాలను అడ్డుకుంటున్నారు. 144 సెక్షన్ పెట్టినా బెదరకుండా ర్యాలీలు, దీక్షలను కొనసాగిస్తున్నారు. మహిళల దీక్షతో కలెక్టర్ ప్రద్యుమ్న, చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్, కార్పొరేషన్ కమిషనర్ హరికిరణ్, మాజీ ఎమ్మెల్యే అరుణకుమారి ఆదివారం మధ్యాహ్నం దీక్ష శిబి రం వద్దకు వచ్చారు. గ్రామస్తులతో చర్చలు జరిపేందుకు ప్రయత్నించా రు. వారిని మహిళలు అడ్డుకున్నారు. జైలులో పెట్టినా కనీసం ఎందుకు పరామర్శించలేదని గల్లా అరుణకుమారిని రామాపురం మహిళలు నిలదీశారు. గ్రామంలో కలెక్టర్ను నడిపిం చారు. భూగర్భజలాలు కాలుష్యమయ్యాయని, బోరు కొట్టి రంగుమారిన నీళ్లను బాటిళ్లలో పట్టి మరీ చూపించారు. ‘ఈ నీళ్లు మీరు తాగండి’ అంటూ కలెక్టర్కు ఇచ్చారు. కమిషనర్ వల్లే సమస్య.. తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ వల్లే గ్రామం మొత్తం రోడ్డు ఎక్కాల్సి వచ్చిం దని డంపింగ్ యార్డు బాధిత గ్రామాల ప్రజలు మండిపడ్డారు. కమిషనర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దొంగచాటుగా సమావేశాలు నిర్వహించాల్సిన అవస రం ఎందుకువచ్చిందని నిలదీశారు. కొ ద్దిసేపు అక్కడ గందరగోళం నెలకొంది. మాట తప్పితే మీతోపాటే వచ్చి ఉద్యమిస్తా: ఎంపీ శివప్రసాద్ ‘గ్రామంలో ప్లాంటు ఏర్పాటును నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. కాదు కూడదని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తే మీతో పాటే రోడ్డు ఎక్కుతా. మీ గొంతుకగా నిలుస్తానని’ చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ‘అఖిలపక్షం పేరుతో తిరుపతిలో చేసిన నాటకాలు నాకుతెలియవు, నన్ను నమ్మం డి’ అంటూ గ్రామస్తులను కోరారు. పవర్ లేదు : అరుణకుమారి ‘నేను మంత్రిగా ఉన్నప్పుడే సమస్య మొ దలైంది. మూడు నెలల్లో పరిష్కరిస్తామన్న అధికారులు పట్టించుకోలేదు. ఇప్పు డు నా దగ్గర పవర్ లేదు. ఇప్పటికిప్పుడు సమస్యను పరిష్కరించాలంటే ఎలా..? హాంఫట్ అంటే సమస్య పరిష్కరం కా దు’.. అంటూ మాజీ ఎమ్మెల్యే అరుణకుమారి గ్రామస్తులపై మండిపడ్డారు. కమిషనర్ను గ్రామస్తులు వ్యతిరేస్తుంటే ఆమె మాత్రం బాగా కష్టపడుతున్నాడు అంటూ పొగడ్త్తలతో ముంచెత్తారు. దీంతో గ్రామస్తులు మండిపడ్డారు. -
ప్రశ్నిస్తే సంకెళ్లా..
►ఎమ్మెల్యే చెవిరెడ్డితో పాటు 120 మంది గ్రామస్తుల అక్రమ అరెస్ట్ ►రోజంతా ఎమ్మెల్యేను స్టేషన్లకు తిప్పిన పోలీసులు ►నియోజకవర్గ వ్యాప్తంగా పెల్లుబుకిన నిరసనలు ►20గంటల పోలీస్ స్టేషన్లోనే మహిళలు ►అక్రమ అరెస్ట్లపై భగ్గు మన్న జనం, పార్టీ శ్రేణులు ►గ్రామానికి వచ్చి క్యాండిల్ ర్యాలీ, రాస్తారోకో డంపింగ్యార్డు తరలించి తమ ఆరోగ్యం కాపాడాలంటూ రామాపురం పరిసర గ్రామల ప్రజలు చేస్తున్న ఆందోళనపై సర్కారు ఉక్కు పాదం మోపింది. అర్ధరాత్రి దాటాక అరెస్టులకు పూనుకుంది. కనీసం మహిళలనే విచక్షణ లేకుండా బలవంతంగా లాక్కుపోయారు. వీరిపక్షాన పోరాడుతున్న చంద్రగిరి ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ పోలీసులు ఆయన్ను జిల్లాలో స్టేషన్లు తిప్పుతూ అరాచక వైఖరిని ప్రదర్శించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా జిల్లావ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది. అక్రమ అరెస్టులను ఖండిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తిరుపతి రూరల్: రామచంద్రాపురం మండలం లోని రామాపురంలో గురువారం అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. తిరుపతి రూరల్, రామాచంద్రాపురం మండలాల్లోని 11 గ్రామాల్లోని వే లాది మంది ప్రజలకు ఏళ్ల తరబడి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న డంపింగ్ యార్డును తరలించాలని డిమాండ్ చేస్తూ చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. గ్రామస్తులతో కలిసి మూడు రోజులు గా శాంతియుతంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి నిరసనను కొనసాగిస్తున్నారు. అర్ధరాత్రి దాటాక ఒంటిగంటన్నర ప్రాంతంలో ఇద్దరు ఏఎస్పీలు, ఐదుగురు డీఎస్పీలు, ఏడుగురు సీఐలు, పది మంది ఎస్ఐలు, 200 మంది పోలీసులు నిరసన శిబిరాన్ని చుట్టుముట్టారు. రోడ్డుపైనే నిద్రి స్తున్న 120 మందికి పైగా గ్రామస్తులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. స్థానికులు తీవ్రం గా ప్రతిఘటించారు. శిబిరాన్ని కూల్చివేశారు. అడ్డుకున్న వారి పట్ల దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల సహకారంతో చివరకు వారిని అరెస్ట్ చేసి తిరుపతి ఈస్ట్, ముత్యాలరెడ్డిపల్లి పోలీ స్స్టేషన్లకు తరలించారు. తొమ్మిది గంటల పాటు హైటెన్షన్.. పోలీసులు వస్తున్నారని ముందుగానే గుర్తిం చిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని గ్రామస్తులు ఓ ఇంటిలో ఉంచారు. లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడిని ఇంటిలో ఉండగా పోలీసులు దౌర్జన్యంగా అరెస్ట్ చేయడానికి వీలులేదు. దీంతో పోలీసులు వెనకడుగు వేశారు. తొమ్మిది గం టల పాటు రామాపురంలో హైటెన్షన్ నడిచింది. గ్రామస్తులను అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా ఎమ్మెల్యేని సైతం బలవంతంగా అరెస్ట్ చేసేందుకు వందల మంది పోలీసులు చేస్తున్న ప్రయత్నాలపై డంపింగ్ యార్డు బాధిత గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాపురం సర్కిల్ల్లో రాస్తారోకో చేపట్టారు. తహసీల్దార్ వచ్చి...144 సెక్షన్ పెట్టి.... ఇంటిలో ఉన్న ఎమ్మెల్యే చెవిరెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు మండల మెజిస్ట్రేట్ హోదా లో ఉన్న తహసీల్దార్ భాగ్యలక్ష్మిని ఆశ్రయిం చారు. ఆమె వచ్చి 144 సెక్షన్ విధించారు. తహసీల్దార్ పర్యవేక్షణలో ఎమ్మెల్యేను అరెస్ట్ చేసేం దుకు ప్రయత్నించారు. పెద్ద సంఖ్యలో చేరుకున్న గ్రామస్తులు ఎమ్మెల్యే అరెస్ట్ను నిరసిస్తూ అడ్డుకున్నారు. మహిళలని కూడా చూడకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించి నెట్టివేసి ఎమ్మెల్యే చెవిరెడ్డిని బలవంతంగా కారులో బుచ్చినాయుడుకండ్రిగకు, తర్వాత తొట్టం బేడు, శ్రీకాళహస్తి రూరల్, రేణిగుంట మీదుగా పుత్తూరుకు తీసుకెళ్లారు. ఇదిలా వుండగా బీఎన్ కండ్రిగలో చెవిరెడ్డిని ఎంపీ వరప్రసాద రావు కలవడానికి ప్రయత్నించినా ఆయన అంగీకరించలేదు. డంపింగ్ యార్డు తరలింపు ఒక్కటే తన డిమాండ్ అని స్పష్టం చేసినట్లు తెలిసింది. మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు దాదాపు 20 గంటల పాటు ఎంఆర్పల్లి పోలీ స్స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్ నుంచి విడుదలయిన మహిళలు గ్రామంలోకి వచ్చి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. చెవిరెడ్డి అక్రమ అరెస్ట్ను వ్యతిరేకిస్తూ గ్రామంలో ర్యాలీ చేసి, డంపింగ్ యార్డుకు వచ్చే తిరుపతి చెత్త వాహనాలను అడ్డుకుని రాస్తారోకో చేశారు. -
మనుషులుగా చూడండి
⇒అధికారుల బాధ్యతారాహిత్యమే సమస్యకు మూలకారణం ⇒తిరుపతిలోనే చెత్త ఉండాలని కోరుకోవడం లేదు ⇒ప్రజలకు, పల్లెలకు దూరంగా డంపింగ్ యార్డు పెట్టాలి ⇒సమస్యను పెద్ద మనస్సుతో ఆలోచించండి ⇒తిరుపతి ప్రజలకు ఎమ్మెల్యే చెవిరెడ్డి వినతి తిరుపతి రూరల్: రామాపురంలోని డంపింగ్యార్డును తరలించాలని గ్రామస్తులతో కలిసి రోడ్డుపైనే బైఠాయించి ఎమ్మెల్యే చెవిరెడ్డి చేపట్టిన నిరవధిక నిరసన బుధవా రం రెండో రోజు కూడా కొనసాగింది. సా యంత్రం నిరసన శిబిరం వద్ద ఆయన విలేకరుల సమావేశంలో గ్రామస్తులతో కలిసి మాట్లాడారు. రామాపురంలోని డంపింగ్ యార్డు తరలించాలని ఇక్కడ ప్రజలు ఐదేళ్లుగా పోరాడుతున్నారన్నారు. ఈ అందోళనల నేపథ్యంలోనే 2012లో తిరుపతి కమిషనర్, అడిషనల్ కమిషనర్, హెల్త్ ఆఫీసర్ విచా రించి, సమస్య తీవ్రతను గుర్తించి, మూడు నెలల్లో యార్డును తరలిస్తామని రాతపూర్వకంగా ఇచ్చింది వాస్తవమా, కాదా అని ప్రశ్నించారు. ఐదేళ్లు అయినా ఎందుకు తరలించలేదో...కనీసం ప్రయత్నం కూడా ఎం దుకు చేయలేదో కార్పొరేషన్ అధికారులు తిరుపతి ప్రజలకు సమాధానం చెప్పాలన్నా రు. బోరులోని నీటిని పబ్లిక్ హెల్త్ విభాగం పరీక్షించగా బ్యాక్టీరియా ఉందని, తాగడానికి పనికిరావని ల్యాబ్ అధికారులు నిర్థారించిం ది వాస్తవమా, కాదా? అన్నారు. ప్రభుత్వ వైద్యా«ధికారులు ఇచ్చిన నివేదిక కారణంగానే నాటి జిల్లా కలెక్టర్ తిరుపతి డివిజన్ పరిధిలోని ప్రజలకు దూరంగా 50 ఎకరాల స్థలాన్ని సేకరించి అక్కడికి యార్డును తరలించాలని మున్సిపల్, రెవెన్యూ అధికారులను అధికారిక ఉత్తర్వుల్లో ఆదేశించిన విషయాన్ని తిరుపతి ప్రజలకు తెలపకుండా ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. ‘ఆసుపత్రి, మాంస వ్యర్థాలు, కోళ్లు, కుక్కలు, జంతు కళేబరాలు, అనాథ శవాలతో కూడిన రోజుకు 178 టన్నుల చెత్తను మా గ్రామాల మధ్య వేస్తుంటే భరించమంటారా? మీరే న్యాయం చెప్పండంటూ తిరుపతి ప్రజలకు విన్నవించుకుంటున్నానన్నారు. ‘మా గ్రామాల్లో చెత్తవేయకండంటే తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మండిపడుతున్నారు. ఎక్కువ మాట్లాడితే గ్రామ ప్రజలను జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారు. ఇది న్యాయమా? తిరుపతి ప్రజలు ఆలోచించాలన్నారు. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం వీడి, రాజకీయ ఎత్తుగడలు, బెదిరింపులు మాని రెండు నియోజకవర్గల్లోని చెత్త సమస్యను సృష్టించాలనే ఆలోచనలు వీడాలన్నారు. ప్రజలకు, పల్లెలకు దూరంగా డంపింగ్ యార్డుని ఏర్పాటు చేయాలని, తిరుపతి ప్రజలు పెద్ద మనస్సుతో సమస్యను అర్థం చేసుకోవాలని చెవిరెడ్డి కోరారు. -
డంపింగ్ యార్డు వద్దంటూ రాస్తారోకో
రామచంద్రాపురం: రామచంద్రాపురం మండలం సి.రామాపురం గ్రామంలో డంపింగ్ యార్డ్ వద్దంటూ గ్రామస్థులు రాస్తారాకో నిర్వహించారు. వీరికి చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్దతు పలికారు. రోడ్డుపై వేసిన చెత్తను గ్రామస్థులు, ఎమ్మెల్యే చెవిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. డంపింగ్ యార్డ్ ఇక్కడి నుంచి తరలించే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. అనంతరం పలువురు గ్రామస్థులు మాట్లాడుతూ తిరుపతి చెత్త మాకొద్దని, మా గ్రామానికి చెత్త తీసుకొస్తె సహించేది లేదని స్పష్టం చేశారు. -
రగులుతున్న రామాపురం
► డంపింగ్ యార్డు తొలగింపు కోరుతూ ఆందోళన ► కంపోస్టు వాహనాలు రాకూడదంటూ బైఠాయింపు ► గ్రామస్తులకు ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి మద్దతు ► రంగంలోకి దిగిన పోలీసులు, వెనక్కి తగ్గేది లేదంటున్న గ్రామస్తులు రామచంద్రాపురం మండలం రామాపురం డంపింగ్ యార్డు సమస్యతో రగిలిపోతోంది. పక్కనే ఉన్న తిరుపతి నగరపాలక సంస్థ డంపింగ్ యార్డును వెంటనే ఎత్తేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రెండు రోజులుగా తిరుపతి కార్పొరేషన్ వాహనాలు రాకుండా అడ్డుకుంటున్నారు. కుప్పలు కుప్పలుగా పెరిగిన కంపోస్టు కారణంగా జనం రోగాల బారిన పడి ఊరి మనుగడే ప్రశ్నార్థకమైందని గ్రామస్తులు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం గ్రామాన్ని సందర్శించిన ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, నారాయణస్వామి గ్రామస్తులకు మద్దతు పలికి డంపింగ్ యార్డును ఎత్తేయాలని డిమాండ్ చేశారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుపతికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాపురం పక్కనే తిరుపతి నగరపాలక సంస్థ డంపింగ్ యార్డు ఉంది. నగరంలోని చెత్తాచెదారం, ఇతరత్రా వ్యర్థపదార్థాలను లారీల్లో తెచ్చి ఇక్కడే అన్లోడ్ చేస్తుంటారు. ఇది 12 ఏళ్లుగా జరుగుతోంది. తిరుపతి నుంచి కంపోస్టు లోడ్తో వెళ్లే మున్సిపల్ వాహనాలన్నీ రామాపురం మీదగానే యార్డుకు వెళతాయి. తమ గ్రామం పక్కనున్న డంపింగ్యార్డును ఎత్తేసి మరో చోట పెట్టుకోవాలని గ్రామస్తులు రెండేళ్లుగా అడుగుతున్నారు. డంపింగ్యార్డు వల్ల గ్రామస్తులు త్వరగా రోగాల బారిన పడుతున్నారనీ, తరచూ జ్వరాలు, విరేచనాలు అవుతున్నాయనీ, ఎంతో మందికి డెంగీ జ్వరాలు కూడా వచ్చాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు గ్రామంలోని భూగర్భ జలాలను పరీక్షించిన క్లినికల్ లేబొరేటరీ సిబ్బంది కలుషితమైన నీటిపై నివేదిక ఇచ్చారు. భూగర్భ జలాలు తాగితే ప్రమాదమని హెచ్చరించారు కూడా. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన గ్రామస్తులు ఇటీవల మరోసారి అధికారులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధం డంపింగ్ యార్డు దగ్గర 6 మెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల వేస్ట్ ఎనర్జీ ప్లాంటును నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం గతంలో శంకుస్థాపనలు కూడా జరిగాయి. మరో వారంలో పనులు మొదలు కావాల్సి ఉంది. ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే రోజుకు 600 టన్నుల కంపోస్టును తీసుకుని విద్యుదుత్పత్తి చేస్తారు. అయితే ప్లాంట్ నిర్మాణం జరిగితే భవిష్యత్తులో ఎప్పుడూ డంపింగ్ యార్డును తొలగించబోరని గ్రామస్తులు గుర్తించారు. దీంతో రెండు రోజుల నుంచి ఆందోళనకు సిద్ధమయ్యారు. బుధ, గురువారాల్లో కంపోస్టు వాహనాలను అడ్డుకుని రోడ్లమీదనే పోయించారు. గ్రామానికి చెందిన 20 మందికి పైగా మహిళలు నిరసన వ్యక్తం చేస్తూ రోడ్లు మీదనే బైఠాయిస్తున్నారు. ఏం సమాధానం చెప్పాలో తెలియక తహసీల్దార్ భాగ్యలక్ష్మి సతమతమవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డంపింగ్ యార్డును తొలగించి మరో చోట పెట్టుకోవాలన్నదే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి వాదన. ఇందుకోసం ఎందాకైనా వెళతానని ఆయన స్పష్టం చేస్తున్నారు. డంపింగ్ యార్డు ఎత్తేయాల్సిందే మున్సిపల్ డంపింగ్ యార్డును తక్షణమే అక్కడి నుంచి తొలగించి, ప్రత్యామ్నాయ స్థలాన్ని ఎంపిక చేసుకోవా లని ఎంపీ విజయసాయిరెడ్డి అధికారులకు సూచించా రు. డంపింగ్ యార్డు కారణంగా రామాపురంవాసుల ఆరోగ్యం దెబ్బతింటోందనీ, భూగర్భ జలాలు మొత్తం కలుషితమై జనం రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. డంపింగ్ యార్డును వెంటనే అక్కడి నుంచి తొలగించాలని ఎంపీ డిమాండ్ చేశారు. గురువారం మధ్యాహ్నం ఎమ్మెల్యే చెవిరెడ్డితో పాటు ఆయన రామాపురం వెళ్లి గ్రామస్తులతో మాట్లాడారు. డంపింగ్ యార్డు వల్ల గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే చెవిరెడ్డి ఎంపీకి వివరించారు. కంపోస్టు యార్డు వల్ల 15 ఏళ్లుగా పడుతున్న ఇక్కట్లను, దెబ్బతింటున్న ఆరోగ్యాన్ని మహిళలు కూడా విశదీకరించారు. దీనిపై మున్సిపల్ అధికారులతో మాట్లాడతానని విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు. డీఎస్పీ నంజుండప్పతోనూ, తహసీల్దార్ భాగ్యలక్ష్మితోనూ ఎంపీ మాట్లాడారు. ఆయన వెంట ఎమ్మెల్యే నారాయణస్వామి, వైఎస్సార్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు చొక్కారెడ్డి జగదీశ్వర్రెడ్డి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి విడుదల మాధవరెడ్డి ఉన్నారు. ప్రజలను ఇబ్బందిపెట్టే ప్రసక్తే లేదు... ఎప్పుడో పన్నెండేళ్ల కిందట ప్రభుత్వం దుర్గసముద్రం, రామాపురం గ్రామాల మధ్య 25 ఎకరాల స్థలాన్ని కార్పొరేషన్కు అప్పగించింది. అప్పట్లో డంపింగ్ యార్డును అక్కడే ఖరారు చేశారు. అప్పటి నుంచీ కంపోస్టును అక్కడే డంప్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో గ్రామస్తులకు ఇబ్బందికరమైతే ప్రత్యామ్నాయంగా యార్డు చుట్టూ స్ట్రెంచ్ తీయడం, లేదా పవర్ జనరేషన్ కోసం వినియోగించడం జరగాలి. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పూర్తయితే చెత్తాచెదారం నిల్వ ఉండే ప్రసక్తి లేదు. ఇందుకోసం మరోసారి గ్రామస్తులు, రాజకీయ నాయకులతో చర్చించాల్సి ఉంది. – హరికిరణ్, కమిషనర్, తిరుపతి కార్పొరేషన్ -
కరీంనగర్ టు హైదరాబాద్...!
- కొత్తపల్లి వాగు నుంచి ఇసుక రవాణా - సీసీ కెమెరాలు లేకుండా తవ్వకాలు - యథేచ్ఛగా యంత్రాల వినియోగం - టీఎస్ఎండీసీ ముసుగులో అక్రమ దందా - రోజుకు 500లకు పైగా లారీల్లో రవాణా - ఓవర్లోడ్ను పట్టించుకోని అధికారులు సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట– కొత్తపల్లి శివారు వాగు నుంచి ఇసుక అక్రమమార్గం పడుతోంది. తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) నిబంధనలకు వక్రభాష్యం చెబుతూ డంపింగ్ యార్డులు లేకుండా ఏకంగా కొత్తపల్లి వాగులోనే యంత్రాలు పెట్టి ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఇసుక తవ్వకాలు జరుపుతున్న ప్రదేశం సీసీ కెమెరాల నిఘాలో ఉండాల్సి ఉండగా, ఆ నిబంధనలను పట్టించుకోవడం లేదు. టీఎస్ఎండీసీ, కాంట్రాక్టర్లు కుమ్ముక్కై లారీల్లో పరిమితులను మించి ఇసుక నింపుతూ అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక తవ్వకాలు జరపాల్సి ఉండగా.. పొద్దంతా కొత్తపల్లి సమీపంలోని రామంచకు తరలించి అక్కడి నుంచి అర్ధరాత్రి వరకు కూడా రవాణా సాగిస్తున్నారు. ఇలా రోజుకు 400 నుంచి 500 లారీల్లో కరీంనగర్ నుంచి హైదరాబాద్, సిద్దిపేట, కరీంనగర్లకు ఇసుక అక్రమమార్గం పడుతోంది. ప్రభుత్వ ఖజానాకు రూ.లక్షల్లో గండి.... కరీంనగర్ జిల్లా కొత్తపల్లి శివారు మానేరువాగు నుంచి ఏప్రిల్ 11 నుంచి ఇసుక తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇసుక రీచ్ను రేణికుంట బ్రిడ్జికి 500 మీటర్ల దూరంలో తవ్వాలి. వాగులో ఉన్న మొత్తం ఇసుకలో కేవలం 30 శాతం మాత్రమే తొలగించాలి. ఇసుక తవ్వకాలు, రవాణా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యనే సీసీ కెమెరాల నిఘాలో చేయాలి. ఇసుక తవ్వకాల సమయంలో సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి కాగా, రాత్రిపూట ఇసుక రవాణా నేరం. ప్రతీ ఆదివారం ఇసుకు రీచ్కు సెలవు. అయితే, టీఎస్ఎండీసీ, కాంట్రాక్టర్లు ఇవేమీ పట్టించుకోవడం లేదు. ఇసుక తవ్వకాలు, రవాణాను నిరంతరం పర్యవేక్షించాల్సిన రెవెన్యూ, భూగర్భ జలవనరుల శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఎడాపెడా ఇష్టారాజ్యంగా వాగులో తవ్వకాలు జరుపుతుండటంతో సమీప గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే ఇన్టెక్వెల్ పైపులైను బయటపడగా, భూగర్భజలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదంతా జరుగుతున్నా టీఎస్ఎండీసీ, ఇతర శాఖలు ప్రేక్షకపాత్ర వహిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా ఇసుక రవాణా.. కొత్తపల్లి క్వారీ నుంచి తీసే ఇసుక క్యూబిక్ మీటర్కు రూ.550లుగా ప్రభు త్వం ధర నిర్ణయించింది. ఈ మేరకు ‘మీ సేవ’కేంద్రాల్లో అవసరమున్న మేరకు డబ్బులు చెల్లించిన వారికి కొత్తపల్లి వాగు నుంచి కాంట్రాక్టర్లు ఇసుక సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం వాగు సమీపంలో ఇసుక నిల్వచేసేందుకు డంపింగ్ యార్డు కోసం ప్రభుత్వం స్థలం కేటాయించింది. ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డుకు ఇసుకను చేర్చి అక్కడ జేసీబీ యంత్రాలతో లారీలలో నింపాల్సి ఉంది. ఇదేమీ పట్టిం చుకోని టీఎస్ఎండీసీ, కాంట్రాక్టర్లు ఏకం గా వాగులోనే యంత్రాలు పెట్టి లారీలు నింపుతున్నారు. ఇదిలా వుండగా నిబంధ నల ప్రకారం 10 టైర్ల లారీలో 10.5 క్యూబి క్ మీటర్ల (15.75 టన్నులు) ఇసుక నింపాలి. అలాగే 12 టైర్ల లారీలో 13.5 (18.75 టన్నులు) క్యూబిక్ మీటర్లు, 14 టైర్ల లారీలో 17 క్యూబిక్ మీటర్లు (25.5 టన్ను లు)నింపాల్సి ఉంది. కానీ కాంట్రాక్టర్లు, టీఎస్ఎండీసీ అధికారులు, లారీల యజ మానులు కుమ్ముక్కై ఒక్కో లారీలో ఒకటి నుంచి రెండున్నర క్యూబిక్ మీటర్ల వరకు అధికంగా నింపుతూ రోజుకు లక్షలాది రూపాయల అక్రమార్జకు పాల్పడుతున్నా రు. ఓవర్లోడ్తో వాగు నుంచే వెళ్లే లారీల ను నియంత్రించాల్సిన రవాణా, పోలీసుశా ఖల అధికారులు చోద్యం చూస్తుండగా, రోజుకు రూ.లక్షల్లో ప్రభుత్వాదాయానికి గండి పడుతోంది. -
డప్పుల్లో తరలిస్తున్న గంజాయి స్వాధీనం
గిద్దలూరు : డప్పుల్లో పెట్టి రైలులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గిద్దలూరు రైల్వే పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. మూడు డప్పుల్లో గంజాయిని కుక్కి రైలులోని సీటు కింద ఉంచి రవాణా చేస్తుండగా సమాచారం అందుకున్న స్థానిక ఆర్పీఎఫ్ ఏఎస్సై నాగభూషణం తన సిబ్బందితో కలిసి దాడులు చేశారు. మూడు డప్పుల్లో ఉన్న సుమారు 10 కిలోల గంజాయిని పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు గంజాయి తరలించేందుకు కొత్త పంధాను ఎన్నుకున్నారు. గతంలో కార్లు, లారీలు, బస్సుల్లో స్టెప్నీ టైర్లలో గంజాయి ఉంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. అలా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకుంటుండటంతో స్మగ్లర్లు సరికొత్త విధానంలో డప్పుల్లో గంజాయి ఉంచి రైలులో తరలిస్తున్నారు. అనుమానాస్పదంగా సీట్ల కింద ఉన్న డప్పులను గమనించిన ప్రయాణికులు.. ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం అందించడంతో ఈ గుట్టురట్టయింది. ఆ డప్పులు ఎవరివని పోలీసులు ప్రశ్నించినా.. అందరూ తమవి కావని చెప్పడంతో వాటిని స్వాధీనం చేసుకుని ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. వాటిలో నాసిరకం గంజాయి ఉందని, ఇది కిలో రూ.వెయ్యి కంటే ఎక్కువ ధర పలకదని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. -
మావోల డంప్ స్వాధీనం
ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లా టేకపానీ దండకారణ్యంలో భారీ డంప్ బయటపడింది. ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు మావోయిస్టుల భారీ డంప్ను గుర్తించారు. మావోలు వినియోగించే సామాగ్రితో పాటు లోడ్ చేసిన పది తుపాకులు, వైర్లు, ఐఈడీలు, ఫ్యూజ్లు, మ్యాగ్జైన్లు స్వాధీనం చేసుకున్నారు. -
ఎవరిదీ పాపం
- రసాయనిక వ్యర్థాల ఫలితం ... బాలికకు శాపం - వేలల్లో వైద్య ఖర్చులు ... ముందుకు రాని యాజమాన్యాలు - అభం,శుభం తెలియని చిన్నారి నరకయాతన కాళ్లు కాలుస్తున్న కెమికల్ వ్యర్థాలు బీచ్ రోడ్డుపై యథేచ్ఛగా డంపింగ్ అనారోగ్యాల బారిన ప్రజలు చోద్యం చూస్తున్న అధికారులు ఎవరో చేసిన నిర్లక్ష్య వ్యవహారానికి పన్నెండేళ్ల బాలిక నరక యాతన అనుభవిస్తోంది. పారిశ్రామిక వ్యర్థాలను తిరుగాడే ప్రదేశాల్లో పారబోయడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ బీచ్ రోడ్డులో సూర్యారావు పేట సమీపంలో ఉండే రెండు రసాయనిక పరిశ్రమలు తమ వ్యర్థాలను ఆరుబయటే పారేస్తుండడం ఎప్పటినుంచో జరుగుతోంది. ఈ నెల 8వ తేదీన తన స్నేహితులతో అటుగా వెళ్లిన ఈ బాలిక రెండు కాళ్లు కాలిపోయాయి. ఏదో చిన్నదేలా అనుకునే సమయంలోనే మోకాలి వరకు బొబ్బలెక్కడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఇప్పటి వరకు సంబంధిత యాజమాన్యం బాధ్యత తీసుకోలేదు. వైద్య ఖర్చుల కోసం వేల రూపాయలవుతోందని...పేద కుటుంబం ... ఎలా ముందుకు సాగేదని వాపోతోంది ఆ బాలిక తల్లిదండ్రులు. సూర్యారావుపేట (కాకినాడ రూరల్) : పారిశ్రామిక, ఆయిల్ రిఫైనరీల వ్యర్థాలను నిర్వాహకులు బీచ్ రోడ్డులో డంపింగ్ చేయడంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఒక పక్క పరిశ్రమల నుంచి విడుదలవుతున్న కాలుష్యంతో తీరప్రాంత గ్రామాల ప్రజలు కాలుష్య కోరల్లో చిక్కుకుపోతుంటే మరో పక్క కెమికల్ వ్యర్థాలను బీచ్రోడ్డు, ఖాళీగా ఉన్న నివాస స్థలాల వద్ద పారవేయడంతో రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించని కంపెనీలపై చర్యలు తీసుకోవాల్సిన పొల్యూషన్ అధికారులు చోద్యం చూస్తున్నారు. డంపింగ్ యార్డుగా బీచ్రోడ్డు.. కాకినాడ రూరల్ మండల పరిధిలోని తీరప్రాంత గ్రామం సూర్యారావుపేటలో సుమారు 5,600 మంది జనాభా నివసిస్తున్నారు. ఇక్కడ నివసించేవారందరూ మత్స్యకారులు. పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం తీరప్రాంతానికి ఆనుకుని సూర్యారావుపేట, వాకలపూడి, పెనుమర్తి పంచాయతీల పరిధిలో తీరానికి ఆనుకుని సుమారు 18 ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీలు, క్రూడ్ ఆయిల్ మరిగిస్తున్న ఫ్యాక్టరీ, చక్కెర తయారు చేస్తున్న ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇందులో ఆయిల్ రిఫైనరీ, క్రూడాయిల్ మరిగించడానికి, ఘగర్ తయారు చేసిన తర్వాత వచ్చిన కెమికల్ వ్యర్థాలను ఫ్యాక్టరీలు నిబంధనల మేరకు నిల్వ చేయకుండా, నేరుగా కెమికల్ వ్యర్థాలను ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి బీచ్రోడ్డులో ఆరుబయట పారబోయిస్తున్నారు. ముఖ్యంగా బీచ్లో ఖాళీగా ఉన్న ప్రదేశాలు పోలవరం, నేమాం, సూర్యారావుపేట, శివాలయం, సూర్యారావుపేట లైట్ హౌస్ సమీపాన రాత్రి, తెల్లవారుజామున స్థానికుల సంచారం లేని సమయాల్లో వ్యర్థాలను తీసుకువచ్చి పారబోస్తున్నారు. దీంతో బీచ్రోడ్డులో రాకపోకలు సాగించే సమయంలో వ్యర్థాల నుంచి వస్తున్న ధూళి, దుర్వాసనకు అనారోగ్యాల బారిన పడుతున్నారు. రోడ్డుకు అడ్డంగా వేస్తున్న వ్యర్థాలపై మోటార్బైక్లపై వెళ్తున్న ప్రజలు జారిపోయి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘగర్ వ్యర్థాలతో ప్రమాదాలు.. ఘగర్ వ్యర్థాలతో వాహనచోదకులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ఘగర్ నుంచి వచ్చిన వ్యర్థ ఊటను నిర్వాహకులు ట్యాంకర్లతో తీసుకొచ్చి బీచ్రోడ్డు, నేమాం, పోలవరం రహదారులపై పారబోస్తున్నారు. నాలుగు రోజుల క్రితం పోలవరం, నేమాంలకు చెందిన ప్రయాణీకులు బైక్పై నుంచి జారి పడిన ఘటనలో ముగ్గురు గాయాలబారిన పడ్డారు. పి.రమేష్,పోలవరం. కాళ్లు కాలిపోతున్నాయి. పరిశ్రమల నుంచి వచ్చే కెమికల్ వ్యర్థాలను ప్యాక్టరీలో నిల్వ చేయకుండా, ట్యాంకర్లతో బయటకు తీసుకొచ్చి బీచ్రోడ్డు, ఖాళీస్థలాల్లో పారబోస్తున్నారు. కంపెనీ నిర్వాహకులు స్థానికుల కంట పడకుండా తెల్లవారుజాము సమయంలో కెమికల్ వ్యర్థాలను ట్యాంకర్లతో తీసుకొచ్చి లైట్హౌస్ సమీపాన ఖాళీ స్థలంలో వేస్తున్నారు. బూడిద, మట్టి రంగులో ఉంటున్న రసాయన వ్యర్థాల్లో పొరపాటున నడిస్తే కాళ్లు కాలిపోయి, చర్మం అంతా ఎలర్జీ వస్తోంది. ఎస్.సత్తిబాబు, తమ్మవరం. నా కుమార్తె రెండు కాళ్లు కాలిపోయాయి నాకుమార్తె మరియ స్నేహితులతో కలసి బయటకు వెళుతున్న సమయంలో బూడిద రంగులో ఉన్న మట్టిలో నడవడంతో రెండు కాళ్లూ తీవ్రంగా కాలిపోయాయి. చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా రూ.30 వేలు వ్యయమవుతాయని వైద్యులు తెలిపారు. కెమికల్ వ్యర్థాలు ఇక్కడ వేయకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. మర్రి శ్రీను, బాధితురాలి తండ్రి, సూర్యారావుపేట. ఘగర్ వ్యర్థాలతో ప్రమాదాలకు గురవుతున్నాం ఘగర్ కంపెనీ నిర్వాహకులు ఘగర్ కోసం వినియోగించిన వ్యర్థాలను తీసుకొచ్చి నేమాం–పోలవరం రోడ్డు వేసేస్తున్నారు. ఘగర్ నుంచి వచ్చిన నూనెలా ఉన్న మడ్డును తీసుకొచ్చి రోడ్డుపై పారబోయడం వల్ల తెల్లవారుజామున బైక్లపై వెళ్తున్నవారు జారిపోయి కిందపడడం వల్ల నలుగురు వాహనచోదకులు గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ విషయమై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. ఎం.రమణ, తమ్మవరం. విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటా కెమికల్ వ్యర్థాలను బీచ్రోడ్డులో పారబోయడంపై విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటా. పారిశ్రామిక వ్యర్థాలను ఆరు బయట వేయరాదు. ప్రజల అనారోగ్యాలకు కారణమవుతున్న నిర్వాహకులకు నోటీసులు జారీ చేస్తాం. రవీంద్రబాబు, ఈఈ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, రమణయ్యపేట. -
‘ఆమె ఫొటోలు కూడా తీసేస్తే అప్పుడు చర్చలు’
చెన్నై: విలీనం చేసే చర్చలకు ముందు పన్నీర్ సెల్వం వర్గం రోజుకో కొత్త డిమాండ్ను తెరమీదకు తెస్తోంది. ఇప్పటి వరకు మొత్తం శశికళ కుటుంబాన్ని పార్టీకి దూరంగా పెట్టాల్సిందేనని డిమాండ్ చేసిన ఆయన వర్గం తాజాగా శశికళ ఫొటోలు కూడా ఉండటానికి వీల్లేదని శాసించింది. ముందు ఆ పని చేస్తేనే చర్చలకు ముందడుగేస్తామంటూ పన్నీర్సెల్వం వర్గంలోని కీలక నేత ఈ మధుసూదనన్ డిమాండ్ చేశారు. ‘శశికళ ఛాయా చిత్రాలన్నింటిని బయటపడేయండి. పార్టీ కార్యాలయ పవిత్రతను కాపాడండి’ అంటూ ఆయన పిలుపునిచ్చారు. చెన్నైలోని రాయపీఠ్లో త్వరలో పన్నీర్ వర్గం, పళనీస్వామి వర్గం ఏకమయ్యే అంశానికి సంబంధించి చర్చలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికీ పార్టీకి సంబంధించిన ప్రధాని కార్యాలయంతోపాటు ఇతర చిన్న చిన్న కార్యాలయాల్లో కూడా శశికళ ఫొటోలు డామినేట్ చేస్తున్నాయంట. ఈ నేపథ్యంలో వాటన్నింటిని తీసిపారేయండి అంటూ తాజాగా డిమాండ్ తెరపైకి తెచ్చారు. -
డంపింగ్ యార్డ్లో అగ్నిప్రమాదం
మేడ్చల్: జిల్లాలోని జవహర్ నగర్ డంపింగ్ యార్డులో బుధవారం మధ్యాహ్నం మంటలు చెలరేగడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి యత్నిస్తున్నారు.