dumping yard
-
ఇక్కడ ఇలా.. అక్కడ అలా.. చెత్త ఎలా?
సాక్షి, హైదరాబాద్: విస్తరిస్తున్న నగరంతో పాటే చెత్త సమస్యలూ పెరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ నుంచి గతంలో రోజుకు 3,500 మెట్రిక్ టన్నుల చెత్త వెలువడగా.. ప్రస్తుతం 7,500 మెట్రిక్ టన్నుల చెత్త వస్తోంది. దీని నిర్వహణ కోసం జవహర్నగర్ డంప్ యార్డుకు తరలిస్తున్నారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్తతో ఎంతో కాలంగా అక్కడి పరిసర గ్రామాల ప్రజలు తల్లడిల్లుతున్నారు. చెరువుల కాలుష్యం తగ్గించేందుకు లీచెట్ ట్రీట్మెంట్ వంటి పనులు జరుగుతున్నా తమ ఆరోగ్యానికి ముప్పేనని అక్కడి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని చెత్త మొత్తం ఒకేచోట పోగు పడకుండా ఉండేందుకు నగరానికి నాలుగు వైపులా డంపింగ్ యార్డులు, చెత్త నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వాలు ఎప్పటి నుంచో ప్రకటిస్తున్నాయి. దశాబ్దం క్రితం నుంచే ఆ దిశగా చర్యలు ప్రారంభమైనా, స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత, నిరసనలతో అవి ముందుకుసాగడం లేదు. తాజాగా సంగారెడ్డి జిల్లా పరిధిలోకొచ్చే నగర శివార్లలోని ప్యారానగర్లో ఏర్పాటు కానున్న చెత్త నిర్వహణ కేంద్రానికీ అదే పరిస్థితి ఎదురవుతోంది. పనులకు సాగనీయకుండా గత నాలుగు రోజులుగా పరిసర గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. బతుకులు బలి చేస్తారా? అక్కడ అత్యాధునిక సాంకేతికతతో యూరోపియన్ దేశాల్లోని చెత్త నిర్వహణ పద్ధతుల్ని పాటిస్తామని, దాని వల్ల పరిసరాల్లో ఎలాంటి కాలుష్యం వ్యాపించదని చెబుతున్న జీహెచ్ఎంసీ అధికారుల మాటల్ని ప్రజలు విశ్వసించడం లేదు. నగరంలోని చెత్తతో తమ బతుకులు బలి చేస్తారా? అని ప్రశి్నస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు పరిస్థితి ఏం కానుందన్నది మున్ముందు తేలనుంది. అక్కడ ఏర్పాటు కానున్న చెత్త నిర్వహణ కేంద్రం గురించి జీహెచ్ఎంసీ అధికారులేమంటున్నారంటే.. ⇒ అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీతో ఏర్పాటు కానున్న ప్లాంట్లో అడ్వాన్స్డ్ డ్రై అనరోబిక్ బయోమిథనేషన్ టెక్నాలజీ (డీఏబీటీ)తో తడిచెత్త నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది. కంపోస్టు ఎరువు తయారవుతుంది. ⇒ఆర్డీఎఫ్(రెఫ్యూజ్ డిరైవ్డ్ ఫూయెల్) ప్రాసిసెంగ్ తో పొడిచెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ⇒ జవహర్నగర్లో పుష్కరకాలంగా పేరుకుపోయిన చెత్తతో దుర్వాసన, కాలుష్యం వంటి సమస్యలుండగా, ప్యారానగర్ ప్లాంట్లో అలాంటి సమస్యలుండవు. ⇒ చెత్త అనేది అసలు నిల్వ లేకుండానే ఎప్పటికప్పుడు ప్రాసెస్ అవుతుంది. చెత్త బహిరంగంగా కనిపించదు. ⇒ డీఏబీటీతో వెలువడే బయోగ్యాస్ను ఇంధనంగా లేదా విద్యుత్ ఉత్పత్తికి వినియోగించవచ్చు. ఆర్డీఎఫ్ను విద్యుత్ తయారీకి ఉపయోగిస్తారు. ⇒ ఈ ప్లాంట్లో పనులన్నీ భూమిలోపల బంకర్లలో, మూసివేసిన షెడ్లలో జరుగుతాయి. చెత్త రవాణా సైతం ఆయిల్ ట్యాంకర్ల మాదిరిగా పూర్తిగా మూసి ఉండే వాహనాల ద్వారా జరుగుతుంది. గాలిని కూడా బయో ఫిల్టర్ల ద్వారా శుద్ధి చేయడం వల్ల ఎలాంటి దుర్వాసనలు రావు. ⇒ డ్రై డైజెసన్ టెక్నాలజీ వల్ల లీచెట్ (విష జలాల) సమస్య ఉండదు. చెత్త నిర్వహణలో పర్యావరణపరంగా మేలైనది. అక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్ స్థానిక అవసరాలకు సరిపోతుంది. ⇒ రోజుకు 2 వేల మెట్రిక్ టన్నుల చెత్తతో 15 మెగావాట్ల విద్యుత్, 270 టన్నుల బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది. చెత్తను మోయలేని జవహర్నగర్ నగరం నుంచి ప్రస్తుతం వెలువడుతున్న దాదాపు 7,500 మెట్రిక్ టన్నుల చెత్తతో పాటు శివార్లలోని మున్సిపాలిటీల చెత్త అక్కడికే వెళ్తోంది. జవహర్నగర్ఫై పడుతున్న ఈ భారాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా నలువైపులా చెత్త నిర్వహణ ఏర్పాటు కేంద్రాలకు ఎప్పటినుంచో ఆలోచనలున్నాయి. జీహెచ్ఎంసీలో ఒక వ్యక్తి నుంచి రోజుకు వెలువడుతున్న చెత్త 2019లో 500 గ్రాములు 2024లో 733 గ్రాములుజవహర్నగర్ డంపింగ్ యార్డుకు తరలుతున్న చెత్త 2014లో 3,500 మెట్రిక్ టన్నులు 2024లో 7,500 మెట్రిక్ టన్నులు పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ చెత్త 9వేల మెట్రిక్ టన్నులకు పెరుగుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. నగరానికి నాలుగువైపులా డంపింగ్ కేంద్రాలు, చెత్త నిర్వహణ కేంద్రాల ఏర్పాటుతో జవహర్నగర్పై భారం తగ్గుతుంది. -
20 ఏళ్లుగా ఉంటున్నాం.. మీరెవరు పొమ్మనడానికి..
-
ఇళ్లు వదిలి పోండి..
-
మాంబట్టు సెజ్లో భారీ అగ్నిప్రమాదం
తడ (తిరుపతి జిల్లా): పరిశ్రమల్లో లభించే పాత వస్తువులను సేకరించే ఒక సంస్థ నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలకు సమీపంలో నెలకొలి్పన డంపింగ్ యార్డులో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా తడలోని మాంబట్టు ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నిల్వ ఉంచిన చెత్తకు నిప్పు అంటుకోవడంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో పొగ ఆకాశాన్ని అంటుకుని చీకట్లు కమ్మేయడంతో సమీప పరిశ్రమల్లోని కార్మికులు ఆందోళన చెందారు.నాయుడుపేట సీఐ శ్రీనివాసులురెడ్డి, సూళ్లూరుపేట సీఐ మధుబాబు, తడ, సూళ్లూరుపేట ఎస్ఐలు నరశింహారావు, రహీంరెడ్డి తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సూళ్లూరుపేట, అపాచీ పరిశ్రమలకు చెందిన రెండు ఫైరింజన్లు మంటలు అదుపు చేసేందుకు శ్రమించాయి. మంటలతోపాటు మంటల్లో నుంచి భారీ శబ్దాలతో పేలుళ్లు వస్తుండటంతో పోలీసులు ఆ దారిన రాకపోకలు అడ్డుకుని ఇతర మార్గాల్లో వాహనాలు మళ్లించారు.కాగా పరిశ్రమలకు సమీపంలో ఎలాంటి జాగ్రత్తలు లేకుండా ఉన్న డంపింగ్ యార్డు వల్ల తీవ్ర ఇబ్బందులు జరుగుతాయని ఏడాది క్రితం సూళ్లూరుపేట ఫైర్ అధికారులు తిరుపతికి చెందిన స్థల యజమాని హర్షవర్ధన్, చెత్త సేకరించి నిల్వ చేసుకునేందుకు స్థలాన్ని లీజుకు తీసుకున్న షేర్ అలీ అనే వ్యక్తులకు సమాచారం ఇచ్చినా వారు పెడచెవిన పెట్టారని ఫైర్ సిబ్బంది తెలిపారు. డంపింగ్ యార్డులో పనికి రాని చెత్త మాత్రమే కాలిపోగా ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఆనుకుని ఉన్న అల్యూమినియం క్యాస్టింగ్ కంపెనీ తీవ్రంగా నష్టపోయింది. -
ఆనంద్ మహీంద్రాను బాధించిన వీడియో.. అందులో ఏముందంటే..?
ముంబయి: సోషల్ మీడియాలో చురుకుగా ఉండే మహీంద్రా గ్రూప్ ఛైర్మెన్ ఆనంద్ మహీంద్రా తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో కొందరు వ్యక్తులు వ్యర్థాలను సముద్రంలో పడేస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. ఈ వీడియో తనను ఎంతగానే బాధించినట్లు ఆనంద్ మహీంద్రా ఆవేదన వ్యక్తం చేశారు. గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద సముద్రంలో కొందరు వ్యక్తులు వ్యర్థాలను పడేశారు. కార్లలో వచ్చి బస్తాల్లో తీసుకొచ్చిన వ్యర్థాలను సముద్ర నీటిలో వేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. పర్యావరణాన్ని కలుషితం చేయడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలింపు చేపట్టారు. నగర మున్సిపాలిటీ అధికారులు నిందితులకు రూ.10,000 జరిమానా కూడా విధించారు. The Good Citizens of Mumbai Early Morning at Gateway of India pic.twitter.com/FtlB296X28 — Ujwal Puri // ompsyram.eth 🦉 (@ompsyram) November 21, 2023 సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. ఈ వీడియోలోని దృశ్యాలు తనను ఎంతగానో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణం పట్ల ప్రజల అభిప్రాయం మారకపోతే.. జీవన నాణ్యతా ప్రమాణాలు పెరగబోవని పేర్కొంటూ ట్వీట్ చేశారు. కాగా.. ఈ వీడియోపై నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయితే.. నగరాన్ని శుభ్రంగా ఉంచడం కష్టమని అభిప్రాయపడ్డారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరారు. ఇదీ చదవండి: 'అలా అయ్యుంటే టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్లో గెలిచేది! -
‘ప్లాస్టిక్ అడవి’లో ఏనుగులు
ఎటు చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తా చెదారం మధ్య ఏనుగుల గుంపు కనిపిస్తోందా? అంతటి కలుషిత, ప్రమాదకర పదార్థాల మధ్య ఆ ఏనుగులు ఆహారాన్ని వెతుక్కుంటున్నాయి. అభివృద్ధితోపాటు వస్తున్న కాలుష్య ప్రమాదానికి ఇదో సంకేతమని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలను తీసుకెళ్లి అడవుల సమీపంలో డంపింగ్ చేస్తుండటం కేవలం పర్యావరణానికి మాత్రమేకాదు వన్య ప్రాణులకు ఎంతో చేటు చేస్తున్న దారుణ పరిస్థితిని ఇది కళ్లకు కడుతోంది. శ్రీలంకలోని తూర్పు ప్రావిన్స్లో లలిత్ ఏకనాయకే అనే ఫొటోగ్రాఫర్ ఈ చిత్రాన్ని తీశారు. నేచర్ ఇన్ఫోకస్ సంస్థ ఇచ్చే ఫొటోగ్రఫీ అవార్డుల్లో ‘కన్సర్వేషన్ ఫోకస్’ విభాగంలో ఇది ఉత్తమ చిత్రంగా నిలిచింది. –సాక్షి సెంట్రల్ డెస్క్ -
యాభై ఏళ్లలో చేయనోళ్లు.. ఇప్పుడు అభివృద్ధి చేస్తారట!
సాక్షి, మేడ్చల్ జిల్లా: యాభై ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయనివాళ్లు.. ఇప్పుడు అవకాశమిస్తే ఎలా చేస్తారని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు ప్రతిపక్షాలను సూటిగా ప్రశ్నించారు. జవహర్నగర్ డంపింగ్ యార్డులో రూ.251 కోట్లతో 2000 కేఎల్డీ సామర్థ్యం కలిగిన లీచెట్ ప్లాంట్ను కార్మిక మంత్రి మల్లారెడ్డి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి , రాంకీ సంస్థ ప్రతినిధులతో కలసి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో 3,619 మంది స్థానిక లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ జవహర్నగర్ డంప్ యార్డ్ నుంచి ఉత్పత్తి అయ్యే లీచెట్ కారణంగా కలుషితమవుతున్న మల్కారం చెరువుతో పాటు యార్డు చుట్టుపక్కల చెరువుల్లో ఉన్న లీచెట్ శుద్దీకరణ ప్రక్రియను వచ్చే ఏడాది ఏప్రిల్ లోపు పూర్తి చేస్తామని ప్లాంట్ నిర్వాహకులు హామీ ఇచ్చారని తెలిపారు. దేశానికే హైదరాబాద్ ఆదర్శ నగరం కాబోతోంది.. హైదరాబాద్ మహానగరంలో రోజుకు దాదాపు 2వేల ఎంఎల్టీ ( 2వేల మిలియన్ లీటర్ల) మురికినీరు ఉత్పత్తి అవుతోందని, 100 శాతం ఎస్టీపీలతో జూలై కల్లా దేశంలోనే మొట్టమొదటి నగరం కాబోతుందని కేటీఆర్ తెలిపారు. ఇందుకోసం రూ.4 వేల కోట్లు ఖర్చుపెడుతున్నట్లు వెల్లడించారు. జపాన్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ చూశానని అక్కడ పైన పార్కు, కింద ప్లాంట్ ఉందని, ఏ మాత్రం వాసన లేదని వివరించారు. జవహర్ నగర్, నాగారం, దమ్మాయిగూడలను ఆ విధంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ హామీనిచ్చారు. 3 వేల మెట్రిక్ టన్నుల యార్డ్... 8 వేల మెట్రిక్ టన్నులైంది జవహర్నగర్ డంపింగ్ యార్డ్ మొదలుపెట్టినప్పుడు హైద రాబాద్ నుంచి 3వేల మెట్రిక్ టన్నుల చెత్త వస్తుందని డిజైన్ చేశారని, కానీ ఇప్పుడు 8 వేల మెట్రిక్ టన్నుల చెత్త వస్తోందన్నారు. ప్రస్తుతం జవహర్ నగర్కు వచ్చే చెత్తలో తడి చెత్త నుంచి ఎరువు ఉత్పత్తి చేసి, రైతులకు అమ్ముతున్నామని కేటీఆర్ తెలిపారు. రూ.550 కోట్లతో దక్షిణ భారతదేశంలోనే పెద్దదైన ఈ చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తి చేసే యూనిట్ను ప్రారంభించి 20 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నామన్నారు. రెండోదశలో మరొక రూ.550 కోట్లతో 28వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని త్వరలో స్థాపించనున్నట్టు కేటీఆర్ తెలిపారు. దీంతో ఒక్క జవహర్నగర్ నుంచే 48 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తవుతుందన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే మొత్తం చెత్తతో 100 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. మూడో రకం చెత్తతో సిమెంట్, బ్రిక్స్ తయారీ తడి,పొడి చెత్త కాకుండా, ఇళ్లు కట్టినప్పుడు, కూలగొట్టినప్పుడు వచ్చే కంకర రాళ్లు, మట్టితో మూడో రకం చెత్త వస్తోందని కేటీఆర్ తెలిపారు. నిర్మాణం, శిథిలాల నుంచి వచ్చే ఈ వ్యర్థాలను పునరుత్పత్తి చేసి.. పునర్వినియోగం చేసి.. వాటి నుంచి సిమెంట్, బ్రిక్స్, ఫుట్పాత్ల మీద వేసే టైల్స్ తయా రు చేస్తున్నామన్నారు. ఈ రకమైన ప్లాంట్లను ఒకటి ఫతూల్గూడలో, రెండోది జీడిమెట్లలో పెట్టినట్లు వివరించారు. ఈ రెండూ కూడా ఒక్కోటి 500మెట్రిక్ టన్నుల కెపాసిటీతో నడుస్తున్నాయని, మరో రెండు కూడా త్వరలో పెట్టబోతున్న ట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కార్యక్రమంలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు, జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎం.సుదీర్రెడ్డి, కలెక్టర్ అమయ్కుమార్, మేయర్లు మేకల కావ్య, జక్కా వెంకట్రెడ్డి, జిల్లా గ్రంధాలయం చైర్మన్ దయాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, అడిషనల్ కలెక్టర్ నర్సింహారెడ్డి, ఆర్డీఓ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పంట నేల కాస్త విషం కక్కుతుంటే..
కరోనా కాదు.. అయినా జనాలు బయట అడుగుపెట్టాలంటే వణికిపోతున్నారు. తలుపులు, కిటికీలు గట్టిగా బిగించేసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు. పోలీసులు సైతం జనాలు అనవసరంగా బయట తిరగడంపై నిఘా పెట్టారు. ఒకవేళ.. అత్యవసరానికి బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్లు ధరిస్తున్నారు. గత వారంగా ఇదే పరిస్థితి చోటు చేసుకుంది అక్కడ. లాక్డౌన్ లాంటి పరిస్థితులకు కారణం ఒక పే... ద్ద చెత్తకుప్ప!. కొన్నేళ్ల కిందటి వరకు అది సారవంతమైన నేల.. వ్యవసాయ భూమి. కానీ, కాలక్రమంలో అదొక చెత్త కుప్పగా మారింది. ఆ చెత్త కుప్పనే వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్గా మార్చేయాలని ప్రభుత్వం భావించి ప్రయత్నాలు మొదలుపెట్టింది. చుట్టుపక్కల జిల్లాల నుంచి ఈ ప్లాంట్కు చెత్త వచ్చి చేరుతుంటుంది. కానీ, ఆ చెత్తే ఇప్పుడు ప్రజల ప్రాణాల మీదకు వచ్చింది. నిర్వాహణ లోపం, నిర్లక్ష్యం కారణంగా టన్నులకు పైగా చెత్తకు నిప్పంటుకోవడంతో.. ఆ పరిసరాలు విషవాయువులతో నిండిపోయింది. కేరళ కొచ్చి సిటీలోని బ్రహ్మపురం ప్రాంతంలోని డంప్ యార్డ్.. జనాలకు ప్రాణాంతకంగా మారింది. చెత్త కుప్ప భారీ ఎత్తున్న తగలబడి.. అందులో ప్లాస్టిక్, మెటల్, ఇతరత్ర వస్తువులు కాలిపోయి విషపూరితమైన వాయువులు వెలువడుతున్నాయి. మంటలు వెలువడిన రెండోరోజునే ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. 30 బృందాలు నిరంతరం ఆ కుప్ప దగ్గరే ఉండి.. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. అయినప్పటికీ దట్టమైన పొగ వెలువడుతూనే ఉంది. విష వాయువులతో ఆ ప్రాంతమంతా కలుషితమైపోయింది. మరోవైపు బయటకు రావొద్దని స్థానికులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ బయటకు వెళ్లినా.. ఎన్95 మాస్క్లు ధరించాలని సూచిస్తున్నారు. గ్యాస్ ఛాంబర్ అంటూ.. బ్రహ్మపురం డంప్ యార్డ్ అగ్నిప్రమాదంపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. నగరం గ్యాస్ ఛాంబర్గా మారుతుంటే ఏం చేస్తున్నారని కొచ్చి మున్సిపల్ విభాగంపై మండిపడింది. అగ్ని ప్రమాదానికి కారణాలతో పాటు యాక్షన్ ప్లాన్ను వివరించాలని ఆదేశించింది కూడా. ఇబ్బందులతో ఆస్పత్రులకు.. వేస్ట్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లోని కాలనీవాసులు నరకం అనుభవిస్తున్నారు. విషపు వాయువుల పొగ కారణంగా.. రకరకాల ఇబ్బందులో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అక్కడా వాళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస కోశ సమస్యలు, ఇతర అనారోగ్యాలు ఉన్నవాళ్లను అసలు బయటికే రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. డంప్ యార్డ్లో 70 శాతం పొగ తగలబడిపోయిందని, మిగతా చెత్తకు మంటలు అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు అంటున్నారు. మార్చి 2వ తేదీన బ్రహ్మపురం సాలిడ్వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్లో మంటలు అంటుకున్నాయి. ప్రమాదానికి కారణాలపై స్పష్టత లేకున్నా.. అధిక ఉష్ణోగ్రతతోనే మంటలు చెలరేగి ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు ప్రతిపక్షాలు ఆ అంశం ఆధారంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. వేస్ట్ మేనేజ్మెంట్లో విఫలం కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని మండిపడుతోంది. అయితే.. చెత్త నుంచి ప్లాస్టిక్, ఇతర కారకాలను తొలగిస్తూనే ఉన్నామని, అయినా పొరపొరలుగా పేరుకుపోయిన వ్యర్థాల వల్లే తీవ్ర కాలుష్యం చోటు చేసుకుందని ప్రభుత్వం అంటోంది. ప్లాంట్ కథాకమామీషు కొచ్చికి వ్యర్థాల తొలగింపు ఎప్పుడూ పెద్ద సమస్యగా ఉంది. 1998లో నగరానికి 17 కిలోమీటర్ల దూరంలోని బ్రహ్మపురం వద్ద కొచ్చి కార్పొరేషన్ 37 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసింది. అక్కడ వ్యర్థాల శుద్ధి కర్మాగారాన్ని నిర్మించేందుకు 2005లో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సమయంలో ఈ ప్రాజెక్టుపై నిర్వాసితుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. ► చివరికి.. 2007లో 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చిత్తడి నేలను పునరుద్ధరించి ఆ ప్రాంతంలో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను నిర్మించారు. రోజుకు 250 టన్నుల సామర్థ్యంతో 2008లో వేస్ట్ ప్లాంట్ను ప్రారంభించారు. కానీ, ఏడాదిన్నర వ్యవధిలోనే ప్లాంట్ దెబ్బతింది. నిర్మాణ లోపాల వల్లే ఇది జరిగిందని గుర్తించిన అధికారులు.. పరిశోధనలు ప్రారంభించారు. కానీ, ఫలితం తేలలేదు. ► ఆపై డిమాండ్ మేరకు కొచ్చి కార్పొరేషన్ మరింత ఎక్కువ భూమిని సేకరించవలసి వచ్చింది. ఇవాళ.. బ్రహ్మపురం వ్యర్థాల కర్మాగారం అనేది కొచ్చి నగరంలోని ప్రధాన ఐటీ పార్కుల సమీపంలో 110 ఎకరాల స్థలంలో విస్తరించింది. ► కొచ్చి కార్పొరేషన్తో పాటు కళమస్సెరీ, ఆళువా, అంగమళి, త్రిక్కకారా, త్రిపునితారా మున్సిపాలిటీలతో పాటు చెరానల్లూరు, వడవుకోడ్ పుథాన్కురిష్ పంచాయితీల చెత్త కూడా ఈ ప్లాంట్కే వచ్చి చేరుతోంది. ► ప్రతిరోజూ సుమారు 400 టన్నుల చెత్త ఈ ప్లాంట్కు వస్తుంది. అందులో నలభై శాతం ప్లాస్టిక్, నాన్బయోడీగ్రేడబుల్ చెత్త ఉంటోంది. ► 2012లో భారత్ ట్రేడర్స్ అనే కంపెనీతో కొచ్చి కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం.. బ్రహ్మపురం ప్లాంట్ నుంచి చెత్త సేకరణలో భాగంగా ప్లాస్టిక్ కేజీకి రూపాయిన్నర చెల్లిస్తుంది. అయితే.. అది రీసైక్లింగ్ ప్లాస్టిక్కు మాత్రమే. దీంతో మిగతా వేస్ట్ అంతా అక్కడే ఉండిపోతోంది. ► ఇక ఇక్కడే చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తికి ఒక ప్లాంట్ ఏర్పాటు చేయాలనే ప్రయత్నం జరిగింది. 2011లో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో ప్లాంట్కు శంకుస్థాపన చేయాలనుకున్నారు. 2015లో ఒప్పందం జరిగి.. మూడేళ్ల తర్వాత ప్లాంట్కు శంకుస్థాపన రాయి కూడా పడింది. కానీ, నిధులు లేక 2020లో ఆ ఒప్పందం రద్దు అయ్యింది. ► బ్రహ్మపురం వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు సైతం జోక్యం చేసుకున్నాయి. అయినప్పటికీ.. కొచ్చి కార్పొరేషన్ దాని పని తీరును మెరుగుపర్చలేదు. ఇంకో విషయం ఏంటే.. తాజా ఘటన నేపథ్యంలో కొచ్చి కార్పొరేషన్కు కేరళ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దాదాపు రూ.15 కోట్ల జరిమానా విధించింది. అయితే.. కార్పొరేషన్ ఈ ఆదేశాలపై హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంది. నాటకీయ పరిణామాల నడుమ.. బ్రహ్మపురం డంప్ యార్డ్ అగ్నిప్రమాదం నేపథ్యంలో.. గత వారం రోజులుగా అందులోని ఇతర ప్రాంతాల నుంచి చెత్తను అనుమతించడం లేదు. అలాగే.. ప్లాంట్ బయట ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు కూడా బైఠాయించారు. ఈ క్రమంలో.. శుక్రవారం అర్ధరాత్రి దాటాక 40 లారీల్లో చెత్త కుప్ప ప్లాంట్కు చేరింది. ఆ సమయంలో కాంగ్రెస్ సభ్యులు అడ్డగించే యత్నం చేయగా.. పోలీసులు వాళ్లను బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు. ఆపై లారీలను లోపలికి అనుమతించారు. విశేషం ఏంటంటే.. అగ్నిప్రమాద ఘటన తర్వాత ప్లాస్టిక డంపింగ్ను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా.. అందుకు విరుద్ధంగా కొచ్చి కార్పొరేషన్ చెత్తను లోపలికి అనుమతించడం. -
డంపింగ్ గ్రౌండ్లతో మృత్యు ఘోష.. పదేళ్లలో 1,877 మంది మృతి
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో చెత్తవేసే డంపింగ్ గ్రౌండ్ల సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. 13 ఏళ్ల నుంచి గోవండీలో ఉన్న డంపింగ్ గ్రౌండ్, బయో మెడికల్ చెత్తను నిర్వీర్యం చేసే ప్రక్రియ ప్రాజెక్టువల్ల వాతావరణం కాలుష్యమైపోతోంది. ఫలితంగా గోవండి ప్రాంత ప్రజలు వివిధ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. గడచిన పదేళ్లలో బీఎంసీకి చెందిన ఎం– తూర్పు వార్డు పరిధిలో 1,877 మంది క్షయ వ్యాధితో మృత్యువాత పడ్డారని సమాచార హక్కు చట్టం కింద సేకరించిన వివరాలను బట్టి తెలిసింది. అంతేగాకుండా గడచిన పదేళ్ల కాలంలో 45,051 మందికి క్షయ వ్యాధి సోకినట్లు ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో గోవండీ, పరిసరాల్లో భీతావహ వాతావరణం నెలకొంది. గోవండీలో ఉన్న డంపింగ్ గ్రౌండ్, బయో మెడికల్ చెత్త నిర్వీర్యం చేసే ప్రకియ ప్రాజెక్టు వల్ల కమలారమణ్ నగర్, డింపింగ్ రోడ్, డా.జాకీర్ హుస్సేన్ నగర్, రఫిక్ నగర్, బాబానగర్, బైంగన్ వాడి, శివాజీనగర్, పీఎంజీపీ కాలనీ, టాటా నగర్ కాలనీ, ఇండియన్ ఆయిల్ నగర్, దేవ్నార్ తదితర పరిసరాల్లో కాలుష్యం పెరిగిపోయింది. దీని ప్రభావం అక్కడుంటున్న స్థానిక ప్రజల ఆరోగ్యంపై పడసాగింది. దీంతో స్థానికుల నుంచి అనేక ఫిర్యాదులు రావడం మొదలయ్యాయి. కానీ వాటిని స్ధలాంతరం చేయడానికి బీఎంసీకి ప్రత్యామ్నాయ మార్గం కనిపించలేదు. దీంతో అక్కడే కొనసాగిస్తూ వస్తున్నారు. సామాజిక కార్యకర్త శేఖ్ ఫైయాజ్ ఆలం సమాచార హక్కు చట్టం ద్వారా బీఎంసీ ఎం–తూర్పు వార్డు పరిధిలో ఎంత మంది క్షయ రోగులున్నారో వారి వివరాలు సేకరించారు. అందులో 2013 నుంచి 2022 వరకు మొత్తం 45,051 మందికి క్షయ వ్యాధి సోకినట్లు తేలింది. అందులో 1,877 మంది చనిపోయినట్లు ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. కానీ క్షయ సోకిన వారు, మృతి చెందిన వారంతా బయో మెడికల్ చెత్త నిర్వీర్యం చేసే ప్రక్రియ ప్రాజెక్టు నుంచి వెలువడుతున్న విషవాయువుల వల్ల చనిపోయినట్లు నిర్ధారించాల్సిన అవరసం ఎంతైన ఉందని ఎస్ఎంఎస్ కంపెనీ అంటోంది. చెత్తను నిరీ్వర్యం చేసే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ముఖ్యంగా ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా ఈ ప్రాజెక్టును కొనసాగిస్తున్నామని తెలిపింది. కొందరు స్థానికులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కంపెనీ స్పష్టం చేసింది. -
హైదరాబాద్ లోయర్ ట్యాంక్బండ్ సమీపంలో భారీ పేలుడు
సాక్షి, హైదరాబాద్: గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోయర్ ట్యాంక్ బండ్ స్నో వరల్డ్ సమీపంలోని చెత్త డంపింగ్ యార్డ్లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న తండ్రీ కొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, గాంధీనగర్ సీఐ మోహన్రావు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. పేలుడుకు గల కారణాలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారు కర్నూలు జిల్లా నాంచార్ల గ్రామానికి చెందిన చంద్రన్న , ఆయన కుమారుడు సురేష్గా గుర్తించారు. సురేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చదవండి: కామారెడ్డి: గుహలో చిక్కుకున్న రాజు సురక్షితంగా బయటకి.. -
‘డంపింగ్ యార్డ్’కు ఢిల్లీ పాలిటిక్స్.. ఆప్, బీజేపీ పరస్పర విమర్శలు
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ)ఎన్నికలు ఈ ఏడాది చివర్లో లేదా 2023 తొలినాళ్లలో జరగనున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. అధికార ఆప్, భాజపా మధ్య తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి ఈ ఎన్నికలు. తాజాగా గాజీపూర్లోని డంపింగ్ యార్డ్ ఇరు పార్టీల మధ్య వివాదానికి తెరతీసింది. అక్కడి చెత్త డంపింగ్ యార్డ్ వద్దకు గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెళ్లగా.. భాజపా కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఆయనొక అబద్ధాలకోరు అంటూ నినాదాలు చేశారు. అందుకు కౌంటర్గా ఆప్ కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూడు స్థానిక సంస్థల విలీనానికి ముందు పదేళ్లకు పైగా ఎంసీడీ అధికారం భాజపా చేతిలోనే ఉంది. ఆ అంశాన్ని లేవనెత్తుతూ.. విమర్శలు గుప్పించారు కేజ్రీవాల్. ‘భాజపా విమర్శల్లో ఎలాంటి లాజిక్ లేదు. భాజపా నేతృత్వంలోని స్థానిక సంస్థలు ఏం చేశాయో తెలుసుకునేందుకే ఇక్కడకు వచ్చాను. ఢిల్లీని శుభ్రంగా ఉంచే పనిలో బీజేపీ పూర్తిగా విఫలమైంది. మేం నిర్మించిన పాఠశాలలు, మొహల్లా క్లినిక్లను చూసేందుకు భాజపా వస్తే.. మేం ఇలా నల్ల బ్యాడ్జీలతో నిరసనలు చేయం. మేం అధికారంలోకి వస్తే.. ఢిల్లీని శుభ్రం చేస్తాం. మిమ్మల్ని ఉచితంగా తీర్థయాత్రలకు తీసుకెళ్లిన కుమారుడికి ఓటు వేయాలని ఢిల్లీలోని మాతృమూర్తులకు చెప్పాలనుకుంటున్నాను.’ అని వెల్లడించారు కేజ్రీవాల్. ఈ సందర్భంగా రామాయణంలోని శ్రవణ కుమారుడి పాత్రతో తనను తాను పోల్చుకున్నారు. మరోవైపు.. కేజ్రీవాల్ వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. స్థానిక సంస్థలకు ఢిల్లీ సర్కార్ తగిన నిధులు ఇవ్వలేదని నిందించింది. ఇప్పుడు స్థానిక ఎన్నికల ముందు ప్రతిజ్ఞలు చేస్తోందని మండిపడింది. స్థానిక సంస్థల ఎన్నికలకు పారిశుద్ధ్య అంశాన్ని కేంద్ర సమస్యగా ఆప్ మార్చిందని, ఇతర ప్రాంతాలను చూపిస్తూ డంపింగ్ పర్వతాలను కప్పిపుచ్చుతోందని ఆరోపించింది. మరోవైపు.. ఎన్నికల తేదీలను ఇంకా ప్రకటించలేదు. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ గణాంకాల ప్రకారం.. నగరంలో నిత్యం 11వేల టన్నుల ఘన వ్యర్థాలు వస్తున్నాయి. వాటిల్లో 5 వేల టన్నులు ప్రాసెస్కు పంపగా.. మరో ఆరు వేల టన్నులు అక్కడి మూడు డంపింగ్యార్డులకు చేరుకుంటున్నాయి. ఇదీ చదవండి: ‘అదే మా లక్ష్యం’.. పీఓకేపై రక్షణ మంత్రి రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు! -
డంపింగ్ యార్డులో మూవీ సెట్ వేశాం : డైరెక్టర్
ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘నవాబ్’. రవిచరణ్ దర్శకత్వంలో నమో క్రియేషన్స్ పతాకంపై ఆర్ఎం నిర్మిస్తున్నారు. హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో రవిచరణ్ మాట్లాడుతూ – ‘‘నా మొదటి సినిమా ‘నల్లమల’కు మంచి ఆదరణ లభించింది. ఆ ఉత్సాహంతో ‘నవాబ్’ తెరకెక్కిస్తున్నాం. పూర్తిగా డంపింగ్ యార్డ్లో సాగే కథతో ఈ సినిమా ఉంటుంది. దీని కోసం పదెకరాల్లో డంపింగ్ యార్డ్ సెట్ వేశాం. మా హీరో ముఖేష్ గుప్తా తెలుగు కాదు. ఆర్నెళ్లు తెలుగు నేర్చుకుని అద్భుతంగా నటిస్తున్నారు’’ అన్నారు. ‘‘ఓ మంచి కథతో రూపొందుతున్న ‘నవాబ్’లో హీరోగా నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు ముఖేష్ గుప్తా. -
‘జవహర్నగర్లో కర్చీఫ్ లేకుండా తిరగలేం’
సాక్షి,మేడ్చల్జిల్లా: డంపింగ్ యార్డు కారణంగా జవహర్ నగర్ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మాటల్లో చెప్పలేమని బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్చార్జ్ మురళీధర్ రావు అన్నారు. హైదరాబాద్ నగరాన్ని న్యూయార్క్, డల్లాస్, వాషింగ్టన్, లండన్లా మారుస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారని, అయితే పక్కనే ఉన్న జవహర్నగర్ లో కర్చీఫ్ అడ్డం పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. సోమవారం దమ్మాయిగూడ ప్రజాసంగ్రామ యాత్ర సభలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ఎన్నికలు అంటే వరద సాయం అన్నారని, దుబ్బాక ఎన్నికలకు మరో పథకం, హుజురాబాద్ ఎన్నికల సమయంలో ‘దళిత బంధు’ మునుగోడు అంటే ‘గిరిజన బంధు’ పథకాలను తెరపైకి తెస్తున్నారన్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ విషయంపై గత కొంతకాలంగా బీజేపీ పోరాటం చేస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇక్కడి నుంచి డంపింగ్ యార్డును ఎత్తివేస్తామన్నారు. టీఆర్ఎస్ పాలనలో ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. కుటుంబ పాలన, అవినీతి, మాఫియా రాజ్యాన్ని అంతమొందించాలంటే బీజేపీని గెలిపించాలన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే నీతివంతమైన పాలన ప్రజలకు అందుతుందన్నారు. సభలో బీజేపీ రాష్ట్ర నేతలు చాడ సురేష్రెడ్డి, డాక్టర్ విజయరామారావు , మాజీఎమ్మెల్సీ దిలీప్కుమార్, కొల్లి మాధవి, కొంపెల్లి మోహన్రెడ్డి, జిల్లా నేతలు పి.హరీష్రెడ్డి, పటోళ్ల విక్రంరెడ్డి, జిల్లాల తిరుమల్రెడ్డి, అమరం మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ చెత్త రాజకీయం.. హిందూపురంలో బాలకృష్ణ ఇంటి వద్ద ఉద్రిక్తత
సాక్షి, హిందూపురం: డంపింగ్ యార్డు తరలింపునకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో టీడీపీ నాయకుల కవ్వింపు చర్యలు హిందూపురంలో ఉద్రిక్తతకు దారి తీసాయి. వివరాలు... పట్టణంలోని 21వ వార్డు మోత్కుపల్లి సమీపంలోని డంపింగ్ యార్డు సమస్యపై మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ సోమవారం రాత్రి వాట్సాప్ గ్రూపుల్లో హిందూపురం పార్లమెంట్ టీడీపీ మీడియా కో–ఆర్డినేటర్ చంద్రమోహన్ పోస్టు చేశాడు. దీనిపై 21వ వార్డు కౌన్సిలర్ మారుతీరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు గోపీకృష్ణ స్పందించారు. పట్టణాభివృద్ధిలో భాగంగా∙మోత్కుపల్లి డంపింగ్ యార్డును చిన్నగుడ్డంపల్లి వద్దకు తరలించేలా ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ చర్యలు చేపట్టారని, త్వరలో యార్డును చిన్నగుడ్డంపల్లి వద్దకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాధానమిచ్చారు. 37 ఏళ్లుగా టీడీపీ ఎమ్మెల్యేలు ఈ సమస్యపై ఏమి చేశారంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ సైతం పట్టించుకోలేదని కౌంటర్ వేశారు. దీనిపై బహిరంగ చర్చకు రావాలన్న టీడీపీ నేత సవాల్ను వైఎస్సార్సీపీ నేతలు స్వీకరించి మంగళవారం ఉదయం 11 గంటలకు చౌడేశ్వరీ కాలనీలోని బాలకృష్ణ ఇంటి వద్దకే వస్తామని ప్రకటించారు. మంగళవారం ఉదయం 10.23 గంటలకు వేదిక మారుస్తూ టీడీపీ పట్టణాధ్యక్షుడు రమేష్ వాట్సాప్ గ్రూప్ల్లో మెసేజ్లు పంపారు. అప్పటికే వైఎస్సార్సీపీ నేత గోపీకృష్ణ, కౌన్సిలర్లు మారుతీరెడ్డి, శివ, తదితరులు బాలకృష్ణ ఇంటి వద్దకు చేరుకున్నారు. చదవండి: (అర్హతే ప్రామాణికం) గత టీడీపీ హయాంలో హిందూపురంలో బాలకృష్ణ ఎలాంటి అభివృద్ధి చేశారో వచ్చి చెప్పాలంటూ టీడీపీ నాయకులను ప్రశ్నించారు. సమాధానం చెప్పలేక జై బాలయ్య అంటూ టీడీపీ నేతలు నినాదాలతో వాతావరణాన్ని వేడెక్కించారు. ప్రతిగా వైఎస్సార్సీపీ నాయకులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఇరు వర్గాలకు నచ్చచెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. చదవండి: (నటుడు నాని ఏ కిరాణా కొట్టు లెక్కలు లెక్కపెట్టారో: మంత్రి పేర్ని నాని) జనవరి నుంచి కొత్త డంపింగ్ యార్డుకు చెత్త జనవరి నుంచి చిన్నగుడ్డంపల్లి వద్దకు డంపింగ్ యార్డును మార్చనున్నట్లు హిందూపురం మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాలుగా మోత్కుపల్లి రోడ్డులో ఉన్న డంపింగ్ యార్డు వల్ల స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయంగా ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ స్పందించి పర్యావరణ శాఖ నుంచి ఎన్ఓసీ తెప్పించి ఇవ్వడంతో 2022, జనవరి నుంచి చెత్తను కొత్త డంపింగ్ యార్డుకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందు కోసం అన్ని చర్యలూ పూర్తి అయ్యాయన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా యార్డు చుట్టూ వందలాది మొక్కలు నాటిస్తున్నట్లుగా తెలిపారు. -
వ్యర్థాలే ‘పవర్’ ఫుల్!
సాక్షి, అమరావతి: వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీకి రంగం సిద్ధమైంది. డంపింగ్ యార్డులో కుప్పలుగా పడి పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఈ వ్యర్థాలు ఇకపై వెలుగులను వెదజల్లనున్నాయి. దీనికి గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నాయుడుపేటలో 15.50 ఎకరాల్లో ఏర్పాటు చేసిన కర్మగారం వేదికగా కానుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో జిందాల్ సంస్థ రూ.340 కోట్లతో ఈ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. గత సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8 వరకూ ప్రయోగాత్మకంగా ఇక్కడ విద్యుత్ను ఉత్పత్తి చేశారు. ఇది విజయవంతమవడంతో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్మాగారంలో విద్యుదుత్పత్తి జరిగే విధానంపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది.. ఇలా ఉత్పత్తి.. రోజుకు 1,200 మెట్రిక్ టన్నుల వ్యర్థాలతో 15 మెగా వాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడ, గుంటూరు, తాడేపల్లి–మంగళగిరి నగరపాలక సంస్థలతో పాటు సత్తెనపల్లి, చిలకలూరిపేట, నరసరావుపేట, పొన్నూరు, తెనాలి పురపాలక సంస్థల నుంచి వ్యర్థాలను ఇక్కడికి తీసుకొస్తారు. లారీల్లో వచ్చే చెత్తను కర్మాగారంలోని పిట్లో అన్లోడ్ చేస్తారు. చెత్తను నిల్వ చేసేందుకు 25 మీటర్ల వెడల్పు, 71 మీటర్ల పొడవుతో పిట్ను నిర్మించారు. పిట్లో ఉన్న వ్యర్థాలను గ్రాబ్ క్రేన్ సాయంతో ఫీడర్లో వేస్తారు. ఫీడర్ కింద అమర్చిన సోటకర్ నుంచి వెలువడే మంటలో వ్యర్థాలను మండిస్తారు. ఇవి మండినప్పుడు వచ్చే వేడికి బ్రాయిలర్లో స్టీమ్ వెలువడుతుంది. ఈ స్టీమ్.. టర్బైన్లను తిప్పినప్పుడు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 20 మెగా వాట్ల టర్బైన్ను అమర్చారు. ఉత్పత్తి అయిన విద్యుత్ను వెంగళాయపాలెంలోని విద్యుత్ సబ్ స్టేషన్కు సరఫరా చేసేందుకు వీలుగా కర్మాగారం నుంచి 32 కేవీ విద్యుత్ లైన్ను వేశారు. కర్మాగారంలో 11/33 కేవీ స్విచ్ యార్డు నెలకొల్పారు. కర్మాగారంలో ఉత్పత్తి అయిన విద్యుత్ను డిస్కమ్లకు యూనిట్కు రూ.6.16కు విక్రయిస్తారు. వ్యర్థాలు మండినప్పుడు బాటమ్ యాష్, ఫ్లైయాష్ అనే రెండు రకాలైన బూడిద వెలువడుతుంది. ఫ్లైయాష్ను నిర్మాణాలకు వాడే ఇటుకల తయారీకి వినియోగిస్తారు. బాటమ్ యాష్ను లోతట్టు ప్రాంతాల్లో పూడిక కోసం వినియోగించవచ్చు. ఇదే తరహాలో విశాఖలోనూ.. గుంటూరు తరహాలోనే విశాఖపట్నంలో 15 మెగా వాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం గల మరో కర్మాగారం నిర్మాణంలో ఉంది. 2016లో కర్మాగారాల ఏర్పాటుకు జిందాల్ సంస్థకు అనుమతులు లభించినా, అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో పనులు వేగంగా జరగలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఈ రెండు కర్మాగారాల ఏర్పాటుతో సుమారు 400 మందికి ఉపాధి లభిస్తోంది. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ కర్మాగారాలు దేశంలో ఇప్పటికే ఐదు ఉన్నాయి. ఢిల్లీలో మూడు, మధ్యప్రదేశ్లోని జబల్పూర్, హైదరాబాద్లో ఒక్కొక్కటి చొప్పున ఉండగా, ఏపీలో ఉన్న రెండింటితో కలిపి మొత్తం ఏడయ్యాయి. త్వరలోనే విద్యుదుత్పత్తి ప్రయోగాత్మక పరిశీలన విజయవంతమైంది. కమర్షియల్ ఆపరేషన్ డేట్(సీవోడీ) కోసం ఏపీసీపీడీసీఎల్కు దరఖాస్తు చేశాం. సీవోడీ మంజూరైతే విద్యుదుత్పత్తిని ప్రారంభిస్తాం. త్వరలోనే కర్మాగారంలో పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. – ఎంవీ చారి, జిందాల్ ఏపీ ప్రాజెక్ట్ల ప్రెసిడెంట్ -
హుస్సేన్సాగర్ని డంపింగ్ సాగర్గా మార్చారు..
సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున ఉన్న చారిత్రక హుస్సేన్సాగర్ను స్వచ్ఛమైన జలాలతో నింపాలన్న సర్కారు సంకల్పం కాగితాలకే పరిమితమవుతోంది. తాజాగా బహుళ అంతస్తుల సెక్రటేరియేట్ భవనాల కూల్చివేత ద్వారా వచ్చిన సుమారు రెండు లక్షల టన్నుల నిర్మాణ వ్యర్థాలను సాగర్లో డంపింగ్ చేశారంటూ పలువురు పర్యావరణ వేత్తలు జాతీయ హరిత ట్రిబ్యునల్ను ఆశ్రయించడంతో సాగరమథనంపై అందరి దృష్టి మళ్లింది. కాగా స్వచ్ఛ సాగర్గా మార్చేందుకు గత దశాబ్దకాలంగా చేసిన వరుస ప్రయోగాలు ఆశించిన మేర సత్ఫలితాలివ్వకపోవడంతో మిషన్ గాడి తప్పిందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. దశాబ్దకాలంగా సాగర ప్రక్షాళనకు సుమారు రూ.326 కోట్లు ఖర్చుచేసినా ఫలితం శూన్యమని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. వ్యర్థాల డంపింగ్పై ఎన్జీటీలో పిటీషన్.. పాత సచివాలయం భవనాల కూల్చివేత ద్వారా వచ్చిన రెండు లక్షల టన్నుల ఘన వ్యర్థాలను అధికారులు వేరొక చోటుకు తరలించినట్లు చెబుతున్నా..అవన్నీ హుస్సేన్సాగర్లో కలిపేశారని, దీంతో సాగర్ 35 మీటర్ల మేర కుంచించుకుపోయిందని ఆరోపిస్తూ సేవ్ అవర్ అర్బన్ లేక్స్ సంస్థ కన్వీనర్, పర్యావరణ వేత్త లుబ్నాసర్వత్ జాతీయ హరిత ట్రిబ్యునల్లో పిటీషన్ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించారు. దీనిపై సెప్టెంబరు 7న సమగ్ర విచారణ జరగనున్నట్లు ఆమె తెలిపారు. డంపింగ్పై వాస్తవాలు బయటపెట్టాలి: లుబ్నా సర్వత్ సచివాలయ కూల్చివేత వ్యర్థాలను హుస్సేన్ సాగర్లో కలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను ఎన్జీటీకి సమర్పించాం. ప్రభుత్వం ఈ విషయంలో వాస్తవాలు బయటపెట్టాలి. అందమైన హుస్సేన్ సాగర్ను ఇలా డంపింగ్ లేక్గా మార్చడం ఏమాత్రం సబబు కాదు. ఆస్ట్రియాలోని డాన్యుబ్ నది తరహాలో ప్రక్షాళన అవసరం సుమారు 900 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో విస్తరించిన హుస్సేన్సాగర గర్భంలో దశాబ్దాలుగా సుమారు 40 లక్షల టన్నుల ఘనవ్యర్థాలు పోగుపడినట్లు అంచనా. ప్రభుత్వం గత దశాబ్దకాలంగా సుమారు 5 లక్షల టన్నుల వ్యర్థాలను మాత్రమే తొలగించినట్లు సమాచారం. మిగిలిన 35 లక్షల టన్నుల ఘన వ్యర్థాలు సాగర గర్భంలోనే మిగిలిపోయాయి. ఈ ఘన వ్యర్థాలను కూడా డాన్యుబ్ నది తరహాలో ఆస్ట్రియా సాంకేతిక పరిజ్ఞానంతో తొలగించి మందమైన హెచ్డీపీఈ పైపుల్లో నింపి సాగరం చుట్టూ కట్టలా ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆస్ట్రియా నిపుణుల సహకారం, సాంకేతికతతో మాత్రమే ఈ పనులు చేయగలుగుతారని..ప్రస్తుతం మన వద్ద అందుబాటులో ఉన్న విధానాలతో అట్టడుగున ఉన్న ఘన వ్యర్థాలను తొలగించడం సాధ్యపడదని స్పష్టంచేస్తుండడం గమనార్హం. సాగర మథనం సాగుతోందిలా.. ► ప్రక్షాళనకు తీసుకున్న చర్యలు: 2006లో రూ.270 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం, ఘన వ్యర్థాల తొలగింపు ► 2014: రూ.56 కోట్లతో కూకట్పల్లి నాలా డైవర్షన్ పనులు ► 2015: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఎనిమిది కాళ్ల ఎక్స్కావేటర్తో వ్యర్థాలు తొలగింపు. ► 2017: హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో సాగర జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు కెనడాకు చెందిన ఎజాక్స్ కంపెనీ శాటిలైట్ ఆధారిత టెక్నాలజీ వినియోగం. (ఈ ప్రయోగాన్ని ఉచితంగానే చేశారు) ► హుస్సేన్సాగర్ ప్రక్షాళనకు దశాబ్దకాలంలో చేసిన వ్యయం: సుమారు రూ.326 కోట్లు చదవండి: ఇదేం రూల్ సారూ.. టులెట్ బోర్డుకు రూ.2 వేల జరిమానా! -
బాబోయ్ డంపు.. తట్టుకోలేక ప్రజలు..
సాక్షి, హైదరాబాద్: నిజాంపేట్లోని డంపింగ్ యార్డుతో స్థానికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. చాలాకాలం నుంచి దీనిని ఇక్కడ నుంచి తరలించాలని అధికారులను వేడుకుంటున్నా ఎవరూ స్పందించకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం బాచుపల్లిలోని సర్వే నెంబర్ 186లో ప్రభుత్వ స్థలంలో అధికారులు డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. అయితే నిత్యం యార్డు నుంచి వెలువడే దుర్వాసనలు, చెత్తను కాల్చడంతో ఎగసి పడుతున్న మంటలు, పొగలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సమస్య తీవ్రతను గుర్తించి ఇక్కడ నుంచి తరలించాలనే డిమాండ్ ప్రజల్లో ఊపందుకుంది. డంపింగ్ యార్డుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ► నిజాంపేట్ కార్పొరేషన్ బాచుపల్లిలోని సర్వే నంబర్ 186లో సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో చెత్త డంపింగ్ యార్డును గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో ఏర్పాటు చేశారు. ► రోజు రోజుకు పెరుగుతున్న జనాభాతో ఇళ్ల నుంచి సేకరించిన చెత్త టన్నుల కొద్దీ పెరుగుతోంది. ఇలా ప్రతి రోజు నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్ ప్రాంతాల్లోని 96 కాలనీల్లో, బస్తీలు, గేటెడ్ కమ్యూనిటీల నుంచి సుమారు 120 టన్నులకు పైగా చెత్తను సిబ్బంది సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ► అయితే ఇక్కడ చెత్తను ఇక్కడ వేరు చేసి జవహర్నగర్ డంపింగ్ యార్డుకు తరలించడం అసలు ఉద్దేశం. ► కానీ నేడు ఏకంగా ఇక్కడే డంపింగ్ యార్డు ఏర్పాటైంది. దీంతో డంపింగ్ యార్డును తరలించాలని స్థానికులు ముక్తకంఠంతో కోరుతున్నారు. విష వాయువులతో ఉక్కిరి బిక్కిరి... ► చెత్త తరచూ తగులబెడుతుండటంతో డంపింగ్ యార్డు రావణ కాష్టంలా నిత్యం మండుతూనే ఉంది. ► గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్తలో ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆసుపత్రి వ్యర్థాలు సైతం ఉంటున్నాయి. ► అయితే ఈ చెత్తను సిబ్బందే తగుల బెడుతున్నారా.? లేక ఏదైనా రసాయన చర్య వల్ల మండుతోందా.. అనేది మాత్రం అంతుచిక్కడం లేదు. ► ఈ మంటలతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ► అసలే దుర్వాసన ఆపై ఘాటైన పొగతో ప్రజలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ► మంటల మూలంగా వాతావరణంలో అనేక వాయువులు విడుదల అవుతున్నాయి. దీంతో ప్రజలు అనేక ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. ఆందోళనలో స్థానికులు.. ► డంపింగ్ యార్డు ఏర్పాటుతో తమకు ప్రశాంత జీవనం కరువైందని హిల్ కౌంటీ, సాయినగర్ కాలనీ, అదిత్య గార్డెన్, రాజీవ్ గృహకల్ప, బండారి లేఅవుట్, జర్నలిస్ట్ కాలనీల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక డంపింగ్ యార్డు పక్కనే నిర్మాణం పూర్తి చేసుకున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభైతే ముప్పు మరింత పెరిగే అవకాశం ఉంది. సమస్య తీవ్రతను గుర్తించి అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి త్వరితగతిన డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి తరలించాలని కోరుతున్నారు. విష జ్వరాల బారిన ప్రజలు... ► డంపింగ్ యార్డు కారణంగా రోజుల తరబడి చెత్త పేరుకుపోవడంతో దోమలు, ఈగలు వృద్ధి చెందుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు మలేరియా, డెంగీ లాంటి విషజ్వారా -
కంపుకొడుతున్న చెరువుకట్ట.. కారణం ఏంటంటే!
సాక్షి, సిరిసిల్ల(కరీంనగర్): సిరిసిల్ల మున్సిపల్ పరిధి చంద్రంపేటలోని ఈదుల చెరువు కట్ట పరిసర ప్రాంతాల్లో చెత్త, కోళ్ల వ్యర్థాలను పడవేస్తున్నారు. చెరువు చుట్టు పక్కల ప్రాంతంలో దుర్గంధం వెదజల్లుతుందోని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని చెత్తచెదారాన్ని, చికెన్సెంటర్ నిర్వాహకులు కోళ్ల వ్యర్థాలను చెరువుకట్ట చుట్టూ పక్కల డంప్ చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈదుల చెరువు మత్తడి దూకడానికి సిద్ధంగా ఉందని, చెరువు పరిసర ప్రాంతాల్లో చెత్తను డంప్ చేయకుండా, నీరు కలుషితం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
చెత్త సమస్యను చిత్తు చేసేలా ‘స్వచ్ఛ సంకల్పం’
సాక్షి, అమరావతి: గ్రామాల్లో పేరుకుపోతున్న చెత్త సమస్యను చిత్తు చేసే చర్యలు త్వరలో మొదలు కాబోతున్నాయి. పట్టణాల్లో మాదిరిగా గ్రామాల్లోనూ ప్రతి ఇంటినుంచీ చెత్తను సేకరించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకోసం జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరిట వంద రోజుల ప్రణాళిక రూపొందించింది. తద్వారా ప్రతి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేసి ప్రజారోగ్యాన్ని కాపాడాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించేలా గ్రామాల్లో ప్రతి 250 ఇళ్లకు ఒకరిని నియమించడంతో పాటు చెత్త సేకరణకు ఆటోలు, రిక్షాలు వంటివి ప్రభుత్వమే గ్రామ పంచాయతీలకు సమకూర్చనుంది. అలా సేకరించిన చెత్తను ఎక్కడికక్కడ ప్రాసెసింగ్ చేయటం ద్వారా వర్మీ కంపోస్టు తయారు చేస్తారు. ప్రాసెసింగ్ ద్వారా వేరు చేసిన పొడి చెత్తను ఫ్యాక్టరీలకు వెళ్లనుంది. ఇందుకు పంచాయతీరాజ్ శాఖ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యాచరణ సిద్ధం చేశాయి. గ్రామాల్లో రోజుకు 12,250 టన్నుల చెత్త గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వ్యక్తి రోజుకు సగటున 300 గ్రాముల చెత్తను పారబోస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఈ విధంగా కేవలం గ్రామీణ ప్రాంతాల నుంచే రోజుకు 500 లారీల్లో పట్టేంతగా 12,250 టన్నుల చెత్త పోగవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లపై చెత్తను శుభ్రం చేయడం గ్రామ పంచాయతీలకు, పంచాయతీరాజ్ శాఖకు, ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. గ్రామాల్లో పోగయిన చెత్తను రోడ్లకు ఇరువైపులా కుప్పలుగా పోసి తగులబెట్టడం వల్ల వచ్చే పొగ, వాసనతో స్థానిక గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం ఓ శాస్త్రీయమైన, సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. కనీసం చెత్తను తగులబెట్టే అవసరం లేకుండా నిత్యం పోగయ్యే చెత్తను ఎప్పటికప్పుడే ప్రత్యామ్నాయ అవసరాలకు వినియోగించుకునేలా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. 12 శాతం చెత్తతోనే అసలు సమస్య గ్రామీణ ప్రాంతాల్లో పోగయ్యే మొత్తం చెత్తలో 65 శాతం తడి చెత్త రూపంలో ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో వర్మీ కంపోస్టు తయారు చేయాలని నిర్ణయించారు. మరో 12 శాతం పొడి చెత్త (గాజు పెంకులు, కార్డు బోర్డు, ఒక రకమైన ప్లాస్టిక్) వల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికి సమస్యలొస్తున్నాయి. దీనిని విద్యుత్ ఉత్పత్తి, సిమెంట్ ఫ్యాక్టరీల్లో మండించడానికి ఉపయోగించేలా ప్రాథమిక కార్యాచరణ రూపొందించారు. మిగిలిన 23 శాతం చెత్తను రీసైక్లింగ్కు ఉపయోగించాలని ఆలోచన చేస్తున్నారు. నాలుగు ఫ్యాక్టరీలు ఎంపిక పొడి చెత్తతో గ్రామ స్థాయిలోనే వర్మీ కంపోస్టు తయారు చేసేలా రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి గ్రామంలో ఒక షెడ్ చొప్పున ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 9 వేలకు పైగా గ్రామాల్లో వీటి నిర్మాణం పూర్తయింది. రీ సైక్లింగ్కు ఉపయోగించే చెత్తను ఆ షెడ్లలోనే వేరుచేసి అక్కడే విక్రయిస్తారు. మిగిలిన 12 శాతం చెత్తను మండించేందుకు రాష్ట్రంలోని నాలుగు ప్రధాన ప్రాంతాల్లో నాలుగు ఫ్యాక్టరీలను ఎంపిక చేయనున్నారు. -
అమానవీయం: ప్రాణం లేదని.. చెత్తకుప్పలోకి
మహబూబ్నగర్: తల్లి గర్భంలోనే ఆ శిశువుకు నూరేళ్లు నిండాయి. ఆపరేషన్ ద్వారా వైద్యులు శిశువు మృతదేహాన్ని బయటకు తీయగా.. ఆ కుటుంబసభ్యులు మానవత్వం మరిచారు. పద్ధతి ప్రకారం అంత్యక్రియలు చేయకుండానే దారిలో చెత్తకుప్పలో ఆ ఆడ శిశువు మృతదేహాన్ని పడేసిన ఘటన గురువారం మహబూబ్నగర్లో కలకలం రేపింది. జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకిషన్ కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం బకారం గ్రామానికి చెందిన మహిళ మూడో కాన్పు కోసం మార్చి 29న నాగర్కర్నూల్ ఆస్పత్రికి వెళ్లింది. అప్పటికే గర్భసంచిలో పిండం మృతి చెందడంతో హైరిస్క్ కేసు కింద వారు మహబూబ్నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. మహబూబ్నగర్ ఆస్పత్రికి రాత్రి 11.30 వచ్చారు. రాత్రి 1.30 ప్రాంతంలో ఆపరేషన్ చేసి తల్లి గర్భంలో నుంచి మృతి చెందిన ఆడ శిశువును బయటకు తీశారు. తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో శిశువు మృతదేహాన్ని తండ్రికి అప్పగించి స్వగ్రామానికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. అయితే కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లకుండా పట్టణంలోని ఓ డ్రైనేజీ సమీపంలో ఉండే చెత్తకుప్పలో పడేశారు. గురువారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టూటౌన్ పోలీసులు శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం గదికి తరలించారు. శిశువు చేతిపై ఆస్పత్రి సిబ్బంది ఏర్పాటు చేసిన ట్యాగ్ ద్వారా ఎవరి శిశువు అనే విషయాన్ని అధికారులు గుర్తించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులను పిలిపించి అడిగితే తప్పు జరిగిందని ఒప్పుకున్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు. ప్రస్తుతం తల్లి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటం వల్ల ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. -
పోలవరంలో ఎన్జీటీ బృందం
పోలవరం రూరల్: పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మూలలంక ప్రాంతంలోని డంపింగ్ యార్డు మట్టి జారిపోకుండా తీసుకున్న చర్యలు, ఇంకా చేపట్టాల్సిన పనులను జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) బృందం మంగళవారం పరిశీలించింది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శేషశయనారెడ్డి నాయకత్వంలో బృంద సభ్యులు కోట శ్రీహర్ష, టి.శశిధర్, ఎస్.మన్నివరం, హెచ్డీ వరలక్ష్మి, డి.సురేష్ పోలవరం ప్రాజెక్టు డంపింగ్ యార్డులు, ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డంపింగ్ యార్డులను పరిశీలించి ప్రాజెక్టు సీఈ ఎం.సుధాకర్బాబు, ఎస్ఈ కె.నరసింహమూర్తిల నుంచి వివరాలు తెలుసుకున్నారు. బీసీ కాలనీ సమీపంలో ఉన్న 203 ఎకరాల డంపింగ్ యార్డు ఏమైనా జారిపోయిందా, మొక్కలు నాటారా.. కాలువ పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలను పరిశీలించారు. 902 హిల్ ప్రాంతంలోని స్పిల్ చానల్ మట్టిని పోస్తున్న రెండు ప్రదేశాలను కూడా చూశారు. హిల్ వ్యూ పై నుంచి స్పిల్ వే రేడియల్ గేట్ల అమరిక, ఎగువ కాఫర్డ్యామ్, ట్విన్టన్నెల్స్ పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బృందం సభ్యులు మూలలంక డంపింగ్యార్డు కోసం తీసుకున్న 203 ఎకరాల భూములకు పరిహారం చెల్లించారా లేదా అనే విషయాలను ఆరా తీశారు. 30 మంది రైతులు పరిహారం తీసుకోలేదని, వారికి సంబంధించిన సొమ్ము కోర్టులో జమచేశామని అధికారులు తెలిపారు. ఈ బృందం బుధవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో పబ్లిక్ హియరింగ్ నిర్వహించి ఆ ప్రాంత వాసుల నుంచి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుంటుంది. ఆర్డీవో వైవీ ప్రసన్నలక్ష్మి, తహసీల్దార్ బి.సుమతి, ఈఈ మల్లికార్జునరావు, మేఘ జీఎం ఎ.సతీష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఆటోతో ఢీకొట్టి, ఆస్పత్రిలో చేర్చకుండా...
సాక్షి, హైదరాబాద్: మానవత్వం మనుషుల్లో రాన్రాను కానరాకపోతోందనడానికి, ఆటోడ్రైవర్ పేరుకు మచ్చతెచ్చే ఓ మచ్చుతునక ఈ అమానుష ఘటన. రోడ్డుపై నడుస్తున్న వ్యక్తిని ఆటోతో ఢీ కొట్టి గాయపరచడమే కాకుండా అతడిని ఆస్పత్రిలో చేర్చాలన్న కనీస మానవత్వాన్ని మరిచి డంపింగ్ యార్డులో పడేసి ఆ వ్యక్తి మృతికి కారణమయ్యాడు ఓ ఆటోడ్రైవర్. ఘటన జరిగిన రెండు నెలల తర్వాత సెల్ఫోన్ సిగ్నల్స్, సీసీ ఫుటేజీ ఆధారంగా ఆటోడ్రైవర్ కిరాతకం బయటపడింది. ఈ ఘటన వివరాలను కూకట్పల్లి ఏసీపీ సురేందర్రావు మంగళవారం విలేకరులకు వెల్లడించారు. ఫైనాన్స్ డబ్బులు చెల్లించేందుకు వెళ్లి... మియాపూర్ జనప్రియనగర్కు చెందిన కాకర రామకృష్ణ జనవరి 7న ఇంటి నుంచి బయటకు వెళ్లి మియాపూర్ రత్నదీప్ మార్కెట్ వద్ద ఫైనాన్స్ డబ్బులు చెల్లించేందుకు గాను రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో హఫీజ్పేటకు చెందిన సయ్యద్ షేర్ అలీ (38) తన స్నేహితుడైన గౌస్కు చెందిన ఆటో (టీఎస్07యూసీ 7684నంబర్)ను తీసుకుని ఆటోతో రామకృష్ణను ఢీ కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలైన రామకృష్ణ రోడ్డుపై పడి సృహ కోల్పోయాడు. స్థానికులు గమనించి రామకృష్ణను ఢీ కొట్టిన ఆటోలోనే ఎక్కించి ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఆటో డ్రైవర్ సయ్యద్ షేర్ అలీకి సూచించారు. సరేనంటూ ఆటోలో బాధితుడిని ఎక్కించుకున్న ఆటో డ్రైవర్ షేర్ అలీ కొద్దిదూరం వెళ్లిన తరువాత బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని ఖైత్లాపూర్లోని డంపింగ్ యార్డులో పడవేసి వెళ్లిపోయాడు. రామకృష్ణ వద్ద ఉన్న సెల్ఫోన్తో పాటు రూ.3 వేల నగదును కూడా తీసుకుని వెళ్లిపోయాడు. మిస్సింగ్ కేసుగా నమోదు అదే నెల 8వ తేదీకి కూడా రామకృష్ణ ఇంటికి తిరిగిరాకపోవటంతో కుటుంబ సభ్యులు మియాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మరోవైపు 8వ తేదీనాడు సాయంత్రం నాలుగు గంటలకు ఖైత్లాపూర్ వద్ద ఉన్న జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డు వద్ద గుర్తుతెలియని శవం పడి ఉందన్న సమాచారంతో కూకట్పల్లి పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మియాపూర్లో రామకృష్ణ మిస్సింగ్ కేసు నమోదు కావడం, కూకట్పల్లి పోలీస్స్టేషన్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యం కావడంతో పాటు ఇద్దరి వివరాలు ఒకే విధంగా ఉండటంతో రామకృష్ణ కుటుంబసభ్యులను కూకట్పల్లి పోలీసులు పిలిపించగా..వారు మృతదేహాన్ని రామకృష్ణదిగా గుర్తించారు. మృతదేహంపై ఉన్న గాయాలను బట్టి ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును మొదలుపెట్టారు. ఆ క్రమంలో ముందుగా రామకృష్ణ రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొట్టడాన్ని సీసీ పుటేజీద్వారా గుర్తించారు. దీంతోపాటుగా రామకృష్ణ సెల్ఫోన్ను నిందితుడైన ఆటోడ్రైవర్ లతీఫ్ అనే వ్యక్తికి రూ.1000కి విక్రయించినట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో లతీఫ్ను విచారించగా నిందితుడు ఆటోడ్రైవర్ సయ్యద్ షేర్ అలీ అని తేలింది. మంగళవారం ఆటో డ్రైవర్ సయ్యద్ షేర్అలీని అదుపులోకి తీసుకుని విచారించగా..సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్తే బ్రతికేవాడేనని, ఆస్పత్రికి తీసుకెళ్లితే తనపై కేసు అవుతుందేమోనన్న భయంతో పాటు వైద్యం ఖర్చులు కూడా తానే భరించాల్సి వస్తుందన్న కారణంతో రామకృష్ణను డంపింగ్ యార్డులో పడేసినట్లు షేర్ అలీ ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు. -
సఫాయివాలా అవతారమెత్తిన హరీశ్రావు
సాక్షి, సిద్దిపేట: జిల్లాలోని బుస్సాపూర్ డంపింగ్ యార్డులోని తడి, పొడి చెత్తను వేరుచేసే యంత్రాన్ని మంగళవారం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుడి యూనిఫాం వేసుకుని అక్కడున్న కార్మికులతో కలిసి పనిచేశారు. మంత్రి మాట్లాడుతూ, వ్యర్థం అనుకున్న ప్రతి వస్తువును ఉపయోగకరంగా మార్చుకోవచ్చని చెప్పారు. సాక్షి, సిద్దిపేట: వ్యర్థ పదార్థాలు, మనకు ఇబ్బంది కరంగా ఉన్న చెత్త, చెదారాన్ని కాస్తా ఆలోచించి, కొద్దిపేట శ్రమను జోడిస్తే ఉపయోగకరమైన పదార్థాలుగా, ఎరువులుగా తయారు చేసుకోవచ్చని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్లో చెత్త రీసైక్లింగ్ యూనిట్ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిద్దిపేట పట్టణంలో రోజుకు 40 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందన్నారు. ఈ తడి, పొడి చెత్తనే వేరు చేసేందుకు రూ. 2.5 కోట్లతో మానవ ఘన వ్యర్థాల నిర్వాహణ(ఎఫ్ఎస్టీపీ) కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇటుకల తయారీని పరిశీలిస్తున్న ఆర్థిక మంత్రి హరీశ్రావు ఇప్పటికే సిరిసిల్లలో తొలుత నిర్మించామన్నారు. ఇలా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిదన్నారు. సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాన్ని ఎఫ్ఎస్టీపీకి అందజేయాలన్నారు. దీన్ని ప్రాస్సెస్ చేసిన తర్వాత 16వేల లీటర్ల నీటిని పార్కులోని మొక్కలకు అందజేస్తారన్నారు. అదేవిధంగా 800 కేజీల ఎరువు వస్తుందని, ఈ ఎరువును రైతులకు ఉచితంగా అందజేస్తామన్నారు. డంప్యార్డులోకి ఎంత చెత్త వస్తుందనే విషయం తెలుసుకునేందరు. రూ. 12లక్షలతో వే బ్రిడ్జి నిర్మించామన్నారు. అదేవిధంగా తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు రూ. 50లక్షలతో మిషన్ కొనుగోలు చేశామని తెలిపారు. వేరుచేసిన తడి చెత్త నుండి సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నామన్నారు. అదేవిధంగా రూ. 30లక్షలతో కొనుగోలు చేసిన యంత్రంతో పొడి చెత్తలోని ప్లాస్టిక్ నుంచి సిమెంట్ బ్రిగ్స్, ఇతర కుండీలు, అలంకరణ వస్తువులు తయారు చేస్తున్నామన్నారు. త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్ త్వరలో ఉద్యోగాల నోటిఫికేషన్ శుభవార్తను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పనున్నారని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కరోనాతో అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. త్వరలోనే రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలతో కూడిన నోటిఫికేషన్ రానుందని, అందుకోసం జిల్లాలో ప్రత్యేక శిక్షణ కేంద్రాలను యువతకు అందుబాటులో ఉంచడంతో పాటుగా, మెటీరియల్ను అందించనున్నట్లు తెలిపారు. దశల వారీగా ప్లాస్టిక్ రోడ్లు.. ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగకరంగా మార్చే ప్రక్రియలో భాగంగా సిద్దిపేటలో రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ రోడ్లు వేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ రోడ్ల నిర్మాణం జరుగుతుందని గుర్తు చేశారు. సిద్దిపేటలో కొంత భాగాన్ని ఎంపిక చేసుకొని ప్లాస్టిక్ రోడ్లు వేస్తామని, దాని ఫలితాలను బట్టి దశల వారీగా విస్తరిస్తామని తెలిపారు. -
గోదా‘వర్రీ’.. పవిత్ర జలాలు అపవిత్రం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : పవిత్ర గోదావరి జలాలు కలుషితమవుతున్నాయి. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే నీళ్లు మురుగును తలపిస్తున్నాయి. పరీవాహకం వెంట ఉన్న ఫ్యాక్టరీలు.. నగర శివారు ప్రాంతాల్లోని వ్యర్థాలన్నీ గోదావరిలో సమ్మిళితం కావడంతో నదీ పవిత్రతను కోల్పోతోంది. రాష్ట్రంలో నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రం వద్ద మహారాష్ట్ర నుంచి తెలంగాణలో ప్రవేశించే గోదావరి.. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన దివ్యక్షేత్రం భద్రాచలం వద్ద ఏపీలోకి వెళ్తోంది. ఈ మధ్య ప్రాంతంలో 465 కిలోమీటర్ల మేర ప్రవహించే గోదావరిలోకి పలు చోట్ల భారీగా చెత్తా చెదారం చేరుతోంది. మురుగు నీటిని నేరుగా గోదావరిలోకి వదులుతుండటంతో పవిత్ర జలాలు అపవిత్రం అవుతున్నాయి. గోదావరిలో కలిసే అన్ని ఉపనదులు దట్టమైన అటవీ ప్రాంతాల నుంచి ప్రవహిస్తూ వస్తుండటంతో ఔషధ విలువలు ఉండాల్సిన జలాలు కాస్తా కాలుష్యమయం అవుతున్నాయి. దీంతో పర్యా వరణానికి హాని కలుగుతుండటంతో పాటు జం తువులు, వన్యప్రాణులు సైతం ఆ నీరు తాగి మృత్యువాత పడుతున్నాయి. బాసర, ధర్మపురి, మంచిర్యాల, రామగుండం, మంథని, భద్రాచలం పట్టణాల నుంచి ప్రతిరోజూ మురుగునీటిని శుద్ధి చేయకుండానే నేరుగా గోదావరిలోకి వదులుతున్నారు. మారని పరిస్థితి.. గోదావరి జలాల్లోకి నేరుగా ఒక్క చుక్క మురుగు నీరు వదలొద్దని.. ఎన్ని కోట్లు ఖర్చయినా మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ గతంలో ఆదేశించారు. అయినప్పటికీ పరిస్థితి మారకపోగా మరింత అధ్వానంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తిపోతల పథకాలు నిర్మించి రివర్స్ పంపింగ్ చేస్తోంది. దీంతో కలుషిత నీరు బ్యారేజీల్లోకి చేరి నీటిలోని జలచరాలు అంతరించిపోయే పరిస్థితి నెలకొంది. అలాగే ఈ నీటిని తాగేందుకు ఉపయోగిస్తే ప్రమాదకరమైన జబ్బుల బారిన పడే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. ఇటువంటి పరిíస్థితుల్లో ఎస్టీపీల (మురుగునీటి శుద్ధి ప్రక్రియ ప్లాంట్లు) ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. పని చేయని ప్లాంట్లు.. రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ల తర్వాత అతిపెద్ద రామగుండం కార్పొరేషన్ నుంచి ప్రతిరోజూ 32 మిలియన్ లీటర్ల మురుగునీరు గోదావరిలో కలుస్తోంది. ఈ నీటిని ఏమాత్రం శుద్ధి చేయకుండా వదిలిపెడుతుండటంతో గోదావరి మురికికూపంగా మారుతోంది. రామగుండం శివారులో నిర్మించిన ఎస్టీపీ ప్లాంట్లో 4 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ ఫర్ డే) వ్యర్థ జలాలను శుద్ధి చేయాలి. అయితే అది పనిచేయడం లేదు. అలాగే 8 ఎకరాల్లో నిర్మించిన మల్కాపూర్ ఎస్టీపీ ప్లాంట్ ద్వారా ప్రతిరోజూ 14 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలను శుద్ధి చేయాలి.. ప్రస్తుతం అది కూడా పనిచేయడం లేదు. అలాగే కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన 14 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన సుందిళ్ల ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం మధ్యలోనే నిలిచింది. దీంతో ఇందుకు కేటాయించిన నిధులూ వృథా అయ్యాయి. రామగుండం కార్పొరేషన్ నుంచి వచ్చే వ్యర్థ జలాలతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర హానికరమైన రసాయన వ్యర్థాలు గోదావరిలో 18 మిలియన్ లీటర్లు కలుస్తున్నాయి. కాగా.. రూ.90 కోట్లతో 21 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీని ద్వారా శుద్ధి చేసిన నీటిని ఎన్టీపీసీకి అందించాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు. అయితే దీనికి ఇంకా అనుమతులు లభించలేదు. ఇక కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి నీటి రివర్స్ పంపింగ్ కారణంగా ముంపునకు గురవుతున్న మల్కాపూర్ ఎస్టీపీ ప్లాంట్ స్థానంలో రూ.15.80 కోట్లతో మరో ప్లాంట్ నిర్మించాలని రామగుండం కార్పొరేషన్ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులకు ప్రతిపాదించారు. దీనిపై ఎలాంటి ముందడుగు పడలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు.. రామగుండంలో 8 ఎంఎల్డీ, మల్కాపూర్ శివార్లలో 21 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన 2 ఎస్టీపీ ప్లాంట్లకు ప్రతిపాదనలు పంపాం. లేటెస్ట్ టెక్నాలజీ వాడేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం. టెండర్ల ప్రక్రియ నడుస్తోంది. – పి.ఉదయ్కుమార్, కమిషనర్, రామగుండం కార్పొరేషన్ రోజూ 11 టన్నుల చెత్త నదిలోనే.. భద్రాచలంలోని 64 కాలనీల నుంచి ప్రతిరోజూ ఉత్పత్తవుతున్న 11 టన్నుల తడి, పొడి చెత్తను దేవస్థానానికి సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక భాగంలో గోదావరి కరకట్ట లోపల నది పారుతున్న చోటే వేస్తున్నారు. దీంతో నదిలోని నీరు కాలకూట విషంలా మారుతోంది. భద్రాచలం పట్టణం మినహా మండలంలోని మిగిలిన గ్రామాలన్నీ పోలవరం ముంపు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కలిపారు. భద్రాచలం చుట్టూ ఏపీ గ్రామాలే ఉన్నాయి. చివరకు భద్రాచలం ఆలయ భూములు 950 ఎకరాలు సైతం ఏపీలోకే వెళ్లాయి. దీంతో పట్టణానికి డంపింగ్ యార్డుకు కూడా స్థలం లేకుండా పోయింది. ఈ క్రమంలో గోదావరికి ఇవతలి ఒడ్డున ఉన్న బూర్గంపాడు మండలం సారపాక పంచాయతీలోని భాస్కర్నగర్, గాంధీనగర్ వద్ద భద్రాచలం డంప్ యార్డ్ ఏర్పాటుకు అధికారులు ప్రయత్నాలు చేయగా.. సారపాక వాసులు వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల జరిగిన బూర్గంపాడు మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో పినపాక ఎమ్మెల్యే, విప్ రేగా కాంతారావు సైతం ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. దీంతో ప్రస్తుతానికి భద్రాచలం వద్ద గోదావరి నదీగర్భమే డంపింగ్ యార్డులా మారింది. ఇచ్చట చెత్త వేస్తే శిక్షార్హులని బోర్డు ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీయే ఆ బోర్డు వద్ద చెత్తను డంప్ చేస్తుండటం గమనార్హం. ఈ విషయమై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కొత్తగూడెం ఇన్చార్జ్ ఈఈ బి.శంకర్బాబును వివరణ కోరగా.. పరిశీలించి భద్రాచలం గ్రామపంచాయతీపై చర్యలు తీసుకుంటామన్నారు. సందట్లో సడేమియాలా.. రాష్ట్ర సరిహద్దులోని మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్లో ఉన్న పయనీర్ లిక్కర్ ఫ్యాక్టరీ వారు వ్యర్థాలను గోతుల్లో నిల్వ చేసి జూలైలో బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తిన సమయంలో సందట్లో సడేమియాలా వ్యర్థాలను గోదావరిలోకి వదులుతుంటారు. ఇక మంచిర్యాల జిల్లా కేంద్రం వద్ద ఉన్న 3 ఎస్టీపీ ప్లాంట్లు పనిచేయడం లేదు. దీంతో మురుగునీరు వాగుల ద్వారా నేరుగా గోదావరిలో కలుస్తోంది. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణం నుంచి మురుగు నీరు నేరుగానే గోదావరిలో కలుస్తోంది. ఇక్కడ ఎస్టీపీ ప్లాంట్ కోసం రూ.18 కోట్లతో ప్రభుత్వానికి ప్రతాపాదనలు పంపారు. ఇటు పెద్దపల్లి జిల్లా మంథని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణాల నుంచి కూడా మురుగునీరు శుద్ధి చేయకుండానే నేరుగా గోదావరిలో కలుపుతున్నారు. -
డంపింగ్ యార్డ్ చెత్త నుంచి విద్యుత్
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా జవహర్నగర్లోని డంపింగ్ యార్డ్ నుంచి వెలువడే మీథేన్ వాయువు ఆధారంగా విద్యుత్ను ఉత్పత్తి చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ హైకోర్టుకు చెప్పారు. రెండు నెలల్లో రెండు విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత మరో రెండు నెలల్లోగా మరో యూనిట్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. డంపింగ్ యార్డ్ వల్ల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు దోమలు, దుర్వాసన వంటి పలు సమస్యల్ని ఎదుర్కొనడంపై పత్రికల్లో వచ్చిన వార్తల ప్రతిని జత చేసి నగరానికి చెందిన సీతారాంరాజు రాసిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డిలతో కూడిన ధర్మాసనం గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు లోకేష్ కుమార్ సోమవారం హైకోర్టుకు హాజరయ్యారు. పత్రికల్లో డంపింగ్ యార్డ్ వల్ల సమస్యల గురించి వార్తలు వస్తున్నాయని, దుర్గంధం వల్ల అక్కడి ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతుంటే జీహెచ్ఎంసీ ఎలాంటి నివారణ చర్యలు తీసుకుందని ధర్మాసనం ప్రశ్నించింది. యార్డ్ 337 ఎకరాల్లో చెత్త ఉండేదని, 137 ఎకరాలకు తగ్గించామని, శాస్త్రీయ పద్ధతుల్లో చెత్తపై పాలిథిన్ కవర్లు మట్టిని వేస్తున్నామని, ఇదే మాదిరిగా పలు పొరలుగా వేస్తామని, దీని వల్ల దుర్వాసన బయటకు వెళ్లదని కమిషనర్ వివరించారు. డంపింగ్ యార్డ్లో చెత్త వేసే పరిధి తగ్గించవచ్చని, అయితే చెత్త వెలువడే దుర్వాసన తగ్గేలా ఎందుకు చేయలేక పోతున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ఒకేచోట చెత్త పేరుకుపోయి ఉంటే అందులోని దుర్గంధమైన నీరు భూమిలోకి చేరే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. చెత్తలో వానపాములు వేసి కొంతవరకూ సమస్యను పరిష్కరిం చేందుకు చర్యలు తీసుకుంటామని, చెత్తను ఎండబెట్టేలా చేసి నివారణ చర్యలు తీసుకుంటామని కమిషనర్ చెప్పారు. విచారణ అనంతరం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కమిషనర్ను ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది. -
రూ. 50 కోట్ల స్థలం మింగేశారు!
సాక్షి, రాజేంద్రనగర్: భూకబ్జాదారులు బరితెగిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ఏకంగా డంపింగ్ యార్డు స్థలానికి ఎసరు పెట్టారు. మొత్తం 22 ఎకరాల్లో దాదాపు 6 ఎకరాలను ప్లాట్లుగా మార్చి విక్రయించి యథేచ్ఛగా సొమ్ము చేసుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గండిపేట మండల పరిధిలోని గంధంగూడ సర్వేనంబర్ 43లో ప్రభుత్వానికి చెందిన 22.17 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలాన్ని గతంలో ప్రభుత్వం డంపింగ్ యార్డును ఏర్పాటు చేసేందుకు సిలికాన్ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించింది. నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన చెత్తాచెదారాన్ని ఇక్కడ డంప్ చేసి రీసైక్లింగ్ నిర్వహించేవారు. ఏడు సంవత్సరాల క్రితం ఈ డంపింగ్ యార్డు మూతబడింది. అంతకుముందు వేసిన చెత్తచెదారంతో ఆ ప్రాంతం ఓ గుట్టలా మారింది. అయితే, కొంతకాలంగా కొందరు స్థానిక నేతలు ఈ చెత్తను తొలగించి ప్లాట్లుగా మారి అమాయకులకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. చెత్తలోనే గుంతలు తీసి పిల్లర్లు వేసి ఇళ్లను నిర్మిస్తున్నారు. 120 నుంచి 180 గజాల వరకు ప్లాట్లుగా చేసి నిర్మాణాలను ప్రారంభించారు. ఈ నిర్మాణాలకు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. డంపింగ్ యార్డు స్థలంలోనే నిర్మాణాలను చేపడుతున్న ఇక్కడి కార్పొరేషన్, రెవెన్యూ అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఈ స్థలాన్ని గండిపేట మండల ఆర్ఐ, వీఆర్వోల ఆధ్వర్యంలో డిజిటల్ సర్వే నిర్వహించడం కొసమెరుపు. స్థానికుడు కృష్ణాగౌడ్ ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలంటూ ఇటీవల ఫిర్యాదు చేయడంతో ఈ సర్వే చేపట్టారు. ఈ సర్వే వివరాలను 3–4 రోజుల్లో వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ ఒక్కో ఎకరం దాదాపు రూ. 8 కోట్ల వరకు పలుకుతోందని స్థానికులు చెబుతున్నారు. అక్రమార్కులు దాదాపు రూ. 50 కోట్ల విలువైన స్థలాన్ని మింగేసినా యంత్రాంగం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆర్ఐ వాణిరెడ్డిని వివరణ కోరగా.. కొన్నిరోజుల్లో సర్వేకు సంబంధించిన రిపోర్టు వస్తుందని, దాని ద్వారా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
సాయంత్రమూ సాఫ్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో రోజురోజుకు చెత్త పెరిగిపోతోంది. జీహెచ్ఎంసీ 2012–13లో 2,200 మెట్రిక్ టన్నుల చెత్తను తరలించగా... ప్రస్తుతమది 5,000 మెట్రిక్ టన్నులను దాటిపోయింది. అయినప్పటికీ వాణిజ్య ప్రాంతా ల్లో, రహదారులపై ఎక్కడ పడితే అక్కడ చెత్త కనిపిస్తోంది. చెత్త తరలింపు కోసం జీహెచ్ఎంసీ ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా, రోడ్లపై వ్యర్థాలు వేయకుండా జరిమానాలు విధిస్తున్నా ఫలితం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ఉదయం చెత్త తరలించినప్పటికీ... తిరిగి చెత్త ఎక్కువగా పోగవుతున్న ప్రాంతాల్లో సాయంత్రం వేళల్లోనూ తరలించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. ఇందుకోసం 120 అద్దె వాహనాలను అందుబాటులోకి తెస్తోంది. వీటిని ఒక్కో సర్కిల్కు నాలుగు చొప్పున కేటాయించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ సోమవారం పేర్కొన్నారు. వీటితో పాటు ఒక్కో సర్కిల్కు రెండు చొప్పున 30 సర్కిళ్లకు మొత్తం 60 బాబ్కాట్లను కేటాయించారు. మరి డంపింగ్యార్డుకు.? అందుబాటులోకి రానున్న వాహనాలు ఆయా ప్రాంతాల్లోని చెత్తను రవాణా కేంద్రాలకు తరలిస్తాయి. అక్కడి నుంచి పెద్ద వాహనాలు (25 మెట్రిక్ టన్నులు, 10 మెట్రిక్ టన్నుల సామర్థ్యం) చెత్తను డంపింగ్యార్డుకు వెంటనే తరలించాల్సి ఉంది. లేని పక్షంలో రవాణా కేంద్రాల్లో సాయంత్రం వేసే చెత్తకు మళ్లీ ఉదయాన్నే వచ్చే చెత్త తోడైతేటన్నుల కొద్దీ పేరుకుపోతుంది. జీహెచ్ఎంసీలో అద్దెవి, సొంతవి కలిపి 25 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన వాహనాలు దాదాపు 130 ఉన్నాయి. అలాగే 10 మెట్రిక్ టన్నులవి జీహెచ్ఎంసీ వాహనాలే 7 ఉన్నాయి. తాజాగా వినియోగంలోకి రానున్న ఒక్కో వాహనం దాదాపు 3 మెట్రిక్ టన్నుల చెత్తను రవాణా కేంద్రానికి చేరుస్తుంది. ఇలా 120 వాహనాల ద్వారా 360 మెట్రిక్ టన్నుల చెత్త స్థానిక రవాణా కేంద్రాలకు చేరుతుంది. దీన్ని వెంటనే డపింగ్యార్డుకు తరలించని పక్షంలో రవాణా కేంద్రంలో సమస్యలు తలెత్తుతాయి. సమస్యలు పునరావృతం.. స్వచ్ఛ ఆటో టిప్పర్లను ప్రవేశపెట్టిన తొలినాళ్లలో ఇలాంటి సమస్యలే ఉత్పన్నమయ్యాయి. తొలి దశలో రెండు వేలు, ఆ తర్వాత 500 స్వచ్ఛ ఆటో టిప్పర్లను అందుబాటులోకి తెచ్చారు. వీటిల్లో దాదాపు 2,100 స్వచ్ఛ ఆటోలు చెత్త తరలిస్తున్నాయి. వీటి ద్వారా చెత్త ఇళ్ల నుంచి రవాణా కేంద్రాలకు చేరుతున్నప్పటికీ.. అక్కడి నుంచి డంపింగ్యార్డుకు వెళ్లకపోవడంతో రవాణా కేంద్రాల్లో చెత్త పేరుకుపోతోంది. అక్కడి నుంచి చెత్తను తరలించేంత వరకూ ఆలస్యంగా వచ్చే స్వచ్ఛ ఆటో టిప్పర్లు రోడ్డుపైనే బారులుతీరాల్సి వచ్చేది. నిర్ణీత సమయాలు కేటాయించి, ఇతరత్రా చర్యలు చేపట్టి ఆ సమస్యను పరిష్కరించినప్పటికీ... ఇప్పుడిక సాయంత్రం అదనంగా చేరే చెత్తతో తిరిగి సమస్య పునరావృతమయ్యే అవకాశం ఉంది. దీని పరిష్కారానికి చర్యలు తీసుకోని పక్షంలో సమస్యలు తప్పవు. బస్టాప్కు రెండు నగరంలోని అన్ని బస్టాప్ల వద్ద రెండు డస్ట్బిన్లను వారం రోజుల్లోగా ఏర్పాటు చేయాలని జీహెచ్ంఎసీ కమిషనర్ దానకిశోర్.. జోనల్, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. వీధి వ్యాపారులందరూ ఆగస్ట్ నెలాఖరులోగా ప్రత్యేక డస్ట్బిన్లను ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించే కార్మికులందరూ సేఫ్టీ పరికరాలను విధిగా ధరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. -
‘చెత్త’ మోత అద్దె వాత
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీకి చెత్త తరలింపు మహా భారంగా మారింది. చెత్త తరలింపు పనుల కోసం అవసరమైన వాహనాల అద్దెలకే ప్రస్తుతం ఏటా దాదాపు రూ.180 కోట్లు వ్యయమవుతోంది. తడి–పొడి చెత్త గురించి దాదాపు నాలుగేళ్లుగా ప్రచారం చేస్తున్నా, ఇంటింటికీ రెండు రంగుల చెత్త డబ్బాలు పంపిణీ చేసినా ప్రజల్లో మార్పు రాలేదు. అదే వచ్చి ఉంటే జీహెచ్ఎంసీ చెత్త రవాణా భారం ఎంతో తగ్గేది. ప్రజలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటం వల్ల జీహెచ్ఎంసీకి చెత్త తరలింపు భారం పెరుగుతోంది. గడచిన ఐదేళ్ల వివరాలను పరిశీలిస్తే గుండె గుభిల్లు మంటుంది. చెత్త తరలించేందుకు అవసరమైన అద్దె వాహనాలకే దాదాపు రూ.642 కోట్లు ఖర్చయింది. ఇందులో రూ.75 కోట్లు మాత్రం జీహెచ్ఎంసీ సొంత వాహనాల మరమ్మతుల కోసం ఖర్చు చేశారు. ఇక జీహెచ్ఎంసీ సొంత వాహనాలు, వాటి నిర్వహణ వ్యయం, ఇంధన వ్యయం అదనం. తడి–పొడి చెత్తను వేరు చేయడం దగ్గరనుంచి పెద్దమొత్తాల్లో చెత్తను వేరు చేసే హోటళ్లు వంటివి ఎక్కడికక్కడే తడిచెత్త నుంచి సేంద్రియ ఎరువును తయారు చేయడం వంటి నిబంధనల్ని కచ్చితంగా అమలు చేస్తే ఈ ఖర్చు తగ్గేది. కానీ జీహెచ్ఎంసీ ఆ పని చేయలేకపోయింది. ఐదేళ్లలో నగరంలో పెరిగిన జనాభా, కాలనీలతోపాటు గతంలో రెండు మూడు రోజులకు ఒకమారు తరలించే చెత్తను ప్రస్తుతం ప్రతిరోజూ తరలిస్తుండటం తదితరమైన వాటి వల్ల రవాణా భారం పెరగడం సహజమే అయినప్పటికీ, స్వచ్ఛ నగరం అమలులో భాగంగా తడి–పొడి చెత్తను ఎక్కడికక్కడే వేరు చేసి సేంద్రియ ఎరువు తయారీ చర్యలు పటిష్టంగా అమలు చేస్తే పొడి చెత్త మాత్రమే డంపింగ్ యార్డు వరకు తరలిస్తే సరిపోయేది. కానీ నేటికీ ఆ పని జరగడం లేదు. దీంతో చెత్త రవాణా భారం పెరుగుతోంది. ♦ ఇళ్ల వద్దే తడి–పొడి చెత్తను వేరు చేసేందుకని నాలుగేళ్లనుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకుగాను 43 లక్షల రెండు రంగుల చెత్త డబ్బాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. ఇందుకుగాను జీహెచ్ఎంసీ దాదాపు రూ.30 కోట్లు ఖర్చు చేసింది. దీనికి తోడు చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్లు పెరిగాయి. ఇళ్లవద్ద, ట్రాన్స్ఫర్స్టేషన్ల వద్ద కూడా పకడ్బందీగా తడి–పొడి వేరు చర్యలు అమలైతే రవాణా భారం తగ్గేది. ♦ ఇళ్ల వద్దే తడి–పొడి చెత్తవేరు చేసి తరలించేందుకని 2500 స్వచ్ఛ ఆటో టిప్పర్లు కొనుగోలు చేశారు. కానీ..అవి కూడా తడి–పొడి చెత్తను వేర్వేరుగా తీసుకెళ్లకుండా, రెంటినీ కలిపే తీసుకువెళ్తున్నాయి. తడి–పొడి వేరుగా తీసుకువెళితే ట్రాన్స్ఫర్ స్టేషన్ల నుంచి కేవలం పొడిచెత్తనే డంపింగ్యార్డుకు పంపేందుకు వీలుంటుంది. ♦ మరో వైపు రవాణా పేరిట సర్కిళ్లు, జోన్లలో అద్దె వాహనాల పేరిట అవకతవకలు జరుగుతున్నాయనే ప్రచారం ఉంది. ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షణ లేమి, జోనల్, సర్కిళ్లకే అధికారాన్ని బదలాయించడం, తదితర చర్యల వల్ల కూడా దుబారా జరుగుతోందనే ఆరోపణలున్నాయి. అవసరం లేని ప్రాంతాల్లో కూడా అద్దె వాహనాలు వినియోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అవకతవకలు తగ్గితే..ఖర్చు తగ్గుతుంది ఏటికేడు పెరిగే జనాభాతో పాటు చెత్త కూడా పెరుగుతుంది. అయితే అక్రమాలు, అవకతవకలకు తావులేకుండా ఉంటే వాహనాల నిర్వహణ, అద్దెల భారం తగ్గే వీలుంది. ఐదేళ్లలో దాదాపు రూ.100 కోట్ల పెంపు అంటే ఆలోచించాల్సిన అంశమే.– పద్మనాభరెడ్డి (ఫోరం ఫర్ గుడ్గవర్నెన్స్) -
మళ్లీ మండుతున్న డంప్యార్డు
కరీంనగర్కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలక సంస్థకు చెందిన డంప్యార్డులో మళ్లీ అగ్గి రాజుకుంది. రెండు రోజులుగా వీస్తున్నగాలి దుమారంతో మంటలు డంప్యార్డు మొత్తం విస్తరించాయి. గురువారం డంప్యార్డు మొత్తం మంటలు లేవడంతో సమీప ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండ వేడికితోడు డంప్యార్డు నుంచి దట్టమైన పొగ వస్తుండడంతో ఊపిరాడక విలవిలలాడుతున్నారు. కళ్ల మంటలతో ఇబ్బందులు పడుతున్నారు. మానేరు ఒడ్డున ఉన్న డంప్యార్డు బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉండడంతో పెద్దపల్లి బైపాస్పై వెళ్లే ప్రయాణికులకు రోడ్డు కనబడని పడని విధంగా పొగ కమ్మేసింది. గత ఏప్రిల్ నెలలో కూడా డంప్యార్డులో మంటలు అంటుకోవడంతో నగరపాలక సంస్థ అధికారులు, పాలకవర్గం స్పందించి చల్లార్చేందుకు చర్యలు చేపట్టింది. అధికార యంత్రాంగం రెండు రోజుల అక్కడే ఉండి కార్మికులు, ఫైరింజన్లు, మున్సిపల్ వాటర్ ట్యాంకర్లతో డంప్యార్డులో మంటలు ఆర్పేశారు. ప్రస్తుతం మంటలు ఆర్పేందుకు సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఒకచోట వాటర్ కొడితే మరో చోట మంటలు లేస్తున్నాయి. వేడి గాలులు వీస్తుండడంతో మంటలు ఆర్పడం తలకు మించిన భారంగా మారింది. ఒకే డంప్యార్డుతో సమస్యలు... కరీంనగర్ నగరపాలక సంస్థలో 78 వేల కుంటుంబాలు, 3.5 లక్షల జనాబా ఉంది. ప్రతిరోజూ 180 టన్నులు చెత్త వెలువడుతోంది. గత యాబై ఏళ్లుగా బైపాస్రోడ్డులోని మానేరు వాగు ఒడ్డున ఉన్న 9 ఎకరాల స్థలంలో చెత్తను డంపింగ్ చేస్తున్నారు. రోజు రోజుకూ నగరం విస్తరిస్తుండడం, జనాబా పెరుగుతుండడంతో చెత్త వేయడం సమస్యగా మారింది. చెత్త గుట్టలుగా పేరుకుపోవడంతో చిన్నగా మంటలు అంటుకున్నా త్వరగానే డంప్యార్డు మొత్తం విస్తరిస్తోంది. ఐదేళ్లుగా ఇతర ప్రాంతాల్లో డంప్యార్డు ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగినా ఫలించ లేదు. ఉన్న ఒక్క డంప్యార్డులోనే చెత్తను వేస్తున్నారు. తడి, పొడి వేరుచేయకుండానే.... తడి, పొడి చెత్తను వేరు చేస్తే డంప్యార్డుకు చెత్తను తగ్గించవచ్చు. అయితే నగరంలో వెలువడుతున్న చెత్తను తడి, పొడి వేరుచేయకుండానే డంప్యార్డుకు తరలిస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో ర్యాంకు కోసం సర్వే సమయంలో చెత్తను వేరు చేస్తున్నట్లు హాడావుడి చేయడం ఆ తర్వాత అటకెక్కించడం నగరపాలక సంస్థలో రివాజుగా మారింది. చెత్త మొత్తం ట్రాక్టర్లతో డంప్యార్డుకు తరలిస్తుండడంతో డంప్యార్డు గుట్టగా పేరుకు పోయి చెత్త డంపింగ్ చేసేందుకు స్థలం కరువవుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో మరింత సమస్య... నగరపాలక సంస్థలో వెలువడే చెత్తలో 50 శాతంపైగా ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. దీంతో చెత్త త్వరగా అంటుకుని మంటలు విస్తరిస్తున్నాయి. ప్లాస్టిక్ మండడం వల్ల విషవాయువులు వెలువడి, ప్రజలు అనారోగ్యాల పాలయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పొగతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరోవైపు కాలం చెల్లిన మందులు, ఆసుపత్రి వ్యర్థాలను సైతం చెత్తలోనే డంప్ చేస్తుండడంతో డంప్యార్డు వ్యర్థాలతో విషపూరితంగా మారుతోంది. డంప్యార్డు అంటుకున్న సమయంలో అందులో ఉన్న ఆసుపత్రి వ్యర్థాలు, ఇతర విషపూరిత రసాయనాలతో విషవాయువులు వెలువడుతున్నాయి. దీంతో ప్రజలు శ్వాసకోశ, చర్మవ్యాధులకు గురయ్యేప్రమాదం ఉంది. -
హరిత ట్రిబ్యునల్ సూచనల మేరకే
పశ్చిమగోదావరి, పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు డంపింగ్ యార్డు నిర్వహణ కోసం జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) సూచనల మేరకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలని కలెక్టర్ ప్రవీణ్కుమార్ అధికారులను ఆదేశించారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ కమిటీ సభ్యులతో కలిసి ఆయన మూలలంక ప్రాంతంలోని డంపింగ్యార్డును పరిశీలించి బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. జాతీయ కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు చెన్నైకి చెందిన శాస్త్రవేత్త సి.పాల్పండి, బెంగళూరుకు చెందిన కాలుష్య నియంత్రణ మండలి అదనపు సంచాలకులు ఎం.మధుసూదన్, జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్లు ఎన్వీ భాస్కర్, శివప్రసాద్, కలెక్టర్ ప్రవీణ్కుమార్ పోలవరం గ్రామంలోని సుజల సాగర అతిథి గృహంలో అధికారులు, బాధితులతో సమావేశం నిర్వహించారు. పర్యావరణానికి ప్రజలకు డంపింగ్యార్డు వల్ల ఎటువంటిఇబ్బందులూ తలెత్తకుండా చూడాలని పేర్కొన్నారు. మూలలంక ప్రాంతంలో వేసిన డంపింగ్యార్డుపై నుంచి మట్టి జారిపోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు సలహాదారుడు వీఎస్ రమేష్బాబును ఆదేశించారు. పర్యావరణానికి, ప్రజల జీవన విధానానికి ఎటువంటి విఘాతం కలగకుండా డంపింగ్ చేయాలన్నారు. డంపింగ్ యార్డు వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు, సమస్యలను, అభిప్రాయాలను పారదర్శకంగా తెలుసుకుంటామన్నారు. ఎన్జీటీ సభ్యుల వద్ద స్థానికుల ఆవేదన అల్లు జగన్మోహన్రావు, కోటం రామచంద్రరావు, షేక్ ఫాతిమున్నీసా తదితర స్థానికులు డంపింగ్ యార్డు వల్ల వచ్చే ఇబ్బందులు, సమస్యలపై ఎన్జీటీ బృందం సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. బీసీ కాలనీ, గణేష్ నగర్ కాలనీల సమీపంలో డంపింగ్ యార్డు ఉన్నందున భారీ వాహనాల రాకపోకలు, శబ్దాలకు ఇళ్లు బీటలు వారుతున్నాయని పేర్కొన్నారు. కొండకాలువల నీరు గోదావరిలో కలవకపోవడంతో వర్షాకాలం వస్తే తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. దుమ్ము, ధూళి లేచిపోయి ఇళ్లల్లోకి వస్తోందని, వంట సామగ్రి, దుస్తులకు మట్టి పడుతోందని వివరించారు. నిత్యం తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. భారీ ఎత్తున డంపింగ్చేయడం వల్ల మట్టి జారిపోయి కడెమ్మ కాలువ కూడా పూడుపోతోందని వివరించారు. పర్యావరణం, వాతావరణం కలుషితమవుతోందని, కనీసం ఈ ప్రాంతంలో ఎక్కడా వాటరింగ్ కూడా చేయడం లేదని తెలిపారు. దుము, ధూళి వల్ల పోలవరం ప్రాంత వాసులం అనారోగ్యాలపాలవుతున్నామని పేర్కొన్నారు. 83 ఎకరాలు తీసుకోవద్దు ఇదే ప్రాంతంలో డంపింగ్ చేసేందుకు మరో 83 ఎకరాలు తీసుకుంటామని డీఎం ప్రకటించారని, ఆ భూమిని తీసుకోవద్దని కలెక్టర్ దృష్టికి స్థానికులు తీసుకువచ్చారు. తామంతా సన్న , చిన్నకారు రైతులమని, ఇప్పటికే ప్రాజెక్టు పేరుతో తమ భూములు కోల్పోయామని, సాధ్యమైనంత వరకు అధికారులు పరిశీలన జరిపి ఈ 83 ఎకరాలు డంపింగ్ నుంచి మినహాయించాలని కోరారు. గతంలో ఎన్జీటీ బృందం సభ్యులు పరిశీలన చేసి ఇంజినీరింగ్ అధికారులకు సూచించినా వాటిని సరిగా అమలు చేయలేదని వివరించారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ పి.రామకృష్ణ, ప్రాజెక్టు సలహాదారుడు వి.ఎస్.రమేష్బాబు, ఆర్డీఓ కె.మోహన్కుమార్, డీఎస్పీ ఎ.టి.వి. రవి కుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ వెంకటేశ్వర్లు, పోలవరం ప్రాజెక్టు ఈఈ ఎన్.చంద్రరావు, తహసీల్దార్ చినబాబు, పోలవరం అటవీ రేంజ్ అధికారి ఎన్.దావీదురాజు పాల్గొన్నారు. -
డంపింగ్ యార్డ్కు అంబేడ్కర్ విగ్రహం
హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి అపచారం జరిగింది. విగ్రహాన్ని జీహెచ్ఎంసీ అధికారులు ధ్వంసం చేయించడమే కాకుండా దానిని చెత్తలారీలో డంపింగ్యార్డ్కు తరలించారు. మరో 24 గంటల్లో రాష్ట్రమంతటా అంబేడ్కర్ జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతుండగా గ్రేటర్ హైదరాబాద్లో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వివరాలు... శనివారం తెల్లవారుజామున కొందరు దళిత సంఘాల నేతలు పంజగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ స్ధలంలో విగ్రహం ఏర్పాటుకు అనుమతిలేదంటూ అధికారులు పోలీసుల సహాయంతో దానిని తొలగించారు. చెత్తలారీలో విగ్రహాన్ని జవహర్నగర్ డంపింగ్యార్డ్కు తరలించారు. విషయం తెలుసుకున్న దళితబహుజన సంఘాల నాయకులు లారీని అడ్డుకుని అందులో ఉన్న చెత్తను కింద పోయించారు. చెత్తతోపాటు ధ్వంసమైన అంబేడ్కర్ విగ్రహం కనిపించింది. దీంతో మాలమహానాడు రాష్ట్ర నాయకుడు పసుల రాంమూర్తి, జవహర్నగర్ దళిత సంక్షేమ సంఘంనేత మేడ రవితోపాటు పలువురు ప్రజాసంఘాల నాయకులు ఘటనాస్థలానికి చేరుకుని పెద్దఎత్తున నిరసన తెలియజేశారు. జవహర్నగర్ పోలీసులు వచ్చి జీహెచ్ఎంసీ లారీ డ్రైవర్ రాజును అదుపులోకి తీసుకుని చెత్తలారీని పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం దళిత సంఘాల నాయకులు అంబేడ్కర్ విగ్రహాన్ని నీటితో కడిగి పాలాభిషేకం చేశారు. అంబేడ్కర్ విగ్రహాన్ని చెత్తలారీలో తీసుకువచ్చి అవమానపరిచిన జీహెచ్ఎంసీ అధికారులపై చర్యలు తీసుకోవాలని దళిత బహుజన సంఘాల నేతలు సాయంత్రం మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మకు ఫిర్యాదు చేశారు. విగ్రహాన్ని జాగ్రత్తగా తరలించాం పంజగుట్ట కూడలిలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన విషయమై జీహెచ్ఎంసీ వారికి సమాచారం ఇచ్చాం. విగ్రహం ఏర్పాటుకు అనుమతి లేనందున దానిని తొలగించాలని కోరడంతో జాగ్రత్తగా దానిని తీసి ప్రైవేట్ లారీలో ఎస్కార్ట్తో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంకు తరలించాం. అక్కడ కూడా జాగ్రత్తగా అమర్చి వచ్చాం. – ఏసీపీ తిరుపతన్న ఐఏఎస్ అధికారితో విచారణ అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్ట అనంతరం జరిగిన సంఘటనలపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. ఈ ఘటనలపై విచారణ జరపాలని నగర పోలీస్ కమిషనర్ను కోరాం. జీహెచ్ఎంసీకి చెందిన ఐఏఎస్ అధికారితో కూడా పూర్తిస్థాయి విచారణ జరిపిస్తాం. యూసుఫ్గూడ నుండి విగ్రహం బయటకు రావడానికి బాధ్యులైన యార్డ్ ఆపరేటర్ బాలాజీని విధుల నుంచి తొలగించాం. – జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ రాత్రికి రాత్రే విగ్రహం ఏర్పాటు జీహెచ్ఎంసీ చెత్తలారీలో అంబేడ్కర్ విగ్రహం శనివారం తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో అంబేడ్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు గుడిమల్లి వినోద్కుమార్ ఆధ్వర్యంలో సుమారు 25 మంది దళిత సంఘాల నేతలు పంజగుట్ట కూడలి వద్దకు చేరుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి ఐదడుగుల దూరంలో సుమారు నాలుగడుగుల గొయ్యి తీశారు. కాంక్రీట్తో ఐదడుగుల దిమ్మె నిర్మించి, దానిపైన 9 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అరగంట వ్యవధిలో విగ్రహ ఏర్పాటు పూర్తి చేశారు. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ ఏసీపీ సుభాష్, సిబ్బంది అక్కడకు చేరుకుని విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదని, పోలీసులు దానిని తొలగించాలని కోరారు. దీంతో దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగాయి. పశ్చిమమండల పోలీసులు, టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, కేంద్ర బలగాలు వచ్చి వారిని అదుపులోకి తీసుకుని విగ్రహాన్ని డంప్యార్డుకు తరలించారు. -
అటకెక్కిన ‘సాలీడ్వేస్ట్’ ప్రాజెక్ట్
సాక్షి, కూసుమంచి: మండల కేంద్రంలో చెత్తా చెదారం, వ్యర్థాలు లేకుండా చేసేందుకు అధికారులు వినూత్నంగా చేపట్టాలనుకున్న సాలీడ్వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు అటకెక్కింది. దీనిలో భాగంగా పంచాయతీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటా డస్ట్బిన్లు (చెత్త డబ్బాలను) ఏర్పాటు చేసి సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తారు. అక్కడ వ్యర్థాలతో కంపోస్ట్ తయారు చేసేందుకు వీలుగా అధికారులు ప్రాజెక్టును రూపొందించారు. 2015లో ప్రతిపాదించిన ఈప్రాజెక్టు నేటికీ కార్యరూపం దాల్చలేదు. కేవలం కాగితాలకే పరిమితమైంది. ప్రస్తుతం మండల కేంద్రంలో నెలకు టన్నుల కొద్ది చెత్తా, వ్యర్థాలు తయారవుతున్నాయి. ఇళ్లలోని చెత్తతోపాటు బస్టాండ్ సెంటర్లో ఉన్న బడ్డీకొట్లు, చికెన్ సెంటర్లు, పండ్లు తదితర దుకాణాల నుంచి చెత్త టన్నుల కొద్ది వస్తోంది. వీటిని నేలకొండపల్లి వెళ్లే రహదారి పక్కన వేస్తున్నారు. దీంతో ఆరోడ్డు పై ప్రయాణించే వాహనదారులు, పాదాచారులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. ముక్కు మూసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. సాలీడ్వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు ఉంటే ఈ వ్యర్థాలతో ఎరువును తయారు చేయవచ్చు. పొడిచెత్తను వేరుచేసి విద్యుత్ ప్రాజెక్టుల్లో వినియోగించుకునేందుకు వీలుండేది. కాగా ఈప్రాజెక్టుకు నిధులు లేకపోవటంతో అది ప్రతిపాదనలకే పరిమితం అయింది. అధికారులు, ప్రభుత్వం ఈప్రాజెక్టుపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. పాలేరులోనూ అంతే... పాలేరు గ్రామ పంచాయతీలో కూడా చెత్త, వ్యర్థాలను నివాసాల దగ్గర లోనే రోడ్డు పక్కన పడవేస్తున్నారు. గ్రామంలోని చర్చి సమీపంలో వ్యర్థాలను వేస్తున్నారు. దీంతో అటుగా వెళ్లేవారు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. మురికి కూపంగా మారిన ఆప్రాంతలో నివాసస్థుల పరిస్థితి వర్ణణాతీతం. అధికారులు స్పందించి చెత్త తొలగించాలని కోరుతున్నారు. ప్రాజెక్టు కోసం కృషి చేస్తా మండల కేంద్రంలో సాలీడ్వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు అధికారులతో మాట్లాడి దాని అమలుకు కృషిచేస్తా. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలి. పంచాయతీ తరుపున చర్యలు చేపడతాం. – చెన్నా మోహన్, సర్పంచ్ -
ఆఖరికి చెత్తనూ వదల్లేదు..
సాక్షి, రాచర్ల (ప్రకాశం) : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో మండలంలోని ప్రతి పంచాయతీలో డంపింగ్యార్డుల (చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు) నిర్మాణాలను పూర్తి చేశారు. డంపింగ్యార్డు నిర్మాణాలను అధికార పార్టీ నాయకుల సొంతం చేసుకుని ఇష్టారాజ్యంగా పనులను పూర్తి చేశారు. మరికొన్ని చోట్ల అధికార పార్టీ నాయకుల వ్యవసాయ పొలాలకు అనుకూలంగా ఉండేలా డంపింగ్యార్డుల నిర్మాణాలు చేసుకున్నారు. భవిష్యత్తులో డంపింగ్యార్డుల నిర్మాణాలను ఆక్రమణ చేసుకుని వారి సొంత పనులకు వాడుకొనేలా ఏర్పాట్లు చేసుకున్నారు. మండలంలోని 14 పంచాయతీలుండగా 14 పంచాయతీల్లో డంపింగ్యార్డు నిర్మాణాలు పూర్తియ్యాయి. ఓబుల్రెడ్డిపల్లె గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు పాలకవీడు పంచాయతీలోని ఓబుల్రెడ్డిపల్లె గ్రామ సమీపంలోని తన వ్యవసాయ పొలం అనుకుని ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలం డంపింగ్యార్డు నిర్మాణం పూర్తి చేసుకుని తన సొంత పనులకు వినియోగించుకుంటున్నట్లు పలువురు విమర్శిస్తున్నారు. గుడిమెట్ట గ్రామంలో గ్రామానికి దాదాపు కిలోమీటరు దూరంలో డంపిండ్యార్డు నిర్మాణం చేశారు. చోళ్లవీడు గ్రామంలో ప్రైవేటు స్థలం పంచాయతీకి ఇవ్వకుండానే ఆ స్థలంలో డంపింగ్యార్డు నిర్మాణం చేశారు. డంపింగ్యార్డు నిర్మాణం పూర్తయిన చెత్త నుంచి సంపద తయారు చేయడం లేదు. ఆ డంపింగ్యార్డు భవిష్యత్తులో అధికార పార్టీ నాయకులు తన సొంత పనులకు వాడుకొనేందుకు సిద్ధం చేసుకుంటున్నట్లుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఓబుల్రెడ్డిపల్లెలో టీడీపీ నాయకుడి వ్యవసాయ పొలం పక్కనే నిర్మించిన డంపింగ్యార్డు ఇలా చేయాలి... నిర్మాణం పూర్తయిన తర్వాత సిబ్బందిని నియమించి, రిక్షాలను ఏర్పాటు చేయాలి. సిబ్బంది పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ప్రతి ఇంటి వద్ద నుంచి తడి, పొడి చెత్తను రిక్షాల ద్వారా షెడ్ వద్దకు తీసుకొచ్చి వేరు చేయాలి. తడి చెత్తను తొట్టెల్లో వేసి వానపాములను వదిలి సేంద్రియ ఎరువులను తయారు చేయాలి. పొడి చెత్తను ప్లాస్టిక్ ద్వారా రీసైక్లింగ్ చేయాల్సి ఉంది. ఇదంతా చేసేందుకు గ్రామ పంచాయతీలో 1000 మంది జనాభాకు ఒక్కరు చొప్పున గ్రీన్ అంబాసిడర్లతో పాటు ఒక్కో కేంద్రానికి ఒక వాచ్మెన్ను నియమిస్తారు. వారికి స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా నెలకు రూ.6 వేల జీతం చెల్లిస్తారు. చేస్తున్నది ఇలా.. మండలంలోని 14 పంచాయతీలకు గానూ ఎట్టకేలకు 12 పంచాయతీల్లో డంపింగ్యార్డు నిర్మాణాలు పూర్తి చేశారు. 10 చోట్ల అధికార టీడీపీ నాయకులు తమకు సంబంధించిన వ్యక్తులకు గ్రీన్ అంబాసిడర్లుగా, వాచ్మెన్లుగా నియమించుకున్నారు. మండలంలో ఎక్కడ కూడ డంపింగ్యార్డుల్లో చెత్త నుంచి సేంద్రియ ఎరువులు తయారు చేయడం ప్రారంభిచలేదు. రాచర్ల, గుడిమెట్ట, సోమిదేవిపల్లె గ్రామాల్లో షో చేసేందుకు కొంత చెత్తను పోగు చేసి వదిలేశారు. ఏ ఒక్కరూ వారి పనులు చేయడం లేదు. మండలంలో డంపింగ్యార్డు నిర్మాణాలకు మంజూరైన నిధులు పంచాయతీ అంచనా మెత్తం (రూ.లక్షల్లో) ఆకవీడు రూ.7,41,735 అనుములపల్లె రూ.2,57,454 చినగానిపల్లె రూ.2,88,337 చోళ్లవీడు రూ.3,93,599 యడవల్లి రూ.3,92,860 గౌతవరం రూ.2,43,961 గుడిమెట్ట రూ.3,01,977 జేపీ చెరువు రూ.3,22,915 కాలువపల్లె రూ.2,78,362 ఒద్దులవాగుపల్లె రూ.2,57,509 పాలకవీడు రూ.3,54,797 రాచర్ల రూ.6,92,455 సత్యవోలు రూ.2,51,914 సోమిదేవిపల్లె రూ.2,81,335 -
ఈ చెత్తేంది నారాయణా!
నెల్లూరు సిటీ : మున్సిపల్ మంత్రి నారాయణ సొంత జిల్లాలో ఒక కార్పొరేషన్.. ఆరు మున్సిపాలిటీలున్నాయి. ఇక్కడ రోజుకు 400 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. దీనిని డంపింగ్ యార్డులకు తరలిస్తుండడంతో చెత్త కొండలు గుట్టలుగా పేరుకుపోతోంది. తడి, పొడి చెత్త సేకరణ అంతంతమాత్రంగానే ఉంది. చెత్తతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు కాగితాలకే పరిమితమైంది. నెల్లూరు నగరంలో చెత్త తరలింపులో అధికార పార్టీ నేతలు బినామీలను ఏర్పాటు చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. కార్పొరేషన్ ఖజానాకు తూట్లు పొడుస్తున్నారు. ఏడు లక్షలు జనాభా ఉన్న నెల్లూరు నగరంలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. పాలకులు చెబుతున్న స్మార్ట్ సిటీ ఇలాగే ఉంటుందేమో! అంటూ ప్రజలు విస్తుపోతున్నారు. కావలి పట్టణంలోని డంపింగ్ యార్డును మోర్లవారిపాళెంకు తరలించారు. రెండేళ్లుగా చెత్త పేరుకుపోతూనే ఉంది. దుర్వాసన వస్తుండడంతో పరిసర గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇక్కడ వాహనాలు మరమ్మతులైనా పాలకులు పట్టించుకోవడంలేదు. నాయుడుపేట, సూళ్లూరుపేట మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డులే లేవు. రహదారుల పక్కనే చెత్తను తరలిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నాయుడుపేటలో స్వర్ణముఖినది సైతం కంపోస్టు యార్డుగా మారిపోతోంది. చిట్టమూరు మండలంలో మూడు ఎకరాల్లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. గూడూరు పట్టణంలో రోజుకు 28 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. అయితే ఇష్టానుసారంగా డంప్ చేస్తున్నారు. వెంకటగిరి పట్టణంలో చెత్తసేకరణ గ్రామాల కంటే దారుణంగా తయారైంది. ప్రధాన వీధుల్లో మినహా మిగతా ప్రాంతాల్లో మూడు రోజులకోసారి చెత్తను సేకరిస్తున్నారు. పట్టణంలో ఇంటింటికీ తిరిగి చెత్తసేకరణ ఇంకా ప్రారంభం కాలేదు. 10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన డంపింగ్ యార్డుకు ప్రహరీ లేకపోవడంతో గాలికి చెత్త సమీప పొలాల్లో పేరుకుపోతోంది. దీంతో రైతులు అవస్థలు పడుతున్నారు. ఆరేళ్ల క్రితం సీ గ్రేడ్ మున్సిపాలిటీగా మారిన ఆత్మకూరులో చెత్త సేకరణ ఆరంభశూరత్వంగా మారింది. రెండునెలల పాటు చెత్తను తరలించారు. ఆ తర్వాత అంతంతమాత్రంగానే సేకరణ జరుగుతోంది. పట్టణంలోని చెత్తను శివారు ప్రాంతాలకు తరలిస్తుండడంతో పరిసర గ్రామాల ప్రజల అవస్థలు వర్ణనాతీతం. చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. చెత్తతో విద్యుత్ తయారీకి అనుమతులిచ్చింది. దేశవ్యాప్తంగా పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వీటిని ఏర్పాచేస్తున్నట్టు ప్రకటించింది. అందులో నెల్లూరు నగరం కూడా ఉంది. అప్పటి నెల్లూరు కమిషనర్ పీవీవీఎస్ మూర్తి ఓ ప్రైవేట్ సంస్థతో ప్రాజెక్ట్ ఏర్పాటు చేసుకునేందుకు ఒప్పందాలు జరిగాయి. నెల్లూరు నగరంతోపాటు కావలి, గూడూరు మున్సిపాలిటీల్లో ప్రతి రోజూ చెత్తను తరలించి తద్వారా విద్యుత్ ఉత్పత్తికి చేయాలని నిర్ణయించారు. దీంతో కొన్నేళ్లుగా చెత్త సమస్యకు విముక్తి కలిగిందని ప్రజలు భావించారు. అయితే ఇప్పటికీ ఆ ఊసేలేదు. కంపోస్టు యార్డుగా స్వర్ణముఖి నాయుడుపేట పట్టణ సమీపంలో ఉన్న స్వర్ణముఖి నదిలో ఇష్టారాజ్యంగా వ్యర్థాలను పడేస్తుండటంతో కంపోస్టు యార్డుగా తయారైంది. నదిపై ఉన్న కాజ్వేపై నుంచి వాహనాల్లో చెత్త నిల్వలు, భవనాలకు సంబంధించిన వ్యర్థాలను నదిలో వేస్తుండడంతో స్వర్ణముఖి నది రోజురోజుకూ రూపుకోల్పోతోంది. మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ కంపోస్టు యార్డు లేకపోవడంతో పట్టణవాసులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి లారీల్లో వ్యర్థాలను నదిలో పడేస్తున్నారు. అధికారులు కూడా పట్టించుకున్న దాఖలాల్లేవు.– నాయుడుపేట టౌన్ -
ఉక్రెయిన్లో భారీ పేలుడు
-
వామ్మో..నెల్లూరు!
నెల్లూరు నగరం నరకానికి ప్రతి రూపంగా మారింది. ఎటు చూసినా అధ్వానమైన రోడ్లు, కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన చెత్తాచెదారాలతో నగర ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారు. దూమ్ము, ధూళి, వానొస్తే రొచ్చు, రోడ్లు ఎక్కి పారుతున్న మురుగు నీటితో జనం రోడ్డు మీదకు వచ్చేందుకు వణికిపోతున్నారు. నెల్లూరు నగరానికి చెందిన పొంగూరు నారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా.. అబ్దుల్ అజీజ్ నగర పాలక సంస్థ మేయర్గా వెలగబెట్టుతున్నారు. వీరు నెల్లూరు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి పథంలో నిలబెట్టి రాష్ట్రంలోనే మొదటి ర్యాంక్లో, దేశంలోనే అగ్రస్థానంలో ఉంచుతామని బీరాలు పోతున్నారు. ఏడాదిన్నరగా నెల్లూరు ప్రజలకు ప్రత్యక్షంగా నరకాన్ని చూపిస్తున్న పాలకులు ఇంకొన్ని రోజులు కష్టపడాలంటూ హితబోధ చేస్తూ తమ అసమర్థను కప్పిపుచ్చుకుంటున్నారు. నెల్లూరు సిటీ: నెల్లూరు నగరం జిల్లా కేంద్రం. పెద్ద పెద్ద భవంతులు. విశాలమైన రోడ్లు. మధ్యలో సుందరంగా కనిపించే డివైడర్లు, సెంట్రల్ లైటింగ్. పైకి కనిపించకుండా పారే మురుగునీరు. ఎటు చూసినా సిమెంట్ రోడ్లు. రోడ్డుపై కనిపించని చెత్తా చెదారాలు. ఇలా గ్రామీణ ప్రజలు నెల్లూరును ఊహించుకుంటారు. కానీ నెల్లూరు నగరం ఇందుకు భిన్నంగా ఉంది. రోడ్డు ఎక్కితేకాని తెలియదు నగర వాసుల దుస్థితి. నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 1.70 లక్షలు కుటుంబాలు ఉన్నాయి. 7 లక్షల మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. నగరంలోని ప్రధాన రహదారులు అయ్యప్పగుడి నుంచి వేదాయపాళెం, దర్గామిట్ట, కేవీఆర్ పెట్రోల్ బంక్, వీఆర్సీ సెంటర్, గాంధీబొమ్మ, ఆత్మకూరు బస్టాండ్ వరకు రోడ్లు దుమ్ము, ధూళితో నిండిపోయాయి. మినీబైపాస్ రోడ్డులోని బీవీగనర్, కొండాయపాళెం గేటు మీదుగా ఆత్మకూరు బస్టాండు వరకు ఇదే పరిస్థితి నెలకొంది. వాహనచోదకులు రోడ్లపై వాహనాలను నడపలేనిపరిస్థితి ఏర్పడింది. కళ్లలో దుమ్ము పడుతుడడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. మరో వైపు చిన్నారులు దుమ్ముతో అనారోగ్యాల బారిన పడుతున్నారు. కార్పొరేషన్ అధికారులు రోడ్లపై దుమ్మును శుభ్రం చేసే ప్రయత్నాలు చేయడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి రోడ్లు శుభ్రం చేసే మిషన్లు కొనుగోలు చేసినా..ఫలితం లేకుండా పోయింది. అడుగుకొక గొయ్యి భూగర్భ డ్రెయినేజీ, తాగునీటి పైప్లైన్ పనుల నేపథ్యంలో సిమెంట్ రోడ్లను ధ్వంసం చేశారు. అయితే పనులు పూర్తయిన తర్వాత వెంటనే రోడ్లు వేస్తామని చెబుతున్న అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రోడ్లలో గుంతలు ఏర్పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఏ రోడ్డులో ఎప్పుడు పనులు జరుగుతాయో తెలియని పరిస్థితి. పొద్దున ఖాళీగా ఉన్న రోడ్డు.. మధ్యాహ్నం క్లోజ్ చేసి పనులు చేపడుతుంటారు. ఏ వీధిలో పని జరుగుతుందో ఆ వీధి చివర ప్రారంభంలో బోర్డులు ఏర్పాటు చేయడం లేదు. దీంతో వాహనచోదకులు రోడ్డు చివరి వరకు వచ్చి వాహనాలు వెళ్లేందుకు దారిలేక వెనుతిరిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో వీధిలోకి వెళ్లినా ఇదే పరిస్థితి. గుంతలు తవ్విన రోడ్డును పూర్తిస్థాయిలో పూడ్చకుండా పైపై పూతలు వేయడంతో గుంతల్లో వాహనాలు ఇరుక్కు పోతున్నాయి. వృద్ధులు, చిన్నారులు ప్రమాదాలకు గురవుతున్నారు. చిన్నపాటి వర్షాలకే రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ద్విచక్ర వాహనాలే కాదు.. పాదచారులు కూడా జారిపడి గాయపడిన ఘటనలు ఇటీవల కాలంలో కోకొల్లలుగా జరిగాయి. భారీ వర్షాలు కురిస్తే నగర వాసులకు అడుగుకొక గండం తప్పదు. నీటి కోసం తిప్పలు ఎన్నడూ లేని విధంగా నగరంలోని భూగర్భ జలాలు ఇంకిపోయాయి. ముఖ్యంగా బాలాజీనగర్, మూలాపేట, దర్గామిట్ట, వేదాయపాళెం, స్టౌన్హౌస్పేట ప్రాంతాల్లో నీళ్లు లేక అవస్థలు ఎదుర్కుంటున్నారు. కార్పొరేషన్ నుంచి సరఫరా అయ్యే నీరు సైతం కొన్ని ప్రాంతాల్లో వారాలు పాటు రాని పరిస్థితి ఉంది. భూగర్భ డ్రెయినేజీ, తాగునీటి పనుల నేపథ్యంలో వాటర్ పైప్లైన్లు పగిలిపోతున్నాయి. దీంతో ఇళ్ల యజమానులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. కార్పొరేషన్ అధికారులు మాకు సంబంధం లేదని, ప్రజారోగ్య శాఖ తమ పని కాదని ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం తప్ప పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేయడం లేదు. రెండు పథకాలకు సంబంధించి పనులను ఎల్అండ్టీ, మెగా కంపెనీలు సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించడంతో వారు ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం అడుగడుగునా ప్రతి వీధిలో ఇదే పరిస్థితి ఉంది. అనారోగ్యం బారిన ప్రజలు నగరాన్ని సుందరీకరణ చేస్తానన్న మంత్రి నారాయణ మాటలు ఏమో కానీ.. ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. రోడ్లపై వెళ్లే సమయంలో దుమ్ము దూళి వ్యాపించి కళ్ల సమస్యలు, ఇతర జబ్బులకు లోనవుతున్నారు. చెత్తాచెదారాలు పేరుకుపోవడంతో వీధుల్లో దుర్వాసన వెలువడుతోంది. దోమలు వ్యాప్తి చెంది విషజ్వరాలకు గురి చేస్తున్నాయి. తాగునీరు మురుగు మయమవడంతో నగర వాసులు అనేక సమస్యలతో సతమవుతున్నారు. ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. మరికొంత కాలంగా కొనసాగితే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కడి చెత్త అక్కడే మూలిగే నక్క పైన తాటికాయపడ్డట్టు నగర వాసుల పరిస్థితి మారింది. ఓ వైపు గుంతల రోడ్లు, దుమ్ము దూళితో అల్లాడిపోతుంటే మరో పక్క నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో ఎక్కడి చెత్త అక్కడే కుప్పలు కుప్పలుగా పేరుకుపోయింది. గత 22 రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు 279 జీఓకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నారు. సమ్మెను విరమింప చేయడం.. పరిస్థితిని చక్కదిద్దాల్సిన అధికారులు వైఫల్యం చెందుతున్నారు. పాలకవర్గం మాత్రం కార్మిక నాయకులతో చర్చలు కూడా జరపకపోవడంతో చెత్త తొలగించే నాథుడు కరువయ్యారు. దీంతో వీధులన్నీ చెత్తతో నిండిపోయి..దుర్గంధం వెదజల్లుతున్నాయి. చిన్నపాటి చినుకులకు చెత్త కుళ్లి వెదజల్లే దుర్గంధానికి స్థానిక నివాసితులు బతకలేని పరిస్థితి నెలకొంది. ఎండలకు వీచే గాలికి వీధుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాలు గాలికి ఎగిరి ఇళ్లల్లోకి చేరుతున్న దుర్భర స్థితి. మంత్రి నారాయణ, మేయర్ అజీజ్లు కారుల్లో నగర రోడ్లపై షికారు చేసి వెళ్లిపోతున్నారని, నేల మీద నడిస్తే, పరిస్థితులను పరిశీలిస్తే తమ బాధ ఏంటో అర్థమవుతుందని నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సీఎంగారు మాకూ జీవించే హక్కుంది: పవన్ కల్యాణ్
సాక్షి, భీమవరం: ముఖ్యమంత్రి గారు మీ కొడుకుకే కాదు మాకు కూడా ఆరోగ్యం కల్పించడంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభ్యర్ధించారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా శనివారం ఆయన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ వారు జనావాసాలకు సమీపంగా, అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన చెత్త డంపింగ్ యార్డ్ను పరిశీలించారు. అనంతరం డంపింగ్ యార్డ్ను ఇలా జనవాసాలకు దగ్గరగా ఏర్పాటు చేయడం వల్ల తీవ్రమైన దుర్గంధం రావడమే కాక.. పందులు, దోమలు విజృంభించి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేవలం ఆయన కొడుకు గురించే కాక రాష్ట్ర ప్రజల ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాలని కోరారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డ్ చుట్టు పక్కల ఉన్న పిల్లల చేత ‘ముఖ్యమంత్రి గారు మా అందరికి ఆరోగ్యం కల్పించండి’ అంటూ ప్రమాణం చేయించారు. తక్షణమే ఈ డంపింగ్ యార్డ్ను ఇక్కడ నుంచి తొలగించాలని పవన్ డిమాండ్ చేశారు. -
కర్నూలు శివారులోని డంప్ యార్డ్ వద్ద భారీ పేలుడు
-
కాలుష్య కుంపటి
అనంతపురం : ఇదీ జిల్లా కేంద్రంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన కమలానగర్ దుస్థితి. నాలుగేళ్ల పాలనపై స్థానిక ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్చౌదరి శ్వేతపత్రం పేరిట గొప్పలకు పోయారు. కార్పొరేషన్ మేయర్ స్వరూప అనంతపురం రూపురేఖలు మార్చేశామంటూ ఇటీవల హడావుడి చేశారు. వీరి పాలన ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇదో మచ్చుతునక. చారిత్రక చిహ్నమైన టవర్క్లాక్కు సమీపంలో వేలాది మంది ప్రజలు రాకపోకలు సాగించే కమలానగర్లో కాలుష్య కుంపటి నిత్యం రగులుతోంది. ఓ ఖాళీ ప్రదేశం డంపింగ్ యార్డును తలపిస్తోంది. జిల్లా కేంద్రంలోనే నెలకొన్న ఈ పరిస్థితి చూసి ప్రజలు తాము చేసిన తప్పు తెలుసుకుని ‘ముక్కు మూసుకుని’ ముందుకు కదులుతున్నారు. చెత్త పేరుకుపోయిన ప్రతిసారీ చుట్టుపక్క నివాసితులు, వ్యాపారులు నిప్పు రాజేస్తుండటంతో ఈ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగించే ప్రజలు పరుగులు తీస్తున్నారు. ఇదే సమయంలో ఇక్కడ తిష్టవేసిన పందుల గుంపుతో స్థానికుల అవస్థలు వర్ణనాతీతం. ఇక్కడే ఓ చిన్నపిల్లల ఆసుపత్రి కూడా ఉంది. ఈ కాలుష్య కుంపటి వెదజల్లే పొగతో వ్యాధుల బారిన పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. అభివృద్ధి ముసుగులో పబ్బం గడుపుకునే నాయకులు ఇప్పటికైనా మేల్కొని ప్రజారోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు.– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
వ్యర్థాలతో వెలుగులు!
సాక్షి, హైదరాబాద్: వివిధ అంశాల్లో అగ్రభాగాన ఉన్న హైదరాబాద్ చెత్త (మునిసిపల్ ఘనవ్యర్థాల ఎంఎస్డబ్లు్య) నిర్వహణలోనూ రికార్డు కెక్కనుంది. దేశంలో ఏ నగరంలో లేని అతి పెద్ద భారీ డంపింగ్ యార్డు జవహర్నగర్లోని వ్యర్థాల క్యాపింగ్ పనులు త్వరలో పూర్తి చేయనుంది. తద్వారా పరిసర గ్రామాల ప్రజలకు వాతావరణ, భూగర్భజల కాలుష్యం తగ్గనుంది. దాదాపు 135 ఎకరాల్లో పేరుకుపోయిన 12 మిలియన్ టన్నుల వ్యర్థాల నుంచి వెలువడుతున్న దుర్గంధం, కాలుష్యంతో పరిసర ప్రాంతాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. చెత్తకుప్పల నుంచి వెలువడే కలుషితాలు, వర్షం నీరు కలిసి వెలువడుతున్న కాలుష్యకారకద్రవాల (లీచెట్)తో భూగర్భ జలాలన్నీ కలుషితమయ్యాయి. ఈ సమస్య పరిష్కారానికి అమెరికా, జర్మనీ, జపాన్, బ్రిటన్ దేశాల మాదిరిగా అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానంతో చెత్త నిర్వహణ పనుల్ని రాంకీకి చెందిన ‘హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ మునిసిపల్ సాలిడ్ వేస్ట్ లిమిటెడ్’ చేపట్టింది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నెలాఖరులోగా క్యాపింగ్ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే క్యాపింగ్లోని ఆరు దశల్లో తొలిదశలో భాగంగా 150 మి.మీ. మందం మట్టితో కప్పే ప్రక్రియను 85శాతం పూర్తిచేసింది. వర్షాకాలం ముగిశాక అక్టోబర్లో రెండో దశ పనుల్ని చేపట్టనున్నారు. విషవాయువులు బయటికి వెళ్లేలా... క్యాపింగ్ అనంతరం డంప్యార్డ్పై బోరు బావుల మాదిరిగా పైపులను చొప్పించి విషవాయువులు పైకి వెళ్లే ఏర్పాట్లు చేస్తారు. వెలువడే గ్యాస్లోని వాయువుల్ని, వాటి పరిమాణాన్ని లెక్కించి, విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తారు. అందుకు అవకాశముంటే విద్యుత్ ఉత్పత్తికూడా చేస్తారు. విషవాయువులు, లీచెట్ను శుభ్రపరుస్తారు. ఇప్పటికే లీచెట్ శుభ్రపరిచే చర్యలు పైలట్గా చేపట్టారు. క్యాపింగ్ పనుల్లో టెర్రా సంస్థ సహకారాన్ని తీసుకుంటున్నారు. ఈ పనుల్ని నగర మేయర్ బొంతు రామ్మోహన్ సోమవారం పరిశీలించారు. క్యాపింగ్ ప్రాజెక్ట్ హెడ్ కృష్ణతో కలసి పనుల వివరాలను మీడియాకు వివరించారు. మార్చిలో విద్యుత్ ప్లాంట్ పనులు.. జవహర్నగర్ డంపింగ్ యార్డులో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ పనులు వచ్చే మార్చిలో ప్రారంభం కానున్నాయి. 19.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ఈ ప్లాంట్కు రోజుకు 1,600 మెట్రిక్ టన్నుల చెత్త అవసరం. ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్లు ఈ క్యాపింగ్ తదితర పనుల్ని పరిశీలిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 నగరాల్లోనే ఇంత పెద్ద డంపింగ్ యార్డులకు క్యాపింగ్ పనులు జరిగాయని ప్రాజెక్ట్ హెడ్ కృష్ణ తెలిపారు. చెత్త నిర్వహణలో ఆదర్శం: బొంతు దేశంలో ఆగ్రా, ముంబై వంటి నగరాల్లో డంపింగ్ యార్డులకు క్యాపింగ్ పనులు చేసినా, ఇంత పెద్ద విస్తీర్ణంలో, ఇంత పెద్ద చెత్తగుట్టలకు ఎక్కడా క్యాపింగ్ జరగలేదు. అనుకున్న ప్రకారం పనులన్నీ పూర్తయితే జవహర్నగర్ మోడల్ డంపింగ్ కేంద్రంగా, పర్యాటక ప్రాంతంగా మారుతుంది. తొలిదశలో మట్టితో కప్పేందుకు ఇప్పటివరకు 5.5 లక్షల క్యూబిక్ టన్నుల మట్టిని వినియోగించారు. లీచెట్ శుద్ధికి 4ఎంఎల్డీ సామర్ధ్యమున్న యంత్రాలతో పనులు చేస్తున్నారు. ఇప్పటికే 90 శాతం మేర దుర్గంధం తగ్గింది. ప్రాజెక్టు వ్యయం రూ.144 కోట్లు కాగా, సగం కాంట్రాక్టు సంస్థ, మిగతా సగం జీహెచ్ఎంసీ భరిస్తున్నాయి. ఇకపై గ్రేటర్లోని చెత్తనంతా జవహర్నగర్కే తరలించం. నగరం నలువైపులా వివిధ ప్రాంతాల్లో చెత్త డంప్ కేంద్రాలు ఏర్పాటు చేసి, నిర్వహణ చేపడతాం. దాదాపు 50–100 ఎకరాల మేర స్థలాల్ని ఎంపిక చేసి చుట్టూ గార్డెన్ను అభివృద్ధి చేసి, మధ్యలో ఘనవ్యర్థాల నిర్వహణ పనులు చేపడతాం. ఆటోనగర్లోనూ చెత్త నిర్వహణ కేంద్రాన్ని త్వరలో అందుబాటులోకి తెస్తాం. గ్రేటర్లోని 12 చెత్త రవాణా కేంద్రాలనూ ఆధునీకరిస్తాం. వాటి నిర్వహణ బాధ్యతల్ని అంతర్జాతీయ సంస్థలకు అప్పగిస్తాం. ఆరు దశల్లో పనులిలా.. ఆరు దశల్లో ఈ క్యాపింగ్ ప్రక్రియ పూర్తిచేస్తారు. తొలిదశలో డంప్ యార్డును మట్టితో కప్పి వర్షపు నీరు చెత్తలోకి చేరకుం డా చేస్తారు. అనంతరం మట్టిపొరపైన జియోసింథటిక్ క్లే లైనర్ వేస్తారు. తర్వాత జియో కంపోజిట్ లేయర్ ఏర్పాటు చేస్తారు. చివరగా మళ్లీ మట్టిపొరను దాదాపు ఒకటిన్నర అడుగు (45సెం.మీ.) మేర పరుస్తారు. దీనిపై అందంగా కనిపించేందుకు, ఆక్సిజన్ వెలువడేందుకు రంగు రంగుల మొక్కలు పెంచుతారు. -
ఎవరెస్ట్.. అత్యంత ఎత్తయిన చెత్త కుప్ప
-
ఎవరెస్ట్.. ఎ ‘వరెస్ట్’...
ఏటికేడూ హిమాలయాల్లోని మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించే వారి సంఖ్య పెరిగిపోతోంది. అదే స్థాయిలో వారు వదిలేస్తున్న వ్యర్థాల పరిమాణమూ పెరిగింది. వెరసి 8,848 మీటర్ల ఎవరెస్ట్ శిఖరం.. నేడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చెత్త కుప్పగా మారిపోయింది. చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ఎవరెస్ట్పై పరిస్థితిని వివరిస్తూ విడుదల చేసిన ఓ నివేదిక విస్మయానికి గురిచేస్తోంది. నిజానికి ఎవరెస్ట్పై చెత్త పేరుపోతుండటం ఇప్పటిదేం కాదు. ఏళ్ల తరబడి కొనసాగుతూ వస్తోంది. ఒకానోక దశలో పరిస్థితులు మరీ దారుణంగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో ఎవరెస్ట్ పై పోగయ్యే వర్థాలను తగ్గించేందుకు ఐదేళ్ల కిందట నేపాల్ ప్రభుత్వం సరికొత్త నిబంధన విధించింది. పర్వతారోహకుల బృందం పైకి ఎక్కేప్పుడు కొంత సొమ్మును డిపాజిట్ చేయాలి. ఒక్కో సభ్యుడు తిరిగి వచ్చేటప్పుడు ఎనిమిది కిలోల చొప్పున వ్యర్థాలను తెవాలి. అప్పుడు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. టిబెట్ వైపు నుంచి ఎక్కేవారు కచ్చితంగా ఎనిమిది కిలోల వ్యర్థాలను తేవాలి. గత ఏడాది నేపాల్ నుంచి వెళ్లిన పర్వతారోహకులు 25 టన్నుల చెత్తను - 15 టన్నుల మానవ విసర్జితాలను తెచ్చారని సాగర్ మాత పొల్యూషన్ కంట్రోల్ కమిటీ తెలిపింది. కానీ ఏటా ఎవరెస్ట్ పై పేరుకుపోతున్న వ్యర్థాలతో పోలిస్తే ఇది చాలా తక్కువన్నది తేలింది. అవినీతి దందా... ‘ఒక్కో బృందం ఎవరెస్ట్ పర్యటనకు రూ.14 లక్షల నుంచి రూ.68 లక్షల వరకు వెచ్చిస్తున్నారు. అంత మొత్తం చెల్లించినప్పుడు తిరిగి చెత్తను వెంటపెట్టుకుని రావటం ఏంటన్న భావనతో చాలా మంది అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పి తమ డిపాజిట్ సొమ్మును వెనక్కి తీసుకుంటున్నారు. ఇలా రెండు దశాబ్దాలుగా ఎవరెస్ట్ అధిరోహకుల సంఖ్య పెరిగి వ్యర్థాలను ఇష్టం వచ్చినట్టు పడేస్తుండటంతో టన్నుల మేర చెత్త పేరుకుపోయింది’ అని నేపాల్ పర్వతారోహకుల సంఘం మాజీ అధ్యక్షుడు నేపాలీ షెర్పా పెంబా డోర్జే ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో 30 మంది సభ్యుల బృందం 8.5 టన్నుల చెత్తను అతికష్టం మీద తీసుకొచ్చినట్లు ఆయన చెబుతున్నారు. అవగాహన సదస్సులు ఎన్ని నిర్వహిస్తున్నా.. అవినీతి దందాతో లాభం లేకుండా పోతోందని పెంబా డోర్జే ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ పరిణామాలపై పర్యావరణ వేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ‘ఎవరెస్ట్ పై పెద్ద ఎత్తున పెరిగిపోతున్న చెత్త సుందర హిహాలయాలను కలుషితం చేస్తోంది. ఎవరెస్ట్ పై పేరుకున్న వ్యర్థాలు మంచులో కలుస్తున్నాయి. మంచు కరిగినప్పుడు కలుషిత నీరు ఉత్పత్తి అవుతోంది. అది మహా ప్రమాదం’ అని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. -
ఇటువైపు ఒక అడుగు
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరిదే!ఆ తర్వాత మరిన్ని అడుగులు పడతాయి. వాటికి మరికొన్ని అడుగులు జత కలిస్తే అద్భుతాలు జరుగుతాయి. అలాంటి ఓ అద్భుతం జరగడం కోసం డంప్యార్డ్ వైపు ఒక అడుగు వేశారు డాక్టర్ జయశ్రీ కిరణ్. తర్వాత అడుగు మనది కావాలి. మనందరిదీ కావాలి. డాక్టర్ జయశ్రీ కిరణ్ లెక్చరర్. సైఫాబాద్ సైన్స్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్. ఉంటున్నది హైదరాబాద్లోని తార్నాక. గత ఐదు నెలలుగా ఆమె డంప్యార్డ్ల చుట్టూ ఉండే జనావాసాల్లోకి వెళ్లివస్తున్నారు. వాళ్లంతా డంప్యార్డే జీవనాధారం అయినవాళ్లు. డంప్యార్డ్కి వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జబ్బు చేస్తే క్రమం తప్పకుండా వాడాల్సిన మందుల గురించి ఆ సమీపంలోని ఇల్లిల్లూ తిరిగి, ముఖ్యంగా అక్కడి మహిళల్లో అవగాహన కల్పిస్తున్నారు. మున్సిపల్ అధికారులను కూడా కలిసి డంప్యార్డ్ వద్ద హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేయమని కోరుతున్నారు. తను కూడా హెల్త్క్యాంపులను పెట్టి, అనారోగ్యం బారిన పడకుండా ఉండటానికి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ‘దయచేసి డంప్యార్డ్ వైపు ఒకసారి చూడండి’ అని నగరవాసులను కూడా కోరుతున్నారు! ఎందుకిలా జయశ్రీ ఏరి కోరి ప్రమాదంలోకి వెళుతున్నారు? ఇదే మాటను ఆమెను అడిగితే.. ‘నేను వెళ్లడం.. అంటుంచండి. వాళ్లంతా ప్రమాదంలోనే కదా ఉంటున్నారు!’ అంటారు ఆవేదనగా. జబ్బుల దిబ్బలు! పగిలిపోయిన ట్యూబ్లైట్లు, గాజు బాటిళ్లు, గ్లాసు ముక్కలు చెత్తబుట్టలోనే వేస్తుంటాం. డయాబెటిస్ పేషెంట్స్ రోజూ తీసుకునే ఇన్సులిన్ ఇంజెక్షన్లూ అదే బుట్టలోనే. ఆడవాళ్లు వాడేసే శానిటరీ న్యాప్కిన్లు, ఉపయోగంలో లేని బ్యాటరీలు, డిజిటల్ వేస్టేజ్.. ఒకటేమిటి హానికరమైన ఎన్నో వస్తువులు చెత్తలోకి చేరుతుంటాయి. అవన్నీ డంప్యార్డ్కి చేర్చి, ఉపాధి కోసం వాటిలోనే తిరిగేవారికి ఆ గాజు ముక్కలు, ఇంజెక్షన్లు గుచ్చుకుని.. వ్యాధుల పాలిట పడుతున్నారు. వాడిపడేసిన బ్యాటరీలు ఒక్కోసారి పేలుతుంటాయి కూడా! ఇదంతా డంప్యార్డ్ వద్ద హెల్త్క్యాంప్ ఏర్పాటు చేశాక, అక్కడి వారి పరిస్థితులు ప్రత్యక్షంగా చూశాక జయశ్రీకి మరింతగా స్పష్టం అయ్యింది. అసలు ఈ జబ్బుల దిబ్బల్లోకి వెళ్లాలన్న ఆలోచన జయశ్రీకి ఎలా వచ్చింది? ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. మూడు రోజులు బండి రాలేదు ‘ఉద్యోగానికి కొంతకాలం సెలవు పెట్టి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు జరిగిందది! ఆ సమయంలో వరుసగా మూడు రోజుల పాటు చెత్త తీసుకువెళ్లే వాళ్లు రాలేదు. ఆ దుర్గంధాన్ని భరించలేకపోయాను. నాల్గవ రోజు చెత్త తీసుకెళ్లే ఆమె వస్తే ‘ఎందుకు రావట్లేదు?’ అని కోపగించుకున్నాను. ‘మా ఆయనకి ఒంట్లో బాగోలేదమ్మా! కడుపునొప్పి. పోయిన వారమే నాకూ ఆసుపత్రి ఖర్చు వెయ్యి రూపాయిలయ్యింది. ఇప్పుడు ఆయనకు..’ అంటూ లోపలికి వచ్చి చెత్త డబ్బా తీసుకెళ్లింది కుంటుకుంటూ. చెత్తను తను తెచ్చిన బండిలో వేసుకుని, చెత్తబుట్టను ఇవ్వడానికి తిరిగొచ్చింది. ‘నీకేమయ్యింది కుంటుతున్నావ్.. ’ అన్నాను. ‘కాలికి ఏదో గుచ్చుకుంది. ఇరవై రోజుల పైనే అయ్యింది. నొప్పి అస్సలు తగ్గడం లేదు’ అంది. ‘మీకిలా ఉంటే మీ పిల్లల్నెవరు చూస్తారు’ అన్నాను. ‘మా పిల్లోడికి ఐదేళ్లమ్మా! ఎక్కడేస్తే అక్కడే పడుంటాడు. పిలిచినా పలకడు. డాక్టర్లకు చూపిస్తే మెదడు ఎదుగుదల లేకుండానే పుట్టాడు అని చెప్పారు, ఏం చేస్తాం. మా తలరాత’ అంటూ ఆమె ఇంకో ఇంట్లో చెత్త తీసుకెళ్లడానికి వెళ్లబోయింది. ‘మీరెక్కడుంటారు.. ఈ చెత్తంతా ఎక్కడకు తీసుకెళతారు?’ అని అడిగాను. ‘డంప్యార్డ్ ఉందిగా అమ్మా! అక్కడకు తీసుకెళ్లి వేస్తాం.. మేం ఉండేది కూడా అక్కడి బస్తీలోనే’ అని చెప్పి, ముందుకు వెళ్లిపోయింది. నేరుగా డంప్యార్డుకే వెళ్లిపోయా! ఆ తర్వాత రోజు చెత్త తీసుకెళ్లడానికి ఆమె రాలేదు. మనసు మనసులో లేదు. ఏమై ఉంటుంది ఆమెకు. భర్తకు ఆరోగ్యం బాగోలేదు. పిల్లాడు ఎలా ఉన్నాడో.. ఆమె చెప్పిన స్థితి కళ్ల ముందు కదలాడుతోంది. ఇంట్లో ఉండబుద్ది కాలేదు. ఆమె చెప్పిన డంప్యార్డ్ ఎక్కడుంటుందో కనుక్కొని వెళ్లాను. ఇక్కడే ఉందన్నట్టు ముందుగా వచ్చిన దుర్వాసన చెప్పేసింది. వంద ఎకరాల్లో ఉండే ఆ డంప్యార్డ్ను కాసేపు అక్కడే ఉండే చూశా! కనుచూపుమేరంతా చెత్త. ముక్కులు పగిలిపోయే దుర్వాసన. భుజాలకు పెద్ద పెద్ద సంచులు వేసుకున్న కొందరు ఆడవాళ్లు, పిల్లలు, మగవాళ్లు చెత్తను కెలుకుతూ స్క్రాప్ని ఏరుకుంటున్నారు. వాళ్ల చేతులకు గ్లౌజులు లేవు. కొందరి కాళ్లకు చెప్పులు లేవు. పందులు, కుక్కలు ఆ ఏరియా మాదేనన్నట్టు తిరుగుతున్నాయి. అక్కడే ఉన్న ఒకట్రెండు చెట్లకు ఐదారు గుడ్డ ఊయలలు పసిపిల్లలను నిద్రపుచ్చుతున్నాయి. ఆ పిల్లల తల్లులు ఆ మురికి చేతుల్తోనే పిల్లలను ఎత్తుకుంటున్నారు. అలాగే పాలు పడుతున్నారు. అక్కడ వారికి చేతులు కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవు. వెంట తెచ్చుకున్న బాటిళ్ల నీళ్లతో గొంతులు తడుపుకుంటున్నారు. దాదాపు వందల మంది ఆ డంప్యార్డే ఆధారంగా జీవిస్తున్నారు. రెండు రోజులు ఇంట్లోని చెత్తను తీసుకెళ్లకపోతేనే విసుక్కుంటాం. అలాంటిది నిత్యం చెత్తలోనే బతుకుతున్న వారిని చూస్తుంటే కడుపులో దేవినట్టయ్యింది. నా భర్త కిరణ్కుమార్ డాక్టర్ కావడంతో నా ఆవేదనను వెంటనే అర్థం చేసుకున్నారు. హెల్త్ క్యాంపు ఏర్పాటులో తనూ ఓ చేయి కలిపారు. పర్మిషనిచ్చినా చాలు..! రోజూ వేల టన్నుల చెత్త ఒక డంప్యార్డ్కి చేరుతుందట! నగరంలో ఇలాంటి డంప్యార్డ్లు 24 ఉన్నాయి. వాటన్నింటినీ తిరిగాను. విదేశాలలో ఇళ్ల నుంచి చెత్తను సేకరించే పద్ధతులు, అక్కడ ప్రజలు తీసుకునే జాగ్రత్తలు, చెత్తను రీ సైక్లింగ్ చేసే విధానాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకున్నాను. వాటిలో మనం కనీసం 50 శాతం పాటించినా ప్రజల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందనిపించింది. అన్ని డంప్యార్డ్ల వద్ద హెల్త్క్యాంపుల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాను. రెండు రోజుల క్రితమే పటాన్చెరువు, మియాపూర్లలోని డంప్యార్డ్ల వద్ద హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశాం. తాగునీటి సౌకర్యం కోసం వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశాం. మిగతా డంప్యార్డ్ల వద్ద కూడా హెల్త్ క్యాంపులు పెట్టి, అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే, ఇందుకు తగినంత వైద్య సిబ్బంది, వాలంటీర్ల లేమి ఉంది. రాబోయేది వర్షాకాలం. ఈ కాలంలో ఆరోగ్య సమస్యల సంఖ్య ఇంకా ఎక్కువే. కాలుష్యం తగ్గడానికి డంప్యార్డ్ చుట్టూ ఔషధ మొక్కల పెంపకానికి చర్యలు తీసుకోవాలని, తాగునీటి వసతితో పాటు చేతులు, ఒళ్లు శుభ్రం చేసుకోవడానికి తగినన్ని నీళ్లను ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నాను. పర్మిషన్ ఇచ్చినా ఆ పనిని నేను కొద్ది కొద్దిగానైనా నెరవేర్చుకుంటూ వెళ్లగలననే నమ్మకం నాకుంది’’ అని చెప్పారు జయశ్రీ. ‘‘ఇన్నాళ్లు నేను చేసిన ఉద్యోగం పిల్లల భవిష్యత్తుకు మార్గం చూపేది. ఇప్పుడు డంప్యార్డ్ చుట్టూ పేరుకుపోయిన అనారోగ్య పరిస్థితుల్ని తొలగించడానికి నా చుట్టూ ఉన్న నలుగురిని తట్టిలేపాలని నిశ్చయించుకున్నాను’’ అంటున్నారు జయశ్రీ. ప్రతి ఇంటికీ బాధ్యత ఉంది మన దగ్గర తడి చెత్త–పొడి చెత్త అని, చెత్తను వేరు చేసే రెండు విధానాలు ఉన్నాయి. కానీ, వాటిని పట్టించుకునే వారే లేరు. ఇళ్ల వద్దే చెత్తను మనం చాలా రకాలుగా తగ్గించవచ్చు. తడి చెత్తను కంపోస్ట్ ఎరువుగా మార్చుకోవచ్చు. పొడి చెత్తలోనూ హానికారకమైన (సిరంజులు, సూదులు, గాజు ముక్కలు, బ్యాటరీల.. వంటివి) వస్తువులను విడిగా ఒక ప్యాకెట్లో వేసి ఇస్తే వాటిని వాళ్లు అంతే జాగ్రత్తగా తీసుకెళ్లగలరు. నివారణ మన ఇంటి నుంచి మొదలైతే సమాజ ఆరోగ్యం బాగుంటుంది. – జయశ్రీ – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
చెత్త కుంభకోణం
కర్నూలు నగరంలో చెత్త తరలించడానికి 12 ట్రాక్టర్లు, 2 టిప్పర్లు 4 కాంపాక్టర్లు ( భారీ స్థాయిలో చెత్త తరలించే వాహనాలు) ఉన్నాయి. ఇవి చాలదన్నట్లు అధికారులు ప్రైవేట్ చెత్త ట్రాక్టర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒక్కో ట్రిప్పుకు రూ.780 ప్రకారం ఏడాదికి కోటి రూపాయలకు పైగా కట్టబెట్టడం విమర్శలకు తావిస్తోంది. కర్నూలు (టౌన్): కర్నూలులో 5.50 లక్షల జనాభా ఉంది. ఇక్కడ 51 వార్డులను పారిశుద్ధ్య పరంగా 13 డివిజన్లుగా విభజించారు. ప్రతి రోజు 170 మెట్రిక్ టన్నుల చెత్త తరలించాల్సి ఉంది. వీటిని తరలించేందుకు నగరపాలక సంస్థకు సంబంధించిన ట్రాక్టర్లు ఉన్నా వినియోగించడం లేదు. ప్రైవేట్ ట్రాక్టర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎందుకంటే.. చెత్తను తరలించేందుకు ట్రిప్పుల విధానం అమలవుతోంది. ప్రభుత్వ ట్రాక్టర్లను ప్రతి రోజూ రెండు ట్రిప్పులు తిప్పుతున్నారు. వీటికి ఎలాంటి ఖర్చు ఉండదు. అయితే ప్రైవేట్ ట్రాక్టర్లకు ప్రతి రోజు ఐదు ట్రిప్పులు కేటాయించారు. ఒక్కో ట్రిప్పుకు రూ. 780ప్రకారం ఐదు ట్రిప్పులకు రూ. 3,900 నగరపాలక సంస్థ చెల్లిస్తుంది. ప్రతి రోజూ 13 ప్రైవేట్ ట్రాక్టర్లకు రూ. 49,400 చెల్లిస్తున్నారు. నెలకు. రూ. 14,80,000 ప్రకారం ఏడాదికి రూ.1,77,84,000 చెల్లిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ప్రైవేట్ ట్రాక్టర్లకు నిధులు చెల్లిస్తున్నా...కర్నూలులో పారిశుద్ధ్యం మెరుగుపడడం లేదు. ఇదిలా ఉండగా.. ప్రతి రోజూ రెండు ట్రిప్పులు తిప్పుతున్న ప్రభుత్వ ట్రాక్టర్లకు డీజీల్ ఖర్చు ఏటా రూ.1,20,00,000 అవుతున్న విషయం విదితమే. ప్రైవేట్ ట్రాక్టర్ల నుంచి మున్సిపల్ అధికారులు ట్రిప్పుకు ఇంత అని కమీషన్ తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డంపింగ్ యార్డు వద్దా ఇదే పరిస్థితి.. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజు 25కు పైగా ట్రాక్టర్ల ద్వారా వస్తున్న చెత్తను పాతబస్తీ జమ్మిచెట్టు వద్ద (ట్రాన్సిట్ పాయింట్)కు తరలిస్తున్నారు. ఇక్కడ నుంచి చెత్తను గార్గేయపురానికి తరలించాలి. ఇక్కడ కూడా ప్రభుత్వ ట్రాక్టర్లు ఉన్నాయి. టిప్పర్లు ఉన్నాయి. కాంపాక్టర్లు ఉన్నాయి. అయినా... వీటన్నింటినీ పక్కన పెట్టారు. ఇక్కడి నుంచి చెత్తను తరలించేందుకు రెండు ప్రైవేట్ టిప్పర్లకు అప్పగించారు. ఒక్కో ట్రిప్పుకు రూ. 2 వేల ప్రకారం చెల్లిస్తున్నారు. -
డంపింగ్ యార్డులు నిర్మించాలి
నల్లగొండ : గ్రామాల్లో డంపింగ్ యార్డులు నిర్మించాలని జెడ్పీ స్థాయీ సంఘం కమిటీ సభ్యులు కోరారు. గురువారం నల్లగొండలోని జెడ్పీ కార్యాలయంలో గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం స్థాయి సంఘం కమిటీల సమావేశం జరిగింది. జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలూనాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఆయా కమిటీల సభ్యులు, ఉమ్మడి జిల్లాకు చెందిన అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ.. గ్రామాల్లో రహదారుల వెంట చెత్తా చెదారం పేరుకుపోతోందని అన్నారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో డంపింగ్ యార్డులు నిర్మించి.. చెత్త నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. హరితహారంలో భాగంగా పంపిణీ చేస్తున్న మల్బరీ, వేప మొక్కలు నాసిరకంగా ఉంటున్నాయని.. మొక్కలు ఎదగడం లేదని సభ్యులు అన్నారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తూకం వేయడానికి కాంటాలు సరిపోవడం లేదని, అధనంగా కాంటాలు ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాలో ఎమ్మార్పీకి మించి మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, చింతపల్లి, మాడ్గులపల్లి ఏరియాల్లో కల్తీ మద్యం విక్రయిస్తున్నారని, జాతర్లు, పండుగలప్పుడు వ్యాపారులు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని సభ్యులు తెలిపారు. దీనిపై ఎక్సైజ్ శాఖ స్పందిచకపోతే.. ప్రజాప్రతినిధులుగా తామే జోక్యం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గురువారం జరిగిన సమావేశాలకు పలువురు అధికారులు హాజరు కాకపోవడంపై జెడ్పీ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా గైర్హాజరైన అధికారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. గత సమావేశాల్లో సభ్యులు కోరిన వివిధ అభివృద్ధి పనులను అధికారులు వీలైనంత త్వరగా పూర్తిచేయాలని చైర్మన్ సూచించారు. సమావేశంలో సభ్యులు, జెడ్పీ సీఈఓ హనుమానాయక్, డీఆర్డీఓ రింగు అంజయ్య, డీఈఓ జగిని చైతన్య, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. -
డంపింగ్ యార్డు తొలగించాల్సిందే..
కాకినాడ : డంపింగ్యార్డు సమస్యతో సతమతమవుతున్న లారీ యజమానులు ఒక్కసారిగా రోడ్డెక్కారు. లారీ యజమానుల సంఘ కార్యాలయం పక్కనే చెత్త వేసి తగలబెట్టడంతో వచ్చే కాలుష్యం వల్ల తమ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని వారు ఆదివారం నుంచి మెరుపు సమ్మెకు దిగారు. దీంతో ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోగా రేవు ద్వారా జరిగే రవాణా కార్యకలాపాలు కూడా స్తంభించిపోయాయి. కాకినాడ రాజీవ్ గృహకల్ప సమీపంలోని పర్లోపేట వద్ద ఎఫ్సీఐ గొడౌన్లను ఆనుకుని ఉన్న స్థలంలో చాలా కాలంగా చెత్త డంప్ చేస్తున్నారు. నగరానికి డంపింగ్యార్డు లేకపోవడంతో నిత్యం సేకరించే చెత్తను అక్కడకు తరలించి తగలబెడుతున్నారు. దీంతో ఇదే ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న లారీ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్తతోపాటు జంతు కళేబరాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆస్పత్రి వ్యర్థాలను తగలబెట్టడంతో విపరీతమైన దుర్వాసన, పొగ ఆవరించి ఆ ప్రాంతం మీదుగా వెళ్లలేని దుస్థితి నెలకొందంటూ చాలాకాలంగా అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. పైగా లారీ యజమానులు, డ్రైవర్లు, కార్మికులతో పాటు చుట్టుపక్కల ఉండే సంజయ్నగర్, పర్లోపేట, దుమ్ములపేట ప్రాంతవాసులు రోగాలు, వ్యాధులతో సతమతమవుతున్నామని గతంలో కూడా రెండుమూడుసార్లు ఆందోళనకు దిగగా అధికారులు, ప్రజాప్రతినిధులు నచ్చచెప్పడంతో వెనక్కి తగ్గారు. తాజాగా డంపింగ్ యార్డు కోసం సామర్లకోట సమీపంలో స్థలం కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, డంపింగ్ సమస్య మాత్రం యథావిధిగా కొనసాగడంపై లారీయజమానులు ఒక్కసారిగా నిరసన గళం విప్పారు. ఆగిన లారీలు... కాకినాడ లారీ అసోసియేషన్ పరిధిలోని దాదాపు 2,500 లారీలను ఆదివారం ఎక్కడికక్కడ నిలిపివేశారు. డంపింగ్యార్డు తరలింపుపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు బంద్ విరమించేదిలేదంటూ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రాజాన సూర్యప్రకాష్, ముత్యం తేల్చిచెప్పారు. పైగా డంపింగ్కు వాహనాలు వెళ్ళే రహదారి వద్ద లారీని అడ్డంగాపెట్టారు. కార్పొరేషన్ పారిశుద్ధ్య వాహనాలు వెళ్ళకుండా నిరోధించారు. దీంతో దిగివచ్చిన కార్పొరేషన్ యంత్రాంగం, పోలీసులు, ప్రజాప్రతినిధులు లారీ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చిస్తున్నారు. అయితే తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు నిర్ణయంలో మార్పులేదని స్పష్టం చేస్తున్నారు. మరో వైపు లారీ అసోసియేషన్ ద్వారా జరిగే రేవు కార్యకలాపాలపై బంద్ ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది. నిత్యం రేవు ద్వారా సుమారు 300లకు పైగా లారీల ద్వారా ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రాలకు బియ్యం, బొగ్గు, కెమికల్స్ వంటి వస్తువులను రవాణా చేస్తుంటారు. ఇప్పుడు ఇవన్నీ దాదాపు స్తంభించిపోయాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రవాణారంగంతోపాటు రేవు కార్యకలాపాలపై కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. -
మున్సిపల్ కార్మికురాలికి అభినందన
మెట్పల్లి: చెత్త కుప్పలో దొరికిన రూ.1.20లక్షలను పోగొట్టుకున్న వ్యక్తికి ఇచ్చి నిజాయితీని చాటుకున్న మున్సిపల్ పారిశుధ్య కార్మికురాలు మద్దెల లక్ష్మిని గురువారం పలువురు అభినందించారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ మర్రి ఉమారాణి, కమీషనర్ అయాజ్లు, బీసీ సంఘం నాయకులు అందె మారుతి, బొడ్ల రమేశ్లు సన్మానించారు. అలాగే 9వార్డులో కౌన్సిలర్ గైనీ లావణ్యతో పాటు స్థానికులు లక్ష్మీ దంపతులను అభినందించారు. -
ఇస్తావా.. చస్తావా!
ఈ ఫొటోలో మొక్కజొన్న తోట వద్ద నిలబడి ఉన్న రైతు పేరు అడబాల పద్మారావు.ఊరు పోలవరం. మూలలంక ప్రాంతంలో ఇతని పేరుతో 47 సెంట్లు, ఇతని భార్య కుమారి పేరుతో 50 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిపైనే ఆధారపడి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ భూమి మొత్తం పోలవరం డంపింగ్యార్డ్ కోసం ప్రభుత్వం సేకరిస్తోంది. ఇతనికి భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తెకు వివాహం చేయాలి. భూమిని ప్రభుత్వం తీసుకుంటే కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలో అర్థం కావటంలేదని పద్మారావు ఆవేదన చెందుతున్నారు. పోలవరం : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అవసరమైన డంపింగ్ యార్డు కోసం రైతుల నుంచి భూములు సేకరించే విషయంలో ప్రభుత్వ తీరు ఆందోళనకరంగా ఉంది. భూములు కలిగిన రైతులతో చర్చలు జరపకుండా, ఎంత నష్టపరిహారం ఇస్తారో తేల్చకుండా ఏకపక్షంగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ (డీఎన్) ప్రటించటం, నోటీసులు జారీ చేయటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బలవంతంగా భూములు తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయమైన ధర చెల్లించకపోతే భూములు ఇచ్చేదిలేదని చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు డంపింగ్యార్డ్ కోసం పోలవరం గ్రామంలోని మూలలంక ప్రాంతంలో 2016లో ప్రభుత్వం భూములు సేకరించింది. రెండో విడతగా ఈ ఏడాది మరికొన్ని భూములు సేకరించేందుకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. భూములు సేకరిస్తున్నామని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్తో మాట్లాడుకోవాలని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె.మోహన్కుమార్ చెప్పటం మినహా, రైతులతో రేటు విషయంలో ఏ విధమైన చర్చలు జరపలేదు. ఆందోళనకు గురైన రైతులు ఇటీవల పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి తమ భూములకు న్యాయమైన ధర ఇప్పించాలని కోరారు. సీఎం జిల్లా కలెక్టర్ భాస్కర్ను అడగ్గా పట్టిసీమ ఎత్తిపోతల పథకం భూములకు ఇచ్చిన ధర ఇస్తామంటూ స్పష్టం చేశారు. పట్టిసీమ భూములకు మూడేళ్ల కిందట ఎకరానికి రూ.19.53 లక్షలు చొప్పున నష్టపరిహారం చెల్లించారు. అప్పుడు ఇచ్చిన రేటే ఇప్పుడు కూడా చెల్లిస్తామని చెప్పటం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండో విడతగా డంపింగ్ యార్డ్ కోసం 52 మంది రైతులకు సంబంధించి 88 ఎకరాల భూములు సేకరించేందుకు ఆర్డీఓ మోహన్కుమార్ ఇటీవల రైతులకు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులను చాలా మంది రైతులు తీసుకోలేదు. మీ భూములకు ఎకరానికి రూ.15.39 లక్షలు రేటు నిర్ణయించామని, నోటీసు అందిన మూడు రోజుల్లోగా బ్యాంకు ఖాతా నంబర్తో పాటు ఆధార్కార్డు జిరాక్స్ను జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో దాఖలు చేయాలని పేర్కొన్నారు. లేకుంటే నష్టపరిహారం సొమ్ము రైతుల ఖాతాకు జమచేయటం వీలు పడదని పేర్కొన్నారు. పత్రాలు దాఖలు చేయకపోతే చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. భూములు కలిగిన రైతులతో చర్చలు జరపకుండా ఏకపక్షంగా భూములు సేకరించేందుకు చర్యలు చేపట్టటం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం వేల కోట్లు పెరుగుతున్నా, తమకు మాత్రం న్యాయం జరగటంలేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి, పోలవరం డంపింగ్ యార్డ్కు, నిర్వాసితుల పునరావాసానికి, పోలవరం కుడి ప్రధాన కాలువకు భూములు ఇచ్చామని ఇక సాగు చేసుకునేందుకు కూడా భూమిలేని పరిస్థితి ఏర్పడిందని విలవిల లాడుతున్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి, పోలవరం కుడి కాలువకు పెదవేగి, నూజివీడు, బాపులపాడు మండలాల్లో భూములకు చెల్లించిన ధర తమకు కూడా చెల్లించాలని కోరుతున్నారు. భూములు మొత్తం కోల్పోతున్నందున అవసరమైతే మిగిలిన ప్రాంతాల్లో ఇచ్చిన విధంగా జీఓ ఇచ్చి ఎకరానికి రూ.30 లక్షలు నష్టపరిహారం చెల్లించి తమకు న్యాయం చేయాలని రైతులు మిరియాల నాగమణి, ఓడపాటి సత్యన్నారాయణ, పంతులు గంగరాజు తదితరులు కోరుతున్నారు. -
కల్తీ మద్యం బుసబుస
తెనాలి: నకిలీ మద్యం కుంభకోణానికి ఇంకా తెరపడలేదు. ఖాళీ సీసాల్లో నకిలీ, చౌక మద్యం అమ్మకాల గుట్టు రట్టయి, నిందితులెవరో నిగ్గు తేలినప్పటికీ తవ్వేకొద్దీ అన్నట్టుగా కొత్త కేసులు వెలుగు చూస్తూనే వున్నాయి. ‘సాక్షి’ వరుస కథనాల్లోని అంశాలు పక్కా వాస్తవాలుగా బహిర్గతమవుతున్నాయి. ఆ క్రమంలోనే శుక్రవారం స్థానిక మార్కెట్ సెంటర్లోని బజారులో మూసి ఉంచిన కూరల దుకాణంలో కొత్త మూతల డంప్ పట్టుబడటం ఇందుకు నిదర్శనం. దుకాణం లోపల ఉంచిన వివిధ రకాల మద్యం బ్రాండ్లకు చెందిన వేలాది మూతలను అధికారులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నకిలీ మద్యం గుట్టు రట్టు రేపల్లె సమీపంలోని తుమ్మల పంచాయతిలోని గాదెవారిపాలెంలో ఒక ప్రైవేటు ఇంటిలో నడుస్తున్న నకిలీ మద్యం రాకెట్ జనవరి 16న బహిర్గతమైన విషయం తెలిసిందే. దీనికి కొన్ని నెలల ముందు నుంచి ఈ అక్రమ వ్యాపారం నడుస్తోంది. మ హారాష్ట్ర టు అదిలాబాద్, విజయవాడకు రెక్టిఫైడ్ స్పిరిట్ను తెప్పించి, రంగు కలిపి నకిలీ మద్యం తయారు చేయటం, ఖాళీ మద్యం సీసాల్లో నింపటం ఒకరకమైతే, మధ్య రకం ఖరీదు కలి గిన బ్రాండ్ల ఖాళీ సీసాల్లో చౌకమద్యం కలపటం మరో రకం. ముందే తెప్పించుకున్న కొత్త మూతల్ని క్యాప్ ఫిట్టింగ్ మిషనుతో సీలు వేస్తున్నారు. ‘ఎక్సైజ్’లోని ఆరితేరిన కొందరు ఉద్యోగులు, మద్యం లైసెన్సుదారులు కుమ్మక్కయి, తెనాలి డివిజనువ్యాప్తంగా ఈ అక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ‘సాక్షి’ కథనాలతో తెనాలికేసి చూపు గాదెవారిపాలెం కల్తీ మద్యం కేసులో ఎక్సైజ్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్, అతడి బంధువు సహా పలువురు నిందితులని తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెనాలి సమీపంలోని క్రాప, ఈమని గ్రామాల్లో పలు కేసులు వెలుగు చూశాయి. అయితే, పట్టించుకోకుండా అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నారు. అధికారుల కనుక మేల్కొంటే కల్తీ, నకిలీ వ్యవహారం ముందే వెలుగుచూసేదని అదే నెల 21న ‘సాక్షి’ కథనంలో పేర్కొనటంతో ఆ దిశగా దర్యాప్తుచేసిన అధికారులు కొత్త మూతల సరఫరాదారును గత నెల మొదటివారంలో అదుపులోకి తీసుకున్నారు. తమదైన ట్రీట్మెంట్తో ఇందులో భాగస్వాములైన లైసెన్సుదారుల పేర్లను వెల్లడించినట్టు తెలిసింది. సందేహాలకు తావిస్తున్న ‘ఎక్సైజ్’ గోప్యత ప్రొహిబిషన్, ఎక్సైజ్ పోలీసులు ఈ కేసులో గోప్యతను పాటిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. గత నెలలో పట్టుబడిన మూతల సరఫరాదారు వెల్లడించిన లైసెన్సుదార్లపై విచారించారా? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అనే అంశంపై అధికారులు మౌనాన్ని వీడటం లేదు. కీలకమైన రెక్టిఫైడ్ స్పిరిట్ను తన పేరుతో దిగుమతి చేసుకుంటూ కల్తీ మద్యం వ్యాపారం కేసులో నిందితుడైన తెనాలి ఎక్సైజ్ కార్యాలయం ఉద్యోగిని ప్రధాన నిందితుల్లో ఒకరుగా కాకుండా చివరి వరుసలోకి చేర్చి, పక్షపాతం చూపారనే విమర్శలున్నాయి. పక్కదారి పట్టించేందుకు ఎత్తుగడ మార్కెట్ సెంటర్లో పట్టుబడిన కొత్త మూతల డంప్ కేసు నీరుగార్చే ప్రయత్నంలో భాగమేనని విశ్వసనీయ సమాచారం. నిజానికి కూరగాయల దుకాణం యజమాని ఆకుల సత్యనారాయణ, అద్దెదారుకు వివాదం నడుస్తోంది. కొద్దినెలలుగా దుకాణం మూసివేసి ఉంటోంది. లోపల బూజు పట్టి వున్న దుకాణంలో మూతలు, వుంచిన సంచీ ఎలాంటి మట్టీమరకలు లేకుండా ఉండటం చూస్తుంటే, ఒకటి రెండురోజుల ముందే ఎవరో అక్కడ పడేసి వుంటారనీ, అందుకు మార్గం కూడా ఉందని చెబుతున్నారు. కేవలం కేసును పక్కదారి పట్టించేందుకు ఇప్పటికే ఆరోపణలున్న దుకాణం యజమానిపై నెట్టే ప్రయత్నంలో ఇదొక భాగమనీ, లైసెన్సుదార్లు తప్పించుకునే వ్యూహమన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో పెద్దఎత్తున డబ్బు చేతులుమారినట్టు మద్యం వ్యాపారవర్గాలు గుసగుసలాడుతున్నారు. మద్యం కల్తీ కోసం దాచిన మూతలు స్వాధీనం తెనాలి రూరల్ : మద్యం కల్తీ చేసి విక్రయించేందుకు దాచి ఉంచిన మూతలను ఎక్సైజ్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. పట్టణంలోని మార్కెట్ కూడలికి వెనుక వైపున ఉన్న షాపులో కల్తీ మద్యం ఉందన్న సమాచారంతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు దాడి చేశారు. మూసి ఉన్న షట్టర్ను తెరిచి చూడగా, శ్లాబుకు కన్నం వేసి ఉంది. దానికి ఆసరాగా ఉన్న నిచ్చెన సాయంతో శ్లాబు పైభాగంలో వెతకగా, మద్యంలోని వివిధ బ్రాండులకు చెందిన మూతలు ఉన్నాయి. సీసాల్లో మద్యం కల్తీ చేసి, వాటిని బిగిస్తారు. షాపు గత 15 సంవత్సరాలుగా ఆకుల సత్యనారాయణ అనే వ్యక్తి పేరున ఉన్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడుల్లో ఎక్సైజ్ ఏఈఎస్ అరుణకుమారి, సిబ్బంది పాల్గొన్నారు. మూతలు తెనాలికి సరఫరా ఇటీవల కొల్లూరు మండలం క్రాపలో పట్టుబడిన నకిలీ మూతలు తెనాలికి సరఫరా అవుతున్నట్లు గుర్తించామని ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ అరుణకుమారి తెలిపారు. సత్యనారాయణ దుకాణంలో ఈ నేపథ్యంలోనే సోదా చేసినట్టు వివరించారు. బ్రాండెడ్ మద్యాన్ని చీప్ లిక్కర్తో కల్తీ చేసి, వాటికి ఈ మూతల్ని బిగిస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించామని, సత్యనారాయణ కొలకలూరు, దుగ్గిరాల గ్రామాల్లో మద్యం వ్యాపారం చేస్తున్నాడని చెప్పారు. -
డంపింగ్ యార్డుల జాడేదీ ?
‘‘పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని.. తడి, పొడి చెత్తను వేర్వేరు చేసి ఇళ్ల వద్దకు వచ్చే రిక్షాల్లోనే వేయాలి అని.. పేర్కొంటూ గ్రామాల్లో ఆర్భాటంగా డంపింగ్యార్డుల నిర్మాణాలు ప్రారంభించారు. అంతవరకూ బాగానే ఉన్నా నెలలు గడుస్తున్నా నేటికీ మండలంలో నాలుగు గ్రామాల్లోనే అవి పూర్తికాగా.. కొన్ని గ్రామాల్లో స్థలాలు లేక, మరికొన్ని గ్రామాల్లో నత్తనడకన డంపింగ్యార్డుల నిర్మాణాలు సాగుతున్నాయి. దీంతో పారిశుద్ధ్యం పడకేసింది, చిన్నచింతకుంట : మండలంలోని ఆయా గ్రామాల్లో డంపింగ్యార్డుల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపడుతూ ఆరోగ్యకరమైన వాతావరణం గల గ్రామాలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం డంపింగ్యార్డుల నిర్మాణాలు నెలల కిందట చేపట్టింది. మండలంలోని 18 గ్రామాల్లో డంపింగ్యార్డు నిర్మాణ పనులు ప్రారంభించగా.. 4 గ్రామాలైన ఉంద్యాల, దాసర్పల్లి, ముచ్చింతల, అల్లీపూర్లో మాత్రం పూర్తయ్యాయి. డంపింగ్యార్డుల నిర్మాణాల కోసం ఈజీఎస్ అధికారులు స్థలాలు ఎంపిక చేశారు. అయితే, ఉపాధి కూలీలతో 8 గ్రామాలైన గూడూర్, నెల్లికొండి, వడ్డెమాన్, మద్దూర్, లాల్కోట, తిర్మలాపూర్ , అమ్మాపూర్, చిన్నచింతకుంటలో డంపింగ్యార్డు గుంతలను ఇప్పుడిప్పుడే తవ్వుతున్నారు. మిగిలిన 6 గ్రామాల్లో స్థలం లేక డంపింగ్ యార్డు పనులకు నోచుకోలేదు. పేరుకుపోతున్న చెత్తా చెదారం పట్టణంతో పాటు ఆయా గ్రామపంచాయతీలలో తడి, పొడి చెత్తలను ఎక్కడపడితే అక్కడ పారవేయడంతో పరిసర ప్రాంతాలన్ని దుర్భరంగా తయారవుతున్నాయి. గ్రామంలో పారిశుద్ధ్య వారోత్సవాల కార్యక్రమాల్లో తప్ప మిగిలిన రోజుల్లో అధికారులు పరిశుభ్రతపై శ్రద్ధ తీసుకోకపోవడంతో చెత్తకుప్పలు ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తున్నాయి. వీటితో పాటు తడిపొడి చెత్తలను తీసుకెళ్లడానికి ప్రభుత్వం ఇచ్చిన రిక్షాలు కూడా నిరుపయోగంగా మారాయి. అవి పంచాయతీ ఆవరణలకే పరిమితమయ్యాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆయా గ్రామాల్లో చెత్తనిల్వల కోసం డంపింగ్యార్డులను వెంటనే చేపట్టాలని పలువురు కోరుతున్నారు. అపరిశుభ్రంగా మారాయి గ్రామాల్లో డంపింగ్యార్డు పనులు నిలిచిపోవడంతో చెత్తా చెదారం రోడ్లపైనే పారబోస్తున్నారు. దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. పందుల సంచారం పెరిగింది. దీనితో పాటు ఈగలు, దోమలు వ్యాప్తిచెంది రోగాలబారిన పడే అవకాశం ఉంది. అధికారులు స్పందించి డంపింగ్యార్డులు త్వరగా పూర్తిచేయాలి. – చంద్రశేఖర్గౌడ్, అప్పంపల్లి త్వరలో పూర్తి చేస్తాం మండలంలోని అన్ని గ్రామాల్లో డంపింగ్యార్డుల నిర్మాణ పనులను వేగవంతంగా చేస్తాం. పర్దిపూర్, బండ్రవల్లి, పల్లమర్రి, కురుమూర్తి దమగ్నాపూర్,అప్పంపల్లి గ్రామాల్లో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాన్ని ఊరికి దూరంగా చూపించకపోవడంతో పనులు మొదలుపెట్టలేక పోయాం. త్వరలో స్థలాలు ఎంపిక చేసి పూర్తిచేస్తాం. – నవీన్కుమార్, ఏపీఓ -
నల్లమలలో మావోయిస్టుల డంప్
సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో కలకలం రేగింది. జిల్లాలోని నాగలూటీ చెంచు గూడెం వద్ద మావోయిస్టుల డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డంప్లో గ్రనేడ్, జిలెటిన్ స్టిక్సను గుర్తించారు. మావోయిస్టుల డంప్ లభ్యం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అటవీ ప్రాంతమంతా జల్లెడ పడుతున్నారు. -
విజయనగరంలో ఆపరేషన్ రెడ్
చిత్తూరు అర్బన్ : ఎర్రచందనం స్మగ్లింగ్ను అరి కట్టడానికి చిత్తూరు పోలీసు జిల్లాలో ఏర్పాటైన ఆపరేషన్ రెడ్ విభాగం విజయనగరంలో ఓ భారీ డంప్ను స్వాధీనం చేసుకుంది. రూ.కోట్లు విలువజేసే ఎర్రచందనం డంప్ను విజయనగరం జిల్లాలో గుర్తించిన చిత్తూరు పోలీసులు దాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీని వెనుక ఉన్న ఓ బడా స్మగ్లర్ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు సమాచారాన్ని రాబడుతున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు.. పూతలపట్టు సమీపంలో మూడు రోజుల క్రితం వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు ఓ మినీలారీలో ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. ఇందుకు సంబంధిం చి నిందితులను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా, ఎర్రచందనం స్మగ్లింగ్లో విజయనగరం జిల్లాకు చెందిన ఓ బడా వ్యక్తి పేరు బయటపెట్టారు. ఈ విషయంపై ఏ మాత్రం ఆలస్యం చేయొద్దని .. ఓ ప్రత్యేక బృందాన్ని విజయనగరం పంపుతూ చిత్తూరు ఎస్పీ రాజశేఖర్బాబు ఆదేశాలు జారీ చేశారు. పూతలపట్టులో పట్టుబడ్డ చోటా స్మగ్లర్ను వెంటపెట్టుకుని మంగళవారం తెల్లవారుజామున చిత్తూరు పోలీసులు విజయనగరం చేరుకున్నారు. అక్క డ భారీగా దాచి ఉంచిన ఎర్రచందనం దుంగల డంప్ను గుర్తించారు. టన్ను రూ.35 లక్షల వరకు పలికే ఏ–గ్రేడ్ ఎర్రచందనం దుంగలు డంప్లో ఉన్నట్లు సమాచారం. పట్టుబడ్డ ఎర్రచందనం దుంగల విలువ దాదాపు రూ.5 కోట్లకుపైగా ఉండొచ్చని సమాచారం. కాగా దుంగలు పట్టుబడ్డ డంప్ ప్రాంతంలో ముగ్గురిని చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఎర్రచంద నం దుంగలు దొరికిన స్థల యజమా నితో పాటు మరో ఇద్దరు స్మగ్లర్లు ఉన్నారు. అయితేఅనూహ్యంగా వీరి వెనుక ఓ అంతర్జాతీయ బడా స్మగ్లర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించా రు. అతడిని పట్టుకోవడానికి విజయనగరం పోలీసులతో కలిసి చిత్తూరు పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అక్కడున్న అన్ని ప్రధాన చెక్పోస్టులపై నిఘా ఉంచారు. మరో రెండు రోజుల పాటు అక్కడే ఉండి పట్టుబడ్డ డంప్తో పాటు నిందితులను చిత్తూరుకు తీసుకురానున్నారు. శేషాచలం అడవుల్లో భారీగా ఎర్రచందనం స్వాధీనం భాకరాపేట /తిరుపతి మంగళం : శేషాచలం అడవుల్లో భారీగా ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నట్లు భాకరాపేట ఫారెస్టు రేంజర్ రఘునాథ్ తెలిపారు. మంగళవారం భాకరాపేటలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ శేషాచలం అడవుల్లో అటవీ అధికారులు, సిబ్బంది, ప్రొటెక్షన్ వాచర్లు, పైర్ వాచర్లు కలసి నాలుగు రోజులుగా కూంబింగ్ చేస్తున్నారని, సోమవారం పెరుమాళ్లపల్లె బీట్ పరిధిలోని మేకలబండ ప్రాంతంలో ఎదురుపడ్డ తమిళ స్మగ్లర్లను చుట్టుముట్టే ప్రయత్నం చేయగా, వారు దుంగలు పడేసి పరారయ్యారని తెలిపారు. అక్కడ 60 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే మంగళవారం 50 దుంగలు ఉన్న డంప్ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. -
పసికందును అమ్మజూపి..ఆపై హత్య చేసి..
-
గ్రేటర్.. ఇండోర్ రూట్
సాక్షి,సిటీబ్యూరో: ఇండోర్ నగరాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు అక్కడి యంత్రాంగం కంకణం కట్టుకుంది. అక్కడ రోడ్డుపై చెత్త వేస్తే రూ.500 నుంచి రూ.1000 వరకు జరిమానా వసూలు చేస్తున్నారు. ఇలా సంవత్సరంలో రూ.1.5. కోట్లు వసూలు చేశారంటే ఎంత నిబద్ధతగా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. నగరమంతా రోడ్డుకు ఇరువైపులా ప్రతి 100 మీటర్లకు రెండు చెత్తడబ్బాలు ఏర్పాటు చేశారు. తడి–పొడి చెత్త ఇంటివద్దే వేరు చేయాల్సిందే. దుకాణాలు, హోటళ్లు, తదితర సంస్థల నుంచి ప్రతిరోజు వెలువడే చెత్త పరిమాణాన్ని బట్టి నెలవారీ చెత్త తరలింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. అలా తక్కువ చెత్త వెలువడే దుకాణాలకు రూ.500 వసూలు చేస్తుండగా, పెద్ద హోటళ్లకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇళ్ల నుంచి చెత్త తరలించే కార్మికులకు నెలకు రూ.60 చెల్లిస్తున్నారు. చెత్త తరలింపు బండ్లలో తడి,పొడికి వేర్వేరు అరలే కాక నాప్కిన్లకు మరో డబ్బా కూడా ఉంచారు. చెత్త రవాణా కేంద్రాల్లో బయో మెథనైజేషన్ చేస్తున్నారు. ఎక్కువ చెత్త ఉత్పత్తి చేసే సంస్థల నిర్వాహకులతో పాటు కాలనీ సంఘాలు తదితరులకు ఎక్కడికక్కడే సేంద్రియ ఎరువు యంత్రాలను వినియోగించాల్సిందిగా అవగాహన కల్పించారు. రోజుకు పది కేజీల కన్నా ఎక్కువ చెత్త వెలువడే ప్రాంతాల్లో ఈ యంత్రాలను ఉంచారు. పెద్ద హోటళ్లు, ఫంక్షన్హాళ్లలో వీటిని తప్పనిసరి చేశారు. పార్టీ ఇస్తే చార్జి చెల్లించాల్సిందే.. ఏదైనా ఫంక్షన్ హాల్లో గానీ, రోడ్డుపై టెంటు వేసి వేడుక ఏర్పాటు చేసి విందు ఇస్తే ఎంతమంది హాజరు కానున్నారో మనిషికి రూ.50 చొప్పున సదరు పార్టీ నిర్వాహకులు కార్పొరేషన్కు ముందుగానే చెల్లించాలి. వ్యర్థాల తరలింపునకు ఈ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఎవరైనా చెల్లించకుంటే పెనాల్టీగా రెట్టింపు చార్జీ వసూలు చేస్తున్నారు. ఇటీవల ఇండోర్లోని స్థానిక ఎమ్మెల్యే ఒకరు ముందస్తు ఫీజు చెల్లించనందుకు అతని నుంచి రూ.50 వేల పెనాల్టీ వసూలు చేశారని అధ్యయనం చేసి వచ్చిన గ్రేటర్ అధికారులు తెలిపారు. అంటే అక్కడ పరిశుభ్రతకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో.. నిబంధనలు ఎంత కఠినంగా అమలు చేస్తున్నారో తెలుస్తోంది. చెత్త తరలింపు పర్యవేక్షణకు కన్సల్టెన్సీ.. ఇంటింటి నుంచి చెత్త తరలింపు సక్రమంగా జరుగుతున్నదీ లేనిదీ పరిశీలించేందుకు ఇండోర్ కార్పొరేషన్ ఎన్విరాన్మెంట్ సర్వీసెస్ కన్సల్టెన్సీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అందుకుగాను ఒక్కో ఇంటికి నెలకు రూ.11 వంతున కార్పొరేషన్ చెల్లిస్తోంది. అక్కడ సేకరించిన చెత్తను రీసైకిల్ చేసి చెత్తడబ్బాలను తయారు చేశారు. తరిగి ఒక్కో డబ్బాను రూ.25లకు ప్రజలకు విక్రయించారు. టాయ్లెట్ల నిర్వహణ ఇలా.. ఒక్కో టాయ్లెట్ నిర్వహణకు ఇండోర్లో నెలకు రూ.15 వేలు ఖర్చు చేస్తున్నారు. ఇందులో రూ.7500 కేర్టేకర్కు చెల్లిస్తుండగా, రూ.7500 నిర్వహణకు వెచ్చిస్తున్నారు. అక్కడ ఔట్సోర్సింగ్ సిబ్బందిని తీసుకునేది 29 రోజులకే. ఆ ఒప్పందం ముగియగానే వారినే మళ్లీ తాజా ఒప్పందంతో తీసుకుంటారు. రెగ్యులర్ చేయాలనే డిమాండ్లు రాకుండా ఇండోర్లో ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. గతేడాది స్వచ్ఛ ర్యాంకింగ్లో దేశంలోనే నెంబర్–1గా నిలిచిన ఇండోర్లో స్వచ్ఛ కార్యక్రమాలు ఎలా అమలు చేస్తున్నారో పరిశీలించేందుకు జీహెచ్ఎంసీకి చెందిన అధికారులు ఇప్పటికే అక్కడ పర్యటించి వచ్చారు. వారు అధ్యయనం చేసిన వివరాలను ‘సాక్షి’కి వివరించారు. అధ్యయనం చేసి వచ్చిన వారిలో జోనల్ కమిషనర్లు శ్రీనివాసరెడ్డి, శంకరయ్య, హరిచందన, భారతి హొళికేరి, అడిషనల్ కమిషనర్ మనోహర్, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్రెడ్డి, శశికిరణాచారి తదితరులు ఉన్నారు. వారు తమ అధ్యయన నివేదికను కమిషనర్కు అందజేయనున్నారు. వాటిలో నగరానికి అనువైన వాటిని త్వరలో అమలు చేయనున్నారు. స్వచ్ఛతపై ప్రత్యేక శ్రద్ధ.. ఇండోర్ కార్పొరేషన్ జనాభా 35 లక్షలు. విస్తీర్ణం 150 చ.కి.మీ. కమిషనర్తో పాటు నలుగురు అడిషనల్ కమిషనర్లు స్వచ్ఛ కార్యక్రమాలపైనే ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారని జోనల్ కమిషనర్ శంకరయ్య తెలిపారు. గతేడాది నెంబర్–1గా నిలవడంతో దాన్ని తిరిగి నిలుపుకుందామంటూ ఎక్కడ చూసినా ‘ఫిర్ రహేంగే’ ప్రకటనలు కనిపిస్తున్నాయని సీసీపీ దేవేందర్రెడ్డి తెలిపారు. -
‘చెత్త’ చెరువు
అది పట్టణం నడిబొడ్డున ఉన్న చెరువు.. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది పట్టణవాసులకు ఆహ్లాద వాతావరణం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. మినీ ట్యాంక్బండ్ పేరుతో రూ.5.41కోట్లు కేటాయించి సుందరీకరణ పనులు చేపట్టింది. ఆహ్లాదం దేవుడెరుగు! కానీ ప్రస్తుతం చెత్తాచెదారంతో చెత్త చెరువుగా మారిపోయింది. అటువైపు నుంచి వెళ్తే దుర్గంధం వెదజల్లుతోంది.. ఇది నల్లచెరువు దైన్యం..! వనపర్తి : జిల్లా కేంద్రంలో సుమారు 70ఎకరాల విస్తీర్ణంలో నల్లచెరువు విస్తరించి ఉంది. దీని కింద 397.37ఎకరాల ఆయకట్టు ఉంది. ఏటా టన్నుల కొద్దీ ధాన్యం పండుతుంది. మినీ ట్యాంకుబండ్గా మార్చిన తర్వాత కేఎల్ఐ నీటితో చెరువును నింపి ఏడాది పొడవునా కృష్ణాజలాలు ఉండేలా ఆధునికీకరణ కోసం అధికారులు ప్రణాళికలు రూపొందించి రూ.5.41కోట్లు వెచ్చించారు. కానీ నిత్యం వనపర్తి పట్టణం నుంచి సేకరిస్తున్న చెత్తను చెరువుకు ఉత్తరం, దక్షిణం దిశలో డంప్ చేస్తున్నారు. మినీ ట్యాంకు అభివృద్ధి పనులు ప్రారంభమైన రెండు నెలల క్రితం కొంతమేర చెత్త వేయగా ప్రస్తుతం పూర్తిగా నిండిపోయింది. నల్లచెరువును నీటితో నింపితే ఇక్కడ ఉన్న నీరంతా కలుషితమవడం ఖాయం. అంతేకాకుండా జిల్లా కేంద్రంలోని ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి సేకరించిన వ్యర్థాలను ఇక్కడే పారబోస్తున్నారు. పట్టణవాసులకు ఆహ్లాదమైన వాతావరణం అందించేందుకు రూ.కోట్ల ప్రజాధనం వెచ్చించి అభివృద్ధి చేస్తున్న మినీ ట్యాంకుబండ్లో చెత్త వేయడంతో పరిసరాలు కంపుకొడుతున్నాయి. చెరువు కట్టమీది నుంచి వచ్చేవారు ముక్కు మూసుకుని వెళ్లాల్సి వస్తోంది. బోటుషికారుకు ఇబ్బందే మినీట్యాంకుబండ్లో చెత్త డంపింగ్ ఆపకుంటే మున్ముందు ఇక్కడ ఏర్పాటుచేసే బోటుషికారు మురుగు, కలుషితనీటిలో చేయాల్సిన వస్తుంది. ఒకవేళ పాడి ఆవులు, గేదెలు తాగినా పాల దిగుబడి తగ్గి, విషతుల్యం కానున్నాయి. బతుకమ్మల నిమజ్జనం కష్టమే.. ఏటా దసరా సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహించే బతుకమ్మలను నల్లచెరువులోనే నిమజ్జనం చేసే విధంగా అధికారులు ప్రత్యేక ఘాట్లను సిద్ధం చేస్తున్నారు. చెరువు భూభాగంలో చెత్త డంపింగ్ ఆపకపోతే ఘాట్ నిర్మాణం పూర్తిగా చెత్తతో నిండిపోనుంది. ప్రతిష్టాత్మక బతుకమ్మ సంబరాలను చెత్తకుప్పల మధ్య నిర్వహించుకోవాల్సి వస్తోందని పలువురు పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త డంపింగ్ యార్డుకు ప్రతిపాదనలు ఇంతకుముందు డంపింగ్యార్డు వివాదంలో ఉండడంతో కొత్తగా మరోచోట డంపింగ్ యార్డు నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అనుమతి రాగానే డంపింగ్ ప్రదేశాన్ని మార్చుతాం. ప్రస్తుతానికి చెరువు ప్రదేశంలో చెత్త వేయకుండా మరోచోట వేసేలా చర్య తీసుకుంటాం. – వెంకటయ్య, ఇన్చార్జి కమిషనర్, వనపర్తి మున్సిపాలిటీ -
స్కూల్ మానేసిన అబ్బాయిలు పెద్ద నేరం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో అత్యాచారాల సంఘటనలు జరుగుతునే ఉన్నాయి. ఓ యువతిపై ముగ్గురు యువకులు లైంగిక దాడి జరిగిన ఘటన మరువకముందే జహంగిపురి ప్రాంతంలో మరో మహిళపై సామూహిక లైంగిక దాడి జరిగింది. ఐదుగురు జువెనైల్స్ కలిసి ఓ మహిళను బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి తెలిసినవాళ్లే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఎవరికైనా చెబితే చంపేస్తాం అని బెదిరించారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ఐదుగురు జువెనైల్స్ జహంగిరి ప్రాంతంలోని మున్సిపల్ చెత్త డంపింగ్ యార్డ్ వద్ద భవనం వెనుకకు ఆమెను రాత్రి 10గంటల ప్రాంతంలో బలవంతంగా తీసుకెళ్లారు. ఆమె అరిచే ప్రయత్నం చేసినా గొంతు నొక్కిపట్లి అరిస్తే చంపేస్తామని చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించి కేసు నమోదు చేశారు. ఈ ఐదుగురు కూడా బాధితురాలు ఉండే ప్రాంతంలో ఉండేవారేనని, మధ్యలోనే స్కూల్ మానేసిన వీరు చెత్త డంపింగ్ యార్డ్లో పనులు చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. వారు బాల నేరస్తులు కాకుంటే కోర్టుకు తీసుకెళతామని చెప్పారు. -
భర్తను చంపి సెప్టిక్ ట్యాంక్లో దాచిన మహిళ
-
కనిపించకుండా పోయి.. శవమై తేలి..
సాక్షి, మేడ్చల్ : మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పంచాయతీ పరిధిలోని రాంకీ చెత్త డంపింగ్ యార్డ్లోని నీటి మడుగులో ఓ బాలుడి మృతదేహం కలకలం రేపింది. శాంతినగర్కు చెందిన కృష్ణ కుమారుడు రామకృష్ణ(4)గా అతడిని గుర్తించారు. పదిహేనేళ్ల క్రితం విజయవాడ నుంచి వలస వచ్చిన కృష్ణ, శాంతి నగర్లో నివసిస్తూ, చెత్తను సేకరించి జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి బాలుడు కనిపించకుండా పోయాడు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు బాలుడు డంపింగ్ యార్డ్కు చెందిన నీటి మడుగులో శవమై తేలాడు. మృత దేహాన్ని మేకలు కాసే వ్యక్తి గుర్తించి బస్తీ వాసులకు తెలపడoతో, వారు పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న జవహర్ నగర్ సీఐ ఉమా మహేశ్వరరావు తన సిబ్బంది తో సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ ను రప్పించిన తదనంతరం పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పటల్ కు తరలించారు. -
భార్య చనిపోయిందని డంపింగ్ యార్డుకు నిప్పు
-
చెత్తశుద్ధి కరువాయే.. భరించలేని బరువాయే
టన్నుల్లో పోగుపడి కొండల్లా పేరుకుపోతున్నచెత్త జిల్లాను వణికిస్తోంది. ఏళ్ల తరబడి డంపింగ్యార్డుల కోసం చేపట్టిన అన్వేషణ ఓ కొలిక్కిరావడం లేదు. దీంతో పాలకవర్గాలకు చెత్త నిర్వహణ తలనొప్పిగా మారింది. ఈలోగా పందులు, దోమల స్వైర విహారంతో ప్రజలు భయపడుతున్నారు. రోగాలు విజృంభిస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. స్వచ్ఛభారత్ అంటూ ప్రభుత్వాలు హడావుడి చేస్తున్నా టన్నుల్లో భారం.. కొంతైనా తరగడం లేదు. ప్రభుత్వానికి బొత్తిగా చెత్తశుద్ధిలేదంటూ ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. ఆ వివరాలు ఇలా.. నగరంలో కార్మికులపై ఒత్తిడి ఏలూరు(సెంట్రల్): నగరపాలకసంస్థ పరిధిలో మొత్తం 50 డివిజన్లలో సుమారు 55 వేల ఇళ్లు ఉన్నాయి. రోజూ సుమారు 80 టన్నుల చెత్తను పారిశుద్ధ్య కార్మికులు సేకరిస్తున్నారు. ఈ చెత్తనంతా నగర శివారు పొణింగ్ ప్రాంతంలోని 18 ఎకరాల్లో ఉన్న డంపింగ్ యార్డుకు 18 ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. 190 మంది పర్మినెంట్ సిబ్బంది ఉండగా 270 మంది కాంట్రాక్ట్ సిబ్బంది నగరంలో పారిశుద్ధ్య పనుల్లో పాల్గొంటున్నారు. ఏటా పారిశుద్ధ్య పనులకు నగరపాలక సంస్థ రూ.30 లక్షలు ఖర్చు చేస్తోంది. నగరంలో 2.12 లక్షల మంది జనాభాకు గాను చెత్త సేకరణకు ఇంకా 100 మంది అదనపు సిబ్బంది అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. యనమదుర్రు కాలువగట్టుపై.. భీమవరం టౌన్: మున్సిపాలిటీ పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చడంతో రోడ్లపై చెత్త తగ్గినప్పటికీ గొల్లవానితిప్ప రోడ్డులోని యనమదుర్రు కాలువగట్టుపై గుట్టలుగా సుమారు కిలోమీటరు దూరం దర్శనమిస్తోంది. మున్సిపాలిటీకి నిధుల కొరతలేనప్పటికీ డంపింగ్యార్డును సమకూర్చుకోలేని పరిస్థితి. 25.64 చ.కిమీ కలిగిన పట్టణంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 1,47,188 మంది జనాభా ఉన్నారు. రోజుకు 81 టన్నుల చెత్తపోగవుతోంది. 417 మంది పారిశుద్ద్య సిబ్బంది రోజుకు 78.50 టన్నుల వ్యర్థాలను తొలగిస్తున్నారు. డంపింగ్యార్డు లేకపోవడంతో సేకరించిన చెత్తను ట్రాక్టర్లలో గొల్లవానితిప్పరోడ్డులోని యనమదుర్రు కాలువగట్టుపై డంప్ చేస్తున్నారు. ఇటీవల కేంద్రం నిర్వహించిన స్వచ్చ సర్వేక్షణ సర్వేలో పట్టణానికి 87వ ర్యాంకు లభించింది. 2007లో యనమదుర్రు గ్రామంలో రూ.80 లక్షలతో 14.5 ఎకరాలను డంపింగ్యార్డు నిమిత్తం మున్సిపాలిటీ కొనుగోలు చేసింది. అయితే కొందరు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సమస్య పెండింగ్లో ఉంది. తడి పొడి.. మొక్కుబడి తణుకు : పట్టణంలో మొత్తం 34 వార్డుల నుంచి నిత్యం దాదాపు 50 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఈ చెత్తను డంపింగ్ యార్డుకు తరలించేందుకు 8 ట్రాక్టర్లు, నాలుగు ఆటోలను వినియోగిస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా తడి, పొడి చెత్తను సేకరించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. తడి, పొడి చెత్త సేకరణపై అవగాహన కల్పించడానికి పురపాలక సంఘం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా మొత్తం నాలుగు డివిజన్లలో ప్రయోగాత్మకంగా తడి, పొడి చెత్త సేకరణ కార్యక్రమం తలపెట్టారు. ఈ పరిస్థితుల్లో 2004లోనే తణుకు పట్టణంలో చెత్త నుంచి ఎరువు తయారు చేసేందుకు ప్రత్యేక యూనిట్ నెలకొల్పినప్పటికీ ప్రస్తుతం వినియోగంలో లేదు. ఇందుకోసం 9 ఎకరాల్లో డంపింగ్ యార్డు నెలకొల్పగా చెత్తను మాత్రం రీ సైక్లింగ్ చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కలగా విద్యుత్ ప్లాంట్ తాడేపల్లిగూడెం: సంవత్సరాలు గడుస్తున్నా గూడెం మున్సిపాలిటీకి డంపింగ్ కోసం స్థలం దొరకని పరిస్థితి. పట్టణంలో రోజుకు వచ్చే చెత్త 80 టన్నులు. ప్రస్తుతం చెత్తను విమానాశ్రయ భూములకు దగ్గరగా ఉన్న భూముల్లో దగ్గరగా డంప్ చేస్తున్నారు. 2014లో తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను ప్రాంతంలో మూడెకరాల 20 సెంట్ల భూమిని మున్సిపాలిటీ డంపింగ్ అవసరాల కోసం రూ.44 లక్షలు ప్రభుత్వానికి చెల్లించారు. వేస్టు ఎనర్జీ ప్లాంటు కోసం పట్టణంలో భూములను కేటాయించారు. అయినా అవి అమలులోకి రాలేదు. పైగా జిల్లాలో గుర్తించిన మునిసిపాలిటీల నుంచి చెత్తను గూడెం తరలించి, దాని నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న ప్రాజెక్టు పట్టాలు ఎక్కలేదు. ఏటా మున్సిపాలిటీ పారిశుద్ధ్య నిర్వహణకు రూ.80 లక్షలు ఖర్చు చేస్తోంది. యార్డులు ఉన్నా యాతన పాలకొల్లు సెంట్రల్: మునిసిపల్ పరిధిలో 31 వార్డులకుగాను సుమారు 80 వేల మంది జనాభా ఉన్నారు. రోజుకు 30 టన్నుల చెత్త డంపింగ్యార్డుకు చేరుతోంది. ఇక్కడ డంపింగ్యార్డులు స్థానిక యడ్లబజారు సెంటర్, రామయ్య హాలు ఏరియాల్లో ఉన్నాయి. రెండు డంపింగ్యార్డులు చెత్తతో కొండలా పేరుకుపోయాయి. ఈ చెత్తను ప్రక్షాళణ చేయడంలో అధికారులు చేతులెత్తేస్తున్నారు. చెత్తను సేకరించడానికి మునిసిపాలిటీకి 6 ట్రాక్టర్లు, 4 ఆటోలు ఉన్నాయి. పారిశుద్ధ్య పర్మినెంటు కార్మికులు 92, కాంట్రాక్ట్ కార్మికులు 77 మంది.. మొత్తం 169 మంది కార్మికులు పనిచేస్తున్నారు. జనాభా పెరుగుతున్నారు తప్ప కార్మికులు మాత్రం పెరగడంలేదు. ఇంకా వేరుకాని చెత్త జంగారెడ్డిగూడెం: నగర పంచాయతీ పరిధిలో రోజూ సుమారు 10 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. ఊరి వెలుపల ఉన్న డంపింగ్యార్డుకు దీనిని తరలిస్తున్నారు. అయితే తడిపొడి చెత్తలను ఇంకా వేరుచేయడం లేదు. పట్టణంలో 20 వార్డుల్లో చెత్తను సేకరించేందుకు మొత్తం 89 కార్మికులు ఉండగా వీరిలో 83 మంది ఔట్ సోర్సింగ్పై పనిచేస్తున్నారు. చెత్తను తరలించేందుకు 3 ట్రాక్టర్లు, ఒక ఆటో, 46 రిక్షాలు ఉన్నాయి. పారిశుద్ధ్య నిర్వహణకు నెలకు రూ.13 లక్షలు.. ఏటా రూ.కోటిన్నర వరకూ వ్యయం అవుతోంది. పట్టణంలో ఈ నెల 31 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహిస్తున్నారు. స్థలం దొరక్క ఇక్కట్లు నరసాపురం: నరసాపురంలో డంపింగ్యార్డ్ సమస్య దశాబ్దాలుగా ఉంది. 1956లో మునిసిపాలిటీ ఏర్పడింది. అప్పటి నుంచి డంపింగ్యార్డ్ లేదు. దీంతో నిబంధనలకు విరుద్దంగా గోదావరిగట్టునే చెత్తను డంప్ చేస్తున్నారు. డంపింగ్యార్డు స్థల సేకరణకు మునిసిపాలిటీ వద్ద నిధులు రూ.1.50 కోట్లు సిద్ధంగా ఉన్నాయి. రెవిన్యూ శాఖ స్థలం అన్వేషిస్తోంది. 11.275 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 31 వార్డులతో విస్తరించి ఉన్న పట్టణంలో 60 వేల జనాభా ఉంది. పట్టణంలో రోజూ 32 టన్నుల చెత్తసేకరణ జరుగుతోంది. ఇందులో 10 టన్నులు తడి చెత్త, 22 టన్నులు చెత్త లభ్యమవుతోంది. ప్రస్తుతం మునిసిపాలిటీలో శానిటరీ సెక్షన్లో 73 మంది శాశ్వత సిబ్బంది, మరో 91 మంది కాంట్రాక్ట్ వర్కర్లు పనిచేస్తున్నారు. క్రైస్తవ శ్మశానవాటికలో డంపింగ్ కొవ్వూరు: డంపింగ్యార్డు కోసం ఆరేళ్ల క్రితం నందమూరు శివారున సేకరించిన 1.96 ఎకరాల భూమి హైకోర్టు తీర్పుతో దక్కలేదు. పట్టణంలో రోజుకు సరాసరి 26 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. రాజీవ్ కాలనీలో ఉన్న ఎకరం స్థలాన్ని ప్రస్తుతం చెత్త డంపింగ్కు వినియోగిస్తున్నారు. ఆ స్థలం సరిపోవడం లేదు. దీంతో రహదారుల చెంతన, క్రిస్ట్రియన్ శ్మశాన వాటికలోను పారబోస్తున్నారు. ఏటా పారిశుద్ధ్య నిర్వహణకు సుమారు రూ.కోటి ఖర్చు చేస్తున్నారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రం రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొవ్వూరులో సేకరించే చెత్తను ఈ కేంద్రానికి తరలించాలని నిర్ణయించారు. ఈ ప్లాంటు ప్రారంభం కాకపోవడంతో సమస్యగా ఉంది. -
అన్ని పంచాయతీలకు డంప్ యార్డులు
- డీపీఓ పార్వతి - అయ్యలూరు డంప్యార్డు పరిశీలన నంద్యాలరూరల్: జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో డంప్యార్డులు నిర్మిస్తామని జిల్లా పంచాయతీ అధికారిణి పార్వతి అన్నారు. సాలిడ్æ వేస్ట్ మేనేజ్మెంట్ పథకం కింద దశల వారీగా నిర్మాణాలు చేపడతామని వెల్లడించారు. అయ్యలూరు డంప్యార్డును మంగళవారం ఆమె పరిశీలించారు. మిగిలి ఉన్న చిన్నచిన్న పనులను త్వరగా పూర్తి చేయించాలని సర్పంచ్ తప్పెట రామలక్ష్మమ్మకు సూచించారు. సాలిడ్æ వేస్ట్మేనేజ్మెంట్ పథకంతో పల్లెల్లో పారిశుధ్య సమస్య పరిష్కారమవుతుందన్నారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్త సేకరించి డంప్యార్డుకు తరలించి వర్మీ కంపోస్టు తయారు చేయిస్తామన్నారు. దీంతోపాటు సేకరించిన చెత్తలోని గాజు, ఇనుప ముక్కలు, పాత చెప్పులను వేరు చేసి డంప్యార్డు ద్వారా విక్రయించడం వల్ల పంచాయతీలకు ఆదాయం లభిస్తుందన్నారు. సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు అలసత్వం వహించకుండా డంప్యార్డుల నిర్వహణపై శ్రద్ధ పెట్టాలన్నారు. కర్నూలు డీఎల్పీఓ విజయ్కుమార్, అనంతపురం డీపీఎం బృందం, అయ్యలూరు డంప్యార్డు నిర్మాణ పనులను పరిశీలించి లోటుపాట్లపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారన్నారు. కార్యక్రమంలో ఈఓఆర్డీ మహ్మద్దౌలా, పీఎస్ అక్బర్వలి, గ్రామ నాయకులు శ్రీనివాసులు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం.. చెత్త కుప్పలో ఆధార్ కార్డులు
సాక్షి, రాజస్థాన్: అధికారుల నిర్లక్ష్యం ప్రజా సేవలకు ఎంత విఘాతం కలిగిస్తుందో మరోసారి బయటపడింది. అల్వార్ జిల్లాలోని ఓ చెత్తకుప్పలో వేల కొద్ది లెటర్లు, ఆధార్ కార్డులు దర్శనమిచ్చాయి. ఏడాదిగా వీటిని బట్వాడా చేయకుండా ఇలా పడేసినట్లు తెలుస్తోంది. గద్బసాయి అటవీ ప్రాంతంలోని డంప్ యార్డ్లో కొందరు వ్యక్తులు రెండు సంచులలో వీటిని తీసుకొచ్చి పడేశారు. అటుగా వెళ్తున్న కొందరు గ్రామస్థులు అది గమనించి థానా ఘజి పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. పోలీసులు సంచులను సోదా చేయగా వాటిలో 3000 వేల ఉత్తరాలు, 100కు పైగా ఆధార్ కార్డులు బయటపడ్డాయి. అందులోని లేఖలన్నీ సంఘనర్ గ్రామానికి చెందిన అడ్రస్లతో ఉన్నట్లు స్టేషన్ హెడ్ ఆఫీసర్ అమిత్ కుమార్ తెలిపారు. బట్వాడా చేయకుండా వీటిని పడేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఆయన అన్నారు. లేఖలు, ఆధార్ కార్డులతోపాటు పెళ్లి శుభలేఖలు కూడా అందులో ఉన్నట్లు తెలుస్తోంది. సరిస్కా ప్రాంతం పక్కనే ఉండటంతో బహుశా ఆ పోస్టల్ కార్యాలయం నుంచే ఇవి వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. విషయాన్ని పోస్టల్ ఉన్నతాధికారులకు చేరవేశామని అమిత్ వెల్లడించారు. కాగా, ఘటనపై స్పందించేందుకు పోస్టల్ శాఖ అధికారులు నిరాకరించారు. -
మియాపూర్లో నాటు బాంబు పేలుడు
హైదరాబాద్: మియాపూర్లోని డంపింగ్ యార్డులో సోమవారం మధ్యాహ్నం నాటుబాంబు పేలుడు కలకలం సృష్టించింది. డంపింగ్ యార్డులో ఒక గేదె మేత మేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు శబ్దం విన్న స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం, బాంబ్ స్క్వాడ్ లతో డంపింగ్ యార్డు పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రేపు స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోనున్న తరుణంలో నాటు బాంబు పేలుడతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు. నాటుబాంబు పేలుడును దృష్టిలో పెట్టుకుని నగరంలోని హోటళ్లు, రేల్వేస్టేషన్, బస్స్టేషన్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
చెత్తలో భారీగా రద్దైన నోట్లు
హైదరాబాద్: నగరంలోని నేరేడ్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలోని వాజ్పేయినగర్లో రైల్వేగేటు వద్ద చెత్తలో భారీగా రద్దైన నోట్లు బయటపడ్డాయి. చంద గంగుభాయి అనే మహిళకు గురువారం ఉదయం రూ. 16 లక్షల రద్దైన నోట్లు దొరికాయి. వాటిలో 1000, 500 రూపాయల నోట్లు ఉన్నాయి. ఈ విషయాన్ని ఆమె పోలీసులకు తెలిపింది. స్థానిక పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అక్కడ చెత్తవేస్తే రూ.50వేలు జరిమానా
న్యూఢిల్లీ: గంగా నది ప్రక్షాళన అంశంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రీన్ గంగా ప్రాజెక్టులో గంగా నది అంచు నుంచి 500మీటర్ల పరిధిలో ఎలాంటి చెత్తను డంప్ చేయడానికి వీల్లేదని ఆదేశించింది. అలాంటి వారికి భారీ జరిమానా విధించాల్సిందిగా గ్రీన్ ట్రిబ్యునల్ చీఫ్ జస్టిస్ స్వతంతర్ కుమార్ గురువారం ఆదేశించారు. లెదర్ పరిశ్రమలను కూడా గంగా నదికి దూరంగా తరలించాలని కూడా స్పష్టం చేసింది. హరిద్వార్-ఉన్నావ్కు మధ్య విస్తరించిన 100 మీటర్ల పరిధిలోని భూభాగాన్ని 'నో-డెవలప్మెంట్ జోన్'గా ప్రకటించింది. అంతేకాదు ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికపై రూ. 50వేల జరిమానా విధించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ సర్కార్ చేపట్టిన చర్యలతో వచ్చిన ఫలితం శూన్యమేనని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పవిత్ర గంగానది ప్రక్షాళనకు దాదాపు రూ. 7,304 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఫలితం శూన్యమని తన ఆదేశాల్లో వ్యాఖ్యానించింది. ఈ పథకం రూపకల్పన అమలులో ప్రాథమికంగానే లోపాలు ఉన్నాయి అని ఎన్జీటీ తెలిపింది. కాగా ఉత్తరాఖండ్లోని హరిద్వార్, ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ మధ్య గంగా నదిలోకి వెలువడుతున్న పారిశ్రామిక కాలుష్యాలకు సంబంధించిన నివేదికలను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలో తీసుకున్నారో తెలపాలని పర్యావరణ, అటవీ, జల వనరుల మంత్రిత్వశాఖలకు, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, ఇతర సంస్థలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
46 బోగీల్లోని ఉల్లిపాయలు మాయం
బెంగళూరు రూరల్ జిల్లాలో ఘటన దొడ్డబళ్లాపురం (కర్ణాటక): కర్ణాటకలో ఉల్లిపాయల లోడుతో వెళుతున్న 46 బోగీల గూడ్సు రైలు లూటీకి గురైంది. ఈ ఘటన బెంగళూరు రూరల్ జిల్లా నెలమంగల సమీపంలోని బసవనహళ్లి రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన బడా వ్యాపారులు ఉల్లిలోడును బీహార్కు తీసుకెళ్లారు. అవి నాసిరకంగా ఉండటంతో వాటిని కొనుగోలు చేసేందుకు అక్కడి వ్యాపారులు నిరాకరించారు. దీంతో ఆ ఉల్లిని గూడ్సురైలులో నెలమంగల వద్ద ఉన్న డంపింగ్ యార్డుకు తరలిస్తుండగా.. బసవనహల్లి రైల్వే స్టేషన్ వద్ద రెడ్ సిగ్నల్ పడింది. దీంతో రైలును నిలిపివేశారు. కాగా, ఉల్లిగడ్డలను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న సమీప గ్రామాల ప్రజలు తండోపతండాలుగా బసవనహల్లి రైల్వే స్టేషన్కు వచ్చారు. గూడ్స్ రైలు బోగీల తలుపులు తెరిచి ఆ ఉల్లిమూటలను బైక్లపై, ఇతర వాహనాల్లో తీసుకువెళ్లిపోయారు. -
ఖర్చు బారెడు ఫలితం జానెడు..
♦ పారిశుద్ధ్యం పేరుతో చేతివాటం ♦ నగరానికి డంపింగ్యార్డు కష్టాలు నెల్లూరు(పొగతోట): నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్యం మెరుగుకు కోట్లు ఖర్చుచేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉండడంలేదు. నగరంలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలు దరశనమిస్తున్నాయి. కార్పొరేషన్ పరిధిలో సరైన డంపింగ్యార్డు అందుబాటులో లేని కారణంగా నిత్యం టన్నుల కొద్ది చెత్త నగరంలో నిలిచిపోతోంది. అంతేకాక డంపింగ్యార్డు నగరానికి దూరంగా ఉండడంతో చెత్తను తరలించడంలో జాప్యం జరుగుతోంది. ఫలితంగా నగరంలోని ఆచారివీధి, పొగతోట, వేదా యపాళెం ప్రాంతాల్లో చెత్త కుప్పలు దర్శ నమిస్తున్నాయి. నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంతాలి వద్ద 12 ఎకరాల విస్తీర్ణంలో డంపింగ్యార్డు ఏర్పాటు చేశారు. నగరంలో ఉత్పత్తయిన చెత్తను రెండు దశల్లో డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో సుమారు 8 లక్షల మంది నివశిస్తున్నారు. దాదాపు 1.50 లక్షల నివాస గృహాలు ఉన్నాయి. వాటితో పాటు వందల సంఖ్యలో ఆస్పత్రులు, హోటళ్లు ఉన్నాయి. నిత్యం 350 ట న్నులకు పైగా చెత్త ఉత్పత్తి అవుతోంది. కాగా చెత్తను తరలించేందుకు 20 టి ప్పర్లు, 4 ట్రాక్టర్లు, 54 ఆటోలు, 5 డంపర్లను కార్పొరేషన్ అధికారులు వినియోగిస్తున్నారు. 1500 మంది పారిశుద్ధ్య కార్మికులు నిత్యం పని చేస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం రెండు డంపింగ్యార్డులను ఉపయోగిస్తున్నా రు. నగరంలో ఉత్పత్తయిన చెత్తను మొ దట వాహనాల ద్వారా బోడిగాడితోట లోని డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. అనంతరం అక్కడి నుంచి దొంతలిలో ఏర్పాటు చేసిన డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. ఇలా రెండు దశల్లో తరలిం చడం వల్ల ఖర్చులు అధికమవుతున్నా యి. వాహనాలకు డీజిల్, కార్మికులకు వేతనాలు తడిసి మోపెడవుతున్నాయి. కాగా చెత్త తరలింపులో అధికారులు చేతి వాటం ప్రదర్శించి నగదు స్వాహా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికులు పనికి రాకపోయిన వచ్చి నట్లు మస్టర్లు వేసి నగదు మింగేస్తున్నారు. అలాగే వినియోగించని వాహనాల నుంచి డీజిల్ డ్రా చేసి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో చెత్తను తరలించిన తర్వాత బ్లీచింగ్ చేయడంలేదు. ఫలితంగా దోమలు ఉత్పత్తై ప్రజలు రోగాల భారిన పడుతున్నారు. గతంలో ఆల్లీపురం సమీపంలో బైపాసురోడ్డుకు పక్కన డంపింగ్యార్డు ఏర్పా టు చేశారు. దానిని ప్రస్తుతం వినియోగించడంలేదు. అలాగే ఇంటింటా చెత్త సేకరణ ప్రక్రియ సక్రమంగా జరగడంలేదు. అరంభంలో ఆటోల్లో మైకులు పెట్టి ప్రచారం చేసి చెత్త సేకరించారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఇంటింటా చెత్తను సేకరించే పారిశుద్ధ్య కార్మికులు గృహాల యాజమానుల నుంచి నెలకు రూ.30 నుంచి 50 వసూలు చేస్తున్నారు. చెత్తను తరలించే వాహనాలు పాతవి కావడంతో వాటిలో వేసిన చెత్త జారీ రోడ్డుపై పడిపోతోంది. -
పోరాటం ఫలప్రదం
►ఫలించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి దీక్ష ►చర్చలకు ఎంపీ శివప్రసాద్ చొరవ మంత్రి, ఎంపీ, కలెక్టర్ చర్చలు ►జిందాల్ ప్లాంట్ రామాపురంపరిసరాల్లో ఏర్పాటు చేయం: మంత్రి అమరనాథరెడ్డి ►డంపింగ్ యార్డును తరలిస్తాం:జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ►ఎమ్మెల్యేతో దీక్ష విరమింపజేసిన రామాపురం మహిళలు కేసీపేట(తిరుపతి రూరల్): ప్రజామద్దతు తోడుగా అంకిత భావంతో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చేపట్టిన దీక్షకు ప్రభుత్వం స్పందించింది. ఏళ్ల తరబడి వేధిస్తున్న సమస్యను పరిష్కరిస్తామని మంత్రి అమరనాథరెడ్డి, ఎంపీ శివప్రసాద్, కలెక్టర్ ప్రద్యుమ్న ప్రకటించారు. జిందాల్ ప్లాంట్ను సైతం రామాపురం పరిసరాల్లో ఏర్పాటు చేసేది లేదని స్పష్టం చేశారు. చెత్త బాధిత గ్రామాల్లో వైద్య సేవలు మెరుగుపరస్తామని, మినరల్ వాటర్ అందిస్తామని, అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ఐదు రోజులుగా చేస్తున్న నిరవధిక నిరాహారదీక్షను గురువారం ఎంపీ శివప్రసాద్ సమక్షంలో రామాపురం మహిళలు నిమ్మరసం ఇచ్చి చెవిరెడ్డి చేత విరమింపజేశారు. డంపింగ్ యార్డు బాధిత గ్రామాల్లోఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. సమన్వయం చేసిన ఎంపీ శివప్రసాద్ డంపింగ్ యార్డును తరలించాలని, చెత్త ప్లాంట్ను రామాపురం పరిసరాల్లో ఏర్పాటు చేయవద్దని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డిని గురువారం ఉదయం ప్రభుత్వ వైద్యులు పరీక్షించారు. పరిస్థితి విషమంగా ఉందని ప్రకటించారు. దీంతో స్థానిక ఎంపీ డాక్టర్ శివప్రసాద్ స్పందించారు. మంత్రి అమరనాథరెడ్డి, కలెక్టర్, కమిషనర్తో మాట్లాడారు. దీక్ష శిబిరం వద్దకు వచ్చి చర్చలకు రావాలని ఎమ్మెల్యే చెవిరెడ్డిని ఒప్పించారు. గురువారం మధ్యాహ్నం తిరుపతి పద్మావతీ అతిథి గృహంలో ఎమ్మెల్యే చెవిరెడ్డితో మంత్రి అమరనాథరెడ్డి, ఎంపీ శివప్రసాద్, కలెక్టర్ ప్రద్యుమ్న, కమిషనర్ హరికిరణ్, అర్బన్ ఎస్పీ విజయారావు రెండు గంటల పాటు చర్చలు జరిపారు. డంపింగ్ యార్డు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారు రోడ్డెక్కి పోరాడడానికి కారణాలను మంత్రి, ఎంపీ, అధికారులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి వివరించారు. పరిష్కార మార్గాలను కూడా సూచించారు. డిమాండ్లకు మంత్రి, ఎంపీ, అధికారులు అంగీకరించారు. ఎమ్మెల్యే, బాధిత ప్రజలు డిమాండ్ చేసినట్లు చెత్త నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసే ప్లాంట్ను రామాపురం పరిసరాల్లో ఏర్పాటు చేయబోమని మంత్రి ప్రకటించారు. డంపింగ్ యార్డును వేరొక ప్రాంతానికి తరలిస్తామన్నారు. డంపింగ్ యార్డు వల్ల పూడిపోయిన కాలువను శుభ్రం చేయడమే కాకుండా శుభ్రమైన వర్షపు నీళ్లు చెరువుకు వెళ్లేలా చేస్తామన్నారు. -
నగరానికి ఏమైంది?
ఒకవైపు పొగ.. మరోవైపు కాలుష్యం తప్పుదు భారీ మూల్యం అనంతపురం సమీపంలోని గుత్తిరోడ్డు పక్కన ఉన్న డంపింగ్ యార్డుతో చుట్టుపక్కల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యార్డు నుంచి వచ్చే పొగ, కాలుష్యం ధాటికి ప్రజలు శ్వాసకోశవ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా గుత్తి రోడ్డులో ఎదురుగా వచ్చే వాహనాలు కనపడకపోవడంతో డ్రైవర్లు పగలు కూడా లైట్లు వేసుకుని వెళ్తున్నారు. అయినా పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న గోడౌన్లు, కళ్యాణమండపాలు, పొగ దెబ్బకు మూతపడుతున్నాయి. అధికారులు స్పందించి డంపింగ్ యార్డును మరో ప్రాంతానికి మార్చాలని ప్రజలు వాపోతున్నారు. - సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
జైలుకు పంపి.. ఏ మొహం పెట్టుకుని వచ్చారు?
సీరామాపురం(తిరుపతి రూరల్): ‘‘పచ్చని పల్లెల్లో అధికారులే చిచ్చు పెడుతున్నారు..అతి తెలివితో సమస్యను జఠిలం చేశారు.. ఊరినంతా రోడ్డుపైకి తీసుకువచ్చారు.. అర్ధరాత్రి ఇళ్లలోకి దూరి చిన్నా, పెద్ద, మహిళలు అనే తేడా లేకుండా అందరినీ జైలుకు పంపారు.. మా వారిని జైలుకు పంపి ఏ మొహం పెట్టుకుని ఊర్లోకి వచ్చా రు..’’ అంటూ రామాపురం డంపింగ్ యార్డు బాధిత గ్రామాల ప్రజలు కలెక్టర్ ప్రద్యుమ్నను నిలదీశారు. ‘మీరు ఏం చెప్పాలన్నా మాకోసం జైలుకు వెళ్లిన ఎమ్మెల్యే చెవిరెడ్డితో పాటు మావాళ్లు వచ్చాకే ఊర్లోకి వచ్చి చెప్పండి.. అప్పటి వరకు మీరు చెప్పేది మేం వినేది లేదు’ అంటూ అధికారుల ప్రసంగాలను అడ్డుకున్నా రు. డంపింగ్ యార్డును తొలగించాల ని, అక్రమంగా అరెస్ట్ చేసిన ఎమ్మెల్యే చెవిరెడ్డిని, గ్రామస్తులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రామాపు రం గ్రామానికి చెందిన మహిళలు రెండు రోజులుగా రిలే నిరాహారదీక్షలను చేపట్టి చెత్త వాహనాలను అడ్డుకుంటున్నారు. 144 సెక్షన్ పెట్టినా బెదరకుండా ర్యాలీలు, దీక్షలను కొనసాగిస్తున్నారు. మహిళల దీక్షతో కలెక్టర్ ప్రద్యుమ్న, చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్, కార్పొరేషన్ కమిషనర్ హరికిరణ్, మాజీ ఎమ్మెల్యే అరుణకుమారి ఆదివారం మధ్యాహ్నం దీక్ష శిబి రం వద్దకు వచ్చారు. గ్రామస్తులతో చర్చలు జరిపేందుకు ప్రయత్నించా రు. వారిని మహిళలు అడ్డుకున్నారు. జైలులో పెట్టినా కనీసం ఎందుకు పరామర్శించలేదని గల్లా అరుణకుమారిని రామాపురం మహిళలు నిలదీశారు. గ్రామంలో కలెక్టర్ను నడిపిం చారు. భూగర్భజలాలు కాలుష్యమయ్యాయని, బోరు కొట్టి రంగుమారిన నీళ్లను బాటిళ్లలో పట్టి మరీ చూపించారు. ‘ఈ నీళ్లు మీరు తాగండి’ అంటూ కలెక్టర్కు ఇచ్చారు. కమిషనర్ వల్లే సమస్య.. తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ వల్లే గ్రామం మొత్తం రోడ్డు ఎక్కాల్సి వచ్చిం దని డంపింగ్ యార్డు బాధిత గ్రామాల ప్రజలు మండిపడ్డారు. కమిషనర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దొంగచాటుగా సమావేశాలు నిర్వహించాల్సిన అవస రం ఎందుకువచ్చిందని నిలదీశారు. కొ ద్దిసేపు అక్కడ గందరగోళం నెలకొంది. మాట తప్పితే మీతోపాటే వచ్చి ఉద్యమిస్తా: ఎంపీ శివప్రసాద్ ‘గ్రామంలో ప్లాంటు ఏర్పాటును నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. కాదు కూడదని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తే మీతో పాటే రోడ్డు ఎక్కుతా. మీ గొంతుకగా నిలుస్తానని’ చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ‘అఖిలపక్షం పేరుతో తిరుపతిలో చేసిన నాటకాలు నాకుతెలియవు, నన్ను నమ్మం డి’ అంటూ గ్రామస్తులను కోరారు. పవర్ లేదు : అరుణకుమారి ‘నేను మంత్రిగా ఉన్నప్పుడే సమస్య మొ దలైంది. మూడు నెలల్లో పరిష్కరిస్తామన్న అధికారులు పట్టించుకోలేదు. ఇప్పు డు నా దగ్గర పవర్ లేదు. ఇప్పటికిప్పుడు సమస్యను పరిష్కరించాలంటే ఎలా..? హాంఫట్ అంటే సమస్య పరిష్కరం కా దు’.. అంటూ మాజీ ఎమ్మెల్యే అరుణకుమారి గ్రామస్తులపై మండిపడ్డారు. కమిషనర్ను గ్రామస్తులు వ్యతిరేస్తుంటే ఆమె మాత్రం బాగా కష్టపడుతున్నాడు అంటూ పొగడ్త్తలతో ముంచెత్తారు. దీంతో గ్రామస్తులు మండిపడ్డారు. -
ప్రశ్నిస్తే సంకెళ్లా..
►ఎమ్మెల్యే చెవిరెడ్డితో పాటు 120 మంది గ్రామస్తుల అక్రమ అరెస్ట్ ►రోజంతా ఎమ్మెల్యేను స్టేషన్లకు తిప్పిన పోలీసులు ►నియోజకవర్గ వ్యాప్తంగా పెల్లుబుకిన నిరసనలు ►20గంటల పోలీస్ స్టేషన్లోనే మహిళలు ►అక్రమ అరెస్ట్లపై భగ్గు మన్న జనం, పార్టీ శ్రేణులు ►గ్రామానికి వచ్చి క్యాండిల్ ర్యాలీ, రాస్తారోకో డంపింగ్యార్డు తరలించి తమ ఆరోగ్యం కాపాడాలంటూ రామాపురం పరిసర గ్రామల ప్రజలు చేస్తున్న ఆందోళనపై సర్కారు ఉక్కు పాదం మోపింది. అర్ధరాత్రి దాటాక అరెస్టులకు పూనుకుంది. కనీసం మహిళలనే విచక్షణ లేకుండా బలవంతంగా లాక్కుపోయారు. వీరిపక్షాన పోరాడుతున్న చంద్రగిరి ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ పోలీసులు ఆయన్ను జిల్లాలో స్టేషన్లు తిప్పుతూ అరాచక వైఖరిని ప్రదర్శించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా జిల్లావ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది. అక్రమ అరెస్టులను ఖండిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తిరుపతి రూరల్: రామచంద్రాపురం మండలం లోని రామాపురంలో గురువారం అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. తిరుపతి రూరల్, రామాచంద్రాపురం మండలాల్లోని 11 గ్రామాల్లోని వే లాది మంది ప్రజలకు ఏళ్ల తరబడి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న డంపింగ్ యార్డును తరలించాలని డిమాండ్ చేస్తూ చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. గ్రామస్తులతో కలిసి మూడు రోజులు గా శాంతియుతంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి నిరసనను కొనసాగిస్తున్నారు. అర్ధరాత్రి దాటాక ఒంటిగంటన్నర ప్రాంతంలో ఇద్దరు ఏఎస్పీలు, ఐదుగురు డీఎస్పీలు, ఏడుగురు సీఐలు, పది మంది ఎస్ఐలు, 200 మంది పోలీసులు నిరసన శిబిరాన్ని చుట్టుముట్టారు. రోడ్డుపైనే నిద్రి స్తున్న 120 మందికి పైగా గ్రామస్తులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. స్థానికులు తీవ్రం గా ప్రతిఘటించారు. శిబిరాన్ని కూల్చివేశారు. అడ్డుకున్న వారి పట్ల దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల సహకారంతో చివరకు వారిని అరెస్ట్ చేసి తిరుపతి ఈస్ట్, ముత్యాలరెడ్డిపల్లి పోలీ స్స్టేషన్లకు తరలించారు. తొమ్మిది గంటల పాటు హైటెన్షన్.. పోలీసులు వస్తున్నారని ముందుగానే గుర్తిం చిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని గ్రామస్తులు ఓ ఇంటిలో ఉంచారు. లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడిని ఇంటిలో ఉండగా పోలీసులు దౌర్జన్యంగా అరెస్ట్ చేయడానికి వీలులేదు. దీంతో పోలీసులు వెనకడుగు వేశారు. తొమ్మిది గం టల పాటు రామాపురంలో హైటెన్షన్ నడిచింది. గ్రామస్తులను అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా ఎమ్మెల్యేని సైతం బలవంతంగా అరెస్ట్ చేసేందుకు వందల మంది పోలీసులు చేస్తున్న ప్రయత్నాలపై డంపింగ్ యార్డు బాధిత గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాపురం సర్కిల్ల్లో రాస్తారోకో చేపట్టారు. తహసీల్దార్ వచ్చి...144 సెక్షన్ పెట్టి.... ఇంటిలో ఉన్న ఎమ్మెల్యే చెవిరెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు మండల మెజిస్ట్రేట్ హోదా లో ఉన్న తహసీల్దార్ భాగ్యలక్ష్మిని ఆశ్రయిం చారు. ఆమె వచ్చి 144 సెక్షన్ విధించారు. తహసీల్దార్ పర్యవేక్షణలో ఎమ్మెల్యేను అరెస్ట్ చేసేం దుకు ప్రయత్నించారు. పెద్ద సంఖ్యలో చేరుకున్న గ్రామస్తులు ఎమ్మెల్యే అరెస్ట్ను నిరసిస్తూ అడ్డుకున్నారు. మహిళలని కూడా చూడకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించి నెట్టివేసి ఎమ్మెల్యే చెవిరెడ్డిని బలవంతంగా కారులో బుచ్చినాయుడుకండ్రిగకు, తర్వాత తొట్టం బేడు, శ్రీకాళహస్తి రూరల్, రేణిగుంట మీదుగా పుత్తూరుకు తీసుకెళ్లారు. ఇదిలా వుండగా బీఎన్ కండ్రిగలో చెవిరెడ్డిని ఎంపీ వరప్రసాద రావు కలవడానికి ప్రయత్నించినా ఆయన అంగీకరించలేదు. డంపింగ్ యార్డు తరలింపు ఒక్కటే తన డిమాండ్ అని స్పష్టం చేసినట్లు తెలిసింది. మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు దాదాపు 20 గంటల పాటు ఎంఆర్పల్లి పోలీ స్స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్ నుంచి విడుదలయిన మహిళలు గ్రామంలోకి వచ్చి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. చెవిరెడ్డి అక్రమ అరెస్ట్ను వ్యతిరేకిస్తూ గ్రామంలో ర్యాలీ చేసి, డంపింగ్ యార్డుకు వచ్చే తిరుపతి చెత్త వాహనాలను అడ్డుకుని రాస్తారోకో చేశారు. -
మనుషులుగా చూడండి
⇒అధికారుల బాధ్యతారాహిత్యమే సమస్యకు మూలకారణం ⇒తిరుపతిలోనే చెత్త ఉండాలని కోరుకోవడం లేదు ⇒ప్రజలకు, పల్లెలకు దూరంగా డంపింగ్ యార్డు పెట్టాలి ⇒సమస్యను పెద్ద మనస్సుతో ఆలోచించండి ⇒తిరుపతి ప్రజలకు ఎమ్మెల్యే చెవిరెడ్డి వినతి తిరుపతి రూరల్: రామాపురంలోని డంపింగ్యార్డును తరలించాలని గ్రామస్తులతో కలిసి రోడ్డుపైనే బైఠాయించి ఎమ్మెల్యే చెవిరెడ్డి చేపట్టిన నిరవధిక నిరసన బుధవా రం రెండో రోజు కూడా కొనసాగింది. సా యంత్రం నిరసన శిబిరం వద్ద ఆయన విలేకరుల సమావేశంలో గ్రామస్తులతో కలిసి మాట్లాడారు. రామాపురంలోని డంపింగ్ యార్డు తరలించాలని ఇక్కడ ప్రజలు ఐదేళ్లుగా పోరాడుతున్నారన్నారు. ఈ అందోళనల నేపథ్యంలోనే 2012లో తిరుపతి కమిషనర్, అడిషనల్ కమిషనర్, హెల్త్ ఆఫీసర్ విచా రించి, సమస్య తీవ్రతను గుర్తించి, మూడు నెలల్లో యార్డును తరలిస్తామని రాతపూర్వకంగా ఇచ్చింది వాస్తవమా, కాదా అని ప్రశ్నించారు. ఐదేళ్లు అయినా ఎందుకు తరలించలేదో...కనీసం ప్రయత్నం కూడా ఎం దుకు చేయలేదో కార్పొరేషన్ అధికారులు తిరుపతి ప్రజలకు సమాధానం చెప్పాలన్నా రు. బోరులోని నీటిని పబ్లిక్ హెల్త్ విభాగం పరీక్షించగా బ్యాక్టీరియా ఉందని, తాగడానికి పనికిరావని ల్యాబ్ అధికారులు నిర్థారించిం ది వాస్తవమా, కాదా? అన్నారు. ప్రభుత్వ వైద్యా«ధికారులు ఇచ్చిన నివేదిక కారణంగానే నాటి జిల్లా కలెక్టర్ తిరుపతి డివిజన్ పరిధిలోని ప్రజలకు దూరంగా 50 ఎకరాల స్థలాన్ని సేకరించి అక్కడికి యార్డును తరలించాలని మున్సిపల్, రెవెన్యూ అధికారులను అధికారిక ఉత్తర్వుల్లో ఆదేశించిన విషయాన్ని తిరుపతి ప్రజలకు తెలపకుండా ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. ‘ఆసుపత్రి, మాంస వ్యర్థాలు, కోళ్లు, కుక్కలు, జంతు కళేబరాలు, అనాథ శవాలతో కూడిన రోజుకు 178 టన్నుల చెత్తను మా గ్రామాల మధ్య వేస్తుంటే భరించమంటారా? మీరే న్యాయం చెప్పండంటూ తిరుపతి ప్రజలకు విన్నవించుకుంటున్నానన్నారు. ‘మా గ్రామాల్లో చెత్తవేయకండంటే తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మండిపడుతున్నారు. ఎక్కువ మాట్లాడితే గ్రామ ప్రజలను జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారు. ఇది న్యాయమా? తిరుపతి ప్రజలు ఆలోచించాలన్నారు. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం వీడి, రాజకీయ ఎత్తుగడలు, బెదిరింపులు మాని రెండు నియోజకవర్గల్లోని చెత్త సమస్యను సృష్టించాలనే ఆలోచనలు వీడాలన్నారు. ప్రజలకు, పల్లెలకు దూరంగా డంపింగ్ యార్డుని ఏర్పాటు చేయాలని, తిరుపతి ప్రజలు పెద్ద మనస్సుతో సమస్యను అర్థం చేసుకోవాలని చెవిరెడ్డి కోరారు. -
డంపింగ్ యార్డు వద్దంటూ రాస్తారోకో
రామచంద్రాపురం: రామచంద్రాపురం మండలం సి.రామాపురం గ్రామంలో డంపింగ్ యార్డ్ వద్దంటూ గ్రామస్థులు రాస్తారాకో నిర్వహించారు. వీరికి చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్దతు పలికారు. రోడ్డుపై వేసిన చెత్తను గ్రామస్థులు, ఎమ్మెల్యే చెవిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. డంపింగ్ యార్డ్ ఇక్కడి నుంచి తరలించే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. అనంతరం పలువురు గ్రామస్థులు మాట్లాడుతూ తిరుపతి చెత్త మాకొద్దని, మా గ్రామానికి చెత్త తీసుకొస్తె సహించేది లేదని స్పష్టం చేశారు. -
రగులుతున్న రామాపురం
► డంపింగ్ యార్డు తొలగింపు కోరుతూ ఆందోళన ► కంపోస్టు వాహనాలు రాకూడదంటూ బైఠాయింపు ► గ్రామస్తులకు ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి మద్దతు ► రంగంలోకి దిగిన పోలీసులు, వెనక్కి తగ్గేది లేదంటున్న గ్రామస్తులు రామచంద్రాపురం మండలం రామాపురం డంపింగ్ యార్డు సమస్యతో రగిలిపోతోంది. పక్కనే ఉన్న తిరుపతి నగరపాలక సంస్థ డంపింగ్ యార్డును వెంటనే ఎత్తేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రెండు రోజులుగా తిరుపతి కార్పొరేషన్ వాహనాలు రాకుండా అడ్డుకుంటున్నారు. కుప్పలు కుప్పలుగా పెరిగిన కంపోస్టు కారణంగా జనం రోగాల బారిన పడి ఊరి మనుగడే ప్రశ్నార్థకమైందని గ్రామస్తులు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం గ్రామాన్ని సందర్శించిన ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, నారాయణస్వామి గ్రామస్తులకు మద్దతు పలికి డంపింగ్ యార్డును ఎత్తేయాలని డిమాండ్ చేశారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుపతికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాపురం పక్కనే తిరుపతి నగరపాలక సంస్థ డంపింగ్ యార్డు ఉంది. నగరంలోని చెత్తాచెదారం, ఇతరత్రా వ్యర్థపదార్థాలను లారీల్లో తెచ్చి ఇక్కడే అన్లోడ్ చేస్తుంటారు. ఇది 12 ఏళ్లుగా జరుగుతోంది. తిరుపతి నుంచి కంపోస్టు లోడ్తో వెళ్లే మున్సిపల్ వాహనాలన్నీ రామాపురం మీదగానే యార్డుకు వెళతాయి. తమ గ్రామం పక్కనున్న డంపింగ్యార్డును ఎత్తేసి మరో చోట పెట్టుకోవాలని గ్రామస్తులు రెండేళ్లుగా అడుగుతున్నారు. డంపింగ్యార్డు వల్ల గ్రామస్తులు త్వరగా రోగాల బారిన పడుతున్నారనీ, తరచూ జ్వరాలు, విరేచనాలు అవుతున్నాయనీ, ఎంతో మందికి డెంగీ జ్వరాలు కూడా వచ్చాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు గ్రామంలోని భూగర్భ జలాలను పరీక్షించిన క్లినికల్ లేబొరేటరీ సిబ్బంది కలుషితమైన నీటిపై నివేదిక ఇచ్చారు. భూగర్భ జలాలు తాగితే ప్రమాదమని హెచ్చరించారు కూడా. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన గ్రామస్తులు ఇటీవల మరోసారి అధికారులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధం డంపింగ్ యార్డు దగ్గర 6 మెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల వేస్ట్ ఎనర్జీ ప్లాంటును నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం గతంలో శంకుస్థాపనలు కూడా జరిగాయి. మరో వారంలో పనులు మొదలు కావాల్సి ఉంది. ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే రోజుకు 600 టన్నుల కంపోస్టును తీసుకుని విద్యుదుత్పత్తి చేస్తారు. అయితే ప్లాంట్ నిర్మాణం జరిగితే భవిష్యత్తులో ఎప్పుడూ డంపింగ్ యార్డును తొలగించబోరని గ్రామస్తులు గుర్తించారు. దీంతో రెండు రోజుల నుంచి ఆందోళనకు సిద్ధమయ్యారు. బుధ, గురువారాల్లో కంపోస్టు వాహనాలను అడ్డుకుని రోడ్లమీదనే పోయించారు. గ్రామానికి చెందిన 20 మందికి పైగా మహిళలు నిరసన వ్యక్తం చేస్తూ రోడ్లు మీదనే బైఠాయిస్తున్నారు. ఏం సమాధానం చెప్పాలో తెలియక తహసీల్దార్ భాగ్యలక్ష్మి సతమతమవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డంపింగ్ యార్డును తొలగించి మరో చోట పెట్టుకోవాలన్నదే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి వాదన. ఇందుకోసం ఎందాకైనా వెళతానని ఆయన స్పష్టం చేస్తున్నారు. డంపింగ్ యార్డు ఎత్తేయాల్సిందే మున్సిపల్ డంపింగ్ యార్డును తక్షణమే అక్కడి నుంచి తొలగించి, ప్రత్యామ్నాయ స్థలాన్ని ఎంపిక చేసుకోవా లని ఎంపీ విజయసాయిరెడ్డి అధికారులకు సూచించా రు. డంపింగ్ యార్డు కారణంగా రామాపురంవాసుల ఆరోగ్యం దెబ్బతింటోందనీ, భూగర్భ జలాలు మొత్తం కలుషితమై జనం రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. డంపింగ్ యార్డును వెంటనే అక్కడి నుంచి తొలగించాలని ఎంపీ డిమాండ్ చేశారు. గురువారం మధ్యాహ్నం ఎమ్మెల్యే చెవిరెడ్డితో పాటు ఆయన రామాపురం వెళ్లి గ్రామస్తులతో మాట్లాడారు. డంపింగ్ యార్డు వల్ల గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే చెవిరెడ్డి ఎంపీకి వివరించారు. కంపోస్టు యార్డు వల్ల 15 ఏళ్లుగా పడుతున్న ఇక్కట్లను, దెబ్బతింటున్న ఆరోగ్యాన్ని మహిళలు కూడా విశదీకరించారు. దీనిపై మున్సిపల్ అధికారులతో మాట్లాడతానని విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు. డీఎస్పీ నంజుండప్పతోనూ, తహసీల్దార్ భాగ్యలక్ష్మితోనూ ఎంపీ మాట్లాడారు. ఆయన వెంట ఎమ్మెల్యే నారాయణస్వామి, వైఎస్సార్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు చొక్కారెడ్డి జగదీశ్వర్రెడ్డి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి విడుదల మాధవరెడ్డి ఉన్నారు. ప్రజలను ఇబ్బందిపెట్టే ప్రసక్తే లేదు... ఎప్పుడో పన్నెండేళ్ల కిందట ప్రభుత్వం దుర్గసముద్రం, రామాపురం గ్రామాల మధ్య 25 ఎకరాల స్థలాన్ని కార్పొరేషన్కు అప్పగించింది. అప్పట్లో డంపింగ్ యార్డును అక్కడే ఖరారు చేశారు. అప్పటి నుంచీ కంపోస్టును అక్కడే డంప్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో గ్రామస్తులకు ఇబ్బందికరమైతే ప్రత్యామ్నాయంగా యార్డు చుట్టూ స్ట్రెంచ్ తీయడం, లేదా పవర్ జనరేషన్ కోసం వినియోగించడం జరగాలి. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పూర్తయితే చెత్తాచెదారం నిల్వ ఉండే ప్రసక్తి లేదు. ఇందుకోసం మరోసారి గ్రామస్తులు, రాజకీయ నాయకులతో చర్చించాల్సి ఉంది. – హరికిరణ్, కమిషనర్, తిరుపతి కార్పొరేషన్ -
కరీంనగర్ టు హైదరాబాద్...!
- కొత్తపల్లి వాగు నుంచి ఇసుక రవాణా - సీసీ కెమెరాలు లేకుండా తవ్వకాలు - యథేచ్ఛగా యంత్రాల వినియోగం - టీఎస్ఎండీసీ ముసుగులో అక్రమ దందా - రోజుకు 500లకు పైగా లారీల్లో రవాణా - ఓవర్లోడ్ను పట్టించుకోని అధికారులు సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట– కొత్తపల్లి శివారు వాగు నుంచి ఇసుక అక్రమమార్గం పడుతోంది. తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) నిబంధనలకు వక్రభాష్యం చెబుతూ డంపింగ్ యార్డులు లేకుండా ఏకంగా కొత్తపల్లి వాగులోనే యంత్రాలు పెట్టి ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఇసుక తవ్వకాలు జరుపుతున్న ప్రదేశం సీసీ కెమెరాల నిఘాలో ఉండాల్సి ఉండగా, ఆ నిబంధనలను పట్టించుకోవడం లేదు. టీఎస్ఎండీసీ, కాంట్రాక్టర్లు కుమ్ముక్కై లారీల్లో పరిమితులను మించి ఇసుక నింపుతూ అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక తవ్వకాలు జరపాల్సి ఉండగా.. పొద్దంతా కొత్తపల్లి సమీపంలోని రామంచకు తరలించి అక్కడి నుంచి అర్ధరాత్రి వరకు కూడా రవాణా సాగిస్తున్నారు. ఇలా రోజుకు 400 నుంచి 500 లారీల్లో కరీంనగర్ నుంచి హైదరాబాద్, సిద్దిపేట, కరీంనగర్లకు ఇసుక అక్రమమార్గం పడుతోంది. ప్రభుత్వ ఖజానాకు రూ.లక్షల్లో గండి.... కరీంనగర్ జిల్లా కొత్తపల్లి శివారు మానేరువాగు నుంచి ఏప్రిల్ 11 నుంచి ఇసుక తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇసుక రీచ్ను రేణికుంట బ్రిడ్జికి 500 మీటర్ల దూరంలో తవ్వాలి. వాగులో ఉన్న మొత్తం ఇసుకలో కేవలం 30 శాతం మాత్రమే తొలగించాలి. ఇసుక తవ్వకాలు, రవాణా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యనే సీసీ కెమెరాల నిఘాలో చేయాలి. ఇసుక తవ్వకాల సమయంలో సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి కాగా, రాత్రిపూట ఇసుక రవాణా నేరం. ప్రతీ ఆదివారం ఇసుకు రీచ్కు సెలవు. అయితే, టీఎస్ఎండీసీ, కాంట్రాక్టర్లు ఇవేమీ పట్టించుకోవడం లేదు. ఇసుక తవ్వకాలు, రవాణాను నిరంతరం పర్యవేక్షించాల్సిన రెవెన్యూ, భూగర్భ జలవనరుల శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఎడాపెడా ఇష్టారాజ్యంగా వాగులో తవ్వకాలు జరుపుతుండటంతో సమీప గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే ఇన్టెక్వెల్ పైపులైను బయటపడగా, భూగర్భజలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదంతా జరుగుతున్నా టీఎస్ఎండీసీ, ఇతర శాఖలు ప్రేక్షకపాత్ర వహిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా ఇసుక రవాణా.. కొత్తపల్లి క్వారీ నుంచి తీసే ఇసుక క్యూబిక్ మీటర్కు రూ.550లుగా ప్రభు త్వం ధర నిర్ణయించింది. ఈ మేరకు ‘మీ సేవ’కేంద్రాల్లో అవసరమున్న మేరకు డబ్బులు చెల్లించిన వారికి కొత్తపల్లి వాగు నుంచి కాంట్రాక్టర్లు ఇసుక సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం వాగు సమీపంలో ఇసుక నిల్వచేసేందుకు డంపింగ్ యార్డు కోసం ప్రభుత్వం స్థలం కేటాయించింది. ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డుకు ఇసుకను చేర్చి అక్కడ జేసీబీ యంత్రాలతో లారీలలో నింపాల్సి ఉంది. ఇదేమీ పట్టిం చుకోని టీఎస్ఎండీసీ, కాంట్రాక్టర్లు ఏకం గా వాగులోనే యంత్రాలు పెట్టి లారీలు నింపుతున్నారు. ఇదిలా వుండగా నిబంధ నల ప్రకారం 10 టైర్ల లారీలో 10.5 క్యూబి క్ మీటర్ల (15.75 టన్నులు) ఇసుక నింపాలి. అలాగే 12 టైర్ల లారీలో 13.5 (18.75 టన్నులు) క్యూబిక్ మీటర్లు, 14 టైర్ల లారీలో 17 క్యూబిక్ మీటర్లు (25.5 టన్ను లు)నింపాల్సి ఉంది. కానీ కాంట్రాక్టర్లు, టీఎస్ఎండీసీ అధికారులు, లారీల యజ మానులు కుమ్ముక్కై ఒక్కో లారీలో ఒకటి నుంచి రెండున్నర క్యూబిక్ మీటర్ల వరకు అధికంగా నింపుతూ రోజుకు లక్షలాది రూపాయల అక్రమార్జకు పాల్పడుతున్నా రు. ఓవర్లోడ్తో వాగు నుంచే వెళ్లే లారీల ను నియంత్రించాల్సిన రవాణా, పోలీసుశా ఖల అధికారులు చోద్యం చూస్తుండగా, రోజుకు రూ.లక్షల్లో ప్రభుత్వాదాయానికి గండి పడుతోంది. -
డప్పుల్లో తరలిస్తున్న గంజాయి స్వాధీనం
గిద్దలూరు : డప్పుల్లో పెట్టి రైలులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గిద్దలూరు రైల్వే పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. మూడు డప్పుల్లో గంజాయిని కుక్కి రైలులోని సీటు కింద ఉంచి రవాణా చేస్తుండగా సమాచారం అందుకున్న స్థానిక ఆర్పీఎఫ్ ఏఎస్సై నాగభూషణం తన సిబ్బందితో కలిసి దాడులు చేశారు. మూడు డప్పుల్లో ఉన్న సుమారు 10 కిలోల గంజాయిని పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు గంజాయి తరలించేందుకు కొత్త పంధాను ఎన్నుకున్నారు. గతంలో కార్లు, లారీలు, బస్సుల్లో స్టెప్నీ టైర్లలో గంజాయి ఉంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. అలా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకుంటుండటంతో స్మగ్లర్లు సరికొత్త విధానంలో డప్పుల్లో గంజాయి ఉంచి రైలులో తరలిస్తున్నారు. అనుమానాస్పదంగా సీట్ల కింద ఉన్న డప్పులను గమనించిన ప్రయాణికులు.. ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం అందించడంతో ఈ గుట్టురట్టయింది. ఆ డప్పులు ఎవరివని పోలీసులు ప్రశ్నించినా.. అందరూ తమవి కావని చెప్పడంతో వాటిని స్వాధీనం చేసుకుని ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. వాటిలో నాసిరకం గంజాయి ఉందని, ఇది కిలో రూ.వెయ్యి కంటే ఎక్కువ ధర పలకదని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. -
మావోల డంప్ స్వాధీనం
ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లా టేకపానీ దండకారణ్యంలో భారీ డంప్ బయటపడింది. ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు మావోయిస్టుల భారీ డంప్ను గుర్తించారు. మావోలు వినియోగించే సామాగ్రితో పాటు లోడ్ చేసిన పది తుపాకులు, వైర్లు, ఐఈడీలు, ఫ్యూజ్లు, మ్యాగ్జైన్లు స్వాధీనం చేసుకున్నారు. -
ఎవరిదీ పాపం
- రసాయనిక వ్యర్థాల ఫలితం ... బాలికకు శాపం - వేలల్లో వైద్య ఖర్చులు ... ముందుకు రాని యాజమాన్యాలు - అభం,శుభం తెలియని చిన్నారి నరకయాతన కాళ్లు కాలుస్తున్న కెమికల్ వ్యర్థాలు బీచ్ రోడ్డుపై యథేచ్ఛగా డంపింగ్ అనారోగ్యాల బారిన ప్రజలు చోద్యం చూస్తున్న అధికారులు ఎవరో చేసిన నిర్లక్ష్య వ్యవహారానికి పన్నెండేళ్ల బాలిక నరక యాతన అనుభవిస్తోంది. పారిశ్రామిక వ్యర్థాలను తిరుగాడే ప్రదేశాల్లో పారబోయడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ బీచ్ రోడ్డులో సూర్యారావు పేట సమీపంలో ఉండే రెండు రసాయనిక పరిశ్రమలు తమ వ్యర్థాలను ఆరుబయటే పారేస్తుండడం ఎప్పటినుంచో జరుగుతోంది. ఈ నెల 8వ తేదీన తన స్నేహితులతో అటుగా వెళ్లిన ఈ బాలిక రెండు కాళ్లు కాలిపోయాయి. ఏదో చిన్నదేలా అనుకునే సమయంలోనే మోకాలి వరకు బొబ్బలెక్కడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఇప్పటి వరకు సంబంధిత యాజమాన్యం బాధ్యత తీసుకోలేదు. వైద్య ఖర్చుల కోసం వేల రూపాయలవుతోందని...పేద కుటుంబం ... ఎలా ముందుకు సాగేదని వాపోతోంది ఆ బాలిక తల్లిదండ్రులు. సూర్యారావుపేట (కాకినాడ రూరల్) : పారిశ్రామిక, ఆయిల్ రిఫైనరీల వ్యర్థాలను నిర్వాహకులు బీచ్ రోడ్డులో డంపింగ్ చేయడంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఒక పక్క పరిశ్రమల నుంచి విడుదలవుతున్న కాలుష్యంతో తీరప్రాంత గ్రామాల ప్రజలు కాలుష్య కోరల్లో చిక్కుకుపోతుంటే మరో పక్క కెమికల్ వ్యర్థాలను బీచ్రోడ్డు, ఖాళీగా ఉన్న నివాస స్థలాల వద్ద పారవేయడంతో రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించని కంపెనీలపై చర్యలు తీసుకోవాల్సిన పొల్యూషన్ అధికారులు చోద్యం చూస్తున్నారు. డంపింగ్ యార్డుగా బీచ్రోడ్డు.. కాకినాడ రూరల్ మండల పరిధిలోని తీరప్రాంత గ్రామం సూర్యారావుపేటలో సుమారు 5,600 మంది జనాభా నివసిస్తున్నారు. ఇక్కడ నివసించేవారందరూ మత్స్యకారులు. పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం తీరప్రాంతానికి ఆనుకుని సూర్యారావుపేట, వాకలపూడి, పెనుమర్తి పంచాయతీల పరిధిలో తీరానికి ఆనుకుని సుమారు 18 ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీలు, క్రూడ్ ఆయిల్ మరిగిస్తున్న ఫ్యాక్టరీ, చక్కెర తయారు చేస్తున్న ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇందులో ఆయిల్ రిఫైనరీ, క్రూడాయిల్ మరిగించడానికి, ఘగర్ తయారు చేసిన తర్వాత వచ్చిన కెమికల్ వ్యర్థాలను ఫ్యాక్టరీలు నిబంధనల మేరకు నిల్వ చేయకుండా, నేరుగా కెమికల్ వ్యర్థాలను ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి బీచ్రోడ్డులో ఆరుబయట పారబోయిస్తున్నారు. ముఖ్యంగా బీచ్లో ఖాళీగా ఉన్న ప్రదేశాలు పోలవరం, నేమాం, సూర్యారావుపేట, శివాలయం, సూర్యారావుపేట లైట్ హౌస్ సమీపాన రాత్రి, తెల్లవారుజామున స్థానికుల సంచారం లేని సమయాల్లో వ్యర్థాలను తీసుకువచ్చి పారబోస్తున్నారు. దీంతో బీచ్రోడ్డులో రాకపోకలు సాగించే సమయంలో వ్యర్థాల నుంచి వస్తున్న ధూళి, దుర్వాసనకు అనారోగ్యాల బారిన పడుతున్నారు. రోడ్డుకు అడ్డంగా వేస్తున్న వ్యర్థాలపై మోటార్బైక్లపై వెళ్తున్న ప్రజలు జారిపోయి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘగర్ వ్యర్థాలతో ప్రమాదాలు.. ఘగర్ వ్యర్థాలతో వాహనచోదకులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ఘగర్ నుంచి వచ్చిన వ్యర్థ ఊటను నిర్వాహకులు ట్యాంకర్లతో తీసుకొచ్చి బీచ్రోడ్డు, నేమాం, పోలవరం రహదారులపై పారబోస్తున్నారు. నాలుగు రోజుల క్రితం పోలవరం, నేమాంలకు చెందిన ప్రయాణీకులు బైక్పై నుంచి జారి పడిన ఘటనలో ముగ్గురు గాయాలబారిన పడ్డారు. పి.రమేష్,పోలవరం. కాళ్లు కాలిపోతున్నాయి. పరిశ్రమల నుంచి వచ్చే కెమికల్ వ్యర్థాలను ప్యాక్టరీలో నిల్వ చేయకుండా, ట్యాంకర్లతో బయటకు తీసుకొచ్చి బీచ్రోడ్డు, ఖాళీస్థలాల్లో పారబోస్తున్నారు. కంపెనీ నిర్వాహకులు స్థానికుల కంట పడకుండా తెల్లవారుజాము సమయంలో కెమికల్ వ్యర్థాలను ట్యాంకర్లతో తీసుకొచ్చి లైట్హౌస్ సమీపాన ఖాళీ స్థలంలో వేస్తున్నారు. బూడిద, మట్టి రంగులో ఉంటున్న రసాయన వ్యర్థాల్లో పొరపాటున నడిస్తే కాళ్లు కాలిపోయి, చర్మం అంతా ఎలర్జీ వస్తోంది. ఎస్.సత్తిబాబు, తమ్మవరం. నా కుమార్తె రెండు కాళ్లు కాలిపోయాయి నాకుమార్తె మరియ స్నేహితులతో కలసి బయటకు వెళుతున్న సమయంలో బూడిద రంగులో ఉన్న మట్టిలో నడవడంతో రెండు కాళ్లూ తీవ్రంగా కాలిపోయాయి. చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా రూ.30 వేలు వ్యయమవుతాయని వైద్యులు తెలిపారు. కెమికల్ వ్యర్థాలు ఇక్కడ వేయకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. మర్రి శ్రీను, బాధితురాలి తండ్రి, సూర్యారావుపేట. ఘగర్ వ్యర్థాలతో ప్రమాదాలకు గురవుతున్నాం ఘగర్ కంపెనీ నిర్వాహకులు ఘగర్ కోసం వినియోగించిన వ్యర్థాలను తీసుకొచ్చి నేమాం–పోలవరం రోడ్డు వేసేస్తున్నారు. ఘగర్ నుంచి వచ్చిన నూనెలా ఉన్న మడ్డును తీసుకొచ్చి రోడ్డుపై పారబోయడం వల్ల తెల్లవారుజామున బైక్లపై వెళ్తున్నవారు జారిపోయి కిందపడడం వల్ల నలుగురు వాహనచోదకులు గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ విషయమై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. ఎం.రమణ, తమ్మవరం. విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటా కెమికల్ వ్యర్థాలను బీచ్రోడ్డులో పారబోయడంపై విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటా. పారిశ్రామిక వ్యర్థాలను ఆరు బయట వేయరాదు. ప్రజల అనారోగ్యాలకు కారణమవుతున్న నిర్వాహకులకు నోటీసులు జారీ చేస్తాం. రవీంద్రబాబు, ఈఈ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, రమణయ్యపేట. -
‘ఆమె ఫొటోలు కూడా తీసేస్తే అప్పుడు చర్చలు’
చెన్నై: విలీనం చేసే చర్చలకు ముందు పన్నీర్ సెల్వం వర్గం రోజుకో కొత్త డిమాండ్ను తెరమీదకు తెస్తోంది. ఇప్పటి వరకు మొత్తం శశికళ కుటుంబాన్ని పార్టీకి దూరంగా పెట్టాల్సిందేనని డిమాండ్ చేసిన ఆయన వర్గం తాజాగా శశికళ ఫొటోలు కూడా ఉండటానికి వీల్లేదని శాసించింది. ముందు ఆ పని చేస్తేనే చర్చలకు ముందడుగేస్తామంటూ పన్నీర్సెల్వం వర్గంలోని కీలక నేత ఈ మధుసూదనన్ డిమాండ్ చేశారు. ‘శశికళ ఛాయా చిత్రాలన్నింటిని బయటపడేయండి. పార్టీ కార్యాలయ పవిత్రతను కాపాడండి’ అంటూ ఆయన పిలుపునిచ్చారు. చెన్నైలోని రాయపీఠ్లో త్వరలో పన్నీర్ వర్గం, పళనీస్వామి వర్గం ఏకమయ్యే అంశానికి సంబంధించి చర్చలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికీ పార్టీకి సంబంధించిన ప్రధాని కార్యాలయంతోపాటు ఇతర చిన్న చిన్న కార్యాలయాల్లో కూడా శశికళ ఫొటోలు డామినేట్ చేస్తున్నాయంట. ఈ నేపథ్యంలో వాటన్నింటిని తీసిపారేయండి అంటూ తాజాగా డిమాండ్ తెరపైకి తెచ్చారు. -
డంపింగ్ యార్డ్లో అగ్నిప్రమాదం
మేడ్చల్: జిల్లాలోని జవహర్ నగర్ డంపింగ్ యార్డులో బుధవారం మధ్యాహ్నం మంటలు చెలరేగడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి యత్నిస్తున్నారు. -
కిరాతకంగా చంపేసి.. బాడీని ముక్కలు చేసి..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి రెండు చోట్ల పడేశారు. శుక్రవారం ఉత్తర ఢిల్లీలోని తిమర్పూర్ ప్రాంతంలో ఓ ఆటో డ్రైవర్ మృతుడి శరీర భాగాలను గుర్తించాడు. హంతకులు మృతుడి తల, చేతులు, కాళ్లు నరికి బెడ్ షీట్లో చుట్టి పడేశారు. అతను పోలీసులకు సమాచారం అందించడంతో ఫోరెన్సిక్ బృందాన్ని అక్కడికి పంపి వాటిని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి ఇతర శరీర భాగాల కోసం పోలీసులు చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలించగా.. నిన్న మధ్యాహ్నం మంజు కర తిలాలోని సంజయ్ అఖాడ సమీపంలో మృతుడి మొండెం భాగాన్ని కనుగొన్నారు. మృతుడి వివరాలు తెలియరాలేదని పోలీసులు చెప్పారు. రెండు రోజుల క్రితం హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి శరీరంపై దుస్తులు ఉన్నాయని, తల వెనుక భాగంలో గాయాలున్నాయని, ముఖం ఛిద్రం కాలేదని చెప్పారు. హంతకులు వేరే చోట హత్య చేసి, మృతుడి ఆనవాళ్లు తెలియకుండా ఉండంటం కోసం శరీర భాగాలను ముక్కలు చేసి ఇక్కడి పడేశారని అనుమానిస్తున్నారు. -
డంపింగ్ యార్డుల నిర్మాణానికి స్థల సేకరణ
ఒంగోలు రూరల్: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్వచ్చ భారత్లో భాగంగా గ్రామాల్లో సాలీడ్ వెల్త్ ప్రోసెసింగ్ సెంటర్లను నిర్మించేందుకు మండల స్థాయి అధికారుల నియామకం జరిగింది. గ్రామ పంచాయతీల్లో సాలీడ్ వేస్టు మేనేజ్మెంట్ విధానం ద్వారా పారిశుధ్యం, ఆరోగ్య భద్రత కల్పించేందుకు ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డుల నిర్మాణానికి మండల స్థాయి అధికారులను నియమించారు. మండలంలోని ఎంపీడీఓ, ఈఓఆర్డి, డ్వామా ఏపీఓ, ఏపీఎం డీఆర్డీఏ, ఏఈఈపిఆర్, ఏఈఈఆర్డబ్ల్యూఎస్ నియామకం జరిగింది. జిల్లాలోని అన్ని మండలాల్లో మండల స్థాయి అధికారులు వారికి కేటాయించబడిన దత్తత గ్రామాల్లో డంపింగ్ యార్డుల నిర్మాణానికి కృషిచేయాలనీ ఆదేశించారు. దీనికోసం వెంటనే తగు చర్యలు తీసుకోవాలనీ ఆదేశించారు. గ్రామ పంచాయితీలో సాలీడ్వెల్త్ ప్రొసెసింగ్ నిర్మాణం కొరకు కావలసిన స్థల సేకరణ గుర్తించి స్థానిక పంచాయితీ కార్యదర్శి, సర్పంచ్ సహకారంతో మండల తహసీల్దార్ ద్వారా 31.03.2017లోగా స్థల సేకరణ పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. ఒంగోలు మండలంలో ఎంపీడీఓ ఎం.వెంకటేశ్వరావు ఉలిచి గ్రామాన్ని, ఈఓఆర్డి పిఆర్ బాలచెన్నయ్య వలేటివారిపాలెం, ఏపీఓ కె.నాగరాజు యరజర్ల, ఏపీఎం ఐకెపి కె.విజయకుమారి సర్వేరెడ్డిపాలెం, ఏఈఈపిఆర్ ఎంవి శివప్రసాదరావు చేజర్ల, ఏఈఈ ఆర్డ్బ్ల్యూఎస్ సతీష్చంద్ర దేవరంపాడు దళితవాడ నియామకం జరిపారు. వీరు ఈ నెల 31లోగా డంపింగ్ యార్డు స్థల సేకరణ పూర్తి చేసి జిల్లా కలెక్టర్ పంచాయితీ రాజ్ విభాగానికి సమాచారం అందజేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. -
ముం'చెత్త'తోంది
⇒ ఇంట్లో చెత్త బయట పడేస్తున్నాం.. ఇల్లు శుభ్రమైందని చేతులు దులిపేసుకుంటున్నాం.. ⇒ ట్రక్కుల కొద్దీ చెత్తను ఊరి శివార్లలో పడేస్తున్న అధికారులూ.. ఓ పనైపోయిందని అంటున్నారు.. ⇒ అంతా బాగానే ఉంది.. కానీ పీల్చే గాలి.. తాగే నీరు.. తినే తిండి.. అన్నీ ఇప్పుడు కాలుష్య కాసారాలే.. ⇒ డెంగీ, చికున్ గున్యా ప్రాణాలు తీస్తూనే ఉన్నాయి.. అసలు ఎక్కడుంది సమస్య? పరిష్కారం ఏమిటి? సాక్షి నాలెడ్జ్ సెంటర్ : నిజం ఏమిటంటే.. దేశంలో ఎంత చెత్త ఉత్పత్తి అవుతోందో ప్రభుత్వానికీ స్పష్టంగా తెలియదు. తెలిసిందల్లా.. ఒక్కో మనిషి రోజుకు కనిష్టంగా 300 గ్రాములు.. గరిష్టంగా 600 గ్రాములు చెత్త ఉత్పత్తి చేస్తాడని.. దీన్ని జనాభా సంఖ్యతో హెచ్చవేసి.. ఫలానా నగరంలో రోజుకు ఇంత చెత్త ఏర్పడుతోందన్న అంచనాలే! 2012 నాటి కస్తూరి రంగన్ నివేదిక ప్రకారం దేశంలో ఏటా 5.2 కోట్ల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతున్నట్లు అంచనా. అంటే.. ప్రతి రోజూ దాదాపు 1.5 లక్షల టన్నుల చెత్తన్నమాట. దక్షిణాదిని మాత్రమే తీసుకుంటే రోజుకు 36,400 టన్నులు. ప్రభుత్వ యంత్రాంగం ఇందులో మూడో వంతును మాత్రమే డంపింగ్ యార్డ్లకు చేరుస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంకో ముప్ఫై ఏళ్లలో చెత్త పారబోసేందుకే దాదాపు నాలుగు లక్షల ఎకరాల స్థలం కావాలి! ఇది ముంబై, చెన్నై, హైదరాబాద్ మూడింటినీ కలిపితే వచ్చేంత భూ భాగం! అంతా కలగాపులగం.. రెండేళ్ల క్రితం ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ) ఈ ‘చెత్త’సమస్యపై ఒక అధ్యయనం చేసింది. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో చెత్త సేకరణ ఎలా జరుగుతోంది? నిర్వహణ ఎలా ఉంది? అన్న అంశాలపై జరిగిన ఈ అధ్యయనంలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. నాట్ ఇన్ మై బ్యాక్యార్డ్ పేరుతో విడుదలైన పుస్తకంలో భారతదేశంలోని నగరాల్లో చెత్త సమస్యను సవివరంగా ప్రస్తావించింది. వంటింటి వ్యర్థాలు, ప్లాస్టిక్, లోహపు వస్తువులు, కాగితం, రబ్బర్ వంటి వాటన్నింటినీ కలగలిపి పారబోస్తూండటం.. చెత్తను సమర్థంగా నిర్వహించడంలో ఎదురవుతున్న అతిపెద్ద సమస్య. కాలుష్యాన్ని తగ్గించేందుకు అనుసరించాల్సిన 3ఆర్ సూత్రాల (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్)ను పాటించకపోవడం కూడా సమస్య తీవ్ర రూపం దాల్చేందుకు ఇంకో కారణం. అంతేకాక చెత్తనంతా ఒకేదగ్గరకు చేర్చి భారీ యంత్రాలు, టెక్నాలజీల సాయంతో సమస్యను అధిగమించాలన్న ఆలోచన కూడా సరికాదని అంటున్నారు సీఎస్ఈ డైరెక్టర్ సునీతా నారాయణ్. వెలుగు దివ్వెలు ఇవిగో.. చెత్త సమస్యను అధిగమించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేరళలోని అలెప్పీ, గోవా రాజధాని పణజి, బెంగళూరు, మైసూరు, ఆంధ్రప్రదేశ్లోని బొబ్బిలి వంటివి ఆశాకిరణాలుగా కనిపిస్తున్నాయి. అలెప్పీ విషయాన్నే తీసుకుంటే.. ప్రతి ఇంట్లోనూ తడి, పొడి చెత్తలు వేర్వేరు చేయాల్సిందేనని.. లేదంటే ఇళ్ల నుంచి చెత్త సేకరించమని స్పష్టం చేసింది. ప్రజలు కొంత కాలం అసంతృప్తి వ్యక్తం చేసినా.. నెమ్మదిగా దీని ప్రాముఖ్యతను గుర్తించారు. ఫలితంగా ప్రస్తుతం అలెప్పీ స్వచ్ఛమైన పట్టణాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. సేకరించిన తడి చెత్తను వివిధ పద్ధతుల ద్వారా కుళ్లబెట్టి ఎరువుగా మార్చి రైతులకు తక్కువ ధరకు అమ్ముతున్నారు. పొడిచెత్తను కూడా ఇదే రకంగా నిర్దిష్ట కేంద్రాల్లో వర్గీకరించి.. ఏవిధంగానూ రీసైకిల్ చేయలేమనుకున్న చెత్తను మాత్రమే డంపింగ్ యార్డ్కు పంపుతున్నారు. పణజి, మైసూరుల్లోనూ ఇదే పరిస్థితి. బెంగళూరులో మాత్రం ‘హసిరుదళ’అనే స్వచ్ఛంద సంస్థ నగరంలో చెత్త ఏరుకునే వారిని ఒక ఛత్రం కిందకు తీసుకువచ్చింది. చెత్త సేకరణ వర్గీకరణల ద్వారా వారు నెలకు దాదాపు రూ.15 వేల వరకూ ఆర్జించేందుకు అవకాశం కల్పించింది. ప్రభుత్వ అధికారులతో మాట్లాడి గుర్తింపు కార్డులు లభించేలా చేయడంతో పోలీసుల వేధింపులు తగ్గి వారు గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు అవకాశం లభించిందని అంటున్నారు హసిరుదళ డైరెక్టర్ నళినీ శేఖర్. అక్కడకక్కడా చెదురుమదురుగా జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలు దేశవ్యాప్తంగా ప్రతిచోటా ఆచరణలోకి వచ్చినప్పుడే చెత్త సమస్యను అధిగమించవచ్చు. ఇందుకు కావాల్సింది మన ఆలోచనల్లో కొంచెం మార్పు.. రాజకీయ నాయకులు, అధికారుల చిత్తశుద్ధి మాత్రమే. -
విజయవాడలో డంపింగ్ యార్డు లొల్లి
-
పోలవరంపై విచారణ చేపట్టిన ఎన్జీటీ
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ విచారణ చేపట్టింది. ప్రాజెక్టు పరిధిలోని ముంపు గ్రామాల్లో డంపింగ్పై తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు సెంట్రల్ పొల్యూషన్ బోర్డు, పర్యావరణశాఖలకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21వ తేదీలోగా నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. -
గుండెల్ని పిండేసే అమానుషం
ముంబై: ఒకవైపు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల స్త్రీ పురుష నిష్పత్తి గణాంకాలు అందోళన పుట్టిస్తున్నాయి. మరోవైపు సమాజంలో అంతకంతకూ తీవ్రమవుతున్న భ్రూణ హత్యలు ఆడబిడ్డ ఉనికినే ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి.ఇలాంటి తరుణంలో మహారాష్ట్రలో అత్యంత అమానవీయైన ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ మహారాష్ట్ర సాంగ్లి జిల్లాలోని ఒక గ్రామంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 19 భ్రూణహత్యల దారుణ ఘటన కలకలం రేపింది.. గుండెలను పిండివేసే ఈ ఘటన ఆదివారం పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఫిబ్రవరి 28 న ఓ 26 ఏళ్ల గర్భిణీ మృతిపై అనుమానం వచ్చిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసలు ఈ రాకెట్ ను ఛేదించారు. పోలీస్ సూపరింటెండెంట్ దత్రాత్రేయ షిండే అందించిన వివరాల ప్రకారం హోమియోపతిలో డిగ్రీ పొందిన బాధిత మహిళకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మూడవసారి కూడా కడుపులో ఉన్నది ఆడపిల్లే అని తెలిసిన ఆమె భర్త ప్రవీణ్ జామ్దాదే ఆమెకు డాక్టర్ డా. బాబాసాహెబ్ ప్రైవేట్ ఆసుపత్రిలో గర్భస్రావం చేయించాడు. దీంతో పరిస్థితి వికటించి ఆమె చనిపోయింది. అయితే అబార్షన్ను తాను వ్యతిరేకించిననప్పటికీ భర్త ప్రవీణ్ ఈ దారుణానికి పాల్పడ్డాడని, తన కుమార్తె మరణానికి కారణమ య్యాడని మహిళ తండ్రి సునీల్ జాదవ్ ఆరోపించారు. అటు మహిళ మరణంపై గ్రామస్తులు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా గ్రామంలోని ఓ గుంతలో పూడ్చిపెట్టిన 19 ఆడ పిండాల అవశేషాలు బైటపడ్డాయి. ఈ భ్రూణ హత్యలను దాచి పెట్టే ఉద్దేశ్యంతో ఖననం చేసి ఉంటారని, ఇప్పటివరకూ 19 బాడీలను కనుగొన్నట్టు షిండే చెప్పారు. దీంతో ఆమె భర్తపైనా, వైద్యునిపైనా కేసులు నమోదు చేశమన్నారు. ఈ మొత్త వ్యవహారంపై విచారణ చేపట్టినట్టు తెలిపారు. -
ఇసుక డంప్ స్వాధీనం
- ఆరుగురిపై కేసు నమోదు కృష్ణగిరి: ఎస్హెచ్ఎర్రగుడి గ్రామ సమీపంలో అక్రమ ఇసుక డంప్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సోమ్లానాయక్ తెలిపారు. గ్రామానికి చెందిన హరిజన సుదర్శన్, శేఖర్, వెంకటేశ్వర్లు, లక్ష్మన్న, సుధాకర్, మద్దిలేటి .. గ్రామ సమీపంలోని హంద్రీ నది నుంచి ఇసుకను ట్రాక్టర్లతో అక్రమంగా తరలించి డంప్ చేసినట్లు జిల్లా మైనింగ్ ఏడీ వెంకటరెడ్డి గుర్తించారని, ఆయన ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
జాడలేని డంపింగ్ యార్డులు
► ఏర్పాటుకు చర్యలే తీసుకోని అధికారులు ► గ్రామాలలో తీవ్రమవుతున్న ‘చెత్త’ సమస్య ► రోడ్ల పక్కనే తగులబెడుతున్న వైనం ► రోగాలపాలవుతున్న స్థానికులు శంషాబాద్ రూరల్: గ్రామీణ ప్రాంతాలలో చెత్త సమస్య రోజురోజుకూ జఠిలంగా మారుతోంది..ఓ వైపు ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోతుండగా.. మరో వైపు సేకరించిన చెత్తను వేయడానికి స్థలం లేక ఇబ్బందులు తప్పడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్ల పక్కన పడవేసి కాల్చేస్తున్నారు. దీంతో అందులోని ప్లాస్టిక్ కారణంగా వాయు కాలుష్యం ఏర్పడి గ్రామీణులు రోగాల పాలవుతున్నారు. పెద్దషాపూర్, తొండుపల్లి, కాచారం, కవ్వగూడ, నర్కూడ, పెద్దగోల్కొండ, చిన్నగోల్కొండ, ఊట్పల్లి, పాల్మాకుల, మదన్ పల్లి, శంకరాపురం, హమీదుల్లానగర్, మల్కారం, నానాజీపూర్, రామంజాపూర్, ముచ్చింతల్, ఘాంసిమియాగూడ, గొల్లపల్లి, జూకల్, సుల్తాన్ పల్లి, పెద్దతూప్ర పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో చెత్త సమస్య తీవ్రంగా మారింది. ఆయా గ్రామాల్లో ప్లాస్టిక్ నివారణకు చర్యలు లేకపోవడంతో, ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా కాకుండా ఒకే రకంగా సేకరిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, రోడ్ల పక్కన పార బోస్తున్నారు. నర్కూడలోని చెత్తను సమీపంలోని చెరువులో వేస్తున్నారు. ఇక పెద్దషాపూర్లో చెత్తను జూకల్ వెళ్లే దారిలోని స్మశానవాటిక స్థలం లోనే వేసి కాల్చేస్తున్నారు. కాచారంలోని చెత్తను షాబాద్ రోడ్డు పక్కన ఉన్న వరద కాలు వలో వేస్తున్నారు. మిగిలిన గ్రామాల్లో సైతం పరిస్థితి ఇలా గే ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో చెత్త నుంచి వెలువడే దుర్గంధంతో అవస్థలు తప్పడం లేదు. చెత్తను కాల్చివేసే సమయంలో అందులోని ప్లాస్టిక్ నుంచి వెదజల్లే కాలుష్యంతో శ్వాస సంబంధిత రోగాల బారిన పడుతున్నా మని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కాగితాల మీదనే ప్రతిపాదనలు.. అన్ని గ్రామాల్లో చెత్త డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు. ఇందుకోసం అనువైన స్థలాలను ఎంపిక చేయడానికి రెవెన్యూ అధికారులు సన్నాహాలు చేపట్టారు. కానీ, చాలా చోట్ల స్థలాభావంతో ఈ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. తొండుపల్లి పంచాయతీ పరిధిలో చెత్త డంపింగ్ యార్డు కోసం ఇందిరమ్మ కాలనీ సమీపంలోని ప్రభుత్వ స్థలం కేటాయించారు. చెత్త వేయడానికి అనువుగా గోతులు కూడా తీశారు. సేకరించిన చెత్తను ఇక్కడకు తరలించడానికి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. ఇక్కడ చెత్త వేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని అక్కడి కాలనీ వాసులు అభ్యంతరం చెబు తున్నారు. స్థలాలు లేక కొన్ని చోట్ల..ఉన్నా వినియోగించుకోలేని పరిస్థితులు నెలకొనడంతో సమస్యకు పరిష్కారం దొరకడంలేదు. -
ఆరని మంట ఎన్నాళ్లీ తంటా?
► దుమ్ము..ధూళి.. దుర్వాసనకు తోడు... ► పదిరోజులుగా మండుతున్న డంపింగ్యార్డు ► తరలించాల్సిందేనని పట్టుబడుతున్న స్థానికులు ► పదకొండు నెలలైనా అమలుకు నోచుకోని సీఎం కేసీఆర్ హామీ ఖమ్మం: నగరంలోని దానవాయిగూడేన్ని డంపింగ్ యార్డు సమస్య వేధిస్తోంది. పది రోజులుగా అక్కడ మంటలు వస్తూనే ఉన్నాయి. దీంతో స్థానికులు పొగ, దుమ్మూధూళితోపాటు మంటలు ఎక్కువవుతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ మంటలను ఆర్పేందుకు చేస్తున్న ప్రయత్నాలేమీ ఫలించడం లేదు. తాము రోజూ ఇబ్బంది పడుతున్నామని, ఇక్కడి నుంచి డంపింగ్ యార్డు తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దానవాయిగూడెంలోని జనావాసాల మధ్యనే డంపింగ్ యార్డు ఉంది. నగరంలో ప్రతి రోజు 50 డివిజన్లలో 2.5 మెట్రిక్ టన్నుల చెత్తా చెదారం వెలువడుతుంది. చెత్తను డంపింగ్ చేసేందుకు దానవాయిగూడెంలో ప్రభుత్వం 38 ఎకరాల భూమి కేటాయించింది. ఈ స్థలం మొత్తం జనావాసాలకు సమీపంలోనే ఉంది. ఈ ప్రాంతంలో మొత్తం 1200 నివాసగృహాలుండగా, ఏడు వేల మంది దాకా ప్రజలు నివస్తున్నారు. 2010 నుంచి నగరంలో సేకరించిన చెత్తాచెదారం ఈ ప్రాంతంలోనే వేస్తున్నారు. చెత్తను రీసైక్లింగ్ చేసే పరిస్థితి లేకపోవడంతో అప్పట్నుంచి పేరుకుపోతోంది. దీంతో పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డంపింగ్యార్డులోకి పందులు, గేదెలు కూడా వచ్చి చెత్తను కదిలిస్తుండటంతో దుర్వాసన మరింత ఎక్కువగా వస్తోంది. దీంతో అక్కడివారు ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి నెలకొంటోంది. కార్పొరేషన్ ఎన్నికలకు ముందు ఖమ్మం నగరానికి వచ్చిన ముఖ్యమంత్రి దానవాయిగూడెంలోని డంపింగ్ యార్డును పరిశీలించారు. ఇది జనావాసాలకు దగ్గరగా ఉందని, ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని సూచించారు. అయితే 11 నెలలు కావొస్తున్నా అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికంగా ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మంటలతో మరింత కష్టం. అసలే దుర్వాసనను భరించలేక పోతున్న స్థానికులకు మరో కష్టం వచ్చి పడింది. పది రోజులుగా ఈ డంపింగ్యార్డులో మంటలు రాజుకున్నాయి. ఇవి ఇప్పటి వరకు అదుపులోకి రాలేదు. ఈ మంటలను ఆర్పేందుకు అటు ఫైర్ సిబ్బంది, కార్పొరేషన్ సిబ్బంది శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు జేసీబీలు ఏర్పాటు చేసినా మంటలు అదుపులోకి రావడం లేదు. పొగ నాలుగు డివిజన్లకు వ్యాపించడంతో ఆయా డివిజన్ వాసులు అసౌకర్యానికి గురవుతున్నారు. నగరంలోని 35, 49, 50, ఒకటో డివిజన్లకు పొగ వ్యాపిస్తోంది. రాత్రి,పగలు తేడా లేకుండా పొగ వెలువడుతోంది. ఈ పొగను పీల్చడం వల్ల అనారోగ్యానికి గురవుతామని ఆందోళనకు గురవుతున్నారు. డంపింగ్యార్డ్ తరలించాల్సిందే: మంటలు అదుపులోకి రాకపోవడంతో రెండు రోజుల క్రితం స్థానికులు ఆందోళనకు దిగారు. డంపింగ్యార్డ్ను పరిశీలించేందుకు వచ్చిన అధికారులను నిర్బంధించి సమస్య పరిష్కారం అయ్యే వరకు వదిలేది లేదని భీష్మించారు. పొగ, దుర్వాసన, దుమ్మూధూళితో తాము ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కమిషనర్ కలెక్టర్కు ఫోన్ చేసి.. కలెక్టర్ ఇచ్చిన హామీతో అధికారులను వదిలిపెట్టారు. అయితే ఈ డంపింగ్యార్డులో మంటలు ఇప్పటికీ అదుపులోకి రాలేదు. మంటలు ఎప్పుడు అదుపులోకి వస్తాయో.. ఇక్కడి నుంచి ఎప్పుడు తరలిస్తారోనని స్థానికులు ఎదురు చూస్తున్నారు. పొగతో ఇబ్బందులు పడుతున్నాం: డంపింగ్యార్డులో మంటలు ఆరకపోవడంతో మేము ఇబ్బందులు పడుతున్నాం. రోజూ పొగ ఇళ్లను కమ్మేస్తోంది. దీనివల్ల ఈ పొగను పీల్చాల్సి వస్తోంది. మాకు అనారోగ్యం వస్తుందేమోనని భయంగా ఉంది. అధికారులు మంటలను త్వరగా అదుపులోకి తీసుకొచ్చేలా చూడాలి: భూక్యా రామదాసు డంపింగ్యార్డును తరలించాలి: నివాసాల మధ్యలో ఉన్న డంపింగ్యార్డును ఇక్కడి నుంచి తరలించాలి. మా ఇళ్ల మధ్యలో డంపింగ్యార్డును ఏర్పాటు చేయడం వల్ల తీవ్ర దుర్వాసన వస్తోంది. ఈవాసన భరించలేకపోతున్నాం. గతంలో సీఎం వచ్చినప్పుడు డంపింగ్యార్డును తరలించాలని అధికారులకు సూచించినా.. చర్యలు తీసుకోవడం లేదు. దీనికితోడు ఇప్పుడు మంటలు రావడంతో పొగతో అందరం ఇబ్బంది పడుతున్నాం. :రమణ -
డంపింగ్ యార్డు ఎత్తివేతకు వైఎస్ఆర్ సీపీ డిమాండ్
-
డంపింగ్ యార్డు ఎత్తివేతకు వైఎస్ఆర్ సీపీ డిమాండ్
తిరుపతి: తిరుపతి స్కావెంజర్స్ కాలనీలోని డంపింగ్ యార్డు ఎత్తి వేయాలనే డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. శనివారం సాయంత్రం డంపింగ్ యార్డు వద్దకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరాగా వైఎస్ఆర్ సీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. చెత్తచెదారం కారణంగా కాలనీ వాసులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, వెంటనే దానిని మరో చోటికి తరలించాలని డిమాండ్ చేశారు. పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని బందోబస్తు చేపట్టారు. ఆందోళన కొనసాగుతోంది. -
డంపింగ్ యార్డుపై గ్రామస్థుల నిరసన
డంపింగ్ యార్డు కారణంగా చెరువు నీరు కలుషితం అవుతోందంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వివరాలివీ.. రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాల సమీపంలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డు ఉంది. ఈ యార్డు నుంచి వెలువడే వ్యర్థ జలాలు పక్కనే ఉన్న చెరువులో కలుస్తున్నాయి. సాగు నీరు కలుషితమవుతోందంటూ కొన్ని రోజులుగా గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ఇదే విషయమై ఒక్కటైన గ్రామస్తులు బుధవారం ఉదయం చెత్తను తీసుకువచ్చే జీహెచ్ఎంసీ వాహనాలను అడ్డుకున్నారు. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఆందోళన కారులకు నచ్చజెప్పేందుకు యత్నిస్తున్నారు. -
రిజిస్ట్రేషన్స్ వెంటనే ప్రారంభించాలి
-
సరిహద్దులో భారీ టేకు కలప నిల్వలు
దాడి చేసి పట్టుకున్న ఖమ్మం స్క్వాడ్ అధికారులు పట్టుబడిన కలప విలువ రూ.5 లక్షలు పైనే.. అశ్వారావుపేట రూరల్ : తెలంగాణ, ఏపీ సరిహద్దు ప్రాంతంలోని ఓ గ్రామంలో భారీస్థాయిలో విలువైన టేకు కలప నిల్వలు ఆదివారం వెలుగులోకి వచ్చాయి. సరిహద్దు ప్రాంతంలో ఉన్న అక్రమ కలపను ఖమ్మం స్క్వాడ్ రేంజర్, సిబ్బంది దాడులు చేసి పట్టుకోగా స్థానిక అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలిలా ఉన్నాయి. అశ్వారావుపేట మండలంలోని కాట్రపాడు గ్రామానికి చెందిన ఓ రైతు ఇంట్లో విలువైన టేకు కలపను సైజులుగా నరికి రవాణాకు సిద్ధంగా ఉంచారు. భారీస్థాయిలో కలప నిల్వ ఉండటంతో దీనిపై సమాచారం అందుకున్న ఖమ్మం స్క్వాడ్ రేంజర్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. దాడుల్లో గ్రామానికి చెందిన రైతు ఇంట్లో అక్రమంగా నిల్వ ఉన్న రూ.5 లక్షల విలువగల టేకు కలపను గుర్తించి పట్టుకున్నారు. పట్టుబడిన ప్రాంతంలో ఇటు తెలంగాణ, అటు ఏపీలోని జీలుగుమిల్లి మండంలోని జగన్నాథపురం గ్రామాలకు సరిహద్దులో ఉండటంతో స్థానిక అటవీ శాఖ అధికారులు ఏపీకి చెందిన ఫారెస్ట్ అధికారులకు కూడా సమాచారం అందించారు. నిల్వ ఉంచిన కలపను పరిశీలించిన ఖమ్మం స్క్వాడ్ రేంజర్ కోటేశ్వరరావు సదరు రైతును విచారించగా అశ్వారావుపేట మండలంలోని కన్నాయిగూడెం సమీపంలోని తన సొంత పొలం గట్లపై ఉన్న టేకు చెట్లను నరికి ఇంటి వద్దకు తీసుకొచ్చి పెట్టినట్లు తెలిపాడు. కాగా పొలంలో ఉన్న టేకు చెట్లను నరికేందుకు అనుమతులు లేకపోగా, అక్రమంగా నిల్వ ఉంచడంపై పలు అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు స్థానిక అటవీశాఖ సిబ్బంది సహకరించారని ప్రచారం జరుగుతోంది. కాగా రైతు చెప్పినట్లు టేకు కలపను పొలంలో నరికారా? లేదా అటవీ ప్రాంతంలో నరికి నిల్వ ఉంచారా? అన్నది విచారిస్తే కానీ తెలియదు. దాడుల్లో ఎఫ్బీఓలు రమేష్, రామారావు, స్ర్టైకింగ్ ఫోర్స్ ఉన్నారు. ఫొటో నంబర్లుః25ఏఎస్పి26 : -
సింగరేణి అప్రమత్తం
గోదావరిఖని : గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతుండడంతో సింగరేణి అధికారులు అప్రమత్తమయ్యారు. నదిని ఆనుకుని ఉన్న మేడిపల్లి ఓపెన్కాస్ట్ ప్రాజెక్టులో ఆదివారం బొగ్గు ఉత్పత్తిని నిలిపివేశారు. యంత్రాలను ఉపరితలానికి తరలించారు. డంపర్లు, ఇతర యంత్రాలను సురక్షిత ప్రాంతంలో నిలిపివేశారు. స్థానిక పవర్హౌస్కు సంబంధించి నీటిని తోడే యంత్రాలను ఉపరితలానికి తీసుకొచ్చారు. జీడీకె 1వ గని అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. గంటగంటకూ ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం వరద నీరు గోదావరిఖని ఫిల్టర్బెడ్ వద్ద 829 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. -
చినుకు పడితే రోడ్లు చిత్తడే
-
519 ట్రాక్టర్ల ఇసుక డంప్ సీజ్
త్రిపురారం : ఎక్కడైన..ఎవ్వరైన గోదాముల్లో ధాన్యం, బియ్యం, నిత్యావసర వస్తువులను నిల్వ చేయడం చూశాం. కానీ ఇసుక డంప్ చేయడం చూసి ఉండరు. కాని ఇది నిజం.. కొందరు ఏకంగా నాలుగు గోదాముల్లో 519 ట్రాక్టర్ ఇసుకను డంప్ చేసిన వైనం మండలంలోని గజలాపురం సమీపంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పక్క సమాచారం మేరకు రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఇసుక డంప్ నిల్వలపై దాడులు నిర్వహించారు. రెవెన్యూ, మైనింగ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గజలా పురం రైల్వేబ్రిడ్జి సమీపంలో గల సర్వేనంబర్ 88, 97, 98, 99,100లో గల 26 ఎకరాల్లో లక్ష్మి నర్సింహ వేర్హౌసింగ్ పేరుతో 12 గోదాముల నిర్మాణం చేపడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నాలుగు గోదాముల్లో సుమారు 519 ట్రాక్టర్ ఇసుకను యజమాని డంప్ చేసినట్లు తెలిపారు. దీంతో గోదాములను సీజ్ చేసి గోదాములను స్థానిక వీఆర్వో రాములమ్మకు అప్పగించారు. రెండు లారీలను కూడా సీజ్చేసి పోలీసులకు అప్పగించారు. పంచనామా చేసిన నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మంగ, సీనియర్ అసిస్టెంట్ శ్రవన్, శ్రీనివాస్, మైనింగ్ అధికారులు సైదులు, మధుకుమార్, సర్వేయర్లు తదితరులు ఉన్నారు. -
కదులుతున్న ఎర్ర డంప్లు
- పుష్కర విధుల్లో జిల్లా పోలీసులు - ఇదే అదునుగా పేట్రేగుతున్న స్మగ్లర్లు - శేషాచలం నుంచి పెద్ద ఎత్తున ఎర్రచందనం రవాణా - బుధ, గురువారాల్లో 13 మంది స్మగ్లర్లు అరెస్ట్ - బడా స్మగ్లర్ శ్రీనివాసరెడ్డి కోసం గాలింపు సాక్షి ప్రతినిధి. తిరుపతి శేషాచలంలోని ఎర్ర చందనం డంప్లు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తమిళనాడు నుంచి వస్తోన్న ఎర్ర స్మగ్లర్లు చాకచక్యంగా ఎర్రదుంగల తరలింపును ముమ్మరం చేశారు. జిల్లా పోలీసుల్లో 80 శాతం మంది కృష్ణా పుష్కర విధులకు హాజరవడం వీరికి కలిసొచ్చింది. ఇదే సరైన అదునుగా భావించిన స్మగ్లర్లు అడవుల్లో దాచిన ఎర్రచందనం దుంగల డంప్లను గుట్టూచప్పుడు కాకుండా బయటకు రవాణా చేసేందుకు యత్నిస్తున్నారు. గడచిన మూడు రోజులుగా ఈ రవాణా పెరిగినట్లు టాస్క్ఫోర్సు అధికారులు గుర్తించారు. బుధ, గురువారాల్లో విస్తృతంగా తనిఖీలు జరిపి 13 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.40 లక్షల విలువైన 58 ఎర్రచందనం దుంగలను (2 టన్నులు)స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లోని 5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న శేషాచలంలో ఇంకా 30 శాతం ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. ఇప్పటికే నరికిన చెట్ల తాలూకు దుంగల నిల్వలు పెద్ద ఎత్తున అడవుల్లో నిల్వ ఉన్నాయి. వీటిని బయటకు తరలించే విషయంలో ఇటు ఆంధ్ర, అటు తమిళనాడు స్మగ్లర్లు విస్తృతంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. గడచిన రెండు నెలల్లో సుమారు 20 టన్నులకు పైన ఎర్ర దుంగలను స్వాధీనం చేసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు 25 మందికి పైబడి స్మగ్లర్లును అరెస్టు చేశారు. రెడ్శాండల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ఫోర్స్కు చెందిన 13 బృందాలు శేషాచలంలో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. వెలిగొండ, పాలకొండ, నల్లమల, లంకమల అటవీ ప్రాంతాల్లో వీరి కూంబింగ్ జరుగుతోంది. ఈ నెల ఏడో తేదీన జిల్లాకు చెందిన 80 శాతం మంది పోలీసులు కృష్ణా పుష్కర విధులకు వెళ్లిపోయారు. దీంతో అన్ని మార్గాల్లోనూ పోలీసుల తనిఖీలు లేకుండా పోయాయి. ఇదే అదునుగా తీసుకున్న స్మగ్లర్లు రాత్రి వేళల్లో యథేచ్చగా ఎర్రచందనాన్ని రవాణా చేస్తున్నారు. 13 మంది అరెస్టు ...పరారీలో ముగ్గురు ఇదిలా ఉండగా బుధవారం మధ్యాహ్నం ఉగ్గరాల తిప్ప దగ్గర కూంబింగ్లో ఉన్న టాస్క్ఫోర్సు పోలీసులకు ఎర్ర చందనం దుంగలను రవాణా చేసే ముగ్గురు తమిళనాడు స్మగ్లర్లు దొరికారు. వీరిని చాకచక్యంగా అరెస్టు చేసిన పోలీసులు వీరి నుంచి 58 దుంగలు (2 టన్నులు)స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.40 లక్షలు ఉంటుందని టాస్క్ఫోర్సు డీఎస్సీ శ్రీధర్రావు విలేకరులకు తెలిపారు. గురువారం ఉదయం 5 గంటలకు జూపార్కు సమీపంలోని పెరుమాళ్లపల్లి అడవుల్లో అడవిలోకి ప్రవేశిస్తోన్న ఎర్ర స్మగ్లర్లపై టాస్క్ఫోర్సు ఆర్ఎస్ఐ వాసు, నర్సింహయ్యల టీములు ఒక్కసారిగా దాడులు జరిపాయి. మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. వీరిలో రేణిగుంటకు చెందిన కె. శివ, తిరుచ్చికి చెందిన లక్ష్మన్ సెంథిల్ కుమార్, రాసు షణ్ముగం, పిలెందిరన్ అంగముత్తు, క్రిష్టన్మూర్తి, రామర్ నాగరాజన్, నల్లిస్వామి పెరుమాళ్, నగరాజన్ సత్యవేల్, సంథానమ్ రవి, సంథానమ్ రాములు ఉన్నారని డీఎస్పీ శ్రీథర్రావు వివరించారు. వీరికి నాయకత్వం వహిస్తోన్న పేరూరి శ్రీనివాసరెడ్డి, మునస్వామి, రామానాయుడులు పరారయ్యారు. అరెస్టయిన వారి నుంచి ఓ ఆటో, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బడా స్మగ్లర్ పేరూరి శ్రీనివాసరెడ్డి కోసం గాలిస్తున్నారు. సహకరిస్తోన్న అగ్రికల్చర్ కాలేజీ వాచ్మెన్, రైల్వే ఉద్యోగిలను విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. -
విరివిగా మొక్కలు నాటాలి
చేగుంట: అన్ని గ్రామాల్లో ప్రతి ఒక్కరు మొక్కలను నాటి హరితహారాన్ని విజయవంతం చేయాలని మెదక్ ఆర్డీఓ మెంచు నగేశ్ పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని చిన్నశివునూర్ డంపుయార్డు సమీపంలోని ఖాళీ స్థలంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ... విద్యార్థులు, యువకులు, వృద్ధులు అన్ని వయసుల వారు విరివిగా మొక్కలు నాటాలన్నారు. ఒక్కో మండలంలో లక్షల మొక్కలు నాటి వాటిని పెరిగి పెద్దగా మారేలా సంరక్షించాలని సూచించారు. అధికారులు సైతం విభాగాలుగా ఏర్పడి అన్ని గ్రామాల్లో ఎక్కువ సంఖ్యల్లో మొక్కలు నాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అల్లి రమ, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది సుజాత, వైస్ చైర్మన్ ఎం శ్రీనివాస్, ఎస్ఐ శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ నిర్మల, ఏపీఓ ఆదినారాయణ, పంచాయతీ కార్యదర్శి బక్కప్ప, నాయకులు జనగామ అంజాగౌడ్, రమేశ్ గౌడ్, ఉప్పరి నాగులు, కుమ్మరి స్వామి తదితరులు పాల్గొన్నారు. మొక్కలు నాటిన ఏఎంసీ డైరెక్టర్ దుబ్బాక: హరిత హారంలో భాగంగా మంగళవారం దుబ్బాక మండలం పోతారెడ్డిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పేరుడి దయాకర్రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరిత హారంలో మొక్కలు నాటడడంలో రాష్ట్రంలోనే దుబ్బాక నియోజక వర్గాన్ని మొదటి స్థానంలో నిలపడానికి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చిత్తశుద్ధితో పని చేస్తున్నారన్నారు. మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందన్నారు. హరిత ఉద్యమంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు గోప కైలాసం, నాయకులు పాతూరి చిన్న శ్రీనివాస్గౌడ్, ఎండీ జాకీర్, జూకంటి రాజిరెడ్డి, గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, బెస్త భూమయ్య, బండి మురళి గౌడ్, దమ్మగౌని శ్రీనివాస్ గౌడ్, మాస్తి సిద్ధిరాములు, జంగం శంకర్ పాల్గొన్నారు. భవిష్యత్తు తరాల కోసమే హరితహారం మిరుదొడ్డి: భవిష్యత్తు తరాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారాన్ని నిర్వహిస్తోందని ఎంపీపీ పంజాల కవిత శ్రీనివాస్గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నంట బాపురెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మోతె శివారులో గల ప్రభుత్వ భూమిలో వివిధ రకాల పండ్ల మొక్కలతోపాటు నీడనిచ్చే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు పాటుపాడాలని కోరారు. హరితహారంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. కార్యక్రమంలోవ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వంజరి శ్రీనివాస్, ఇన్చార్జి ఎంపీడీఓ నీలకంఠ మఠం నగేష్, సర్పంచ్ కోరంపల్లి విజయలక్ష్మి వెంకట్రెడ్డి, భూంపల్లి ఎస్ఐ పి.ప్రసాద్, ఉపాధి హామీ ఏపీఓ శంకరయ్య, మండల సాక్షర భారత్ కోకన్వీనర్ బొంగాని రాములు, కార్యదర్శి అశోక్, నాయకులు సిద్ది భూపతిగౌడ్ పాల్గొన్నారు. -
డంపింగ్ యార్డు ఏర్పాటులో జాప్యం
తిరువళ్లూరు: మున్సిపాలిటీ పరిధిలో సేకరించిన చెత్తను డంపింగ్ చేయడానికి స్థలం ఏర్పాటు చేయకపోవడంతో, ప్రభుత్వం ప్రకటించిన సేంద్రీయ ఎరువుల తయారీ పరిశ్రమ ఏర్పాటు అగమ్యగోచరంగా మారింది. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరువళ్లూరు మున్సిపాలిటీలో దాదాపు లక్ష మందికి పైగా నివాసం ఉంటున్నారు. విద్యాసంస్థలు, కళాశాలలు, హోటల్స్తో పాటు ఇతర అవసరాల వల్ల ఏర్పడే చెత్తను మగ్గిన కుప్పలు, మగ్గని కుప్పలుగా వేరు చేసి తలకాంజేరీకి సమీపంలో డంపింగ్ చేస్తున్నారు. అక్కడ చెత్తకుప్పలు గుట్టల్లా పేరుకుపోవడంతో సమీప ప్రాంతాలకు దుర్వాసన వస్తోంది. చెత్తకుప్పలకు నిప్పు పెట్టినప్పుడు పొగలు దట్టంగా విస్తరించడం, హానికర వాయువులు వెలువడుతుండడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో చెత్తను పడవేయడానికి కుత్తంబాక్కం సమీపంలో 110 ఎకరాల స్థలంలో డంపింగ్ యార్డును ఏర్పాటుచేసి అక్కడ సేంద్రీయ ఎరువుల తయారీ చేపట్టాలన్న ప్రభుత్వ లక్ష్యం ముందుకు సాగడం లేదు. డంపింగ్ యార్డుకు స్థలం కరువు: తిరువళ్లూరులో సేకరించే చె త్తకుప్పలను డంపింగ్ యార్డును ఏర్పాటు చేసి అక్కడికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కుత్తంబాక్కంలో స్థానికులు డంపింగ్యార్డు ఏర్పాటుకు నిరసన వ్యక్తం చేయడంతో ఎగువ నల్లాటూరు వద్ద ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా ఆచరణలో సాధ్యం కావడం లేదు. దీంతో తిరువళ్లూరును పారిశుద్ధ్య నగరంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వం ఆశయం కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి డంపింగ్ యార్డును వెంటనే ఏర్పాటు చేసి సేంద్రియ ఎరువుల తయారీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఎరువుల తయారీ పరిశ్రమకు నిధుల కొరత : తిరువళ్లూరు మున్సిపాలిటీ నుంచి భారీగా వెలువడుతున్న చెత్తవల్ల భవిష్యత్తులో ముప్పు ఏర్పడుతుందన్న కారణంతో ప్రభుత్వం ముందస్తు చర్యగా సేంద్రియ ఎరువుల తయారీ చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ ప్రక్రియ నారావారికుప్పంతో పాటు 8 మేజర్ పంచాయతీల్లో జరుగుతోంది. వాస్తవానికి సేంద్రియ ఎరువుల తయారీ ఖర్చులను ఆయా పంచాయతీలు, మున్సిపాలిటీలే భరించాల్సి ఉంది. అయితే తిరువళ్లూరులో సేకరించిన చెత్త నుంచి సేంద్రియ ఎరువుల తయారీకి భారీగా ఖర్చు అయ్యే అవకాశం ఉండడంతో ఈ ప్రక్రియ సాధ్యం కాదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తిరువళ్లూరు మున్సిపాలిటీలో సేంద్రీయ ఎరువుల తయారీకి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. ముప్పు నుంచి ఉపశమనం : ప్రస్తుతం తిరువళ్లూరులో సేకరించే చెత్తకుప్పలను తలకాంజేరి వద్ద డంపింగ్ చేస్తున్నారు. చెత్తకుప్పలు భారీగా పేరుకుపోతే నిప్పు పెట్టి కాల్చేస్తున్నారని, ఆ సమయంలో పొగలు దట్టంగా వ్యాపించడంతో పాటు హానికర వాయువులు వెలువడుతుండడంతో గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. -
దౌర్జన్యం.. తన పని తాను చేసుకుపోతోంది
రైతుల అంగీకారం లేకుండా భూసేకరణ రైతులకు నోటీసులు ఇవ్వచూపిన రెవెన్యూ సిబ్బంది తీసుకోకపోవటంతో ఇంటి గోడలకు అంటించిన సిబ్బంది ఇదేం న్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న మూలలంక రైతులు దౌర్జన్యం.. తన పని తాను చేసుకుపోతోంది. పోలవరం ప్రాజెక్టు డంపింగ్ యార్డ్ కోసం భూములు కోల్పోతున్న రైతులు న్యాయం కోసం పోరాడుతున్నారు. తమ భూములకు సరైన పరిహారం చెల్లించాలని మూడు నెలలుగా దీక్షలు కూడా చేస్తున్నారు. అధికారులు తమతో చర్చలు జరుపుతారేమోనని ఎదురుచూస్తున్న సమయంలో దౌర్జన్యం నిద్ర లేచింది. రైతులు నోటీసులు తీసుకునేందుకు అంగీకరించకపోవడంతో వారి ఇళ్లకు అతికించి రెవెన్యూ సిబ్బంది రూపంలో విజయగర్వంతో పరిహాసమాడింది. ఇదీ పోలవరం మండలంలోని మూలలంక గ్రామంలో దుస్థితి. పోలవరం : రైతులతో చర్చలు జరపకుండా, వారి అంగీకారం లేకుండా ఏకపక్షంగా భూములు సేకరించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. పోలవరంలోని మూలలంక ప్రాంతంలో భూములు కలిగిన రైతులకు ఈ మేరకు శనివారం నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు తీసుకునేందుకు రైతులు అంగీకరించలేదు. దీంతో రెవెన్యూ సిబ్బంది వారి ఇంటి గోడలకు నోటీసులు అంటించి ఫొటోలు తీశారు. నోటీసులు అంటించినట్టు చుట్టు పక్కల ఇళ్ల వారితో సంతకాలు తీసుకున్నారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అదికారులు తమతో సంప్రదించి నష్టపరిహారం నిర్ణయించకుండా, తమ అంగీకారం తీసుకోకుండా భూములు సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని వాపోతున్నారు. పోలవరం ప్రాజెక్టు డంపింగ్ యార్డ్ కోసం పోలవరంలోని మూలలంక ప్రాంతంలో 150 మంది రైతులకు సంబం ధించి 207 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరిస్తున్న విషయం తెలి సిందే. దీనికి సంబంధించిన రైతులు మూడు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని రోజుల పాటు తమ భూములకు సరైన ధర చెల్లించాలంటూ రిలే దీక్షలు కూడా చేశారు. అధికారులు నష్టపరిహారం విషయమై తమతో చర్చలు జరుపుతారని భావించామని, కాని ఏకపక్షంగా నోటీసులు జారీ చేయటం దారుణమని రైతులు చౌటపల్లి లక్ష్మి, సంగినీడి రాంప్రసాద్, నంగినీడి కృష్ణ, తాడి మంగారాం, పసుపులేటి సత్యనారాయణ తదితరులు వాపోతున్నారు. అవార్డు పాసయ్యింది మూలలంక భూములకు సంబంధించి అవార్డు పాసయ్యింది. మూడు సార్లు రైతులకు కబురు చేశాం. చ ర్చలకు రాలేదు. బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇవ్వాలని నోటీసు జారీ చేశాం. అకౌంట్ నెంబరు ఇస్తే నష్టపరిహారం సొమ్ము జమ చేస్తాం. లేకుంటే ఎల్ఏఓ అకౌంట్కు వేస్తాం. - ఎస్.లవన్న, ఆర్డీవో, జంగారెడ్డిగూడెం నోటీసులు అంటించారు నాకు మూలలంకలో 0.35 సెంట్లు భూమి ఉంది. దీనిని డంపింగ్ యార్డ్ కోసం సేకరిస్తున్నట్టు రెవెన్యూ సిబ్బంది నోటీసు తీసుకు వచ్చి సంతకం చేయమన్నారు. నేను సంతకం చేయలేదు. నోటీసు మా ఇంటి గోడకు అంటించి ఫొటో తీసుకున్నారు. - నాగిరెడ్డి శ్రీనివాసరావు, మూలలంక రైతు, పాత పోలవరం అడిగినా సమాధానం చెప్పలేదు నాకు మూలలంకలో 1.49 సెంట్లు భూమి ఉంది. దీన్ని సేకరిస్తున్నట్టు రెవెన్యూ సిబ్బంది మా ఇంటి గోడకు నోటీసు అంటించారు. అడిగినా సమాధానం చెప్పలేదు. రైతులతో మాట్లాడి నష్టపరిహారం నిర్ణయించకుండా నోటీసు అంటించారు. ఇది అన్యాయం. - పసుపులేటి శ్రీనివాస్, మూలలంక రైతు, పోలవరం -
డంపింగ్పై విజిలెన్స్
సాక్షి ప్రతినిధి, విజయనగరం : చారిత్రక నగరంగా భాసిల్లుతున్న విజయనగరాన్ని చెత్త సమస్య పట్టి పీడిస్తోంది. ఇక్కడి మునిసిపల్ అధికారులు డంపింగ్యార్డు నిర్వహిస్తున్న తీరుపై విజిలెన్స్, ఎన్ఫోర్సుమెంట్ విభాగం సీరియస్గా తీసుకుంది. యార్డుకోసం వెచ్చిస్తున్న నిధులు దుర్వినియోగం అయినట్టు నిర్ధారించింది. వీరు అనుసరిస్తున్న తీరువల్ల చుట్టుపక్కల నివాసం ఉంటున్నవారికి ప్రమాదం పొంచి ఉందని అభిప్రాయపడింది. దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు సమాయత్తమవుతోంది. రోజూ 20టన్నుల చెత్త తరలింపు నగరంలోని చెత్తను డంప్ చేయడానికి 15 ఏళ్ల క్రితం అప్పటి తెలుగుదేశం పార్టీ హయాంలో డెంకాడ మండలం చొల్లంగిపేట పంచాయతీ కె.ముంగినాపల్లి వద్ద 20 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. అక్కడకు రోజూ సుమారు 15నుంచి 20 టన్నుల చెత్తను తరలిస్తున్నారు. తరలిస్తున్న చెత్త నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. దీనివల్ల సమీప గ్రామాలైన కె.ముంగినాపల్లి(దళితవాడ), ముంగినాపల్లి, గుణుపూరుపేట గ్రామాల్లోని ప్రజల జీవనానికి ఆటంకంగా మారింది. నిర్వహణ అధ్వానంగా ఉండటంతో పీల్చే గాలి నుంచి తాగే నీరు వరకు అన్నీ కలుషితమవుతున్నాయి. రోజురోజుకు సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. ఆ గ్రామాల ప్రజలు ఉన్న ఊరిని విడిచి వెళ్లలేక, అక్కడే ఉండ లేక నరకం చూస్తున్నారు. ఈ ప్రాంతంలో ఈగలు, రకరకాల పురుగులు స్వైరవిహారం చేస్తున్నాయి. వర్షాకాలం వస్తే నరకమే వర్షాలు కురిస్తే ఇక్కడి పరిస్థితి మరీ దయనీయంగా ఉంటోంది. యార్డులోని కాలుష్యాలు భూగర్బ జలాలతో కలిసి కలుషితమవుతున్నాయి. వాటిని తాగుతున్న అక్కడి ప్రజలు వ్యాధుల బారినపడుతున్నారు. దురదలు, గజ్జి రూపంలో చర్మవ్యాధులు వ్యాపిస్తున్నాయి. దీనికోసం అక్కడ అప్పుడప్పుడు వైద్యాధికారులు వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నారు తప్ప ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం మాత్రం చూపట్లేదు. ఇప్పటికే ఇక్కడ వివిధ వ్యాధుల బారిన పడి 11మంది మృతి చెందారన్న వాదనలు ఉన్నాయి. మీడియా కథనాలతో కదిలిన విజిలెన్స్ డంపింగ్యార్డు వల్ల ప్రజలు పడుతున్న అవస్థలపై మీడియాలో వచ్చిన కథనాలపై మున్సిపల్ యంత్రాంగం, పాలకులు స్పందించకపోయినా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం సీరియస్గా స్పందించింది. కొన్ని నెలలుగా డంపింగ్ యార్డ్ నిర్వహణను పరిశీలిస్తూ వస్తోంది. ఈ క్రమంలో అధికారుల వైఫల్యాలను గుర్తించింది. ఇప్పుడా లోపాల చిట్టాలతో ప్రభుత్వానికి నివేదిక సిద్ధం చేస్తోంది. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ గుర్తించిన అంశాలివి: బయో గ్యాస్ ప్లాంట్ ద్వారా వ్యర్థ పదార్థాల నుంచి గ్యాస్, విద్యుత్ ఉత్పత్తి చేయాలి. ఇక్కడదేమీ జరగట్లేదు. పట్టణంలోని రైతు బజార్లు, పండ్ల దుకాణాల వద్ద మిగిలిపోయిన వ్యర్థాలతో ఎరువులు తయారు చేసేందుకు కొనుగోలు చేసిన పలవరైజేషన్ యంత్రం నిరుపయోగంగా ఉంది. దీనికోసం వెచ్చించిన రూ. పదిలక్షలు వృథా అయింది. తరలిస్తున్న చెత్తను తడి, పొడిగా వేరుచేయాలి. సేకరణ సమయంలోనే ఈ ప్రక్రియ జరగాలి. మున్సిపల్ యంత్రాంగం ఈ విషయంలో విఫలమైంది. యథాతధంగా చెత్త తరలించేస్తుండటంతో దేనికీ ఉపయోగ పడట్లేదు. సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో గుట్టలుగుట్టలుగా ఎక్కడబడితే అక్కడే చెత్తను డంపింగ్ చేస్తున్నారు. దీనిని చదును చేయడానికి ప్రతీ మూడు నెలలకు లక్షలాది రూపాయల ఖర్చు చేస్తున్నారు. వర్మీ కంపోస్టు యార్డ్ను రూ.10లక్షలతో నిర్మించారు. గాని పలవరైజేషన్ ద్వారా వ్యర్థాల నుంచి వేరు చేసిన మెటీరియల్ను దశల వారీగా ఎరువుల కింద మార్చడం లేదు. వర్మీ కంపోస్టు యార్డ్కు చేసిన ఖర్చు అంతా నిరుపయోగంగా మారింది. డంపింగ్ యార్డ్లో పనిచేయడానికి 40నుంచి 50మంది సిబ్బంది కావాలి. అధికారులు ఇక్కడ 10మంది పనిచేస్తున్నట్టు చెబుతున్నా... వారూ కనిపించడం లేదు. -
చెత్త కుప్పలో నవజాత శిశువు
ఉండి(పశ్చిమగోదావరి): మానవత్వాన్ని మరచిన మనుషులు అప్పుడే పుట్టిన మగ శిశువును చెత్త కుప్పలో వదిలివెళ్లారు. ఈ హృదయ విదారక ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం పాండువ గ్రామంలో శనివారం వెలుగుచూసింది. గ్రామంలోని క్రిస్టియన్ పేటలో గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన శిశువును చెత్త కుప్పలో వదిలివెళ్లారు. చిన్నారి ఏడుపు వినిపిస్తుండటం గమనించిన స్థానికులు ఆ శిశువును ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
దోచేయ్.. దాచేయ్!
* ఉచితం మాటున ఇసుక అక్రమ వ్యాపారం * అనధికార రీచ్ ల నుంచి యథేచ్ఛగా తరలింపు * నిబంధనలకు విరుద్ధంగా తోటల్లో డంపింగ్ * సరిహద్దులు దాటించి సొమ్ము చేసుకొంటున్న ‘తమ్ముళ్లు’ * పర్యవేక్షణ మరచి, చోద్యం చూస్తున్న అధికారులు ఉలవపాడు: తెలుగు తమ్ముళ్ల అక్రమ ఇసుక వ్యాపారం మూడు టిప్పర్లు, ఆరు డంప్లుగా వెలుగొందుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానంతో సామాన్య ప్రజలకు వనగూరే ప్రయోజనం మాటెలా ఉన్నా ఆపార్టీ శ్రేణులకు మాత్రం వరంలా మారింది. వారికి నిబంధనలు పట్టవు.. రవాణాకు పగలు, రాత్రి అనే బేధం లేదు.. అధికారులు పర్యవేక్షణ ఉంటుందనే భయం అసలే లేదు.. వారికి నచ్చిన రీచ్ల నుంచి ఇసుకను యథేచ్ఛగా తరలించి, తోటల్లో రహస్యంగా డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి టిప్పర్లతో వివిధ జిల్లాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యవహారమంతా తెలిసికూడా అధికారులు ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి నెలకొంది. మన్నేరు నుంచి యథేచ్చగా తరలింపు.. రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానంలో నిర్ణయించిన రీచ్ల నుంచే అవసరమైన వారు ఇసుక తెచ్చుకోవాలి. డంప్ చేయకూడదు. రాత్రి వేళల్లో ఇసుక తరలించకూడనే నిబంధన ఉంది. కానీ, ఇసుకాసురులకు ఈ నిబంధనలు పట్టడం లేదు. ఉలవపాడు మండల పరిధిలో ప్రభుత్వం అనుమతిచ్చిన చినిగేవారిపాలెం రీచ్ నుంచే కాక మన్నేరులోని అన్ని రీచ్ల నుంచి రాత్రివేళల్లో సైతం యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. కొల్లూరుపాడు- ఆత్మకూరు మధ్య బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో, భీమవరం, కుమ్మరిపాలెం, మన్నేటికోట నుంచి ఇసుక తరలిస్తున్నారు. ట్రాక్టర్ల యజమానులందరూ వీరి చేతుల్లోనే ఉండటంతో ఇసుక అవసరమైన సామాన్య ప్రజలు వీరినే ఆశ్రయించాల్సి వస్తోంది. తోటల్లో రహస్య డంప్లు... ఉలవపాడు మండల పరిధిలోని నాయకులు పలు చోట్ల ఇష్టానుసారంగా ఇసుక డంప్ చేస్తున్నారు. ఇసుకను అవసరానికి మాత్రమే తీసుకెళ్లాలని తెలిసినా నాయకులు మాత్రం తోటల్లో కూడా రహస్యంగా డంపింగ్ చేస్తున్నారు. కృష్ణాపురం-భీమవరం సరిహద్దులోని తోటల్లో రోజూ రాత్రి వేళ భారీగా డంప్ చేయడం అక్కడ నుంచి వివిధ జిల్లాలకు టిప్పర్ల ద్వారా ఎగుమతులు చేస్తున్నారు. ఇవికాక ఉలవపాడు, కొల్లూరుపాడు, ఆత్మకూరు, మన్నేటికోట రెవెన్యూ పరిధిలో కూడా ఇసుక డంప్లు ఏర్పాటుచేసి ఎగుమతులు చేస్తున్నారు. దీని వలన మండల పరిధిలో ఇసుక తగ్గిపోయి నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తూ డంపింగ్ చేస్తున్నారని ఇటీవల రీచ్కి వచ్చిన అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, ఇకనైనా ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు విన్నవిస్తున్నారు. -
'అదనపు బకెట్’పై ఏడీ విచారణ
► ‘సాక్షి’ కథనాలతో ► స్పందించిన ఖనిజాభివృద్ధి సంస్థ ► ఇసుక క్వారీల వద్ద వే బ్రిడ్జిల ఏర్పాటుకు నిర్ణయం ► అధికారులు, కాంట్రాక్టర్ల దందాకు అడ్డుకట్ట సాక్షి ప్రతినిధి, వరంగల్ : జిల్లాలోని ఇసుక క్వారీల్లో ‘అదనపు బకెట్’ అక్రమాలపై ఏప్రిల్ 27,28 తేదీల్లో ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలకు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(టీఎస్ఎండీసీ) స్పందించింది. ఈ మేరకు ప్రభుత్వ క్వారీలన్నింటి వద్ద కచ్చితంగా వేబ్రిడ్జిలను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించింది. ఇన్నాళ్లుగా అక్రమాలతో లబ్ధిపొందిన అధికారులు, కాంట్రాక్టర్లు వేబ్రిడ్జిల ఏర్పాటును అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఉన్నతాధికారులపై వివిధ మార్గాల ద్వారా ఒత్తిడి పెంచేందుకు యత్నిస్తున్నారు. ఇసుక అమ్మకాలతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని అధికారులు, కాంట్రాక్టర్లు జేబులో వేసుకుంటున్నారు. వరంగల్లోని క్వారీల వద్ద అనధికారింగా అదనపు బకెట్ ఇసుక లోడింగ్ చేస్తున్న అంశంపై తనకు పూర్తి నివేదిక ఇవ్వాలని భూగర్భ శాఖ సహాయ సంచాలకుడు(ఏడీ) బాలదాసును టీఎస్ఎండీసీ మేనేజింగ్ డెరైక్టర్(ఎండీ) ఇలంబర్తి ఆదేశించారు. ఈ మేరకు జిల్లా ఏడీ క్వారీలవారీగా వివరాలను సేకరించి, ప్రత్యేక నివేదిక రూపొందించారు. క్వారీల వద్ద వేబ్రిడ్జిలు ఏర్పాటు చేస్తే అనధికారికంగా అధిక లోడింగ్ ఉండదని సూచించారు. వేబ్రిడ్జి లేకపోవడంతో ఎక్కువసార్లు అధిక లోడింగ్ జరుగుతుందనే సమాచారం ఉందని పేర్కొన్నారు. విచారణ నివేదిక ఆధారంగా టీఎస్ఎండీసీ ఎండీ ఇలంబర్తి చర్యలు తీసుకున్నారు. ఇలంబర్తి ప్రస్తుతం కేరళ అసెంబ్లీ ఎన్నికల పర్యవేక్షకుడిగా వెళ్లారు. దీంతో వేబ్రిడ్జిల ఏర్పాటు ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. ఇలంబర్తి ఎన్నికల విధుల నుంచి రాగానే వేబ్రిడ్జిల ఏర్పాటు దిశగా చర్యలు వేగం పుంజుకోనున్నారుు. లోడింగ్లో మాయూజాలం టీఎస్ఎండీసీ ఆధ్వర్యంలో జిల్లాలో ప్రస్తుతం ఏటూరు ఏ, ఏటూరు బీ, ఏటూరు 2, ఏటూరు 3, సింగారం, తుపాకులగూడెం, రామన్నగూడెం, చుంచుపల్లిల్లో ఇసుక క్వారీలు నిర్వహిస్తున్నారు. అన్ని ప్రభుత్వ క్వారీల్లో అధిక లోడింగ్ అక్రమాలు జరుగుతున్నాయి. అధికారులు, ఇసుక అక్రమార్కులు కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయూనికి గండిపెడుతున్నారు. ఇసుకను లారీల్లోకి లోడింగ్ చేసే డంపింగ్ యార్డు వద్దే అక్రమాలకు నాంది పలుకుతున్నారు. లారీలను డంపింగ్ యార్డుకు తీసుకొస్తున్నప్పుడే అక్కడ ఉంటున్న సిబ్బంది లారీల డ్రైవర్ల వద్దకు వెళ్లి అనధికారింగా రూ.1000 తీసుకుంటున్నారు. ఇలా ఇచ్చిన వారి లారీల్లోకి, పొక్లెరుున్ బకెట్లో నిర్దేశిత పరిమాణం కంటే అదనంగా ఇసుకను లోడ్ చేసి వేరుుస్తున్నారు. దీన్నే ‘అదనపు బకెట్’ అని అంటారు. దీని కారణంగా లారీల వారికి 5 నుంచి 6 టన్నులు అదనంగా ఇసుక లోడ్ అవుతోంది. టన్నుకు రూ.1000 చొప్పున లారీల నిర్వాహకులు అదనపు ఇసుకను బహిరంగ మార్కెట్లో విక్రయించుకొని సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలోని 6 క్వారీలకు ప్రతి రోజు సగటున 500 లారీలు వస్తుంటారుు. ఒక్క ఏటూరు క్వారీకే 300 లారీలు వస్తుంటారుు. లారీలో అదనంగా ఒక బకెట్ ఇసుకను లోడింగ్ చేయడం వల్ల ప్రతిరోజు 1500 టన్నుల దాకా ఇసుక అక్రమంగా తరలివెళ్తోంది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి రోజుకు రూ.5,73,525 చొప్పున భారీ నష్టం కలుగుతోంది. ఈ నష్టాన్ని నివారించే దిశగా వడివడిగా చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. -
డంపింగ్ యార్డు నిర్వాహకుడి అరెస్ట్
► తహశీల్దార్నే బెదిరించిన రజత్ ► గంటల వ్యవధిలోనే అరెస్టు చేసిన పోలీసులు దొడ్డబళ్లాపురం : తాలూకాలోని కణికేనహళ్లి వద్ద ఉన్న రేస్కోర్స్ వ్యర్థాల డంపింగ్ సెంటర్ను మూసివేసి, అక్కడి నుంచి తొలగించాలని డిమాండు చేస్తూ చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఏ.25న భారీ ఆందోళన చేస్తామని హెచ్చరించడంతో స్థానిక ఎమ్మెల్యే వెంకట రమణయ్య తహశీల్దార్ రమేశ్కుమార్తో కలసి శనివారం సాయంత్రం డంపింగ్ సెంటర్ను పరిశీలించారు. ఊహించిన దానికంటే సమస్య తీవ్రత ఎక్కువగా ఉందని భావించిన తహశీల్దార్ డంపింగ్ సెంటర్ యజమాని రజత్ను పిలిపించుకుని తక్షణం దాన్ని మూసివేయాలని, అనుమతులు లేకుండా నిబంధనలకు వ్యతిరేకంగా డంపింగ్ సెంటర్ నిర్వహిస్తున్నందుకు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. తహశీల్దార్ హెచ్చరికలు ఖాతరు చేయని రజత్ ఎమ్మెల్యే వెంకటరమణయ్య సమక్షంలోనే బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో తహశీల్దార్ రమేశ్కుమార్ నేరుగా వెళ్లి దొడ్డబెళవంగల పోలీస్ స్టేషన్లో రజత్పై ఫిర్యాదు చేసారు. అదేవిధంగా అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా డంపింగ్ సెంటర్ నడుపుతున్నందుకు, గ్రామాల పరిసరాలను కలుషితం చేసినందుకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. దొడ్డబెళవంగల పీఎసై ్స శ్రీనివాస్ రజత్ను అరెస్టు చేసారు. రాత్రి 8 గంటల సమయంలో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచారు. ఇంకేం జైలుకు పంపించాలని పోలీసులు సిద్ధమవుతుండగా అనారోగ్యమంటూ రజత్ నాటకాలు ప్రారంభించాడు. అర్ధరాత్రి వరకూ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రజత్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అదే సమయానికి ఆస్పత్రికి విచ్చేసిన రజత్ మద్దతుదారులు తాము మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్రమంత్రికి బంధువులమని అంతుచూస్తామని చిందులువేసారు. ఎట్టకేలకు రజత్ ను పోలీసులు జైలుకు పంపించారు. సమస్య పరిష్కరించబడడంతో గ్రామాల ప్రజలు సోమవారం తలపెట్టిన ఆందోళనను విరమించుకున్నారు. -
డంపింగ్ యార్డ్లో కాలిపోయిన మృతదేహం
ఘటనపై పలు అనుమానాలు కాటేదాన్: డంపింగ్ యార్డులో గుర్తు తెలియని యువకుడి మృతదేహం కాలిపోతూ కనిపించిన ఘటన మంగళవారం మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. కాటేదాన్ పారిశ్రామిక వాడలోని పాయల్ ఫుడ్ పరిశ్రమ పక్కనే గల డంపింగ్ యార్డులో ఉదయం ఓ మృతదేహం కాలిపోతుండగా క్రికెట్ ఆడేందుకు అటుగా వచ్చిన యువకులు గమనించారు. వెంటనే వారు పాయల్ ఫుడ్ కంపెనీ జనరల్ మేనేజర్ సుబ్బారావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే మృతదేహం గుర్తు పట్టలేని విధంగా కాలిపోయింది. మృతుడి కుడి చేతికి ప్లాస్టిక్ బ్యాండ్ ఉంది. వయసు 30-35 ఏళ్ల మధ్య ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు ఎవరనేది తెలిస్తే కేసును ఛేదించేందుకు వీలవుతుందని ఇన్స్పెక్టర్ సెరైడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. హత్య చేసి పడేశారా? పాయల్ ఫుడ్ పరిశ్రమ నిర్వాహకుడు పరిశ్రమ ఏర్పాటు అయిననాటి నుంచి పరిశ్రమలోని వ్యర్థాలు, వేస్ట్పేపర్లు ఇందిరా గాంధీ సొసైటీలోని ఖాళీ ప్రదేశంలో పడేస్తున్నారు. వీటిని గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి సమయంలో తగులబెడుతుంటారు. ఇదిలా ఉండగా మృతుడు డంపింగ్ యార్డ్ మంటల్లో ఎలా కాలి బూడిదయ్యాడో ప్రశ్నార్థకంగా మారింది. ఎవరైనా హత్య చేసి మృతదేహాన్ని గుర్తు పట్టకుండా ఉండేందుకు డపింగ్ యార్డ్లో పడేసి తగులబెట్టారా? లేక సమీపంలోని పరిశ్రమలో కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోతే గుట్టుచప్పుడు కాకుండా మంటల్లో పడేసి చేతులు దులుపేసుకున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
డంపింగ్ యార్డ్ వద్ద చిన్నారుల ఆందోళన
పార్వతీపురం: విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపల్ డంపింగ్ యార్డ్ వద్ద ఓ అనాథాశ్రమం చిన్నారులు శుక్రవారం ఆందోళనకు దిగారు. డంపింగ్ యార్డులోని చెత్తకు మున్సిపల్ సిబ్బంది నిప్పు పెడుతుండడంతో సమీపంలోనే ఉన్న జట్టు అనాథాశ్రమం చిన్నారులు పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో చెత్త వేయవద్దని కోరుతూ గత రెండు రోజులుగా చిన్నారులు రహదారిపై రాస్తారోకో చేశారు. అయినా శుక్రవారం ఉదయం యథావిధిగా చెత్త వేయడానికి మున్సిపల్ సిబ్బంది రావడంతో మరోసారి చిన్నారులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. పోలీసులు, ఆశ్రమం నిర్వాహకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. -
రూ. 2 కోట్ల బ్యాగ్ దొరికిందా.. లేదా?
నగర శివార్లలోని జవహర్నగర్ డంపింగ్ యార్డులో రూ. 2 కోట్లు దొరికాయన్న వార్త.. కలకలం రేపింది. అంతలోనే.. డబ్బులు ఏమీ దొరకలేదంటూ యార్డు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చెప్పడంతో అంతా తుస్మన్నట్లే అంటున్నారు. కానీ ఈ విషయంలో ప్రజలకు మాత్రం సవాలక్ష అనుమానాలు వస్తున్నాయి. జవహర్నగర్ డంపింగ్ యార్డులో విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ గార్డులకు మంగళవారం ఓ బ్యాగ్ దొరికిందని, అందులో రూ. 2 కోట్ల డబ్బు ఉందని కథనాలు వచ్చాయి. అంత డబ్బు కళ్ల చూడటంతో ఒక్కసారిగా వాళ్లలో ఆశ పుట్టిందని, అయితే పంచుకోవడంలో లెక్కలు తేలకపోవడంతో గొడవపడిన గార్డులు పోలీసులకు ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. డంపింగ్ యార్డ్లో దొరికిన పెద్దమొత్తంలో ఉన్న డబ్బుల బ్యాగ్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ బ్యాగ్ అక్కడికి ఎలా వచ్చింది, ఎవరూ పెట్టారు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారని కూడా తెలిసింది. కానీ అక్కడే ఈ కథ మరో మలుపు తిరిగింది. అసలు యార్డులో డబ్బులేవీ దొరకలేదని డంపింగ్ యార్డు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నవీన్ కుమార్ అన్నారు. డబ్బు దొరికిందంటూ వచ్చినవన్నీ వదంతులు మాత్రమేనని ఆయన చెప్పారు. సెక్యూరిటీ సిబ్బంది అందరినీ విచారించామని, అయితే డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని వివరించారు. దీంతో అసలు నిజంగా డబ్బు ఉందా.. లేదా అన్న విషయమై ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. -
నెల్లూరు జిల్లాలో ఎర్ర్రచందనం డంప్ పట్టివేత
-
34 ఎర్ర చందనం దుంగల పట్టివేత
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం సున్నపువారిపాలెం సమీపంలో 34 ఎర్రచందనం దుంగలను శనివారం ఉదయం పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీటిని ఓ చోట డంప్ చేసి తరలించడానికి సిద్ధమవుతుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితుల్లో ఇద్దరు నెల్లూరు జిల్లాకు చెందిన వారు కాగా, మిగిలిన నలుగురు చిత్తూరు జిల్లా వాసులు. -
పరుపులో గుర్తుతెలియని మృతదేహం
వైఎస్సార్ జిల్లా కేంద్రం కడప నగరంలోని ఉక్కాయపల్లి చెత్త డంపింగ్ యార్డులో పరుపులో చుట్టిన మృతదేహం కనిపించింది. విపరీతమైన దుర్వాసన వస్తుండటంతో స్థానికుల ఫిర్యాదు మేరకు మున్సిపల్ సిబ్బంది గురువారం సాయంత్రం పరుపును విడదీసి చూశారు. అందులో వృద్ధుడి మృతదేహం కనిపించింది. పూర్తిగా కుళ్లిపోయి గుర్తించడానికి వీల్లేకుండా ఉంది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం
చింతూరు: ఛత్తిస్గఢ్ రాష్ట్రంలోని కన్కేర్ జిల్లా భానుప్రతాప్పూర్ డివిజన్ పరిధిలోని తడోకి పెదబేడ అటవీ ప్రాంతంలో భారీ డంప్ లభ్యమైంది. శనివారం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించిన పోలీసులు డంప్ ను గుర్తించారు. అడవిలోని ఓ కాలువ గట్టుపై దాచి ఉంచిన 4 టిఫిన్ బాక్స్ బాంబులు, 11 బార్మర్ తుపాకులు, 2 పిస్టల్స్, భారీ ఎత్తున డిటోనేటర్లను గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. డంప్ బయటపడిన నేపధ్యంలో పోలీసులు కూంబింగ్ ను ముమ్మరం చేశారు. -
డంపింగ్ యార్డ్లో పులి చర్మం..
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు డంపింగ్యార్డ్ ప్రాంతంలో గురువారం ప్లాస్టిక్ కవర్లో పులి చర్మం లభించింది. స్థానికులు గుర్తించి కవర్లో నుంచి చర్మాన్ని బయటకు తీసి పరిశీలించారు. దీని పొడవు ఐదడుగులు ఉంది. మరోచోట పులిచర్మం చీకిపోయిన ముక్కలు కనిపించాయి. దీంతో వారు ఈ విషయాన్ని గూడూరు రూరల్ పోలీసులకు తెలియజేశారు. వారు పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. రూ. లక్షల విలువజేసే పులి చర్మాన్ని తమ వద్ద ఉంచుకుంటే వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద జైలుపాలవుతామని ఎవరైనా అక్కడ పడేసి ఉంటారని భావిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -గూడూరు -
మావోయిస్టుల డంపు లభ్యం
-
మావోయిస్టుల డంపు లభ్యం
విద్యాసాగర్రెడ్డి, శ్రుతి ఎన్కౌంటర్ ప్రదేశంలోనే.. ములుగు: రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కలకలం సృష్టించిన విద్యాసాగర్రెడ్డి, శ్రుతిల ఎన్కౌంటర్ జరిగిన వరంగల్ జిల్లా గోవిందరావుపేట మండలం ప్రాజెక్టునగర్ సమీపంలోని దరవాజగుట్ట ఒర్రెలో(వాగులో) శుక్రవారం మావోయిస్టుల డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని జిల్లా క్రైం అడిషనల్ ఎస్పీ జాన్వెస్లీ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దరవాజగుట్ట ఒర్రెలో(వాగులో) మావోయిస్టుల డంపు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ములుగు డీఎస్పీ రాజమహేం ద్రనాయక్, ములుగు, ఏటూరునాగారం సీఐలు శ్రీనివాస్రావు, కిషోర్కుమార్, పస్రా ఎస్సై యాసిన్ సీఆర్పీఎఫ్ బలగాలతో అక్కడికి వెళ్లి వెతికారు. డంప్ను ములుగు పోలీస్స్టేషన్కు తరలించి చూడగా అందులో రెండు 303రైఫిల్స్ గన్లు, 61 రౌండ్స్కు సరిపడా మార్క్-3 బుల్లెట్లు, టు ప్లస్ టు 104 రౌండ్ల బుల్లెట్లు, రెండు మ్యాగ్జీన్లు, నోకియా సెల్ బ్యాటరీ, టెస్టర్, 4 బెల్ట్లు, లైటర్, ఆయస్కాంతం దిక్సూచి ఉన్నాయి. -
భారీ డంప్ స్వాధీనం
ఏవోబీలో భారీగా మావోయిస్టుల డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోరాపూట్ జిల్లా నారాయణ పట్నం బ్లాక్ కుంబర పుట్టి సమీపంలో డంప్ ఉందన్న సమాచారంతో.. కూంబింగ్ నిర్వహించిన పోలీసులు.. భారీ ఎత్తున పేలుడు పదార్థాలు సీజ్ చేశారు. డంప్ లో రెండు ల్యాండ్ మైన్స్, పెద్ద ఎత్తున జిలిటెన్ స్టిక్స్, వైర్ కట్టలను స్వాధీనంచేసుకున్నారు. కాగా.. ఈ కేసుకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదు. -
భారీ ఎర్రచందనం డంప్ స్వాధీనం
కర్నాటక రాష్ట్రంలో అక్రమంగా నిల్వ చేసిన రూ.కోటి విలువైన ఎర్రచందనం దుంగల్ని చిత్తూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుంగలతో పాటు ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఆదివారం బంగారుపాళ్యం, మదనపల్లె టూటౌన్ పోలీసు స్టేషన్ ప్రాంతాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరు ఇచ్చిన సమాచారంతో కర్నాటక రాష్ట్రం దొడ్లబళ్లాపూర్, కడనూర్ గ్రామంలో అంజాద్ కు చెందిన మామిడి తోటలో మూడు టన్నుల ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసుల జాడ పసిగట్టిన అంజాద్ పారిపోయినట్లు సమాచారం. అరెస్టయిన వారిలో చిత్తూరు నగరంలోని జాన్స్గార్డెన్కు చెందిన మహ్మద్ అల్తాఫ్ హుస్సేన్ (36), తమిళనాడు క్రిష్ణగిరి జిల్లా ఉత్తస్గారై తాలూకా కీలమత్తూరుకు చెందిన ఎస్.అరుల్ (25), ఎస్.శరవన (22)లు ఉన్నారు. -
భారీగా ఎర్రచందనం డంప్ స్వాధీనం
వెలుగొండ అడవుల్లో భారీఎత్తున నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంగల డంప్ను స్పెషల్ పార్టీ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ దుంగలను నెల్లూరు జిల్లాకు తరలించినట్లు తెలిసింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు సమీప వెలుగొండ అడవుల్లో గత రెండురోజులుగా స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ కూంబింగ్లో సుమారు రూ.50 లక్షల విలువ చేసే 50 ఎర్రచందనం దుంగలు దొరికినట్లు సమాచారం. గతంలో ఇక్కడ పనిచేసిన ఓ పోలీసు అధికారి పర్యవేక్షణలో డంప్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఎర్రచందనం దుంగలు స్వాధీనం విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. వెలుగొండల్లో ఇంకా ఎర్రచందనం దుంగలు ఉన్నాయనే విశ్వసనీయ సమాచారంతో ముమ్మరంగా గాలింపుచర్యలు చేపడుతున్నారు. -
డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా ప్రజాందోళన
విజయనగరం పురపాలక సంఘం డంపింగ్ యార్డ్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో దానికి వ్యతిరేకంగా జిల్లాలోని డెంకాడ మండలం గునుపూరుపేట వద్ద సోమవారం ఉదయం పలు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. గునుపూర్పేట వద్దనున్న డంపింగ్ యార్డ్ నిర్వహణ సరిగా లేదని, దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆరోపించారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆందోళన చేశారు. -
రోడ్డు పక్కన రేషన్ కందిపప్పు ప్యాకెట్ల గుట్ట
నిరుపేదలకు అందించాల్సిన సబ్సిడీ కందిపప్పును రేషన్ డీలర్లు అక్రమంగా షాపులకు తరలిస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం కాకర్లపల్లి రోడ్డు గాడుదల వాగు వద్ద రోడ్డు పక్కన సోమవారం ఉదయం రేషన్ కందిపప్పు ఖాళీ ప్యాకెట్లు గుట్టగాలుగా పడి ఉన్నాయి. ఈ ఏడాది జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి ఈ ప్యాకెట్లపై తయారీ ముద్రలు ఉన్నాయి. వీటిని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. రెవెన్యూ అధికారులు ఆర్ఐ హుస్సేన్, వీఆర్వోలు కె.శ్రీధర్, వెంకటేశ్వర్లు హడావుడిగా ఆ ఖాళీ ప్యాకెట్లను బస్తాలలో కుక్కి స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు. మండలంలో మూడు నెలల నుంచి సరిగా సబ్సిడీ కందిపప్పు పంపిణీ చేయటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు ధర రూ.120 నుంచి రూ.140వరకు ఉండటంతో అదే అదనుగా భావించిన కొందరు రేషన్ డీలర్లు నిరుపేదల పొట్టగొట్టి షాపులకు విక్రయిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సత్తుపల్లి పట్టణంలోని ఐదు రేషన్ దుకాణాల్లో విచారణ నిర్వహిస్తామని సివిల్ సప్లై డీటీ కరుణాకర్ తెలిపారు. అవసరమైతే పక్క మండలాల చౌక ధరల దుకాణలపైన కూడా విచారణ చేస్తామని అన్నారు. -
డంపింగ్కు స్థలం ఎందుకు లభించట్లేదు?
‘‘నగరంలో మూతపడిన మిల్లు స్థలాల్లో పుట్టగొడుగుల్లా నూతన కట్టడాలు వెలుస్తున్నాయి. అందుకు అవసరమైన స్థలం కావల్సినంత లభిస్తుంది. కానీ ప్రతీ రోజు పోగవుతున్న వేలాది టన్నుల చెత్తను వేసేందుకు అవసరమైన డంపింగ్ గ్రౌండ్లకు మాత్రం స్థలం లభించడం లేదు. పోగైన చెత్తను ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది. అందుకు నగరంలో డంపింగ్ ఏర్పాటు చేసేందుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కు త్వరగా సాధ్యమైనంత స్థలం సమకూర్చి ఇవ్వాలి’’ - ముంబై హైకోర్టు సాక్షి, ముంబై : వాణిజ్య, వ్యాపార సంస్థలు నెలకొల్పేందుకు స్థలం లభిస్తుంది.. కానీ డంపింగ్ గ్రౌండ్లకు స్థలం ఎందుకు లభించడం లేద ని ముంబై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నగరం, ఉప న గరంలోని దేవ్నార్, కాంజూర్మార్గ్, ములుండ్ ప్రాంతాల్లోని డంపింగ్ గ్రౌండ్లో పోగైన చెత్తను నిర్వీర్యం చేయడంలో నియమాలు అమలు చేయడం లేదని గతంలో జరిగిన అనేక విచారణల్లో కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై దాఖలుచేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై న్యాయమూర్తులు అభయ్ ఓక్, అచలియాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. 10 రోజుల్లో నిర్ణయం తీసుకోండి కాంజూర్మార్గ్లోని డంపింగ్ గ్రౌండ్ సామర ్థ్యం పెంచివ్వాలని బీఎంసీ డిమాండ్ చేసింది. డంపింగ్కు అదనంగా స్థలం సమకూర్చి ఇచ్చే అంశం కూడా ప్రభుత్వం వద్ద పెండింగులో ఉందని, అందుకు సంబంధించిన ప్రతిపాదన సీంఎ దేవేంద్ర ఫడ్నవీస్కు పంపించామని ప్రభుత్వం తరపు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. దీంతో 10 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది. కాగా, ప్రస్తుతం నగరం, పట్టణాల్లోని అన్ని డంపింగ్ గ్రౌండ్ల పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే నూతన కట్టడాలకు మంజూరునిచ్చే అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుందని బెంచి స్పష్టం చేసింది. అయినప్పటికి డంపింగ్ గ్రౌండ్కు స్థలం సేకరించలేకపోయాయి. ములుండ్, దేవ్నార్ డంపింగ్ గ్రౌండ్లో చెత్త వేసేందుకు గడువు ఈ ఏడాది నవంబరు వరకు ఉంది. ఆ తరువాత పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాంజూర్మార్గ్ డంపింగ్ గ్రౌండ్లో రోజూ 3,000 మెట్రిక్ టన్నుల చెత్త పోగవుతుంది. మిగతా డంపింగ్ గ్రౌండ్లో సుమారు 7,000 మెట్రిక్ టన్నుల చెత్త పోగవుతోంది. సామర్థ్యానికి మించి చెత్త పోగవుతున్నప్పటికీ ఏ డంపింగ్ గ్రౌండ్లో కూడా నియమాలను పాటించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. -
ఊడ్చిన చెత్త ఊరినెత్తిన
పల్లెల్లో కొరవడిన పారిశుధ్యం పంచాయతీల్లో కానరాని డంపింగ్ యార్డులు నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం మహారాణిపేట (విశాఖ): పల్లెల్లో పారిశుధ్యం కొరవడింది. ఎక్కడికక్కడ చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. స్వచ్ఛభారత్ కార్యక్రమం తొలినాళ్లలో కొందరు చీపుళ్లు పట్టుకుని హడావుడి చేశారు. ప్రభుత్వ కార్యాలయల పరిసరాల్లో ఊడ్చడం, పరిశుభ్రం చేయడం కనిపించేది. దీంతో గ్రామాల స్వరూపం మారిపోతుందని అంతా ఆశించారు. పారిశుధ్యం మెరుగు పడుతుందని ఆశించారు. ఇందులో భాగంగా రాష్ట్రప్రభుత్వం రెండడుగులు ముందుకేసి ప్రతి గ్రామంలోనూ డంపింగ్యార్డులు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకు 20 నుంచి 30 సెంట్లు భూమి కేటాయించాలని తహశీల్దార్లు, సర్పంచ్లను ఆదేశించింది. అధికారుల పట్టించుకోని తనమో, సర్పంచ్ల నిర్లక్ష్యమో కాని జిల్లాలో ఇది అమలు కాలేదు. ఒక్క పంచాయతీలోనూ డంపింగ్యార్డు ఏర్పాటు కాలేదు. అవగాహన లోపంతో గ్రామీణులు ఇళ్లల్లో ఊడ్చిన చెత్తను తెచ్చి రోడ్లపై వేసేస్తున్నారు. దీంతో పారిశుధ్యం కొరవడి పరిస్థితి దయనీయంగా ఉంటోంది. 12 పంచాయతీల్లోనే స్థలాల గుర్తింపు జిల్లాలో 925 పంచాయతీల్లో కేవలం 12మంది సర్పంచ్లు మాత్రమే డంపింగ్యార్డులకు స్థలాలను గుర్తించి ప్రతిపాదనలు పంపించారు. మిగతా వారు పట్టించుకోలేతదు. అసలు ఈ యార్డులు ఎవరు ఏర్పాటు చేయాలన్న దానిపై ఇంత వరకూ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఈ లక్ష్యం నీరుగారిపోతోంది.గ్రామాల్లో పారిశుధ్యం కొరవడి అన్ని వీథుల్లోనూ చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. ఈగలు, దోమలు విజృంభిస్తున్నాయి. జనం రోగాలతో మంచానపడి విలవిల్లాడుతున్నారు. యార్డుల ఏర్పాటు ఎలా అంటే.. డంపింగ్యార్డుకు 20 నుంచి 30 సెంట్లు స్థలం ఉండాలి. దానిని గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్లే గుర్తించాలి. పంచాయతీ స్థలం లేకపోతే రెవెన్యూ అధికారులు కేటాయించాలని సర్పంచ్ మండల తహశీల్దార్కు లేఖ రాయాలి. అప్పుడు రెవెన్యూ అధికారులు ఆ పంచాయతీ పరిధిలో 30సెంట్లు స్థలం గుర్తించి ఇవ్వాలి. ఉపాధిహామీ పథకంలో ఈ డంపింగ్యార్డు ఏర్పాటు చేయాలి. గ్రామంలో ఊడ్చిన చెత్తనంతటినీ తెచ్చి ఇక్కడ వేయాలి. ఈ విధానం ఏ మండలంలోనూ కానరావడం లేదు. అసలు ఈ డంపింగ్యార్డులు గురించి పంచాయతీ అధికారులే పట్టించుకోవడం లేదు. గ్రామపంచాయతీలపై ఈవోపీఆర్డీల పర్యవేక్షణ లేదు. ఇబ్బంది కరంగా ఉంది శ్రీరాంపురంలో పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ప్రాంతాల్లో రోడ్డుకు ఇరు వైపులా రోజూ చెత్త వేసేస్తున్నారు. వ ర్షం పడితే ఇబ్బందిగా ఉంటోంది. డంపింగ్ యార్డు ఏర్పాటుకు చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటకయినా అధికారులు స్పందించాలి. రోడ్డు పక్కన చెత్త వేయకుండా చూడాలి. -ఎం.శ్రీనివాసరావు, శ్రీరాపురం -
‘స్వచ్ఛ’ పురపాలికలు
హన్మకొండ: మున్సిపాలిటీల్లో రోజు పోగవుతున్న చెత్తను ప్రస్తుతం డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. అక్కడ చెత్తను మూకుమ్మడిగా తగలబెడుతున్నారు. ఈ విధానం వల్ల వాయుకాలుష్యం ఏర్పడుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలంలో డంప్యార్డు పరిసర ప్రాంతాల్లో ఉన్న జనావాసాలలో దుర్వాసనతోపాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పశువులు, కోళ్లు, పక్షులు తదితర జీవాలు మృత్యువాత పడుతున్నాయి. ఫలితంగా డంపింగ్ యార్డులపై ఎక్కువగా ఆధారపడకుండా చెత్త వల్ల తలెత్తే సమస్యలకు మెరుగైన పరిష్కార మార్గంగా తడిపొడి చెత్త సేకరణ విధానం అమలుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. జిల్లాలో ఉన్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్తోపాటు మహబూబాబాద్, జనగామ మున్సిపాలిటీలు నర్సంపేట, పరకాల, భూపాలపల్లి నగరపంచాయతీలలో తడిపొడి చెత్త సేకరణ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఒక కార్పొరేషన్ ఐదు మున్సిపాలిటీలలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తొలిదశలో 2015 ఆగస్టు 20 నుంచి వరంగల్ కార్పొరేషన్ పరిధిలో కార్మికులకు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, ట్రైనింగ్, రీసెర్చ్ ఇన్సిస్టిట్యూట్ (ఈపీటీఆర్ఐ), హైదరాబాద్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రోజుకు వంద మంది వంతున పారిశుద్ధ్య కార్మికులకు తడిపొడి చెత్తసేకరణలో శిక్షణ ఇస్తున్నారు. వరంగల్ నగరంలో శిక్షణ, అవగాహన తరగతులు ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 15 వరకు కొనసాగుతారుు. వరంగల్ కార్పొరేషన్లో శిక్షణ పూర్తై తర్వాత మహబూబాబాద్, జనగామ, పరకాల, నర్సంపేట, భూపాలపల్లిలో పారిశుద్ధ్య కార్మికులకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగిస్తామని ఈపీటీఆర్ఐ ఇంజనీర్ రాహుల్రెడ్డి తెలిపారు. సమర్థంగా అమలు చేయాలి.. తడిపొడి చెత్త సేకరణ విధానంలో ఇళ్ల నుంచి నేరుగా చెత్తను సేకరించాలి. వీటితో తడి చెత్తద్వారా కంపోస్టు ఎరువులు, విద్యుదుత్పత్తి ప్లాంట్లను నెలకొల్పాలి. పొడి చెత్త కేటగిరీలోకి వచ్చే ప్లాస్టిక్ వస్తువులు, కవర్లను వేలం పాట ద్వారా అమ్మాలి. ఈ పద్ధతిని సమర్థంగా అమలు చేయడం ద్వారా మున్సిపాలిటీల్లో చెత్త కుండీలు, మురికికుప్పలు తగ్గిపోతాయి. డంపింగ్యార్డుల ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. కంపోస్టు ఎరువుల అమ్మకం, పొడిచెత్త వేలం పాట ద్వారా వచ్చిన ఆదాయాన్ని మున్సిపాలిటీ అభివృద్ధి, పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించవచ్చు. తడిపొడి చెత్త సేకరణ విధానంలో వస్తున్న ఆదాయాన్ని గడిచిన పది నెలలుగా తాండూరు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి వినియోగిస్తున్నారు. వివేక్యాదవ్ మున్సిపల్ కమిషనర్గా ఉన్న కాలంలో గ్రేటర్ పరిధిలో తడిపొడి చెత్త సేకరణ పద్ధతిని సమర్థంగా అమలు చేశారు. జాతీయ స్థారుులో వరంగల్కు గుర్తింపు వచ్చింది. సినీనటుడు అమీర్ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘సత్యమేవ జయతే’లో వరంగల్కు ప్రశంసలు దక్కాయి. వివేక్యాదవ్బదిలీపై వెళ్లగానే ఈ కార్యక్రమం నిర్వీర్యమైంది. చెత్త సేకరణకు కేంద్ర నిధులకు లంకె.. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పేరుతో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చెత్త సేకరణలో మెరుగైన పద్ధతులను అవలంభించే మున్సిపాలిటీలకు ప్రోత్సాహకాలు, అదనపు నిధులు అందించేందుకు సిద్ధంగా ఉంది. ఆఖరికి స్మార్ట్సిటీ, అమృత్ పట్టణాల ఎంపిక ప్రక్రియలో మెరుగైన చెత్త సేకరణ పద్ధతికి ప్రాధాన్యత ఇచ్చింది. తడిపొడి చెత్త విధానం అవలంభిస్తున్న మున్సిపాలిటీలకు స్కోర్ ఇస్తోంది. త్వరలో మున్సిపాలిటీల్లో ఉన్న మురికివాడల రూపు రేఖలు మార్చేందుకు హౌజింగ్ ఫర్ ఆల్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తడిపొడి చెత్త సేకరణ పద్దతిని సమర్థంగా అమలు చేయడం ద్వారా హసింగ్ ఫర్ ఆల్ పథకంలో చోటు సాధించేందుకు ఇతర జిల్లాలకు చెందిన మున్సిపాలిటీలను వెనక్కినెట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది. -
క్షమించు అమ్మా..
అమ్మ... స్వచ్ఛమైన ప్రేమకు ప్రతి రూపం.. నిస్వార్థతకు నిలువెత్తు నిదర్శనం.. తాను దహించుకుపోతూ.. తన సంతానానికి వెలుగునిస్తుంది. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు.. స్వార్థించడం.. సాధించడం.. సాగనంపడం తప్పితే.. అలాంటి హృదయ విదారకర సంఘటన ఇది.. కాటికి కాలు చాపిన కన్నతల్లిని నిర్ధాక్షిణ్యంగా వీధి పాలు చేసిన సంతానం వైనమిది. ఈ సంఘటన చూసిన వారికి చెమ్మ గిల్లాయే తప్పితే.. పెంచి పెద్ద చేసిన ఆమె సంతానానికి మాత్రం ఈమె మా అమ్మ అని గుర్తుకురాలేదు. గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఆటోలో మారేడుపూడి కూడలి వద్దకు వచ్చారు. అందులో 85 ఏళ్ల వయసున్న ఓ వృద్ధురాలిని రోడ్డు పక్కనే పడేశారు. ఇది గమనించిన స్థానికులు ఆటో డ్రైవర్ను పిలుస్తుండగానే క్షణంలో ఆటో వెళ్లిపోయింది. వృద్ధురాలు దుస్థితి ప్రత్యక్షంగా చూసిన వారిని కలచి వేసింది. వెంటనే ఆమెకు సపర్యలు చేసి, వివరాలు అడిగే ప్రయత్నం చేశారు. ఆమె ఏదో చెప్పాలని ప్రయత్నించినప్పటికీ.. ఫలితం లేకపోయింది. స్థానికులు కుటుంబ సభ్యులను తిట్టిపోస్తూ.. వారికీ ఇటువంటి దుస్థితి ఏర్పడాలని శాపనార్థాలు పెట్టారు. మార్కెట్ కమిటీ మాజీ డెరైక్టర్ సాలాపు మోహన్ పరవాడ పోలీసులకు సమాచారం అందించి, అంబులెన్స్లో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. - అనకాపల్లి రూరల్ -
ఎదురుదెబ్బలు
మావోయిస్టులకు కలసి రాని కాలం తూర్పులో భారీ డంప్ స్వాధీనం దండకారణ్యం ఎన్కౌంటర్లో ముగ్గురు మృతిల కొయ్యూరు: మావోయిస్టులకు పీఎల్జీఏ వారోత్సవాల కాలం కలిసిరావడం లేదు. వరుసగా ఎదురుదెబ్బలు త గులుతున్నాయి. దళసభ్యుల వ్యూహాలను ముందుగానే పసిగట్టిన పోలీసులు వారోత్సవాలకు సిద్ధమయ్యే ప్రాం తాల్లో పెద్ద ఎత్తున మొహరిస్తున్నారు. వారోత్సవాల రెం డో రోజునే విశాఖ- తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉపయోగించే ఆయుధాల భారీ డంప్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలోనే మావోయిస్టుల అగ్రనేతలు కూడా ఉన్నారన్న పక్కా సమాచారంతో ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)తోపాటు ఛత్తీస్గఢ్ సరిహద్దులను బలగాలు జల్లెడపడుతున్నాయి. ఈనేథ్యంలో ఒడిశా-ఛత్తీస్గఢ్ సరిహద్దులో శుక్రవారంనాటి ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. మావోయిస్టులు అనుకున్నవి చేయలేకపోతున్నారు. వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని వారం ముందు నుంచి ప్రచారం చేశారు. దానిని తిప్పి కొట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అంతటా భారీగా బలగాలను మోహరించారు. పోలీసులు లక్ష ్యంగా మందుపాతర పేల్చాలన్న దళసభ్యుల వ్యూహాన్ని పోలీసులు వమ్ము చేశారు.తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం మండలం బొడ్డులంక సమీపంలో గొర్లోడు వద్ద భారీడంప్ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో విలువైన రాకెట్ లాంచర్లు, జిలెటిన్ స్టిక్స్ ఉన్నాయి. పేలుడు పదార్థాలు అమోనియం, పొటాషియం నైట్రేట్లను గు ర్తించారు. అదే దారిలో కూంబింగ్కు వస్తారని ఊహించి మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను పోలీసులు గుర్తించడంతో పెద్ద ముప్పు తప్పింది. తాజగా శుక్రవారం ఏవోబీని అనుకుని ఉన్న దండకారణ్యంలో కూడా పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ముగ్గురు దళసభ్యులు మరణించినట్టుగా చెబుతున్నారు. మావోయిస్టులకు అడ్డా అయిన జీకేవీధి మండలం కుంకుంపూడిని రెండు రోజుల కిందట నర్సీపట్నం ఓఎస్డీ విశాల్గున్నీ సందర్శించారు. వారోత్సవాలప్పుడు ఓఎస్డీ స్థాయి అధికారి ఆ ప్రాంతానికి వెళ్లడం విశేషం. అంటే పరోక్షంగా మావోయిస్టులకు సవాల్ విసిరారు. జీకేవీధి, కొయ్యూరు,చింతపల్లి, జీ మాడుగుల, ముంచంగిపుట్టు మండలాల్లో పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ చేపడుతున్నారు. మావోయిస్టులు స్తూపాలను ఆవిష్కరిస్తారనే అనుమానం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు మొహరిస్తున్నారు. కిందటి ఏడాది నుంచి మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వీరవరం ఘటన లో గిరిజనుల చేతిలో సహచరులను కోల్పోవలసి వచ్చిం ది. అనంతరం ఆ ప్రాంతంలో లొంగుబాట్లు పెరిగాయి. జూన్ 20న రంగబయలు పంచాయతీలో జరిగిన ఎన్కౌంటర్లో సూర్యం అనే మావోయిస్టు మరణించాడు. ఇలా మావోయిస్టులకు వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. కేంద్ర కమిటీ సభ్యులు నంబళ్ల కేశవరావు మన్యానికి వచ్చినప్పటి నుంచి పోలీసులు అప్పమత్తమయ్యారు. మావోయిస్టుల కార్యక్రమాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. -
మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం
వై రామవరం : తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన డొంకరాయి పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం భారీ డంప్ బయటపడింది. అటవీప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న యాంటీ నక్సల్ స్క్వాడ్ దళాలకు డంప్ లభ్యమైనట్లు సమాచారం. అందులో పేలుడు పదార్ధాల తయారీలో వాడే అమోనియం నైట్రేట్, రాకెట్ లాంచర్ల తయారీలో వాడే సామగ్రి పెద్ద ఎత్తున ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డంప్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కాకినాడ హెడ్క్వార్టర్కు తరలించనట్టు తెలుస్తోంది -
టెర్రార్...
- గ్రామీణుల పాలిట శాపంగా టెర్రాఫార్మా - చెరువులు, కుంటలకు చేరుతున్న కెమికల్ నీరు - మృత్యువాత పడుతున్న పశుపక్షాదులు - అస్వస్థత బారిన ప్రజలు లక్ష్యం సమున్నతం... ఆచరణే అధమం.. ఫలితం గ్రామీణుల బతుకు ఛిద్రం! ఇది దొడ్డబళ్లాపురం సమీపంలో ఏర్పాటు చేసిన టెర్రాఫార్మా ప్రస్తుత ముఖచిత్రం. చెత్తనుంచి ఎరువులు తయారు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ప్రస్తుతం దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామీణుల పాలిట శాపంగా మారింది. నిబంధనలు తుంగలో తొక్కి అడ్డగోలుగా ఇక్కడ చెత్తను డంప్ చేస్తుండడంతో వింత రోగాల బారిన పడి గ్రామీణులు విలవిల్లాడుతున్నారు. పశుపక్షాదుల మృత్యుఘోషకు అంతులేకుండా పోతోంది. ఒక ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలనే పాలకుల నీతి.. మరో ప్రాంత ప్రజలను అన్యాయానికి గురిచేస్తోంది. దొడ్డబళ్లాపురం : బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) పరిధిలో నిత్యం పోగవుతున్న టన్నుల కొద్ది చెత్తను దొడ్డబళ్లాపురం తాలూకాలోని గుండ్లహళ్లి వద్ద టెర్రాఫార్మాలో డంపింగ్ చేస్తున్నారు. చెత్త నుంచి ఎరువులు తయారు చేయాలనే లక్ష్యంతో టెర్రాఫార్మాను ఏర్పాటు చేశారు. బెంగళూరు నుంచి తరలివస్తున్న చెత్త మొత్తాన్ని రీసైక్లింగ్ చేసేందుకు ఇక్కడి యంత్రాలకు తగిన సామర్థ్యం లేకపోవడంతో రోజూ చెత్త పేరుకుపోతూ వస్తోంది. నిబంధలను ఉల్లంఘిస్తూ ఇక్కడ చెత్తను డంప్ చేస్తున్నారు. వాస్తవానికి తడి, పొడి చెత్తను ఇక్కడ రీసైక్లింగ్ చేయడం ద్వారా ఎరువులను తయారు చేస్తారు. అయితే బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న లెక్కకు మించిన రసాయనిక పరిశ్రమల వ్యర్థాలను సైతం ఇక్కడ డంప్ చేస్తున్నారు. నిబంధనల ప్రకారమైతే రసాయనిక వ్యర్థాలను ఆయా పరిశ్రమల వద్దనే రీసైక్లింగ్ చేసి తరలించాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి రీసైక్లింగ్ చేయని రసాయనిక వ్యర్థాలను ఇక్కడ డంప్ చేస్తుండడంతో అవి భూమిలో కలిసి విషపూరితంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కురుస్తున్న వర్షాలకు విషపూరితమైన రసాయనిక నీరుగా మారి సమీపంలోని చెరువులు, కుంటల్లోకి చేరుకుంటున్నాయి. అంతేకాక భూగర్భ జలాల్లో సైతం ఇవి కలిసి బోరుబావుల్లోకి చేరుకుంటున్నాయి. ఇటీవల చుట్టపక్కల పాతిక గ్రామాలకు చెందని పశువులు చెరువులు, కుంటల్లోని నీరు తాగి చూస్తుండగానే పొట్ట ఉబ్బి వృత్యువాత పడుతుండడంతో గ్రామీణుల వేదనకు అంతులేకుండా పోయింది. మేతకు వెళ్లిన పశువులు తిరిగి ఇంటికి చేరుకునే క్రమంలో మార్గమధ్యలోనే మరణిస్తుండడం పాడిరైతులను మరింత కృంగదీస్తోంది. మరో వైపు వాన నీటికి చెత్త తడిసి మరింత దుర్వాసన వ్యాపిస్తోంది. ఈ వాసన భరించలేక నాలుగు రోజుల్లోనే పదుల సంఖ్యలో గ్రామీణులు ఆస్పత్రుల పాలయ్యారు. ఇదంతా టెర్రాఫార్మాకు అతి సమీపంలో ఉన్న సక్కరెగొల్లహళ్లి, కాశీపాల్య, గుండ్లహళ్లి గ్రామాల్లో మరీ ఎక్కువగా ఉంది. పశువులు, మేకలు, గొర్రెలతో పాటు కోళ్లు, పిట్టలు కూడా వృత్యువాత పడుతున్నాయి. నీరు తాగిన కొద్ది సేపటికి పొట్ట ఉబ్బి, ముక్కు, నోటి వెంట రసాయనిక మిశ్రీత నీరు కారుతుండగా విలవిల్లాడుతూ తమ కంటి ముందే పశువులు మరణిస్తున్నాయని గ్రామీణులు వాపోతున్నారు. దుర్వాసన వెదజల్లుతుండడంతో భరించలేక ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న పొలాలను దుక్కి చేసుకోలేక పోతున్నట్లు రైతులు తెలిపారు. ప్రశాంతంగా భోజనం కూడా చేయలేని స్థితిలో ఉన్నామని, ఇప్పటికైనా అధికారులు స్పందించి టెర్రాఫార్మా బారి నుంచి తమను కాపాడాలని పలువురు గ్రామీణులు వేడుకుంటున్నారు. కాగా, పాడి పశువులను కోల్పోయిన బాధిత రైతులు నాగరాజు, ముద్దన్న, జరీనా తదితరులు టెర్రాఫార్మా డంపింగ్ సెంటర్ నిర్వాహకులపై బెళవంగల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
బాలాజీనగర్కు చిరుతల భయం
తిరుమలలో చిరుతల సంచారం పెరిగిపోయింది. బాలాజీనగర్ వాసులు కంటి మీద కునుకులేకుండా భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సివస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. తిరుమల: బాలాజీనగర్లోని తూర్పు ప్రాంతంలో మూడు చిరుతలు సంచరిస్తున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి కాకుల కొండ మీదుగా డంపింగ్యార్డ్ వద్ద అవి తిరుగుతాయి. చీకటి పడిన తర్వాత స్థానికులు నివాసం ఉండే బాలాజీనగర్ తూర్పు ప్రాంతానికి చేరుకుంటాయి. రాత్రి 10 గంటలకు జనం చప్పుడు తగ్గిన తర్వాత రాకపోకలు సాగిస్తున్నాయి. గంటల తరబడి తూర్పు ప్రాంతం నుంచి పాచికాల్వ గంగమ్మ గుడి ప్రాంతం వరకు ఉండే ఇళ్ల ప్రాంతాల్లో చిరుతల సంచారం పెరిగిపోయింది. పొంచిఉన్న ప్రమాదం బాలాజీనగర్ ప్రాంతంలో పగలు, రాత్రి లేకుండా చిరుతలు సంచరిస్తున్నాయి. ఇవి ఎవరిపైనైనా దాడి చేసే అవకాశం ఉంది. బాలాజీనగర్ వాసులు తూర్పుప్రాంతంలోని నీటి గుంట వద్ద బట్టలు ఉతికేందుకు వెళుతుంటారు. ఆ ప్రాంతం అంతా దట్టమైన చెట్లు, ముళ్ల పొదలతో నిండి ఉంది. సీసీ కెమెరా పెట్టే ఆలోచనలో ఫారెస్ట్ అధికారులు ఇటీవల కాలంలో చిరుతల సంచారం పెరిగిపోవడంతో సీసీ కెమెరాలు పెట్టాలని ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. నిత్యం అవి వచ్చివెళ్లే దారుల్లో సీసీ కెమెరాలు పెట్టి వాటి జాడలు గుర్తించాలని అధికారులు నిర్ణయించారు. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. చిరుతల సంచారం నిర్దారించాక పరిస్థితి అధికమిస్తే వాటిని పట్టుకునేందు ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. -
డంపింగ్ యార్డు మార్పునకు కృషి
పులివెందుల : మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపురంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు మార్పునకు కృషి చేస్తానని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన వెంకటాపురం ప్రజల తరఫున.. ప్రస్తుతం చెత్తను వేస్తున్న ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలు పురపాలక ప్రాంత పరిధిలోని చెత్తను ఇక్కడ వేయడం వల్ల వర్షాకాలంలో వ్యాధులు సోకే ప్రమాదం ఉందని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అదే విధంగా పశువుల మేత కోసం వదిలిన ఖాళీ స్థలంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం వల్ల మూగ జీవాలకు మేత కరువయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అనంతరం నామాలగుండు ప్రాంతంలోని కొండ వద్ద ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రజలు సూచించారు. దీంతో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డితోపాటు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ నాయకులు వైఎస్ భాస్కర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ విజయసింహారెడ్డి కలిసి నామాలగుండు రోడ్డులోని కొండ కటింగ్ వద్ద స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఇక్కడ డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎటువంటి సమస్య ఉండదని మున్సిపల్ కమిషనర్కు ఎంపీ సూచించారు. ఈ స్థలం డీకేటీదని తమకు రాతపూర్వకంగా ఇస్తే ఇక్కడ ఏర్పాటుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పరిశీలిస్తామన్నారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళతా :యార్డు మార్పునకు కలెక్టర్ దృష్టికి తీసుకెళతానని ఎంపీ చెప్పారు. ఇక్కడ డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదన్నారు. కావున తక్షణమే వెంకటాపురం నుండి ఇక్కడికి మార్పు చేయాలని ఆయన ఆదేశించారు. అనంతరం మున్సిపల్ వర్సెస్ విద్యుత్ శాఖ అనే శీర్షికన సాక్షిలో ప్రచురించిన కథనానికి స్పందించిన ఆయన ట్రాన్స్కో సీఎండీతో ఫోన్లో చర్చించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్గా విడతల వారీగా బిల్లులు చెల్లిస్తామని సూచించారు. సామరస్యంగా ఇరు శాఖల అధికారులు సమన్వయంగా పని చేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, కౌన్సిలర్ వరప్రసాద్, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు ఈశ్వరయ్య, వెంకటాపురం గ్రామస్తుడు ఆంజనేయులునాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
పుణేలో రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
బస్సును ఢీకొన్న డంపర్, మరో వాహనం సాక్షి, ముంబై: పుణేలో రహదారి రక్తమోడింది. దేహు-కాత్రజ్ రోడ్డు మలుపులోని వడ్గావ్ బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గురువారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో వడ్గావ్ బ్రిడ్జిపై ఈ సంఘటన చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ డంపర్ ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొన్నది. ఈ ఘటనలో బస్సు కూడా మరో వాహనాన్ని ఢీ కొట్టడంతో వెనకాల వస్తున్న మరో రెండు మోటర్సైకిళ్లు ప్రమాదంలో చిక్కుకుపోయాయి. ఘటన స్థలంలోనే నలుగురు మరణించగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడిన ముగ్గురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. మృతులు సాతారా జిల్లా జావలీ గ్రామానికి చెందిన సుభాశ్ చౌదరి, బాలాజీ రాథోడ్, రవీంద్ర సావంత్, సారిక, రేవతి సావంత్, గైక్వాడ్ మహంబర్గా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన డంపర్ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన అనంతరం దేహు-కాత్రజ్ రోడ్డుపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్థంబించిపోయింది. -
అక్రమ ఇసుక దందాపై దాడిశెట్టి పోరు
బొద్దవరం డంపింగ్యూర్డులో నిల్వల్ని గుర్తించిన ఎమ్మెల్యే రాజా స్థానికాధికారులు స్పందించకపోవడంతో కలెక్టర్, ఆర్డీఓలకు ఫిర్యాదు రైతులు, పార్టీ నాయకులతో ఏడున్నర గంటలకు పైగా యూర్డులోనే నిరీక్షణ చివరికి వేలాది క్యూబిక్ మీటర్ల ఇసుక, 11లారీలు, రెండు జేసీబీల సీజ్ తుని :కోట్ల విలువ చేసే ఇసుక అక్రమంగా తరలిపోతుంటే అవినీతితో, అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతో పట్టించుకోని అధికారులను తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తన పట్టుదలతో దిగివచ్చేలా చేశారు. అక్రమ ఇసుక నిల్వలను స్వయంగా గుర్తించిన ఆయన వాటిని స్వాధీనం చేసుకునే వరకూ పట్టువిడవ లేదు. ఏడున్నర గంటలపాటు అధికారుల కోసం నిరీక్షించి మరీ వేలాది క్యూబిక్ మీటర్ల అక్రమ ఇసుక నిల్వలను, తరలించడానికి ఉద్దేశించిన వాహనాలను పట్టించారు. ఇసుక అక్రమ దందాతో తాండవ ఒడ్డున పంట భూములు కోల్పోతున్న రైతులను ఆదుకోవాలని సంకల్పించిన ఎమ్మెల్యే రాజా రైతులు, మండల వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి శనివారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో కోటనందూరు మండలం బొద్దవరం వెళ్లారు. తాండవ నదిలో తవ్విన ఇసుకను నిల్వచేసిన డంపింగ్ యార్డుకు వెళ్లి, 11 లారీలు, రెండు జేసీబీలతోపాటు వేలాది క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలను గుర్తించారు. దీనిపై స్థానిక రెవెన్యూ, మండల పరిషత్ అధికారులకు సమచారమిచ్చారు. గంటలు గడుస్తున్నా స్థానిక అధికారులు స్పందించకపోవడంతో కలెక్టర్ అరుణ్కుమార్, పెద్దాపురం ఆర్డీవో విశ్వేశ్వరరావులకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందించి ఇసుక నిల్వలు, వాహనాలను సీజ్ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు వచ్చే వరకు కదిలేది లేదన్న ఎమ్మెల్యే రాత్రి తొమ్మిది గంటల వరకూ అక్కడే ఉండిపోయూరు. కాగా అధికార పార్టీ పెద్దలు చీకటిపడ్డాక ఇసుక అక్రమార్కులను ఉసిగొల్పి ఎమ్మెల్యేను, గ్రామస్తులను బెదిరించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో ఎస్పీ, డీఎస్పీలకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, తహశీల్దారు పి.వరహాలయ్య, ఎంపీడీఓ మధుసూదన్లు వచ్చి ఇసుక తరలింపుకు ఉపయోగిస్తున్న వాహనాలను సీజ్ చేస్తామని చెప్పారు. అయితే లిఖితపూర్వకంగా చెబితేనే అక్కడ నుంచి కదులుతానని ఎమ్మెల్యే రాజా తేల్చిచెప్పడంతో చివరికి సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. ఇదంతా జరిగే సరికి రాత్రి 10 గంటలైంది. రైతుల శ్రేయస్సుకు రాజీలేని పోరు: ఎమ్మెల్యే రాజా తాండవ నదిలో ఇసుకను గృహనిర్మాణదారుల కోసమంటూ పంచాయతీ జారీ చేసే పర్మిట్లను అడ్డుపెట్టుకుని రోజుకు రూ.కోటి పైగా విలువ చేసే ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఎమ్మెల్యే రాజా విలేకరులకు చెప్పారు. కోటనందూరు నుంచి తుని మండలం వరకూ ఉన్న తాండవలో సుమారు పదిచోట్ల అధికారపార్టీ అండదండలతో ఇసుక మాఫియూ చెలరేగిపోతోందన్నారు. ఆరునెలలుగా ఇది జరుగుతున్నా ఒక్క అధికారీ పట్టించుకోలేదని ఆరోపించారు. విచ్చలవిడి తవ్వకాలతో నదీగమనం మారి సాగు భూములు నదిలో కలిసిపోతున్నాయని, బోరుబావుల్లో నీటి నిల్వలు తగ్గుతున్నాయని అన్నారు. రైతుల శ్రేయస్సు కోసం ఇసుకమాఫియాను అరికట్టేంత వరకూ రాజీ లేని పోరాటం చేస్తానన్నారు. ఎమ్మెల్యే వెంట మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ గొర్లి రామచ ంద్రరావు, మాజీ ఎంపీపీ గొర్లి అచ్చియ్యనాయుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు పెదపాటి అమ్మాజీ, పార్టీ నాయకులు దాడి బాబులు, వేముల రాజబాబు, చింతకాయల చినబాబ్జి, లగుడు శ్రీను, లంకప్రసాద్, ఎల్లపు సూర్యనారాయణ, సుర్ల అప్పలనాయుడు, కూరపాటి రమణ, బర్రి అప్పారావు, రేలంగి రమణాగౌడ్, మోతుకూరి వెంకటేష్, పలువురు రైతులు ఉన్నారు. ప్రోటోకాల్ను విస్మరించిన అధికారులు ఎమ్మెల్యే రాజా, రైతులు కలసి అనధికార ఇసుక నిల్వలపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా అధికారులు సకాలంలో స్పందించలేదు. చివరికి డిప్యూటీ తహశీల్దార్ ఆర్.వెంకటేశ్వరరావు వచ్చి లారీలు, జేసీబీలు,ఇసుక నిల్వల వివరాలను నమోదు చేశారు. స్థానిక పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నిం చగా రెండు నిమిషాలు మాట్లాడాక స్విచాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాగా ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేకి బందోబస్తు ఇవ్వవలసిన పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. ఎమ్మెల్యే బొద్దవరం వచ్చిన అరగంటకు వచ్చిన కోటనందూరు ఎస్సై గోపాలకృష్ణ పది నిమిషాల్లోనే ఉన్నతాధికారుల నుంచి ఫోన్ రాగా వెళ్లిపోయారు. అనంతరం తహశీల్దార్, ఎంపీడీఓ కూడా ఇలాగే వ్యవహరించారు. -
మేడిపల్లి ఓసీపీలో డంపర్ బోల్తా
గోదావరిఖని : సింగరేణి ఆర్జీ-1 డివిజన్ పరిధిలోని మేడిపల్లి ఓసీపీలో బుధవారం మధ్యాహ్నం సీ-28 నెంబర్ గల డంపర్ బోల్తా పడింది. ప్రాజెక్టులోని ఫేజ్-1 ఏరియా 4వ సీమ్ వద్ద బొగ్గు లోడుతో వెళ్తున్న డంపర్ వాహనంలో స్టీరింగ్ రాడ్ లాక్ అయి తిరగకపోవడంతో పక్కనున్న మట్టి బర్మ్ను ఢీకొట్టి డంపర్ బోల్తాపడింది. దీంతో వాహనంలో బ్యాటరీలు ఆపరేటర్ కొమ్మిడి రాజిరెడ్డిపై పడడంతో అతను స్వల్పంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
భూసేకరణే అస్త్రం
♦ కడియం పోతవరంలో 28 ఎకరాలు గుర్తింపు ♦ కలెక్టర్కు లేఖ రాసిన మునిసిపల్ కమిషనర్ ♦ నెలాఖరు నాటికి ల్యాండ్ అక్విజేషన్ పూర్తిచేయాలని నిర్ణయం విజయవాడ సెంట్రల్ : డంపింగ్ యార్డు స్థలం కోసం భూసేకరణ (ల్యాండ్ అక్విజేషన్) అస్త్రాన్ని ప్రయోగించేందుకు కార్పొరేషన్ అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం జి.కొండూరు మండలం కడియం పోతవరం గ్రామంలోని 28 ఎకరాల భూమిని ఎంపిక చేశారు. భూ సేకరణకు అనుమతులు మంజూరు చేయాల్సిందిగా కలెక్టర్ బాబు కు కమిషనర్ జి.వీరపాండియన్ లేఖ రాశారు. సాధ్యమైనంత త్వరలోనే భూ సేకరణ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కడియం పోతవరం ఎంపిక రాజధాని నేపథ్యంలో నగరపాలక సంస్థకు డంపింగ్ యార్డు అత్యవసరమైంది. గతంలో కేటాయించిన రూ.9 కోట్లతో భూమిని కొనాలని అధికారులు భావించారు. ఎకరం భూమి రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల ధర పలకడంతో బేరం కుదరలేదు. చివరి అస్త్రంగా భూసేకరణ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగానే నాలుగు రోజుల కిందట అధికారుల బృందం కడియం పోతవరం ప్రాంతంలో భూముల్ని పరిశీలించి సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఇండస్ట్రీ జోన్లో ఉన్న 28 ఎకరాలను ఎంపిక చేసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఎకరం రూ.11 లక్షల నుంచి రూ.15 లక్షలకు మించకుండా భూ యజమానికి నష్టపరిహారం ఇవ్వాలన్న యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. యజమాని ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నట్లు తెలుస్తోంది. భూమి ఒకరిదే కాబట్టి ఇబ్బందులు ఎదురుకావనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఇన్నాళ్లకు మోక్షం డంపింగ్ యార్డు స్థల సేకరణ కోసం గడిచిన రెండేళ్లుగా అధికారులు వెతుకులాట సాగిస్తున్నారు. జి.కొండూరు మండలం కడియం పోతవరం గ్రామంలో స్థలాలను గత ఏడాది అక్టోబర్లో నాటి కమిషనర్ సి.హరికిరణ్, మేయర్ కోనేరు శ్రీధర్ పరిశీలించారు. సైంటిఫిక్ డంపింగ్ యార్డుకు భూమి అనుకూలంగా ఉందని తేల్చారు. రైతులు ఎకరం కోటి రూపాయలపైన ధర చెప్పడంతో అధికారులు అవాక్కయ్యారు. దీంతో స్థల సేకరణ సమస్యగా మారింది. జనవరిలో బాధ్యతలు చేపట్టిన కమిషనర్ వీరపాండియన్ నెలరోజుల్లో డంపింగ్ యార్డు స్థల సేకరణకు చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. భూముల ధర పైపైకి ఎగబాకడంతో ల్యాండ్ అక్విజేషన్పై దృష్టిసారించారు. ఈనెలఖరుకు భూసేకరణ పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రి డెరైక్షన్లోనే.. నగరంలో ప్రస్తుతం 10.74 లక్షల ప్రజలు నివసిస్తున్నారు. రాజధాని నేపథ్యంలో మరో రెండు లక్షల జనాభా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రోజుకు 550 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. జనాభా పెరుగుదల నేపథ్యంలో దీని పరిమాణం పెరుగుతుందనడంలో సందేహం లేదు. ఈ క్రమ ంలో నగరానికి సైంటిఫిక్ డంపింగ్ యార్డు తప్పనిసరైంది. భూ సేకరణ సమస్యపై మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ వీరపాండియన్లు మునిసిపల్ మంత్రి పి.నారాయణ దృష్టికి తీసుకెళ్లారు. భూముల ధరలు పెరిగిన నేపథ్యంలో భూసేకరణ అస్త్రాన్ని ప్రయోగించాల్సిందిగా మంత్రి సూచించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు పావులు కదిపినట్లు సమాచారం. నిధులు రెడీ జేఎన్ఎన్యూఆర్ఎంలో భాగంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పథకం కింద నగరపాలక సంస్థ డంపింగ్ యార్డు స్థలసేకరణ కోసం 2007లోనే రూ.9 కోట్లు కేటాయించారు. రవిబాబు కమిషనర్గా ఉన్న సమయంలోనే ఈ నిధుల్ని రెవెన్యూ అధికారుల వద్ద డిపాజిట్ చేశారు. ప్రస్తుతం అవి ఖజానాలో మూలుగుతున్నాయి. కాబట్టి భూసేకరణకు నిధుల సమస్య లేదని అధికారులు చెబుతున్నారు. కడియం పోతవరంలోని 28 ఎకరాల భూములు డంపింగ్ యార్డుకు అనుకూలంగా ఉన్నాయని సిటీప్లానర్ ఎస్.చక్రపాణి ‘సాక్షి’కి చెప్పారు. ఈ మేరకు కలెక్టర్కు లేఖ రాశామని, అనుమతి వచ్చాక భూమి సేకరిస్తామన్నారు. -
ఈ చెత్త మాకొద్దు..
విజయనగరం : ఈ చెత్త మాకొద్దంటూ పార్వతీపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఎదుట బుధవారం రావికోనబట్టివలస గిరిజనులు ఆందోళన చేశారు. పార్వతీపురం మున్సిపాలిటీ చెత్తను డంపింగ్ చేయడానికి రావికోనబట్టివలస వద్ద డంపింగ్ యార్డును ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం మున్సిపాలిటీ అధికారులు సన్నాహాలు చేస్తుండటంతో గిరిజనులు నిన్న రోడ్డుపై వాహనాలను అడ్డుకున్నారు. ఈ ఆందోళనలో చుట్టుపక్కల ఉన్న ఆరు గ్రామాల సర్పంచ్లతో పాటు గిరిజనులు పాల్గొన్నారు. ఈ చెత్తతో మాకు నిరంతరం దుర్గంధంతో పాటు రోగాలు వస్తాయని, చెత్తను పాత డంపింగ్ యార్డు వద్దే వేయాలని వారు కోరారు. (పార్వతీపురం) -
సమగ్ర సమాచారమివ్వండి
న్యూఢిల్లీ: బవానా, నరేలాలో ఏర్పాటు చేయబోతున్న డంపింగ్ ప్లాంట్కు సంబంధించి సమగ్ర ప్రణాళికను సమర్పించాలని ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి(డీపీసీసీ), ఢిల్లీ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ (డీఎస్ఐఐడీసీ)లను జాతీయ హరిత ధర్మాసనం (ఎన్జీటీ) ఆదేశించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారంతో తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని డీఎస్ఐఐడీసీ మేనేజింగ్ డైరక్టరుకు సూచించింది. పర్యావరణ అనుమతి లేకుండా ప్లాంటు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ బాలంసింగ్ రావత్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దేశ రాజధానిలో ఇలాంటి ప్లాంటు ఇప్పటి వరకు లేకపోవడం బాధపడాల్సిన విషయమన్నారు. బవానా, నారెలాలో ఈ డంపింగ్ ప్లాంటు ఏర్పాటు కోసం ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ 14 ఎకరాల భూమి అప్పగిస్తూ మార్చి 12న జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకుందని కార్పొరేషన్ తరఫు న్యాయవాది ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ విచారణకు డీఎస్ఐఐడీసీ తరఫున ఎవరూ హాజరుకాకపోవడంపై ట్రిబ్యునల్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు పూర్తి సమాచారంతో డీఎస్ఐఐడీసీ మేనేజింగ్ డైరక్టరు స్వయంగా హాజరుకావాలని చైర్పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ ఆదేశించారు. డంపింగ్ యార్డును ఏర్పాటు చేయడం వరకు మాత్రమే బాధ్యతే కాదు.. మొత్తం పర్యావరణానికి అనుకూలంగా ఉండే విధంగా చెత్త సేకరణ చేయడం, దానిని రవాణా చేసి నాశనం చేయడం కూడా మున్సిపాలిటీ బాధ్యతేనని బెంచ్ వ్యాఖ్యానించింది. -
'గంటలోగా చెత్తడబ్బాలను తొలగించండి'
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్తి పన్ను చెల్లించని బకాయిదారుల ఇళ్ల ముందు జీహెచ్ఎంసీ చెత్తడబ్బాలు ఉంచటంపై న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. నేరం చేస్తున్నారంటూ జీహెచ్ఎంసీని హెచ్చరించింది. గంటలోగా చెత్తడబ్బాలను తొలగించాలని హైకోర్టు ఈ సందర్భంగా జీహెచ్ఎంసీని ఆదేశించింది. ఆస్తి పన్ను వసూలుకు అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని, అంతేకానీ చెత్తడబ్బాలను ఇళ్ల ముందు ఎలా పెడతారని ప్రశ్నించింది. చెత్త డబ్బాలు తొలగించకపోతే కమిషనర్, అధికారులపై చర్యలుకు ఆదేశిస్తామని న్యాయస్థానం హెచ్చరించింది. కాగా ఆస్తిపన్ను వసూలుకు జీహెచ్ఎంసీ అధికారులు చేస్తున్న పనులు విమర్శలకు తావిస్తున్నాయి. -
‘చెత్త’ యోచనకు స్వస్తి
బంజారాహిల్స్: ఆస్తి పన్ను బకాయిదారులను దారికి తెచ్చుకునేందుకు ఇళ్లు, షాపులు, బ్యాంక్ల ముందు జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన చెత్త డబ్బాలను (డంపర్ బిన్లు) శుక్రవారం ఉదయం సంబంధిత అధికారులు తొలగించారు. బకాయిదారుల నుంచి పన్నులు రాబట్టేందుకు సర్కిల్-10 అధికారులు గురువారం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సోమాజిగూడలలో 12 చోట్ల చెత్తకుండీలను ఏర్పాటు చేశారు. కాంప్లెక్స్ల ముందు, ఇళ్ల గేట్ల మధ్య వీటిని పెట్టడంతో ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ విషయమై సీఎం కేసీఆర్ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో అధికారులు హుటాహుటిన వీటిని తొలగించారు. -
మత్తులో పాడి
►పాడిపశువులకు దాణాగా బీరు వ్యర్థం ►పాలు పెరుగుతాయని దారుణం ►దుష్ఫలితాలకు అవకాశం ►మూగ జీవికి వేదన రోజుకు ఒక బంగారు గుడ్డు పెట్టే బాతును అత్యాశకు పోరుు చంపుకున్నట్లు... రాయచోటి ప్రాంతంలో కొందరు పశువులకు దాణాగా ప్రమాదకరమైన బీరు వ్యర్థాలను వాడుతున్నారు.. మూగజీవాలకు నరకం చూపెడుతున్నారు. కాసిన్ని పాల కోసం బీరు వ్యర్థాన్ని ఎరగా వాడి వాటి జీవిత కాలాన్ని హరిస్తున్నారు. పునరుత్పత్తి సామర్థ్యం కోల్పోవడానికి కూడా కారణం అవుతున్నారు. కుటుంబ పోషణకు జీవితకాలం కొండంత అండగా నిలిచే పాడిపశువుల విలువ మరచి చేతులారా చంపుకుంటున్నారు. రాయచోటి టౌన్ : రాయచోటి పశు సంవర్ధ శాఖ పరిధిలో వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ ఎక్కువ. 25వేల మందికి పైగా పాడి రైతులు జీవనం సాగిస్తున్నారు. కొందరు స్వార్థపరులు చేసిన ప్రచార మాయలో పడిన రైతులు తమ జీవనాధారమైన పశువులకు విషపు దాణా పెడుతున్నారు. పాలు కొద్దిగా ఎక్కువ ఇస్తాయని ఆశపడి బీరుపొడిని తినిపించి తమకు తామే నష్టం కలుగజేసుకుంటున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న దళారులు కాసులు పండించుకుంటున్నారు.40 కిలోల బరువున్న బీరు పొడిని రూ.330లకు పాడి రైతులకు అమ్ముతున్నారు. ఫ్యాక్టరీల నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలను బయటకు తీసుకెళ్లి పడేయాల్సిందిపోయి దాన్ని ఇలా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఊరి బయట వ్యాపారాలు ఈ బీరు పొడిని అధికారుల కళ్లు కప్పి అమ్మేస్తున్నారు. కేవలం పాడి రైతులకు మాత్రమే సమాచారం ఇచ్చి ఊరి పొలిమేర్లలోనే విక్రయిస్తున్నారు. అది కూడా గుట్టుచప్పుడు కాకుండా ఎక్కడో తయారు చేసే వ్యర్థ పదార్థాలను తడి కూడా ఆరకుండా తీసుకొచ్చి రైతులకు కట్టబెడుతున్నారు. దాన్ని రైతులు తమ పాడి పశువులకు వేస్తున్నారు. ఆ పొడిని తడి ఆరక ముందే వేయడం వల్ల ప్రాంణాంతమనే విషయం వారికి తెలియడం లేదు. పచ్చిపొడితో ప్రాణాలకు ముప్పు పచ్చి పొడి(బీరు వ్యర్థం)లో కొన్ని రకాల ప్రాణాంతాక సూక్ష్మజీవులు నిల్వచేరతాయని, కంటికి కనిపించని ఫంగస్ తయారై అది పశువు కడులోకి చేరి జీర్ణవ్యవస్థపై దుష్ర్పభావం చూపిస్తుందని పశువైద్యాధికారులు అంటున్నారు. ఈ మత్తు పదార్థం తినడం వల్ల తాత్కాలికంగా పాలు ఎక్కువ ఇచ్చినా... ఉత్పత్తి త్వరగా తగ్గిపోతుందని పేర్కొంటున్నారు. అసాధారణంగా అధిక పాలను ఇవ్వడం వల్ల తన శరీరంలోని శక్తిని త్వరగా కల్పోయి పునరుత్పత్తి సామర్థ్యం కూడా తగ్గుతుంది. రెండు ఈతలు తరువాత చూడి నిలబడదని, ఒక వేళ చూడి నిలబడినా ఈనేలోపు దూడ మృతి చెందడమో... లేక మధ్యలో ఈసుకపోవడమో సంభవిస్తుందని సూచిస్తున్నారు. 15-16 సంవత్సరాలు జీవించాల్సిన పాడి పశువు కేవలం 7-8 సంవత్సరాలకే మరణిస్తారుు. పాడి పశువు జీవిత కాలంలో 8-10 దూడలను ఇచ్చే సామర్థ్యం నుంచి కేవలం రెండు లేదా మూడిటికే పరిమితమవుతుంది. బీరు పొడి తినిపిస్తే పశువుకు ప్రమాదం కడప అగ్రికల్చర్ : పశువులకు బీరు తయారు చేయగా వచ్చే వ్యర్థ పదార్థాన్ని రాయచోటి డివిజన్లో కొందరు అమ్ముతున్నారు. దాన్ని పశువులకు ఆహారంగా వాడితే దీర్ఘకాలిక వ్యాధులు ప్రబలుతాయి. తడిగా ఉన్నది పెడితే మరింత ప్రమాదం. జీర్ణకోశ వ్యాధులు సంక్రమించి పశువు ఆయుస్సు తగ్గిపోయి మరణిస్తుంది. పాలు కూడా నాణ్యత కోల్పోయి దుర్గంధం వస్తాయి. అమ్మకానికి ఈ పాలు పనికి రాకుండా పోయే ప్రమాదముంది. పాడి పశువులకు ప్రకృతి సిద్ధమైన గడ్డి పోషక విలువున్న ఆహార పదార్థాలను మాత్రమే ఇవ్వాలి. - హేమంత్కుమార్, అసిస్టెంట్ డెరైక్టర్, జిల్లా పశుగణాభివృద్ధి శాఖ -
16 నుంచి ఇసుక అమ్మకాలు
తొలుత కరీంనగర్ రీచ్ నుంచి.. టెండర్లను తెరిచిన ఎండీసీ సాక్షి, హైదరాబాద్: ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంతోపాటు, చవక ధరల్లో ఇసుకను అందుబాటులోకి తెచ్చే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బహిరంగ మార్కెట్లో ఈ నెల 16 నుంచి ఇసుకను అందుబాటులో ఉంచేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేసింది. ఈ మేరకు ఇప్పటికే గుర్తించిన రీచ్ల నుంచి డంపింగ్ యార్డుకు ఇసుకను చేరవేసే కాంట్రాక్టు కోసం అధికారులు టెండర్లను పిలిచారు. కరీంనగర్ రీచ్లకు సంబంధించిన టెండర్ల ద్వారా కాంట్రాక్టర్ను ఎంపిక చేసే ప్రక్రియను శనివారం టీఎస్ఎండీసీ అధికారులు ప్రారంభించారు. రీచ్ల నుంచి ఇసుకను తరలించి, ప్రజలకు అందుబాటులోకి తేవడం వంటి కార్యక్రమాలను ఈ నెల 15లోగా పూర్తి చేసి 16 నుంచి అమ్మకాలు సాగించాలని నిర్ణయించినట్లు టీఎస్ఎండీసీ ఎండీ లోకేష్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులోకి ఇసుకపై గత ప్రభుత్వాలు సరైన విధానాన్ని అవలంభించక పోవడంతో రీచ్లన్నీ ఇసుక మాఫియా చేతుల్లోకి వెళ్లాయి. డిమాండ్ను బట్టి ఇప్పటి వరకు అక్రమంగా టన్ను ఇసుకను వెయ్యి నుంచి 2 వేల రూపాయల వరకు విక్రయించేవారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని రూపొందించింది. గోదావరి, దాని ఉప నదులు, కృష్ణా నది, ఇతర వాగుల్లో లభించే మేలైన ఇసుకను సరైన పద్ధతిలో విక్రయిస్తే ప్రజలకు మేలు కలుగుతుందని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా టీఎస్ఎండీసీకి ప్రభుత్వ ఆదేశాలు మేరకు ముందుగా కరీంనగర్ జిల్లాలో గుర్తించిన 15 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక రీచ్లకు టెండర్లను పిలిచారు. కాంట్రాక్టర్లను సోమవారం నాటికి ఖరారు చేస్తారు. అలాగే కరీంనగర్, నల్గొండలోని మరో రెండు రీచ్లలో ఫిబ్రవరి 25 నుంచి ఇసుక అమ్మకాలు సాగిస్తారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో గుర్తించిన మూడు రీచ్లలో 1.2 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుకను మార్చి 10 నుంచి అందుబాటులోకి తేనున్నారు. ఇసుక టన్నుకు రూ. 400 నుంచి గరిష్టంగా రూ. 1100 వరకు విక్రయించాలని టీఎస్ఎండీసీ నిర్ణయించింది. -
పదేళ్ల నాటి డంప్ స్వాధీనం
నల్గొండ జిల్లా చందంపేటలో ఎస్పీ ఆధ్వర్యంలో జరిపిన కూంబింగ్ లో పదేళ్ల క్రితం మావోయిస్టులు దాచిపెట్టిన డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో మావోయిస్టుల టోపీలు, బెల్టులు, జిలెటిన్ స్టిక్స్, విప్లవ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ ప్రభాకర్ రావు తెలియజేశారు. -
డంప్ల కోసం డాన్లు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎర్రచందనం డంప్ల కోసం జిల్లాలో డాన్లు వేట ప్రారంభించారు. హైదరాబాద్, చెన్నై ప్రాంతాల నుంచి ఎర్రచందనం స్మగ్లర్లు ఆపరేషన్ ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో ఉన్న ప్రధాన అనుచరుల ద్వారా ఎర్రచందనం అక్రమరవాణాకు రంగం సిద్ధం చేసుకున్నట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఆత్మకూరు పోలీసులకు చిక్కిన ఎర్రచందనం స్మగ్లర్ కృష్ణ ఆ కోవకు చెందిన వారేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అతని ద్వారా మరింత మంది గుట్టు తెలుసుకునే పనిలో ఉన్నట్లు తెలిసింది. ఎస్పీ, కొందరు అటవీశాఖ అధికారుల చర్యలతో స్మగ్లర్లలో వణుకుపుట్టింది. ఆ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన స్మగ్లర్లు కొందరు అధికారపార్టీ నేతలు, మరి కొందరు పోలీసు, అటవీ అధికారులను ప్రసన్నం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నాళ్లు రహస్యప్రాంతాల్లో ఎర్రచందనం దుంగలను దాచి ఉంచాలని స్మగ్లర్లు బరితెగించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే గుట్టుచప్పుడుగా ఉన్న స్మగ్లర్ల ప్రధాన అనుచరులు ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నారు. రహస్యప్రదేశాల్లో దాచి ఉంచిన డంప్లను తరలించే పనిలో నిమగ్నమైనట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో వెంకటగిరి, డక్కిలి, రాపూరు, అనంతసాగరం, సోమశిల, ఆత్మకూరు పరిధిలోని అడవుల్లోని ఎర్రచందనం చెట్లను కొద్దిరోజుల క్రితం బ్యాటరీతో తయారు చేయించిన రంపాలతో నరికినట్లు తెలిసింది. తమిళనాడుతో పాటు జిల్లాలోని కొన్నిగ్రామాలకు చెందిన కూలీలకు పెద్ద ఎత్తున డబ్బులు ముట్టజెప్పి చెట్లను నరికించినట్లు సమాచారం. అడవుల్లో నరికిన చెట్లను గ్రామాలకు చేరవేసినట్లు అధికారులకు సమాచారం అందింది. కాలిబాట ద్వారా దుంగలను భుజాన ఎత్తుకుని వ్యవసాయ పొలాల్లోని తోటల్లో దాచి ఉంచినట్లు కొందరు అధికారులు గుర్తించారు. ఆపరేషన్ ఎర్రచందనం అటు పోలీసులు.. ఇటు అటవీ అధికారులు నిద్రాహారాలు మాని కూంబింగ్ నిర్వహిస్తున్నా.. స్మగ్లర్లు మాత్రం ఎర్రచందనం దుంగలను రహస్యప్రాంతాల నుంచి అనుకున్న చోటుకు చేరవేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కేవలం కొందరు ఇంటి దొంగల సహకారంతోనే ఎర్రబంగారం తరలిపోతుందని ప్రచారం జరుగుతోంది. ఈ అపవాదు నుంచి బయటపడేందుకు కొందరు అధికారులు పథకం వేశారు. వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల పరిధిలో దాచి ఉంచిన ఎర్రచందనం దుంగలను సేకరించి ఇక్కడికి తీసుకొచ్చి తాము పట్టుకున్నట్లు కొందరు అధికారులు ప్రచారం చేయించుకుంటున్నట్లు సమాచారం. అదే విధంగా పాత దొంగలను పిలిపించి ఈ కేసుల్లో ఇరికించి వారిని హింసిస్తున్నట్లు బాధితులు కన్నీరుపెట్టుకుంటున్నారు. ఈ విషయాలను ఎస్పీకి ఫిర్యాదు చేయాలని కొందరు ప్రయత్నించగా కొందరు అధికారులు వారిని భయపెట్టి నెల్లూరుకు రానివ్వకుండా అడ్డుకున్నట్లు తెలిసింది. అదే విధంగా టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసిన కొందరిని, ఎర్రచందనం అక్రమరవాణా సమాచారం ఇచ్చేవారిపై నిఘాపెట్టారు. అటువంటి వారిపై టీడీపీ నేతలు కొందరు పోలీసుల సహకారంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయిస్తున్నట్లు తెలిసింది. దీంతో అనేక మంది ఎర్రచందనం అక్రమరవాణా సమాచారం ఇవ్వటానికి ముందుకు రాకపోవటం గమనార్హం. ఈ విషయంపై ఉన్నతాధికారులు దృష్టిపెట్టి కొందరు పోలీసులు, అటవీ అధికారుల స్వార్థాలకు బలవుతున్న అమాయకులను కాపాడాల్సిన బాధ్యత ఉందని బాధిత బంధువులు కోరుతున్నారు. -
ఇదేం ‘చెత్త’ రాజకీయం...!
పార్వతీపురం: ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో చిచ్చు పెట్టేందుకు పట్టణానికి చెందిన పాలకులు ‘చెత్త’ రాజకీయాలకు తెరతీశారు. ఇందుకోసం మున్సిపాల్టీ చెత్త డంపింగ్ యార్డును వాడుకుంటున్నారు. పార్వతీపురం మున్సిపాల్టీలో రోజువారీ తయారైన చెత్త పారబోసే డంపింగ్యార్డు వ్యవహారంలో పాలకులు రాజకీయాలకు పాల్పడుతున్నారనే విమర్శలొస్తున్నాయి. నిన్న, మొన్నటివరకు లక్షలాది రూపాయలు వెచ్చించి మరికి గ్రామం వద్ద డంపింగ్ యార్డు తయారు చేసిన అధికారులు ఇపుడు టీడీపీ కీలక నేత వద్దన్నారని నర్సిపురం వైపు దృష్టిసారించారు. దీంతో పార్వతీపురం మున్సిపాల్టీ చెత్త మాకా...? అంటూ నర్సిపురం గ్రామస్తులు వ్యతిరేకత కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్వతీపురం మున్సిపాలిటీ మున్సిపల్ వనరుల పార్కు (కంపోస్ట్ డంపింగ్యార్డు) వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఇదిలా ఉండగా రాయగడ రోడ్డులోని డంపింగ్యార్డు స్థలం చాలకపోవడంతో చెత్త రోడ్డుమీదకు వస్తోంది. దీంతో డంపింగ్యార్డు సమస్య ఎప్పటికి తీరుతుందోనని పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. మండలంలోని చినమరికి వద్ద సుమారు రూ.64లక్షలతో పనులు ప్రారంభించిన కంపోస్ట్ డంపింగ్యార్డు దశాబ్దకాలాన్ని హరిస్తోంది తప్ప ముందుకు కదలడం లేదు. మొదట్లో స్థలం చిక్కుతో ముందుకు కదలని వ్యవహారాని రెవెన్యూ యంత్రాంగం సుమారు 8 ఎకరాల స్థలాన్ని అప్పగించింది. అయితే పనులు ప్రారంభించిన నాటి నుంచి పార్వతీపురం చెత్త మా గ్రామాలకా..? అంటూ చినమరికి, పెదమరికి గ్రామాలకు చెందిన ప్రజలు అభ్యంతరం చెబుతుం డడమే కాకుండా పలుమార్లు ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలను అడ్డుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఈ డంపింగ్యార్డు వద్ద వర్మీ కంపోస్ట్, వ్యర్థ పదార్థాల విభజన, రీ-సైక్లింగ్ వంటివి ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అయినప్పటికీ ఇప్పటికీ అవి అమలు నోచుకోలేదు. ప్రస్తుతం పట్టణం శివారున రాయగడ రోడ్డులోని శివిని దారిలో ఉన్న డంపింగ్యార్డులో స్థలం చాలకపోవడంతో చెత్తను రోడ్డుపై వేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. అంతే కాకుండా ఈ చెత్త నుండి వచ్చే దుర్గాంధానికి సమీపంలోని జట్టు ఆశ్రమంతో పాటు వివేకానంద కాలనీ ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇక్కడ నుంచి డంపింగ్యార్డు మార్చేందుకు చినమరికి వద్ద అవాంతరాలు రావడంతో గతంలో ఇక్కడ వర్మీ కంపోస్ట్ షెడ్ నిర్మాణానికి రూ.5లక్షలు కేటాయించారు. దీని కోసం రూ.3లక్షలు ఖర్చుచేసి పనులు కూడా చేపట్టారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ఆ నిధులు వృథా అయ్యాయి. ఇక చినమరికి వద్ద కూడా చాలా మేరకు పనులు కూడా చేపట్టారు. అక్కడ కూడా ఖర్చు చేసిన నిధులు వృథాగానే పడిఉన్నాయి. ఇటు నిధులు మిగలక, డంపింగ్ యార్డు అందుబాటులోకి రాక చెత్త డంపింగ్యార్డు కోసం మున్సిపాలిటీ అవస్థలు పడుతోంది. నాయకుల ‘చెత్త’ గేమ్... ఇదిలా ఉండగా మరో రూ.70లక్షలతో ఇప్పుడు నర్శిపురం వద్ద డంపింగ్యార్డు పనులకు అధికారులు, పాలకులు సన్నద్ధమవుతున్నారు. అయితే మరికి వద్ద ఇప్పటి వరకు వెచ్చించిన వ్యయం మాటేమిటని పట్టణ ప్రజలంటున్నారు. ఇప్పుడు నర్శింపురం ప్రజలు వద్దంటే అస్సలు పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. -
కలుషిత తాండవం
డంపింగ్ యార్డుగా తాండవ నది ప్లాస్టిక్ సంచుల శుభ్రంతో నీరు కలుషితం ఇలాగే వదిలేస్తే ఉనికికే ప్రమాదం తాండవ నదిలో కలుషితం తాండవిస్తోంది. నది కాలుష్య కోరల్లో చిక్కుకుని జీవ రాసులు బలైపోతున్నాయి. చె త్తా చెదారంతో తాండవ ఉనికి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. నదికి రెండు పక్కలా ఆక్రమణలు చోటు చేసుకోగా, మరో పక్క డంపింగ్ యార్డుగా ఉపయోగిస్తున్నారు. పాయకరావుపేట, తుని పట్టణాలకు తాగునీటితోపాటు వేలాది ఎకరాలకు సాగునీరందించే తాండవను ర క్షించేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంది. పాయకరావుపేట: ప్రస్తుతం ఉన్న తాండవ పరిస్థితి చూస్తే గుండె తరుక్కు పోతుంది. ప్రజలకు, రైతులకు ఆందోళన కలిగిస్తోంది. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల సరిహద్దులో ఉన్న తాండవ నది నాతవరం మండలం తాండవ నుండి ప్రవహిస్తూ నాతవరం, కోటనందూరు, పాయకరావుపేట, తుని పట్టణాల మీదుగా పెంటకోట వద్ద సముద్రంలో కలుస్తోంది. ఈ నదిపై ఆధారపడి తుని, పాయకరావుపేట, నక్కపల్లి మండలాలకు చెందిన 22 వేల ఎకరాల భూములు సాగవుతున్నాయి. జంట పట్టణాల్లో తాగునీటి అవసరాలను తీరుస్తోంది. చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉన్న తాండవ తీరంలో తుని- పాయకరావుపేట పట్టణాలకు చెందిన వందలాది టన్నుల చెత్త వేస్తుండటంతో నది డంపింగ్ యార్డుగా మారింది. గతంలో తుని మున్సిపాలిటీ అధికారులు పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు. గతేడాదిలో వచ్చిన నీలం తుపాను ధాటికి నది ఉధృతంగా ప్రవహించి నదిలో పేరుకు పోయిన చెత్త మంగవరం, కొత్తూరు, సత్యవరం, మాసాహెబ్పేట ప్రాంతాల్లో ఉన్న తమలపాకు తోటల్లోకి కొట్టుకుని వచ్చి నిలచిపోయంది. భారీగా వచ్చిన చెత్తను తొలగించలేక రైతులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో ముఠా ఆనకట్ట దిగువ భాగంలో అర ట్లకోట ప్రాంతంలో ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్ల నదికి చుట్టుపక్కల ఉన్న భూములు కోతకు గురయ్యాయి. ముఠా ఆనకట్టకు వేసి రాతిపేర్పు చెల్లా చెదురైంది. దీనికి తోడు నదిలో సిమెంటు, ఎరువులు, సల్ఫర్ సంచులు శుభ్రంచేస్తున్నారు. తుని, పాయకరావుపేట పట్టణాల్లో వివిధ దుకాణాల్లో లభ్యమయ్యే ప్లాస్టిక్ సంచులు, గోనెలను నదిలో పూర్తిగా శుభ్రపరచి వాటిని రీసైక్లింగ్కు పంపిస్తుంటారు. ఈ క్రమంలో నది పూర్తిగా కలుషితమవుతోంది. రెండు పట్టణాల్లో ఉన్న చేపలు మార్కెట్, చికెన్, మటన్సెంటర్ల నుండి వస్తున్న వ్యర్థాలను కూడా నదిలోనే పడేస్తున్నారు. దీంతో నీరు కలుషితమై వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని పట్టణ వాసులు భయాందోళనలు చెందుతున్నారు. ఇంత జరగుతున్నా నీటిపారుదల శాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపడితే నది కాలుష్యం నుండి రక్షించుకునే అవకాశం ఉందని పలువురు సూచిస్తున్నారు. -
డంపింగ్యార్డు ఏర్పాటుకు మల్లగుల్లాలు
పార్వతీపురం రూరల్ :మున్సిపాల్టీ పరిధిలో డంపింగ్ యార్డు ఏర్పాటుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రస్తుతం పట్టణ శివారున ఉన్న డంపింగ్ యార్డు చాలకపోవడంతో పాటు చెత్తంతా ప్రధాన రోడ్డుపైకి వచ్చేయడంతో మున్సిపల్ అధికారులు కొత్తగా డంపింగ్ యార్డు ఏర్పాటు చేసేందుకు స్థలసేకరణ పనిలో పడ్డారు. గత ప్రభుత్వ హయాంలో మండలంలోని చినమరికి గ్రామ సమీపంలో యార్డు ఏర్పాటు చేసేందుకు స్థలం సేకరించి, ట్రాక్టర్ల సహాయంతో చెత్తను పారబోసేందుకు ప్రయత్నించారు. అయితే గ్రామ సమీపంలో చెత్తను వేసేందుకు గ్రామస్తులంతా వ్యతిరేకించి అప్పట్లో ఆందోళనలు చేపట్టారు. అధికారులు ఎంత నచ్చచెప్పినా వారంతా ససేమిరా అనడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అయితే మున్సిపాల్టీలో రోజు రోజుకూ పెరుగుతున్న చెత్తను పారబోసేందుకు స్థలం లేకపోవడంతో అధికారులు స్థలసేకరణ పనిలో పడ్డారు. ఇందులో భాగంగా శనివారం స్థానిక ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్, మున్సిపల్ కమిషనర్ వీసీహెచ్ అప్పలనాయుడు, తహశీల్దార్ కేడీవీ ప్రసాదరావు నర్సిపురం రెవెన్యూ పరిధిలో ఉన్న స్థలంలో డంపింగ్యార్డు ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని పరిశీలించారు. అయితే గ్రామానికి చెందిన సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులకు, గ్రామపెద్దలకు మాటమాత్రమైనా చెప్పకుండా గ్రామ రెవెన్యూ పరిధిలో స్థల పరిశీలన చేయడంతో స్థానిక ప్రజాప్రతినిధులు గుర్రుమంటున్నారు. గ్రామస్తుల అనుమతి లేకుండా ఏ విధంగా డంపింగ్యార్డు ఏర్పాటు చేస్తారో చూస్తామని గ్రామపెద్దలు అంటున్నారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలనుకుంటే ప్రజలనుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రామానికి చెందిన వైస్ ఎంపీపీ గొట్టాపు గౌరి స్పష్టం చేశారు. పంచాయతీ అనుమతి లేకుండా మున్సిపల్ అధికారులు గ్రామంలో ప్రవేశించి డంపింగ్ యార్డుకు స్థలపరిశీలన చేయటమేమిటని ప్రశ్నించారు. ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని హితవు పలికారు. మరి మున్సిపల్ అధికారులు ఏమి చేస్తారో వేచి చూడాలి మరి. -
అమావాస్య చీకట్లే
ఈసారి దీపావళి లేనట్టే.. బాణసంచా విక్రయాలపై నిషేధం అప్రమత్తం కాకుంటే మరో ‘అగ్ని’తుపాను విరిగిన చెట్లతో పొంచిఉన్న పెనుముప్పు విశాఖ రూరల్: దీపావళి ఆనందాన్ని హుదూద్ దూరం చేసింది. అంతేకాదు మేలుకోకపోతే మరింత ప్రమాదం పొంచి ఉంది. తుపాను వల్ల ఎక్కడ చూసిన మోడు వారిన చెట్లు, ఎండిన మానులుదర్శనమిస్తున్నాయి. ఏ చిన్న నిప్పు వీటికి అంటుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవల్సి ఉంటుంది. తుపానుకు మించిన నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. బాణా సంచాకు దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి కూడా స్పష్టం చేశారు. బాణసంచా అమ్మకాలను సైతం నిషేదించారు. తొలిసారిగా దీపావళికి దూరంగా ఉండాలంటూ ప్రభుత్వం ప్రకటించిం దంటే ఎంత ప్రమాదం పొంచి ఉందో అర్ధం చేసుకోవచ్చు. తుపాను ధాటికి జిల్లాలో చెట్లన్నీ నేలకొరిగాయి. ఆరు రోజులుగా వాటి తొలగింపు ప్రక్రియను చేపడుతున్నా కనీసం 50 శాతం కూడా పూర్తి కాలేదు. విశాఖ శివారులో ఉన్న డంపింగ్యార్డుకు ఇప్పటి వరకు 500 మెట్రిక్ టన్నుల వ్యర్ధాన్ని తరలించినప్పటికీ.. ఇంకా పదింతలు రోడ్లమీదే ఉంది. నిర్జీవ వృక్షాలకు ప్రూనింగ్ చేసిన నాలుగు సంవత్సరాలకు తిరిగి పచ్చదనంతో కళకళలాడుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బాణాసంచా కారణంగా ఏ చెట్టుకు నిప్పు అంటుకున్నా మంటలు దావానంలా వ్యాపిస్తాయి. నీటి కొరత నేపథ్యంలో వాటిని అదుపు చేయడంఅసాధ్యమైన పనే. ఈ నేపథ్యంలో జిల్లాలో బాణ సంచా అమ్మకాలపై నిషేదాజ్ఞలు విధించింది. -
డంపింగ్ యార్డుల ఏర్పాటుకు సత్వర చర్యలు
చిత్తూరు (సెంట్రల్): గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డుల ఏర్పాటుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిద్ధార్థ్జైన్ ఎంపీడీవోలను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన జిల్లాలోని ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జన్మభూమి కార్యక్రమంలో పెద్ద ఎత్తున డంపింగ్ యార్డుల ఏర్పాటుకు పూనుకోవాలన్నారు. ఎస్ఆర్హెచ్ఎం కింద ప్రతి గ్రామపంచాయతీకి పారిశుద్ధ్య పనుల నిమిత్తం రూ.50 వేలు విడుదల చేశారని, ఈ నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. మండలాలకు వివిధ అభివృద్ధి పనులు మంజూరవుతు న్నా, అవి పూర్తికావడం లేదన్నారు. ఇకపై పనులు మంజూరైన 90 రోజుల్లో పూర్తికాకపోతే వాటికి సంబంధించిన నిధులను వేరే మండలాలకు ఇస్తారని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్లో జెడ్పీ సీఈవో వేణుగోపాల్రెడ్డి, డీఆర్డీఏ పీడీ రవిప్రకాష్రెడ్డి, డీపీవో ప్రభాకర్, డ్వామా పీడీ గోపిచంద్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. బాధితులకు విరాళం హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం రేణిగుంట మండలానికి చెందిన సర్పంచ్లు భాస్కరయాదవ్ (తూకివాకం), మునిశేఖర్రెడ్డి (ఆర్.మల్లవరం), శ్రీరాజ్ (గాజులమండ్యం), హరినాథ్యాదవ్ (అత్తూరు), ఎం.పురుషోత్తం (విప్పమానుపట్టెడ) కలిసి మొత్తం రూ.57,635 విరాళాన్ని కలెక్టర్కు అందజేశారు. అలాగే తిరుపతి మండల సర్పంచ్లు లక్ష రూపాయలు ఇచ్చారు. -
విశాఖలో అంతంత మాత్రంగానే నీటి సరఫరా
విశాఖ : హుదూద్ తుఫానుతో సర్వం కోల్పోయిన విశాఖ ప్రజల కష్టాలు ఆరో రోజూ కూడా కొనసాగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇంకా విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ కాలేదు. విద్యుత్ సరఫరా లేక జనం అవస్థలు పడుతున్నారు. మరోవైపు అంతంత మాత్రంగానే తాగునీరు సరఫరా అవుతోంది. దాంతో అపార్ట్మెంట్ వాసులు తీవ్రంగా నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. చాలా కాలనీల్లో కూలిపోయిన భారీ వృక్షాలను ఇంకా తొలగించలేదు. విశాఖ నగరం అంతా చెత్తతో నిండిపోయింది. పారిశుద్ధ్య సిబ్బంది పత్తా లేకపోవటంతో రోడ్లన్ని చెత్తా చెదారంతో నిండిపోయాయి. పెను తుఫాను కారణంగా నగరం వ్యర్థాలతో నిండిపోయినా, చెట్ల శిథిలాలతో రోడ్లన్నీ బీభత్సంగా మారిపోయినా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) చోద్యం చూస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
స్థలాలు సరే.. నిధులేవీ?
చిత్తూరు(టౌన్): జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డుల నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంలో ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం నిధులివ్వకనే అరచేతిలో వైకుంఠం చూపుతోంది. జిల్లాలో తొలివిడతగా 225 గ్రామ పంచాయతీలకు యార్డులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో 135 యార్డులను ఆర్డబ్ల్యూఎస్ శాఖకు కేటాయించగా మిగిలిన 90 యార్డుల బాధ్యతను జిల్లా పంచాయతీ కార్యాలయ అధికారులు తీసుకున్నారు. నిధులు రాకపోవడంతో వారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కూర్చున్నారు. ఏం చేయనున్నారంటే.. మండల కేంద్రం, మేజర్ గ్రామ పంచాయతీల పరిధిలో పోగయ్యే చెత్తను సేకరించి యార్డులో ఎరువులను తయారు చేసి తద్వారా పంచాయతీల ఆదాయాన్ని పెంచాలనేదే ప్రభుత్వ యోచన. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు యార్డుల నిర్మాణం కోసం స్థలాలను కేటాయించనుంది. తొలివిడతగా స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, బోరు డ్రిల్ చేసి, దానికి మోటారు అమర్చి, యంత్రాల వినియోగం కోసం షెడ్ల నిర్మాణాలను చేపట్టనున్నారు. ఇందులో తయారైన ఎరువును ఆయా గ్రామ పంచాయతీలే అమ్ముకుని ఆదాయాన్ని పెంచుకునే ఆర్థిక వెసులుబాటు కల్పించనుంది. నిధులే సమస్య.. గ్రామ పంచాయతీల పరిధిలో ఉండే స్థలాలనైతే ప్రభుత్వం కేటాయించింది కాని యార్డుల నిర్మాణానికి నిధులను మాత్రం మంజూరు చేయలేదు. ప్రభుత్వం అనుకున్న విధంగా డంపింగ్ యార్డులను నిర్మించాలంటే ఒక్కో దానికి కనీసం రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు నిధులు అవసరమవుతాయి. ఇప్పటివరకు ఒక్కపైసా కూడా మంజూరు చేయకుండా ఆదేశాలు మాత్రం జారీ చేసి మిన్నకుంది. ఆర్డబ్ల్యూఎస్ శాఖకు కేటాయించిన 135 యార్డులకు ప్రభుత్వం కేటాయిచిన స్థలాలను ఇప్పటివరకు రెవెన్యూ అధికారులు చూపలేదు. నిధులు మంజూరు కాక, కేటాయించిన స్థలాలు ఎక్కడున్నాయో తెలియక ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీనిపై ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాసులును వివరణ కోరగా యార్డుల పర్యవేక్షణ బాధ్యతను తమకైతే అప్పగించారు కానీ నిధులు ఒక్కపైసా కూడా మంజూరు కాలేదన్నారు. తమకు కూడా నిధులు రాలేదని జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్రావు వివరించారు. -
వృథాగా డంప్యార్డు ఏడేళ్లుగా నిరుపయోగం
జిన్నారం : మండలంలోని ఊట్ల గ్రామ శివారులో ఏడేళ్ల క్రితం డంప్యార్డును నిర్మించారు. గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను సేకరించి దాని నుంచి వర్మీకంపోస్టు ఎరువులను తయారు చేయాలన్నది లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ నిధులు రూ. 2 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ డంప్యార్డును అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు డంప్యార్డు వినియోగంలో లేదు. కేవలం రెండు నెలలు మాత్రమే చెత్తను సేకరించారే తప్ప, ఎరువును సైతం తయారు చేయలేకపోయారు అధికారులు. జిల్లా పంచాయతీ అధికారి పర్యవేక్షణలో డంప్యార్డును నిర్వహించాలని అప్పటి కలెక్టర్ సూచించారు. అయినా ఈ డంప్యార్డు మాత్రం వినియోగంలోకి రావటంలేదు. డంప్యార్డులో విలువైన వాహనాలు, భారీ యంత్రాలు, వర్మీకంపోస్టు షెడ్డులను నూతన సాంకేతిక పరిజ్ఙానంతో ఏర్పాటు చేశారు. చెత్తను సేకరించేందుకు ట్రాక్టర్లు, ట్రాలీ సైకిళ్లు, చెత్త డబ్బాలను సైతం ఏర్పాటు చేశారు. ఇందులో జనరేటర్, వే బ్రిడ్జ్లను కూడా ఏర్పాటు చేశారు. ఏడేళ్లుగా ఇవి వినియోగంలో లేకపోవడంతో అవికాస్తా ఎందుకు పనికి రాకుండా పోయాయి. వాహనాలు తుప్పుపట్టాయి. గుర్తుతెలియని వ్యక్తులు డంప్యార్డులో ఉన్న వస్తువులను అపహరించుకుపోతున్నారు. విలువైన భవనాలు బీటలు వారుతున్నాయి. డంప్యార్డు వద్ద వాచ్మెన్ను నియమించినా అతనికి తగిన వేతనం ఇవ్వకపోవడంతో అతను విధుల నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాలు అధికారులకు తెలిసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పటి కలెక్టర్ దినకర్బాబు స్వయంగా డంప్యార్డును సందర్శించారు. అయినా ఫలితం లేకుండాపోయింది. గ్రామ శివారులో డంప్యార్డు ఏర్పాటు వల్ల స్థానికంగా తమకు ఉద్యోగాలు వస్తాయని యువకులు భావించారు. డంప్యార్డు ఏర్పాటు వల్ల ఎప్పటికప్పుడు చెత్తను సేకరిస్తుండడం వల్ల గ్రామాలు సైతం శుభ్రంగా ఉంటాయని ఆయా గ్రామాల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాని ప్రజలు, యువకుల ఆశలు నెరవేరడం లేదు. గత ప్రభుత్వాలు ఈ డంప్యార్డుని తిరిగి వినియోగంలోకి తీసుకురావటంలో పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలోనైనా డంప్యార్డు వినియోగంలోకి వస్తుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చెత్తను తొలగించి గ్రామాలు శుభ్రంగా ఉండడంతో పాటు, సేకరించిన చెత్త నుంచి రైతులకు ఉపయోగపడే వర్మికంపోస్టు ఎరువును తయారు చేయాలనే ప్రభుత్వం లక్ష్యం నీరుగారిపోయింది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి డంప్యార్డును వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.