విద్యుత్ ఉద్యోగుల సమ్మె 16కు వాయిదా | Electricity employees strike postponed to 16th | Sakshi
Sakshi News home page

విద్యుత్ ఉద్యోగుల సమ్మె 16కు వాయిదా

Published Wed, Sep 11 2013 7:47 PM | Last Updated on Fri, Sep 1 2017 10:37 PM

Electricity employees strike postponed  to 16th

హైదరాబాద్: సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సమ్మె ఈ నెల 16వ తేదీకి  వాయిదా వేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో  సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు జరిపిన  చర్చలు సఫలమయ్యాయి. దాంతో వారు సమ్మెను వాయిదా వేసుకున్నారు.


తొలుత ఈ రోజు అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభిస్తున్నట్లు   సీమాంధ్ర ట్రాన్స్కో, జెన్కో ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు ఈ రోజు సాయంత్రం అధికారులతో చర్చలు జరిపారు. ఆ చర్చలు విఫలమయ్యాయి. ఆ తరువాత క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.  సీఎంతో మాట్లాడిన తరువాత సమ్మె వాయిదా నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement