సాక్షి అమరావతి: ఈ నెల 8 నుంచి ప్రారంభం కానున్న ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా ఎంపీసీ విభాగానికి గానూ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు 35 కేంద్రాలను ఏర్పాటుచేశారు. దీనికి సంబంధించిన వివరాలు ‘హెచ్టీటీపీఎస్://ఏపీఈఏఎంసీఈటీ.ఎన్ఐసీ.ఐఎన్’ వెబ్సైట్లో ఉన్నాయి. దివ్యాంగులు, ఎన్సీసీ, సీఏపీ, స్పోర్ట్సు, గేమ్స్, ఆంగ్లో ఇండియన్ కేటగిరీల అభ్యర్థులు మాత్రం విజయవాడ బెంజ్సర్కిల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ కేంద్రంలో హాజరుకావాలి. వీరికి 8 నుంచి 15 వరకు పరిశీలన ఉంటుంది. ఓసీ, బీసీ, ఎస్సీ, మైనార్టీలకు జూన్ 8 నుంచి 17 వరకు ఉంటుంది కాగా ఎస్టీ అభ్యర్థుల పరిశీలనకు 13 కేంద్రాలు ఏర్పాటుచేశారు.