ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలి: భన్వర్ లాల్
Published Fri, Nov 1 2013 7:47 PM | Last Updated on Sat, Sep 2 2017 12:12 AM
కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ కార్డుల్లో తప్పులను సవరణ షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈవో భన్వర్లాల్ ప్రకటించారు. నవంబర్ 15న ప్రారంభమయ్యే నమోదు, సవరణ కార్యక్రమం 30వరకు సాగుతుందని భన్వర్ లాల్ తెలిపారు.
19 నుంచి 26 వరకు ఓటర్ కార్డుల పరిశీలన జరుగుతుందని.. ఆతర్వాత గ్రామ సభల ద్వారా అభ్యంతరాల స్వీకరణ జరుగుతుంది అని ఆయన తెలిపారు. 17తేది నుంచి 24 వరకు బూత్ లెవల్లో...రాజకీయపార్టీల నుంచి అభ్యంతరాల స్వీకరణ కార్యక్రమం చెపడుతామన్నారు.
వచ్చేనెల 16లోగా పరిశీలన పూర్తి చేసి.. జనవరి 16న తుది ఓటర్ జాబితాను ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుందన్ని భన్వర్ లాల్ మీడియాకు తెలిపారు. జనవరి 1, 2014కు 18 ఏళ్లు నిండబోతున్నప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవాలి సీఈవో భన్వర్ లాల్ విజ్ఞప్తి చేశారు.
Advertisement
Advertisement