State Election Commissioner
-
కూటమికి కళ్లెం వేయండి
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీల అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. అధికార కూటమి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని చెప్పింది. రాష్ట్రంలో ఉప ఎన్నికలను సజావుగా నడిపించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేసింది. ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తదితరులతో కూడిన వైఎస్సార్సీపీ బృందం సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసి ఈమేరకు వినతిపత్రం అందజేసింది. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. పిడుగురాళ్ల ఎన్నిక రద్దు చేయాలి: ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఉప ఎన్నికల్లో గెలవడానికి కూటమి నేతలు పోలీసు వ్యవస్థలను అడ్డుపెట్టుకొని వైఎస్సార్సీపీ శ్రేణులను భయపెడుతున్నారని, ఇళ్లను కూల్చివేసి, అరాచకాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిడుగురాళ్ల ఎన్నికను రద్దు చేసి, మరోసారి ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ను కోరినట్లు తెలిపారు.తునిలో కూటమి పార్టీ ల వల్ల ఇప్పటికి రెండు దఫాలు వాయిదా పడిందని చెప్పారు. పాలకొండలో ఒకే ఒక్క ఎస్సీ సభ్యురాలు ఉంటే ఆమెను కూడా వారి పార్టీ తరపున నిలబెట్టే ప్రయత్నం చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఈ వ్యవహరంలో జోక్యం చేసుకుని పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా చూడాలని కోరారు. మాజీ మంత్రిపైనే దాడి చేస్తారా?: దేవినేని అవినాష్ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రతినిధులను భయపెట్టి ఓట్లేయించుకుంటున్న టీడీపీ నేతల అకృత్యాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోకపోవడం దారుణమని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. తునిలో ఏకంగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపైనే దాడి చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీల దౌర్జన్యాలపై ఎన్నికల కమిషన్కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేయడం ఇది నాలుగోసారి అని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. అధికార పార్టీ ఆగడాలను, అప్రజాస్వామిక విధానాలను అధికారులు చేష్టలుడిగి చూస్తున్న వైనాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప అధికారవ్యవస్థలేవీ పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసమే చలో తునికి పిలుపునిచ్చామన్నారు. హద్దుల్లేకుండా దమనకాండ: మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాలకొండ, తుని, పిడుగురాళ్లలో వైఎస్సార్సీపీ ప్రతినిధులమీద అధికార పార్టీ దౌర్జన్యాలు, కిడ్నాపులు చేస్తూ దమనకాండకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. రాష్ట్రంలో గూండాల రాజ్యం నడుస్తోందని అన్నారు. -
Munugode Bypoll: ఆన్లైన్లో డబ్బులు పంపిణీ.. రిజర్వ్ బ్యాంక్ సాయం కోరతాం
సాక్షి, హైదరాబాద్: ‘‘మునుగోడు నియోజకవర్గంలో ఫోన్ పే, గూగుల్ పే వంటి పేమెంట్ యాప్స్ ద్వారా నగదు బదిలీ చేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారన్న విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై నల్లగొండ జిల్లా కలెక్టర్ నుంచి సమగ్ర నివేదిక కోరాం. నివేదిక వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటాం’’అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్రాజ్ తెలిపారు. ఓటర్లను ఇలా ప్రలోభాలకు గురిచేసే వారిని గుర్తించి, చర్యలు తీసుకునేందుకు రిజర్వు బ్యాంకు, ఇతర బ్యాంకుల సహకారాన్ని కోరే అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. అయితే దీనిపై జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో వికాస్రాజ్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. కొత్త ఓటర్లపై కోర్టు తీర్పు మేరకు నిర్ణయం మునుగోడులో 24 వేలకుపైగా కొత్త ఓటర్ల నమోదుపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. మా వాదనలు వినిపించాం. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎప్పుడు వచ్చాయి? ఎన్ని ఆమోదించాం? ఎన్ని తిరస్కరించాం? కారణాలేమిటన్నది కోర్టుకు వివరించాం. కోర్టు తీర్పు ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం. వేలకోట్ల కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరారంటూ టీఆర్ఎస్ నేతలు చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. టీఆర్ఎస్ పేరుమార్పుపై సమాచారం లేదు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చాలంటూ ఆ పార్టీ నాయకత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించింది. పార్టీ పేరు మార్పునకు అనుమతిపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మాకు ఎలాంటి సమాచారం కోరలేదు. పార్టీ పేరు మార్పునకు అనుమతి విషయంలో ఇంకా ఈసీఐ నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు. ఇక చండూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి జరిగిందన్న ఫిర్యాదుపై డీజీపీ, జిల్లా ఎస్పీల నుంచి నివేదిక కోరాం. ఇంకా అందలేదు. ఎక్కువ మంది ఉన్నా నిర్వహించగలం గతంలో నిజామాబాద్ స్థానం నుంచి భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేసినా విజయవంతంగా ఎన్నికలు జరిపాం. మునుగోడులో ఇప్పటివరకు 40 మందికిపైగా అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఎక్కువ సంఖ్యలో బ్యాలెట్ యూనిట్లను తెప్పించి సిద్ధంగా పెట్టాం. నియోజకవర్గంలో 298 పోలింగ్ కేంద్రాలకుగాను గురువారం నాటికి 2,40,287 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికకు పాత ఈవీఎంలనే వాడుతున్నాం. ఒక పోలింగ్ కేంద్రానికి ఒక కంట్రోల్ యూనిట్ సరిపోతుంది. అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని 2,126 బ్యాలెట్ యూనిట్లను సిద్ధం చేస్తున్నాం. 1,500 మంది పోలింగ్ అధికారులు, సిబ్బందిని నియమిస్తున్నాం. 10 కంపెనీల కేంద్ర బలగాలు వస్తున్నాయి. రాష్ట్రం నుంచి 2,500 మందిని పోలింగ్ బందోబస్తు విధులకు వాడుకుంటాం. ప్రలోభాల కట్టడికి కఠిన చర్యలు మునుగోడు నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో 113 పోలీసు చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేయిస్తున్నాం. మరో 45 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, వీడియో స్క్వాడ్స్, అబ్జర్వర్ల బృందాలు పరిశీలన జరుపుతున్నాయి. ఇప్పటివరకు రూ.20 లక్షల నగదు, రూ.16.2 లక్షల విలువ చేసే మద్యం జప్తు చేశాం. రోజువారీ మద్యం విక్రయాలపై నిఘా పెట్టాం. నియోజకవర్గంలోని 70 బెల్ట్ షాపులను మూయించాం. మద్యం సంబంధిత కేసుల్లో 60 మంది అరెస్టయ్యారు. అనుమతి లేని ప్రాంతాల్లో బ్యానర్లు, పోస్టర్లు అంటించడం వంటి ఘటనల్లో 15వేలకుపైగా కోడ్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. -
22 స్థానిక సంస్థల ఎన్నికలు ఈవీఎంలతోనే
సాక్షి, అమరావతి: గతంలో ఎన్నికలు జరగని 22 నగరపాలక సంస్థలు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఈవీఎంల విధానంలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 17 నగరపాలక సంస్థలు, 106 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో కాకినాడ కార్పొ రేషన్ ఎన్నికలు జరిగాయి. వైఎస్సార్సీపీ అధికా రంలోకి వచ్చిన తరువాత గత ఏడాది మార్చిలో 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలకు, నవంబర్లో నెల్లూరు నగరపాలక సంస్థకు, 12 పుర పాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించింది. ఈ రెండు విడతల్లోను బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరిగాయి. కోర్టు కేసుల కా రణంగా రాజమహేంద్రవరం (రాజమండ్రి), శ్రీకా కుళం, మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థల్లో ను, ఆముదాలవలస, రాజాం (శ్రీకాకుళం జిల్లా), తణుకు, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, చింతలపూడి (పశ్చిమగోదావరి), వైఎస్సార్ తాడి గడప, గుడివాడ (కృష్ణా), బాపట్ల, పొన్నూరు, నర సరావుపేట (గుంటూరు), కందుకూరు, పొదిలి (ప్రకాశం), కావలి, గూడూరు, అల్లూరు (నెల్లూరు), బి.కొత్తకోట, శ్రీకాళహస్తి (చిత్తూరు జిల్లా) పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగలేదు. కోర్టు కేసులు కొలిక్కి వస్తే వీలైనంత త్వరగా వీటికి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తోంది. ఉమ్మడి ఏపీలో ఈవీఎంల విధానంలోనే.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వారం రోజుల కిందట తన కార్యాలయ అధికారులతో సమావేశం నిర్వహించి ఈవీఎంల విధానంలో ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మునిసిపల్ ఎన్నికలు ఈవీఎంల విధానంలో నిర్వహించిన విషయాన్ని అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు 8 వేల ఈవీఎంలు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. 22 నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చినా నాలుగువేల బూత్లలోనే పోలింగ్ ఉంటుందని, ఇందుకు ఆ ఈవీఎంలు సరిపోతాయని వివరించారు. అసెంబ్లీ, లోకసభ ఎన్నికలను ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లతో కలిపి ఉండే మిషన్లతో నిర్వహిస్తున్నారని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద వీవీప్యాట్లు లేని పాత ఈవీఎంలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా ఈవీఎంలకు వీవీప్యాట్లను అనుసంధానం చేసే అంశంపై ప్రభుత్వరంగ సంస్థ ఈసీఐఎల్ను సంప్రదించి తదుపరి చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. కోర్టు కేసులపైనా దృష్టి ఎన్నికలు జరగని 22 నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు సంబంధించిన పెండింగ్లో ఉన్న కోర్టు కేసులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు ఎప్పటికప్పుడు మునిసిపల్శాఖ అధికారులతో సంప్రదిస్తున్నారు. నెలరోజుల కిందట నీలం సాహ్ని మునిసిపల్శాఖ అకారులతో సమావేశమై ఆయా కేసుల పరిస్థితి గురించి తెలుసుకున్నారు. -
టీడీపీ తప్పుడు ప్రచారం.. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ
సాక్షి, విజయవాడ: టీడీపీ తప్పుడు ప్రచారాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. మిస్డ్ కాల్ ఇస్తే టీడీపీ ప్రభుత్వం రాగానే పన్ను మినహాయింపులు అంటూ ప్రకటనలు ఇస్తోంది. ఇది పూర్తిగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యలయ ఇన్చార్జ్ లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల కమిషన్రకు ఫిర్యాదు చేశారు. ప్రజలను మభ్యపెడుతూ నిబంధనల ఉల్లంఘనకి పాల్పడిన టీడీపీ జాతీయ అధ్యక్షుడిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ కోరారు. చదవండి: (కుప్పంలో కొత్త నాటకం.. టీడీపీ సానుభూతి డ్రామా) -
స్వేచ్ఛగా బద్వేలు ఉప ఎన్నిక
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికను స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించిన అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. బుధవారం సాయంత్రం 7 గంటల నుంచి ఎన్నికల ప్రచారాన్ని అన్ని రాజకీయ పార్టీలు నిలిపేసినట్లు తెలిపారు. ఎన్నికకు 12 గంటల ముందుగానే నియోజకవర్గం సరిహద్దులన్నీ మూసేయాలని, నిత్యావసర సరుకులు రవాణా చేసే వాహనాలు మినహా ఇతర వాహనాలను అనుమతించొద్దని ఆదేశించారు. 28వ తేదీ సాయంత్రం 7 నుంచి 30 వ తేదీ రాత్రి 10 గంటల వరకూ, ఓట్ల లెక్కింపు రోజైన నవంబర్2న మద్యం షాపులను మూసేయాలన్నారు. 30న నియోజకవర్గంలో అన్ని కార్యాలయాలకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు. హుజూరాబాద్లో ముగిసిన ప్రచార హోరు తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రం తెరపడింది. 30న ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరుగనుంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతోపాటు కొందరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్న ఈ ప్రతిష్టాత్మక ఎన్నిక కోసం.. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా దాదాపు నాలుగు నెలలపాటు ప్రచార పర్వం సాగింది. -
నీలం సాహ్ని నియామకం సరైందే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్ని నియామకం సరైందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని.. రాజ్యాంగానికే లోబడే గవర్నర్ ఆమెను నియమించారని పేర్కొంది. గవర్నర్ నిర్ణయాన్ని ఏ రకంగానూ తప్పుపట్టలేమని పేర్కొంది. నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన కోవారెంటో పిటిషన్ను కొట్టేసింది. ప్రస్తుత ప్రభుత్వంలో నీలం సాహ్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, ప్రధాన సలహాదారుగా పనిచేశారని, అందువల్ల ఎన్నికల కమిషనర్గా ఆమె స్వతంత్రంగా విధులు నిర్వర్తించలేరన్నది పిటిషనర్ ఆరోపణ మాత్రమేనని స్పష్టం చేసింది. నీలం సాహ్ని స్వతంత్రంగా వ్యవహరించలేరనేందుకు పిటిషనర్ ఎలాంటి ఆధారాలను కోర్టు ముందుంచలేదని ఆక్షేపించింది. ఆమె నియామకం విషయంలో ఏకపక్షత, దురుద్దేశాలు ఉన్నాయని నిరూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారంది. ఎన్నికల కమిషనర్గా ఆమెను నియమించడం వల్ల పిటిషనర్ చట్టబద్ధ, రాజ్యాంగబద్ధ హక్కులకు ఎలాంటి విఘాతం కలగలేదని తెలిపింది. హక్కుల ఉల్లంఘన జరగనప్పుడు పిటిషనర్ ‘మాండమస్’ కోరలేరని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం తీర్పునిచ్చారు. ఎన్నికల కమిషనర్గా ఏ అధికారంతో కొనసాగుతున్నారో నీలం సాహ్నిని వివరణ కోరడంతోపాటు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా జరిగిన ఆమె నియామకాన్ని రద్దు చేయాలని కోరుతూ విజయనగరం జిల్లాకు చెందిన న్యాయవాది మహేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ నియామకం కూడా అలాగే జరిగింది.. ‘‘మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్’ ప్రకారం జడ్జిల నియామకాలు జరుగుతాయి. దీని ప్రకారం.. సీఎం ఓ న్యాయవాది పేరును జడ్జి పోస్టుకు సిఫారసు చేయొచ్చు. అలా సిఫారసు చేసిన పేరును ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇలా జడ్జి అయిన న్యాయవాది.. న్యాయమూర్తిగా స్వతంత్రంగా వ్యవహరించలేరని ఎవరైనా చెప్పగలరా? ఇదే తీరులో ప్రస్తుత కేసులో కూడా గవర్నర్ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే నీలం సాహ్నిని ఎన్నికల కమిషనర్గా నియమించారు. ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యే నాటికి ఆమె ప్రధాన సలహాదారు పోస్టులో లేరు. కాబట్టి ఆమె రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్నారని చెప్పడానికి వీల్లేదు’ అని జస్టిస్ దేవానంద్ తన తీర్పులో పేర్కొన్నారు. -
చేతులెత్తే విధానంలో.. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నిక
సాక్షి, అమరావతి: ఈ నెల 24, 25 తేదీల్లో జరగనున్న ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు.. సభ్యులు చేతులు ఎత్తే విధానంలో జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నీలం సాహ్ని సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలకు లేఖ రాశారు. మండల, జిల్లా పరిషత్ల వారీగా ఆ రోజు జరిగే ప్రత్యేక సమావేశాల్లో ఉపాధ్యక్షులు, వైస్ చైర్మన్లు, కోఆప్టెడ్ సభ్యుల ఎన్నిక కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా అనుసరించాల్సిన విధానాన్ని ఎస్ఈసీ ఆ లేఖలో వివరించారు. నిర్ణీత కోరం ప్రకారం.. మండల పరిధిలో కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులలో సగం మంది హాజరైతేనే ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవితో పాటు కోఆప్టెడెడ్ సభ్యల ఎన్నిక నిర్వహించాలని ఆమె సూచించారు. అదే విధంగా.. జిల్లా పరిధిలో ఎన్నికైన జెడ్పీటీసీలలో సగం మంది హాజరైతే జెడ్పీ చైర్మన్, ఇద్దరు వైస్ చైర్మన్లు, ఇద్దరు కోఆప్టెడెడ్ సభ్యుల ఎన్నిక నిర్వహించాలన్నారు. ఈ ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకే ఓటు హక్కు ఉంటుందని.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఉండదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టంచేసింది. అయితే, ఎన్నిక జరుగుతున్న సమయంలో వారు ఎక్స్ అఫీషియో సభ్యుని హోదాలో ఆ సమావేశాల్లో పాల్గొనవచ్చని తెలిపింది. ఎన్నిక జరిగే సమయంలో వారికి సమావేశ మందిరంలో ముందు వరుస సీట్లు కేటాయించాలని కమిషన్ ఆ లేఖలో పేర్కొంది. ఇక ఎంపీపీ ఎన్నిక పూర్తయితే ఆ మండలంలో ఉపాధ్యక్ష ఎన్నిక నిర్వహించుకోవాలని.. జెడ్పీ చైర్మన్ ఎన్నిక పూర్తయితే ఇద్దరు వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ కొనసాగించాలని కూడా తెలిపింది. ‘విప్’ అధికారం జనసేనకు లేదు ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో తమ పార్టీ సభ్యులకు విప్ జారీచేసే అధికారం ఎస్ఈసీ వద్ద గుర్తింపు కలిగిన 18 రాజకీయ పార్టీలకు మాత్రమే ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంటూ వాటి పేర్లను ప్రకటించింది. ఆ జాబితాలో అధికార వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ వంటి పార్టీలు ఉన్నాయి. అయితే, జనసేన పార్టీకి అందులో చోటు దక్కలేదు. గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీగా జనసేనకు ఆ హోదా లేకపోవడంతో విప్ జారీచేసే అధికారం ఆ పార్టీకి దక్కలేదని కమిషన్ కార్యాలయ అధికారులు తెలిపారు. 24న ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు అన్ని మండల పరిషత్లలో ప్రత్యేక సమావేశం నిర్వహించి కొత్తగా ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికైన వారితో ప్రమాణస్వీకారం చేయించాలని నీలం సాహ్ని ఆదేశించారు. అలాగే, 25వ తేదీ మధ్యాహ్నం జిల్లా పరిషత్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసి జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించాలని ఆమె సూచించారు. -
నాలుగు ఎంపీటీసీ స్థానాల్లో రీపోలింగ్?
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కడప: లెక్కించాల్సిన బ్యాలెట్ పేపర్లు తడవడంతో నాలుగు ఎంపీటీసీ స్థానాలో రీ పోలింగ్ జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి అందిన నివేదిక మేరకు శ్రీకాకుళం జిల్లా మందస మండలం అంబుంగం ఎంపీటీసీ స్థానంలో నాలుగు పోలింగ్ కేంద్రాల్లో, విశాఖపట్నం జిల్లా గొలిగొండ మండలం పాకాలపాడు ఎంపీటీసీ పరిధిలో రెండు బూత్ల్లోనూ రీపోలింగ్కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనుమతి తెలిపినట్టు తెలిసింది. కాగా, ఇలాగే బ్యాలెట్ బాక్సులు తడిచిపోవడంతో వైఎస్సార్ జిల్లాలో కొర్రపాడు, గొరిగెనూరు ఎంపీటీసీ స్థానాలకు రీపోలింగ్ నిర్వహించే అంశంపై ఆ జిల్లా అధికారులు ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులను సంప్రదించారు. అయితే, రాత్రి 12 గంటల సమయానికి ఆ రెండు ఎంపీటీసీలకు సంబంధించి అధికారులకు ఎలాంటి లిఖితపూర్వక నివేదికలు అందని కారణంగా అక్కడ ఎలాంటి అ«ధికార నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. కొర్రపాడు ఎంపీటీసీ స్థానానికి సంబంధించి మూడు బ్యాలెట్ బాక్సులకుగాను ఒక బాక్సులో నీళ్లు చేరడంతో లెక్కింపునకు అంతరాయం కలిగింది. అప్పటికి లెక్కించిన రెండు బ్యాలెట్ బాక్సుల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థి పుష్పలతకు 355 ఓట్ల మెజారిటీ లభించింది. కాగా, మిగిలిన బాక్సులో 600 ఓట్లున్నట్టు సమాచారం. నిబంధనల ప్రకారం.. మొత్తం బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను లెక్కించిన తర్వాతే ఫలితాన్ని ప్రకటించాల్సి ఉంది. ఇదే కారణంతో ముద్దనూరు జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థిని ఉమాదేవికి 6,409 ఓట్ల మెజారిటీ ఉన్నప్పటికీ ఆమె గెలుపొందినట్లు అధికారులు ధ్రువీకరించలేదు. ఇక, జమ్మలమడుగు మండలం గొరిగెనూరు ఎంపీటీసీ స్థానానికి సంబంధించి మూడు బ్యాలెట్ బాక్సులకుగాను రెండింటిలో నీళ్లు చేరడంతో కౌంటింగ్ ఆపేశారు. ఇదే కారణంతో జమ్మలమడుగు జెడ్పీటీసీ ఫలితం కూడా ఆగిపోయింది. ఈ విషయమై జాయింట్ కలెక్టర్ సాయికాంత్వర్మ మాట్లాడుతూ పై విషయాలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని, తదుపరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరికొన్నిచోట్ల బ్యాలెట్ పత్రాలు తడిచినా.. పోలింగ్ జరిగిన ఐదున్నర నెలల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టడం కారణంగా స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సుల్లోకి కొన్నిచోట్ల వర్షపు చెమ్మ చేరి కొన్ని పత్రాలు దెబ్బతినడం, చెదలు పట్టడం చోటు చేసుకున్నాయి. ఆదివారం ఉదయం ఐదారు చోట్ల ఈ పరిస్థితిని అధికారులు గుర్తించారు. బ్యాలెట్ బాక్సుల్లో మొత్తం ఓట్లు దెబ్బతినకుండా కొన్ని మాత్రమే పాడయ్యాయి. దెబ్బతిన్న ఓట్లను పక్కనపెట్టి మిగతా ఓట్లను లెక్కించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆయా జిల్లాల అధికారులకు సూచించింది. -
నేడు ‘ఏలూరు కార్పొరేషన్’ ఫలితాలు
ఏలూరు టౌన్: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. మార్చిలో ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా వేచిచూస్తున్న అభ్యర్థుల గెలుపోటములు వెల్లడి కానున్నాయి. ఏలూరు శివారులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 12 గంటలకల్లా పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే మూడు డివిజన్లు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. మరో 47 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించగా.. వీటికి ఆదివారం ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. కరోనా నిబంధనల నేపథ్యంలో 47 టేబుళ్లపై ఏకకాలంలో రెండు రౌండ్లలో ఓట్లను లెక్కించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. 47 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, మరో 254 మంది సిబ్బందితోపాటు, అదనంగా 200 మంది ఏలూరు కార్పొరేషన్ సిబ్బంది ఎన్నికల కౌంటింగ్ విధుల్లో పాల్గొంటారని నగర కమిషనర్ డి.చంద్రశేఖర్ చెప్పారు. కౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్థితోపాటు ఒక ఏజెంట్కు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. కాగా, ఓట్ల లెక్కింపు జరిగే సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని శనివారం సందర్శించారు. కౌంటింగ్ హాళ్లను, టేబుళ్ల అమరికను పరిశీలించారు. అనంతరం అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపునకు తీసుకున్న చర్యలను జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆమెకు వివరించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేంత వరకు 144 సెక్షన్ విధించామని, మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని ఎస్పీ రాహుల్దేవ్ శర్మ తెలిపారు. మొత్తం 175 మంది పోలీసులను నియమించామన్నారు. -
నిష్ణాతులైన వారే నియామకం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి సలహాదారుల నియామకంలో ఎలాంటి నిబంధనలు లేవని, ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని, పరిపాలన వ్యవహారాల్లో విశేష అనుభవం ఉన్న వారిని సలహాదారులుగా నియమించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. సలహాదారులు నిర్వర్తించాల్సిన విధులను వారి నియామక జీవోల్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంటుందని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ కోర్టుకు వివరించారు. వారి నియామకం తాత్కాలికమైనదని తెలిపారు. ఆ నియామకాలపై ఏ చట్టంలోనూ నిషేధం లేదని, ప్రభుత్వ అవసరాలను బట్టి వారి నియామకం ఉంటుందన్నారు. వీరి నియామకాన్ని ప్రజాధనం వృథా అనే కోణంలో చూడటానికి వీల్లేదని తెలిపారు. న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ స్పందిస్తూ.. సలహాదారులను నియమించే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్నారా? వారు మీడియాతో మాట్లాడవచ్చా అని ప్రశ్నించారు. గతంలో ఎవరూ మీడియాతో మాట్లాడలేదన్నారు. ఏజీ వాదనలు వినిపిస్తూ.. గతంలో సలహాదారులు మీడియాతో మాట్లాడారని తెలిపారు. సాహ్ని నియామకం సరైనదే.. పాలనా వ్యవహారాల్లో విశేష అనుభవం ఉండటం వల్ల ఐఏఎస్ అధికారులుగా పనిచేసిన వారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నియమించడం సంప్రదాయంగా వస్తోందని శ్రీరామ్ కోర్టుకు వివరించారు. ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకం విషయంలో గవర్నర్కు ముఖ్యమంత్రి ఏ రకమైన సలహాలు ఇవ్వలేదని, సిఫారసు చేయలేదని తెలిపారు. ఒకవేళ సలహా ఇచ్చినా, సిఫారసు చేసినా దానికి గవర్నర్ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్నారు. పరిపాలనలో సమర్థత కలిగిన వారి పేర్లను ముఖ్యమంత్రి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారని, అంతిమంగా గవర్నర్ తన విచక్షణాధికారం మేరకే నీలం సాహ్నిని నియమించారని వివరించారు. ముఖ్యమంత్రి సలహాదారు పదవికి రాజీనామా చేసిన తర్వాతే ఆమె ఎస్ఈసీగా నియమితులయ్యారని చెప్పారు. ఆమె నియామకం విషయంలో నిబంధనల ఉల్లంఘన జరగలేదన్నారు. ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకం రద్దు చేయాలని కోరుతూ విజయనగరం జిల్లాకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కో వారెంటో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ తరఫున న్యాయవాది బి.శశిభూషణ్రావు శుక్రవారం వాదనలు వినిపిస్తూ.. నీలం సాహ్ని ముఖ్యమంత్రి సలహాదారుగా వ్యవహరించారని, ఆమె పేరును గవర్నర్కు సీఎం సిఫారసు చేశారని తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, ఎస్ఈసీగా ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారులే నియమితులు కావాలని నిబంధనలు చెబుతున్నప్పుడు, వారికి ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఎస్ఈసీ నియామకం, పిటిషనర్ విచారణార్హత తదితరాలపై గవర్నర్ ముఖ్య కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి వాదనల నిమిత్తం హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆ వ్యాజ్యానికి విచారణార్హత లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నీలం సాహ్నిని నియమించడం వల్ల పిటిషనర్ వ్యక్తిగత హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లలేదని, అందువల్ల ఈ పిటిషన్కు విచారణార్హత లేదని గవర్నర్ ముఖ్య కార్యదర్శి తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. సాహ్ని నియామకం వల్ల తనకు ఎలా వ్యక్తిగత నష్టం జరిగిందో, ఆమె నియామకం వల్ల ఏ రకంగా ప్రభావితం అయ్యారో ఎక్కడా చెప్పలేదని వివరిం చారు. వ్యక్తిగతంగా హక్కులు ప్రభావితం కానప్పుడు అది ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) అవుతుందని, పిల్ను ధర్మాసనమే విచారించాల్సి ఉం టుందన్నారు. అలాగే పిటిషనర్ కో–వారెంటో ఉత్తర్వులు కోరుతున్నారని, కో–వారెంటో పిటిషన్ దాఖలు చేసినప్పుడు దానిని ఎవరు విచారించాలన్న విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి (సీజే) నిర్ణయిస్తారని తెలిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది బి.శశిభూషణ్రావు స్పందిస్తూ.. నీలం సాహ్ని నియామకం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉందని, అందువల్లే ఓ పౌరుడిగా సవాల్ చేశారని చెప్పారు. హెకోర్టు తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది.. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్ని నియామకాన్ని రద్దు చేయాలని కోరుతూ విజయనగరం జిల్లాకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కో–వారెంటో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఏఎస్జీ) చింతల సుమన్ గత విచారణ సమయంలో న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రభుత్వ సలహాదారుల నియామక విధానం, వారి విధులు, బాధ్యతలు తదితరాలకు సంబంధించిన వివరాలతో అఫిడవిట్ దాఖలు చేశారు. -
నీలం సాహ్ని నియామకం సరైనదే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా విశ్రాంత ఐఏఎస్ అధికారి నీలం సాహ్ని నియామకం సరైనదేనని గవర్నర్ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మంగళవారం హైకోర్టుకు నివేదించారు. రాజ్యాంగంలోని అధికరణ 243కే కింద తనకున్న విచక్షణాధికారాల మేరకు గవర్నర్ ఆమెను నియమించారని తెలిపారు. ఎస్ఈసీ నియామకానికి గవర్నర్ పెద్ద ఎత్తున కసరత్తు చేశారని వివరించారు. 25 ఏళ్ల అనుభవం ఉండి, గత మూడేళ్ల కాలంలో పదవీ విరమణ చేసిన 11 మంది విశ్రాంత ఐఏఎస్ అధికారుల పేర్లను, వారి వార్షిక పనితీరు మదింపు నివేదికలను (ఏపీఏఆర్) తెప్పించుకుని పరిశీలించారని చెప్పారు. ఇందులో నీలం సాహ్నికి గత ఐదేళ్లుగా 10 గ్రేడింగ్ ఉందని, మిగిలిన ఏ అధికారికీ ఇంత గ్రేడింగ్ లేదన్నారు. అలాగే ఆమెపై ఎలాంటి కేసులు, ప్రొసీడింగ్స్ పెండింగ్లో లేవని తెలిపారు. పిటిషనర్ వాదనల్లో అర్థం లేదు.. నీలం సాహ్నిని ఎస్ఈసీగా నియమించే ముందు సుప్రీంకోర్టు తీర్పును సైతం గవర్నర్ పరిగణనలోకి తీసుకున్నారని మీనా కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేస్తేనే ఆమెను ఎస్ఈసీగా నియమించాలని గవర్నర్ షరతు విధించారని, దీంతో ఆమె ఆ పదవికి రాజీనామా చేశారన్నారు. రాజీనామాను ప్రభుత్వం ఆమోదించాకే ఆమెను ఎస్ఈసీగా నియమించారని వివరించారు. అందువల్ల ప్రభుత్వ సలహాదారును ఎస్ఈసీగా నియమించారంటూ పిటిషనర్ చేస్తున్న వాదనలో అర్థం లేదన్నారు. అధికరణ 243కే కింద గవర్నర్ కార్యనిర్వాహక నిర్ణయాధికారాన్ని ఉపయోగించి తీసుకునే నిర్ణయాలపై న్యాయ సమీక్షకున్న అవకాశం చాలా స్వల్పమని గుర్తు చేశారు. నిరాధార ఆరోపణలు, స్వీయ ప్రకటనల ఆధారంగా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయడం ద్వారా పిటిషనర్ న్యాయప్రక్రియను దుర్వినియోగం చేశారని తెలిపారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాన్ని కొట్టేయాలని ఆయన కోర్టును కోరారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకే.. ఎన్నికల కమిషనర్గా ఏ అధికారంతో కొనసాగుతున్నారో నీలం సాహ్నిని వివరణ కోరడంతో పాటు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా జరిగిన ఆమె నియామకాన్ని రద్దు చేయాలని కోరుతూ విజయనగరం జిల్లాకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కోవారెంటో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు మీనా కౌంటర్ దాఖలు చేశారు. కోవారెంటో పిటిషన్ మంగళవారం విచారణకు రాగా ప్రభుత్వంతోపాటు ఇతరులు దాఖలు చేసిన కౌంటర్లకు సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్ తరఫు న్యాయవాది బి.శశిభూషణ్రావు గడువు కోరడంతో న్యాయమూర్తి అందుకు అంగీకరిస్తూ విచారణను జూలై 8కి వాయిదా వేశారు. గవర్నర్ పరిగణనలోకి తీసుకున్న 11 మంది అధికారులతో పాటు సీఎంవో విశ్రాంత ఐఏఎస్లు శామ్యూల్, ఎల్.ప్రేమచంద్రారెడ్డి పేర్లను సూచించిందని మీనా పేర్కొన్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుని నీలం సాహ్ని వైపు గవర్నర్ మొగ్గు చూపారన్నారు. ఆమె సీఎస్గా పనిచేశారని, ఆ పోస్టు ప్రభుత్వాలతో సంబంధం లేని తటస్థ పోస్టు అని తెలిపారు. -
నీలం సాహ్ని నియామకంపై వేసిన పిటిషన్ ఉపసంహరణ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పిటిషనర్ తన పిల్ను విత్డ్రా చేసుకున్నట్లు అతడి తరఫు న్యాయవాది గురువారం కోర్టుకు తెలిపాడు. ఈ క్రమంలో ఈ పిటిషన్ డిస్పోజ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల క్రితం నీలం సాహ్ని నియామకానికి సంబంధించిన జీవోను రద్దు చేయాలంటూ విజయవాడకు చెందిన గుర్రం రామకృష్ణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల్లేకుండా ఎందుకు పిల్ వేశారని ప్రశ్నించింది. పిల్ దాఖలు చేయడమంటే ఆషామాషీ అయిపోయిందని వ్యాఖ్యానించింది. వాయిదా కోసం న్యాయవాది పదే పదే అభ్యర్థించడంతో ధర్మాసనం అందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో పిటిషన్దారు తన పిల్ను ఉపసంహరించుకున్నాడు. చదవండి: పిల్ వేయడమంటే ఆషామాషీ అయిపోయింది.. -
సింగిల్ జడ్జి ఆదేశాలను రద్దు చేయండి
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను గతంలో ఏ దశలో అయితే నిలిచిపోయాయో అక్కడి నుంచి తిరిగి నిర్వహించాలని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి గత నెల 21న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ధర్మాసనం ముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి ఆదేశాలను రద్దు చేయాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ అప్పీల్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరపనుంది. కేసుతో సంబంధం లేని అంశాల ప్రస్తావన సింగిల్ జడ్జి తన తీర్పులో ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని అంశాలను ప్రస్తావించారని, అంతర్జాతీయ ఒడంబడికలు, అవసరానికి మించి తీర్పులను ప్రస్తావించారని ఎస్ఈసీ నివేదించారు. టీడీపీ నేత వర్ల రామయ్య, జనసేన దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన సింగిల్ జడ్జి, జనసేన పిటిషన్ ఆధారంగా తీర్పు వెలువరించారన్నారు. ఎన్నికల తేదీకి 4 వారాల ముందు నియమావళి అమలు చేయాలని జనసేన తన పిటిషన్లో ఎక్కడా కోరలేదని, అయినా సింగిల్ జడ్జి ఆ అంశం ఆధారంగా ఎన్నికలను రద్దు చేశారని ఎస్ఈసీ పేర్కొన్నారు. 4 వారాల ముందు నియమావళి అమలు చేయాలని వర్ల రామయ్య కోరితే సింగిల్ జడ్జి ఆ పిటిషన్ను కొట్టివేశారన్నారు. సింగిల్ జడ్జి తీర్పులో పరస్పర విరుద్ధమైన అంశాలనేకం ఉన్నాయన్నారు. సింగిల్ జడ్జి వ్యాఖ్యలు సరికాదు.. సింగిల్ జడ్జి ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే కాకుండా తనపై వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. సింగిల్ జడ్జి అలా మాట్లాడకుండా ఉండాల్సిందన్నారు. ఓ రాజ్యాంగ సంస్థగా హైకోర్టు స్వతంత్రంగా విధులు నిర్వహిస్తున్న మాదిరిగానే ఎన్నికల కమిషనర్ కూడా బాధ్యతలు నిర్వర్తిస్తారని తెలిపారు. సింగిల్ జడ్జి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను తీర్పు నుంచి తొలగించాలని కోరారు. ఉమ్మడిగా వర్తిస్తుంది.. స్థానిక సంస్థల కాలపరిమితి 2018–19లోనే ముగిసిందని, వాటికి సత్వరమే ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్పై ఉందన్న విషయాన్ని సింగిల్ జడ్జి విస్మరించారన్నారు. సుప్రీంకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలు అని తన ఉత్తర్వుల్లో చెప్పిందే కానీ ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ అంటూ వేర్వేరుగా చెప్పలేదన్నారు. అందువల్ల 4 వారాల ఎన్నికల నియమావళి అమలు అన్ని ఎన్నికలకు ఉమ్మడిగా వర్తిస్తుందన్నారు. కాబట్టి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నాలుగు వారాల నియమావళి అమలు చేయలేదన్న వాదన చెల్లదన్నారు. సుప్రీం ఎన్నోసార్లు చెప్పింది.. ఎన్నికల ప్రక్రియ ఒకసారి మొదలయ్యాక అందులో జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తీర్పులిచ్చిందని, సింగిల్ జడ్జి అందుకు విరుద్ధంగా వ్యవహరించి, ఎన్నికలను రద్దు చేశారని ఎస్ఈసీ వివరించారు. ఎన్నికల నిర్వహణకు రూ.150 కోట్ల ప్రజాధనం ఖర్చు అయిందన్న విషయాన్ని సింగిల్ జడ్జి పరిగణలోకి తీసుకోలేదన్నారు. -
రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు కరోనా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి కరోనా బారిన పడ్డారు. గురువారం ఆయనకు కోవిడ్ పరీక్ష నిర్వహించగా శుక్రవారం ఫలితాలు వచ్చాయి. తనకు పాజిటివ్గా నిర్ధారణైందని పార్థసారథి ధ్రువీకరించారు. స్వల్పజ్వరంతో బాధపడుతున్నట్టు తెలిపారు. కాగా ఈ నెల 28న నిమ్స్లో ఆయన కోవిడ్ టీకా తొలిడోసు వేసుకున్నారు. ఇదిలాఉంటే రాష్ట్రంలో పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల ఏర్పాట్లలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిమగ్నమైంది. అందులో భాగంగా ఈ నెల 7న ఎస్ఈసీ కార్యాలయం నుంచి పార్థసారథి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పరిషత్ ఎన్నికల రోజున సెలవు ప్రకటించాలి: ఎస్ఈసీ
సాక్షి, అమరావతి: పరిషత్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్ రోజున(ఏప్రిల్ 8) సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నీలం సాహ్ని ప్రభుత్వాన్ని కోరారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో కార్యాలయాలు, వ్యాపారాలు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ ప్రదేశాల్లో అన్ని నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి కలెక్టర్లను ఆదేశించారు. ఎన్నికల విధుల నిర్వహణకు ప్రభుత్వ వాహనాలు వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తూ జీఓ జారీ చేశారు. వాహనాలు వినియోగానికి అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పబ్లిక్ మీటింగ్ల నిర్వహణకు రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని.. ఒకే ప్రదేశంలో, ఒకే సమయానికి మీటింగ్లు నిర్వహించాల్సి వన్తే ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికే అనుమతులిస్తామని స్పష్టం చేశారు. పోలింగ్ విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా పనిచేయరాదని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాలను అధికారుల వద్దకు చేర్చే బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. పంచాయితీ ఎన్నికల్లో చూపుడు వేలుకు వేసిన ఇంక్ మార్క్ ఇంకా పోయి ఉండదు కాబట్టి పరిషత్ ఎన్నికల్లో ఎడమ చేతి చిటికెన వేలుకు ఇంక్ రాసేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. -
‘పరిషత్’ ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నితో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శనివారం భేటీ అయ్యారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు జిల్లాల్లో పక్కా ఏర్పాట్లు చేసినట్టు ఆమెకు వివరించారు. ఎన్నికల ఏర్పాట్లపై చర్చించేందుకు ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ కూడా ఎస్ఈసీతో వేరుగా భేటీ అయ్యారు. ఆ తరువాత ద్వివేది, గిరిజాశంకర్ తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో 13 జిల్లాల ఎన్నికల సూపర్వైజరీ అధికారులతో సమావేశమయ్యారు. సూపర్వైజరీ అధికారులు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మేరకు జిల్లాల్లోని అధికారులను సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టాలని ద్వివేది ఆదేశించారు. -
ఏపీ: హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఎస్ఈసీ
సాక్షి, అమరావతి: హైకోర్టులో ఎస్ఈసీ అఫిడవిట్ దాఖలు చేశారు. నిబంధనల ప్రకారమే ఆంధ్రప్రదేశ్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎస్ఈసీ నీలం సాహ్ని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికలు జరుపుతున్నామన్నారు. గత ఏడాది కరోనా కారణంగా ఎన్నికలు నిలిచిపోయాయని.. నిలిచిపోయిన ఎన్నికలను యథావిధిగా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. గత ఏడాది నోటిఫికేషన్ ప్రకారంగా ఎన్నికల నిర్ణయం తీసుకున్నామని వివరించారు. రిట్ అప్పీల్ను డిస్మిస్ చేసి ఎన్నికలు సజావుగా జరిగేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును ఎస్ఈసీ కోరారు. చదవండి: ఆటంకాలు లేవని తేలాకే నోటిఫికేషన్ జెండా ఎత్తేసిన చంద్రబాబు -
ఎన్నికల పరిశీలకులతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి: ఎన్నికల పరిశీలకులతో ఎస్ఈసీ నీలంసాహ్ని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి జిల్లాకు ఇద్దరు పరిశీలకులను నియమించారు. ఎన్నికల వ్యయ పరిశీలకులుగా ఐఎఫ్ఎస్ అధికారి, నిర్వహణ పరిశీలకులుగా ఐఏఎస్ అధికారి బాధ్యతలు నిర్వహిస్తారు. ఎన్నికల కోడ్ నిర్వహణపై ఎస్ఈసీ నీలంసాహ్ని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమన్వయం చేసుకోవాలని ఎన్నికల పరిశీలకులకు ఎస్ఈసీ నీలంసాహ్ని సూచించారు. రాజకీయ పార్టీలతో కూడా శుక్రవారం ఉదయం ఎస్ఈసీ నీలం సాహ్ని సమావేశం నిర్వహించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో పార్టీల సహకారంపై చర్చించారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతల అభిప్రాయాలను ఎస్ఈసీ తీసుకున్నారు. చదవండి: ఏపీ: రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ సమావేశం పరువు కోల్పోయేకంటే ఇదే బెటర్.. -
ఎన్నికల ప్రారంభం ప్రక్రియల్లో నీలం సాహ్ని
-
ఏపీ: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 8న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనున్నారు. 10న ఫలితాలు ప్రకటించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అవసరమైనచోట్ల ఈనెల 9న రీపోలింగ్ నిర్వహించనున్నారు. గత ఏడాది మార్చి 14న ఎన్నికల ప్రక్రియ నిలిచిన చోట నుంచే ప్రక్రియ కొనసాగనుంది. 513 జెడ్పీటీసీ స్థానాలకు, 7230 ఎంపీటీసీ స్థానాలకు నేడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. జెడ్పీటీసీ ఎన్నికల్లో 2,092 మంది అభ్యర్థులు, ఎంపీటీసీ ఎన్నికల్లో 19,002 మంది అభ్యర్థులు బరిలో నిలవనున్నారు. 126 జెడ్పీటీసీ స్థానాలు, 2371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. చదవండి: పీఆర్సీపై ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు తెలుగు రాష్ట్రాల్లో కలకలం: ఎన్ఐఏ సోదాలు -
కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి: కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ నీలం సాహ్ని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కొనసాగింపుపై ఎస్ఈసీ కసరత్తు చేస్తున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్, అదనపు డీజీలు డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్, సంజయ్, ఎన్నికల కమిషన్ కార్యదర్శి కన్నబాబు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్గా గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని.. అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్ను కలిశారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియపై గవర్నర్తో చర్చించారు. ఎస్ఈసీ నీలం సాహ్నిని చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ కలిశారు. మిగిలిన ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీతో సీఎస్ చర్చలు జరిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్పై ఎస్ఈసీ, సీఎస్ చర్చించారు. ఎన్నికల ప్రక్రియను సత్వరం పూర్తిచేయాలని ఎస్ఈసీని సీఎస్ కోరారు. రేపు(శుక్రవారం) రాజకీయ పార్టీల నేతలతో ఎస్ఈసీ సమావేశం నిర్వహించనున్నారు. -
ఏపీ: గవర్నర్ను కలిసిన ఎస్ఈసీ నీలం సాహ్ని
సాక్షి, అమరావతి: గవర్నర్ బిశ్వభూషణ్ను ఎస్ఈసీ నీలం సాహ్ని గురువారం కలిశారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియపై గవర్నర్తో చర్చించారు. కాగా, ఎస్ఈసీ నీలం సాహ్నిని చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ కలిశారు. మిగిలిన ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీతో సీఎస్ చర్చలు జరిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్పై ఎస్ఈసీ, సీఎస్ చర్చించారు. ఎన్నికల ప్రక్రియను సత్వరం పూర్తిచేయాలని ఎస్ఈసీని సీఎస్ కోరారు. ఎన్నికలు పూర్తయితే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉందని సీఎస్ తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీలపై చర్చించారు. సాయంత్రం ఎన్నికల ప్రక్రియపై ఎస్ఈసీ ప్రకటన చేసే అవకాశం ఉంది. గత ఏడాది జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయ్యింది. కేవలం 6 రోజుల ఎన్నికల ప్రక్రియ మిగిలి ఉంది. వ్యాక్సినేషన్కు ఇబ్బంది కాకుండా ఎన్నికలు పూర్తిచేసే యోచనలో ప్రభుత్వం ఉంది. చదవండి: ఏపీ: ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని ఉద్యోగం పోయే చివరిరోజు శ్రీరంగనీతులా? -
ఏపీ: ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని
-
ఆగిన చోట నుంచే ఆరంభం: ఎస్ఈసీ నీలం సాహ్ని
సాక్షి, అమరావతి: ఏడాది క్రితం అర్థాంతరంగా ఆగిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీలు ఖరారయ్యాయి. కొత్తగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమితులైన నీలంసాహ్ని తాను బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు గురువారం ఎన్నికల కొనసాగింపు నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్పట్లో ఆగిన చోట నుంచే ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టి ఈ నెల 8వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య పోలింగ్ నిర్వహిస్తారు. అవసరమైన చోట 9వ తేదీన రీ పోలింగ్ జరిపి, పదవ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. కనీసం ఐదు రోజులు పూర్తిగా ప్రచారానికి అవకాశం ఉండేలా.. ఎన్నికల కొనసాగింపు ప్రకటనకు, పోలింగ్ తేదీకి మధ్య ఆరు రోజుల సమయం కేటాయించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్టు నీలం సాహ్ని ప్రకటించారు. 526 జెడ్పీటీసీ స్థానాలకు, 7,321 ఎంపీటీసీ స్థానాలకు.. ఏడాది క్రితం నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ ముగియగా.. ఏకగ్రీవమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు మినహాయించి 526 జెడ్పీటీసీ స్థానాలు, 7,321 ఎంపీటీసీ స్థానాల్లో 8వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10,047 ఎంపీటీసీ స్థానాలు ఉండగా కోర్టు కేసు కారణంగా కొన్ని చోట్ల ఎన్నికలు వాయిదా పడగా, 9,692 ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే అప్పట్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. వాటిలో 2,371 ఏకగ్రీవం కాగా, మిగిలిన 7,321 చోట్ల ఇప్పుడు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఎంపీటీసీ స్థానాల్లో మొత్తం 19,000 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర వ్యాప్తంగా 660 జెడ్పీటీసీ స్థానాలకు గాను 652 చోట్ల ఎన్నికలు జరిపేందుకు అప్పట్లో నోటిఫికేషన్ జారీ అయింది. అందులో 126 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 526 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. జడ్పీటీసీ స్థానాలలో మొత్తం 2092 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. చకచకా పరిణామాలు.. గురువారం ఉదయం 9.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నీలంసాహ్ని బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను మర్యాదపూర్వకంగాకలిశారు. కొద్దిసేపటికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వచ్చి కొత్త ఎస్ఈసీతో సమావేశమయ్యారు. ఎంపీటీసీ, జడ్పీటీసీఎన్నికలకు సంబంధించి మిగిలిపోయిన ఆరు రోజుల ప్రక్రియ పూర్తయితే గ్రామీణ ప్రాంతాల్లో కరొనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగించే వీలుంటుందన్న అంశాన్ని ఆయన నీలం సాహ్నితో వివరించినట్టు తెలిసింది. పంచాయతీరాజ్, పోలీసు అధికారులతో సమావేశం.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సీఎస్ నుంచి అందిన వినతి మేరకు కొత్త ఎస్ఈసీ నీలంసాహ్ని ఎన్నికల నిర్వహణ స్థితిగతులను తెలుసుకునేందుకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్, శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్తో గురువారం మధ్యాహ్నం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయ కార్యదర్శి కన్నబాబు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పంచాయతీరాజ్ కమిషనర్, పోలీసు అదనపు డీజీ లిద్దరూ ఎన్నికల నిర్వహణకు సన్నదద్దతను తెలియజేయడంతో క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణ స్థితిగతులను తెలుసుకునేందుకు సాయంత్రం జిల్లా కలెక్టర్లు, ఎస్సీలు, జడ్పీ సీఈవోలు, డీపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు సిద్దంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశాలు.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కొనసాగింపునకు పూర్తి సన్నద్దంగా ఉండాలంటూ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో నీలం సాహ్ని స్పష్టం చేశారు. బ్యాలెట్ పేపరు ముద్రణ, బ్యాలెట్ బాక్సు్ల, సరిపడినన్ని ఓటర్ల జాబితాలు సిద్దం చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను వేగంగా పూర్తి చేసుకోవాలని సూచించారు.వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ కూడా వీడియో కాన్ఫరెన్సో్ల పాల్గొని కరోనా జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్లకు సూచనలు చేశారు. కాగా, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కొనసాగింపుపై సూచనలు తీసుకునేందుకు శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. 19 రాజకీయ పార్టీలకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు కమిషన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. పార్టీ అభ్యర్ధులు చనిపోయిన చోట ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీల తరుఫున పోటీలో ఉండి, అభ్యర్ధులు చనిపోయిన చోట నిబంధనల ప్రకారం ఆయా పార్టీలు మరో అభ్యర్థిని నిలబెట్టేందుకు వీలుగా ఆ స్థానాల్లో ఎన్నికలు తాత్కాలికంగా మరికొంత కాలం వాయిదా వేయాలని నిర్ణయించారు. స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీలో ఉన్న వారు మరణించిన చోట మాత్రం ఎన్నికలను యధావిధిగా కొనసాగిస్తారు. అయితే, చనిపోయిన అభ్యర్ధి పేరు బ్యాలెట్ నుంచి ™తొలగిస్తారు. ఏకగ్రీవమైన వారితో కలిసి ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉన్న వారిలో 88 మంది, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉన్న వారిలో 13 మరణించినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం గుర్తించింది. ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉండి చనిపోయిన 88 మందిలో ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు చనిపోయారని, అక్కడ మాత్రమే ఎన్నికలు యధావిధిగాకొనసాగుతాయని అదికారులు తెలిపారు. జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉండి చనిపోయిన13 మందిలో ఒక స్వతంత్ర అభ్యర్ధి ఉన్నారని, అక్కడ మాత్రం ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. ఏకగ్రీవాలపైనా కలెక్టర్లకు స్సష్టత ఏడాది క్రితం నామినేషన్ ఉపసంహరణ రోజే 2371 ఎంపీటీసీ స్థానాలలో ఎన్నికలు ఏకగ్రీవం కాగా, 126 జడ్సీ స్థానాలు ఏకగ్రీవంగానే ముగిశాయి. ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు స్పష్టత ఇవ్వడంతో పాటు ఎన్నికల నిబంధనలు ప్రకారం అలాంటి వారికి స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారులు గెలుపొందినటుŠుట ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారు ఏడాది క్రిత్రమే ధృవీకరణ పత్రాలు అందుకున్నప్పటికీ కొత్తగా ఎన్నికైన సభ్యులతో సమానంగా పదవీ కాలం ఉంటుంది. ఈ మేరకు నీలంసాహ్ని గురువారం కలెక్టర్లు, అధికారులకు స్పష్టత ఇచ్చినట్టు తెలిసింది. స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నీలంసాహ్ని బాధ్యతలు చేపట్టిన సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం మీడియాకు ఒక వీడియో సందేశం విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తాను పక్షపాతం లేకుండా పనిచేస్తానని, ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహిస్తాననినీలం సాహ్ని పేర్కొన్నారు. చదవండి: ఉద్యోగం పోయే చివరిరోజు శ్రీరంగనీతులా? -
నిమ్మగడ్డ వాస్తవాలను దాచిపెట్టారు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పనిచేసిన నిమ్మగడ్డ రమేశ్కుమార్ కోర్టు ముందు వాస్తవాలను దాచి పెట్టారని, ఇందుకు గాను అతనిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని గవర్నర్ ముఖ్య కార్యదర్శి ముఖేష్కుమార్ మీనా తరఫు న్యాయవాది సీవీ మోహన్రెడ్డి హైకోర్టును అభ్యర్థించారు. తన ప్రత్యేక హక్కులో భాగంగా గవర్నర్కు రాసిన లేఖలు గవర్నర్ కార్యాలయం ద్వారానే లీక్ అయ్యాయని పరోక్షంగా చెబుతూ హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్ వేశారని పేర్కొన్నారు. అయితే, మార్చి 12న గవర్నర్కు రాసిన లేఖ కాపీలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శికి సైతం పంపారని, ఈ విషయాన్ని ఆయన తన పిటిషన్లో ప్రస్తావించకుండా దాచిపెట్టారని మోహన్రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాస్తవాలను దాచిపెట్టడం ద్వారా నిమ్మగడ్డ న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించారని, దీనిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎస్ఈసీ హోదాలో కాకుండా వ్యక్తిగత హోదాలో నిమ్మగడ్డ రమేశ్ ఈ వ్యాజ్యం దాఖలు చేశారని, ఎన్నికల కమిషన్ లేదా ఎన్నికల కమిషనర్ పిటిషన్ దాఖలు చేయలేదని తెలిపారు. అందువల్ల ఆయన రాజ్యాంగ వ్యవస్థగా తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని ఫిర్యాదు చేయజాలరని వివరించారు. వ్యక్తిగత హోదాలో పిటిషన్ దాఖలు చేసి, గవర్నర్కు, ఎన్నికల కమిషనర్కు మధ్య రాసిన లేఖలు లీక్ అయ్యాయంటూ కోర్టును ఆశ్రయించడానికి వీల్లేదని తెలిపారు. అందువల్ల ఆయన దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేయాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంలో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనల నిమిత్తం హైకోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. తన ప్రత్యేక హక్కులో భాగంగా గవర్నర్తో తాను సాగించిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ బహిర్గతం అయ్యాయని, దీనిపై దర్యాప్తు చేసేలా కేంద్ర హోంశాఖను, సీబీఐని ఆదేశించాలని కోరుతూ నిమ్మగడ్డ రమేశ్కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు బుధవారం మరోసారి విచారించారు. రహస్య లేఖ ఎలా అవుతుంది.. మార్చి 12న నిమ్మగడ్డ మధురై, రామేశ్వరం వెళుతున్నట్టు గవర్నర్కు సమాచారం ఇచ్చారని, ఇది రహస్య లేఖ ఎలా అవుతుందని గవర్నర్ ముఖ్య కార్యదర్శి తరఫు న్యాయవాది ప్రశ్నించారు. నిమ్మగడ్డ ఈ లేఖలోని కొంత భాగాన్ని మాత్రమే హైకోర్టు ముందుంచి మోసపూరితంగా వ్యవహరించారని కోర్టుకు తెలిపారు. ఆ లేఖను పూర్తిగా పరిశీలిస్తే ఆ లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శికి పంపిన విషయం అర్థమవుతోందని కోర్టుకు నివేదించారు. వారి కార్యాలయాల్లో కూడా లీక్ అయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. లేఖల లీక్పై సీబీఐ దర్యాప్తు కోరుతున్నారని, సీబీఐ దర్యాప్తు చేపట్టి ఏం తేలుస్తుందని ప్రశ్నించారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టంలో నిర్దేశించిన నేరాల విషయంలో మాత్రమే సీబీఐ దర్యాప్తు చేయగలుగుతుందన్నారు. నిమ్మగడ్డ తన పిటిషన్లో ఎక్కడా నేరం జరిగినట్టు చెప్పలేదని, అలాంటప్పుడు సీబీఐ ఎలా దర్యాప్తు చేయగలుగుతుందన్నారు. సీబీఐ తన పరిధి దాటి వ్యవహరించడానికి వీల్లేదన్నారు. అధికరణ 226 కింద పిటిషనర్ కోరిన అభ్యర్థనను న్యాయస్థానం మన్నించడానికి వీల్లేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. సోషల్ మీడియాలో పోస్టులపై సీబీఐ నివేదిక తదుపరి విచారణ జూన్ 28కి వాయిదా పలు కేసుల్లో హైకోర్టు తీర్పుల సందర్భంగా న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో వెలువడిన పోస్టులపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ ప్రాథమిక విచారణ నివేదికను హైకోర్టుకు సమర్పించింది. దీనికి సంబంధించిన వ్యాజ్యంపై జస్టిస్ బాగ్చీ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు.. రోడ్డుపై తాగి న్యూసెన్స్ సృష్టించిన నర్సీపట్నం వైద్యుడు డాక్టర్ సుధాకర్ను పోలీసులు అదుపు చేయడంపై హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినప్పుడు.. ఇలా పలు సందర్భాల్లో హైకోర్టు తీర్పులిచ్చినప్పుడు సామాజిక మాధ్యమాల్లో న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై పోస్టులు వెలువడిన విషయం విదితమే. వీటిపై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ అధికారులు కొందరిపై కేసులు నమోదు చేశారు. దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేకపోవడంతో సామాజిక మాధ్యమ కంపెనీలైన ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్ వంటి వాటిపై చర్యలు తీసుకోవడంలో సీఐడీ అధికారులు విఫలమయ్యారంటూ హైకోర్టు తరఫున రిజిస్ట్రార్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ గత ఏడాది అక్టోబర్ 12న ఉత్తర్వులిచ్చింది. దర్యాప్తు చేపట్టిన సీబీఐ తన ప్రాథమిక విచారణ నివేదికను హైకోర్టు ముందుంచింది. ఈ మొత్తం వ్యవహారంలో అంతర్జాతీయ సోషల్ మీడియా కంపెనీలు ఉండటంతో వాటినుంచి సమాచారం తెప్పించుకునేందుకు సమయం పడుతుందని, దౌత్యపరమైన మార్గాల ద్వారా సమాచారం తెప్పించుకుంటున్నామని హైకోర్టుకు సీబీఐ నివేదించింది. దర్యాప్తును పూర్తి చేసేందుకు సమయం పడుతుందని వివరించింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, తదుపరి విచారణను జూన్ 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ మంతోజు గంగారావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఏపీ ఎస్ఈసీగా ముగిసిన నిమ్మగడ్డ పదవీ కాలం
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ముగిసింది. బుధవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఆయన పదవీ విరమణ చేశారు. పదవీకాలం ముగియడంతో విజయవాడ నుంచి హైదరాబాద్కి బయలుదేరారు. రేపు(గురువారం) ఉదయం 9.30 కొత్త ఎస్ఈసీగా మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం జెడ్పీ ఎన్నికలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కాగా, జెడ్పీ ఎన్నికలకి ఇప్పటికే కోర్టు అడ్డంకులు తొలగిన సంగతి తెలిసిందే. ఏకగ్రీవాలని ప్రకటించాలని ఇప్పటికే కోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఏకగ్రీవాలని మినహాయించి మిగిలిన జెడ్పిటీసీ, ఎంపీటీసీ స్ధానాలకి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. -
ప్రభుత్వ సాయంతోనే ఇది సాధ్యమైంది: నిమ్మగడ్డ రమేష్
-
ప్రభుత్వ సాయంతోనే ఇది సాధ్యమైంది: నిమ్మగడ్డ
సాక్షి, విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం నుంచి తనకు పూర్తి సహకారం లభించిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. రాష్ట్ర ఎన్ఈసీగా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు(మార్చి 31) పదవీ విరమణ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి, మీడియా ద్వారా అపూర్వ సహకారం అందిందన్నారు. తనకు అందించిన సహకారం ఎంతో విలువైనదని, ఎన్నికల కమిషనర్గా విధులు నిర్వహించడం సంతృప్తి కలిగించిందన్నారు. ఎక్కడా రీపోలింగ్కు అవకాశం లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపామని, అధికారులు సిబ్బంది ఎంతో నిబద్దతతో పనిచేసి ఎన్నికలు సజావుగా నిర్వహించారని ప్రశంసించారు. ప్రభుత్వం పూర్తి సహకారం అందిందని, ప్రభుత్వ సాయంతోనే ఇదంతా సాధ్యమైందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించాలి ‘సీఎస్, డీజీపీ సహా కలెక్టర్లు ఎస్పీలు పూర్తిగా సహకరించారు. రాష్ట్రంలో ఎన్నికలు పారదర్శకంగా జరపాలని హైకోర్టు ఆదేశించింది. మా బాధ్యతలు నిర్వహించడంలో హైకోర్టు మాకు సంపూర్ణ సహకారంగా అందించింది. రాజ్యాంగ వ్యవస్థలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. చట్ట సభలపట్ల పూర్తి విశ్వాసం ఉండాల్సిందే. నేను 7 ఏళ్లపాటు గవర్నర్ కార్యదర్శిగా కూడా గతంలో పనిచేశాను. రాజ్యాంగ వ్యవస్థలపై నాకు అపార విశ్వాసం ఉంది. నామినేషన్ల ఉపసంహరించడంపై హైకోర్టు ఆదేశాలను శిరసావహించా. వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన మంచి పద్దతి అమల్లో ఉంది. అన్నింటినీ నివేదిక రూపంలో క్రోడీకరించి వాటిని అమలు చేయాలని గవర్నర్కు నివేదిక అందిస్తా. చేయాల్సిన సంస్కరణలపై నివేదికలో పొందుపరిచా. సిఫార్సులు అమలు చేస్తే శాశ్వత ప్రయోజనాలు కలుగుతాయి. నాకు వారసులుగా నీలం సాహ్ని ఎస్ఈసీగా బాధ్యతలు నిర్వహిస్తారు. ఎస్ఈసీ నీలం సాహ్నికి అభినందనలు తెలియజేశాను. నేనెప్పుడూ అధికారిక సమాచారాన్ని బయటకు లీక్ చేయలేదు. వ్యవస్థకు సంబంధించి స్వతంత్రత, నిబద్దతపై ఎవరూ రాజీ పడటానికి వీల్లేదు. రాజ్యాంగ వ్యవస్థలు స్వతత్రంగా పనిచేయాలనేదే నా అభిప్రాయం. ప్రభుత్వంతో స్నేహపూర్వక వాతావరణం, తోడ్పాటు ఉన్నప్పుడే మెరుగైన పనితీరు వస్తుంది. అందరి సహకారం వల్లే ఎన్నికలను సజావుగా నిర్వహించగలిగాను.’ అని పేర్కొన్నారు. చదవండి: విజయవాడ రిటైనింగ్ వాల్కు సీఎం జగన్ శంకుస్థాపన నిమ్మగడ్డకు నో అపాయింట్మెంట్ -
నిమ్మగడ్డకు నో అపాయింట్మెంట్
సాక్షి, అమరావతి: గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను కలిసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్కుమార్కు అపాయింట్ మెంట్ దొరకలేదు. నిమ్మగడ్డ పదవీకాలం బుధవారంతో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం గవర్నర్తో భేటీ అయ్యేందుకు అపాయింట్మెంట్ కోరుతూ నిమ్మగడ్డ నాలుగు రోజుల క్రితమే రాజ్భవన్ కార్యాలయ అధికారులకు తెలియజేశారు. అయితే నిమ్మగడ్డను కలిసేందుకు గవర్నర్ ఆసక్తి చూపలేద ని సమాచారం. మంగళవారమంతా కమిషన్ కార్యాలయంలో ఉన్న నిమ్మగడ్డ గవర్నర్ కార్యాలయం నుంచి పిలుపుకోసం ఎదురుచూశారు. కానీ పిలుపు రాకపోవడం తో రమేష్ తీవ్ర నిరాశకు గురయ్యారని సమాచారం. మార్చి 19న తనను అత్యవసరంగా కలవాలంటూ ఒకరోజు ముందు గానే గవర్నర్ సమాచారమిచ్చినప్పటికీ.. తాను హైదరాబాద్లో ఉన్నానంటూ నిమ్మగడ్డ ఆయన్ను కలవని విషయం తెలిసిందే. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను మార్చి నెలాఖరులోగా పూర్తిచేసే అంశంపై చర్చించేందుకే గవర్నర్ అత్యవసరంగా 19న తనను కలవాలని ఎస్ఈసీని ఆదేశించగా, తన హయాంలో ఆ ఎన్నికలు జరిపేందుకు ఏమా త్రం ఆసక్తిగా లేని నిమ్మగడ్డ ఏవో కారణాలు చెప్పి అప్పుడు ఆయన్ని కలవలేదన్న విమర్శలున్నాయి. (చదవండి: ఎన్నికలకు టైం లేదు!) -
ఏపీ: ఎస్ఈసీ పదవికి ముగ్గురి పేర్లు ప్రతిపాదన
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి ముగ్గురు రిటైర్ట్ ఐఏఎస్ అధికారులతో కూడిన ప్యానల్ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కార్యాలయానికి పంపించింది. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, ప్రస్తుతం సీఎం ముఖ్య సలహాదారుగా ఉన్న నీలంసాహ్ని, మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, నవరత్నాల పర్యవేక్షణ సలహాదారు ఎం.శామ్యూల్, ఇంకో రిటైర్డ్ ఐఏఎస్, ప్రస్తుతం రాష్ట్ర పునర్విభజన విభాగం బాధ్యతలు నిర్వహిస్తున్న ఎల్.ప్రేమచంద్రారెడ్డి పేర్లతో కూడిన ప్యానల్ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ విశ్వభూషణ్కు నివేదించింది. ఈ ముగ్గరిలో గవర్నర్ ఎవరి పేరును ఆమోదిస్తే.. వారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ప్రభుత్వం నియమిస్తుంది. ఈ నియామకం జరిగితే వీలైనంత త్వరగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయించి కోవిడ్ వ్యాక్సినేషన్పై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. -
ఎన్నికలకు టైం లేదు!
సాక్షి, అమరావతి: తన హయాంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను జరిపే పరిస్థితి లేదని, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా దీనికి కారణమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేయనున్న తనకు ఈ ఎన్నికలు నిర్వహించేందుకు తగినంత సమయం లేదన్నారు. ఈ మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది క్రితం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసినప్పుడు సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం.. తిరిగి ఎన్నికలు నిర్వహించేటప్పుడు ప్రభుత్వంతో సంప్రదింపుల తర్వాతే కొత్త తేదీలను ఖరారు చేయాలని, పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు నుంచి ఎన్నికల కోడ్ అమలు చేయాలని సూచించిందని నిమ్మగడ్డ అందులో పేర్కొన్నారు. ఎన్నికలకు నాలుగు వారాల ముందు కోడ్ అమలు చేయడం ద్వారా పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలను నిర్వహించానని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విషయంలోనూ ఇదే విధానం అమలు చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆ బాధ్యత తదుపరి ఎస్ఈసీదే నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమలు చేయాల్సి ఉండటం, పోలింగ్ సిబ్బందిని కోవిడ్ వారియర్స్గా గుర్తించి వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడం, మరోవైపు తన పదవీ కాలం ఈ నెలాఖరు (మార్చి 31వ తేదీ)తో ముగుస్తున్న కారణంగా వాయిదా పడిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించలేకపోతున్నట్లు నిమ్మగడ్డ పేర్కొన్నారు. తన తదుపరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు చేపట్టేవారు ఈ ఎన్నికల నిర్వహణ బాధ్యత తీసుకుంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిన్న అలా.. నేడు ఇలా దాదాపు నెలన్నర క్రితం కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యేవరకైనా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కోరినా నిమ్మగడ్డ నిరాకరించారు. ఎన్ని అవాంతరాలు తలెత్తినా తక్షణమే ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలను నిమ్మగడ్డ ప్రారంభించిన విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సినేషన్ పెద్ద ఎత్తున సాగుతున్న సమయంలో అలా మొండిగా వ్యవహరించిన నిమ్మగడ్డ ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించలేకపోవడానికి అదే వ్యాక్సినేషన్ను సాకుగా చూపుతుండటం పట్ల అధికార, రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. -
పోలింగ్కు ముందే పోటీలో ఉన్న 100 మంది మృతి
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో సరిగ్గా వంద మంది పోలింగ్ జరగడానికి ముందే చనిపోయినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖల పరిశీలనలో వెల్లడైంది. మృతుల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వారు సైతం కొందరు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గత ఏడాది మార్చి నెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే. నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తయ్యాక, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ కరోనా పేరుతో ఎన్నికలను వాయిదా వేసిన విషయం కూడా తెలిసిందే. ఇటీవలే గ్రామ పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో.. అప్పట్లో వాయిదా పడిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా సన్నద్ధంగా ఉండేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు ముందస్తు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అప్పట్లో పోటీలో ఉన్న అభ్యర్థుల స్థితిగతులపై అధికారులు వాకబు చేసినట్టు తెలిసింది. 2020 మార్చి 15న ఎన్నికలు వాయిదా పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి 87 మంది, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 13 మంది చనిపోయారని నిర్ధారించారు. మృతుల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన 8 మంది ఎంపీటీసీ సభ్యులు రాష్ట్రంలో 10,047 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, అందులో 9,692 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అప్పట్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. అందులో 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 7,321 స్థానాల్లో పోటీ జరుగుతుండగా, 19,000 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన 2371 మందిలో చిత్తూరులో ఐదుగురు.. విజయనగరం, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరి చొప్పున 8 మంది చనిపోయారు. ఎన్నికలు జరగాల్సి ఉన్న మిగిలిన 7,321 ఎంపీటీసీ స్థానాల్లో పోటీలో ఉన్న 19 వేల మందిలో 79 మంది చనిపోగా, వీరిలో అత్యధికులు వివిధ రాజకీయ పార్టీల తరుఫున పోటీలో ఉన్న వారే కావడం గమనార్హం. ఐదుగురు మాత్రమే స్వతంత్ర అభ్యర్థులు. ఏకగ్రీవంగా నెగ్గిన జెడ్పీటీసీ సభ్యుడొకరు.. రాష్ట్ర వ్యాప్తంగా 660 జెడ్పీటీసీ స్థానాలకు గాను అప్పట్లో 8 చోట్ల ఎన్నికలు వాయిదా పడగా, మిగిలిన 652 చోట్ల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారు. అందులో 126 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో కర్నూలు జిల్లాలో ఏకగ్రీవంగా గెలిచిన వైఎస్సార్సీపీ అభ్యర్థి ఒకరు మృతి చెందారు. ఏకగ్రీవంగా ముగిసినవి పోను 526 స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా, 2,092 మంది పోటీలో ఉన్నారు. వీరిలో చనిపోయిన 12 మందిలో (ఏకగ్రీవమై చనిపోయిన వ్యక్తి కాకుండా) 11 మంది వివిధ రాజకీయ పార్టీల తరుఫున పోటీలో ఉన్న వారు. ఆ స్థానాల్లో మళ్లీ నామినేషన్కు వీలు! అభ్యర్థులు చనిపోయిన చోట తిరిగి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ప్రారంభించేందుకు ఎస్ఈసీ అవకాశం ఇచ్చే వీలుందని అధికార వర్గాలు వెల్లడించాయి. రాజకీయ పార్టీలకు మాత్రమే ఆయా చోట్ల కొత్త అభ్యర్థులను బరిలో నిలిపేందుకు అవకాశం కల్పిస్తుందని చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ సంప్రదాయం అమలు చేసిందని వారు గుర్తు చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు చనిపోయిన చోట మాత్రం ఈ అవకాశం ఉండని చెబుతున్నారు. అయితే ఏకగ్రీవంగా ఎన్నికైన వారు చనిపోతే ఎలా వ్యవహరించాలన్న దానిపై తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఎస్ఈసీ వర్గాలు తెలిపాయి. -
గవర్నర్కు నేను రాసిన లేఖలు లీకయ్యాయి..
సాక్షి, అమరావతి: తాను గవర్నర్తో సాగించిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ లీక్ అయ్యాయని, దీనిపై ఫిర్యాదు చేసినా ఆయన ముఖ్య కార్యదర్శి విచారణ జరపడంలో విఫలమయ్యారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ శనివారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ఉత్తర ప్రత్యుత్తరాల లీకేజీపై దర్యాప్తు చేసేలా కేంద్ర హోం శాఖను, సీబీఐని ఆదేశించాలని కోరారు. లీకేజీపై 72 గంటల్లో మధ్యంతర నివేదికను సమర్పించేలా సీబీఐని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్ ముఖ్య కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, మంత్రులు.. బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన గుంటూరు వాసి మెట్టు రామిరెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యం న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ముందు విచారణకు వచ్చింది. నిమ్మగడ్డ తనకు బాగా తెలిసిన వ్యక్తి అని, అందువల్ల ఈ వ్యాజ్యాన్ని తాను విచారించనని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావుకు జస్టిస్ రఘునందన్రావు స్పష్టం చేశారు. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని పిటిషనర్ కోరుతున్న నేపథ్యంలో దీన్ని మరో న్యాయమూర్తికి నివేదించేందుకు వీలుగా ఈ కేసు ఫైల్ను ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. రహస్య లేఖల ద్వారా గవర్నర్ను సంప్రదించాను: నిమ్మగడ్డ ‘ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్న నేపథ్యంలో నేను రహస్య లేఖల ద్వారా గవర్నర్ను సంప్రదించాను. రెండు రాజ్యాంగ కార్యనిర్వాహకుల మధ్య సాగిన ఈ లేఖలను ప్రజానీకానికి, మీడియాకు బహిర్గతం చేయడానికి వీల్లేదు. అయితే కొందరు స్వార్థ ప్రయోజనాలతో వీటిని ప్రజాబాహుళ్యంలోకి తెచ్చారు. ఈ నెల 18న అసెంబ్లీ కార్యదర్శి నుంచి నాకు ఓ లేఖ అందింది. నేను రాసిన లేఖల ఆధారంగా మంత్రులు.. బొత్స, పెద్దిరెడ్డిలు నాపై స్పీకర్కు ఫిర్యాదు చేసినట్లు అందులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు నన్ను దూషించారు. ఏపీ పోలీసులకు లేఖల లీకేజీ దర్యాప్తు బాధ్యతలను అప్పగిస్తే వాటిని నేనే లీక్ చేశానని ఇరికిస్తారు. అందుకే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయాల్సి వచ్చింది’ అని నిమ్మగడ్డ తన పిటిషన్లో పేర్కొన్నారు. -
మీ అధికారాలకు పరిమితులు లేవా?
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను శనివారం గట్టిగా నిలదీసింది. ఒక 2 నెలల తర్వాత ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామంటే ఎలా? అని ఆయనను ప్రశ్నించింది. కోర్టులు అధికార రహితమని భావిస్తున్నారా? అని నిలదీసింది. ఎన్నికల కమిషనర్ తనకున్న విచక్షణాధికారాలను ఎలా ఉపయోగించాలో అలానే ఉపయోగించాలని స్పష్టం చేసింది. వాటికి పరిమితులు లేవని అనుకుంటున్నారా? అని ప్రశ్నించింది. ఆ విచక్షణాధికారాలు న్యాయ సమీక్షకు లోబడి ఉండవా? అంటూ నిలదీసింది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణపై మధ్యంతర ఉత్తర్వుల జారీ విషయంలో నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ప్రకటించారు. పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించడంతో టీడీపీ ప్రయోజనాలను కాపాడేందుకే నిమ్మగడ్డ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడం లేదని గుంటూరు జిల్లా పాలపాడుకు చెందిన మెట్టు రామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ మరోసారి న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు ముందుకు విచారణకొచ్చింది. నిమ్మగడ్డ కోర్టుకు బాధ్యత వహించాల్సిందే.. ముందుగా నిమ్మగడ్డ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల కమిషనర్ ప్రతి నిర్ణయాన్ని న్యాయస్థానం ప్రశ్నించజాలదని, పరీక్షించజాలదని తెలిపారు. పరీక్షించడమంటే ఎన్నికల కమిషన్ స్వతంత్రతలో జోక్యం చేసుకోవడమేనన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. వీటిని ఎప్పుడు నిర్వహించాలో నిర్ణయించే అధికారం కమిషన్కు ఉందన్నారు. నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేయడానికి వీల్లేదన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వీఆర్ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ.. ఏ దశలో అయితే పరిషత్ ఎన్నికలు నిలిచిపోయాయో అక్కడి నుంచే నిర్వహించాల్సిన బాధ్యత కమిషన్పై ఉందన్నారు. గ్రామ పంచాయతీ, పురపాలక ఎన్నికలు పూర్తి కాగానే పరిషత్ ఎన్నికలను కూడా నిర్వహిస్తామని నిమ్మగడ్డ తెలిపారని వివరించారు. ఆయన కోర్టుకు బాధ్యత వహించాల్సిందేనని తెలిపారు. మరో 11 రోజులు మాత్రమే నిమ్మగడ్డ పదవిలో ఉంటారని, పరిషత్ ఎన్నికల పూర్తికి 6 రోజులు సరిపోతాయని, ఇప్పుడు ఆయన సెలవుపై వెళుతూ తనను ఏ రకంగానూ ప్రశ్నించకూడదనడం ఆయన తీరుకు నిదర్శనమన్నారు. ఎన్నికలు నిర్వహించేలా కమిషనర్ను ఆదేశించాలని కోరారు. న్యాయ సమీక్షకు ఎన్నికల కమిషనర్ అతీతుడేమీ కాదు.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి మరో రాజ్యాంగ వ్యవస్థ పట్ల బాధ్యతారాహిత్యంతో, నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడానికి వీల్లేదన్నారు. కేంద్ర హోంశాఖకు నిమ్మగడ్డ రాసిన లేఖ ఓ రాజకీయ పార్టీ కార్యాలయంలో తయారైందని, దీనిపై విచారణ కూడా జరుగుతోందన్నారు. కోర్టు ప్రశ్నించడం తన స్వతంత్రతలో జోక్యం చేసుకోవడమేనని ఆయన చెప్పడం సరికాదన్నారు. ఎన్నికల కమిషనర్ న్యాయ సమీక్షకు అతీతుడు కారని తెలిపారు. అతీతుడిని అని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. అందరి వాదనలు విన్న కోర్టు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. -
నిమ్మగడ్డకు మరో ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కు హైకోర్టులో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బలవంతంగా నామినేషన్లను ఉపసంహరించారని నిర్ధారణ అయితే, ఆ అభ్యర్థుల నామినేషన్లను పునరుద్ధరించాలని జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లను ఆదేశిస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ఈ ఏడాది ఫిబ్రవరి 18న జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఒకసారి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత మొదటిదశ నుంచి విచారణ జరపాలని కలెక్టర్లను ఆదేశించే అధికారం ఎన్నికల కమిషన్కు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఏపీ పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణ చట్ట నిబంధనల ప్రకారం గత ఏడాది జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల ఎన్నికను ప్రకటించి తీరాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించింది. ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల ఎన్నికపై వారి ప్రత్యర్థులకు ఏవైనా అభ్యంతరాలుంటే, వారు సంబంధిత ఎన్నికల ట్రిబ్యునల్లో ఆ ఎన్నికను సవాలు చేసుకోవచ్చునంది. నామినేషన్ల ప్రక్రియ మొదలు, ఎన్నికల ఫలితాల వెల్లడి వరకు ఈ మధ్యలో ఎన్నికలకు సంబంధించి వచ్చే ఏ ఫిర్యాదుపైన కూడా విచారణ జరిపే అధికారం ఏపీ పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణ చట్ట నిబంధనల్లోని రూల్ 99 ప్రకారం ఎన్నికల కమిషన్కు లేదని తేల్చి చెప్పింది. అదే విధంగా ఎన్నికను రద్దు చేసే అధికారం కూడా ఎన్నికలకు కమిషన్కు లేదని స్పష్టం చేసింది. ఎన్నికల్లో మోసం, బెదిరింపులు, బలవంతపు చర్యలు తదితరాలు విచారణ చేయదగ్గవే అయినా కూడా, అందులో జోక్యం చేసుకునే అధికారం ఎన్నికల కమిషన్కు లేదంది. ఓసారి ఎన్నిక ముగిసిన తరువాత ఎన్నికలకు సంబంధించిన వివాదాలు, ఫిర్యాదులపై ఎన్నికల ట్రిబ్యునల్ మాత్రమే విచారణ జరపాలని చట్టం చెబుతోందని గుర్తుచేసింది. మోసం, బెదిరింపులు, బలవంతపు చర్యలు తదితరాల విషయంలో స్పష్టమైన, నిర్దిష్ట ఆధారాలు ఉండాలంది. ఇలాంటివాటిని న్యాయపరంగా సుశిక్షితులైన న్యాయాధికారి మాత్రమే విచారణ జరపగలరని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు మంగళవారం తీర్పు చెప్పారు. ఎన్నికల కమిషనర్ గత నెల 18న జారీచేసిన ఉత్తర్వులతో పాటు బలవంతపు నామినేషన్ల ఉపసంహరణపై వచ్చే ఫిర్యాదులను స్వీకరించి, వాటిపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా, ఏకపక్ష చర్యగా ప్రకటించి, వాటిని రద్దుచేయాలని కోరుత్తూ ఫారం–10 అందుకున్న పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు గత వారం వాయిదా వేసిన తీర్పును మంగళవారం వెలువరించారు. సమాచారం సేకరించవచ్చు ఎన్నికల ప్రక్రియలో లోపాలను సవరించేందుకు ఎన్నికల అక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించవచ్చని, సమాచార సేకరణకు మాత్రమే కమిషన్ విచారణను పరిమితం చేయాల్సి ఉంటుందని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో నిష్పాక్షికంగా వ్యవహరించని ఎన్నికల అధికారులపై, సిబ్బంది చర్యలు తీసుకునేందుకు సైతం సమాచారం సేకరించవచ్చన్నారు. సేకరించిన సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్వీయ అవసరాల నిమిత్తం లేదా చట్ట సవరణ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి, శాసనసభకు, పార్లమెంట్కు పంపొచ్చని పేర్కొన్నారు. తీర్పు వెలువరించిన తరువాత అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ జోక్యం చేసుకుంటూ, ఈ వ్యాజ్యాలు పెండింగ్లో ఉన్నాయన్న కారణంతో ఎన్నికల కమిషన్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించడం లేదని, అందువల్ల ఈ వ్యాజ్యాలు ఎన్నికల నిర్వహణకు అడ్డంకి కాదంటూ ఉత్తర్వుల్లో ప్రస్తావించాలని కోరారు. అలా చేయడం ద్వారా సమస్యలు వస్తాయన్న న్యాయమూర్తి.. అది ఈ వ్యాజ్యాలతో సంబంధం లేని స్వతంత్ర అంశమని చెప్పారు. జనసేన పిటిషన్పై విచారణ 23కి వాయిదా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్ జారీచేసేలా ఆదేశాలివ్వాలంటూ జనసేన పార్టీ కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాసరావు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఈ నెల 23కి వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ కోరడంతో న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు విచారణను వాయిదా వేశారు. -
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నిమ్మగడ్డ 'వెనకడుగు'
సాక్షి, అమరావతి: ఎన్ని అవాంతరాలు ఎదురైనా పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలు జరిపి తీరాల్సిందేనని పట్టు బట్టిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ తాజా పరిస్థితుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు వెనుకడుగు వేస్తున్నారని రాజకీయ పార్టీలు, అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు అనువైన పరిస్థితులు, అవకాశాలు ఉన్నా.. కావాలనే దాట వేస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల కోసం కమిషన్ కార్యాలయంలో డిప్యుటేషన్పై నియమించిన అదనపు సిబ్బందిని నిమ్మగడ్డ వారి మాతృశాఖలకు తిరిగి పంపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తీరు చూస్తుంటే ‘పరిషత్’ ఎన్ని కలు నిర్వహించేందుకు ఆసక్తి చూపడం లేదనే విషయం స్పష్ట మవుతోందని అధికారులు పేర్కొంటున్నారు. ఎన్నికల కమిషన్ కార్యాలయానికి డిప్యుటేషన్పై వచ్చిన నలుగురు ఏఎస్వో స్థాయి అధికారులను మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ ముగిసిన వెంటనే మాతృశాఖలకు తిరిగి వెనక్కి వెళ్లేందుకు నిమ్మగడ్డ అనుమతి ఇచ్చారు. సోమవారం మరో నలుగుర్ని వారి పాత విధులకు పంపేందుకు నిమ్మగడ్డ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరుకు నిమ్మగడ్డ పదవీ కాలం ముగియనుంది. ఈలోగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నా అందుకు ఆయన సుముఖంగా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. న్యాయపరమైన చిక్కులు లేకున్నా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు న్యాయపరమైన చిక్కులు, ఇతర సమస్యలు ఏమీలేవు. ఒక ట్రెండు పార్టీలు మాత్రమే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దుచేసి, ఎన్నికల ప్రక్రియను మొదటినుంచీ చేపట్టాలని కోరుతూ హైకోర్టుకు వెళ్లాయి. ఆగిపోయిన ఎన్నికలను రద్దుచేయాలనిగానీ, తాత్కాలికంగా నిలిపివేయాలని గానీ కోర్టు తీర్పులు కూడా ఏమీ లేవు. ‘పరిషత్’ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గతంలోనే ముగిసిన దృష్ట్యా ఆ ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు వారం రోజులకు మించి అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు. టీడీపీకి నష్టమని భావించి.. ‘పరిషత్’ ఎన్నికలు నిర్వహించేందుకు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ నిమ్మగడ్డ వాటి జోలికి వెళ్లకపోవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల ఫలితాలు పూర్తిగా అధికార వైఎస్సార్సీపీకి అనుకూలంగా వెలువడ్డాయి. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీకి రాజకీయ లబ్ధి చేకూర్చేందుకు నిర్ణయించుకున్న నిమ్మగడ్డ ప్రభుత్వం వారిస్తున్నా ఎన్నికల నిర్వహణకు సిద్ధçమయ్యారని అప్పట్లో పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. కనీసం కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు ఎంత ఒత్తిడి తెచ్చినా.. ఎన్నికలు జరపాల్సిందేనని పట్టుబట్టి ఆ ఎన్నికలకు నిమ్మగడ్డ పూనుకున్నారు. చివరకు ఎన్నికల ఫలితాలు టీడీపీకి రాజకీయంగా ప్రయోజనం కల్పించకపోగా.. తీవ్ర నష్టం చేకూర్చాయి. ఈ నేపథ్యంలోనే కనీసం తాను కమిషనర్గా ఉన్నంత వరకైనా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరపకూడదని నిమ్మగడ్డ నిర్ణయించుకుని ఉంటారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
పంచాయతీ రీ కౌంటింగ్పై ఈసీ మరో కీలక ఉత్తర్వు
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓట్ల లెక్కింపులో ఎక్కడెక్కడ రీ కౌంటింగ్ జరిగింది? ఎందుకు నిర్వహించారు? తదితర అంశాలపై తనకు పూర్తి వివరాలు తెలియజేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంగళవారం పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఎన్నికలు జరిగిన ప్రతి చోట కౌంటింగ్ ప్రక్రియపై పూర్తి వివరాలతో పంచాయతీలవారీగా నివేదికలు అందజేయాలని కూడా ఆయన ఇప్పటికే ఆదేశించినట్లు పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. 5లోగా నివేదిక ఇవ్వాలి ఓట్ల లెక్కింపు ఎన్ని గంటలకు మొదలైంది..? లెక్కింపు సమయంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడిందా? కరెంటు సరఫరా ఎందుకు నిలిచిపోయింది? కౌంటింగ్ పూర్తయ్యాక ఓడిపోయిన అభ్యర్ధి ఏజెంట్ల నుంచి సంతకాలు తీసుకున్నారా? తదితర వివరాలు పంచాయతీల వారీగా స్పష్టంగా ఉండాలని పేర్కొంటూ నిర్ణీత ఫార్మాట్ను నిమ్మగడ్డ తాజాగా పంచాయతీరాజ్ శాఖకు పంపారు. ప్రతి పంచాయతీకి సంబంధించిన నివేదికలను ఈనెల 5లోగా పంపాలని పేర్కొన్నారు. ఎలా సాధ్యం? పంచాయతీల వారీగా రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీవోలు పంపే నివేదికలపై జిల్లా కలెక్టర్లు, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ వేర్వేరుగా తమ అభిప్రాయాలను జోడించి ఎన్నికల కమిషన్కు పంపాలని నిమ్మగడ్డ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏకగ్రీవాలు కాకుండా 10,890 పంచాయతీల్లో ఓటింగ్ ప్రక్రియ జరిగిందని, భారీగా ఉన్న పంచాయతీలపై కలెక్టర్లు, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఏ ప్రాతిపదికన విడివిడిగా అభిప్రాయాలు వెల్లడించాలనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అది కూడా మూడు రోజుల వ్యవధిలోనే ఒక్కో పంచాయతీలో రిటర్నింగ్ అధికారి నుంచి ఎంపీడీవోకు, అక్కడ నుంచి డీపీవో, జిల్లా కలెక్టర్లకు నివేదికలు అందడం, పరిశీలన జరిపి అభిప్రాయాలు తెలియచేయడం సాధ్యమేనా? అనే ప్రశ్నలు అధికారుల్లో ఉత్పన్నమవుతున్నాయి. వివాదాలన్నీ ట్రిబ్యునల్లోనే.. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ పది రోజుల క్రితమే ముగిసింది. గెలిచిన సర్పంచి అభ్యర్ధులు, వార్డు సభ్యులకు రిటర్నింగ్ అధికారులు ఎక్కడికక్కడ గెలుపు ధ్రువీకరణ పత్రాలు కూడా అందజేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలపై ఎలాంటి వివాదాలున్నా ఎన్నికల ట్రిబ్యునల్లోనే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని, ముగిసిన ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఎలాంటి నిర్ణయం తీసుకునే అధికారం ఉండదని పేర్కొంటున్నారు. ఇదంతా గందరగోళానికి గురి చేసేందుకేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
వలంటీర్ల ఫోన్ల స్వాధీనం సరికాదు
సాక్షి, అమరావతి: వార్డు వలంటీర్ల వద్ద ఉండే మొబైల్ ఫోన్లను కలెక్టర్లు స్వాధీనం చేసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ ఆదేశాలు జారీచేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఎన్నికల నిర్వహణలో రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు సోమవారం ఆయన విజయవాడలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధులు నారాయణమూర్తి, పద్మజారెడ్డిలు హాజరుకాగా.. టీడీపీ నుంచి వర్ల రామయ్య, సీపీఎం నుంచి వైవీ రావు, సీపీఐ తరఫున జల్లి విల్సన్, కాంగ్రెస్ నుంచి మస్తాన్వలితో పాటు బీజేపీ, జనసేన తదితర పార్టీల ప్రతినిధులూ హాజరయ్యారు. మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవాలన్న ఆదేశాలవల్ల వార్డు వలంటీర్లు వారి రోజు వారీ విధులు నిర్వర్తించే పరిస్థితి ఉండదని, నిబంధనల పేరుతో వారికి ఆటంకాలు కలిగే నిర్ణయాలు తీసుకోవడం సరికాదని వైఎస్సార్సీపీ ప్రతినిధులు నిమ్మగడ్డ దృష్టికి తీసుకెళ్లారు. వృద్ధులు, వికలాంగులకు రవాణా సౌకర్యం వృద్ధులు, వికలాంగులు తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు వీలుగా ప్రభుత్వ యంత్రాంగమే వారికి ఉచితంగా రవాణా సౌకర్యం ఏర్పాటుచేస్తుందని సమావేశంలో కమిషనర్ వివరించారు. అలాగే, ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ఖచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని నిమ్మగడ్డ స్పష్టంచేశారు. కాగా, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా పలుచోట్ల బదిలీలు జరుగుతున్నాయని పలువురు ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు నిమ్మగడ్డ దృష్టికి తీసుకురాగా.. ‘దీర్ఘకాలికంగా ఒకేచోట ఉన్న వారి బదిలీలకు తానే సీఎస్కు సిఫార్సు చేశానని, అందుకనుగుణంగానే మార్పులు జరుగుతున్నాయ’ంటూ కమిషనర్ బదులిచ్చారు. దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు: వర్ల పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని సమావేశంలో వర్ల రామయ్య ప్రస్తావించడంతో నిమ్మగడ్డ ఆయన్ను వారించి మున్సిపల్ ఎన్నికలపై మాట్లాడాలని సూచించారు. అయినా, అదే అంశాన్ని పెద్ద గొంతుతో పదేపదే ప్రస్తావిస్తుండడంతో ఎన్నికల కమిషనర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశానంతరం వర్ల రామయ్య విలేకరులతో మాట్లాడుతూ, మేం మొన్నమొన్నటి వరకు చూసిన నిమ్మగడ్డలా ఆయన కనిపించడంలేదని.. ఆయనపై మాకు అనుమానాలున్నాయని, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. -
విశేషాధికారాల ముసుగులో.. టీడీపీ సేవ
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ప్రక్రియ ప్రారంభం నుంచి తెలుగుదేశం పార్టీకి మేలు చేకూర్చేలా ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్కుమార్ తాజాగా మరో ఉత్తర్వు జారీచేశారు. ఈనెల 10న జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ఘట్టం ఎప్పుడో ముగిసిపోయినప్పటికీ కొందరు టీడీపీ నేతలకు మాత్రం ఇప్పుడు నామినేషన్ వేసుకునేందుకు తన విశేషాధికారాలతో అనుమతిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిశాక మళ్లీ వాటిని వేసేందుకు వీల్లేదని ఎన్నికల చట్టాలు స్పష్టంగా చెబుతున్నా నిమ్మగడ్డ వాటన్నింటినీ తోసిరాజని.. ఫిర్యాదులు, వినతులు వచ్చాయంటూ ఓ పార్టీకి లబ్ధిచేకూర్చేలా నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలను దెబ్బతీసేందుకే ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఉందన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. మరోవైపు.. నామినేషన్లపై తామెంలాంటి ఫిర్యాదు చేయలేదని, వినతులు కూడా పంపలేదంటూ ఇద్దరు నేతలు స్పందించినట్లు తెలిసింది. తమ సంతకాలను ఎవరన్నా ఫోర్జరీ చేసి వినతులు పెట్టి ఉండొచ్చని, ఇప్పుడు నామినేషన్ల దాఖలుపై తమకెలాంటి ఆసక్తిలేదని వారు ఎన్నికల అధికారులకు స్పష్టంచేసినట్లు సమాచారం. వివరాలివీ.. తిరుపతి నగరపాలక సంస్థతో పాటు పుంగనూరు, రాయచోటి, ఎర్రగుంట్ల మున్సిపాలిటీల్లో మొత్తం 14 డివిజన్లు, వార్డులలో టీడీపీ అభ్యర్థులకు ఇప్పుడు ప్రత్యేకంగా నామినేషన్ల దాఖలుకు వీలుకల్పిస్తూ నిమ్మగడ్డ సోమవారం ఆదేశాలు జారీచేశారు. నిజానికి ఈ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ 2020 మార్చి 13నే ముగిసింది. ఆ మరసటి రోజు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కూడా పూర్తయ్యాక కరోనా సాకుతో ఎన్నికల ప్రక్రియ వాయిదా వేశారు. అప్పుడు ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచి తిరిగి కొనసాగిస్తున్నట్లు గత నెలలో ఎస్ఈసీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ల దాఖలు చేసుకోవడానికి ఇప్పుడు అవకాశంలేదు. కానీ, నిమ్మగడ్డ మాత్రం.. పలువురు టీడీపీ నేతలకు అవకాశం కల్పిస్తూ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్సీపీ ఏకగ్రీవాలను అడ్డుకునేందుకేనా!? నిజానికి తిరుపతి నగరపాలక సంస్థలోని ఆరు డివిజన్లలో సింగిల్ నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. అవీ వైఎస్సార్సీపీ అభ్యర్థులవే. అంటే ఇక్కడ వీరి ఎన్నిక దాదాపు ఏకగ్రీవమే. అయితే, ఇప్పుడు ఆ ఆరు డివిజన్లలో నామినేషన్లకు మళ్లీ అవకాశం కల్పించడమంటే వైఎస్సార్సీపీకి అయ్యే ఏకగ్రీవాలకు గండికొట్టి టీడీపీకి లబ్ధిచేకూర్చడమేనన్నది స్పష్టంగా తెలుస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పుంగనూరు, రాయచోటిలోనూ ఇదే లక్ష్యం కనపిస్తోందంటున్నారు. అవి ఫోర్జరీలేమో.. ఇదిలా ఉంటే.. పుంగనూరులోని 14, 28 వార్డుల్లో కొత్తగా నామినేషన్ దాఖలకు అవకాశం దక్కిన వారిలో ఇద్దరు నాయకులు ఎస్ఈసీ నిర్ణయంపై విస్మయం వ్యక్తంచేసినట్లు తెలిసింది. తాము అసలు కొత్తగా నామినేషన్ వేసేందుకు జిల్లా కలెక్టరుకుగానీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్కుగానీ ఎలాంటి వినతులు పంపలేదని.. తమ సంతకాలను ఎవరన్నా ఫోర్జరీ చేసి వినతులు పెట్టి ఉండొచ్చని వారు ఎన్నికల అధికారులకు తెలియజేసినట్లు సమాచారం. ఇప్పుడు నామినేషన్ల దాఖలుపై తమకెలాంటి ఆసక్తి కూడా లేదని వారు స్పష్టంచేసినట్లు తెలిసింది. అప్పుడు అడ్డుకున్నారంటూ.. తిరుపతి నగరపాలక సంస్థలోని 2, 8, 10, 21, 41, 45 డివిజన్లలో ఐదుగురు టీడీపీ, ఒక బీజేపీ నేత పేర్లను ప్రత్యేకంగా తెలియజేస్తూ మంగళవారం సా.3 గంటల వరకు వారి నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లుచేసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. అలాగే, పుంగనూరు మున్సిపాలిటీలోని 9, 14, 28 వార్డులు.. వైఎస్సార్ జిల్లా రాయచోటి మున్సిపాలిటీలోని 20, 31 వార్డుల్లో ఐదుగురు టీడీపీ నేతల పేర్లను ప్రత్యేకంగా పేర్కొన్నారు. గతంలో వీరు నామినేషన్లు వేయడానికి సిద్ధపడగా, ప్రత్యర్థులు వీరిని అడ్డుకున్నట్లుగా తాను నిర్ధారణకు వచ్చానని నిమ్మగడ్డ పేర్కొన్నారు. అలాగే, వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో కూడా 6, 11, 15 వార్డుల్లో నామినేషన్లు దాఖలు చేసిన తర్వాత ముగ్గురితో వారి ప్రత్యర్థులు బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేశారని.. వారికీ ఇప్పుడు మళ్లీ నామినేషన్ దాఖలకు అవకాశం కల్పిస్తున్నట్లు నిమ్మగడ్డ ఆదేశాలు జారీచేశారు. -
పోస్ట్మేన్లా ఎన్నికల కమిషనర్: అచ్చెన్నాయుడు
సాక్షి, మహారాణిపేట(విశాఖ దక్షిణ): రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పోస్టుమేన్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. విశాఖ నగర టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చిత్తూరు రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును నిర్బంధించడంపై కమిషన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తిరుపతితోపాటు ఇతర కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థులను భయపెట్టి, అక్రమ కేసులు మోపుతున్నారని ఆరోపించారు. -
నామినేషనే వేయని వారికి ఇప్పుడు అవకాశం కుదరదు
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లో గతంలో అసలు నామినేషన్ దాఖలు చేయని అభ్యర్థులకు ఇప్పుడు అవకాశమివ్వడానికి, స్కూృటినీలో తిరస్కరణకు గురైన వాటిని తిరిగి పునరుద్ధరించడానికి ఎన్నికల నిబంధనలు అంగీకరించవని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ స్పష్టం చేశారు. ఈ నిబంధనలకు లోబడి కొన్ని పరిమితుల మేరకు బలవంతపు చర్యల ద్వారా నామినేషన్లు విరమించుకున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై సోమ లేదా మంగళవారాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానన్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, ఇతర జిల్లాల అధికారులతో నిమ్మగడ్డ విజయవాడలో ఆదివారం సమీక్ష నిర్వహించారు. తర్వాత ఆయా జిల్లాల రాజకీయ పార్టీ నేతలతోనూ వర్చువల్ సమావేశంలో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘మున్సిపల్ ఎన్నికల్లో బలవంతం మీద నామినేషన్లు ఉపసంహరించుకున్న విషయంలో అభ్యర్థిత్వాల పునరుద్ధరణను బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పరిగణనలోకి తీసుకుంటాం. అలాంటి ఫిర్యాదులపై కొన్ని జిల్లాల నుంచి నివేదికలు వచ్చాయి. మరికొన్ని చోట్ల నుంచి కూడా తెప్పించుకుంటాం. పాక్షికంగా పునరుద్ధరించడం రాష్ట్రస్థాయిలో జరుగుతుంది’ అని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ చర్యల వల్ల కరోనా నియంత్రణలోకి వచ్చినప్పటికీ.. మున్సిపల్ ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం ఐదుగురు మించి చేయడానికి వీలులేదన్నారు. అతిక్రమిస్తే క్రిమినల్ చర్యగా పరిగణిస్తామన్నారు. పరిమితంగా రోడ్డు షోలకు అనుమతిస్తామన్నారు. సోమవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామన్నారు. -
మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): రాష్ట్రవ్యాప్తంగా మార్చిలో నిర్వహించే మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర వర్సిటీలో శనివారం రాత్రి మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రాయలసీమ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ అధికారులతో నిమ్మగడ్డ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు చక్కగా జరిగాయన్నారు. ఇదే స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలన్నారు. ప్రతి ఓటరుకు ఓటింగ్ స్లిప్ చేరాలని చెప్పారు. ఈ ప్రక్రియలో వలంటీర్లను దూరంగా ఉంచడంతో పాటు వారిపై నిఘా ఉంచాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలో హెల్ప్లైన్ ఏర్పాటు చేసి ఓటరుకు తమ ఓటు, పోలింగ్స్టేషన్ వివరాలు అందించాలని ఆదేశించారు. పార్టీ ప్రాతిపదికన మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నందున పకడ్బందీగా ఎన్నికల నియమావళిని అమలు చేయాలన్నారు. కోవిడ్ నేపథ్యంలో ఇంటింటి ప్రచారానికి ఐదుగురికే అనుమతి ఇస్తున్నామన్నారు. దీనిని ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా మద్యం, డబ్బు పంపిణీ ద్వారా ప్రలోభాలకు గురి చేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. గతేడాది మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఒత్తిడికి, ప్రలోభాలకు లోనై నామినేషన్లు విత్ డ్రా చేసుకున్న వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అభ్యర్థిస్తే సానుకూలంగా స్పందిస్తామన్నారు. మార్చి 1న రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. స్థానికంలోనూ ఈసీ నిబంధనలే.. సాక్షి, అమరావతి: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన నిబంధనలను.. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తక్షణమే అమలులోకి తీసుకొస్తున్నట్టు నిమ్మగడ్డ రమేష్కుమార్ శనివారం తెలిపారు. మున్సిపల్ ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు కలెక్టర్లు, ఎన్నికల నిర్వహణాధికారులు ఈ నిబంధనలను అమలు చేయాలని ఆదేశించారు. -
మీ సదుద్దేశాలపై అనుమానం కలుగుతోంది
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ సదుద్దేశాలపై తమకు అనుమానాలు కలుగుతున్నాయని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ మాట చెప్పేందుకు ఈ న్యాయస్థానం ఎంతమాత్రం సంశయించడంలేదని తెలిపింది. ఎన్నికల సంఘానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్న తమ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయకుంటే, వెంటనే ఎందుకు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయలేదని ప్రశ్నించింది. ఆ తరువాత కూడా కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసి, అది విచారణకు రాకున్నా కూడా పట్టించుకోలేదని.. 42 రోజులపాటు ఆ పిటిషన్ను అలా వదిలేశారంటే ఎన్నికల కమిషనర్కు ఎంత శ్రద్ధ ఉందో అర్ధమవుతుందని వ్యాఖ్యానించింది. ఇక్కడే ఎన్నికల కమిషనర్ తీరుపై ఈ న్యాయస్థానానికి సందేహాలు కలుగుతున్నాయంది. కేసు పూర్వాపరాలివీ.. ఎన్నికల కమిషన్కు రూ.40 లక్షలు మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఆ మొత్తాలను విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించడంతో పాటు, ఎన్నికల నిర్వహణ విషయంలో సహాయ, సహకారాలను అందించేలా కూడా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్.. కమిషన్కు పూర్తి సహాయ సహకారాలు అందించాలని గత ఏడాది నవంబర్ 3న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ, వీటిని అమలుచేయలేదంటూ నిమ్మగడ్డ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ దేవానంద్ సోమవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది ఎన్. అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ కోర్టు ఆదేశాలను అధికారులు అమలుచేయలేదన్నారు. కొత్త ఓటర్ల జాబితా తయారుచేయలేదని తెలిపారు. దీంతో 2019 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చిందన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. గత ఏడాది నవంబర్ 3న ఇచ్చిన ఉత్తర్వుల్లో చెప్పిన అంశాలకే ఈ కోర్టు పరిమితం అవుతుందని తెలిపారు. తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేశారా? లేదా? అన్నదే చూస్తామన్నారు. ఒకవేళ తాజా సమస్యలపై ఇచ్చిన వినతులపై ప్రభుత్వం స్పందించకుంటే, వాటిపై మళ్లీ పిటిషన్ దాఖలు చేసుకోవాలని, వాటిని ఈ వ్యాజ్యంలో కలపవద్దని స్పష్టంచేశారు. అనంతరం.. ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ, కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలుచేశామన్నారు. నిజమైన స్ఫూర్తితో కోర్టు ఉత్తర్వులను అమలుచేయలేదన్న న్యాయమూర్తి, దీనిపై స్వయంగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీలను ఆదేశించారు. ముందు కౌంటర్ దాఖలు చేసేందుకు అనుమతినివ్వాలని సుమన్ అభ్యర్థించడంతో న్యాయమూర్తి అందుకు అంగీకరిస్తూ విచారణను మార్చి 22కి వాయిదా వేశారు. -
బలవంతపు ఉపసంహరణలపై ఫిర్యాదుల్ని స్వీకరించండి
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికలలో పోటీకి దిగిన అభ్యర్థులు ఎవరైనా తమ నామినేషన్ను బలవంతంగా విత్డ్రా చేయించినట్టు ఆధారాలతో ఫిర్యాదు చేస్తే స్వీకరించాలని మున్సిపల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అలా అందిన ఫిర్యాదులను రాష్ట్ర ఎన్నికల కమిషన్కు పంపాలని, వాటిని పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వచ్చే 2, 3 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ జరగనున్న నేపథ్యంలోనే ఎస్ఈసీ ఈ ఆదేశాలు జారీ చేసినట్టు కమిషన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. నామినేషన్ వేయకుండా అడ్డుకుంటే.. గత ఏడాది మార్చిలో జరిగిన నామినేషన్ల స్వీకరణ సందర్భంగా నామినేషన్ వేయకుండా అడ్డగింతలకు సంబంధించిన బాధితులు ఉంటే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని ఎస్ఈసీ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో సూచించారు. నామినేషన్ వేయనివ్వకుండా అడ్డుకున్నారనడానికి ఆధారాలతో సంబధిత రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయడం/ఆ ఘటనపై పోలీసు కేసు నమోదు చేయడం లేదా ఆ ఘటనకు సంబంధించి ప్రముఖ పత్రికలు, టీవీ చానళ్లలో ప్రసారమైన కథనాలను సా«క్ష్యాలుగా కలెక్టర్ల ముందు ఉంచాలని పేర్కొన్నారు. అలాంటి సమాచారం ఉంటే కలెక్టర్ల నుంచి తెప్పించుకుని తదుపరి చర్యలు చేపడతామని నిమ్మగడ్డ పేర్కొన్నారు. -
మంత్రి కొడాలి పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు తనను మీడియాతో మాట్లాడకుండా నిరోధిస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మంత్రి కొడాలి నాని దాఖలు చేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. మంత్రి రాష్ట్ర ఎన్నికల కమిషన్ను, కమిషనర్ను కించపరిచేలా మాట్లాడారంటూ వీడియో క్లిప్పింగులను ఎన్నికల కమిషన్ సోమవారం హైకోర్టు ముందుంచింది. వీటిని కోర్టు హాలులోనే వీక్షించిన హైకోర్టు ఇరుపక్షాల నుంచి మరింత స్పష్టతను ఆశిస్తూ విచారణను వాయిదా వేసింది. మీడియాతో మాట్లాడకుండా ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వారం రోజుల్లో మూడు వ్యాజ్యాలు వచ్చాయని, భావ ప్రకటన స్వేచ్ఛ, పరిమితులపై విచారణ జరపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. కోర్టుకు సహకరించేందుకు సీనియర్ న్యాయవాది పి.శ్రీరఘురాంను అమికస్ క్యూరీ (కోర్టు సహాయకుడు)గా నియమిస్తూ న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి తరఫున న్యాయవాది వీఆర్ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ పార్క్ హయత్లో కొందరు రాజకీయ నాయకులను నిమ్మగడ్డ కలిసిన విషయాన్ని ప్రస్తావించారు. జోగి రమేశ్ వ్యాజ్యం పరిష్కారం.. మీడియాతో మాట్లాడేందుకు, పార్టీ విధానాలు, విజయాలు, కార్యక్రమాల గురించి తెలియజేసేందుకు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్కు అనుమతినిస్తూ గత వారం ఇచ్చిన ఉత్తర్వులను ఈ నెల 21 వరకు పొడిగిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఆ ఉత్తర్వులను జోగి రమేశ్ ఉల్లంఘించలేదని తెలుపుతూ జిల్లా ఎన్నికల అధికారి ఇచ్చిన నివేదికను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇంటింటికీ రేషన్.. తొలగిన అడ్డంకి
ఇంటింటికీ రేషన్ పథకం వెనుక పెద్ద సదుద్దేశం ఉంది. ఈ పథకం కొత్తది కాదు. దీన్ని ప్రభుత్వం ఇప్పటికే పట్టణాల్లో అమలు చేస్తోంది. ఈ పథకం కోసం ఆపరేటర్లు బ్యాంకుల రుణాలు పొంది వాహనాలు కొన్నారు. ఎన్నికల కమిషన్ చెప్పినట్టు వాహనాలకు మళ్లీ తటస్థ రంగులు వేయాలంటే భారీ ఖర్చు అవుతుంది. వాహనాలపై సీఎం ఫొటోలు ఉండటంపై ఎన్నికల కమిషన్ అభ్యంతరం చెబుతోంది. సీఎం ఫొటో ఉండరాదన్న నిషేధం ఏదీ లేదు. ఆ వాహనాలపై రంగులను ఓ రాజకీయ పార్టీకి ఆపాదించడం సరికాదు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు సరికాదు. – హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు సాక్షి, అమరావతి: ‘ఇంటింటికీ రేషన్’ పథకం అమలుకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఈ పథకం అమలుకు బ్రేక్ వేస్తూ ఎన్నికల కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను మార్చి 15వ తేదీ వరకు నిలిపేస్తూ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటివరకు సంచార వాహనాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీని అడ్డుకోవద్దని ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ‘ఇంటింటికీ రేషన్’ పథకానికి బ్రేక్ వేస్తూ ఎన్నికల కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు మధ్యంతర ఉత్తర్వుల జారీపై నిర్ణయాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఆయన తన నిర్ణయాన్ని వెలువరించారు. సీఎం ఫొటో వాడటంపై నిషేధం లేదు ‘ఇంటింటికీ రేషన్ పథకం వెనుక పేదలకు, అవసరం ఉన్న ప్రజలకు ఆహార ధాన్యాలు అందచేయాలన్న భారీ సదుద్దేశం, ప్రయోజనం దాగి ఉంది. ప్రజల సంక్షేమం, ఆరోగ్యమే సుప్రీం లా. అదే ఈ మధ్యంతర ఉత్తర్వుల జారీకి కారణం. పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే ఈ పథకం అమలవుతోంది. 3.25 కోట్ల మంది లబ్ధిదారులకు ఆహార ధాన్యాలను అందించేందుకు వేల వాహనాలను ఆపరేటర్లు కొనుగోలు చేశారు. దీని కోసం వారు డబ్బు పెట్టుబడిగా పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు కూడా తీసుకున్నారు. వాహనాలకు రీ పెయింటింగ్ నిమిత్తం ఎంతో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపే సమయానికి గ్రామీణ ప్రాంతాల్లో రెండు దశల పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. సంచార వాహనాలకు తటస్థ రంగులు వేసేంత వరకు ఈ పథకం అమలును నిలిపేయడం సరికాదన్నది ఈ కోర్టు ప్రాథమిక అభిప్రాయం. ఈ కారణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ న్యాయస్థానం ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతోంది’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాహనాలపై రంగులు, ఫొటోల విషయమై దాఖలైన ఓ కేసులో విచారణ జరిపిన సుప్రీం కోర్టు చాలా స్పష్టమైన తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికల వేళ ప్రకటనల్లో రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దల ఫొటోలను ఉపయోగించడంపై సుప్రీం కోర్టు ఎలాంటి నిషేధం విధించలేదని, ముఖ్యమంత్రి ఫొటో కూడా ఉండొచ్చని తెలిపిందన్నారు. వాహనాలపై ఉపయోగించినవన్నీ సాధారణ రంగులేనని, అధికార పార్టీ రంగులను పోలి ఉన్నాయంటూ ఎన్నికల కమిషన్ అంతిమ నిర్ణయానికి రావడం ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే ఎంతమాత్రం సరికాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. పల్లెల్లో కదిలిన వాహనాలు ‘ఇంటింటికీ రేషన్’ పథకం అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. పల్లెల్లోనూ ఇంటింటికీ సరుకులు పంపిణీ చేసేందుకు వీలుగా మొబైల్ వాహనాలు సోమవారం మధ్యాహ్నం నుంచి ఒక్కొక్కటిగా ముందుకు కదిలాయి. ఇంటింటా సరుకులు పంపిణీకి రాష్ట్ర వ్యాప్తంగా 9,260 వాహనాలను మంగళవారం నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా అధికారులకు పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 22 లక్షల కార్డుదారులకు ఇంటివద్దే సరుకులు పంపిణీ చేసినట్టు పౌర సరఫరాల శాఖ ఎక్స్–అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. రేషన్ షాపుల వద్ద క్యూ లైన్లకు స్వస్తి పలకడం.. తూకంలో అక్రమాలు, మోసాలకు తావు లేకుండా నాణ్యమైన బియ్యంతో పాటు ఇతర సబ్సిడీ సరుకులను పేదల గడప వద్దే అందివ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 9,260 మొబైల్ వాహనాలను కొనుగోలు చేసిన విషయం విదితమే. వాటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత నెలలో ప్రారంభించగా.. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1.45 కోట్లకు పైగా కార్డుదారులకు ఇంటింటింకీ వెళ్లి రేషన్ సరుకులు పంపిణీ చేసేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పల్లెల్లో ఈ వాహనాను ఆపాలంటూ ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులివ్వడంతో గ్రామాల్లో ఇంటింటికీ రేషన్ కార్యక్రమం నిలిచిపోయింది. ఎస్ఈసీ ఉత్తర్వులను హైకోర్టు కొట్టేయడంతో రేషన్ పంపిణీకి మార్గం సుగమమైంది. -
మున్సిపల్ నగారా.. ఆగిన చోట నుంచే
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. గత ఏడాది మార్చిలో.. మధ్యలో ఆగిపోయిన చోట నుంచి ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. వచ్చే మార్చి 10వ తేదీన పోలింగ్ నిర్వహించి, 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. అప్పట్లో ఎన్నికలు అర్ధంతరంగా ఆగిపోయిన 12 నగర పాలక సంస్థలకు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. నిమ్మగడ్డ జిల్లాల పర్యటనలో ఉండగా ఈ నోటిఫికేషన్ జారీ అయింది. ఇక్కడ ఎన్నికలకు బ్రేక్ గత ఏడాది మార్చిలో నోటిఫికేషన్ వెలువడే నాటికి.. కోర్టు వివాదాలు, కొన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో కొత్తగా అప్పుడే విలీనం కావడం తదితర కారణాలతో 16 మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియ నిలిపివేశారు. పామిడి నగర పంచాయతీని డౌన్గ్రేడ్ చేయాలన్న ప్రభుత్వ ఆలోచన నేపథ్యంలో అక్కడ ఎన్నికలు నిర్వహించడం లేదు. కొత్తగా నగర పంచాయతీలుగా ఏర్పడిన 12 చోట్ల వార్డుల విభజన, ఓటర్ల జాబితాలు తయారీ వంటి ప్రక్రియ చేపట్టనందున వాటిలోనూ ఎన్నికలు పక్కనపెట్టారు. ఎన్నికలు జరగని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు రాజాం, తణుకు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, గుడివాడ, తాడేపల్లి, బాపట్ల, మంగళగిరి, పొన్నూరు, నరసరావుపేట, కందుకూరు, కావలి, గూడూరు, శ్రీకాళహస్తి, ఆమదాలవలస, రాజంపేట, పామిడి, భీమవరం, జగ్గయ్యపేట, ఆకివీడు, దర్శి, గురజాల, దాచేపల్లి, కొండపల్లి, పెనుకొండ, కమలాపురం, బేతంచర్ల, కుప్పం, బుచ్చిరెడ్డిపాలెం. ఎన్నికలు జరిగేవి... శ్రీకాకుళం జిల్లా: ఇచ్ఛాపురం, పలాస–కాశీబుగ్గ, పాలకొండ విజయనగరం: బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, నెలిమర్ల విశాఖపట్నం: నర్సీపట్నం, యలమంచిలితూర్పుగోదావరి: అమలాపురం, తుని, పిఠాపురం, సామర్లకోట, మండపేట, రామచంద్రాపురం, పెద్దాపురం, ఏలేశ్వరం, గొల్లప్రోలు, ముమ్మడివరం పశ్చిమ గోదావరి: నరసాపురం, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం కృష్ణా: నూజివీడు, పెడన, ఉయ్యూరు, నందిగామ, తిరువూరు. గుంటూరు: తెనాలి, చిలకలూరిపేట, రేపల్లె, మాచర్ల, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల ప్రకాశం: చీరాల, మార్కాపురం, అద్దంకి, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు నెల్లూరు: వెంకటగిరి, అత్మకూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట అనంతపురం: హిందూపురం, గుంతకల్లు, తాడిపత్రి, ధర్మవరం, కదిరి, రాయదుర్గం, గుత్తి, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, మడకశిర కర్నూలు: ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు, గూడూరు, ఆళ్లగడ్డ, అత్మకూరు వైఎస్సార్: ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, రాయచోటి, మైదుకూరు, ఎర్రగుంట్ల చిత్తూరు: మదనపల్లి, పుంగనూరు, పలమనేరు, నగరి, పుత్తూరు ఎన్నికలు జరగని కార్పొరేషన్లు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్కు 2017లోనే ఎన్నికలు నిర్వహించారు. ఇక కోర్టు వివాదాల కారణంగా శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, నెల్లూరు కార్పొరేషన్లలో ఎన్నికలు నిలిపివేశారు. ఎన్నికలు జరిగేవి విజయనగరం, గ్రేటర్ విశాఖపట్నం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం కార్పొరేషన్లకు ఇప్పుడు ఎన్నికలు నిర్వహించనున్నారు. -
రెండో విడత స్థానిక ఎన్నికలూ ప్రశాంతం
సాక్షి, అమరావతి: చెదురుమదురు ఘటనలు మినహా రెండో విడత ఎన్నికలు కూడా ప్రశాంత వాతావరణంలోనే జరిగాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో వ్యవహరిస్తున్నారని కొనియాడారు. ఇప్పటి వరకు దాదాపు సగం పంచాయతీల్లో ఎన్నికలు పూర్తయినట్టు తెలిపారు. సాధారణ ఎన్నికల స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. మూడో విడతలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన చోట గట్టి నిఘా ఉంటుందని తెలిపారు. మూడో విడతలోనూ అవాంతరాల్లేకుండా ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని నిమ్మగడ్డ సూచించారు. -
వివరాలు లేకుండా పిల్ ఎలా వేస్తారు?
సాక్షి, అమరావతి: కనీస వివరాల్లేకుండా ప్రభుత్వ చర్యలను తప్పుపడుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడంపై హైకోర్టు సోమవారం పిటిషనర్ను నిలదీసింది. ప్రాథమిక సమాచారం లేకుండా పిల్ దాఖలు చేయడమే కాక, వివరాలు కోరితే సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశామని ఎలా చెబుతారని ప్రశ్నించింది. తగిన సమాచారం లేకుండా ఇలాంటి పిల్లతో కోర్టు సమయాన్ని వృథా చేయడం తగదని న్యాయస్థానం హెచ్చరించింది. అనంతరం.. వివరాలు సమర్పించేందుకు పిటిషనర్ గడువు కోరడంతో విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. అమ్మఒడి పథకానికి రూ.24.24 కోట్ల నిధుల విడుదలకు ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్కు పరిపాలన అనుమతులిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ న్యాయవాది చింతా ఉమామహేశ్వరరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరామని, ఆ వివరాలు రావాల్సి ఉందని, అందువల్ల విచారణను వాయిదా వేయాలని కోరారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తంచేస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఎన్నికల కమిషనర్ ప్రొసీడింగ్స్పై.. పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ఎన్నికల కమిషనర్ గత ఏడాది నవంబర్లో జారీ చేసిన ప్రొసీడింగ్స్ను సవాల్ చేస్తూ దాఖలైన పిల్పై విచారణను మార్చి 1కి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల కమిషన్కు రాజ్యాంగంలోని అధికరణ 243(కే) కింద ఉన్న అధికారాలను సవరిస్తూ పార్లమెంట్లో పెట్టిన బిల్లు, తదనంతర పరిణామాలను తమ ముందుంచాలని పిటిషనర్ను ఆదేశించింది. ఆ వివరాలు తెలియకుండా ఈ వ్యాజ్యంపై విచారణ జరపడం సాధ్యం కాదని పేర్కొంది. సీజే జస్టిస్ అరూప్కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ఎస్ఈసీ గత ఏడాది నవంబర్లో జారీ చేసిన ప్రొసీడింగ్స్ను సవాలు చేస్తూ న్యాయవాది ఆర్.మహంతి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. నవంబర్ 17న జారీ చేసిన ఉత్తర్వులను ఇన్ని రోజుల తరువాత ఇప్పుడు సవాల్ చేయడం ఏమిటని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపింది. 243కేను సవరించారా? బిల్లు తరువాత పరిణామాలు తెలియకుండా వ్యాజ్యాన్ని ఎలా విచారించగలమని ప్రశ్నించింది. బిల్లు, తరువాతి పరిణామాలన్నింటినీ తమ ముందుంచాలని పిటిషనర్ను ఆదేశించింది. -
ఆ ఏకగ్రీవాలు సక్రమమే
సాక్షి, అమరావతి: చిత్తూరు, గుంటూరు జిల్లాలో జరిగిన ఏకగ్రీవాలపై 4 రోజుల కిందట అనుమానం వ్యక్తం చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్.. సోమవారం ఆ ఏకగ్రీవాలన్నీ సక్రమమేనని తేల్చారు. వీటిని అధికారికంగా ప్రకటించవచ్చని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు తెలిపారు. కలెక్టర్ల నివేదికలతో పాటు ఆయా జిల్లాల అబ్జర్వర్ల నుంచి తీసుకున్న సమాచారం మేరకు.. 2 జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ నిర్ధారణకు వచ్చినట్టు వెల్లడించారు. -
నిర్బంధ ఉత్తర్వులు ఏకపక్షం
సాక్షి, అమరావతి: తనను ఈ నెల 21వ తేదీ వరకు ఇంటికే పరిమితం చేయాలంటూ రాష్ట్ర డీజీపీకి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషనర్ ఉత్తర్వుల అమలును నిలిపేయాలని కోర్టును కోరారు. ఈ చర్యలను రాజ్యాంగ విరుద్ధంగా, ఏకపక్ష చర్యగా ప్రకటించాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు. ఈ పిటిషన్పై హైకోర్టు ఆదివారం ఉదయం విచారణ జరపాలని నిర్ణయించింది. ఈ పిటిషన్లోని వివరాలు ఇలా ఉన్నాయి. స్పీకర్కు రాసిన లేఖకు ఇది ప్రతి చర్య ► స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో నిమ్మగడ్డ రమేష్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. గత నెల 28న రాష్ట్ర గవర్నర్కు లేఖ రాసిన నిమ్మగడ్డ అందులో నాపై పలు తప్పుడు ఆరోపణలు చేశారు. ► ఈ నేపథ్యంలో గత నెల 30న నేను అసెంబ్లీ స్పీకర్కు లేఖ రాసి, సభా హక్కుల ఉల్లంఘన కింద నిమ్మగడ్డపై చర్యలు తీసుకోవాలని కోరాను. ఇది నిమ్మగడ్డ రమేష్కు ఎంత మాత్రం నచ్చలేదు. ► దీంతో తిరుపతిలో ఈ నెల 5న నేను మాట్లాడిన మాటలను నిమ్మగడ్డ వక్రీకరించారు. ఈ ఉత్తర్వులు జారీ చేసే ముందు నాకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. ఎలాంటి వివరణ కోరలేదు. ఇలా చేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. ► ప్రొటోకాల్ ప్రకారం ఈ నెల 7న తిరుపతిలో నేను రాష్ట్రపతిని ఆహ్వానించాల్సి ఉంది. అయితే నిమ్మగడ్డ ఇచ్చిన ఉత్తర్వుల వల్ల నేను స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేకుండా పోయింది. ఈ దృష్ట్యా ఎస్ఈసీ ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలి. -
మంత్రి పెద్దిరెడ్డిని గృహనిర్బంధం చేయండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాలుగు దశల పంచాయతీ ఎన్నికలు ముగిసే ఫిబ్రవరి 21వ తేదీ వరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా నియంత్రించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ను ఆదేశిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యాంగంలోని 243 కె నిబంధన ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా తనకు ఉన్న విశేషాధికారాలతో ఈ ఆదేశాలు జారీ చేశానని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 16 రోజుల పాటు మంత్రి పెద్దిరెడ్డిని మీడియాతో కూడా మాట్లాడకుండా నియంత్రించాలని చెప్పారు. ఈ ఆదేశాల్లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ► శుక్రవారం తిరుపతిలో విలేకరుల సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడిన మాటలపై రాజకీయ పార్టీలు, సాధారణ పౌరుల నుంచి అధిక సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. మంత్రి మాటలు ఓటర్ల మనసులో భయాందోళనలు సృష్టించాయి. ► మంత్రి వ్యాఖ్యలు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే కాకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్వతంత్రతను బెదిరించడం కిందకు వస్తుంది. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నట్టు ఆయన వ్యాఖ్యలున్నాయి. ► అత్యున్నత పదవిలో ఉన్న మంత్రి పెద్దిరెడ్డి ఉద్దేశ పూర్వకంగానే చట్ట ఉల్లంఘన చర్యలకు పాల్పడుతున్నట్టుగా ఉంది. ఫలితంగా ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర నష్టం కలుగుతుంది. ► జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు స్వేచ్ఛాయుతంగా, న్యాయపరంగా సజావుగా ఎన్నికలు నిర్వహించడానికే ఈ ఆదేశాలు జారీ చేస్తున్నా. ► వైద్య సహాయం తీసుకోవడానికి, ఇతర సహేతుక కారణాల తెలిపిన సందర్భాలలో ఈ ఆంక్షలు వర్తించవు. అలాంటి సందర్భాల్లోనూ మంత్రిని మీడియాకు, అతని మద్దతు దారులకు, అనుచరులకు దూరంగా ఉంచాలి. మంత్రిగా అధికార పత్రాలను పరిశీలించవచ్చు. ఈ ఆదేశాలు కేవలం ప్రజా ప్రయోజనాల కోసమే. పరివర్తన, పరిస్థితులకు అనుగుణంగా ఈ ఆదేశాలపై భవిష్యత్లో పునరాలోచన చేసేందుకు ఎస్ఈసీ సిద్ధంగా ఉంటుంది. రిటర్నింగ్ అధికారులకు రక్షణ ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న రిటర్నింగ్ అధికారులు, ఇతర అధికారులు అభద్రతా భావనకు గురికావాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీరు ఎన్నికల కమిషన్ రక్షణ కవచంలో ఉంటారని పేర్కొన్నారు. వీరిపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు చేపట్టాలన్నా ఎన్నికల కమిషన్ ముందస్తు అనుమతి విధిగా తీసుకోవాలన్నారు. బెదిరింపు ప్రకటనలను ఎంతటి పెద్దవారు ఇచ్చినా లెక్క పెట్టవలసిన అవసరం లేదన్నారు. -
ఏకగ్రీవాలైన చోట అధికారుల్ని మార్చడమేంటి!
కర్నూలు (రాజ్విహార్): ఏకగ్రీవాలు జరిగిన చోట ఎంపీడీవోలను మార్చాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖలు రాయడం సరి కాదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అనిల్కుమార్ యాదవ్, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డితో కలిసి బొత్స సత్యనారాయణ మీడియాతో బుధవారం మాట్లాడారు. గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల క్రమంలో ఏకగ్రీవాలు అయిన చోట ఎంపీడీవోలను బదిలీ చేయాలని సీఎస్కు ఎస్ఈసీ లేఖ రాయడం విచారకరమన్నారు. గ్రామ స్వరాజ్యానికి విఘాతం కలిగించేలా నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యాప్లు ఉన్నప్పటికీ ఎస్ఈసీ ప్రత్యేక యాప్ తయారు చేసిందని, ఇది తమ హక్కు అని చెప్పే ముందు బాధ్యతలను తెలుసుకుని అనుసరించాలని బొత్స పేర్కొన్నారు. -
నేటితో ముగియనున్న గడువు
సాక్షి, అమరావతి: తొలి విడతలో ఈ నెల 9వ తేదీన పోలింగ్ జరిగే గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల ఉపసంహరణకు గురువారం సాయంత్రం 3 గంటలతో గడువు ముగియనుంది. తొలి విడతలో 3,249 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా.. నామినేషన్ల పరిశీలన తర్వాత సర్పంచ్ పదవులకు 18,168, ఆయా గ్రామాల్లో వార్డు పదవులకు 77,554 నామినేషన్లు మిగిలాయి. నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత ఒక్క అభ్యర్థి మాత్రమే పోటీలో ఉన్నచోట ఎన్నిక ఏకగ్రీవమైనట్టు రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారు. ఒకరి కంటే ఎక్కువ మంది పోటీలో ఉన్నచోట అభ్యర్థులకు క్రమపద్ధతిలో ఎన్నికల గుర్తులను కేటాయిస్తారు. కాగా, తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం రెవెన్యూ డివిజన్లోని 7 మండలాలు, ఎటపాక రెవెన్యూ డివిజన్లోని 4 మండలాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ సమయాన్ని తగ్గించాలంటూ ఆ జిల్లా కలెక్టర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ప్రతిపాదించారు. ఆ మండలాల్లో మావోయిస్టుల ప్రభావం ఉన్న దృష్ట్యా మధ్యాహ్నం 1.30 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అనుమతి కోరారు. రెండో విడత గ్రామాల్లో... రెండో విడతలో 3,327 పంచాయతీల్లో సర్పంచ్ పదవులతో పాటు 33,562 వార్డు పదవులకు ఎన్నికలు జరుగుతుండగా.. ఆ గ్రామాల్లో బుధవారం కూడా నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. గురువారం సాయంత్రం 5 గంటలతో ఈ కార్యక్రమం ముగియనుంది. కాగా, గ్రామాల్లో దాఖలయ్యే నామినేషన్ల వివరాలను ఎప్పటికప్పుడు అన్లైన్లో అప్లోడ్ చేయడానికి వీలుగా పంచాయతీరాజ్ శాఖప్రత్యేక వెబ్ అప్లికేషన్ రూపొందించింది. దీనికి సంబంధించిన లాగిన్ ఐడీ, పాస్వర్డ్లను జిల్లాల వారీగా డీపీవోలకు పంపించామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.గిరిజాశంకర్ తెలిపారు. సదరు లింక్ ఆధారంగా నామినేషన్ల సమాచారాన్ని ఎంపీడీవోలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని ఆదేశించారు. -
ఆ యాప్పై నిషేధ ఉత్తర్వులివ్వండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ).. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో కేంద్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వ అధికారిక యాప్లను కాకుండా ప్రైవేట్ యాప్ను ఉపయోగించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రైవేట్ యాప్ ఉపయోగించకుండా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ యాప్లైన ‘సీ విజిల్’, ‘నిఘా’ యాప్లను ఉపయోగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఇంకొల్లు గ్రామానికి చెందిన న్యాయవాది కె.సుధాకర్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ నిమిత్తం న్యాయవాది ఎం.జయరామ్రెడ్డి బుధవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనం ముందు దీని గురించి ప్రస్తావించారు. ఈ వ్యాజ్యంపై గురువారం విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిటిషన్లో వివరాలు ఇలా ఉన్నాయి. నిమ్మగడ్డ ఆది నుంచీ తెలుగుదేశం పక్షమే ► ఎన్నికల నిర్వహణ విషయంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆది నుంచీ వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు. పక్షపాతంగా వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీని రక్షిస్తూ వస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబునాయుడు పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తే ఆయనకు నోటీసులు ఇవ్వలేదు. టీడీపీ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసి సరిపుచ్చారు. ► తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ఎన్నికల బరిలో ఉన్న వారిని బెదిరించారు. వారిపై దౌర్జన్యం చేశారు. అయినా నిమ్మగడ్డ ఏ రకంగానూ స్పందించలేదు. పారదర్శకత అంటే ఇదేనా? ► తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూర్చడంలో భాగంగా నిమ్మగడ్డ ప్రైవేట్ యాప్ను తీసుకొచ్చారు. ఈ యాప్ రూపకల్పన అత్యంత రహస్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. అందువల్ల అత్యంత భద్రతా ప్రమాణాలతో కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ‘సి–విజిల్, రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నిఘా యాప్లను ఉపయోగించేలా ఎన్నికల కమిషనర్కు తగిన ఆదేశాలు జారీ చేయండి. ► నిమ్మగడ్డ ప్రైవేట్ యాప్ ద్వారా పౌరుల సమాచారం బయటకు వెల్లడయ్యే ప్రమాదం ఉంది. తప్పుడు వీడియోలు సృష్టించే అవకాశం ఉంది. ► సీ విజిల్ యాప్కు ప్రాధాన్యత ఇవ్వాల్సిన కమిషనర్.. దాన్ని పూర్తిగా విస్మరించి తన సొంత యాప్ ఆధారంగా సమాచారం తెప్పించుకోవాలని నిర్ణయించారు. సమాచార హక్కు చట్టం కింద కూడా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఈ ప్రైవేట్ యాప్ గురించి సమాచారం కోరాం. ► ఈ యాప్ పేరు.. రూపకల్పన ఎలా జరిగింది.. ఎవరు చేశారు.. టెండర్లు ఆహ్వానించారా.. భద్రత ప్రమాణాలు ఏమిటి తదితర వివరాలు కోరినా, ఎన్నికల సంఘం ఇప్పటి వరకు ఇవ్వలేదు. ► అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భద్రత ఆడిట్ జరిగిన తర్వాతే యాప్ బయటకు రావాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల కమిషనర్ తయారు చేయించిన సొంత యాప్ ఈ ప్రమాణాలను పాటించలేదు. -
ఈ–వాచ్ యాప్ విడుదల చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేస్తూ, అందరి అనుమానాలను నిజం చేస్తూ, కీలకమైన ఎన్నికల నిఘా వ్యవస్థ మొత్తాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగుతూ ప్రముఖ కార్పొరేట్ కంపెనీ రిలయన్స్ పేరును తెరపైకి తెచ్చి ఎన్నికల ప్రక్రియతో ఆటలాడారు. రోజుకో రకంగా మాట్లాడుతూ పారదర్శకతకు పాతరేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు ఆయన తన సొంత యాప్ను తాజాగా ఆవిష్కరించారు. పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ రోజు ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే ఆ ఫిర్యాదులను తొలుత నిమ్మగడ్డ ఎంపిక చేసిన ప్రైవేట్ ఏజెన్సీ ప్రతినిధులు పరిశీలించాకే కలెక్టర్లకు పంపుతారు. అంటే వడపోత అనంతరం అవసరాన్ని బట్టి మాత్రమే ఎంపిక చేసిన ఫిర్యాదులను పరిశీలించేలా ఏర్పాట్లు జరిగినట్లు స్పష్టమవుతోంది. కాగా ఈ యాప్తో తమకు ఎలాంటి సంబంధం లేదని రిలయన్స్ జియో ప్రతినిధులు స్పష్టం చేశారు. తమ కంపెనీ పేరుతో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. యాప్ రూపకల్పనకు సంబంధించి నిమ్మగడ్డ తన ప్రెస్మీట్లో ప్రస్తావించిన సాంబశివరావు, మదన్మోహన్రెడ్డిని ‘సాక్షి’ సంప్రదించగా ఈ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తమతో కేవలం యాప్ల గురించి మాత్రమే మాట్లాడారని, తమ కంపెనీ ద్వారా దీన్ని రూపొందించలేదని వెల్లడించారు. కమిషన్ తన సొంత వనరులతో యాప్ తయారీ చేసుకున్నట్లు నిమ్మగడ్డ ప్రకటించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. అంత సాంకేతిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులు అసలసక్కడ ఉన్నారా? అన్ని వనరులున్నాయా? కమిషన్ కార్యాలయంలో ఎవరితోనూ సంబంధం లేకుండా నిమ్మగడ్డ ఒంటిచేత్తో ఓ యాప్ను ఆగమేఘాలపై తేవడం సాధ్యమేనా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. టీడీపీ ద్వారా దీన్ని రూపొందించినట్లు చెప్పలేక, సొంత వనరులంటూ ఆయన చెబుతున్నారని స్పష్టమవుతోంది. ఔట్సోర్సింగ్, ప్రైవేట్ ఏజెన్సీ ముసుగులో.. ఎన్నికల్లో పారదర్శకత కోసం 2020 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం, పంచాయతీరాజ్ శాఖలు సంయుక్తంగా తయారు చేయించి జడ్పీటీసీ, ఎన్నికల్లో వినియోగించిన నిఘా యాప్ను పూర్తిగా పక్కన పెట్టేసి నిమ్మగడ్డ తన సొంత యాప్ ’ఈ–వాచ్’ను బుధవారం ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఆవిష్కరించడం పలు సందేహాలకు తావిస్తోంది. గురువారం నుంచి ఇది ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుందని కమిషన్ ప్రకటించింది. పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ప్రయోజనం చేకూర్చేందుకే నిమ్మగడ్డ ప్రైవేట్ యాప్ను సిద్ధం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో పనిచేసిన వారు, ఆ పార్టీ సానుభూతిపరులు ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా, ప్రైవేట్ ఏజెన్సీల రూపంలో ఎన్నికల కమిషన్ కార్యాలయంలో చొరబడి ఈ తతంగాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడవుతోంది. తాము అనుకున్నట్లుగా ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్, ఎడిటింగ్ చేసి ఫిర్యాదులను పంపే అవకాశం ఉంది. కాల్ సెంటర్లో ఐదుగురు వ్యక్తుల ద్వారా.. ఎన్నికల అక్రమాలపై యాప్ ద్వారా ఎవరు ఫిర్యాదు చేసినా నేరుగా కలెక్టర్లు, ఎస్పీలకు వెళ్లదని రాష్ట్ర ఎన్నికల కమిషనే ప్రకటించింది. యాప్ ద్వారా నమోదయ్యే ఫిర్యాదు ముందుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఉండే కాల్ సెంటర్కు చేరుతుంది. అయితే ఆ కాల్ సెంటర్ ప్రైవేట్ ఏజెన్సీ ఆధ్వర్యంలోనే పనిచేస్తుందని నిమ్మగడ్డ రమేష్కుమార్తో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ కార్యదర్శి కన్నబాబు వివరించారు. దీన్ని సమర్ధించుకుంటూ దేశంలో ఏ కాల్ సెంటర్లోనైనా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు లేదా ప్రైవేట్ ఏజెన్సీకి సంబంధించిన వ్యక్తులే పనిచేస్తారని, వారిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉద్యోగులు పర్యవేక్షిస్తుంటారని నిమ్మగడ్డ తెలిపారు. యాప్తో అనుసంధానించి కమిషన్ కార్యాలయంలో ఏర్పాటయ్యే కాల్ సెంటర్లో ఐదుగురు వ్యక్తులు ఉంటారని, వారంతా ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన వారని వెల్లడించారు. ఆ ప్రైవేట్ ఏజెన్సీ పేరు ప్రత్యేకంగా చెప్పకుండానే రిలయన్స్కు పార్ట్నర్గా వ్యవహరించే సునందకు సంబంధించినదని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం సృష్టికర్తలదే..! యాప్ ద్వారా అందే ఫిర్యాదులను కాల్ సెంటర్లో పనిచేసే ప్రైవేట్ వ్యక్తులు తీవ్రతను బట్టి వర్గీకరించి కలెక్టర్లకు ఏవి పంపాలో నిర్థారించేలా ప్రక్రియను రూపొందించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి తెలిపారు. యాప్ను పూర్తిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సూచనలు, సలహాల మేరకు తయారు చేయించినట్లు చెప్పారు. యాప్ నిర్వహణలో బగ్స్ లాంటి సమస్యలు తలెత్తితే ప్రభుత్వ ఐటీ విభాగం ద్వారా కాకుండా యాప్ తయారు చేసిన వారి ద్వారానే పరిష్కరించనున్నట్లు ఎన్నికల కమిషన్ కార్యాలయం తెలిపింది. నిపుణులు లేకుండా.. రూపాయి ఖర్చు కాకుండా సాధ్యమేనా? సాధారణంగా ఓ యాప్, వెబ్సైట్కు రూపకల్పన చేయాలంటే కనీసం రూ.లక్షల్లోనే ఖర్చవుతుంది. కానీ నిమ్మగడ్డ యాప్ తయారీకి ఎలాంటి ఖర్చు కాలేదని ఆయనే ప్రకటించడంతో సందేహాలు ముసురుకుంటున్నాయి. కమిషన్ కార్యాలయంలో ఉండే వనరులను వినియోగించుకుని సొంతంగా యాప్, వెబ్ అప్లికేషన్ తయారు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చెబుతున్నారు. అయితే అధికారిక వర్గాల సమాచారం మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో స్టాఫ్ట్వేర్ పరంగా ప్రావీణ్యం కలిగిన ఉద్యోగులెవరూ లేరు. అలాంటప్పుడు ఎలాంటి ఖర్చు లేకుండా ఈ యాప్ ఎలా తయారు చేశారని సామాన్యుడికి కూడా అనుమానం కలుగుతుంది. దీన్ని బట్టి ఎక్కడో తయారు చేసిన యాప్ను ఈ ఎన్నికలకు వినియోగిస్తున్నట్లు నిర్థారణ అవుతోంది. ఫిర్యాదుదారులకు రక్షణుందా? యాప్ ద్వారా ఫిర్యాదు చేసే వారి వివరాలు కాల్సెంటర్ సిబ్బందికి కూడా తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే యాప్ హ్యాకింగ్ జరిగే అవకాశాల గురించి ఏమాత్రం పరిశీలన చేయకుండానే హడావుడిగా ఆవిష్కరించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఫిర్యాదుదారుల వివరాలు బహిర్గతమైతే గ్రామాల్లో అశాంతికి ఆజ్యం పోసినట్లే అవుతుందని హెచ్చరిస్తున్నారు. జియో యాప్ తెద్దామనుకున్నాం కానీ.. పంచాయతీ ఎన్నికల కోసం జియో యాప్ తెస్తున్నట్లు తొలుత నిమ్మగడ్డ స్వయంగా మీడియాకు చెప్పారు. అయితే ఇప్పుడు సొంతంగా తయారు చేయించామంటూ మరో యాప్ ప్రవేశపెట్టారు. ‘మొదట రిలయెన్స్ జియో ద్వారా దీనిని పెడతామని చెప్పా. జియో యాప్లో అంతర్భాగంగా చేద్దామనుకున్నాం. కానీ సాంకేతిపరమైన సమస్యలొచ్చాయి. పరిష్కరించే సమయం లేక మేమే సొంతంగా తయారు చేయించాం. ప్రభుత్వం నిఘా యాప్ తీసుకురావడం మంచిదే. కాకపోతే అది అవసరాలకు అనుగుణంగా ఉన్నట్లు తోచలేదు. నిఘా యాప్పై అపనమ్మకం ఉందని కాదు. ఎన్నికల కమిషనర్ తోడ్పాటు లేకుండా వాళ్లు సొంతంగా చేసుకున్నారు. ఆ నిఘా యాప్ను వాళ్లు ఉపయోగించుకోవచ్చు. ఎన్నికల కమిషన్కు ఆ నిఘా యాప్పై అపనమ్మకం లేదు. కమిషన్ అవసరాలకు ‘ఈ వాచ్’ యాప్ తెస్తున్నాం’ అని నిమ్మగడ్డ పేర్కొన్నారు. ‘ఈ–వాచ్’... ఇలా –యాప్, వెబ్ అప్లికేషన్ ద్వారా ఎవరైనా ఫిర్యాదు చేయగానే అది కాల్ సెంటర్కు వెళుతుంది. – కాల్ సెంటర్ ఫిర్యాదులను కేటగిరీలవారీగా.. తీవ్రమైన ఫిర్యాదా.. ? సాధారణ ఫిర్యాదా? అని వర్గీకరిస్తుంది. తర్వాత ఆ ఫిర్యాదును సంబంధిత కలెక్టర్లకు కాల్ సెంటర్ ప్రతినిధులు పంపుతారు. –కలెక్టర్లు ఆ ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నాక తిరిగి యాప్లో వివరాలు నమోదు చేస్తే కాల్ సెంటర్కు అందుతాయి. –కాల్ సెంటర్లో ఉండే వ్యక్తులు ఫిర్యాదు చేసిన వ్యక్తికి ఫోను చేసి సక్రమంగా పరిష్కరించారా... లేదా? అని వాకబు చేస్తారు. – ఫిర్యాదుదారుడు అసంతృప్తి వ్యక్తం చేస్తే ఆ ఫిర్యాదును తిరిగి ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. – యాప్ ద్వారా అందే ఫిర్యాదుల వివరాలు అందరికీ తెలిసేలా వెబ్సైట్లో ఉండవు. కేవలం ఎన్ని ఫిర్యాదులు వచ్చాయన్న సంఖ్య మాత్రమే డ్యాష్ బోర్డు రూపంలో ఉంచుతారు. ఏకగ్రీవ నినాదం బాగా వెనుకబడింది ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ సాక్షి, అమరావతి/తిరుపతి: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ‘ఈ–వాచ్’ యాప్ ద్వారా అందే సీరియస్ ఫిర్యాదులను కలెక్టర్లు, ఎస్పీలు సకాలంలో పరిష్కరించని పక్షంలో ఎన్నికనే రద్దు చేయాల్సి ఉంటుందని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ పేర్కొన్నారు. అతి తీవ్రత ఉండే ఫిర్యాదులను అరగంటలోపే పరిష్కరించాలన్నారు. ఎన్నికల నిఘాకు తాను సొంతంగా తయారు చేయించిన ‘ఈ–వాచ్’ యాప్ను బుధవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ యాప్పై క్షేత్రస్థాయిలో ప్రచారం చేసే బాధ్యత కలెక్టర్లకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఏకగ్రీవం నినాదం బాగా వెనుకబడిపోయిందని, అభ్యర్థులు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా వచ్చి నామినేషన్లు వేస్తున్నారన్నారు. తక్కువ మాట్లాడతా.. యాప్పై కొందరు కోర్టుకు వెళ్లడంపై ఆయన స్పందిస్తూ.. ‘వాళ్ల పని వాళ్లు చేసుకుంటారు. మన పని మనం చేసుకుంటాం. సుప్రీంకోర్టు చెప్పాక ఇక ఆగుతాయా? చిన్నాచితకా ఉంటూ ఉంటాయి. కోర్టులో కేసు పడకపోతే ఆశ్చర్యపోవాలి గానీ కేసు వేశారంటే.. నాకైతే ఏమీ ఆశ్చర్యం కలిగించడం లేదు’ అని వ్యాఖ్యానించారు. తాను తక్కువగా మాట్లాడి ఎక్కువగా పని చేసుకుంటూ పోతానన్నారు. కార్యక్రమంలో ఉన్నతాధికారులు కన్నబాబు, గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్, సంజయ్ పాల్గొన్నారు. తాను మాట్లాడటం పూర్తవగానే విలేకరుల ప్రశ్నలకు జవాబు చెప్పకుండానే నిమ్మగడ్డ నిష్క్రమించారు. కాగా, రాజ్యాంగంలో తన పరిధి చాలా చిన్నదని, ఆ మేరకే రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటున్నానని ఎస్ఈసీ నిమ్మగడ్డ చెప్పారు. చిత్తూరు జిల్లా అధికారులతో తిరుపతిలో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. -
నేడే నిమ్మగడ్డ ప్రైవేట్ యాప్!
సాక్షి, అమరావతి: ఎన్నికల నిర్వహణలో నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పారదర్శకతకు పాతరేశారు. ఎన్నికల పర్యవేక్షణ పేరుతో గుట్టుచాటుగా ప్రైవేట్ యాప్ రూపొందించుకుని ఆ బండారం బయటపడకుండా ఉండేందుకు ప్రభుత్వం నుంచి భద్రతాపరమైన అనుమతులు తీసుకోకుండానే ఎన్నికలలో వినియోగించాలని నిర్ణయించారు. ఇప్పటిదాకా రహస్యంగా ఉంచిన ఆ యాప్ను బుధవారం ఉదయం 11 గంటలకు ఆవిష్కరించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న నిమ్మగడ్డ కూడా ఇదే విషయాన్ని మీడియాకు చెప్పారు. ఇప్పటివరకు యాప్ వివరాలు ఏమాత్రం వెల్లడించకుండా ఆయన గోప్యంగా ఉంచారు. యాప్ తయారు చేసింది ఎవరు? కంట్రోల్ కేంద్రం ఎక్కడుంది? ఎవరు పర్యవేక్షిస్తారు? సిబ్బంది ఎవరు? ఫిర్యాదులను ఎలా పరిష్కరిస్తారు? తదితర వివరాలు బహిర్గతం కాకుండా గోప్యత పాటించడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. పూర్తి పారదర్శకతతో జరగాల్సిన ఎన్నికలకు ఉపయోగించే యాప్ను అనుమతులు లేకుండానే ఆవిష్కరించేందుకు నిమ్మగడ్డ ఏర్పాట్లు చేసుకోవడం గమనార్హం. మరోవైపు యాప్లో అందే సమాచారాన్ని తొలుత తాను మాత్రమే చూసి ఆ తర్వాత ఎంపిక చేసిన డేటానే జిల్లా కలెక్టర్లకు పంపేలా నిమ్మగడ్డ ఇప్పటికే లాగిన్ ఏర్పాట్లు చేసుకున్నారు. అనుమతులు తప్పనిసరి.. సాధారణంగా ప్రభుత్వంలోగానీ, ప్రభుత్వ వ్యవస్థలలోగానీ యాప్లు, ఇతర సాఫ్ట్వేర్లు ఉపయోగించాలంటే నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకోవాలి. యాప్లో నమోదు చేసే సమాచారం (డేటా) నిర్ణీత వ్యక్తులు మినహా ఇతరులకు చేరకుండా, హ్యాక్ చేసే వీలు లేకుండా డేటా సెక్యూరిటీ ఏర్పాట్లు ఉన్నాయా? అని ఏపీటీఎస్ విభాగం నిపుణులు పరిశీలన చేశాక అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. యాప్లలో నమోదు చేసే సమాచారాన్ని బయట వ్యక్తులు మార్చేసే అవకాశం (మార్ఫింగ్, ఎడిటింగ్) లేకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వ డేటా సెంటర్ (అన్ని రకాల ప్రభుత్వ యాప్లు, వెబ్సైట్ సమాచారం నిల్వ చేసే కేంద్రం)తో అనుసంధానించేలా అనుమతి పొందాలి. అయితే డేటా భద్రతకు ఉద్దేశించిన అనుమతులేవీ తీసుకోకుండానే యాప్ను తెచ్చేందుకు నిమ్మగడ్డ సిద్ధమయ్యారు. తద్వారా ఎన్నికల ప్రక్రియలో దురుద్దేశాలతో వ్యవహరిస్తున్నారనే అనుమానాలు బలపడుతున్నాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఎవరి లబ్ధి కోసం? ఎన్నికల కోసం ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ తయారు చేయించిన యాప్ ఉన్నప్పటికీ దాన్ని కాదని అనుమతులు లేని ప్రైవేట్ యాప్ను ఎన్నికల పర్యవేక్షణకు వినియోగించాలన్న నిర్ణయం వెనుక టీడీపీకి లబ్ధి చేకూర్చాలన్న దురుద్దేశం దాగి ఉన్నట్లు భావిస్తున్నారు. కొందరు టీడీపీ ముఖ్యలు హైదరాబాద్ నుంచి పర్యవేక్షించేలా యాప్లో ఏర్పాట్లు జరిగినట్లు కమిషన్ కార్యాలయ వర్గాల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలలో రాజకీయాలను చొప్పించడం ద్వారా ప్రశాంతతకు భంగం కలిగే ప్రమాదం నెలకొందన్న ఆందోళన గ్రామాల్లో వ్యక్తమవుతోంది. -
శ్రీకాకుళం, విజయనగరం అధికారులతో ఎస్ఈసీ సమీక్ష
అరసవల్లి/సాక్షిప్రతినిధి, విజయనగరం: ‘నేనెప్పుడూ వివాదాల జోలికి వెళ్లను.. 40 ఏళ్లలో ఎక్కడా వివాదాలకు పోలేదు. కనీసం ఏ వ్యక్తిని, ఏ రాజకీయ పార్టీనుద్దేశించి కూడా ఇంతవరకు మాట్లాడలేదు.. మాట్లాడే వ్యవహార శైలి నాది కాదు..’ అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. తాను రాగద్వేషాలకు అతీతంగా విధులు నిర్వర్తిస్తున్నానని, తనకు అన్ని రాజకీయ పార్టీలు సమానమేనని చెప్పారు. ఆయన సోమవారం శ్రీకాకుళం, విజయనగరం కలెక్టరేట్లలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళంలోను, విజయనగరంలోను నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ అని, అలాంటి వ్యవస్థలోకి ఇంకో వ్యవస్థ చొరబడేలా ప్రయత్నించడం, భయభ్రాంతులకు గురిచేయాలనుకుంటే.. అలాంటి అనుభవాలే కచ్చితంగా ఆ వ్యవస్థలకు కూడా ఎదురవుతాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ఎన్నికల కమిషన్ వ్యతిరేకం కాదని, అయితే బలవంతపు ఏకగ్రీవాలను మాత్రం అంగీకరించేది లేదని చెప్పారు. 2013, అంతకుముందు ఎన్నికల్లో కూడా ఏకగ్రీవాలు అధికంగానే జరిగాయన్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా, అలాగే ఎలాంటి ఫిర్యాదులైనా స్వీకరించేందుకు ప్రత్యేకంగా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని, బుధవారం ప్రత్యేక యాప్ను ఆవిష్కరిస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో తొలివిడతలో 321 పంచాయతీల్లో ఎన్నికల ఏర్పాట్లు అద్భుతంగా చేశారంటూ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఎస్పీ అమిత్ బర్దార్లను ప్రశంసించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో ఆదివారం నామినేషన్ల స్వీకరణ సమయంలో జరిగిన ఘటనపై విలేకరులు అడిగినా ఆయన ఏమాత్రం స్పందించకుండా వెనుదిరిగారు. రేపు తిరుపతికి నిమ్మగడ్డ చిత్తూరు కలెక్టరేట్: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం చిత్తూరు జిల్లా తిరుపతి రానున్నారు. సాయంత్రం తిరుపతి పద్మావతి అతిథి గృహంలో ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్కు ఉత్తర్వులు అందాయి. -
నిమ్మగడ్డ తీరును ఎండగట్టిన హైకోర్టు న్యాయమూర్తి
సాక్షి, అమరావతి: కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలుచేయడం లేదంటూ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్ను ప్రచారం కోసం దాఖలు చేస్తున్నారా? అంటూ హైకోర్టు సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ను నిలదీసింది. గత నెల 18న దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్ 42 రోజుల పాటు ఈ కోర్టు ముందు విచారణకు రాలేదని.. అయితే, పిటిషన్లో ప్రతీ అక్షరం మాత్రం డిసెంబర్ 19నే అన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమైందని.. దీంతో పిటిషన్ వేసిన ప్రయోజనం నెరవేరినట్లు కమిషనర్ భావించినట్లున్నారని హైకోర్టు తెలిపింది. దీని ఆధారంగానే నిమ్మగడ్డ రమేష్ ప్రచారం కోసమే కోర్టు ధిక్కార వ్యాజ్యం దాఖలు చేశారన్న అభిప్రాయం ఈ న్యాయస్థానానికి కలుగుతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇదీ కోర్టు ధిక్కార పిటిషన్.. తమకు కేటాయించిన నిధులను ప్రభుత్వం విడుదల చేయడంలేదని, నిధులు విడుదల చేసేలా ఆదేశాలివ్వడంతో పాటు విధి నిర్వహణలో తమకు ఆర్థిక, ఆర్థికేతర సహాయ, సహకారాలు అందించేలా కూడా ఆదేశాలివ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్, ఎన్నికల కమిషన్కు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని గత ఏడాది నవంబర్ 3న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం వీటిని అమలుచేయడంలేదని, దీనిని కోర్టు ధిక్కారంగా పరిగణించాలంటూ నిమ్మగడ్డ రమేష్ గత ఏడాది డిసెంబర్ 18న కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం జనవరి 29న విచారణకు రాగా, ఇందులో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ను ప్రతివాదిగా చేసేందుకు కమిషన్ తరఫు న్యాయవాది గడువు కోరడంతో న్యాయమూర్తి అంగీకరించిన విషయం తెలిసిందే. ఇన్ని రోజులు జాప్యం ఎందుకు? ఈ నేపథ్యంలో.. సోమవారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, న్యాయమూర్తి తనకు కొన్ని విషయాలపై స్పష్టతనివ్వాలని ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ను ఆదేశించారు. డిసెంబర్ 18న పిటిషన్ దాఖలు చేస్తే అది జనవరి 29 వరకు ఎందుకు విచారణకు రాలేదని.. ఇన్ని రోజుల జాప్యం మీ తప్పా, రిజిస్ట్రీ తప్పా అంటూ అడిగారు. కేసు విచారణకు వచ్చేందుకు రిజిస్ట్రీకి లేఖలు రాశానని, ఫోన్లు కూడా చేశానని అశ్వనీ చెప్పారు. అత్యవసరంలేదని భావించే 42రోజులు మౌనంగా ఉన్నారా? అంటూ న్యాయమూర్తి మళ్లీ ప్రశ్నించారు. ‘నిజంగా అత్యవసరమని భావించే ఉంటే ఈ కోర్టులో ప్రస్తావించి ఉండేవారు. ఆ పనిచేయలేదంటే వారు ఏ ప్రయోజనం ఆశించి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారో సులభంగా అర్థమవుతోంది. ఇన్ని రోజులు మౌనంగా ఉండి, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తరువాత దీనిపై అత్యవసర విచారణ జరపాలని కోరుతున్నారంటే ప్రతివాదులపై (ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి) ఒత్తిడి పెంచడానికి ఇలా చేస్తున్నారని ఈ కోర్టు భావిస్తోంది. ఎన్నికల కమిషనర్ సదుద్దేశాలపై ఈ కోర్టుకు సందేహం కలుగుతోంది’.. అని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఇన్ని రోజులు ఓ పిటిషన్ విచారణకు రాకపోవడం అంటే ఈ కోర్టు రాజ్యాంగ విధులను నిర్వర్తించకుండా అడ్డుకోవడమేనని న్యాయమూర్తి తెలిపారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, ఈ కోర్టు ధిక్కార వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న అప్పటి సీఎస్ నీలం సాహ్ని, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీలకు నోటీసులు జారీచేశారు. అంతేకాక.. నవంబర్లో తమ ఉత్తర్వులకు సంబంధించి తీసుకున్న చర్యలపై తాము కోరిన నివేదికను తదుపరి విచారణ సమయంలో తన ముందుంచాలని రిజిస్ట్రీకి న్యాయమూర్తి స్పష్టంచేశారు. అలాగే, పిటిషన్ విచారణకు రాక ముందే వాటిని పత్రికలకు ఇవ్వడం సరికాదని, ఈ విషయంలో కమిషనర్కు తగిన సలహా ఇవ్వాలని కమిషన్ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్కు సూచించారు. తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఉత్తర్వులు జారీచేశారు. -
‘కంట్రోల్ రూమ్’ కనుసన్నల్లో నిమ్మగడ్డ యాప్!
సాక్షి, అమరావతి: రాజ్యాంగబద్ధమైన పదవిని అడ్డు పెట్టుకుని ఆడుతున్న వికృత క్రీడ పరాకాష్టకు చేరుకుంది. ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేస్తూ ఎన్నికల ప్రక్రియను ఛిన్నాభిన్నం చేసి అధికారులను గందరగోళానికి గురి చేసేందుకు టెక్నాలజీ చాటున ఎత్తుగడలకు దిగారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పంచాయతీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా రూపొందించుకున్న యాప్ ద్వారా ఎంపిక చేసుకున్న ఫిర్యాదులు మాత్రమే స్వీకరించేలా ఏర్పాట్లు చేసుకున్నట్లు అనుమానాలు బలపడుతున్నాయి. ఒకవైపు ఎన్నికలు ముంచుకొస్తున్నా ఎస్ఈసీ నిమ్మగడ్డ ఈ యాప్ను అత్యంత గోప్యంగా ఉంచడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నేతలు తమ పార్టీ కంట్రోల్ రూమ్కు ఫిర్యాదులు పంపడం.. వాటిని నిమ్మగడ్డ యాప్కు చేరవేయడం.. అక్కడి నుంచి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియను ఛిన్నాభిన్నం చేసి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. తద్వారా అధికార వైఎస్సార్ సీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని బురద చల్లేందుకు ప్రయత్నం జరుగుతోంది. ప్రజల ఓట్లతో గెలవడం అసాధ్యమని గత సార్వత్రిక ఎన్నికలు రుజువు చేయడంతో దొడ్డి దారి వ్యూహాలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పదును పెడుతున్నట్లు వెల్లడవుతోంది. మార్ఫింగ్ అవకాశాలు పుష్కలం నిమ్మగడ్డ సొంతంగా రూపొందించుకున్న ప్రైవేట్ యాప్లో ఫిర్యాదులను మార్ఫింగ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వీడియోలను ఎడిటింగ్ చేసి రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునే అవకాశమూ ఉంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన యాప్, వెబ్కాస్టింగ్, నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) ద్వారా ఇలాంటి వాటికి ఏమాత్రంఅవకాశం లేదు. అందుకనే వాటిని పక్కనపెట్టి నిమ్మగడ్డ ఓ ప్రైవేట్ యాప్ తెచ్చారు. దీనివల్ల తమకు అవసరమైన చోట మార్ఫింగ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. లైవ్ టెలికాస్టింగ్ జరిగే వెబ్కాస్టింగ్లో వీటికి తావుండదు. ఫిర్యాదులకు టీడీపీ వాట్సాప్ నంబర్ ఈ యాప్ పూర్తి వివరాలను ఎస్ఈసీ ఇంతవరకు వెల్లడించలేదు. మరోవైపు టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి ‘యాప్’ ఆపరేషన్ మొదలు కావడం గమనార్హం. ప్రైవేటు వ్యక్తుల పరిధిలో ఉన్న ఆ యాప్ను టీడీపీ కార్యాలయంలోని ‘కంట్రోల్ రూం’ నుంచి నియంత్రించేలా కార్యాచరణకు ఉపక్రమించారు. ఎన్నికల ప్రక్రియపై కంట్రోల్ రూమ్కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయాలని సూచిస్తూ ఫొటోలు, వీడియోలు పంపేందుకు ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్ను కేటాయిస్తూ టీడీపీ తన శ్రేణులకు సమాచారం ఇవ్వడం గమనార్హం. ఈ యాప్ వివరాలు, ఇతర సమాచారాన్ని వెల్లడించకుండానే టీడీపీ ఫిర్యాదుల కోసం సొంత ఏర్పాట్లు చేసుకోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు తప్పుడు ఫిర్యాదులు, మార్ఫింగ్ చేసిన ఫొటోలు, ఎడిట్ చేసిన వీడియోలను ఆ వాట్సాప్ నంబర్కు పంపాలన్నది టీడీపీ తమ పార్టీ శ్రేణులకు పరోక్షంగా సూచించింది. తమ పార్టీ కార్యకర్తలు పంపించే తప్పుడు ఫిర్యాదులను టీడీపీ కార్యాలయంలోని కంట్రోల్ రూం నుంచి నేరుగా ఎన్నికల కమిషన్ యాప్కు పంపడం... వీటి ఆధారంగా నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని టీడీపీకి రాజకీయ ప్రయోజనం కల్పించాలన్నది అసలు పన్నాగమని నిపుణులు పేర్కొంటున్నారు. గోప్యంగా సొంత ‘యాప్’... పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలను అరికట్టేందుకు తాను ప్రత్యేకంగా ఓ యాప్ను ప్రవేశపెడతానని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఇటీవల ప్రకటించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల పర్యవేక్షణకు వినియోగిస్తున్న పారదర్శకమైన వెబ్ కాస్టింగ్ విధానాన్ని కాదని ఆయన సొంత యాప్ను తెస్తానని చెప్పడం పట్ల నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ యాప్ను ఎవరు రూపొందించారు? యాప్ పర్యవేక్షణ, ఎవరి నియంత్రణలో ఉంటుంది? తదితర వివరాలను ఆయన ఏమాత్రం వెల్లడించ లేదు. ఇదంతా టీడీపీ ఐటీ విభాగం ఆధ్వర్యంలోనే సాగుతోందని ఎన్నికల కమిషన్ వర్గాలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. పంచాయతీ ఎన్నికల్లో పాల్గొంటున్న వారికిగానీ, సాధారణ ప్రజలకు గానీ ఇంతవరకు యాప్ వివరాలను వెల్లడించ లేదు. నిమ్మగడ్డ యాప్ కంట్రోల్ కేంద్రం ఎక్కడ? కేంద్ర ఎన్నికల సంఘం 2019 సార్వత్రిక ఎన్నికల్లో వెబ్కాస్టింగ్తోపాటు ‘సీ–విజిల్’ అనే యాప్ను అందుబాటులోకి తెచ్చి విజయవంతంగా అమలు చేసింది. ఎన్నికల నిబంధనల అమలును దీని ద్వారా పర్యవేక్షించింది. దేశవ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో ఇవి ప్రధాన పాత్ర పోషించాయి. అంతర్జాతీయంగా కూడా భారత్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ప్రశంసలు వచ్చాయి. పారదర్శకంగా ఉండే ఈ యాప్ అందుబాటులో ఉండగా ఎక్కడ తయారైందో తెలియని సొంత యాప్ను నిమ్మగడ్డ తేవడంపై సందేహాలు అలముకుంటున్నాయి. అసలు నిమ్మగడ్డ యాప్ ఎక్కడ తయారైంది? ఎవరు పర్యవేక్షిస్తారు? కంట్రోల్ కేంద్రం ఎక్కడ? సిబ్బంది ఎవరు? కార్యాలయం ఎక్కడుంది? ఫిర్యాదులను ఎవరు చూస్తారు? టెండర్లు పిలిచారా? అనే వివరాలను ఏమాత్రం వెల్లడించకుండా గుట్టుగా ప్రైవేట్ యాప్ను సిద్ధం చేయడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఈ యాప్ పర్యవేక్షణ కేంద్రం ఎన్నికల కమిషన్ కార్యాలయంలో లేదన్నది మాత్రం సుస్పష్టం. ఇలా ఫిర్యాదు... అలా చర్యలు! యాప్ నియంత్రణ ఎక్కడుందనే వివరాలను అధికార వర్గాలకు తెలియకుండా నిమ్మగడ్డ రహస్యంగా ఉంచారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలోనే ‘కంట్రోల్ రూం’ లోగుట్టు దాగుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. యాప్ ప్రవేశపెడుతున్నట్టు అధికారికంగా వెల్లడించగానే అసలు కథ మొదలవుతుంది. అప్పటికే టీడీపీ నేతలు, కార్యకర్తల నుంచి తెప్పించిన ఫొటోలు, వీడియోలను యాప్లో అనుసంధానిస్తారు. యాప్ నిర్వహణ టీడీపీ ఐటీ వింగ్ ఆధ్వర్యంలోనే ఉండటంతో వాటినే కంట్రోల్ రూం నుంచి స్వీకరించి నిమ్మగడ్డకు అందజేస్తారు. ఇతరులు చేసే ఫిర్యాదులు బుట్టదాఖలు కానున్నాయి. టీడీపీ మద్దతుదారులు ఓడిపోతారని నిర్ధారణ అయ్యే పంచాయతీల్లో పోలింగ్ను నిలిపేయడం, ఓట్ల లెక్కింపును వాయిదా వేయడం, పోలింగ్ రద్దు చేయడం లాంటి చర్యలకు దిగే అవకాశం ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు. -
సొంత గడ్డకు నిమ్మగడ్డ
సాక్షి, తాడేపల్లి రూరల్ (దుగ్గిరాల): ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఆదివారం స్వగ్రామం దుగ్గిరాలకు విచ్చేశారు. ఆయన రాకను పురస్కరించుకొని టీడీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డు పొడవునా స్వాగతం పలికారు. ఏడాదిగా సొంతూరుకు వెళ్లని నిమ్మగడ్డ, ఇప్పుడు బిజీగా గడుపుతున్న వేళఊర్లో ప్రత్యక్షమవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. దుగ్గిరాల మండలానికి చెందిన కొంత మంది టీడీపీ నాయకులు ఆయన్ను కలిసి ఇంట్లో గంటన్నర పైనే మాట్లాడారు. నిమ్మగడ్డను కలిసిన వారిలో మాజీ సర్పంచ్ జంపాల కృష్ణారావు, దుగ్గిరాల బీజేపీ నాయకురాలు చుండూరు ఉమ తదితరులు ఉన్నారు. దుగ్గిరాల తహసీల్దార్ మల్లేశ్వరి నిమ్మగడ్డకు స్వాగతం పలికారు. చదవండి: (పరిటాల సునీతకు ఎదురుదెబ్బ) -
రేపు ఉత్తరాంధ్ర పర్యటనకు ఎస్ఈసీ
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ రేపటి నుండి ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం 12.20 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరనున్న ఎస్ఈసీ.. మధ్యాహ్నం 1.30గంటలకు విశాఖ చేరుకొని, అక్కడి నుంచి 2.30 గంటలకు శ్రీకాకుళం బయల్దేరి వెళ్తారు. సాయంత్రం 4.30 గంటలకు శ్రీకాకుళం జిల్లా అధికారులతో సమీక్ష అనంతరం, సాయంత్రం 7 గంటల నుంచి విజయనగరం జిల్లా అధికారులతో జరిగే సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. ఆ రాత్రికి విశాఖలోనే బస చేయనున్న ఎస్ఈసీ.. 2వ తేదీ ఉదయం 9 గంటలకు విశాఖ జిల్లా అధికారులతో, మధ్యాహ్నం 1.30 గంటలకు కాకినాడ వెళ్లి తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగంతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరి ఏలూరు చేరుకొని, రాత్రి 7 గంటల నుంచి పశ్చిమ గోదావరి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం అదే రోజు రాత్రి తిరిగి విజయవాడకు చేరుకుంటారు. -
ఎన్నికలను ఏ శక్తీ ఆపలేదు
కడప సిటీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల స్పష్టమైన తీర్పుతో పంచాయతీ ఎన్నికలను ఇక ఏ శక్తీ ఆపలేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ అన్నారు. శనివారం వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడప కలెక్టరేట్లో పంచాయతీ ఎన్నికలపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సరైన సమయంలో ఎన్నికలు నిర్వహించడం తన విధి అని, రాజ్యాంగం ప్రకారమే ఎన్నికల నిర్వహణ చేపట్టామన్నారు. 2006లో 36 శాతం పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని, ఆ తర్వాత నుంచి తగ్గుముఖం పడుతున్నాయన్నారు. బలవంతంగా ఏకగ్రీవాలకు పాల్పడటం తగదని, ఆ దిశగా ప్రభావితం చేసే వారిపై షాడో బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. వెనుకబడిన వారిని ప్రోత్సహించడమే సమన్యాయం అని, ప్రతిపక్ష పార్టీలపై వేధింపులు ఉండవని చెప్పారు. ఎన్నికల నిర్వహణపై జిల్లా యంత్రాంగం పనితీరు బాగుందని, పనితనం ఉన్న వారిపై ఆరోపణలు రావడం సహజమే అన్నారు. ఎన్నికల నియమ నిబంధనల ఉల్లంఘనపై ప్రత్యేకంగా దృష్టి సారించామని వివరించారు. నిజం నిర్భయంగా చెబుతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరుతో ఉన్న ఈ జిల్లాలో ఒక అధికారిక సమావేశంలో పాల్గొనడం చాలా సంతృప్తికరంగా ఉందని నిమ్మగడ్డ అన్నారు. వైఎస్సార్ వద్ద పని చేయడం వల్లే తన కెరీర్లో గొప్ప మలుపు వచ్చిందని చెప్పారు. ఆయన వద్ద మూడేళ్లు ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేసిన తనను, ప్రత్యేక పరిస్థితుల్లో రాజ్భవన్లో ఉన్నత బాధ్యతల కోసం పంపించారన్నారు. అలా వెళ్లిన తాను అక్కడ ఏడేళ్లు ఉండిపోయి ఎలక్షన్ కమిషనర్ను అయ్యానని వివరించారు. రాజ్ భవన్ ఆశీస్సులతోనే తనకు ఈ పదవి వచ్చిందన్నారు. అందువల్ల తన హృదయంలో వైఎస్కు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. తానెప్పుడూ నిజాన్ని నిర్భీతిగా, ధైర్యంగా చెబుతానన్నారు. ఇటీవల కొన్ని పరిణామాల వల్ల వచ్చిన సీబీఐ కేసుల్లో తాను ప్రధాన సాక్షినని, రేపు కోర్టులో నిలబడి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. చాలా విషయాల్లో ఇదివరకే సాక్ష్యం చెప్పానన్నారు. ఇలాంటి కేసుల్లో సాక్ష్యం చెప్పే వారికి కోర్టు అనేక రక్షణలు ఇచ్చిందన్నారు. అందువల్ల నిర్భీతితో తాను చెప్పాల్సింది చెబుతానన్నారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు నిమ్మగడ్డ సమాధానం ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
మంత్రుల పర్యటనలకు ప్రభుత్వ వాహనాలొద్దు
సాక్షి, అమరావతి : పార్టీయేతర ప్రాతిపదికన జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మంత్రులెవరూ పల్లెల్లో పర్యటించే సమయంలో వ్యక్తిగత భద్రతా సిబ్బంది తప్ప ఇతర ప్రభుత్వోద్యోగులెవరినీ వెంట తీసుకెళ్లకూడదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తెలిపారు. అలాంటి సమయాల్లో ప్రభుత్వ వాహనాలతో సహా ఇతరత్రా ఏ ప్రభుత్వ సదుపాయాలను వారు వినియోగించకూడదని శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్కు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో కోడ్ అమలులో ఉందని.. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమానికైనా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రభుత్వ వాహనాలను సమకూర్చవద్దని నిమ్మగడ్డ పేర్కొన్నారు. అలాగే, మంత్రులు తమ అధికారిక కార్యక్రమాలతో పాటు ఎన్నికల కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఏ ఇతర ప్రభుత్వ సౌకర్యాలను పొందకూడదని స్పష్టంచేశారు. అంతేకాక.. కేబినెట్ ర్యాంకు హోదాలో ప్రభుత్వ సలహాదారులుగా ఉండే వారు పార్టీ కార్యాలయాలకు వెళ్లి రావడానికి కూడా ప్రభుత్వ వాహనాలు వినియోగించుకోకూడదని.. ప్రభుత్వ సౌకర్యాలు పొందుతూ పార్టీకి సంబంధించిన ప్రెస్మీట్లలోనూ పాల్గొనడం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని నిమ్మగడ్డ ఆ లేఖలో సీఎస్కు వివరించారు. -
నోటి మాటే ఫై'న'ల్
సాక్షి, అమరావతి: ఎక్కడైనా సరే ప్రభుత్వ వ్యవస్థలంటే.. ఏ స్థాయిలో ఉన్నవారైనా, ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోవాలన్నా అది ఎందుకోసమో తెలియచేస్తూ పారదర్శకత కోసం నోట్ ఫైల్స్తో కూడిన దస్త్రం (ఫైల్) ఉంటుంది. కానీ రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం ఎలాంటి నోట్ ఫైల్స్, ఫైల్స్ లేకుండానే వరుసగా అత్యంత వివాదాస్పద నిర్ణయాలను ఎడాపెడా తీసుకుంటున్నారు. సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ శుక్రవారం తీసుకున్న నిర్ణయంతో సహా ఇటీవల నిమ్మగడ్డ పలు వివాదాస్పద నిర్ణయాలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కనీసం ఎందుకు తీసుకున్నారో తెలియజేసే ఫైళ్లు కూడా లేవని విశ్వసనీయంగా తెలిసింది. నిమ్మగడ్డ రమేష్కుమారే ఒక కారణాన్ని వెతుక్కోవడం.. ఆ వెంటనే తనకు విచక్షణాధికారాలు ఉన్నాయంటూ నిబంధనలను తుంగలోకి తొక్కి చర్యల పేరుతో ఉత్తర్వులు జారీ చేయడం నిత్యకృత్యంగా మారింది. నిమ్మగడ్డ నిర్ణయాలు అప్రజాస్వామికంగా, పూర్తిగా రాచరికపు పోకడలను తలపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు, రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చరిత్రలో పేరుపొందిన నియంతలను సైతం మరిపిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరించడాన్ని తప్పుబడుతున్నారు. రాష్ట్రపతి నుంచి న్యాయమూర్తుల దాకా.. రాష్ట్రపతి నుంచి ప్రధానమంత్రి వరకు తమకు అందే వినతులు, తాము తీసుకునే నిర్ణయాలకు సంబంధించి అన్ని వివరాలను ఒక ఫైల్ రూపంలో పొందుపరచడం అనవాయితీ అని అధికార వర్గాలు వెల్లడించాయి. ఉన్నత న్యాయస్థానాల్లో వెలువరించే తీర్పులకు సంబంధించి కూడా ఆ కేసుల తాలూకు అన్ని వివరాలను ప్రత్యేకంగా పైళ్ల రూపంలో పొందుపరుస్తారని పేర్కొన్నాయి. నిర్ణయం ఎంత చిన్నదైనా.. ప్రభుత్వ అధికారులు ఎంత చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా ‘ప్రతిపాదన’ అనే ప్రాధమిక రూపం నుంచి ప్రక్రియ మొదలవుతుంది. తొలిదశలో ప్రతిపాదన నోట్ ఫైల్గా రూపుదిద్దుకుంటుంది. సాధారణంగా కార్యాలయ దిగువస్థాయి అధికారి నోట్ఫైల్ను రూపొందించి తన పై అధికారికి పంపిస్తారు. పై అధికారి నోట్ ఫైల్లో అవసరమైన మార్పులు చేయడంతో పాటు తన అభిప్రాయాన్ని, రూల్ పొజిషన్ను పేర్కొంటూ సంతకం చేస్తారు. అక్కడ నుంచి సంబంధిత ఉన్నతాధికారికి ఫైలు వెళుతుంది. అవసరమైన మార్పులు చేర్పులు అనంతరం నిబంధనలకు అనుగుణంగా ఆ ప్రతిపాదన ఉంటే ఆమోదించి ఉత్తర్వులు జారీ చేస్తారు. ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఇదే విధానాలను అమలు చేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు వివరించాయి. సాధారణంగా రాజకీయ పార్టీలు లేదా ఇతరులెవరైనా ఫిర్యాదులు చేయకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోదు. కానీ నిమ్మగడ్డ మాత్రం ప్రజాస్వామ్య పద్ధతులను విస్మరించి నియంతృత్వ పోకడలతో ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తేటతెల్లమవుతోంది. ఎక్కడో తయారైన ఆదేశాలను జారీ చేస్తున్నారా? ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కనీసం నోట్ ఫైల్స్ కూడా లేకుండా వివాదస్పద ఆదేశాలను జారీ చేస్తున్న నిమ్మగడ్డ బయట ఎక్కడో రూపొందించిన వాటిని తన పేరుతో విడుదల చేస్తున్నట్లు పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతేడాది జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను మధ్యలోనే వాయిదా వేసినప్పుడు నిమ్మగడ్డ 2020 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. టీడీపీ కార్యాలయంలో తయారైన లేఖపై ఆయన సంతకం చేసి పంపినట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కాకుండా బయట తయారై వచ్చిన లేఖను నిమ్మగడ్డ కేంద్ర హోంశాఖకు పంపారన్న ఫిర్యాదుపై సీఐడీ విచారణ ప్రారంభం కాగా కోర్టు జోక్యంతో నిలిచిపోయింది. తాజాగా కూడా నిమ్మగడ్డ ఆదేశాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో కాకుండా బయటే రూపుదిద్దుకుని వస్తున్నాయని, వాటినే నిమ్మగడ్డ తన పేరుతో జారీ చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. తీర్పులు రావడమే ఆలస్యం.. ఎన్నికల కమిషన్ కార్యాలయంలోని నిమ్మగడ్డ ఛాంబరు (ఆయన విజయవాడలో ఉంటే రాత్రి వేళ కూడా అక్కడే గడుపుతూ నిద్రపోతుంటారు)లోకి ఎప్పడో ప్రత్యేక పరిస్థితుల్లో మినహా కార్యాలయ అధికారులను సైతం రానివ్వరని సిబ్బంది వెల్లడించారు. చాలా సందర్భాల్లో కీలక ఆదేశాలను నిమ్మగడ్డ తన ఛాంబరు నుంచే మొదట పేపరు మీద రాసి వాటిని వ్యక్తిగత భద్రతా సిబ్బంది, అటెండర్ ద్వారా ఒకరిద్దరు అధికారుల వద్దకు పంపి టైపు చేయించి అనంతరం ఆ కాగితాలపై సంతకాలు చేసి ఆదేశాల పేరుతో జారీ చేస్తున్నారని కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. నిమ్మగడ్డ చెబుతున్న ప్రకారమే రాష్ట్ర ఎన్నికల కమిషన్లో సిబ్బంది సంఖ్య తక్కువగా ఉంది. కానీ కోర్టు తీర్పులు లాంటివి వచ్చిన తర్వాత కేవలం 10 – 20 నిమిషాల వ్యవధిలోనే పేజీలకు పేజీలు ఆదేశాలు రూపొందించి మెరుపు వేగంతో జారీ చేస్తున్నారంటే దీని వెనుక అదృశ్య హస్తం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇలాంటి ఉత్తర్వులు రూపొందించేందుకు ఓ రాజకీయ పార్టీ ట్రస్టు భవన్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయనే విమర్శలున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్వతంత్రతను ఆ అదృశ్య శక్తులు నీరుగారుస్తున్నాయని, కమిషన్ కార్యాలయ ఉద్యోగులను కాకుండా ట్రస్టు భవన్ సేవలను వినియోగించుకోవడం వెనక లక్ష్యం ఏమిటనేది వరుసగా జారీ అవుతున్న వివాదాస్పద ఉత్తర్వులే రుజువు చేస్తున్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. -
జీఏడీ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ తనకున్న విచక్షణాధికారాలతో సాధారణ పరిపాలన విభాగం(జీఏడీ) ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ను బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయన లేఖ రాశారు. ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఈ నెల 23న ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్లు, ఎస్పీలు హాజరుకాకపోవడానికి ప్రవీణ్ ప్రకాశే కారణమని తాను చేయించిన విచారణల్లో తేలిందన్నారు. నేను నిబంధనల మేరకే పనిచేశా: పవీణ్ ప్రకాశ్ వివరణ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో తాను నిబంధనల ప్రకారమే పనిచేశానని సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ తన గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖపై వివరణ ఇస్తూ ఆయన సీఎస్కు శుక్రవారం లేఖ రాశారు. నిమ్మగడ్డ లేఖలో పూర్తి అంశాలను వివరించలేదన్నారు. ఎస్ఈసీ నుంచి తనకు మెయిల్ ద్వారా వచ్చిన లేఖపై తాను వెంటనే స్పందించానని, జీఏడీ ముఖ్య కార్యదర్శి(పొలిటికల్) కార్యాలయం స్వతంత్రమైంది కాదని, జీఏడీకి సీఎస్ అధిపతి అని, తాను ఆయనకే రిపోర్టు చేస్తాననే విషయాన్ని రమేష్ తెలుసుకోవాలన్నారు. జీఏడీలోని ఐదుగురు ముఖ్య కార్యదర్శుల్లో జీఏడీ పొలిటికల్ కార్యదర్శి సీఎస్కు సపోర్టింగ్ అధికారి మాత్రమేనన్నారు. కాబట్టి తాను స్పందించలేదని ఎస్ఈసీ అనడం ఎంతవరకు న్యాయమని, ఇది నైతికమా? అని ప్రశ్నించారు. ‘‘పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశంపై న్యాయవివాదం కొనసాగుతున్నందున, యథాతథస్థితి కొనసాగించాలని ప్రభుత్వం ఎన్నికల సంఘానికి తెలిపిన విషయం కలెక్టర్లు, ఎస్పీలందరికీ తెలుసు. వారు వీడియో కాన్ఫరెన్స్కు హాజరుకాకపోవడానికి అదే కారణం. ఈ అంశంలో నేను ప్రత్యేకంగా అధికారులను ఆదేశించింది ఏమీ లేదు. దీంతో నాకెలాంటి సంబంధం లేదు. వాస్తవాలిలా ఉంటే వీడియో కాన్ఫరెన్స్ జరక్కుండా నేను అడ్డుకున్నానని ఎస్ఈసీ అనడం ఏమాత్రం సమంజసం కాదు’’ అని ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. -
బలవంతపు ఏకగ్రీవాలను ఒప్పుకోం
సాక్షి ప్రతినిధి, అనంతపురం, సాక్షి ప్రతినిధి, కర్నూలు: పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలను ఒప్పుకునేది లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. నిర్దిష్టంగా ఇన్ని జరగాలనే పిడివాదంతో చేసే ఏకగ్రీవాలను అంగీకరించేది లేదన్నారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై శుక్రవారం ఆయన అనంతపురం, కర్నూలులో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల పర్యవేక్షణ కోసం కొత్త యాప్ ‘జియో’ తయారు చేశామని, గ్రామాల నుంచి నేరుగా రికార్డింగ్ మెసేజ్లతో పాటు సందేశాలు కూడా పంపవచ్చని తెలిపారు. యాప్, కాల్సెంటర్లను డ్యాష్బోర్డు ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. రాష్ట్ర సిబ్బందితోనే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో ఏకగ్రీవాలైన చోట్ల సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించాలని ఆదేశించారు. ఏకగ్రీవాలకు ఈ ప్రభుత్వం కొత్తగా ఏమీ ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదని, అది గతం నుంచే ఉందన్నారు. రాష్ట్రంలో ఆందోళనకర వాతావరణం ఉందని విపక్ష పార్టీల నాయకులు ఏకగ్రీవాలపై గవర్నర్కు ఫిర్యాదు చేశారని చెప్పారు. సమాచార శాఖ కమిషనర్ను సంజాయిషీ కోరానని, ఆయనపై చర్యలు కూడా తీసుకోబోతున్నానన్నారు. ఇప్పటివరకూ ఎన్నికల కమిషనర్లు నాలుగు గోడల మధ్య పిచ్చాపాటి కబుర్లతో కాలక్షేపం చేశారని, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల సందర్భంగా షాడో టీంలను విధిగా ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో పోలింగ్ సమయాన్ని ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పెంచినట్లు తెలిపారు. కోవిడ్ పాజిటివ్ పేషెంట్లు ఓటు వేసేందుకు వస్తే చివరిలో పీపీఈ కిట్లు ధరించి వినియోగించుకునేలా అవకాశం ఇస్తామన్నారు. నిన్ను సెన్సూర్ చేస్తా ఉన్నతాధికారికి నిమ్మగడ్డ బెదిరింపులు పత్రికలు, టీవీలు చూడలేదన్నందుకు ఓ ఉన్నతాధికారిని సెన్సూర్ చేస్తానంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ బెదిరించడం ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. అనంతపురంలో సమీక్ష సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ‘ఈ రోజు పత్రికలు చూశావా? గవర్నరు వద్ద ఏం జరిగిందో తెలుసా?’ అంటూ కోనేరు రంగారావు సిఫారసుల కమిటీ(కేఆర్ఆర్సీ) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విశ్వేశ్వర నాయుడును నిమ్మగడ్డ ప్రశ్నించారు. పత్రికలు, టీవీలు చూడకపోతే ఎన్నికల సమయంలో నువ్వేం పని చేస్తావంటూ చిందులు తొక్కినట్టు తెలిసింది. సెన్సూర్ చేస్తానంటూ మూడుసార్లు బెదిరించినట్లు సమాచారం. తాను తెల్లవారుజామునే వచ్చి రిటర్నింగ్ అధికారులకు ఫోన్లు చేసే పనిలో నిమగ్నమైనట్లు ఆయన పేర్కొనడంతో ‘గవర్నర్ వద్దకు వెళ్లి రాజకీయ పార్టీలు ఏం చెప్పాయో తెలియకపోతే ఏం డ్యూటీ చేస్తావ్?’ అని మరోసారి హెచ్చరించారు. అనంతరం ఆయన పేరు తెలుసుకుని నిమ్మగడ్డ సారీ చెప్పినట్లు తెలిసింది. మీడియాపై చిందులు... ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, జీఏడీ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్లను తప్పించాలంటూ రాసిన లేఖలపై నిమ్మగడ్డను మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంతో ఆయన సహనం కోల్పోయి గద్దించారు. ‘ఉండవయ్యా...ఉండు’ అంటూ చిర్రుబుర్రులాడారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించడంపై ఏ చర్యలు తీసుకుంటారన్న ప్రశ్నలపై అసహనం వ్యక్తం చేశారు. -
యాప్పై నిమ్మగడ్డ తెలిసే మాట్లాడుతున్నారా?
సాక్షి, అమరావతి: పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలను ‘యాప్’ ద్వారా నియంత్రించేందుకు పన్నిన కుట్ర లోతులు.. మెల్లగా బహిర్గతమవుతున్నాయి. ఈ ‘యాప్’ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెబుతున్న మాటలు, పాటిస్తున్న గోప్యత చూస్తుంటే... అసలీ ఎన్నికల్లో పారదర్శకత మచ్చుకైనా ఉంటుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఈ యాప్ జియోలో ఏపీ పంచాయతీ ఎన్నికల పేరిట లభ్యమవుతుందని, దీనికి రికార్డింగ్ మెసేజ్లు, ఫొటోలు, సందేశాలు పంపవచ్చని శుక్రవారం అనంతపురంలో విలేకరులతో చెప్పారాయన. సందేశం ఇచ్చిన వారికి రిప్లై ఇస్తామంటూ... తొలిసారికే ఇది విజయవంతం కాదని, మూడో దశకల్లా బలపడుతుందని, పట్టు వస్తుందని చెప్పారు. ఈ మాటలు విన్నవారికి... ఇలా మాట్లాడుతున్నది ఒక ఎన్నికల కమిషనరేనా? రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న అధికారేనా? అనే సందేహం రాక మానదు. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ మొదలై... తొలి దశ పోలింగ్ కూడా సమీపిస్తోంది. ఇప్పటికీ ఈ యాప్ గురించి ఎస్ఈసీ కార్యాలయంలో నిమ్మగడ్డకు తప్ప ఎవ్వరికీ వివరాలు తెలియవు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని రెండు రోజుల కిందట ‘సాక్షి’తో చెప్పిన నిమ్మగడ్డ కార్యదర్శి... శుక్రవారం నాలిక కర్చుకున్నారు. అలాంటిదేమీ పంపలేదన్నారు. ఇంకా విచిత్రమేంటంటే... జియోలో యాప్ ఉంటుందనే మాటకు అర్థమే లేదు. జియో అనేది బయటి యాప్లను హోస్ట్ చేసే ఆండ్రాయిడ్, ఐఓఎస్ లాంటి ప్లాట్ఫామ్ కాదు. ప్రస్తుతానికి అదో మొబైల్ నెట్వర్క్. ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ మాదిరే ఇది కూడా. మరి దీన్లో అధికారిక యాప్ను ఎలా ఆవిష్కరిస్తారు? మొదటి దశకు సక్సెస్ కాదని, చివరి దశకల్లా పట్టు వస్తుందని చెప్పటమేంటి? అసలీయన తెలిసే మాట్లాడుతున్నారా? లేక బయటి నుంచి ఎవరో చెప్పమన్న మాటలను చెబుతూ... తడబడుతున్నారా? కావాలని తప్పుడు మాటలు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారా? తనకు కావాల్సిన వారికే లాగిన్? యాప్ వివరాలు తన కార్యాలయంలో కూడా ఎవ్వరికీ తెలియకుండా సొంత వ్యవహారంలా చక్కబెడుతున్న నిమ్మగడ్డ రమేష్కుమార్... ఈ యాప్ ద్వారా అందే ఫిర్యాదులను తెరిచి చూసుకునేందుకు వీలైన లాగిన్ ఐడీ, పాస్వర్డ్లను కూడా ఎవ్వరికీ ఇవ్వలేదు. ఇది ఆయనకు, ఆయనకు ఇష్టమైన కొందరు తెలుగుదేశం పార్టీ ముఖ్యులకు మాత్రమే ఉంటుందని విశ్వసనీయంగా తెలియవచ్చింది. లాగిన్ తన ఒక్కడి దగ్గరే ఉంటుందన్న విషయాన్ని నిమ్మగడ్డ స్వయంగా జిల్లా కలెక్టర్ల సమావేశంలో చెప్పారు. జిల్లా కలెక్టర్లకు కూడా ఈ యాప్ అందుబాటులో ఉంటుంది కానీ... వారికి సీఈసీ పంపిన ఫిర్యాదులు మాత్రమే ఎవరి జిల్లావి వారికి కనిపిస్తాయి. దీనివల్ల సీఈసీ తనకు వచ్చిన ఫిర్యాదుల్లో కావాలనుకున్న వాటిని మాత్రమే కలెక్టర్లకు పంపించే అవకాశం ఉంటుంది. తనకు ఇష్టం లేని ఫిర్యాదుల్ని అక్కడే డిలీట్ చేసేయొచ్చు కూడా. ఎక్కడా నిఘా లేకుండా, ప్రభుత్వ అ«దీనంలో కాకుండా ఒక ప్రయివేటు వ్యక్తి మాదిరిగా ఇలా యాప్ను నిర్వహించటం అత్యంత ప్రమాదమన్నది ప్రజాస్వామ్య వాదుల మాట. సహజంగా ఇలాంటి టెక్నాలజీ వ్యవస్థల్ని కేంద్ర ప్రభుత్వ అ«దీనంలోని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ గానీ, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ విభాగం గానీ నిర్వహిస్తుంటాయి. కానీ వేటికీ సంబంధం లేకుండా తనే సొంత యాప్ను తయారు చేయించుకుని, తన ఒక్కడి వద్దే లాగిన్ ఉంచుకుని ఈయన ఏం చేయాలనుకుంటున్నారు? అసలు పారదర్శకత అనే మాటకు అర్థమైనా తెలుసా? రాజ్యాంగబద్ధమైన పదవిని అడ్డంపెట్టుకుని ఇలా విలువల్ని కాలరాయటం కరెక్టేనా? అన్నది అందరినీ తొలుస్తున్న ప్రశ్న. యాప్ తయారైందా.. లేదా.. అదీ రహస్యమే!! ఈ ఎన్నికల కోసం తానే ప్రత్యేక యాప్ తయారు చేయిస్తున్నట్టు చెప్పి నిమ్మగడ్డ ఏడాది కిత్రం పంచాయతీరాజ్ శాఖ తయారు చేయించిన నిఘా యాప్ను సైతం పక్కన పెట్టాలని ఆదేశాలిచ్చారు. అయితే, నిఘా యాప్కు బదులుగా ఆయన చెబుతున్న యాప్ ఇప్పటికే తయారైందా.. లేదా అన్నది తేల్చటం లేదు. గోప్యత పాటిస్తున్నారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ను అనంతపురంలో శుక్రవారం విలేకరులు అడిగినప్పుడు ఇంకా ఆ యాప్ తయారు చేయించడం పూర్తి కాలేదనే చెప్పటం గమనార్హం. మరో పక్క పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా శుక్రవారం ప్రారంభమైంది. 3249 గ్రామాల్లో ఫిబ్రవరి 9వ తేదీన్ల పోలింగ్ కూడా జరగబోతుంది. అంటే ఖచ్చితంగా మరో పది రోజులకు మించి సమయం లేదు. మరి ఈయన ఉద్దేశమేంటి? ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తయారు చేసి, తమ అ«దీనంలో నడిపిస్తున్న యాప్ను ఈయన వాడతారా? చివరి రోజు వరకూ ఎవ్వరికీ చెప్పకుండా ఇలాగే అందరినీ చీకట్లో ఉంచాలన్నది ఆయన వ్యూహమా? ‘ఔట్ సోర్సింగ్’ సిబ్బందిలో టీడీపీ హస్తం! ఇటీవలే కమిషన్ కార్యాలయంలో ఎన్నికల సెల్ను ఏర్పాటు చేశామని చెప్పిన నిమ్మగడ్డ... ఆ సెల్కు కేటాయించిన ఫోన్ నెంబర్లు మాత్రం గోప్యంగానే ఉంచుతున్నారు. ఎన్నికల కోసం ప్రభుత్వం ఇటీవల ప్రత్యేకంగా నియమించిన ఉద్యోగులతో కలిసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో 15 మంది లోపే రెగ్యులర్ ఉద్యోగుల పనిచేస్తున్నారని.. మరో 20 మంది దాకా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నన్నారని కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. ఇప్పుడు సెల్ నిర్వహణ బాధ్యత పూర్తిగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే చూస్తున్నారు. వీరిలో కొందరు తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పనిచేసిన వాళ్లు కూడా ఉన్నారని సమాచారం. వారికే ఈ సెల్ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు సమాచారం. -
నిమ్మగడ్డ తీరు: నాడు అలా.. నేడు ఇలా..
‘పార్టీయేతర ప్రాతిపదికన గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి కనుక ఈ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధులకు మద్దతుగా రాజకీయ పార్టీలు కటౌట్లు, హోర్డింగ్లు, గోడలపై పెయింటింగ్లు, బ్యానర్లు మొదలైన వాటిని ఏర్పాటు చేయకూడదు’ – 2018 అక్టోబర్ 25న ఎస్ఈసీ నిమ్మగడ్డ ఉత్తర్వులు సాక్షి, అమరావతి: ప్రభుత్వం మారిపోతే ఎన్నికల నిబంధనలూ మారిపోతాయా? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల విషయంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టాక మరోలా నడుచుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికల్లో పార్టీల ప్రమేయాన్ని నిరోధించిన ఆయన ఇప్పుడు వాటి జోక్యాన్ని ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నట్లు తాజా పరిణామాలతో వెల్లడవుతోంది. పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రమేయాన్ని ప్రోత్సహించేలా వాటి నుంచి ఫిర్యాదులు స్వీకరించడం.. గ్రామాల్లో శాంతి, ఐక్యతకు దోహదం చేసే ఏకగ్రీవ ఎన్నికలపై కమిషన్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందంటూ హెచ్చరికలు జారీ చేయడం ఇందుకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. మరోవైపు విశేషాధికారాల పేరుతో అధికార యంత్రాంగాన్ని బెదిరిస్తూ, ఒక పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా ఎస్ఈసీ వ్యవహరిస్తున్నారని, ఇవన్నీ పంచాయతీ ఎన్నికల్లో పార్టీల జోక్యాన్ని పెంచేందుకు దోహదం చేస్తాయని విశ్లేషిస్తున్నారు. చదవండి: విద్వేషాలకే వింత రాజకీయం రాజకీయాల రంగు పులిమేలా.. పార్టీ రహితంగా జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో గ్రూపులు, ఘర్షణలకు తావులేకుండా ప్రజలంతా అన్నదమ్ముల్లా కలసి మెలసి జీవించేలా ఏకగ్రీవాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటిస్తే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తప్పుబట్టడం విస్మయం కలిగిస్తోంది. రాజకీయాల రంగు పులుముకుంటే పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలకు దారి తీసి ప్రశాంతతకు భంగం కలుగుతుందనే ఉద్దేశంతో ఏకగ్రీవాలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను ప్రకటించింది. చదవండి: సెన్సూర్ అధికారం ఎస్ఈసీది కాదు ఈ నేపథ్యంలో అసలు రాజకీయ పార్టీల ప్రమేయమే ఉండకూడదని తానే ఆదేశాలు జారీ చేసి మళ్లీ ఇప్పుడు ఏకగ్రీవ ప్రకటనలపై రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశాయనడంపై అధికార యంత్రాంగం, నిపుణులు విస్తుపోతున్నారు. ప్రభుత్వ ఉద్దేశాలను తప్పుబట్టడమే కాకుండా ప్రకటనలిచ్చిన అధికారులకు సంజాయిషీ నోటీసులు జారీ చేయడాన్ని విపరీత ధోరణిగా అభివర్ణిస్తున్నారు. 2018లో నెంబరు 145–ఎస్ఈసీ–బి2– ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో ఎన్నికలకు రాజకీయ పార్టీలు పెట్టే ఖర్చులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకూడదు. అంటే ఈ ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీలు ఏ కార్యక్రమం చేపట్టకూడదని నిపుణులు పేర్కొంటున్నారు. టీడీపీ మేనిఫెస్టో.. ఉల్లంఘన కాదా? పార్టీలకు అతీతంగా జరగాల్సిన పంచాయతీ ఎన్నికలలో రాజకీయ పార్టీల ప్రమేయాన్ని ప్రోత్సహించేలా ఎస్ఈసీ వ్యవహరిస్తుండటాన్ని అలుసుగా తీసుకొని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మునుపెన్నడూ లేని వింత పోకడలకు తెర తీశారు. పార్టీయేతర ప్రాతిపదికన జరిగే పంచాయతీ ఎన్నికలలో రాజకీయ పార్టీలు కనీసం బ్యానర్లు కూడా కట్టకూడదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేస్తే.. చంద్రబాబు మాత్రం ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఓటర్లకు హామీలు గుప్పిస్తూ తాజాగా ఏకంగా మేనిఫెస్టోనే విడుదల చేయడం గమనార్హం. మరి ఇది ఎలాంటి ఉల్లంఘన కిందకు వస్తుందో ఉత్తర్వులిచ్చిన నిమ్మగడ్డే తేల్చాలని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఏకగ్రీవాలకు నజరానాలు ఆనవాయితీనే
సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఏకగ్రీవ పంచాయతీలకు నజరానాలు ప్రకటించడం దశాబ్దాలుగా కొనసాగుతోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. గ్రామాల్లో శాంతియుత వాతావరణం, ప్రజల మధ్య సఖ్యత, సోదరభావం పెంపొందాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంలో రాజకీయం ఎక్కడుందో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ చెప్పాలన్నారు. ఏకగ్రీవాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చేసిన వ్యాఖ్యలపై పలు ప్రశ్నలను సంధిస్తూ మంత్రి బుధవారం ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. పెద్దిరెడ్డి ఏమన్నారంటే.. నిమ్మగడ్డకు కంగారెందుకు? ► ప్రజాస్వామ్యంలో ఏకగ్రీవాలు జరగకూడదా? ఏకగ్రీవాలను అడ్డుకోవడమే మీ ఉద్దేశమా? రాష్ట్రంలోలో గ్రామీణ పాలన, సచివాలయ వ్యవస్థ, ఇళ్ల వద్దకే సంక్షేమ పాలనను ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు కొనియాడుతుంటే ఎస్ఈసీని అడ్డుపెట్టుకొని టీడీపీ అధినేత చంద్రబాబు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ► ఏకగ్రీవం అయ్యే పంచాయతీలకు నజరానాలు ప్రకటించడం దశాబ్దాలుగా కొనసాగుతోంది. స్వాతంత్య్రం రాకముందు నుంచి ‘పంచాల’ పేరుతో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. టీడీపీ హయాంలో ఏకగ్రీవాలను ఎందుకు తప్పుబట్టలేదు? అప్పటికే ఉన్న జీవోపై కోర్టుకు ఎందుకు వెళ్లలేదు? ► ఏకగ్రీవాలను అడ్డుకోవాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచనలు చేయడం దురదృష్టకరం. ఏకగ్రీవాలకు అస్కారం ఇవ్వరాదని బాబు టెలికాన్ఫరెన్సులో చెప్పిన మాటలనే ఎస్ఈసీ వల్లె వేశారు. ► ఏకగ్రీవాలు ఎక్కువైతే వ్యతిరేకిస్తామన్నట్లు నిమ్మగడ్డ అనడం రాజకీయం కాదా? ► ఏకగ్రీవాలు ఎన్ని అవుతాయో ముందుగానే ఎందుకు ఊహించి కంగారుపడుతున్నారు? ► పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా, పార్టీల గుర్తులతో సంబంధం లేకుండా జరుగుతాయని తెలిసి కూడా ఏకగ్రీవాలు ఫలానా పార్టీకి అనుకూలంగా, కొన్ని పార్టీలకు వ్యతిరేకంగా ఉంటాయనే అభిప్రాయాన్ని కలిగించేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? ► పరిమితులకు లోబడే ఏకగ్రీవాలు ఉండాలనేందుకు రాజ్యాంగపరమైన, చట్టపరమైన ప్రాతిపదిక ఏముందో, ఏ చట్టంలో అది పొందుపరిచారో నిమ్మగడ్డ వెల్లడించగలరా? ► అధికారులతో ఎలాంటి సమస్యా లేదంటూనే.. తనకన్నా మెరుగైన స్థితిలో రాష్ట్ర ఎన్నికల అధికారిగా విధులు నిర్వహించి అవార్డు పొందిన అధికారికి నిబంధనలు, నియమాలు తెలియవు అన్నట్లుగా కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం రాజకీయంలో భాగం కాదా? ► సీనియర్ ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్లకు ఎస్ఈసీ పంపిన 9 పేజీల అభిశంసన లేఖను తిరిగి ఎన్నికల కమిషన్కే పంపాలని నిర్ణయించాం. మార్చి 31 తరువాత నిమ్మగడ్డ రమేష్ చౌదరి టీడీపీలో చేరి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. ఎన్నికల కమిషనరే చట్టాలను ఉల్లంఘించారు ఎన్నికల కమిషనర్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం–1994 కి విరుద్ధంగా వ్యవహరించడం వల్ల రాష్ట్రంలో లక్షలాది మంది పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితి వచ్చిందని రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పంచాయతీరాజ్ చట్టం–1994 సెక్షన్ 2 (34) ప్రకారం ఎన్నికల జాబితా తయారు చేయడం, దానిని ప్రచురించడానికి ఏ సంవత్సరంలో జాబితా సిద్ధం చేశారో ఆ ఏడాది జనవరి 1వ తేదీని అర్హత తేదీ (క్వాలిఫైయింగ్ డేట్)గా గుర్తిస్తారని తెలిపారు. సెక్షన్ 11 ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన అధికారి ఈ క్వాలిఫయింగ్ డేట్ను ఆధారంగా చేసుకుని పంచాయతీ ఓటర్ల జాబితాలను సిద్ధం చేస్తారని, ఈ బాధ్యతలను జిల్లా పంచాయతీ అధికారికి అప్పగిస్తూ 2000 ఆగస్టు 4న అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. దీనినే ఇప్పటివరకు అన్ని ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయని చెప్పారు. నిబంధనలకు ఎస్ఈసీ తిలోదకాలు.. 2019లో చట్టపరంగా ఈ ప్రక్రియను అనుసరించిన కమిషనర్ 2021 పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ సమయంలో ఎందుకు తిలోదకాలు ఇచ్చారని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది ఓటర్లు ఓటు హక్కు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. 2021 జనవరి 1 క్వాలిఫైయింగ్ డేట్ ప్రకారం పంచాయతీల్లో ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఎన్నికల కమిషన్ ఎందుకు ఆదేశించలేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను కూడా ఖరారు చేయాల్సి ఉంటుందని, ఈ ప్రక్రియను పక్కన పెట్టడంతో ఎన్నికల చట్ట నిబంధనలను సాక్షాత్తూ ఎన్నికల కమిషనరే ఉల్లంఘించినట్లు అవుతోందన్నారు. దీనికి ప్రభుత్వం, ఉద్యోగులను కారణంగా చూపడం సమంజసం కాదన్నారు. -
ఏకగ్రీవాల ప్రకటనపై అభ్యంతరాలు
సాక్షి, అమరావతి: పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో శాంతి, సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేలా ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికలను ప్రభావితం చేసేలా ప్రకటనలున్నాయనే ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు. ‘ప్రభుత్వ ప్రకటనలను తప్పుబడుతూ నాలుగైదు రాజకీయ పార్టీలు కొత్త విషయాన్ని ఎన్నికల కమిషన్ ముందుకు తెచ్చాయి. ఎన్నికలు మొదలయ్యాక ఎన్నికలకు సంబంధించిన అన్ని విషయాలు కమిషన్ పరిధిలోనే ఉంటాయి. ఈ ప్రకటనపై ఐ అండ్ పీఆర్ కమిషనర్ నుంచి సంజాయిషీ కోరా’ అని నిమ్మగడ్డ పేర్కొన్నారు. మీడియాతో నిమ్మగడ్డ సమావేశం వివరాలివీ.. అపరిమితమైతే పరిశీలనే సాధారణంగా జరిగే ఏకగ్రీవ ఎన్నికలకు ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఏకగ్రీవాల సంఖ్య అపరిమితంగా పెరిగిపోతే నిశితంగా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్పై ఉంటుంది. ఎన్నికల్లో పోటీచేసే ఔత్సాహిక అభ్యర్థులకు అండగా నిలబడాలని కలెక్టర్లకు చెప్పా. ఇందుకు ఆటంకాలు కల్పిస్తే చర్యలు తీసుకోవాలని సూచించాం. తుది నిర్ణయం తీసుకోలేదు.. గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో చాలా అక్రమాలు జరిగాయని, దాని మూలంగానే ఏకగ్రీవాలు అయ్యాయని ఆరోపణలున్నాయి. ఇవన్నీ కమిషన్ విచారణలో ఉన్నాయి. ప్రస్తుతం ఏకగ్రీవాలు జరిగితే క్షేత్రస్థాయిలో జాగ్రత్తగా పరిశీలించి సముచిత నిర్ణయం తీసుకోవాలని సూచించాం. ఎన్నికలు సజావుగా జరుగుతాయని నాకు నమ్మకం ఉంది. అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే సుప్రీం తీర్పును ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారని భావించి, అన్ని విషయాలు న్యాయస్థానాల ముందుంచాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్పై ఉంటుంది. సంయమనం పాటించేలా చూడాలని కోరా ఇవాళ కలెక్టర్ల సమావేశం తర్వాత ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లన్నీ చక్కగా జరుగుతున్నాయి. ఎన్నికల కమిషనర్ను వ్యక్తిగతంగా నిందించడం తగదని, ప్రభుత్వంలో ఉన్న అధికార పెద్దలు సంయమనం పాటించి ఎన్నికల కమిషన్ ప్రతిష్టను కాపాడేందుకు కృషి చేయాలని గవర్నర్ను కోరా. ఈ విషయంపై సీఎస్కు గవర్నర్ సూచన చేసినట్లు తెలిసింది. మంత్రులందరికీ సీఎస్ చెప్పి ఉంటారు. కానీ సాయంత్రానికి ఓ మంత్రి.. ఎవరి ప్రాపకం కోసమో తాను ఇద్దరు అధికారులపై చర్య తీసుకున్నట్లు మాట్లాడడం బాధాకరం. అవి రాజ్యాంగ స్ఫూర్తి, ఎన్నికల కోడ్కు వ్యతిరేకం. ఇద్దరు అధికారులపై చర్య తీసుకున్నది వాస్తవమే. వాళ్లకు హానికరంగా ఉండేటట్లు నేనేమీ చేయలేదే. నేనేమీ వాళ్ల బదిలీ, క్రమశిక్షణ చర్యలు కోరలేదు. సస్పెండ్ చేస్తాననలేదు. కేవలం ‘సెన్సూర్’ చేశా. వారు మెరుగైన పనితీరు ప్రదర్శించి, పోకడలో మార్పు ఉంటే పునరాలోచించే అవకాశం ఉంటుంది. పొద్దున వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణను గిరిజా శంకర్కే అప్పగించా. జిల్లాలో సమస్యలుంటే ఆయన్నే సంప్రదించాలని కలెక్టర్లకు సూచించా. నేను వారి ప్రతిష్ట, గౌరవాన్ని పెంచడానికి ప్రయత్నించా. -
ఏకగ్రీవాలపై కమిషన్ కన్ను
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ పునరుద్ఘాటించారు. ఎన్నికల ఏర్పాట్లపై బుధవారం కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాన్ఫరెన్స్ వివరాలపై కమిషన్ కార్యాలయం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఏకగ్రీవ ఎన్నికలకు సంబంధించి ఏవైనా అవకతవకలు జరిగాయని నిర్ధారణకు వస్తే సంబంధిత ఆర్వో, ఏఆర్వోలపై కూడా చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, అంకితభావంతో నిర్వహించాలన్నారు. రాజ్యాంగ పరిధికి లోబడి ఎన్నికల కమిషన్ పనిచేస్తుందని, కమిషన్ విశేషాధికారాలను దుర్వినియోగం కానివ్వబోమని చెప్పారు. ‘గతం చూడొద్దు.. నేనూ చూడను.. ఎన్నికలు సజావుగా నడపడమే ధ్యేయంగా అందరూ పనిచేయాలి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా తహశీల్దార్లు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో అలసత్వం వహించినా, ఫిర్యాదులు వచ్చినా ఉపేక్షించం. అలాంటి ఘటనలను తీవ్రంగా పరిగణిస్తాం’ అని పేర్కొన్నారు. కొన్ని ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్పై తీవ్ర పదజాలంతో మాట్లాడినా వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదని చెప్పారు. ప్రత్యేక యాప్తో పోలింగ్ పర్యవేక్షణ.. ఎన్నికల రోజు వెబ్కాస్టింగ్కు బదులుగా ప్రత్యేక యాప్ ద్వారా పోలింగ్ బూత్ బయట, లోపల జరిగే అంశాలపై దృష్టి సారిస్తామని ఎస్ఈసీ తెలిపారు. ఇందుకోసం కొత్త యాప్ తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల అక్రమాలకు సంబంధించి వీడియో క్లిప్పింగ్లను, ఫొటోలను యాప్లో అప్లోడ్ చేయవచ్చని, వీటిని పరిశీలించేందుకు కమిషన్ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామన్నారు. పంచాయతీ ఎన్నికలలో వలంటీర్లను వినియోగించరాదని, వారు ప్రచార కార్యక్రమంలో పాల్గొంటే తీవ్ర చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. సమన్వయంతో నిర్వహించుకుందాం: సీఎస్ ఎన్నికల ప్రక్రియను సమన్వయంతో సమర్ధంగా నిర్వహించుకుందామని కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పేర్కొన్నారు. కోవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు పోలీసు బృందాలను పోలింగ్కు రెండు రోజుల ముందే సిద్ధం చేస్తున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. తొలివిడత పోలింగ్ 9వ తేదీన జరగనుండగా 7వ తేదీకల్లా విధుల్లో పాల్గొనే పోలీసు సిబ్బందికి వ్యాక్సినేషన్ అందేలా ప్రణాళిక రూపొందించుకుంటామన్నారు. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ సమావేశంలో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పోలింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. పోలింగ్ మెటీరియల్, ఎన్నికల ఫారాలను సిద్ధం చేయడం, బ్యాలెట్ బాక్స్లు బూత్లకు తరలింపు ప్రక్రియలో కలెక్టర్లకు పూర్తి స్థాయి అధికారాలుంటాయన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కలెక్టర్లు పంపే ప్రతిపాదనలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి తదనుగుణంగా ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుందన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బందికి శానిటైజర్లు, మాసు్కలు, గ్లౌజులు అందుబాటులో ఉంచుతామని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కె.భాస్కర్ తెలిపారు. మొదటి దశలో ఆరోగ్య సిబ్బందికి, తదుపరి పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బందికి, అధికారులకు వ్యాక్సినేషన్ ఉంటుందన్నారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, అడిషనల్ డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్, ఏడీజీ సంజయ్ పాల్గొన్నారు. జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్స్లో జెడ్పీ సీఈవోలు, డీపీవోలు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆదిత్యనాథ్ దాస్, గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ దాదాపు పావుగంట పాటు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమే‹Ùకుమార్తో ఆయన చాంబర్లో సమావేశమై చర్చలు జరిపారు. నేనే జిల్లాల్లో పర్యటిస్తా.. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి అన్ని రకాల బాధ్యతలను రాష్ట్ర ఎన్నికల అథారిటీ హోదాలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ చూసుకుంటారని.. స్వేచ్ఛ, పారదర్శకంగా నిర్వహించే క్రమంలో తనకు అనేక ఇతర పనులు ఉంటాయని నిమ్మగడ్డ చెప్పారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి కలెక్టర్లు ఎవరూ తనతో ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదని, వాటిని పంచాయతీరాజ్ కమిషనర్ దృష్టికి తేవాలన్నారు. ఎన్నికల సమయంలో తాను స్వయంగా జిల్లాల్లో పర్యటిస్తానని ప్రకటించారు. కోడ్, నిబంధనల అమలులో అధికారులెవరూ నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. మూడు జిల్లాల్లో షెడ్యూల్ మార్చాలని వినతి విజయనగరం, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విడతల వారీగా ఎన్నికలు జరిపే మండలాలలో మార్పులు చేయాలని వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లు కోరినట్లు తెలిసింది. అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించిన ప్రాంతాలలో చివరి విడతలో ఎన్నికలు జరిపేలా ఏర్పాట్లు చేశామని, అయితే నోటిఫికేషన్ రీషెడ్యూల్లో తొలి విడత ఎన్నికలను ఆఖరి విడతకు మార్చడం వల్ల సమస్య ఉత్పన్నమైనట్లు కలెక్టర్లు నిమ్మగడ్డ దృష్టికి తెచ్చారు. విజయనగరం కలెక్టర్ ప్రతిపాదన పట్ల నిమ్మగడ్డ సానుకూలంగా స్పందించారని, అందుకు సంబంధించిన ప్రతిపాదనను పంచాయతీరాజ్ కమిషనర్ ద్వారా పంపాలని సూచించినట్లు తెలిసింది. -
లక్ష్మణ రేఖ దాటొద్దు
సాక్షి, అమరావతి: ‘ఎన్నికల నిర్వహణ రాజ్యాంగబద్ధ ప్రక్రియ. అందులో భాగస్వాములయ్యే ప్రతి ఒక్కరికీ లక్ష్మణ రేఖ ఉంటుంది. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారితో సహా ఎవరూ కూడా ఆ రేఖను అతిక్రమించకూడదు. అందరూ తమ పరిధిని గుర్తెరిగి సమన్వయంతో పని చేయాలి’ అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ హితవు చెప్పినట్టు సమాచారం. ‘ఎన్నికల నిర్వహణ అన్నది ఒక్కరితో సాధ్యం కాదని.. యావత్ ప్రభుత్వ యంత్రాంగాన్ని విశ్వాసంలోకి తీసుకుని సమన్వయం, సంయమనంతో వ్యవహరించాలి’ అని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర అధికార యంత్రాంగం యావత్తూ సమాయత్తమవుతున్న తరుణంలో పంచాయతీరాజ్ ఉన్నతాధికారులపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ మంగళవారం ఏకపక్షంగా చర్యలకు సిఫార్సు చేయడంతో తీవ్ర కలకలం రేగింది. నిమ్మగడ్డ తన పరిధిని అతిక్రమించి ఏకపక్షంగా వ్యవహరించారని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు నిబద్ధతతో పని చేస్తున్న ఉన్నతాధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తాయన్నారు. నిమ్మగడ్డ చర్యలు ఒక చెడు సంప్రదాయానికి తెరతీస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తనను కలవాల్సిందిగా గవర్నర్ హరిచందన్.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ను ఆదేశించినట్టు సమాచారం. దాంతో నిమ్మగడ్డ బుధవారం రాజ్భవన్కు చేరుకుని దాదాపు 40 నిమిషాల పాటు గవర్నర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చేపడుతున్న చర్యల గురించి గవర్నర్ ఆరా తీశారు. అనంతరం పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు ఇద్దరిపై ఎందుకు ‘సెన్సూ్యర్’ చర్యలు చేపట్టాల్సి వచ్చిందని గవర్నర్ ప్రశ్నించినట్టు సమాచారం. గవర్నర్ హరిచందన్తో సమావేశమైన ఎస్ఈసీ నిమ్మగడ్డ నేరుగా ఎలా చర్యలు తీసుకుంటారు? ► నేరుగా క్రమశిక్షణా చర్యలు చేపట్టే అధికారం రాష్ట్ర ఎన్నికల కమిషన్కు లేదు కదా అని గవర్నర్.. నిమ్మగడ్డకు గుర్తు చేసినట్టు తెలిసింది. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుపై తుది తీర్పు వచ్చే వరకు వేచి చూడాలన్న దృక్పథంతోనే ఉన్నతాధికారులు వ్యవహరించారని, అదేమీ తప్పుకాదని గవర్నర్ చెప్పినట్టు సమాచారం. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉన్నందున ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు పంచాయతీ ఎన్నికల వాయిదా కోరాయి తప్ప, ఇతరత్రా కారణాలు లేవు కదా అని అన్నట్లు తెలుస్తోంది. ఆ మొత్తం వ్యవహారంపై తనకూ సమాచారం ఉందని గవర్నర్ చెప్పడంతో నిమ్మగడ్డ మరేమీ మాట్లాడలేకపోయారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ► అయ్యిందేదో అయ్యింది.. ఇకనైనా భేషజాలు విడిచిపెట్టి అధికార యంత్రాంగాన్ని కలుపుకుని ఎన్నికలు నిర్వహించాలని గవర్నర్ సున్నితంగా అయినాసరే కచ్చితంగా చెప్పారని అధికార వర్గాలు చర్చించుకుంటున్నాయి. గవర్నర్ మాటలతో ఒకింత మార్పు! ► గవర్నర్ మాటలు నిమ్మగడ్డ రమేష్పై బాగానే ప్రభావం చూపించాయనిపిస్తోంది. ఆయనతో భేటీ అనంతరం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన తీరే ఇందుకు నిదర్శనం. సీఎస్ ఆదిత్యనాథ్దాస్, డీజీపీ సవాంగ్, పంచాయతీ రాజ్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్లతో సహా ఈ వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ సందర్భంగా క్షేత్రస్థాయి అధికార యంత్రాంగంతో రోజువారీ సమీక్ష, సమన్వయ బాధ్యతలను పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ నిర్వర్తిస్తారని, ఆయన ఆదేశాలను పాటించాలని నిమ్మగడ్డ.. కలెక్టర్లకు స్పష్టం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ► సరైన సమయంలో గవర్నర్ జోక్యం చేసుకుని నిమ్మగడ్డ రమేష్కు తన పరిధి, పరిమితులను గుర్తు చేయడం ప్రభావం చూపింది. రాష్ట్రంలో ఉన్నతాధికారులతోపాటు యావత్ అధికార యంత్రాంగం మనోస్థైర్యం ఇనుమడించిందని అధికార వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. -
ఎస్ఈసీ వ్యాఖ్యలు తమ నిబద్దతను శంకించేలా ఉన్నాయి..
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల విధులకు కేంద్ర సిబ్బందిని వినియోగించుకుంటామంటూ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నిబద్దతని శంకించేలా ఉన్నాయంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే ఆర్ సూర్యనారాయణ మండి పడ్డారు. గతంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించారని, కరోనా పరిస్ధితుల దృష్ట్యా మాత్రమే తాము ఎన్నికలను వాయిదా వేయాలని ఎస్ఈసీని కోరామన్నారు. కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహిస్తే ఉద్యోగులు ఎదుర్కొనే ఇబ్బందులపై తాము ఎస్ఈసీకి వినతి పత్రాన్ని సమర్పించామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రభుత్వ ఉద్యోగులపై ఎస్ఈసీ చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. రాష్ట్ర ఉద్యోగులను కించపరుస్తూ ఎన్నికల విధులకు కేంద్ర సిబ్బందిని వాడుకుంటామని చెప్పడంపై ఎస్ఈసీని ప్రశ్నించామన్నారు. అయితే ప్లాన్ బి కింద రాష్ట్ర ఉద్యోగుల సేవలు వినియోగించుకునేందుకు ఆలోచన చేశామని ఎస్ఈసీ వివరణ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్క్లు, శానిటైజర్లు సరఫరా చేస్తామని గతంలో ఎస్ఈసీ ప్రకటించారని, వాటి విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదన్నారు. ప్రకటనలతో సరిపెట్టకుండా ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందిని కరోనా నుంచి రక్షణ కల్పించాలని తాము ఎస్ఈసీని కోరామన్నారు. ఎస్ఈసీని కలిసిన వారిలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్సి ఆస్కార్ రావు తదితరులు ఉన్నారు. -
ఎన్నికల విధుల్లో పాల్గొనండి
సాక్షి, అమరావతి: ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని.. ఎన్నికల విధుల్లో పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలను కోరారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆదిత్యనాథ్ దాస్ ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. కోడ్ అమలు, ఉద్యోగుల విధుల గురించి చెప్పిన ఆయన ఎన్నికల ఏర్పాట్ల గురించి కూడా వారికి వివరించారు. ఎన్నికలు, వ్యాక్సినేషన్ ఒకేసారి నిర్వహించడం కష్టమని.. దీనిపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఇప్పటికే తాను కేంద్రానికి లేఖ రాశానని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్తో బుధవారం జరిగే సమావేశంలో ఈ అంశాన్ని చర్చిస్తానని హమీ ఇచ్చారు. ఇక తమ భద్రతకు సంబంధించి ఉద్యోగ సంఘాల నాయకులు పలు అనుమానాలు లేవనెత్తగా ఆయన నివృత్తి చేశారు. చివరికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఉద్యోగ సంఘాల నేతలు అంగీకరించారు. సమావేశానంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల విధుల్లో మృతిచెందితే రూ.50 లక్షలు ఇవ్వాలి తాము ఎన్నికల విధుల్లో పాల్గొంటామని.. కానీ, తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సీఎస్ను కోరినట్లు ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉండి కరోనా సోకి మృతిచెందితే రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని కోరామన్నారు. 50 ఏళ్లు దాటిన మహిళలకు పోలింగ్ డ్యూటీ వేయవద్దని.. ఆరోగ్య సమస్యలున్న వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కూడా కోరినట్లు ఆయన తెలిపారు. తాము ఉద్యోగులను ఇబ్బంది పెట్టవద్దని మాత్రమే కోరామని తెలిపారు. సుప్రీంకోర్టులో ఉద్యోగులకు న్యాయం జరగలేదని, అయినా తీర్పును తాము గౌరవిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల భద్రత గురించి అడిగితే తమకు రాజకీయాలు ఆపాదించారని, గత ముఖ్యమంత్రి ఉద్యోగులను ఢిల్లీ తీసుకెళ్లి బీజేపీని ఓడించండి అని నినాదాలు చేయించారని తెలిపారు. సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలవలేని వారు కూడా తమను విమర్శిస్తున్నారని, ఉద్యోగులతో వైరం మంచిది కాదని వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ తమను వివాదంలోకి లాగిందని, తాము ఎప్పుడూ వారితో విభేదించలేదన్నారు. తమపై వ్యాఖ్యలు చేశాకే తాము వ్యాఖ్యలు చేశామని చెప్పారు. ఎన్నికలకు పూర్తిగా సహకరిస్తామన్నారు. ఎన్నికలకు సహకరిస్తాం ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. తమ సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చెప్పామని, ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ఎన్నికలకు సహకరించాలని నిర్ణయించామని తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చాకే ఎన్నికలు నిర్వహించాలని తాము కోరగా తాను ఆ విషయాన్ని ఎన్నికల కమిషనర్తో చర్చిస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొని కోవిడ్ బారిన పడకుండా ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరగా ఆయన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారని తెలిపారు. ఇప్పటికీ ఉద్యోగులు ఎన్నికలకు సిద్ధంగా లేరని.. తమ సంఘం జిల్లాల సభ్యులు ఎన్నికలకు వెళ్లలేమని చెబుతున్నారని చెప్పారు. వారిని ఒప్పించి ఎన్నికలకు సహకరిస్తామని, కానీ.. ఉద్యోగులకు కోవిడ్ నుంచి పూర్తి రక్షణ కల్పించాల్సిందేనని కోరామని చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. ఉద్యోగులకు పూర్తి భద్రత కల్పించాలి ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉద్యోగులకు పూర్తి భద్రత కల్పించాలని సీఎస్ను కోరినట్లు తెలిపారు. ఎక్కువ వయసున్న ఉద్యోగులను, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని ఎన్నికల విధుల నుంచి మినహాయించాలని కోరామన్నారు. కరోనా వ్యాక్సిన్ ఇచ్చాకే ఉద్యోగులను ఎన్నికల విధుల్లో వాడుకుంటామని, పీపీఈ కిట్లు ఇస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చెప్పారని, అవన్నీ జరిగేలా చూడాలని కోరినట్లు ఆయన తెలిపారు. -
పోలింగ్ విధులకు కేంద్ర ఉద్యోగులు!
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను పోలింగ్ సిబ్బందిగా వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ సూచించారు. తనకున్న విశేషాధికారాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అన్ని జిల్లాల కలెక్టర్లకు సమాచారమిస్తూ నిమ్మగడ్డ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా కలెక్టర్లు మొదటి ప్రాధాన్యతగా రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఆర్గనైజేషన్స్, రాష్ట్ర సహకార సంస్థల ఉద్యోగులనే ఎన్నికల విధులలో వినియోగించుకోవాలని నిమ్మగడ్డ ఆ ఉత్తర్వులో సూచించారు. అప్పటికీ సిబ్బంది సరిపోని పక్షంలోనే కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులను వినియోగించుకోవాలన్నారు. ఇదిలా ఉంటే.. ఎన్నికల విధులకు కేంద్ర ప్రభుత్వోద్యోగులను వినియోగించుకోవడానికి అవకాశమివ్వాలని కేంద్ర కేబినేట్ సెక్రటరీకి కూడా లేఖ రాసినట్లు నిమ్మగడ్డ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయండి పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి చర్చించేందుకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో ఈనెల 27 లేదా అంతకంటే ముందుగా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటుచేయాలంటూ నిమ్మగడ్డ రమేష్కుమార్ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్కు లేఖ రాశారు. ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వపరంగా పూర్తి తోడ్పాటు, సహాయ సహకారాలు అందించాలని కోరారు. -
ఏపీ: పంచాయతీ ఎన్నికలు రీ షెడ్యూల్
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలను ఎస్ఈసీ రీ షెడ్యూల్ చేసింది. రెండో దశ ఎన్నికలను తొలి దశగా మారుస్తూ రీ షెడ్యూల్ ప్రకటించింది. మూడో దశ ఎన్నికలను రెండో విడతగా, నాలుగో దశ ఎన్నికలను మూడో విడతగా ఎస్ఈసీ మార్పు చేసింది. మొదటి దశ ఎన్నికలను నాలుగో విడతగా మార్చింది. ఎన్నికల ఏర్పాట్లు పూర్తికానందున రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. తొలి దశకు ఈ నెల 29 నుంచి, రెండో దశకు ఫిబ్రవరి 2 నుంచి, మూడో దశకు ఫిబ్రవరి 6 నుంచి, నాలుగో దశకు ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 9న తొలి విడత, ఫిబ్రవరి 13న రెండో దశ, ఫిబ్రవరి 17న మూడో దశ, ఫిబ్రవరి 21న నాలుగో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. చదవండి: ఎన్నికలు వాయిదా వేసిన గోవా ఎస్ఈసీ -
గతేడాది ‘స్థానికం’ నోటిఫికేషన్ నాటికి ఒక్క కేసే..
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గతేడాది మార్చిలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూలు జారీ చేసి కూడా కరోనా ఉందంటూ వాయిదా వేయడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా ప్రకటించిన ప్రకారం నాడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి ఉంటే రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి ప్రభావం ఏమాత్రం లేనప్పుడే పోలింగ్ ప్రక్రియ సజావుగా పూర్తయ్యేదని నిపుణులు పేర్కొంటున్నారు. అప్పటితో పోలిస్తే రాష్ట్రంలో ఇప్పుడే చాలా ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. నాడు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ నాటికి రాష్ట్రంలో కేవలం ఒకే ఒక్క కరోనా కేసు ఉంది. ఇప్పుడు సగటున రోజుకు 170 నుంచి 180 వరకూ నమోదవుతున్నాయి. పైగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. లక్షలాది మంది సిబ్బంది ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. మరి అప్పుడు వాయిదా వేసి ఇప్పుడెందుకు నోటిఫికేషన్ ఇచ్చారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవైపు ఉద్యోగులు మరోవైపు వైద్యులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా ఈ సమయంలో ఎన్నికలు సరికాదని విన్నవిస్తున్నా మొండిగా వ్యవహరించడం వెనుక కొందరి రహస్య పాత్ర ఉందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కేసులు లేనప్పుడు వాయిదా వేసి.. గత ఏడాది మార్చి 7వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సమయంతో పోలిస్తే కరోనా పరిస్థితులు ఇప్పుడే ఆందోళనకరంగా ఉన్నాయి. ఏప్రిల్లో మర్కజ్ యాత్రికులు తిరిగి రావడం, వివిధ రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు పెద్ద ఎత్తున వలస కార్మీకుల రాకతో క్రమంగా పెరిగిపోయాయి. గతేడాది మార్చిలో కరోనా కేసులు లేనప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను మధ్యలోనే వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తాజాగా కోవిడ్ సెకండ్ వేవ్ చెలరేగిన వేళ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. కరోనా పరిస్థితులు ఇలా ► స్థానిక సంస్థలకు సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ గతేడాది మార్చి 7న విడుదలైంది. ఆ సమయానికి రాష్ట్రంలో నమోదైన కేసులు కేవలం ఒక్కటి మాత్రమే కావడం గమనార్హం. ► ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తేదీ మార్చి 21 నాటికి రాష్ట్రంలో కేసులు 13 మాత్రమే ఉన్నాయి. తొలిదశ పంచాయతీ ఎన్నికలు మార్చి 27న నిర్వహించనున్నట్లు షెడ్యూలు జారీ చేయగా అప్పటికి 13 పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. ► రెండో దశ పంచాయతీ ఎన్నికల షెడ్యూలు సమయానికి అంటే మార్చి 28 నుంచి ఏప్రిల్ 3 నాటికి 167 కేసులున్నాయి. అయితే ముందుగా ప్రకటించిన ప్రకారం ఎన్నికలు జరిగి ఉంటే అప్పటికి పోలింగ్ ముగిసేది. ► స్థానిక సంస్థల ఎన్నికలను అర్ధాంతరంగా వాయిదా వేసిన గత మార్చి 15వతేదీ నాటికి రాష్ట్రంలో నమోదైంది కేవలం 3 కేసులు మాత్రమే. ► తాజాగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన జనవరి 23న రాష్ట్రంలో 172 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ రాష్ట్రంలో సగటున వారానికి 1,260 కరోనా కేసులు నమోదవుతున్నాయి. -
నిమ్మగడ్డపైనే నిఘా పెట్టాలి
సాక్షి, అమరావతి: తనపై నిఘా పెట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డీజీపీకి లేఖ రాశారని, అసలు నిఘా పెట్టాల్సింది ఆయనపైనేనని రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కే వెంకట్రామిరెడ్డి అన్నారు. ఆయనే ఎవరెవరినో కలుస్తున్నారని, ఈ విషయం అందరికీ తెలుసని చెప్పారు. విజయవాడ ప్రెస్క్లబ్లో ఆదివారం వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయనను బెదిరించినట్లు, తన ద్వారా ఆయనకు ప్రాణహాని ఉన్నట్లు ఎన్నికల కమిషనర్ డీజీపీకి లేఖ రాయడం సరికాదన్నారు. ఆయన్ను బెదిరించాల్సిన అవసరం తనకు లేదని, రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి మాత్రమే తాను చెప్పానని, అవి ఆయన్ను ఉద్దేశించి కాదన్నారు. అయినా, తనపై నిఘా పెట్టినా అభ్యంతరం లేదన్నారు. తాను ఉద్యోగులు, వారి రక్షణ గురించి మాత్రమే మాట్లాడానని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏమిటని అడిగామని చెప్పారు. 30 నెలలుగా ఏం చేశారు? ఎన్నికల కమిషనర్కి ప్రభుత్వానికి ఏదైనా ఉంటే వాళ్లే చూసుకోవాలని, వారి మధ్య జరిగే పోరాటంలో ఉద్యోగుల్ని బలి చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు వెంటనే ఎన్నికలు పెడితే వచ్చే లాభం, వ్యాక్సినేషన్ పూర్తయ్యాక జరిగితే వచ్చే నష్టం ఏమిటో ఎస్ఈసీ చెప్పాలని వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. 30 నెలల నుంచి ప్రత్యేక అధికారుల పాలన ఉందని, ఇంతకాలం ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నా వెంకట్రామిరెడ్డి, చంద్రశేఖర్రెడ్డి వంటి నాయకులే సిద్ధంగా లేరని కొందరు టీడీపీ నాయకులు అంటున్నారని.. సిద్ధంగా ఉన్న వారితో ఎన్నికలు జరుపుకోవచ్చని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని తెలిపారు. టీడీపీ అధికార ప్రతినిధి హద్దుల్లో ఉండాలి టీడీపీ అధికార ప్రతినిధి తమ గురించి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ఆయన హద్దుల్లో ఉండాలని వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. ఉద్యోగులను అడ్డగోలుగా వాడుకుంది టీడీపీ ప్రభుత్వమేనని విమర్శించారు. సచివాలయం నుంచి బస్సులు పెట్టి పోలవరం ప్రాజెక్టుకి ఉద్యోగుల్ని తీసుకెళ్లారని.. ఢిల్లీలో దీక్షలు చేసి అక్కడికి తమను తీసుకెళ్లారని.. నవ నిర్మాణ దీక్షలు చేసి వాటికి ఉద్యోగులను తరలించారని.. ఇలా టీడీపీ ప్రభుత్వం వాడుకున్నంతగా ఉద్యోగుల్ని ఎవరూ వాడుకోలేదన్నారు. ఇప్పటి ప్రభుత్వం అలాంటి ఒక్కదానిక్కూడా ఉద్యోగులను తీసుకెళ్లలేదని చెప్పారు. ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి అరవపాల్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమే‹Ùకుమార్పై నిఘా పెట్టాలని తాము డీజీపీని కోరతామని చెప్పారు. తమపై మాట తూలితే సహించేది లేదన్నారు. -
‘పంచాయతీ’: ఒట్టు.. ఇదీ లోగుట్టు!
సాక్షి, అమరావతి: కరోనా వ్యాక్సినేషన్ వేళ ఎన్నికలొద్దని అందరూ చెబుతున్నా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎందుకు వినిపించుకోవడం లేదు? హడావుడిగా 2019 ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు నిర్వహిస్తామని ఎందుకు చెబుతున్నారు? ఒకవేళ ఎన్నికలు తప్పదనుకుంటే గతంలో ప్రక్రియ ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే తిరిగి మొదలు పెట్టాలి కదా? మధ్యలో ఆగిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను అలా గాలికొదిలేసి కొత్తగా పంచాయతీ ఎన్నికలకు ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చినట్లు? లక్షలాది మంది ప్రజల మదిని తొలుస్తున్న ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అంపశయ్యపై ఉన్న టీడీపీకి ఊతమివ్వడానికేనని స్పష్టమవుతోంది. తనకు పదవి కట్టబెట్టడానికి కారణమైన రాజకీయ పెద్దల ప్రయోజనాల కోసమే పని చేస్తున్నట్టు స్పష్టమవుతున్నా, ఏమాత్రం జంకకుండా నిర్ణయాలు తీసుకుంటుండటం రాజకీయ పరిశీలకులను విస్మయ పరుస్తోంది. గ్రామాల్లో జనం గ్రూపులుగా విడిపోవాలి.. – మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలలో వైఎస్సార్సీపీ గెలుపొందిన తర్వాత తెలుగుదేశం పార్టీ రాజకీయంగా పూర్తిగా బలహీన పడిందనేది అందరికీ తెలిసిందే. ఎంతో మంది నేతలు, కార్యకర్తలు ఆ పార్టీని వీడుతున్న సంగతి కూడా విదితమే. ఏకంగా పలువురు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా వైఎస్ జగన్కు మద్దతు ప్రకటించడం చూస్తున్నాం. – ఈ పరిణామాలను తట్టుకోలేక ఆ పార్టీ పెద్దలు దిగజారుడు రాజకీయం చేస్తుండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఇలానే కొనసాగితే మిగిలిన కొద్దిపాటి మంది కూడా పార్టీకి దూరమవ్వడం ఖాయం అనే భయం చంద్రబాబు అండ్ కో కు పట్టుకుంది. – ఈ పరిస్థితి నుంచి కాస్తా అయినా కోలుకోడానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను అడ్డుపెట్టుకుని, వారి వ్యూహం ప్రకారం స్థానిక ఎన్నికల ప్రక్రియను వాడుకుంటూ పావులు కదిపారని స్పష్టమవుతోంది. ఆ రోజు భయంతో వాయిదా – గత ఏడాది మార్చిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. అప్పటికే వైఎస్ జగన్ తనదైన శైలిలో ఇచ్చిన హామీల్లో సింహ భాగం నెరవేర్చడంతో పాటు ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దీంతో పలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వార్ వన్సైడ్గా మారిపోతోందని స్పష్టమైంది. ఇది గమనించి, టీడీపీ పెద్దలు ఇచ్చిన సూచన మేరకు నాడు నిమ్మగడ్డ ఉన్నట్లుండి కరోనా పేరుతో ఆ ఎన్నికలను అర్ధంతంగా వాయిదా వేశారు. – ఆ రోజు కరోనా కేసులు పదుల సంఖ్యలో కూడా లేవు. అలాంటి పరిస్థితిలో ఆ ఎన్నికలను ఆపేసిన నిమ్మగడ్డ.. ఈ రోజు కరోనా కేసులు వందల సంఖ్యలో వస్తున్నప్పటికీ, వ్యాక్సినేషన్ కొనసాగుతున్నప్పటికీ తిరిగి ఎన్నికలు అంటూ హడావుడి చేస్తున్నారు. ఏకకాలంలో ఇటు వ్యాక్సినేషన్, అటు ఎన్నికలు సాధ్యం కాదని తెలిసినా టీడీపీ అజెండా మేరకు ఎన్నికలు నిర్వహించి తీరాలన్న పట్టుదలతో ముందుకెళుతున్నారు. – అప్పట్లో ఏకగ్రీవం అయినవి కాకుండా రాష్ట్రంలో 7,331 ఎంపీటీసీ స్థానాలకు, 526 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది. 19 వేల మంది అభ్యర్థులు ఎంపీటీసీల బరిలో, 2,092 మంది అభ్యర్థులు జెడ్పీటీసీల బరిలో ఉన్నారు. – ఈ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులతో 652 మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులను, 13 జిల్లాల జెడ్పీ చైర్మన్లను ఎన్నుకోవాల్సి ఉంది. మరి ఈ ఎన్నికల ప్రక్రియను కొనసాగించకుండా, దీని ఊసే ఎత్తకుండా పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడం వెనుక టీడీపీ దురాలోచనే కారణమని స్పష్టమవుతోంది. ఈరోజు టీడీపీ ఉనికి కోసం ‘పంచాయతీ’ – పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలను వ్యూహాత్మకంగా ఉపయోగించుకుని ఉనికి కాపాడుకునేందుకు టీడీపీ పెద్దలు స్కెచ్ వేశారు. పార్టీ రహితంగా ఈ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి, ప్రతి గ్రామంలో గ్రూపు రాజకీయాలు మామూలే. – పంచాయతీ ఎన్నికల కారణంగా గ్రామాల్లో కక్షలు, గ్రూపులు వీలైనంతగా పెరగాలనేది టీడీపీ అజెండా. ఇందులో భాగంగానే ఏకగ్రీవ ఎన్నికలకు మోకాలడ్డేలా నిమ్మగడ్డ మాట్లాడటం చూశాం. వాస్తవానికి గ్రామాల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించాలి. అప్పుడే ప్రజలు వర్గాలు విడిపోకుండా ఉంటారు. సత్వర అభివృద్ధి సాధ్యమవుతుంది. – ఇందుకోసమే ప్రభుత్వాలు ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు నగదు ప్రోత్సాహకాలు ప్రకటిస్తాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా రూ.20 లక్షల వరకు ప్రోత్హాహకాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. – ఈ నేపథ్యంలో ఏకగ్రీవాలు కాకుండా చూసి, గ్రామాల్లో రెండు మూడు వర్గాలుగా ప్రజలు విడిపోయేలా చేసి టీడీపీకి లబ్ధి కలిగించే దిశగా నిమ్మగడ్డ అడుగులు వేస్తున్నారు. – ఓటమి చెందిన వర్గం వారికి, అసంతృప్తులకు డబ్బు ఎరవేసి.. రాత్రికి రాత్రి టీడీపీ క్యాంపులో చేర్చే ఆ పార్టీ వ్యూహానికి ఓ వైపు మద్దతు ఇస్తూ.. ఆ వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను కొనసాగించనున్నారని విశ్వసనీయంగా తెలిసింది. తద్వారా టీడీపీ ఉనికి చాటేలా ఊతమివ్వనున్నారని సమాచారం. అప్పుడు ఎందుకు మిన్నకున్నారంటే.. – రాష్ట్రంలో గ్రామ పంచాయతీ సర్పంచి, వార్డు సభ్యుల పదవీ కాలం 2018 ఆగస్టులోనే ముగిసింది. అదే ఏడాది అక్టోబర్లో హైదరాబాద్లో ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు జరపాలని స్పష్టంగా తీర్పు వెలువరించింది. ఆ సమయంలో కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డే ఉన్నారు. – అయితే అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల ముందు పంచాయతీ ఎన్నికల వల్ల తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూరుతుందని భావించారు. పంచాయతీ ఎన్నికలకు సిద్ధపడలేదు. అలాంటప్పుడు ఇప్పుడు మాదిరి నిమ్మగడ్డ నాడు చంద్రబాబు ప్రభుత్వంపై గవర్నర్కు ఫిర్యాదు చేయలేదు. ఎన్నికలకు టీడీపీ ప్రభుత్వం అడ్డుపడుతోందని ఎప్పుడూ కోర్టుకు వెళ్లలేదు. – ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పలుమార్లు లేఖలు రాసినా, స్వయంగా కలసి వివరించినా పట్టించుకోలేదు. కరోనా వాక్సినేషన్ ప్రక్రియ కళ్లెదుటే కనిపిస్తున్నా, తనకు ప్రభుత్వం సహకరించడం లేదంటూ అనేక దఫాలు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. హైకోర్టుకూ వెళ్లారు. దీన్నిబట్టి రాజ్యాంగబద్ద రాష్ట్ర కమిషనర్ హోదాలో ఉన్న నిమ్మగడ్డ తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారని స్పష్టమవుతోందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు తుంగలోకి.. – రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ పదవీ కాలం ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగియనుంది. దాంతో తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం ఏకంగా సుప్రీంకోర్టు తీర్పును ఆయన తుంగలోకి తొక్కారు. 2020 మార్చి 15న ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వాయిదా వేయగా.. దానిపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది. – కరోనా పరిస్థితులు మెరుగుపడిన తర్వాత.. ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆపేశారో అక్కడి నుంచే తిరిగి ప్రారంభించాలని, ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే కొత్త తేదీలను ఖరారు చేయాలని ఈ కేసులో తీర్పు వెలువరించింది. – ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే మొదలు పెట్టాలంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ముందుగా పూర్తి చేయాల్సి ఉంటుంది. వాటిని నిర్వహించకుండా కొత్తగా గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు నిమ్మగడ్డ నోటిఫికేషన్ ఇచ్చారు. – ఎన్నికలు జరిపే అనుకూల పరిస్థితులు లేవని ప్రభుత్వం స్పష్టంగా నివేదికలు అందజేసినా, ఏకపక్షంగా పంచాయతీ ఎన్నికల తేదీలను ప్రకటించారు. గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల గ్రామంలో ఎంపీటీసీ స్థానం ఎన్నికకు 2020 మార్చి 9వ తేదీన రిటర్నింగ్ అధికారి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. నామినేషన్ల ప్రక్రియ ముగిశాక ముగ్గురు అభ్యర్థులు పోటీలో నిలిచారు. అంతలో అర్ధంతరంగా ఆ ఎన్నికలు నిలిపివేశారు. ఇప్పుడు ఆ ఎన్నికలను తొలుత పూర్తి చేయకుండానే.. ఆ గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు పెడుతున్నారు. ఇవేం ఎన్నికలు.. ఎవరి కోసం ఈ రాజకీయం అంటూ ఆ గ్రామ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. నిమ్మగడ్డ నిర్వాకం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. -
నిమ్మగడ్డ ఏకపక్ష ధోరణి సరికాదు: సామినేని
సాక్షి, కృష్ణా జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ ఏకపక్ష ధోరణి సరికాదని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను హితవు పలికారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్న సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వటం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని ఆయన దుయ్యబట్టారు. చదవండి: ‘2018లో చంద్రబాబే పారిపోయారు’ రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. కరోనా ప్రారంభ దశలో ఎన్నికలు నిలిపివేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్.. కరోనా విలయ తాండవం చేస్తున్న పరిస్థితుల్లో ఎందుకు ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారో చెప్పాలన్నారు. ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వంతో చర్చించాలని, ప్రభుత్వ ఉద్యోగుల అభ్యర్థన పరిగణనలోకి తీసుకుని ఎన్నికలపై పునరాలోచించాలని సామినేని ఉదయభాను కోరారు. చదవండి: పెన్నాపై మరో కొత్త బ్రిడ్జి: మంత్రి అనిల్) -
‘2018లో చంద్రబాబే పారిపోయారు’
సాక్షి, తిరుమల: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ తీరును ప్రజలు గమనిస్తున్నారని ఏపీఐఐసీ ఛైర్ పర్సన్, ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఆదివారం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం పరిస్థితుల్లో ఎన్నికలు జరపడం సబబు కాదని.. ఎస్ఈసీ నిర్ణయాన్ని ఆమె తప్పుపట్టారు. వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి కాకముందే ఉద్యోగులు, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు జరపాల్సిన అసవరం ఏమిటని ప్రశ్నించారు. చదవండి: పెన్నాపై మరో కొత్త బ్రిడ్జి: మంత్రి అనిల్ ‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏనాడు ఎన్నికలకు భయపడ లేదు. అది ప్రజలకి తెలుసు. 2018లో చంద్రబాబే ఎన్నికలకు భయపడి పారిపోయారు. కోవిడ్ సమయంలో చంద్రబాబు ఎటువంటి సహకారం, సాయం అందించలేదని’’ రోజా మండిపడ్డారు సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సానుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నామని.. ఎన్నికలు జరపాలని న్యాయస్థానం ఆదేశిస్తే.. ధర్మాసనాన్ని గౌరవించి ఎన్నికలు జరుపుతామన్నారు. ప్రజల శ్రేయస్సు కోసమే ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతున్నామన్నారు. ఎన్నికలకు వైఎస్సార్సీపీ ఎప్పుడైనా సిద్ధమేనని.. తమ సంక్షేమ పథకాలే శ్రీరామ రక్షా అని తెలిపారు. చదవండి: నిమ్మగడ్డను బెదిరించాల్సిన అవసరం నాకు లేదు -
ప్రజల ప్రాణాలతో ఈసీ చెలగాటం సరికాదు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): రాష్ట్రంలో మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న తరుణంలో ఎన్నికలు నిర్వహించి తన పంతం నెగ్గించుకోవాలని చూస్తున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ వైఖరి సరికాదని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. కోవిడ్ వ్యాక్సినేషన్ సాగుతున్న సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం ప్రజల ప్రాణాలతో చెలగాటమేనన్నారు. తమ్మినేని శనివారం శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు. నిమ్మగడ్డ ప్రెస్మీట్ పొలిటికల్ ప్రెస్మీట్లా ఉందని, బాధ్యత గల అధికారి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. కరోనాకు ముందు స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యి, ఏకగ్రీవాలు కూడా అయ్యాక ఎన్నికలు నిలిపేసిన ఎన్నికల కమిషనర్.. ఇప్పుడు కరోనా విలయ తాండవం చేస్తున్న పరిస్థితుల్లో ఎందుకు ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ఎన్నికలు వద్దని ప్రజలు, ఉద్యోగులు తిరగబడితే మీ పరిస్థితి ఏమవుతుందో గుర్తెరగాలని హితవు పలికారు. నియంతృత్వ పోకడలకు విరుగుడు ప్రజాభిప్రాయ సేకరణ ఒక్కటేనన్నారు. ఎన్నికలపై ఈసీ పునరాలోచన చేయాలని ఆయన సూచించారు. -
పచ్చని పల్లెల్లో చిచ్చు రేపుతారా?
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటి దాకా ఉన్న సంప్రదాయాలకు భిన్నంగా ఏకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనరే గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలు ప్రోత్సహించేలా మరో వివాదాస్పద నిర్ణయాన్ని ప్రకటించారు. పంచాయతీ ఎన్నికలంటే స్థానికంగా ఉండే కక్షల చుట్టూ తిరుగుతాయనే విషయం తెలిసిందే. రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా జరిగే ఈ ఎన్నికల కారణంగా గ్రామాలలో కక్షలు, కార్పణ్యాలు పెరగ కూడదని ఏకగ్రీవాలయ్యే పంచాయతీలకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో నగదు పోత్సాహకాలను ప్రకటించడం కొన్ని దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. దానికి భిన్నంగా ఈసారి ఎన్నికల్లో గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు ఏకగ్రీవంగా ముగియడాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ తప్పుపట్టారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఓ పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవం కావడమంటేనే అక్రమాలు చోటు చేసుకున్నట్లని ఆయన అభివర్ణించారు. ఏకగ్రీవం అయ్యే వాటిపై తాను ప్రత్యేక దృష్టి సారిస్తానని, ఒక ఐజీ స్థాయిలో ఉండే అధికారి సహకారంతో ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని ధృడ సంకల్పంతో ఉన్నట్టు ఆయన ప్రకటించడం వివాదాస్పదమైంది. వాస్తవాలకు తిలోదకాలు ► ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాల వల్ల ఆయా గ్రామాల్లో ప్రజలు ఎన్నిక ఏకగ్రీవం చేసుకోవడం దిశగా మొగ్గు చూపితే, చిన్న చిన్న తగాదాలు ప్రాణాల మీదకు రావడం తగ్గుతుంది. ► పలు గ్రామాల్లో ఎన్నికల బరిలోకి దిగడానికి చాలా మంది ఇష్టపడరు. డబ్బు ఖర్చు కావడంతో పాటు, మనస్పర్థలు వస్తాయనే భయంతో రాజకీయాలకు దూరంగా ఉంటారు. ఇలాంటి చోట్ల ఆ గ్రామ పెద్దలందరూ ఒక చోట కూర్చొని.. ఎవరు సర్పంచ్ అయితే బావుంటుందో ఒక నిర్ణయానికి వస్తారు. తద్వారా ప్రభుత్వం వల్ల ఆ గ్రామానికి అదనంగా వచ్చే ప్రోత్సాహక మొత్తం ఎన్నో పనులకు ఉపయోగపడుతుంది. ► ఏకగ్రీవాలకు అవకాశం లేకుండా చేస్తే చిన్న చిన్న గ్రామాల్లో ప్రజలు గ్రూపులుగా విడిపోతారు. అప్పటివరకు కలిసిమెలిసి ఉన్న వారు సైతం ఎడమొహం, పెడమొహంతో వ్యవహరిస్తారు. ఎదురుపడినా పలకరించుకోరు. ఎన్నికలు ముగిశాక కూడా ఇదే వాతావరణం ఉంటుంది. దాంతో చిన్న పాటి విషయాలు గొడవలుగా మారే ప్రమాదం ఉంది. ► ప్రజలు పోటీకి ఇష్టపడని చోట బలవంతంగా పోటీ చేయిస్తే, ఎన్నికల వేళ మాటా మాటా పెరిగి ఘర్షణలు చోటుచేసుకుంటే అందుకు బాధ్యులు ఎవరు? ► ఈ రోజుల్లో ప్రజలకు రాజకీయ అవగాహన బాగా పెరిగింది. ఎవరినైనా బలవంతంగా పోటీ నుంచి తప్పిస్తే న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమకు జరిగిన అన్యాయం గురించి పది మందికీ తెలిసేలా చేస్తున్నారు. ఈ వాస్తవాన్ని ఎన్నికల కమిషనర్ విస్మరించి, ఏకగ్రీవాలను తప్పు పడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. గొడవలకు తావు లేకుండా ఏకగ్రీవమైన పంచాయతీకి రూ.20 లక్షల దాకా ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2020 మార్చి 12న ఉత్తర్వులు జారీ చేసింది. 2 వేల జనాభా లోపు ఉండే గ్రామాల్లో ఎన్నిక ఏకగ్రీవం అయితే రూ.5 లక్షలు.. రెండు వేల నుంచి ఐదు వేల మధ్య జనాభా ఉండే గ్రామాల్లో ఎన్నిక ఏకగ్రీవమైతే రూ.10 లక్షలు.. ఐదు వేల నుంచి పది వేల మధ్య జనాభా ఉండే గ్రామాల్లో ఏకగ్రీవమైతే రూ.15 లక్షలు.. పది వేల జనాభా పైన ఉండే గ్రామాల్లో ఏకగ్రీవాలైతే రూ.20 లక్షలు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని 2020 మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే సమయంలో నిమ్మగడ్డ రమేష్కుమార్ అభినందించారు. ఇప్పుడు అందుకు భిన్నంగా మాట్లాడటం చూస్తుంటే రాజకీయ దురుద్దేశం కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ఓటర్లు, ఉద్యోగులవి ప్రాణాలు కావా?
సాక్షి, అమరావతి: ‘కరోనా తగ్గిపోయింది.. ఎన్నికలు నిర్వహించాల్సిందే’ అని పట్టు పట్టిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్.. శనివారం విలేకరుల సమావేశం నిర్వహించడానికి తీసుకున్న జాగ్రత్తలు చూస్తుంటే నవ్వు తెప్పించింది. 20–30 మంది మీడియా ప్రతినిధులుండే సమావేశంలో అర గంట పాటు మాట్లాడటానికి ఆయన తన చుట్టూ పెద్ద సైజు అద్దం (గ్లాస్) అడ్డం పెట్టుకున్నారు. ఆయన కూర్చునే కుర్చీ దగ్గరకు ఇతరులెవరూ రాకుండా బారికేడ్ల తరహాలో తాడు కట్టించారు. ఆయన కుర్చీలో కూర్చోవడానికి ముందే ఎదురుగా బల్లపై మీడియా ప్రతినిధులు ఉంచిన మైకులకు తన సిబ్బంది ద్వారా 3 సార్లు శానిటైజర్ స్ప్రే చేయించారు. నోటిఫికేషన్ విడుదల చేసే కొద్ది సేపు కేవలం కొద్ది మంది వ్యక్తులకు దగ్గరగా ఉండడానికి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న నిమ్మగడ్డ రమేష్కుమార్.. కరోనా అంటే కొద్దొ గొప్పో అవగాహన మాత్రమే ఉండే గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య, పేద ప్రజల గురించి ఎందుకు ఆలోచించడం లేదు? వ్యాక్సికేషన్ సమయంలో ఎన్నికలు వద్దని ప్రభుత్వం చెబుతున్నా, పట్టించుకోకుండా పంతం పట్టి, ఎన్నికలు జరిపి తీరాల్సిందేనని నోటిఫికేషన్ను కూడా విడుదల చేశారు. రాష్ట్రంలో పరిస్థితిని, అన్ని విషయాలను వివరిస్తూ స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏడు విడతలుగా లేఖలు రాసినా పట్టించుకోకుండా, వెనుక ఎవరో తరుముతున్నట్లు ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపారు. ఎన్నికలంటే 15 రోజులు గ్రామాల్లో గుంపులే ► పంచాయతీ ఎన్నికలంటే గ్రామాల్లో 10–15 రోజులు గుంపులు గుంపులతో హడావుడిగా ఉంటుంది. ► పంచాయతీ ఎన్నికలంటే గ్రామాల్లో పట్టుదలలు, పంతాల మధ్యనే సాగుతాయి. ఉండే మొత్తం మూడు నాలుగు వేల ఓట్లలో ప్రతి ఓటు కీలకమే అన్నట్టు అభ్యర్థులు పోటీ పడతారు. ► అసెంబ్లీ, మున్సిపల్ ఎన్నికల కంటే కూడా పంచాయతీ ఎన్నికలలో ఇంటింటి ప్రచారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఊళ్లో ఓటరుగా ఉండే వాళ్లు ఎంత దూరంలో ఉన్నా, పోలింగ్ రోజుకు సొంతూరికి పిలిపిస్తారు. వేరే ఊళ్ల నుంచి రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కరోనా వైరస్ వ్యాప్తికి కారణమవుతాయని వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. ► పోలింగ్ రోజున నలుగురైదుగురు సిబ్బంది చేతులు మారే బ్యాలెట్ పేపర్ను గ్రామీణ ఓటరు ముట్టుకోవాల్సి రావడం కూడా కరోనా వ్యాప్తికి అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. 2.60 కోట్ల మంది ఓటర్లు.. 2 లక్షల మంది సిబ్బంది ► ఇటీవలే స్థానిక ఎన్నికలు జరిగిన కేరళలో కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరిగినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. మన రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో ఉండే మొత్తం 2.60 కోట్ల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొనాల్సి ఉంటుంది. దీనికి తోడు రెండు లక్షల మందికి పైనే ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ► 13,371 గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచ్ పదవులకు, 1.34 లక్షల వార్డు మెంబర్ పదవులకు ఎన్నికలు జరుగుతాయి. ఒక్కో వార్డుకు వేర్వేరుగా పోలింగ్ బూత్ ఏర్పాటు చేసి ఎన్నికలు జరపాలి. ఒక్కో బూత్కు ప్రత్యక్షంగా పరోక్షంగా కనీసం ఐదుగురు సిబ్బంది పాల్గొనాల్సి ఉంటుంది. ► ఈ లెక్కన రెండు లక్షల మందికి పైగా సిబ్బంది నాలుగు విడతల ఎన్నికల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో కేరళ తరహాలో పరిస్థితి మన రాష్ట్రంలో పునరావృతమైతే.. పరిస్థితి ఏమిటని ఉద్యోగులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్కమ్లో మాటామంతి కరోనా వల్ల నిమ్మగడ్డ రమేష్కుమార్ ఆఫీసులోనూ ఎవరికీ అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదు. ఎవరినీ కలవడం లేదని ఆఫీసు సిబ్బంది చెప్పారు. ఎన్నికల నిర్వహణపై వినతులు ఇచ్చేందుకు ఎవరైనా నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వస్తే.. ఆయన తన పీఎస్ గదిలో ఉండే ఇంటర్కమ్ ద్వారానే వారితో మాట్లాడి పంపుతున్నారు. ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కలవడానికి వచ్చిన బీజేపీ నేతల బృందానికి ఇదే రీతిలో అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. -
ఎన్ని అవరోధాలు వచ్చినా ఇప్పుడే ఎన్నికలు
సాక్షి, అమరావతి: ఎన్ని అవరోధాలు వచ్చినా ఇప్పుడే ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. ఈ నెల 8వ తేదీన విడుదల చేసిన షెడ్యూల్ మేరకు నాలుగు విడతల్లో జరిగే ఎన్నికలకు శనివారం ఒకేసారి నోటిఫికేషన్ (వాస్తవానికి వేర్వేరు నోటిఫికేషన్లు ఇవ్వాలి) జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘నేనైతే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తున్నా.. ఇక ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత అంతా ప్రభుత్వానిదే’ అని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల ప్రక్రియకు ఎటువంటి అవరోధాలు, ఆటంకాలు ఎదురైతే దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం, యంత్రాంగానిదేనని చెప్పారు. ఈ విషయాన్ని గవర్నర్కు నివేదించక తప్పదని, ఒకవేళ ఉద్దేశ పూర్వకంగా ఎన్నికలు జరగకుండా అడ్డుకుంటే.. దానికి ప్రభుత్వ వ్యవస్థే పూర్తిగా మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎన్నికలు నిర్వహించడం పెను సవాలే అయినప్పటికీ, ఏ అడ్డంకులు తమను ప్రభావితం చేయబోవన్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ ఇంకా ఏం చెప్పారంటే.. ప్రభుత్వ వినతిని తిరస్కరించా ► సోమవారం సుప్రీంకోర్టులో కేసు విచారణకు వస్తుందని, అందువల్ల ఎన్నికల ప్రక్రియ వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కోరగా, అది సహేతుకంగా లేదని తిరస్కరించాను. సుప్రీంకోర్టు తుది నిర్ణయం ఏదైనా వస్తే దానిని తప్పనిసరిగా పాటిస్తాం. ► జిల్లా కలెక్టర్లందరితో రాష్ట్ర ఎన్నికల సంఘం సంప్రదింపులు జరిపింది. ఎన్నికల ఏర్పాట్లన్నీ సంతృప్తిగా ఉన్నాయనే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు ఎన్నికలు చేపట్టాం. ప్రభుత్వ పరంగా తోడ్పాటులో కమిషన్కు మిశ్రమ అనుభవాలున్నాయి. ఎన్నికలపై భిన్న వాదనలు ఉన్న మాట వాస్తవం ఎన్నికల మీద భిన్న స్వరాలు వినిపిస్తున్నాయన్న మాట వాస్తవం. కాకపోతే వీటి ప్రభావం ఎన్నికల నిర్వహణ మీద, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మీద ఉండవని కమిషన్ బలంగా విశ్వసిస్తోంది. ఎన్నికల్లో హింస, పోటీ చేయడంలో అవరోధాలు కల్పించినట్లయితే.. కమిషన్, పోలీసు శాఖ తీవ్రంగా స్పందిస్తాయి. ఏకగ్రీవ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెడతాం ఎన్నికల్లో అక్రమాలు.. ఏకగ్రీవ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టబోతున్నాం. ఐజీ స్థాయి అధికారి సహకారంతో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తాం. ఇలాంటి అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని ధృడ సంకల్పంతో ఉన్నాం. నిధులు, సిబ్బంది కొరత.. ► ఎన్నికల నిర్వహణలో నిధుల సమస్య ఉంది. మాకు సిబ్బంది కొరత కూడా ఉంది. వీటన్నింటినీ పరిష్కరిస్తారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం పరిష్కరించకపోతే కోర్టు దృష్టికి తీసుకెళ్లాం. కోర్టు ఆదేశాల మేరకు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ► ఈ హామీ అమలు విషయంలో ఆశించినంతగా ఫలితాలు లేవు. ఈ విషయాన్ని నేను రెండు మూడు విడతలుగా గవర్నర్ దృష్టికి స్వయంగా తీసుకెళ్లాను. మాకు సెక్రటరీ లేరు. జాయింట్ సెక్రటరీ లేరు. జాయింట్ డైరెక్టర్ లేరు. న్యాయ సలహాదారులు లేరు. ఉన్నవాళ్లు కొద్ది మందే. అయినప్పటికీ ఏ అడ్డంకులు మా పనితీరును ప్రభావితం చేయలేవు. ఉద్యోగ సంఘాల వాదన సరికాదు ► ఎన్నికల నిర్వహణపై కొన్ని ఉద్యోగ సంఘాలు కొన్ని భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎన్నికలు వద్దని కొంత మంది కోరుకోవడం సరికాదు. ► సోమవారం సుప్రీంకోర్టులో కేసు విచారణకు వస్తున్న నేపథ్యంలో.. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఆటంకాలు కల్పించాలని చూస్తోందని నివేదించాల్సి వస్తుందనుకోవడం లేదు. అవసరం వస్తే సుప్రీంకోర్టుకు కూడా నివేదించాల్సి వస్తుంది. తప్పదు. ఉన్న పరిస్థితులను నేను దాచలేను. సమస్యలొస్తే గవర్నర్, న్యాయ వ్యవస్థ దృష్టికి తీసుకెళ్తా ► ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఎలాంటి సమస్య వచ్చినా ఎప్పటికప్పుడు గవర్నర్ దృష్టికి తీసుకెళతా. అవసరమైతే న్యాయ వ్యవస్థ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా సవాళ్లను అధిగమిస్తాం. ► నాకు న్యాయ వ్యవస్థ, గవర్నర్ వద్ద నుంచి పూర్తి తోడ్పాటు లభిస్తుందనే భావనతో ఎన్నికల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అనుకుంటున్నా. జిల్లా కలెక్టర్లందరి వద్ద నుంచి కూడా పూర్తి సహకారం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంటుంది. 3.60 లక్షల మంది ఓటు హక్కు కోల్పోతున్నారు.. ఎన్నికలు జరిపే ముందు ఏ ఎన్నికల రోల్ ప్రకారం ముందుకు పోవాలన్న దానిపై స్పష్టత అవసరం. ఈ స్పష్టత ఇవ్వడంలో పంచాయతీ రాజ్ కమిషనర్, ముఖ్య కార్యదర్శి పూర్తిగా విఫలమవ్వడం చాలా బాధాకరం. 2021 ఓటర్ల జాబితా ఆధారంగా ఈ ఎన్నికలు జరుపుతామని చెప్పాం. విధిలేని పరిస్థితులలో కమిషన్ 2019 ఓటర్ల జాబితా ప్రాతిపదిక మీదనే ఎన్నికలు నిర్వహిస్తోంది. తద్వారా 18 ఏళ్లు నిండి, ఓటు హక్కు పొందిన 3.6 లక్షల మంది యువత ఓటు హక్కు కోల్పోతోంది. పంచాయతీరాజ్ శాఖ అలసత్వం వల్ల కానీ, బాధ్యతా రాహిత్యంగా పని చేయడం వల్ల ఈ విపత్కర పరిస్థితి వచ్చింది. దీనిని కమిషన్ చాలా తీవ్ర విషయంగా పరిగణిస్తోంది. సంబంధిత అధికారులందరిపై సరైన సమయంలో సరైన చర్యలు ఉంటాయి. ఈ ప్రశ్నలకు బదులేదీ? విలేకరుల సమావేశంలో మీడియా అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు నిమ్మగడ్డ నిరాకరించారు. ‘ఇక్కడ డిస్ట్రబెన్స్ చెయ్యొద్దు..’ అని సమావేశం ముగించే ప్రయత్నం చేశారు. మీరు ఒక పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారంటున్నారు.. దీనికి మీరు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారా? అని ప్రశ్నిస్తున్నా జవాబు చెప్పకుండా వెళ్లిపోయారు. -
తారస్థాయికి పంచాయితీ
సాక్షి, అమరావతి: ‘ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపి కట్టెది మరోదారి’ అనే పాత సామెతను గుర్తుకు తెస్తున్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. కరోనా వ్యాక్సినేషన్ వేళ ఎన్నికల పంచాయితీ ఏమిటని అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగులు వాస్తవ పరిస్థితులు విడమరచి చెబుతున్నా, తన రూటే సపరేటు అంటూ మొండిగా, ఏకపక్షంగా ఎవరికో లబ్ధి చేకూర్చేలా ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం వ్యాక్సినేషన్ ప్రక్రియలో నిమగ్నమైందని, ఫ్రంట్ లైన్ సిబ్బందికి టీకాలు ఇచ్చాక ఎన్నికల గురించి ఆలోచిద్దామని ఎంతగా చెప్పినా వినిపించుకోకుండా ముందుకెళ్తుండటం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. శనివారం ఆయన వ్యవహార శైలి, హడావుడి ఏమాత్రం ప్రజామోదం పొందలేదనేది సుస్పష్టమైంది. వాస్తవానికి రాష్ట్రంలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం పూర్తయ్యాక నిరభ్యంతరంగా ఎన్నికలు నిర్వహించవచ్చని స్పష్టం చేస్తోంది. సుప్రీంకోర్టులో ఉన్న ఈ వివాదం సోమవారం విచారణకు వచ్చే వీలుంది. ఇంతలోనే నిమ్మగడ్డ నోటిఫికేషన్ ఇవ్వడం అనేక అనుమానాలకు తావిస్తోంది. చంద్రబాబు హయాంలో నిర్వహించాల్సిన ఈ ఎన్నికలు మూడేళ్లు ఎందుకు వాయిదా వేశారు? ఎవరి లబ్ధి కోసం? అన్న విమర్శలకు నిమ్మగడ్డ వైఖరి దారి తీసింది. కీలకమైన సమయంలో ఎందుకీ హడావిడి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టింది. ఉద్యోగులంతా ఈ పనిలోనే నిమగ్నమై ఉన్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే ఉత్సవాలకు సన్నాహాలు చేస్తున్నారు. కరోనా సమయం కావడంతో మరింత అప్రమత్తంగా ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇవేవీ పట్టనట్టుగా నిమ్మగడ్డ నోటిఫికేషన్ ఇచ్చేసి, ఉద్యోగులను విధుల్లో చేరమన్నట్టు ఆదేశించే ప్రయత్నం చేశారు. తాము ఎన్నికల విధులు నిర్వహించలేమన్న ఉద్యోగ సంఘాలను ఆయన హెచ్చరించేందుకూ వెనకాడలేదు. ఇంత చేసినా ఉద్యోగులు మాత్రం ప్రాణాలను పణంగా పెట్టలేమని తేల్చి చెప్పారు. ప్రజలతో మమేకమయ్యే ఉద్యోగులు ప్రజల నాడి తెలియకుండా ఈ స్థాయిలో నిర్ణయం తీసుకోరనేది స్పష్టం. కలెక్టర్లపైనా కన్నెర్ర ఉదయం నోటిఫికేషన్ ఇస్తూనే మధ్యాహ్నం కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ షెడ్యూల్ను నిమ్మగడ్డ ఖరారు చేశారు. అందరూ హాజరు కావాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ను వాయిదా వేయాలని సీఎస్ కోరినా పట్టించుకోలేదు. అయితే, ఆ వీడియో కాన్ఫరెన్స్కు ఎవరూ హాజరు కాకపోవడాన్ని బట్టి కలెక్టర్లు, ఎస్పీలూ ఇప్పట్లో ఎన్నికలు సరికాదనే సందేశాన్ని ఎన్నికల కమిషన్కు చెప్పినట్టయింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన కలెక్టర్లు, ఎస్పీలు సైతం నిమ్మగడ్డ నిర్ణయం సరికాదని చెబుతున్నారంటే.. దీన్నిబట్టి అయినా ఆయన తీరు ప్రజలు మెచ్చడం లేదని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ మొత్తం వ్యవహారాన్ని సాయంత్రం గవర్నర్కు నివేదిస్తానని చెప్పిన నిమ్మగడ్డ మారు మాట్లాడకుండా హైదరాబాద్కు వెళ్లడం విశేషం. గవర్నర్ అపాయింట్మెంట్ దొరక్కనే కాబోలు హైదరాబాద్కు వెళ్లిపోయారనే వ్యాఖ్యలు వినిపించాయి. ఎన్నికల విధుల్లో కీలకమైన వ్యక్తుల నుంచి వ్యతిరేకతను చూసైనా, ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఎన్నికలు కోరుకోవడం లేదని గుర్తించాలని మేధావి వర్గం చెబుతోంది. కమిషనరా? రాజకీయ నాయకుడా? రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డ.. ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తున్న సమయంలో మీడియా ముందు మాట్లాడిన ప్రతి మాటలో రాజకీయ కోణం కన్పించింది. ఎన్నికలపై భిన్న స్వరాలు విన్పిస్తున్నాయని, ఉద్యోగులు విధులు నిర్వర్తించేందుకు సుముఖంగా లేరని ఆయన నోటితోనే ఒప్పుకున్నారు. కరోనా భయం వెంటాడుతోందని ఉద్యోగులు చెబుతుంటే.. నిమ్మగడ్డ మాత్రం ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నట్టు మాట్లాడారు. ఏకగ్రీవ ఎన్నికలను తప్పుబట్టడం, దీనిపై ఐజీ స్థాయి అధికారితో పర్యవేక్షణ ఉంటుందని చెప్పడం రాజకీయ నేత మాటల్లా అన్పిస్తోంది. పంచాయతీరాజ్ వ్యవస్థ తీరు మెరుగు పర్చుకోవాలని ఆయనే నిర్ధారించేశారు. దాదాపు 3 లక్షల మందికి పైగా కొత్త ఓటర్లు ఆ హక్కును వినియోగించుకోలేక పోవడాన్ని ప్రస్తావిస్తూ.. దానికీ అధికారులను బాధ్యులను చేస్తానన్నారు. ఈ వ్యాఖ్యలన్నీ ఎవరిమీదో కక్షగట్టినట్టు ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు హయాంలో ఎన్నికలు పెట్టలేదని ఒప్పుకున్న నిమ్మగడ్డ.. అందుకు కారణాలు చెప్పకుండానే.. ఇప్పుడు ఎన్నికలు పెట్టడం రాజ్యాంగ విధి అంటూ విరుద్ధంగా మాట్లాడారు. తాను కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ.. టీడీపీ ఆఫీసు నుంచే ఎలా లీకయిందనే విమర్శలకు బదులివ్వ లేదు. తనకు సీఎస్ రాసిన లేఖ మీడియాకు ఎలా వెళ్లిందని మాత్రం ప్రశ్నించారు. ఇవన్నీ ఒక రాజకీయ పార్టీ కార్యాలయం రాసిచ్చిన స్క్రిప్టుగా ఉందే తప్ప, బాధ్యతగల ఎన్నికల కమిషన్ స్థాయిని తలపించడం లేదనే రాజకీయ విమర్శలొస్తున్నాయి. -
ఎస్ఈసీ మరోసారి ఆలోచించాలి: పోలీసులు
సాక్షి, విజయవాడ: కరోనా నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని.. తమ ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ మరోసారి ఆలోచించాలని ఏపీ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జనుకుల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. పోలీసు శాఖలో కరోనాతో 109 మంది ప్రాణాలు కోల్పోయారని.. పోలీసు శాఖలో 14 వేల మంది కరోనా బారిన పడ్డారన్నారు. ఎన్నికల్లో పోలీసులు ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల ద్వారా వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందని.. పోలీసు శాఖలో ముందుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగాలన్నారు. వ్యాక్సినేషన్.. బందోబస్తు ఒకేసారి చేయాలంటే ఇబ్బందికరమని తెలిపారు. చదవండి: ఓ రాజకీయ నేతలా నిమ్మగడ్డ.. ‘‘ఎస్ఈసీకి చేతులెత్తి వేడుకుంటున్నాం. ఎన్నికలు అవసరమే కానీ.. కొంతకాలం వాయిదా వేస్తే బాగుంటుంది. కరోనా నేపథ్యంలో నిరంతరం ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాం. మనం ప్రాణాలతో ఉంటేనే కదా.. ఏదైనా చేయగలుగుతాం. తమ ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని ఎస్ఈసీ మరోసారి ఆలోచించాలి. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యాకే ఎన్నికలు నిర్వహించాలని పోలీసులు ఎస్ఈసీని కోరారు. చదవండి: ఎందుకంత నియంతృత్వ పోకడ: స్పీకర్ తమ్మినేని -
ఓ రాజకీయ నేతలా నిమ్మగడ్డ..
సాక్షి, నెల్లూరు: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్కు అధికారం తప్ప.. బాధ్యతల గురించి పట్టించుకోవడం లేదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శనివారం ఆయన నెల్లూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎస్ఈసీకీ అధికారంతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయని.. అధికారాన్ని, బాధ్యతలను సమన్వయం చేసుకోవాలని ఆయన హితవు పలికారు. ఫ్రంట్లైన్ వారియర్స్కు వ్యాక్సిన్ తప్పనిసరని ప్రధాని చెప్పారు. ప్రజారోగ్యం ప్రభుత్వానికి ప్రధాన బాధ్యత అని తెలిపారు. ఓ రాజకీయ నేతలా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని.. వ్యక్తిగత అవసరాల కోసమే ఆయన పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల ప్రాణాలే ముఖ్యమని ప్రభుత్వం చెబితే పట్టించుకోవడం లేదు.. రేపు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిదని మంత్రి బొత్స ప్రశ్నించారు.(చదవండి: ఎందుకంత నియంతృత్వ పోకడ: స్పీకర్ తమ్మినేని ఎవరి మెప్పు కోసం..? ‘‘గతంలో గోపాల కృష్ణ ద్వివేది ఎంత పకడ్బందిగా ఎన్నికలు నిర్వహించారో మీకు తెలుసు. నిమ్మగడ్డ రమేష్ వ్యక్తిగత స్వార్థం, పరిచయాల కోసం రాజ్యాంగాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఎవరి కోసం ఈ ఎన్నికలు. గతంలో మేము ఎన్నికలు నిర్వహించమంటే ఎందుకు పెట్టలేదు. చంద్రబాబు మీ స్నేహితుడని, సామాజిక వర్గమని ఎన్నికలు పెట్టలేదా.. ఇప్పుడు ఈ ఎన్నికలు మీకు పదవిచ్చిన చంద్రబాబు మెప్పు పొందడానికా..? చంద్రబాబుతో నిమ్మగడ్డ రమేష్ లాలూచి పడ్డారు. ఎన్నికలు మూడు నెలల వాయిదా వేయడం వల్ల ఏలాంటి నష్టం లేదు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పని చేయడం ఎంత వరకు కరెక్టు. రాజ్యంగ వ్యవస్థలో నిమ్మగడ్డ వంటి వ్యక్తులు ఉండటం చాలా దురదృష్టం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాతే ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది. రాష్ట్రంలో ప్రతి విషయానికి చంద్రబాబు అల్లకల్లోలం సృష్టిస్తున్నారని’’ మంత్రి బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. -
ఎందుకంత నియంతృత్వ పోకడ: స్పీకర్ తమ్మినేని
సాక్షి, శ్రీకాకుళం: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ ప్రెస్ మీట్ కేవలం పొలిటికల్ సమావేశంలా ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2018లో జరగాల్సిన స్థానిక ఎన్నికలు.. 2021లో జరగడానికి కారకులు ఎవరని ప్రశ్నిస్తూ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ‘‘రాష్ట్రంలో మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న తరుణంలో ఎవరి ప్రాపకం, రాజకీయ లబ్ధి కోసం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మీరు చుట్టూ అద్దాలు బిగించుకుని ప్రెస్ మీట్ పెట్టారు. రేపు ఎన్నికల పోలింగ్ కోసం ఇతర ప్రాంతాల నుండి వలస కార్మికులు వస్తారు. గతంలో వలస కార్మికుల ద్వారా కరోనా వ్యాపించిన సందర్భం ఉంది. కరోనా సెకండ్ వేవ్ మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇటువంటి తరుణంలో ఎన్నికల నిర్వహిస్తే కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పొతే ఎవరు బాధ్యత తీసుకుంటారు. మీరు ఫాల్స్ ప్రెస్టేజ్కు పోతున్నారు. మీరు కుర్చీలో ఉండగా ఎన్నికలు జరపాలా.. మరొకరు జరపకూడదా.. ఎందుకంత నియంతృత్వ పోకడ’’ అంటూ తమ్మినేని సీతారాం నిప్పులు చెరిగారు. ప్రంట్ లైన్ వారియర్స్ రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీపై లేదా.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసి బెదిరింపు ధోరణిలో వెళ్లడం సబబేనా.. ఒక రాజ్యాంగ వ్యవస్థ అధిపతిగా ఉండి నిబంధనలను అతిక్రమిస్తున్నారు. సీఎస్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా న్యాయస్థానం తీర్పును మీరు ఉల్లంఘించలేదా అంటూ స్పీకర్ ప్రశ్నలు గుప్పించారు. చదవండి: నిమ్మగడ్డ.. ఎందుకంత మొండి వైఖరి.. ‘‘రాజ్యాంగంలో పొందు పరచిన ఫోర్స్ మెజర్ కేసు క్రింద పరిగణించి ఎన్నికలను ఆపాల్సిన అవసరం ఉంది. ఎన్జీవోలు ఎన్నికల విధులు బహిష్కరించారు. రేపో మాపో పోలీసులు కూడా ఎన్నికలను బహిష్కరిస్తారు. అప్పుడు ఎవరు ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికలు వద్దని ఉద్యోగులు, ప్రజలు తిరగబడితే మీ పరిస్థితి ఏంటి. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ఉంది. దాన్ని కాలరాస్తూ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న మీకు రైట్ టూ లివ్ ఆర్టికల్ మీకు తెలియదా..?. కొద్ది మంది వ్యక్తుల ప్రయోజనాల కోసం మీరు తీసుకున్న నిర్ణయం ప్రజల ధన, మాన, ప్రాణాలకు భంగం వాటిల్లుతుంది. దీనిపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. న్యాయస్థానం ఏం చెబుతుందో వేచి చూడాలి. దీనిపై ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అవసరం అయితే దీనిపై ప్రజల్లోకి రెఫరెండం(ఎన్నికల నిర్వహణ పై ప్రజాభిప్రాయ సేకరణ )కు వెళ్లాలని’’ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. చదవండి: మూడేళ్లు నిద్రపోయి.. ఇప్పుడెందుకు తొందర..! -
నిమ్మగడ్డ.. ఎందుకంత మొండి వైఖరి..
సాక్షి, విజయవాడ: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ మొండిగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘ఉద్యోగులు, ప్రజల ప్రాణానికో న్యాయం.. మీ ప్రాణానికి మరొక న్యాయమా?. ఉద్యోగులంతా ఫ్రంట్లైన్ వారియర్స్ అని తెలియదా?. ఫ్రంట్లైన్ వారియర్స్కు వ్యాక్సిన్ తప్పనిసరి అని కేంద్రం చెప్పింది. కేంద్రం రూల్స్ అంటే నిమ్మగడ్డకు లెక్కలేదా?. దీనిపై వివరణ ఇవ్వకుండా ఎందుకు తప్పించుకుంటున్నారంటూ’’ బాలశౌరి విమర్శలు గుప్పించారు. చదవండి: నిమ్మగడ్డ తీరు.. విమర్శల జోరు కరోనా సమయంలో ఎన్నికలు వద్దని ఉద్యోగులు మొర పెట్టుకుంటున్నారని.. వారి అభ్యర్థనను నిమ్మగడ్డ పెడచెవిన పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో విడత వ్యాక్సిన్ అత్యంత ముఖ్యమని కేంద్రం ఇప్పటికే ప్రకటించిందన్నారు. కోర్టులు కూడా వర్చువల్గానే పనిచేస్తున్నాయని.. నిమ్మగడ్డ కూడా ఎస్ఈసీ తరఫున వర్చువల్గా హాజరయ్యారని’’ ఎంపీ బాలశౌరి తెలిపారు. చదవండి: మూడేళ్లు నిద్రపోయి.. ఇప్పుడెందుకు తొందర..! -
మూడేళ్లు నిద్రపోయి.. ఇప్పుడెందుకు తొందర..!
సాక్షి, తాడేపల్లి: మూడేళ్ల పాటు నిద్రపోయిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్.. మూడు నెలల కోసం ఎందుకు తొందరపడుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబుకు అనుకూలమైన అధికారులతో..ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘నిమ్మగడ్డ సమావేశం పొలిటికల్ ప్రెస్మీట్లా అనిపించింది. 2018లో పంచాయతీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు?. ఎన్నికల నిర్వహణలో మూడేళ్లుగా ఈసీ ఎందుకు విఫలమైంది?.చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు.. ఈ న్యాయపోరాటం ఎక్కడికి పోయింది?.ఎన్నికల నిర్వహణ ఒక విధి అనే భావన ఎక్కడా కనిపించట్లేదు. అహంకారంతో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారని’’ అంబటి దుయ్యబట్టారు. చదవండి: బెదిరించేలా నిమ్మగడ్డ వ్యవహార శైలి: మల్లాది విష్ణు తమకు ప్రజలు, ఉద్యోగుల ప్రాణాలు ముఖ్యమని ఆయన తెలిపారు. వ్యాక్సినేషన్, ఎన్నికలు ఒకేసారి నిర్వహించటం సాధ్యం కాదని.. వ్యాక్సినేషన్ చేస్తే కోవిడ్ తగ్గుతుంది. ఎన్నికలు నిర్వహిస్తే కోవిడ్ పెరుగుతుందన్నారు. వ్యాక్సినేషన్ ముఖ్యమా? ఎన్నికలు ముఖ్యమా?. ఎన్నికల్లో ఏకగ్రీవాలు కాకూడదా? అని ప్రశ్నించారు. ‘‘ఏకగ్రీవాలు జరిగిన చోట స్పెషల్ మోనటరింగ్ పెడతారంట. ఏకాభిప్రాయంతో ఏకగ్రీవాలు జరిగితే అభివృద్ధి సాధ్యం’’ అని తెలిపారు. నిమ్మగడ్డ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని.. ఎన్నికలు సజావుగా సాగకపోతే ప్రభుత్వానిదే బాధ్యత అంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. నిమ్మగడ్డ వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నట్లు ఉన్నాయని అంబటి రాంబాబు మండిపడ్డారు. చదవండి: పంచాయతీ ఎన్నికలు బహిష్కరిస్తాం: చంద్రశేఖర్ రెడ్డి -
విశేష అధికారాలంటూ వివాదాస్పద నిర్ణయం
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ప్రారంభం కాకుండానే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా తనకు విశేషాధికారాలు ఉన్నాయంటూ చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, తిరుపతి అర్బన్ ఎస్పీని విధుల నుంచి తప్పిస్తూ నిమ్మగడ్డ రమేష్కుమార్ వివాదస్పద నిర్ణయం తీసుకున్నారు. ఆ ముగ్గురు అధికారులతో పాటు ఒక ఆడిషనల్ ఎస్పీ, శ్రీకాళహస్తి డీఎస్పీ, మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను తాను విధుల నుంచి తప్పిస్తున్నట్టు శుక్రవారం ప్రొసీడింగ్ ఉత్తర్వులను జారీ చేశారు. ఆర్టికల్ 324, అర్టికల్ 243(కె) ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఉండే విశేష అధికారాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అందులో పేర్కొన్నారు. గతేడాది మార్చిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపల్ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆ అధికారులను తొలగించాలంటూ అప్పట్లోనే తాను ప్రభుత్వానికి సూచించానని, తాజాగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఈనెల 8న ఒకసారి 21న మరోసారి దీనిపై సీఎస్కు గుర్తు చేసినట్లు ఉత్వర్వుల్లో ఎస్ఈసీ పేర్కొన్నారు. కాగా ఎన్నికల నోటిఫికేషన్ జారీకి సన్నాహాలు చేస్తూ ఒక్క రోజు ముందు ఇద్దరు ఐఏఎస్లు, ఒక ఐపీఎస్ అధికారితో సహా మొత్తం 9 మంది అధికారులపై విశేషాధికారాల పేరుతో చర్యలు తీసుకోవడం పట్ల ఉద్యోగ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదం లేకుండా కలెక్టర్లు, ఎస్పీని తనంతట తానుగా తప్పించే అధికారం ఎస్ఈసీకి ఉంటుందా? అని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ముగ్గురి పేర్లను పంపాలన్న ఎస్ఈసీ గుంటూరు జిల్లా కలెక్టరు జాయింట్ కలెక్టరు–1కు, చిత్తూరు జిల్లా కలెక్టరు జాయింట్ కలెక్టరు–1కు బాధ్యతలు అప్పగించాలని నిమ్మగడ్డ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తిరుపతి అర్బన్ ఎస్పీ తన బాధ్యతలను చిత్తూరు జిల్లా ఎస్పీకి అప్పగించాలని ఆదేశించారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, తిరుపతి అర్బన్ ఎస్పీగా కొత్త వారి నియామకానికి సంబంధించి ముగ్గురు అధికారుల పేర్లను తన పరిశీలనకు పంపాలని సీఎస్కు సూచించారు. మిగిలిన ఆరుగురు పోలీసు అధికారుల బాధ్యతలను కొత్త వారికి అప్పగించేందుకు డీజీపీ తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గవర్నర్తో నిమ్మగడ్డ భేటీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ శుక్రవారం ఉదయం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్తో భేటీ అయ్యారు. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పును వివరించి శనివారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలియజేశారని కమిషన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని నిమ్మగడ్డకు గవర్నర్ సూచించినట్లు తెలిసింది. పావుగంట పాటు ఇరువురి భేటీ కొనసాగింది. ఈ భేటీకి సంబంధించి గవర్నర్ కార్యాలయం కానీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు. -
పాత ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు
సాక్షి, అమరావతి: మండల, జిల్లా పరిషత్ల ఎన్నికల కోసం గత ఏడాది మార్చి నాటికి తయారుచేసిన ఓటర్ల జాబితా ప్రకారమే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ శుక్రవారం జారీచేసిన ఉత్తర్వుల్లో తెలిపారు. 2019 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారితో అప్పట్లో ఓటర్ల జాబితాలు తయారు చేశారని, 2020 మార్చి 7వ తేదీ నాటికి వాటిని అప్డేట్ చేశారని తెలిపారు. -
ప్రాణాలు కాపాడుకునే రాజ్యాంగ హక్కు ఉద్యోగులకూ ఉంది
సాక్షి, అమరావతి: ‘ఎన్నికలు నిర్వహించే హక్కు రాజ్యాంగబద్ధంగా ఎన్నికల కమిషన్కు ఉన్నట్టే... తమ ప్రాణాలను కాపాడుకునే రాజ్యాంగబద్ధ హక్కు ఉద్యోగులకూ ఉంది. ఎన్నికలకు మేం వ్యతిరేకం కాదు. కానీ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ పూర్తి చేసిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలి’ అని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యక్తిగత పంతానికి పోకుండా ఉద్యోగుల ప్రాణాల గురించి ఆలోచించాలని కోరారు. ‘రాష్ట్రంలో లక్ష మంది పోలీసులున్నారు. వారంతా రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకోకుండా ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికల విధులకు హాజరవుతారా?’ అని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాయని, అది పూర్తి కాకుండా ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. 2018లోనే స్థానిక సంస్థల కాలపరిమితి ముగిసినప్పటికీ అప్పుడు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదో చెప్పాలన్నారు. ఎన్నికలు నిర్వహించే రాజ్యాంగబద్ధమైన హక్కును ఎన్నికల కమిషనర్ నాడు ఎందుకు వినియోగించలేదని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని 2018 అక్టోబర్ 23న కోర్టు ఆదేశించినా పట్టించుకోలేదన్నారు. కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్నప్పుడే నిమ్మగడ్డకు రాజ్యాంగబద్ధ అధికారాలు గుర్తొచ్చాయా? అని ప్రశ్నించారు. ఎన్నికల విధులంటే వేల మందిని కలవాలి.. ఎన్నికలు బహిష్కరిస్తామని తాము అనలేదని, ముందుగా ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేశాకే ఎన్నికలు జరపాలని వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. ‘రాజ్యాంగ నిర్మాతలు కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఊహించలేదు. ఎన్నికల కమిషనర్ తన విచక్షణాధికారాలను ఉపయోగించి ఉద్యోగుల ప్రాణాలు కాపాడేందుకు వ్యాక్సినేషన్ పూర్తి అయ్యేవరకు ఎన్నికలను వాయిదా వేయాలి’ అని కోరారు. కరోనా కారణంగా న్యాయస్థానాలు సైతం ఆన్లైన్ ద్వారానే వాదనలు వింటున్నాయని గుర్తు చేశారు. ఎన్నికల విధుల్లో వేలాదిమందిని కలవాల్సిన ఉద్యోగులకు కరోనా ముప్పు ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. ఈ అంశంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, తీర్పు ఎలా వచ్చినా ఉద్యోగుల అభిప్రాయం మాత్రం ఇదేనన్నారు. వ్యాక్సినేషన్ పూర్తి కాకుండా ఎన్నికల విధులకు హాజరు కావాలని ఉద్యోగులను ఒత్తిడి చేయొద్దని ఎన్నికల కమిషనర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరతామన్నారు. కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం కోరుతోందని, తాము మాత్రం ఉద్యోగులకు వ్యాక్సినేషన్ పూర్తి చేసిన తరువాత ఎన్నికలు నిర్వహించాలని అడుగుతున్నామని వివరించారు. -
నేడు ఎన్నికల కమిషనర్ మీడియా సమావేశం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్కుమార్ శనివారం ఉదయం 10 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. నాలుగు విడతల్లో ఫిబ్రవరి 5, 9, 13, 17వ తేదీలలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు గురువారం హైకోర్టు తీర్పు అనంతరం ఎస్ఈసీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు, గుంటూరు జిల్లాలను మినహాయించి మిగిలిన 11 జిల్లాల్లో తొలి విడతలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ క్రమంలో శనివారం ఎన్నికల నోటిఫికేషన్ జారీకి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఒక్కో జిల్లాలో ఒక్కో రెవెన్యూ డివిజన్ చొప్పున 11 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని అన్ని పంచాయతీలకు ఈ విడతలో ఎన్నికలు జరపాలని భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై చర్చించేందుకు కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణకు నిమ్మగడ్డ సిద్ధమయ్యారు. శనివారం సాయంత్రం 3 – 5 గంటల మధ్య సమావేశం ఉంటుందని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఎన్నికలకు ఆటంకం కలిగించే వారిపై చర్యలు పంచాయతీ ఎన్నికలపై గతేడాది అక్టోబర్ 28న రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైందని, ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా కొందరు మాట్లాడుతుండటం పట్ల రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆందోళన చెందుతోందంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే హక్కు కమిషన్కు ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయడానికి కమిషన్ అన్ని వర్గాల నుంచి పూర్తి స్థాయి సహకారాన్ని కోరుతోందని తెలిపారు. -
‘పంచాయతీ’ పాత తేదీల్లోనే!
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలను ఈ నెల 8న షెడ్యూల్లో ప్రకటించినట్లుగానే ఫిబ్రవరి 5, 9, 13, 17వ తేదీల్లో నాలుగు విడతల్లో నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ పేర్కొన్నారు. ఈమేరకు గురువారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలపై గురువారం హైకోర్టు తీర్పు వెలువరించిన నాటి నుంచే రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రజా ప్రతినిధులెవరూ సంక్షేమ పథకాల పంపిణీలో భాగస్వాములు కారాదని సూచిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. ఎన్నికల ఏర్పాట్లపై చర్చించేందుకు త్వరలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది, భద్రతకు సంబంధించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. హైకోర్టు తీర్పు వెలువరించిన వెంటనే ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్కు నిమ్మగడ్డ లేఖ రాసినట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించేందుకు కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయాలంటూ సీఎస్కు ఆయన మరో లేఖ రాసినట్లు తెలిసింది. మరోవైపు నిమ్మగడ్డ 13 జిల్లాల కలెక్టర్లకు ఫోన్ చేసి.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కాగా పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ శుక్రవారం సాయంత్రం 4కి తనతో సమావేశం కావాలని నిమ్మగడ్డ సూచించినట్లు తెలిసింది. -
ఇబ్బంది లేకుండా పంచాయతీ ఎన్నికలు..
సాక్షి, అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేసిన రిట్ పిటిషన్ను హైకోర్టు అనుమతించింది. ఇబ్బంది లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని గురువారం హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. కాగా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ ఈ నెల 8వ తేదీన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించగా.. 11వ తేదీన ఎస్ఈసీ ఆదేశాలను హైకోర్టు సింగిల్ జడ్జి కొట్టేశారు. ఎన్నికల కమిషన్ ఆచరణ సాధ్యం కాని నిర్ణయం తీసుకుందని ఆక్షేపించారు. ఈ ఎన్నికల షెడ్యూల్ రాజ్యాంగంలోని అధికరణలు 14, 21లకు విరుద్ధమని తేల్చి చెప్పారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కరోనా వ్యాక్సినేషన్ బృహత్కార్యానికి విఘాతం కలిగిస్తుందని స్పష్టం చేశారు. -
అంతా నా ఇష్టం
సాక్షి, అమరావతి: రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి ఆ పదవికి వన్నె తెచ్చేలా వ్యవహరించాలి. కానీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ మాత్రం ఎన్ని మొట్టికాయలు పడుతున్నా తన ఏకపక్ష, వివాదాస్పద నిర్ణయాలను మార్చుకోవటం లేదు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించారా? పోలింగ్ సిబ్బంది నియామకం పరిస్థితేంటి? బ్యాలెట్ పేపర్ ముద్రణ సంగతేంటి? అన్నవేవీ కనీసం పట్టించుకోకుండా... తాను చెబుతున్నాను కనుక ఇప్పుడే ఎన్నికలు జరగాలన్న రీతిలో షెడ్యూలు విడుదల చేశారు. ఇలాంటి ఒంటెద్దు పోకడలను సాగనివ్వబోమంటూ ఇప్పటికే హైకోర్టు మొట్టికాయలు వేసింది. అయినా ఊరుకోకుండా అప్పీలుకు వెళ్లటమే కాక... తాను చెప్పినట్టు వినలేదనే అక్కసుతో ఇపుడు ఈసీ కార్యాలయంలోని ఉద్యోగులపై కక్ష సాధింపులకు దిగారు. ఏడాదిక్రితం నాటి ఏర్పాట్లతో పంచాయతీ ఎన్నికలా? క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణ పరిస్థితిని ఏమాత్రం పట్టించుకోకుండా.. 2020 మార్చిలో ఎన్నికలకోసం చేసిన ఏర్పాట్ల ప్రతిపాదికనే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరిపేందుకు ఎస్ఈసీ సిద్ధపడడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోవిడ్ ఛాయలు అప్పుడప్పుడే కనిపిస్తున్న నాటి పరిస్థితులకు... కోవిడ్ తీవ్రస్థాయిలో విజృంభించి ప్రపంచమంతా అతలాకుతలమై, ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్ను సమకూర్చుకుని జనం కాస్త మానసికంగా కుదుట పడుతున్న నేటి పరిస్థితులకు చాలా తేడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే కాదు... యావత్తు ప్రపంచంలోని యంత్రాంగం ఇన్నాళ్లూ కోవిడ్పై పోరులోనే మునిగిపోయింది. దేశంలోనే కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పూర్తి క్రియాశీలంగా వ్యవహరించి... తాజాగా వ్యాక్సిన్ పంపిణీకి కూడా పూర్తిస్థాయిలో సన్నద్ధమయింది. ఈ పరిస్థితుల్లో పోలింగ్ కేంద్రాలను కొన్నింటిని కొత్తగా గుర్తించడం... అధికారులు చాలామంది బదిలీలపై వెళ్లిన నేపథ్యంలో కొత్తగా పోలింగ్ సిబ్బంది నియమించాల్సి ఉంటుంది. ‘‘పోలింగ్ సందర్భంగా ఓటర్ల చేతివేలికి వేయడానికి వాడే ఇంకు.. దొంగ ఓట్ల నివారణలో అత్యంత ప్రధానమైనది. ఏడాదిక్రితం కొనుగోలు చేసిన ఆ ఇంకు ఇపుడు పనికొస్తుందా? లేదా? అన్నది చూసుకోవాలి. ఆ ఇంకు పనికిరాకుంటే.. మళ్లీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందుకు కనీసం 40 రోజులు పడుతుంది’’ అని సాక్షాత్తూ ఎన్నికల ప్రక్రియతో సంబంధం ఉండే అధికారులే చెబుతున్నారు. కాకపోతే షెడ్యూల్ ప్రకటించడానికి ముందు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇలాంటివేమీ పట్టించుకోలేదన్నది బహిరంగమే. కమిషన్ కార్యాలయ ఉద్యోగులపైనా అదే తీరు.. పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేస్తూ నిమ్మగడ్డ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఎన్నికల ఉత్తర్వులపై స్టే విధించింది. షెడ్యూలు విడుదల చేసినవారు ప్రజల ప్రాణాలకు పెద్దగా విలువివ్వలేదన్న రీతిలో కోర్టు అభిప్రాయపడింది. అయినప్పటికీ నిమ్మగడ్డ తన వైఖరిని మార్చుకోలేదు. దీనిపై అప్పీలుకు సైతం వెళ్ళారు. మరోవంక కమిషన్ కార్యాలయంలోని ఉద్యోగులపై కక్ష సాధింపులు మొదలుపెట్టారు. ముఖ్యంగా కమిషన్ కార్యాలయ కార్యదర్శి వాణీమోహన్ను ప్రభుత్వానికి తిరిగి పంపించటంలోనూ... అనారోగ్యంతో సెలవు పెట్టిన కార్యాలయ జాయింట్ డైరెక్టర్ సాయిప్రసాద్ను ఏకంగా సర్వీసు నుంచి తొలగించడంలోను నిమ్మగడ్డ వ్యవహారశైలిని ఉద్యోగ సంఘాలు నేరుగా తప్పుపట్టాయి. 1995–2000 మధ్య రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పనిచేసిన కాశీ పాండ్యన్ అప్పటి కమిషన్ కార్యాలయ కార్యదర్శి లాల్ రోశమ్ను ప్రభుత్వానికి తిప్పి పంపారని, 73, 74 రాజ్యాంగ సవరణల తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొత్త పంచాయతీరాజ్ చట్టం వచ్చాక అప్పట్లో ఆ ఘటన జరిగిందని అధికార వర్గాలు చెప్పాయి. అప్పటికి ప్రత్యేకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్, కార్యదర్శిల సర్వీసు రూల్స్ రూపొందించలేదని, కానీ ప్రస్తుతం ప్రత్యేకంగా ఎవరి బాధ్యతలేంటో సర్వీసు రూల్స్ పేర్కొనడంతో ఎవరి విధుల్లో వారే పనిచేయాల్సి ఉంటుందని.. ఇలాంటి పరిస్థితుల్లో బీసీ మహిళ అయిన ఐఏఎస్ అధికారిణి వాణీమోహన్ను ప్రభుత్వానికి నిమ్మగడ్డ తిప్పి పంపటం తీవ్రమైన చర్యేనని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ సర్వీసు నిబంధనల ప్రకారం.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్లు జారీ చేయడం, ఎన్నికలకు సంబంధించి ఇతర విధానపరమైన నిర్ణయాలలో పూర్తి అధికారాలు కలిగివుంటే.. పరిపాలన వ్యవహారాల పరంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి కార్యదర్శే హెడ్గా వ్యవహరిస్తారు. కమిషనర్ కార్యాలయ స్థాయిలో ఎన్నికల ఖర్చుకు సంబంధించి ఏ బిల్లులైనా కార్యదర్శి ఉత్తర్వులద్వారా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. వాణీమోహన్ను ప్రభుత్వానికి తిరిగి పంపిస్తూ ఉత్తర్వులు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ మంగళవారం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ కార్యదర్శిగా ఉన్న వాణీమోహన్ను విధుల నుంచి తప్పించారు. అప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ కార్యాలయ కార్యదర్శి బాధ్యతల నుంచి రిలీవ్ అయి సాధారణ పరిపాలన విభాగంలో రిపోర్టు చేయాలని మంగళవారం జారీ చేసిన ఆదేశాల్లో సూచించారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యనాథ్ దాస్కు సమాచారమిస్తూ లేఖ రాశారు. వాణీమోహన్ స్థానంలో రాష్ట్ర కమిషన్ కార్యాలయ కార్యదర్శిగా కొత్తవారి నియామకం కోసం ఐఏఎస్ అధికారుల ప్యానల్ పేర్లను పంపాలంటూ లేఖలో సీఎస్కు సూచించారు. గవర్నర్తో నిమ్మగడ్డ భేటీ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ మంగళవారం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను కలిశారు. కరోనా వ్యాక్సినేషన్ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెబుతున్నది పరిగణనలోకి తీసుకోకుండా గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యుల్ను విడుదల చేయడాన్ని రాష్ట్ర హైకోర్టు సింగిల్ బెంచ్ తప్పుపట్టడం తెలిసిందే. దీంతో తాను ఏ పరిస్థితులలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాల్సి వచ్చిందో నిమ్మగడ్డ.. గవర్నర్కు వివరణ ఇచ్చుకున్నట్టు సమాచారం. అయితే ఈ భేటీకి సంబంధించి గవర్నర్ కార్యాలయం గానీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం గానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఉదయం 11.30 గంటలకు గవర్నర్తో నిమ్మగడ్డ భేటీ ఖరారవగా.. 11.10 గంటలకే ఎన్నికల కమిషనర్ గవర్నర్ కార్యాలయానికి చేరుకున్నారు. నిర్ణీత 11.30 గంటలకు సమావేశం ప్రారంభమైంది. అయితే కేవలం పది నిమిషాల్లోనే ఈ భేటీ ముగిసింది. -
ఎస్ఈసీ అభ్యంతరాలను తోసిపుచ్చిన ధర్మాసనం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ దుర్గాప్రసాద్, జస్టిస్ కృష్ణ మోహన్లతో కూడిన ధర్మాసనం.. ఎస్ఈసీ అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని భావిస్తూ.. తదుపరి విచారణను ఈనెల 18కు వాయిదా వేసింది. కాగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకై ఎలక్షన్ కమిషన్, ఈ నెల 8న జారీ చేసిన షెడ్యూల్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు సోమవారం ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే. ఈ ఎన్నికల షెడ్యూల్ రాజ్యాంగంలోని అధికరణలు 14, 21లకు విరుద్ధమన్న న్యాయస్థానం... ఎస్ఈసీ ఆచరణ సాధ్యం కాని నిర్ణయం తీసుకుందని ఆక్షేపించింది.(చదవండి: నిమ్మగడ్డ మరో వివాదాస్పద నిర్ణయం) అదే విధంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కరోనా వ్యాక్సినేషన్ బృహత్కార్యానికి విఘాతం కలిగిస్తుందని పేర్కొంటూ.. ఎస్ఈసీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని ఈ సందర్భంగా తప్పుబట్టింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హౌస్ మోషన్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. -
నిమ్మగడ్డ మరో వివాదాస్పద నిర్ణయం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ మరోవివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. అనారోగ్యం కారణంగా మెడికల్ లీవ్లో వెళ్లిన అధికారిని ఏకంగా ఉద్యోగం నుంచే తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న సాయిప్రసాద్పై ఈ మేరకు తీవ్ర చర్య తీసుకున్నారు. జీవీ సాయిప్రసాద్ అనారోగ్య సమస్యలతో ఆదివారం నుంచి నెలరోజులపాటు మెడికల్ లీవ్ పెట్టారు. ఆయనతోపాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు పీఎస్గా వ్యవహరిస్తున్న అసిస్టెంట్ సెక్రటరీ రామారావు, మరో అసిస్టెంట్ సెక్రటరీ సాంబమూర్తి కూడా లీవ్ పెట్టారు. ముగ్గురు లీవ్ పెట్టినప్పటికి జేడీ సాయిప్రసాద్పైనే నిమ్మగడ్డ చర్యలు తీసుకోవడం గమనార్హం. కనీసం ఛార్జి మెమో కూడా ఇవ్వకుండా ఏకంగా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడం, అంతేగాక పదవీ విరమణ బెనిఫిట్స్ కూడా ఇవ్వరాదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తన ఉత్తర్వులలో పేర్కొనడం ఉద్యోగ సంఘాల్లో చర్చనీయాంశమైంది. ఈ నెల 8న ఎన్నికల కమిషనర్ వెలువరించిన గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను సోమవారం సాయంత్రం హైకోర్టు కొట్టివేయడానికి ముందుగా నిమ్మగడ్డ ఈ ఉత్తర్వులిచ్చారు. నిమ్మగడ్డ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు విస్మయం వ్యక్తం చేశాయి. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టాయి. సాయిప్రసాద్ని డిస్మిస్ చేయడం దుర్మార్గం రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయిప్రసాద్ని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ డిస్మిస్ చేయడం చాలా దుర్మార్గమైన చర్యని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి అన్నారు. సెలవు దరఖాస్తు చేసినందుకు డిస్మిస్ చేయడం ఎన్నడూ చూడలేదన్నారు. సస్పెండ్ చేసినా ఒకరకం కానీ ఏకంగా డిస్మిస్ చేయటం దారుణమన్నారు. నిమ్మగడ్డ ఉద్యోగులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో అందరికీ తెలుసన్నారు. తాడేపల్లిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. -
పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించేలా ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఎన్నికల కమిషన్ ఈ నెల 8న జారీ చేసిన షెడ్యూల్ అమలును నిలిపేసింది. ఎన్నికల కమిషన్ ఆచరణ సాధ్యం కాని నిర్ణయం తీసుకుందని ఆక్షేపించింది. ఈ ఎన్నికల షెడ్యూల్ రాజ్యాంగంలోని అధికరణలు 14, 21లకు విరుద్ధమని తేల్చి చెప్పింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కరోనా వ్యాక్సినేషన్ బృహత్కార్యానికి విఘాతం కలిగిస్తుందని స్పష్టం చేసింది. ఈ బృహత్కార్యాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్నికల కమిషన్ జరిపిన సంప్రదింపుల్లో నిష్పాక్షికత లేదని తేల్చి చెప్పింది. ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమని స్పష్టం చేసింది. సంప్రదింపుల సందర్భంగా క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ తన స్వీయ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని ఎన్నికల షెడ్యూల్ను జారీ చేసిందని ఆక్షేపించింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమిషన్ జారీ చేసి పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ అమలును నిలిపేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. మధ్యంతర ఉత్తర్వుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను అనుమతిస్తున్నట్లు తెలిపింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించింది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం షెడ్యూల్ విడుదల చేస్తూ ఎన్నికల కమిషన్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే ఎన్నికల షెడ్యూల్ను వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్, వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్లు కూడా అత్యవసరంగా లంచ్ మోషన్ల రూపంలో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యాలపై సోమవారం మధ్యాహ్నం న్యాయమూర్తి జస్టిస్ గంగారావు విచారణ జరిపారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్, ఎన్నికల కమిషన్ తరఫున ఎన్.అశ్వనీకుమార్, కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్లు వాదనలు వినిపించారు. కరోనా మహమ్మారి తీవ్రతను, కరోనా వ్యాక్సినేషన్ బృహత్కార్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిందని ఏజీ శ్రీరామ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై కూడా ఉందని, అయితే ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు లేవు కాబట్టి, అలాగే ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది కాబట్టి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. అప్పుడు.. ఇప్పుడు ఏకపక్ష నిర్ణయాలే... ‘సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు ప్రారంభించిన సంప్రదింపుల ప్రక్రియను ఎన్నికల కమిషన్ లాంఛనప్రాయంగా మార్చేసింది. క్షేత్రస్థాయి పరిస్థితులను పలు మార్లు వివరించాం. అయినా మా వినతులను, అభ్యంతరాలను ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదు. ఎన్నికల కమిషనర్కు దురుద్దేశాలు ఉన్నాయి కాబట్టే, ఎన్నికల కమిషన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది. హైకోర్టు జోక్యంతో 2020 మార్చిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల కమిషన్ ప్రారంభించింది. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. కోవిడ్ ప్రారంభం దశలో ఉన్నప్పటికీ, దానిని సాకుగా చూపిన ఎన్నికల కమిషనర్ ఏకపక్షంగా ఎన్నికలను వాయిదా వేశారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీస స్థాయిలో కూడా సంప్రదించలేదు. ఏ దశలో ఎన్నికలు వాయిదా వేశామో, తిరిగి ఆ దశ నుంచే ఎన్నికల ప్రక్రియను మొదలుపెడతామని చెప్పారు. కానీ అందుకు విరుద్ధంగా మళ్లీ ఏకపక్షంగా కేవలం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీల సంగతిని గాలికొదిలేశారు..’ అని శ్రీరామ్ తెలిపారు. ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు... ‘అప్పుడు ప్రజల ఆరోగ్యం కోసం ఎన్నికలను వాయిదా వేశామని చెప్పిన ఎన్నికల కమిషనర్, ఇప్పుడు అదే ప్రజల ప్రాణాలను, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ ఎన్నికలు నిర్వహిస్తానంటున్నారు.. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉందని, కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు కేంద్రం సర్వం సిద్ధం చేస్తోందని చెప్పినా పట్టించుకోలేదు. వ్యాక్సినేషన్ సమయంలో స్థానిక ఎన్నికల నిర్వహణ సాధ్యం అయ్యే పరిస్థితి లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాం. హైకోర్టు ఇరుపక్షాలు కూర్చొని సంప్రదింపులు జరపాలని ఆదేశించింది. అలా సంప్రదింపులు జరిపిన కొద్ది గంటల్లోనే ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషనర్ విడుదల చేశారు. దీనిని బట్టి ఎన్నికల కమిషనర్ ముందుస్తుగానే నిర్ణయం తీసుకున్నారని సులభంగా అర్థమవుతోంది..’ అని వివరించారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికుంది ‘కరోనా వ్యాక్సినేషన్ ఓ బృహత్కార్యం. రాష్ట్రంలో 1.49 కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కానుంది. ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడాల్సిన రాజ్యాంగ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల కంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలే ముఖ్యం. ఇన్ని వివరాలను సమర్పించినా కూడా ఎన్నికల కమిషన్ ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసింది. కేరళ, తెలంగాణ, రాజస్తాన్ తదితర చోట్ల పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన తర్వాతనే కోవిడ్ కేసులు భారీగా పెరిగాయి. ఇది దృష్టిలో పెట్టుకునే ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణపై ఆందోళన వ్యక్తం చేశాం. వ్యాక్సినేషన్ తర్వాత కరోనా భయం లేకుండా నిర్భయంగా ఓటు వేసే పరిస్థితులు ఉన్నాయన్న విశ్వాసాన్ని ప్రజల్లో తీసుకురావాలి. అప్పటివరకు వేచి చూడాలి. ఎన్నికల కమిషనర్ తన సంకుచిత మనస్తత్వంతో ప్రజారోగ్యాన్ని, ప్రజా ప్రయోజనాలను పణంగా పెట్టాలని చూస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, ఎన్నికల షెడ్యూల్ అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి.’ అని శ్రీరామ్ కోర్టును అభ్యర్థించారు. షెడ్యూల్ వచ్చాక న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదు... అనంతరం ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది అశ్వనీ కుమార్ వాదనలు వినిపించారు. ‘ఓసారి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత సాధారణంగా న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెబుతూ వచ్చింది. అది ఇప్పటికీ అమలవుతూనే ఉంది. ఎన్నికల నియమావళి ఇప్పటికే అమల్లోకి వచ్చింది. వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. ఎన్నికలను వాయిదా వేసేందుకు ప్రభుత్వం ఏవేవో కారణాలు చెబుతోంది...’ అని అన్నారు. కేంద్రం ఆదేశాలను రాష్ట్రాలు అమలు చేసి తీరాల్సిందే... అటు తరువాత కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్ వాదనలు వినిపించారు. కేంద్రానికి కూడా ప్రజల ప్రాణాలే ముఖ్యమన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుల్లో.. దేశంలోని 135 కోట్ల మందికి దశల వారీగా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి వ్యాక్సిన్ బయటకు వస్తుంది. ఇందుకు సంబంధించి కేంద్రం ఇచ్చే ఆదేశాలను రాష్ట్రాలు అమలు చేసి తీరాల్సిందే.’ అని వివరించారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి.. ఎద్దుల మధ్య జరిగే పోరాటంలో లేగదూడలు బలి కాకూడదని, వాటిని మనం కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్ అమలును నిలిపేస్తున్నట్లు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే పరిస్థితి లేదు.. ఈ ఉత్తర్వులు జారీ చేసిన కొద్దిసేపటి తరువాత ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్, వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్లు లంచ్మోషన్ రూపంలో దాఖలు చేసిన వ్యాజ్యాలు విచారణకు వచ్చాయి. వ్యాక్సినేషన్ తీసుకోకుండా ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకునే పరిస్థితి లేదని ఇరు ఫెడరేషన్లు స్పష్టం చేశాయి. కాగా ఈ వ్యాజ్యాల్లో కూడా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై ఇచ్చిన ఉత్తర్వులే వర్తిస్తాయని న్యాయమూర్తి స్పష్టం చేశారు. -
టీడీపీతో నిమ్మగడ్డ చెట్టపట్టాల్
సాక్షి, అమరావతి: రాజ్యాంగ బద్ధమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్కుమార్ తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా మెలగడం మరోసారి బట్టబయలైంది. కృష్ణా జిల్లా మొవ్వ మండల కేంద్రానికి ఆదివారం దైవ దర్శనానికి వెళ్లిన ఆయనకు అక్కడి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయంలోనే శాలువా కప్పి సన్మానించారు. టీడీపీ అనుబంధ విభాగం తెలుగు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తాతినేని పూర్ణచంద్రరావు, ఆ పార్టీ మొవ్వ గ్రామ కమిటీ అధ్యక్షుడు బుజ్జి కోటేశ్వరరావు, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జన్మభూమి కమిటీ సభ్యులుగా పనిచేసిన శీలం బాబురావు, ఇతర నాయకులు పోతర్లంక సుబ్రహ్మణ్యం, మండవ వీరభద్రరావు, మండవ రవికిరణ్, మండవ రాజ్యలక్ష్మి తదితరులు నిమ్మగడ్డతో ఆత్మీయంగా మెలుగుతూ కొద్దిసేపు ముచ్చటించారు. తిరిగి వెళ్లేటప్పుడు వారు ఆయన వెంట కారు దాకా వచ్చి ఘనంగా వీడ్కోలు పలికారు. నిమ్మగడ్డ మొవ్వ గ్రామానికి వెళ్లుతున్న విషయాన్ని టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి పార్టీ పెద్దలు గ్రామ పార్టీ నేతలకు ముందే సమాచారం ఇచ్చారని తెలిసింది. అందువల్లే అక్కడి నేతలు శాలువాతో ముందే సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం. అంతకు ముందు నిమ్మగడ్డ రమేష్కుమార్ మోపిదేవి సుబ్రమణ్యస్వామి ఆలయంలో, పేదకల్లేపల్లి దుర్గానాగేశ్వరస్వామి ఆలయంలో, శ్రీకాకుళం గ్రామంలోని శ్రీకాకులేశ్వరస్వామి ఆలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వంతో ఘర్షణ.. ప్రతిపక్షంతో స్నేహం! – ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులతో సన్నిహితంగా మెలుగుతున్న నిమ్మగడ్డ.. అదే సమయంలో ప్రభుత్వంతో పూర్తిగా ఘర్షణ వైఖరితో ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార ఉత్తర ప్రత్యుత్తరాలు మొదలు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వరకు అన్నింటా భిన్న వైఖరి ప్రదర్శిస్తున్నారు. – ప్రభుత్వం నుంచి ఒక రకమైన అభిప్రాయం వెల్లడైతే, నిమ్మగడ్డ రమేష్కుమార్ మరో అభిప్రాయం వ్యక్తపరుస్తూ వచ్చారు. 2020 మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలను అర్ధంతరంగా వాయిదా వేసినప్పుడు గానీ.. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరపాలన్న అంశంలోగానీ ఏకపక్షంగా వ్యవహరించారు. – గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీ కాలం 2018 ఆగస్టులోనే ముగిసినప్పటికీ, అప్పుడు కూడా ఎన్నికల కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ.. సకాలంలో ఎన్నికలు జరపని విషయం తెలిసిందే. – అలాంటిది ప్రపంచం మొత్తాన్ని ప్రాణ భయంలోకి నెట్టివేసిన కరోనాకు వ్యాక్సినేషన్ అందజేసే ప్రస్తుత సమయంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాసు స్వయంగా వివరించినప్పటికీ, వినిపించుకోక ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. కృష్ణా జిల్లా మొవ్వలో టీడీపీ నేతలతో ముచ్చటిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ బాబు సన్నిహితులతో నాడు హోటల్లో మంతనాలు – రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బాధ్యతల విషయంలో నిమ్మగడ్డ రమేష్కుమార్కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య 2020 జూన్లో వివాదం తలెత్తిన సమయంలో.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా పేరున్న అప్పటి టీడీపీ నేత సుజనా చౌదరి (ప్రస్తుతం బీజేపీలో చేరారు), గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసిన కామినేని శ్రీనివాసరావుతో అదే నెల 13న హైదరాబాద్లోని ఒక స్టార్ హోటల్లో సమావేశం కావడం అప్పట్లో రాజకీయ దుమారానికి కారణమైంది. – నా రోజు ఆ ఇద్దరు నేతలు ఒకరి తర్వాత ఒకరు నిమ్మగడ్డ ఉన్న హోటల్లోని గదికి చేరుకోవడం, గంటన్నర సేపు మంతనాలు సాగించడం.. అనంతరం ముగ్గురూ వేర్వేరుగా హోటల్ గది నుంచి బయటకు వచ్చే దృశ్యాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే. టీడీపీ నేతే అన్నట్టు వ్యవహారం కరోనా సెకెండ్ వేవ్ ఉన్నప్పటికీ నిమ్మగడ్డ రమేష్కుమార్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక ఆయన మొవ్వ మండల కేంద్రంలోని వేణుగోపాల స్వామి ఆలయానికి దర్శనానికి వెళితే.. అక్కడి టీడీపీ నేతలు స్వాగత సత్కారాలు చేస్తుంటే, ఆయన సంతోషంగా స్వీకరిస్తూ.. ఏదో విజయం సాధించినట్టు వ్యవహరించారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న అధికారికి ఇది తగునా? ఎన్నికల కోడ్ అమలులో ఉందని చెప్పిన ఆయనే టీడీపీ నేతలతో ఎలా సన్మానాలు చేయించుకున్నారు? ఆయనేమన్నా టీడీపీ అనుబంధ సంఘం నేతా? ఎన్నికలు జరపడానికి అనువైన పరిస్థితులు ఇప్పుడు లేవని సీఎస్ స్వయంగా చెప్పినప్పటికీ, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం చూస్తుంటే నిమ్మగడ్డ టీడీపీ నాయకుడిగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. – కైలే అనిల్కుమార్, ఎమ్మెల్యే, పామర్రు. ఇతరులు వెళితే ఇంటర్ కమ్లోనే.. ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చించడానికి ఇతర పార్టీ నేతలెవరైనా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళితే నిమ్మగడ్డ కలవడం లేదు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రతినిధుల బృందం నిమ్మగడ్డను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు వెళితే.. తానెవరినీ కలవడం లేదంటూ, తన పీఏ వద్ద ఉన్న ఇంటర్ కమ్ ఫోన్లో మాట్లాడి పంపారు. తమ వద్ద నుంచి నిమ్మగడ్డ వ్యక్తిగత కార్యదర్శి వినతిపత్రం తీసుకున్నారని బీజేపీ ప్రతినిధుల బృందం సభ్యుడు ఉప్పలపాటి శ్రీనివాసరాజు ‘సాక్షి’ ప్రతినిధికి వివరించారు. -
అసెంబ్లీని మించి ‘పంచాయితీ’!
సాక్షి, అమరావతి: ఎన్నికల నిర్వహణ సన్నద్ధతను ఏమాత్రం పట్టించుకోకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్కుమార్ ఏకపక్షంగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను జారీ చేయడంపై అధికార యంత్రాంగంలో విస్మయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికలను మించి పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయాల్సి ఉందని గుర్తు చేస్తున్నారు. బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ పరిస్థితి ఏమిటి? తగినన్ని బ్యాలెట్ బాక్స్లు ఉన్నాయా? పోలింగ్ సిబ్బంది సంఖ్య తదితరాల గురించి ఏమాత్రం వాకబు చేయకుండా కరోనా వ్యాక్సినేషన్కు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో ఏదో తరుముకొస్తున్నట్లుగా ఎన్నికలు జరపాలనే నిర్ణయం తీసుకోవడం పట్ల అంతా విస్తుపోతున్నారు. ఇలా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలతో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే అవకాశం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ హయాంలో పట్టించుకోకుండా... వాస్తవానికి గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ల పదవీ కాలం టీడీపీ హయాంలోనే 2018 ఆగస్టులోనే ముగిసినా అప్పుడు కూడా ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ స్థానిక ఎన్నికలను జరపలేదు. సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా హఠాత్తుగా ఈ సమయంలో షెడ్యూల్ జారీ చేయడం సరికాదని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో అధికార యంత్రాంగం అంతా తలమునకలై ఉన్నందున ఎన్నికలు ఇప్పుడు సాధ్యం కాదని ఉన్నతాధికారుల బృందం తెలియచేసినా మొండి వైఖరి అనుసరించడాన్ని బట్టి నిమ్మగడ్డ నిష్పాక్షికతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని, నిపుణులు పేర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మించి.. రాష్ట్రవ్యాప్తంగా 13,371 గ్రామ పంచాయతీలకు సర్పంచి ఎన్నికలతో పాటు 1,34,099 వార్డు పదవులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అంటే దాదాపు లక్షన్నర పదవులకు ఎన్నికలు జరపాలి. ఒక్కో పదవికి ముగ్గురు చొప్పున పోటీలో ఉన్నా తక్కువలో తక్కువ నాలుగున్నర లక్షల మంది బరిలో ఉంటారు. అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా 43 వేల పోలింగ్ కేంద్రాలలోనే జరుగుతాయని, పంచాయతీ ఎన్నికలు మాత్రం దాదాపు 1.34 లక్షల పోలింగ్ బూత్లలో జరపాల్సి ఉంటుంది. ఇంత పెద్ద స్థాయిలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలంటే అందుకు తగ్గ ఏర్పాట్లు జరిగాయో లేదో తొలుత పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇవేమీ పట్టించుకోకుండానే నిమ్మగడ్డ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. అర్థాంతరంగా ఆపినవి వదిలేసి కొత్త పంచాయితీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు గత ఏడాది మార్చిలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. నామినేషన్ల ఉపసంహరణ కూడా ముగిసింది. పట్టణ, నగర వార్డు సభ్యులకు మరో నోటిఫికేషన్ విడుదల చేసి వాటి నామినేషన్ల ప్రక్రియనూ పూర్తి చేశారు. ఆ తరుణంలో ఎన్నికల మధ్యలో అర్థాంతరంగా వాయిదా వేశారు. దాదాపు 50 వేల మంది ఆయా ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. మధ్యలో ఆగిపోయిన ఆ ఎన్నికలను పూర్తిగా పక్కనపెట్టి ఇప్పుడు కొత్తగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను నిమ్మగడ్డ ప్రకటించారు. ఇలా ఒక ఎన్నికలను మధ్యలో నిలిపివేసి మరో ఎన్నికలను చేపట్టాలని ఎస్ఈసీ నిర్ణయం తీసుకోవడం ఇంతవరకు దేశంలో ఎక్కడా జరగలేదని పేర్కొంటున్నారు. -
స్థానిక ఎన్నికలు: హైకోర్టును ఆశ్రయించిన సర్కార్
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏకపక్ష నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తలుపు తట్టింది. గ్రామ పంచాయతీలకు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ నెల 8న జారీ చేసిన షెడ్యూల్ను సవాలు చేస్తూ శనివారం పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేస్తూ కమిషన్ జారీ చేసిన ప్రొసీడింగ్స్తో పాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, బదిలీల నిలిపివేత తదితర చర్యలన్నింటినీ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించి, రద్దు చేయాలని కోరుతూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రొసీడింగ్స్తో సహా తదుపరి చర్యల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ వ్యాజ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శులతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు. ఎన్నికల తేదీని ప్రకటించే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పనిసరిగా సంప్రదించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, హైకోర్టు సైతం రాష్ట్ర ప్రభుత్వం తన అభ్యంతరాలు, ఆందోళనలన్నింటినీ లిఖిత పూర్వకంగా ఎన్నికల కమిషన్ ముందుంచాలని ఆదేశించిందని ద్వివేదీ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాల మేరకు తాము తమ అభ్యంతరాలన్నింటినీ ఆధారసహితంగా ఎన్నికల కమిషనర్ ముందు ఉంచామని వివరించారు. ఎన్నికల కమిషన్తో సంప్రదింపులు జరపాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన కాపీ అందుబాటులోకి రాక ముందే, సంప్రదింపులకు రావాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీ రాజ్ కమిషనర్లకు నిమ్మగడ్డ రమేశ్ లేఖలు రాశారని తెలిపారు. ఈ వ్యాజ్యంపై సోమవారం హైకోర్టు విచారణ జరపనుంది. పిటిషన్లోని వివరాలు ఇంకా ఇలా ఉన్నాయి. సంప్రదింపుల వెనుక చిత్తశుద్ధి లేదు.. – రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా, ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ రమేశ్ ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఈ నెల 8న సంప్రదింపులకు రావాలని అధికారులను ఆదేశించారు. – హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ముగ్గురు అధికారుల బృందం 8న సాయంత్రం ఎన్నికల కమిషనర్ను కలిసింది. మా బృందం కలిసి వచ్చిన కొద్ది గంటలకే ఎన్నికల కమిషనర్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. – ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేగాన్ని చూస్తే, సంప్రదింపుల ప్రక్రియ కేవలం ఓ ఫార్స్ అన్న సంగతి ఇట్టే అర్థమవుతోంది. సంప్రదింపుల విషయంలో కోర్టు ముందు అంగీకరించిన దానికి భిన్నంగా ఎన్నికల కమిషనర్ వ్యవహరించారు. నాలుగు దశల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ను విడుదల చేశారు. దీనిని బట్టి షెడ్యూల్ను ముందుగానే సిద్ధం చేసుకున్నారని స్పష్టమవుతోంది. – తన పదవీ విరమణ తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోందని నిమ్మగడ్డ రమేశ్ స్వయంగా చేసిన ప్రకటనే, ఈ మొత్తం విషయాన్ని చెబుతోంది. ఆ ప్రకటనే ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసేలా చేసింది. – రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాలను చెప్పడానికి ముందే ఎన్నికల షెడ్యూల్ తయారు చేశారు. కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి మాత్రమే ప్రభుత్వాధికారులతో సంప్రదింపులు జరిపారే తప్ప, చిత్తశుద్ధితో జరపలేదు. సంప్రదింపుల ప్రక్రియను, కోర్టు ఆదేశాలను ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ అపహాస్యం చేశారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ఎంతో ముఖ్యమని చెప్పినా వినలేదు – ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదనేందుకు ప్రభుత్వం చెప్పిన కారణాలు, క్షేత్ర స్థాయి పరిస్థితులను వివరిస్తూ అందజేసిన ఆధారాలను నిమ్మగడ్డ పరిగణనలోకి తీసుకోలేదు. ఏకపక్షంగా షెడ్యూల్ విడుదల చేశారు. – కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో రాష్ట్రాలను సన్నద్ధం చేసేందుకు కేంద్ర హోం శాఖ, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలు రాష్ట్ర ప్రభుత్వాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాయి. సాధారణ ఎన్నికలను ఎలా నిర్వహిస్తారో అలా కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. – ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని ఈ కార్యక్రమంలో నిమగ్నం చేయాలని కోరుతోంది. ఈ నెల 11న ప్రధాన మంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కోవిడ్ వ్యాక్సిన్ సన్నద్దత, విధి విధానాలు తదితరాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. – ఈ విషయాన్ని కూడా ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాం. ప్రధాన మంత్రి ప్రకటన తర్వాత నిర్ణయం తీసుకోవాలని కూడా కోరాం. ఇప్పటికే వ్యాక్సినేషన్ మార్గదర్శకాలను జారీ చేసిన విషయాన్ని కూడా కమిషనర్కు వివరించాం. పోలీసులతో సహా మొత్తం అధికార యంత్రాంగం కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం ఎంత ముఖ్యమో తెలియజేశాం. దురుద్దేశంతోనే ఈ నిర్ణయం – వీటన్నింటినీ బేఖాతరు చేస్తూ ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్ దురుద్దేశంతో ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. దీని వెనుక నిమ్మగడ్డకు కుటిల ఉద్దేశాలున్నాయి. ఎన్నికలను వాయిదా వేయాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయి పరిస్థితులను, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంది. – దీనికి, రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వ నిర్ణయాల్లో పార్టీ నేతల జోక్యం ఉండదు. ఇదే విషయాన్ని ఎన్నికల కమిషనర్కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చాలా స్పష్టంగా చెప్పారు. – నిమ్మగడ్డ రమేశ్ తన నోటిఫికేషన్లో బీహార్, కేరళ, అమెరికాలను ఉదాహరణగా పేర్కొన్నారు. ఆ ప్రాంతాల్లో ఎన్నికల తర్వాత కోవిడ్ కేసులు భారీగా పెరిగాయి. కేరళలో ఎన్నికలను నోటిఫై చేసిన నవంబర్ నాటికి 4.50 లక్షల కేసులు ఉంటే, మూడో దశ ఎన్నికల నాటికి ఆ సంఖ్య 6.50 లక్షలకు చేరింది. – ఈ రోజుకు (శనివారం) కేరళలో కోవిడ్ కేసులు 8.01 లక్షలు. అమెరికా విషయానికొస్తే, అమెరికా అధ్యక్ష్య ఎన్నికలు జరిగే నాటికి అక్కడ కోవిడ్ కేసులు 97.53 లక్షలు. ఇప్పుడు ఆ సంఖ్య 2.21 కోట్లకు చేరింది. – ఇదే రీతిలో రాజస్తాన్, బీహార్లలో కూడా ఎన్నికల తరువాత కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక్కడ ఎన్నికలు నిర్వహించే నాటికి కోవిడ్ వ్యాక్సినేషన్కు సంబంధించి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం కాలేదు. మార్గదర్శకాలు కూడా జారీ కాలేదు. నిమ్మగడ్డ ఇష్టాయిష్టాలకు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేం – రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ కూడా ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించే ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోదు. ఎన్నికల ప్రక్రియపై రాష్ట్రానికి ఆపార గౌరవం ఉంది. ప్రజల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. – ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్ ఇష్టానుసారం తీసుకునే నిర్ణయాలకు ప్రజల ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పణంగా పెట్టలేదు. పౌరుల, ప్రభుత్వాధికారుల ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – దేశం మొత్తం ఇప్పుడు జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం పరిధిలో ఉంది. ఇలాంటి సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేయడం సరికాదు. దీనిపై మా అభ్యంతరాలను పట్టించుకోలేదు. – నిమ్మగడ్డ రమేశ్ ప్రభుత్వ వ్యతిరేక భావనతో ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ జారీ వెనుక సదుద్దేశాలు, హేతుబద్ధత ఎంత మాత్రం లేదు. కోవిడ్ వ్యాక్సినేషన్ దృష్ట్యా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయలేదన్న విషయాన్ని నిమ్మగడ్డ రమేశ్ ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యం ముడిపడి ఉన్న ఈ వ్యవహారంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవాలి. -
ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతున్నారు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమే‹Ùకుమార్ నిర్ణయం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టేలా ఉందని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం.. వారి ప్రాణాలు కాపాడడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి ఏమాత్రం ఆలోచించకుండా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ ముందుగా నిర్ణయించుకున్న వ్యూహం ప్రకారం, మొండిగా స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలోనే జరుపుతామంటున్నారని తెలిపారు. ఈ మేరకు ద్వివేది శుక్రవారం రాత్రి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో ఆయన ఏం పేర్కొన్నారంటే.. సీఎస్ సూచనలను పట్టించుకోలేదు ‘రాష్ట్ర ప్రజల ప్రాణ రక్షణ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం. అధికారులు, సిబ్బంది మొత్తం కోవిడ్ వ్యాక్సినేషన్ సన్నాహక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ నెల 9న కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి కూడా వ్యాక్సినేషన్పై అన్ని రాష్ట్రాలకూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు ఇవ్వబోతున్నారు. ఈ నెల 11న ప్రధాని మోదీ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఈ వివరాలన్నీ ఎస్ఈసీ దృష్టికి తీసుకొచ్చి 13 తర్వాత ఎన్నికలపై సంప్రదింపుల ప్రక్రియ చేపడదామని కోరినప్పటికీ పట్టించుకోలేదు’. అధికార దురహంకారంతో వ్యవహరించారు.. ‘గత ఏడాది మార్చి 15 నాటికి రాష్ట్రంలో ఒకేఒక్క కోవిడ్ కేసు నమోదు అయినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల కమిషనర్ ఏకపక్షంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేయగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని కచ్చితంగా సంప్రదించిన తరువాతే ఎన్నికల కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని న్యాయస్థానం ఆదేశించింది. కానీ, రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా ప్రస్తుతం ఎన్నికలు జరిపేందుకు అనువైన పరిస్థితుల్లేవని, అనుకూల పరిస్థితులు ఏర్పడిన వెంటనే తెలియజేయగలమని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 2020 అక్టోబరు 28న లిఖిత పూర్వకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు తెలియజేశారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా, ఏకపక్షంగా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు శుక్రవారం షెడ్యూలు ప్రకటించారు. ఎలక్షన్ కమిషనర్ వాస్తవాలను విస్మరించడమే కాకుండా, తాను ముందుగానే నిర్ణయించుకున్న విధంగా ఉద్దేశపూర్వక చర్యలకు పాల్పడుతున్నారు. ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి అధికార దురహంకారంతో వ్యవహరిస్తున్నారు’. హైకోర్టు ఉత్తర్వులూ బేఖాతరు ‘కోవిడ్ వ్యాక్సినేషన్పై కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగాలేదని.. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమై ఉంటుందని ప్రభుత్వం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా ఎస్ఈసీకి మూడ్రోజుల్లోపు అందజేయాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. ఈ ఉత్తర్వుల కాపీ ఈ నెల 5న ప్రభుత్వానికి అందగా.. 7న తన అభిప్రాయాలను రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈసీకి తెలియజేసింది. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం 13న ప్రారంభిస్తున్న నేపథ్యంలో.. జనవరి 13 తరువాత సంప్రదింపులకు సమయం కేటాయించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కోరాం. కానీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ 8వ తేదీనే సంప్రదింపులకు హాజరుకావాలని, లేదా తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలియజేయటం ఏకపక్ష నిర్ణయమే. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, తాను శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కలిసి రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితులను.. వ్యాక్సినేషన్ ఆవశ్యకతను వివరించాం. కనీసం మొదటి దశ వాక్సినేషన్ కార్యక్రమం పూర్తయ్యే వరకు ఎన్నికలను వాయిదా వేయాల్సిందిగా కోరినా పట్టించుకోలేదు’.. అని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆ ప్రకటనలో వివరించారు. -
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్పై ఫిర్యాదు..
సాక్షి, విజయవాడ: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్పై సూర్యారావుపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ప్రభుత్వాన్ని మోసం చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ నిమ్మగడ్డపై ఏపీ ప్రజా న్యాయవేదిక అధ్యక్షుడు బి.శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లో ఉంటూ విజయవాడలో ఉన్నట్లుగా ఇంటి అద్దె తీసుకున్నందుకు నిమ్మగడ్డపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో శ్రీనివాసరావు పేర్కొన్నారు. -
నిమ్మగడ్డ రమేష్ది మోసమే..!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ రాష్ట్రంలో నివసించడం లేదని, కానీ ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా మోసం చేస్తూ ప్రతి నెలా ఇంటి అద్దె అలవెన్స్ పొందుతున్నారని సమాచార హక్కు ఉద్యమ ఐక్య వేదిక (యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్), గవర్నర్ విశ్వభూషణ్కు ఫిర్యాదు చేసింది. నిమ్మగడ్డపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ ప్రభుత్వం నుంచి పొందుతున్న వేతన వివరాలను సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం ద్వారా తీసుకున్న వేదిక ప్రతినిధులు.. ఆ వివరాల కాపీలను ఫిర్యాదుకు జత చేశారు. ఉన్నత స్థాయి వ్యక్తులు ఆదర్శంగా ఉండాలి గవర్నర్కు ఫిర్యాదు అనంతరం వేదిక ప్రతినిధులు జంపాన శ్రీనివాసగౌడ్, కేఎండీ నస్రీన్ బేగంలు ఆ వివరాలను సోమవారం ఒక ప్రకటన రూపంలో మీడియాకు విడుదల చేశారు. ప్రకటనలో ఏముందంటే.. ► రాజ్యాంగబద్ధమైన ఉన్నత స్థాయి పదవులలో ఉన్న వ్యక్తులు అధికారులకు, ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. ► తాము ఆర్టీఐ చట్టం ద్వారా పొందిన వివరాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెలా రూ. 3,19,250 జీతం పొందుతున్న నిమ్మగడ్డ రమేష్ అసలు రాష్ట్రంలోనే నివాసం ఉండడం లేదు. రాజధాని హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చినప్పటి నుంచి, ఇక్కడ సరైన సౌకర్యాలు లేనప్పటికీ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర ఉన్నత స్థాయి అధికారులు విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లోనే నివాసం ఉంటున్నారు. ► రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం కూడా హైదరాబాద్ నుంచి విజయవాడకు మారినా ఎన్నికల కమిషనర్ మాత్రం హైదరాబాద్ నుంచి విజయవాడకు ఇప్పటివరకు మారలేదు. హైదరాబాద్లో ఉండడం సమంజసమా? ► స్థానిక ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించాల్సిన కమిషనర్ రాష్ట్ర ప్రజలకు ఏ మాత్రం అందుబాటులో లేకుండా హైదరాబాద్లో నివాసం ఉండడం ఎంతవరకు సమంజసం? ఆయన ఎందుకు హైదరాబాద్ వీడేందుకు ఇష్టపడడం లేదు? ► హైదరాబాద్లో ఉంటున్నా.. ప్రతి నెలా ఇక్కడ ఇంటి అద్దె అలవెన్స్ను తీసుకుంటున్నందున, ఇప్పటివరకు ఆయనకు చెల్లించిన ఆ అలవెన్స్ మొత్తాన్ని రికవరీ చేయాలి. ప్రభుత్వాన్ని మోసగించి ఇంటి అద్దె పొందుతున్న నిమ్మగడ్డపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. -
‘స్థానికం’పై అసెంబ్లీ తీర్మానం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ అనుమతితోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన శనివారం గవర్నర్ హరిచందన్కు లేఖ రాసినట్లు రమేష్ సన్నిహితుల ద్వారా తెలిసింది. అసెంబ్లీ తీర్మానాన్ని అడ్డం పెట్టుకొని.. ప్రభుత్వ అనుమతితోనే ఎన్నికలు జరపాలని ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే, దాన్ని తిరస్కరించాలని లేఖలో నిమ్మగడ్డ పేర్కొనట్టు సమాచారం. అసెంబ్లీలో అలాంటి తీర్మానం చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడినట్లు తెలిసింది. -
ఎన్నికలకు సహకరించండి
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వపరంగా సహకరించడంతో పాటు అవసరమైన నిధులను కేటాయించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ సోమవారం మరోసారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ రాశారు. రెండు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు వెలువరించిన తీర్పును ప్రస్తావిస్తూ.. కోర్టు తీర్పునకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వపరంగా సహకరించాలని ఆ లేఖలో సూచించారు. ఎన్నికల నిర్వహణకు ఎంత ఖర్చవుతుందనేది పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ద్వారా ప్రభుత్వమే అంచనా వేయించి, ఆ మొత్తాన్ని కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు అన్ని జిల్లాలో తగిన ఏర్పాట్లు చేపట్టేలా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని కూడా పేర్కొన్నారు. సీఎస్కు రాసిన లేఖతో కోర్టు తీర్పు కాపీని కూడా జత చేసినట్టు తెలిసింది. కొత్త ఓటర్ల జాబితా సిద్ధం చేయాలి కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం గ్రామ పంచాయతీల వారీగా కొత్త ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ అధికారులకు ‘డైరెక్షన్’ పేరుతో ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతిపాదించామని, దీనికి వీలుగా డిసెంబర్ 21 తేదీ నాటికి గ్రామ పంచాయతీల వారీగా కొత్త ఓటర్ల జాబితా మాస్టర్ కాపీలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయని కారణంగా ఆ ఎన్నికలకు కొత్త ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని సూచించారు. -
ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్పై హై డ్రామా
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోవాలనే నియమ నిబంధనలు, గతంలోనే సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని పక్కనపెట్టి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏకపక్షంగా ముందుకు వెళ్తున్నట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికలపై మొండిగా వ్యవహరిస్తూ వీడియో కాన్ఫరెన్స్లకు సిద్ధం కావడం.. రద్దు చేసుకున్న సమావేశాలను మరుసటి నిర్వహిస్తానంటూ మళ్లీ వెంటనే పేర్కొనడం.. ఇలా ఎవరో ప్రేరేపించినట్లుగా ఆయన లేఖలు రాస్తుండటం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రద్దు చేసి మళ్లీ అంతలోనే... పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి బుధవారం ఉన్నతాధికారులతో నిర్వహించాలని భావించిన వీడియో కాన్ఫరెన్స్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్కుమార్ హైడ్రామా మధ్య చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మొండిగా ముందుకెళ్లాలనే యోచనలో ఉన్న ఆయన దీన్ని నేడు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. విశ్వసనీయ వివరాల ప్రకారం.. రద్దు చేసుకున్న ఆ సమావేశాన్ని తిరిగి గురువారం నిర్వహిస్తానంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ మరోసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ రాశారు. ఎన్నికల ఏర్పాట్లపై చర్చించేందుకు ఉదయం 10 – 12 గంటల మధ్య దీన్ని నిర్వహించ తలచినట్లు పేర్కొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో సీఎస్కు సూచించారు. చాంబర్కే పరిమితం.. ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై చర్చించేందుకు బుధవారం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల మధ్య వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు ఆయా అధికారులందరికీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ మంగళవారమే లేఖలు రాశారు. అయితే ఒకదాని వెంట ఒకటిగా రోజంతా చోటు చేసుకున్న పరిణామాల తరువాత నిర్ణీత సమయానికి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించకుండా నిమ్మగడ్డ తన ఛాంబర్కే పరిమితమయ్యారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆ సమావేశాన్ని నిర్వహించకుండా విరమించుకున్నట్లు అనంతరం కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి వాణీమోహన్ సాయంత్రం 3 గంటల వరకు కార్యాలయంలోనే అందుబాటులో ఉండి తర్వాత వెళ్లిపోయారు. రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులకు తోడు సెకండ్ వేవ్ రూపంలో మరోసారి వైరస్ ప్రబలుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావడంపై ప్రభుత్వపరంగా అభ్యంతరాలు తెలియజేస్తూ సీఎస్ సాహ్ని మంగళవారమే రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ప్రత్యుత్తరం రాశారు. గవర్నర్తో నిమ్మగడ్డ భేటీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం ఉదయం 11.30 గంటలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్తో భేటీ అయ్యారు. అరగంట ముందే రాజ్భవన్ చేరుకున్న ఆయన 20 నిమిషాల పాటు గవర్నర్తో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు వీలుగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తగిన చర్యలు చేపట్టాలని గవర్నర్కు లేఖ సమర్పించారు. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు కొనసాగుతున్నాయని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలు, పంచాయతీలకు మళ్లీ తాజాగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు వీడియో కాన్ఫరెన్స్కు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తనకు ప్రత్యుత్తరం ఇవ్వడంపై గవర్నర్కు నిమ్మగడ్డ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇలా వ్యవహరించడం చట్ట విరుద్ధమంటూ అంతకుముందు ఆయన సీఎస్కు ఎస్సెమ్మెస్ చేసినట్లు తెలిసింది. -
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
-
హైదరాబాద్: మోగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా!
-
మోగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నగారా మోగనుంది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ప్రకటించారు. డిసెంబర్ 6 లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 1న ఓటింగ్ నిర్వహించి, డిసెంబర్ 4 న కౌంటింగ్ చేపట్టే దిశగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. మొత్తం 14 రోజుల్లో ఎన్నికల ప్రక్రి ముగియనుంది. బ్యాలెట్ పద్ధతిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ప్రక్రియ జీహెచ్ఎంసీ పరిధిలో 74 లక్షల 4 వేల మందికి పైగా ఓటర్లున్నారు. అత్యధికంగా మైలార్దేవ్పల్లిలో 79,290 మంది ఓటర్లున్నారు. అత్యల్పంగా రామచంద్రాపురంలో 27,997 మంది ఓటర్లున్నారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న డివిజన్గా బన్సీలాల్పేట్. ఇక గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే నగరవాసులకు ఆస్తి పన్నులో మినహాయింపు, పారిశుద్ధ్య కార్మికుల జీతాల పెంపు వంటి తాయిలాలు ప్రకటించింది. ఎల్ఆర్ఎస్ పథకాన్ని తీసుకొచ్చింది. రూ.10 వేల చొప్పున వరద సాయం అందించింది. అయితే, దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ చేతిలో పరాభవం ఎదువడంతో కారు పార్టీలో కొంత కలవరం మొదలైంది. పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులు శాయశక్తులా శ్రమించినా విజయం దక్కలేదు. దీంతో కారు పార్టీ మరింత అప్రమత్తమైంది. బల్దియా ఎన్నికల్లో 17 మంది మంత్రులను ఇంచార్చిలుగా టీఆర్ఎస్ నియమించనుంది. ఒక్కో డివిజన్కు ఒక్కో ఎమ్మెల్యేను బాధ్యుడిగా చేయనుంది. ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు దుబ్బాకలో సంచలనం విజయం సాధించిన బీజేపీ గ్రేటర్ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ శ్రేణులు పోటీకి తయారవుతున్నాయి. (చదవండి: టీఆర్ఎస్లో 16, ఎంఐఎంలో 13 మంది నేరచరితులు) -
జీహెచ్ఎంసీ ఎన్నికలకు రంగం సిద్ధం
-
ఆ విషయంలో పునరాలోచన చేయాలి
సాక్షి, విశాఖపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై ఎన్నికల కమిషన్ పునరాలోచన చేయాలని ఏపీ బీసీ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు పోలాకి శ్రీనివాస్ కోరారు. కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తగదని, కరోనా తగ్గిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే మంచిదని పేర్కొన్నారు. రోజుకి మూడు, నాలుగు వేలు కరోనా కేసుల నేపథ్యంలో ఎన్నికల వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో ఉద్యోగులను బలి చేయొద్దని కోరారు. -
గుజరాత్లో వాయిదా .. రాష్ట్రంలో బేఖాతరు
సాక్షి, అమరావతి: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇటీవల కేసులు కొంత తగ్గుముఖం పట్టినా ఢిల్లీ, కేరళ వంటి కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా సెకండ్ వేవ్ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని గుజరాత్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వాయిదా వేశారు. గుజరాత్తో పోల్చుకుంటే మన రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. అక్కడికంటే మూడు, నాలుగు రెట్లు అధికంగా కేసులు నమోదవుతున్నాయి. గుజరాత్లో ప్రస్తుతం రోజుకు వెయ్యిలోపు కేసులు నమోదవుతుంటే, మన రాష్ట్రంలో ప్రతిరోజూ దాదాపు మూడు వేల కేసులు నమోదవుతున్నాయి. ఇది పట్టించుకోకుండా స్థానిక ఎన్నికల విషయంలో మన రాష్ట్ర ఎన్నికల కమిషన్ అవలంభిస్తున్న వైఖరిపై రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. అప్పుడు వాయిదావేసి ఇప్పుడు పట్టించుకోకుండా.. గుజరాత్లో 31 జిల్లా పంచాయతీలు, 231 తాలుకా పంచాయతీలు, 55 మున్సిపాలిటీలకు సంబంధించి ప్రస్తుత సభ్యుల పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్ రెండో వారంతో ముగుస్తోంది. అయినప్పటికీ కరోనా వల్ల ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు వాయిదా వేసింది. 20 రోజుల క్రితమే అక్కడి ఎన్నికల కమిషనర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 2018 ఆగస్టు 1 నాటికే (రెండేళ్ల మూడు నెలల క్రితమే) గ్రామ పంచాయతీలు, జూలై 5వ తేదీ (ఏడాది నాలుగు నెలల కిత్రమే) నాటికే మండల, జిల్లా పరిషత్లు, మున్సిపల్ కార్పొరేషన్ల పదవీ కాలం ముగిసిపోయింది. అయినా చంద్రబాబు, ప్రసుత్త రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ హయాంలో ఇన్నాళ్లూ ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. దీంతో ప్రస్తుతం ఇన్చార్జిల పాలన కొనసాగుతోంది. ఎట్టకేలకు ఈ ఏడాది మార్చిలో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. నామినేషన్లు కూడా ముగిశాయి. అయితే కరోనా పేరుచెప్పి నిమ్మగడ్డ అర్ధంతరంగా ఎన్నికలు వాయిదా వేశారు. రోజుకు 2, 3కేసులు నమోదవుతున్న సమయంలో ఎన్నికలు వాయిదా వేశారు. అలాంటిది ఇప్పుడు రోజుకు 3 వేల కేసులు నమోదవుతున్నాయి. అయినా కూడా ఎన్నికల ప్రక్రియను కొనసాగించేందుకు కమిషనర్ ప్రయత్నించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సమంజసం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వలస వెళ్లిన వారితో ముప్పు! రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరిగితే ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన ఓటర్లు గ్రామాలకు వస్తే, ప్రభుత్వం ఎంత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా కరోనా విజృంభణకు అవకాశాలు ఉంటాయనే ఆందోళన అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. లాక్డౌన్ ఎత్తివేత తర్వాత గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో వలస కూలీలు తిరిగి ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. ఈ సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ఒకట్రెండు ఓట్లపై కూడా గెలుపోటములు ఆధారపడి ఉండే స్థానిక సంస్థల ఎన్నికల్లో తలపడే అభ్యర్థులు.. తమ ఓటర్లు దేశంలోని ఏ ప్రాంతంలో ఉన్నా వారిని పోలింగ్ రోజుకల్లా రప్పించేందుకు ప్రయత్నిస్తుంటారు. అదే జరిగితే ఉత్పమన్నమయ్యే పరిస్థితులను కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పరిగణనలోకి తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. -
ఏపీలో పనిచేస్తూ.. హైదరాబాద్లో నివాసమా!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ హైదరాబాద్లోని తన ఇంటిని తన అధికారిక నివాసంగా భావించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇలా కోరడం వింతగా ఉందని తెలిపింది. ఎన్నికల కమిషనర్గా ఆంధ్రప్రదేశ్లో బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని, అలాంటప్పుడు హైదరాబాద్లోని తన నివాసాన్ని అధికారిక నివాసంగా భావించాలని కోరడం ఎంత మాత్రం అర్థంకాని విషయమని పేర్కొంది. ఎన్నికల కమిషన్కు మంజూరు చేసిన రూ.40 లక్షలు విడుదల చేసేలా, ఎన్నికల నిర్వహణ విషయంలో సహాయ, సహకారాలను అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపి, తీర్పు రిజర్వ్ చేసిన జస్టిస్ బట్టు దేవానంద్.. మంగళవారం తీర్పు వెలువరించారు. రాజ్యాంగ నిబంధనలకు, చట్టాలకు లోబడి విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్పై ఉందని తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేసిన అభ్యర్థనల పట్ల ప్రభుత్వం సరిగా స్పందించడం లేదన్నారు. వ్యవస్థలే శాశ్వతం తప్ప, ఆయా హోదాల్లో ఉన్న వ్యక్తులు శాశ్వతం కాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని, రాష్ట్ర ఎన్నికల కమిషన్.. రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేసే సంస్థ కాదని, అది స్వతంత్ర హోదా కలిగిన వ్యవస్థ అన్నారు. ఎన్నికల కమిషన్ విధులను స్వేచ్ఛగా నిర్వర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరమన్నారు. ఆర్థిక, ఆర్థికేతర అంశాలకు సంబంధించి ఏ రకమైన సహాయ, సహకారం కావాలో మూడురోజుల్లో ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వాలని ఎన్నికల కమిషన్ను, వినతిపత్రం అందుకున్న తరువాత ఎన్నికల కమిషన్కు సహకారాలను అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ ఉత్తర్వులను అమలయ్యేలా చూసి, అమలు విషయంలో 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ప్రజాస్వామ్య పునాదులను సత్యం, న్యాయం ద్వారా నిలబెట్టేందుకు ఏర్పాటైన రాజ్యాంగ వ్యవస్థల మహత్తును, హుందాతనాన్ని, సమగ్రతను పరిరక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. -
నిమ్మగడ్డను ఎలా విశ్వసించాలి?
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వంపై కోర్టులకు వెళ్లి, టీడీపీ నేతలను హోటళ్లలో కలుస్తున్న ఎన్నికల కమిషనర్ను ఎలా విశ్వసించగలమని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రపంచ బ్యాంకు నిధులతో విశాఖలో నిర్వహిస్తున్న బీచ్ ఫ్రంట్ రీడెవలప్మెంట్ ప్రాజెక్టుపై మంత్రి బొత్సతో పాటు ముత్తంశెట్టి శ్రీనివాసరావు బుధవారం జీవీఎంసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం బొత్స మాట్లాడుతూ ఓ వ్యక్తి తీసుకున్న నిర్ణయం వల్ల రూ.3,200 కోట్లు ప్రజాధనం వృథాగా పోయిందన్నారు. రాజకీయ పార్టీలను గానీ, ప్రభుత్వ అభిప్రాయాల్ని అడగకుండానే గతంలో ఎన్నికలు ఎలా రద్దు చేశారని నిమ్మగడ్డను ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో కేసులున్నప్పుడు ఎన్నికలు వాయిదా వేసి.. ఇప్పుడు వేలల్లో వస్తున్నప్పుడు నిర్వహిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమో ఎన్నికల కమిషనర్ చెప్పాలన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పూర్తయిన టిడ్కో గృహాల లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలు అందిస్తామని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా నూరు శాతం విజయం సాధిస్తామని బొత్స ధీమా వ్యక్తం చేశారు. -
ఇప్పట్లో ఎన్నికలు కష్టం
సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణకు దేశంలోనే అత్యుత్తమ స్థాయిలో అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని, ఈ సమయంలో ఎన్నికల నిర్వహణకు అనువైన వాతావరణం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్కు స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన సమయంలో మార్చిలో రాష్ట్రంలో కరోనా కేసులు కేవలం 26 మాత్రమే ఉండగా తాజాగా 26,622 యాక్టివ్ కేసులున్నాయని మొత్తం 8,14,774 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనమని పేర్కొంది. ప్రభుత్వం వైరస్ నియంత్రణకు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా రోజుకు సగటున 20 వరకు మరణాలు నమోదవుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు అనువైన వాతావరణం లేదని పేర్కొంటూ సీఎస్ నీలం సాహ్ని బుధవారం సాయంత్రం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ను ఆయన కార్యాలయంలో కలసి నివేదిక ఇచ్చారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడ్డారని, విధి నిర్వహణలో ఉన్న 11 వేల మందికి పైగా పోలీస్లకు కోవిడ్ సోకిందని సీఎస్ నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. కోవిడ్ తీవ్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు ఏర్పడగానే ఎన్నికల కమిషన్కు తెలియచేస్తామని పేర్కొన్నట్లు తెలిసింది. వైరస్ తీవ్రత అధికంగా ఉన్నందున ఈ సమయంలో ఎన్నికల నిర్వహణ సరికాదని తాజాగా నిమ్మగడ్డ నిర్వహించిన సమావేశంలో దాదాపు అన్ని పార్టీలు కూడా ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. అసలు ఎన్నికలు ఎలా నిర్వహిస్తారో ముందు ఎస్ఈసీ తేల్చి చెప్పాకే తమ అభిప్రాయాన్ని తెలియచేస్తామని పార్టీలు పేర్కొన్నాయి. టీడీపీ మినహా ఎవరూ ఈ సమయంలో ఎన్నికలకు మొగ్గు చూపలేదు. ఉనికిలో లేని పార్టీలతో... గుర్తింపు పొందిన పార్టీలంటూ రాష్ట్రంలో ఏమాత్రం ఉనికిలో లేని రాజకీయ పక్షాలను పిలిచి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ సమావేశాలను నిర్వహించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. భేటీకి ఆహ్వానించిన 19 పార్టీల్లో 10 పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల పోటీలో కూడా లేకపోవడం గమనార్హం. ఒక్కో పార్టీ ప్రతినిధితో విడివిడిగా ఏకాంతంగా సమావేశాన్ని నిర్వహించిన ఎస్ఈసీ వేల సంఖ్యలో ప్రజలు గుమిగూడేందుకు అవకాశం ఉన్న స్థానిక ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావడం విస్మయం కలిగిస్తోంది. మరోవైపు నవంబర్లో కరోనా రెండో దశ వ్యాప్తి మొదలు కానుందనే భయాందోళనలున్నాయి. ఈ సమయంలో తక్షణమే ఎన్నికలంటూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడేలా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతా ఏకపక్షమే.. సంప్రదాయం ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంతో చర్చించి సంప్రదింపుల అనంతరం ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాల్సిన ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ మొక్కుబడి తంతుగా పార్టీలతో ఈ సమావేశాన్ని నిర్వహించింది. ప్రభుత్వం అభిప్రాయాన్ని తీసుకున్నాక అవసరమైన పక్షంలో అఖిలపక్ష భేటీ నిర్వహించాల్సి ఉండగా నిమ్మగడ్డ అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. అంతకుముందు స్థానిక ఎన్నికలను అర్థాంతరంగా వాయిదా వేసే సమయంలో కూడా నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని సంప్రదించకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈసారి కూడా ఆయన అదే ధోరణిలో వ్యవహరించారు. చదవండి: అది చంద్రబాబు.. నిమ్మగడ్డ జాయింట్ కమిషన్ -
అప్పుడలా.. ఇప్పుడిలా!?
రాష్ట్రంలో కరోనా ప్రభావం మొదలైన సమయంలో రోజుకు కేవలం ఒకటి, రెండు కేసులు మాత్రమే నమోదవుతున్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషనర్ ముందుకు రాలేదు. ఎవరినీ సంప్రదించకుండా వాయిదా వేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో శ్రమపడి, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని కరోనా తీవ్రతను తగ్గించినప్పటికీ ప్రస్తుతం రోజుకు 4 వేల కేసులు నమోదవుతున్నాయి. 31 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇలాంటి సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల నిర్వహణపై ముందుకు వెళుతూ పోలింగ్కు సంసిద్ధత వ్యక్తం చేస్తుండటం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వాయిదా పడ్డ స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ ఈ నెల 28వ తేదీన రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసినట్టు ప్రకటించడం పట్ల రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఈవీఎం మిషన్లతో జరిగే బిహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను.. బ్యాలెట్ పేపరుతో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు ముడిపెట్టి.. కరోనా విపత్కర పరిస్థితుల్లో తిరిగి ఎన్నికల ఆలోచన చేయడం విడ్డూరమే. ఈవీఎం.. బ్యాలెట్కు ఎంతో తేడా ► ఈవీఎంల ద్వారా జరిగే ఎన్నికల్లో పోలింగ్ సమయంలో ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకునే వీలుంటుంది. బ్యాలెట్ ఎన్నికలలో ఎన్నికల ముందస్తు ఏర్పాట్లు మొదలు పోలింగ్, కౌంటింగ్ వరకు వివిధ దశల్లో ఒక్కో బ్యాలెట్ పేపరు అనేక మంది చేతులు మారే అవకాశం ఉంటుంది. ► ఈ నేపథ్యంలో ఆ పేపరుకు ఏ దశలోనూ శానిటైజ్ చేసే అవకాశం ఉండదు. పైపెచ్చు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలతో పోల్చితే గ్రామ, వార్డు స్థాయిలో జరిగే మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ ఎక్కువగా ఉంటుంది. ఇంటింటి ప్రచారం కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ► ఈ లెక్కన అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియతో పోల్చితే స్థానిక ఎన్నికల వల్ల కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుందని నిపుణుల అభిప్రాయం. అటు ఓటర్లతో పాటు ఇటు ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సిన ఉద్యోగులకు కరోనా ముప్పు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ► రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ మార్చి 15వ తేదీన ఎన్నికలు వాయిదా వేస్తూ.. బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని స్పష్టంగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఎన్నికల రద్దుకు అవకాశమే లేదు ► ఎన్నికలు వాయిదా పడ్డ మార్చి 15వ తేదీ నాటికి.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ఉపసంహరణ తర్వాత మొత్తం 660 జెడ్పీటీసీ స్థానాల్లో 126 స్థానాలు, 10,047 ఎంపీటీసీ స్థానాల్లో 2,363 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఆయా అభ్యర్థులకు ఎన్నికల్లో గెలిచినట్టు జిల్లాల్లో రిటర్నింగ్ అధికారులు ధ్రువీకరణ పత్రాలు కూడా జారీ చేశారు. ► గెలిచినట్టు రిటర్నింగ్ అధికారి ఒకసారి ధ్రువీకరణ పత్రం ఇచ్చాక, సదరు అభ్యర్థి అధికారికంగా గెలుపొందినట్టు లెక్క. గెలిచిన అభ్యర్థిని పదవి నుంచి తొలగించే అధికారం రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఉండదని నిబంధనలు చెబుతున్నాయి. ► గెలిచిన అభ్యర్థిని ఎన్నికల ట్రిబ్యునల్ ద్వారా లేక అనర్హత వేటు ద్వారా మాత్రమే ఆయా పదవుల నుంచి తొలగించవచ్చు. ► ఏవైనా బలమైన కారణాలు ఉంటే ఒకటి, రెండు చోట్ల ఎన్నికలను రద్దు చేసే అధికారం ఉండొచ్చు కానీ, జెడ్పీటీసీ సభ్యుల్లో 19 శాతం మంది, ఎంపీటీసీ సభ్యుల్లో 23 శాతం మంది గెలిచిన తర్వాత ఆ ఎన్నికలన్నింటినీ మూకుమ్మడిగా రద్దు చేసే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉండదు. ► ఒకసారి ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక ఏకగ్రీవమైనవి కాకుండా మిగిలిన చోట్ల ఎన్నికలు రద్దు చేయాలంటే, రాష్ట్ర ఎన్నికల కమిషన్.. పోటీ చేసే అభ్యర్థులందరి అభిప్రాయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. ఇందుకు భిన్నంగా ఏ నిర్ణయం తీసుకున్నా, అభ్యర్థులు కోర్టుకు వెళితే న్యాయం వారి వైపే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కంటైన్మెంట్ ఏరియాల్లో ఇప్పటికీ పూర్తి స్థాయి ఆంక్షలు ► రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా పడినప్పడు దేశంలోనే ఎక్కడా లాక్డౌన్ అమలు కాలేదు. మార్చి 15న ఎన్నికలను వాయిదా వేస్తే.. మార్చి 23వ తేదీ నుంచి దేశంలో లాక్డౌన్ అమలులోకి వచ్చింది. ప్రస్తుతం దేశమంతటా అన్లాక్ కార్యక్రమం కొనసాగుతున్నా, కరోనా కేసులు నమోదవుతున్న కంటైన్మెంట్ జోన్లలో ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఆంక్షలు అమలులో ఉన్నాయి. ► అక్టోబర్ 22వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 2,244 కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఈ జోన్ల పరిధిలో స్థానిక ఎన్నికలు జరపడం ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్న తలెత్తుతోంది. ► రాష్ట్రంలో 2018 ఆగస్టు 1వ తేదీ నాటికే గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీ కాలం ముగిసింది. అప్పుడు ఎన్నికల నిర్వహణపై కాలయాపన చేసి, ఇప్పుడు విపత్కర పరిస్థితుల్లో ఎన్నికలంటూ త్వరపడటం గమనార్హం. -
నిర్దిష్టంగా చెప్పకుండా ఆరోపణలా?
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం సహకరించడం లేదని, నిధులు విడుదల చేసి తగిన సహకారం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. కాగా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఎన్నికల కమిషన్కు అలవాటుగా మారిందని ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ హైకోర్టుకు బుధవారం నివేదించారు. రెండు గంటల్లోనే కమిషన్ ఖాతాలో నిధులు జమ చేశామని తెలిపారు. ప్రభుత్వం ఏ విషయంలో సహకరించడం లేదు? ఎలాంటి సహకారం కావాలి? అనే విషయాలను నిర్దిష్టంగా చెప్పకుండా ఆరోపణలు చేయడం దారుణమన్నారు. ఎన్నికల కమిషన్కు సహాయ, సహకారాలు అందిస్తూనే ఉన్నామని తెలిపారు. ఈ సమయంలో హైకోర్టు స్పందిస్తూ... ప్రతి దానికీ ప్రభుత్వాన్ని అడుక్కోవాలా? అని వ్యాఖ్యానించింది. రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్కు సహకరించడం ప్రభుత్వ బాధ్యత కాదా? అని ప్రశ్నించింది. అయితే న్యాయస్థానం అలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని, ప్రభుత్వానికి తన బాధ్యతలు స్పష్టంగా తెలుసని, తమ స్థాయిలో సహకరిస్తూనే ఉన్నామని సుమన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఏ సహకారం అందడం లేదు? ఏ రకమైన సహకారం కావాలి? అనే అంశాలను వివరిస్తూ అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని నిమ్మగడ్డను ఆదేశిస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. కమిషన్ ఖాతాలో రూ.39.64 లక్షలు జమ.. ఎన్నికల కమిషన్కు రూ.40 లక్షలు మంజూరు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నిధులు విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించడంతో పాటు ఎన్నికల నిర్వహణ విషయంలో సహాయ, సహకారాలను అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ సోమవారం స్వయంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు రాగా మంజూరైన నిధులను రెండు గంటల్లో కమిషన్ ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఈ క్రమంలో బుధవారం విచారణ సందర్భంగా రూ.40 లక్షలకుగాను రూ.39.64 లక్షలు జమ అయినట్లు నిమ్మగడ్డ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మిగిలిన రూ.36 వేలు ఎందుకు నిలిపివేశారో తెలుసుకుని చెబుతానన్నారు. దీంతో ఈ వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. -
సమన్వయంతో పనిచేస్తా: పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల కమిషన్కు రాజ్యాంగం కల్పించిన స్వయం ప్రతిపత్తిని కాపాడుతూ, దాని విధులను నిష్పక్షపాతంగా నిర్వహిస్తానని రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి వ్యాఖ్యానించారు. కమిషన్ గౌరవాన్ని మరింత పెంచేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం, సీఎస్, డీజీపీ, జిల్లాల ఎన్నికల యంత్రాంగం సహకారం, సమన్వయంతో పనిచేస్తామని వెల్లడించారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలోని చాంబర్లో ఎన్నికల కమిషనర్గా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎన్నికలు అత్యంత కీలకం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో రాజ్యాంగం ప్రకారం గడువులోపు స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించే గురుతర రాజ్యాంగ బాధ్యతను నిర్వహించే అవకాశాన్ని కల్పించిన గవర్నర్, సీఎం, ప్రభుత్వానికి ధన్యవాదాలు..’అని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలే ప్రథమ ప్రాధాన్యత ఇక 2021 ఫిబ్రవరి 10వ తేదీతో పదవీ కాలం ముగియనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు నిర్వహించటమే తన ప్రథమ ప్రాధాన్యత అని.. త్వరలోనే జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందిస్తామని పార్థసారథి తెలిపారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్కు అలాగే ఏప్రిల్లో పదవీ కాలం ముగియనున్న సిద్దిపేట మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. (మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ అరెస్ట్) -
పొరపాటును సవరించుకున్నా.. రాద్ధాంతమా?
సాక్షి, అమరావతి: ‘పొరపాటును సవరించుకున్నా ఓ వర్గానికి చెందిన మీడియా రాద్ధాంతం చేయడం దుర్మార్గం’ అని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ‘నిన్న(జులై 22) పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గంటకు కోట్ల రూపాయలు ఫీజులు తీసుకునే న్యాయవాదులను ఎలా పెట్టుకోగలిగారు.. ఆ డబ్బులు ఆయనకు ఎలా వస్తున్నాయి, ఎక్కడ నుంచి వస్తున్నాయి.. అని మాట్లాడుతూ.. న్యాయవాది అనబోయి పొరపాటున జడ్జి అన్న విషయం వాస్తవం. అది పొరపాటు. (రాజ్యాంగ వ్యవస్థకు నిమ్మగడ్డ వ్యతిరేకం) అయితే, వెనువెంటనే నా పొరపాటును సవరించుకుని న్యాయవాది అని చెప్పాను. అయితే దానిని ఓ వర్గం మీడియా రాద్ధాంతం చేయటం దుర్మార్గం. జడ్జిలకు ఫీజులు ఎవరైనా ఇస్తారా..? కనీసం ఆమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా.. నేనేదో అనుచిత వ్యాఖ్యలు చేశానంటూ అభూత కల్పనలు సృష్టించటం బాధ్యతాయుతమైన మీడియా చేసే పని కాదు. ఇప్పటికైనా ఇటువంటి అబద్ధాలు, అసత్య వార్తలకు స్వస్తి చెప్పాలని కోరుతున్నాను.’ అని ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. (ఎస్ఈసీ విషయంలో తగిన నిర్ణయం తీసుకోండి) -
రాజ్యాంగ వ్యవస్థకు నిమ్మగడ్డ వ్యతిరేకం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా చెప్పుకుంటున్న నిమ్మగడ్డ రమేష్కుమార్ తీరు సరిగా లేదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉండాలంటూనే.. హోటళ్లలో టీడీపీ నాయకులతో మంతనాలు జరుపుతుండటంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఎస్ఈసీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా.. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి దానిని గౌరవించాల్సిన పని లేదా అని నిలదీశారు. రాజ్యాంగ వ్యవస్థకు తగ్గట్టుగా ఆయన ప్రవర్తించడం లేదన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా రాజకీయ నాయకులను ఎందుకు రహస్యంగా కలుస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం ► నిమ్మగడ్డ వ్యవహారంలో హైకోర్టు ఆదేశాల్లో ఉన్నదాన్ని పరిశీలించి కన్సిడర్ చేయాలని గవర్నర్ ప్రభుత్వానికి సూచించారు. ఈ విషయంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది కాబట్టి వేచి చూద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వ్యవస్థలకు వ్యతిరేకంగా వ్యవహరించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. మేము వ్యవస్థలను గౌరవిస్తాం. ► హైకోర్టు తీర్పును, గవర్నర్ ఆదేశాలను మేము వ్యతిరేకించడం లేదు. నిమ్మగడ్డ కేసులో హైకోర్టు ఆదేశాలపై మాకు అభ్యంతరాలు ఉన్నాయి. నిమ్మగడ్డ నియామకం వ్యవహారంపై మేము సుప్రీంకోర్టుకు వెళ్లాం. సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం. ఇదే విషయాన్ని తెలియజేస్తాం. ఏం చేయాలనే విషయాన్ని ఏజీ నిర్ణయిస్తారు. ► హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం ఓడిపోయింది.. నిమ్మగడ్డ రమేష్ విజయం సాధించారని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. హైకోర్టు తీర్పు టీడీపీ గెలుపు కాదు.. వైఎస్సార్సీపీ ఓటమి అంతకన్నా కాదు. రమేష్ విజయం అసలే కాదు. ఈ వ్యవహారంలో ప్రజాస్వామ్యం ఓడిపోయింది. ► నిమ్మగడ్డ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కోసం ఎదురు చూడాలి కానీ ఇలా చేయకూడదు. రాజ్యాంగ వ్యవస్థను గౌరవించాల్సిన అవసరం నిమ్మగడ్డకు లేదా? గంటకు కోట్లలో వసూలు చేసే లాయర్లను నిమ్మగడ్డ సుప్రీంకోర్టులో నియమించుకున్నారు. ఎవరితో స్పాన్సర్ చేయించుకుని కోట్లు పెట్టి లాయర్ల ఫీజులు చెల్లిస్తున్నారు? ► స్పష్టంగా రమేష్కుమార్ నైజం బయటపడింది. ఆయన ప్రభుత్వాన్ని ఏ రకంగా వ్యతిరేకిస్తున్నారో చూస్తున్నాము. ఇలాంటి పరిస్థితిలో ఆ పదవికి ఆయన ఏ విధంగా న్యాయం చేస్తారు? నిమ్మగడ్డకు సహకరిస్తున్నది బాబు కాదా? ► నిమ్మగడ్డకు సహకరిస్తున్నది.. డబ్బు ఇస్తున్నది చంద్రబాబు కాదా? ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేందుకు నిమ్మగడ్డ లాంటి వ్యక్తిని చంద్రబాబు అడ్డుపెట్టుకున్నారు. లాయర్ల కోసం నిమ్మగడ్డకు కోట్ల రూపాయల డబ్బు ఎవరు ఇస్తున్నారో చెప్పాలి. ఈ పరిస్థితిలో ఎస్ఈసీ కుర్చీలో నిమ్మగడ్డ కూర్చుంటే అది ఆయన విజయం కాదు.. ప్రజాస్వామ్యం ఓడినట్లే. ► అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఆలోచన. రాష్ట్రంలో సంక్షేమ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. ఏదోరకంగా ప్రభు త్వంపై విషం చిమ్మాలని చూస్తున్నారు. పబ్లిసిటీ కోసం శవాలపై కూడా రాజకీయం చేసే దుర్బుద్ధి చంద్రబాబుది. ► చంద్రబాబుకు అధికారంపోయాక ఏం చేయాలో తెలియక, హైదరాబాద్లో కూర్చొని జూమ్ మీటింగులు పెట్టుకుని ఆ మంత్రిని బర్తరఫ్ చేయాలి.. ఈ మంత్రిని బర్తరఫ్ చేయాలి అంటూ మాట్లాడుతున్నారు. ఏదైనా ఒక నోట్ గవర్నర్ నుంచి వ్యతిరేకంగా వస్తే ‘గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి. గవర్నర్పై నమ్మకం లేదు’ అని మీలా మేము మాట్లాడం. ► కరోనా నేపథ్యంలో కూడా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. రూ.43 వేల కోట్లు ప్రజలకు బదిలీ అయ్యాయి. అన్ని వర్గాల వారికి న్యాయం చేసే దిశగా సీఎం కృషి చేస్తున్నారు. దళితులకు అండగా నిలిచారు. ► మంత్రి పెద్దిరెడ్డికి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మంచి పేరు ఉంది. అదే జిల్లాకు చెందిన చంద్రబాబును మాత్రం రాక్షసుడు అంటారు. ఎందుకో మీరే ఆలోచించు కోవాలి. -
ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డను కొనసాగించొద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్ను కొనసాగించవద్దని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కు విశ్రాంత ఐజీ డాక్టర్ ఆలూరి సుందర్కుమార్ దాస్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఈ–మెయిల్ ద్వారా గవర్నర్కు వినతిపత్రం పంపారు. ► రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను మంత్రిమండలి సిఫారసు మేరకు కాకుండా రాజ్యాంగంలోని అధికరణ 243(కే) ప్రకారం గవర్నర్ తన విచక్షణాధికారం మేరకు మాత్రమే నియమించాలని హైకోర్టు తీర్పునిచ్చిందని దాస్ తన వినతిపత్రంలో పేర్కొన్నారు. ► ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్ నియామకం రాజ్యాంగంలోని అధికరణ 243(కే) ప్రకారం జరగలేదన్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం.. ఎన్నికల కమిషనర్ పదవీ కాలం, సర్వీసు నిబంధనలను రూపొందించే అధికారం మాత్రమే ప్రభుత్వానికి ఉందన్నారు. ► పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్–200 కింద నియమితుడైన ఎన్నికల కమిషనర్.. మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ప్రక్రియను చేపట్టలేరని హైకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. ► నిబంధనల మేరకు నిమ్మగడ్డ రమేశ్ నియామకం జరగనందున ఆయనను ఎన్నికల కమిషనర్గా కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమే కాకుండా హైకోర్టు తీర్పుకు వ్యతిరేకమన్నారు. మా తీర్పును అమలు చేయడం లేదెందుకు? నిమ్మగడ్డ ధిక్కార పిటిషన్పై హైకోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నియామకం విషయంలో తామిచ్చిన తీర్పుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో తమ తీర్పును ఎందుకు అమలు చేయడం లేదని హైకోర్టు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో అధికరణ 243(కే) ప్రకారం గవర్నర్కే అధికారం ఉంటుందన్న తమ తీర్పు మేరకు.. ఎన్నికల కమిషనర్గా కొనసాగే విషయంలో ఆయనను కలవాలని నిమ్మగడ్డకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను సీజే జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం వచ్చే వారానికి వాయిదా వేసింది. -
నిమ్మగడ్డకు సుప్రీంకోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సర్వీసు నిబంధనలు, పదవీ కాలాన్ని సవరిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్, కొత్త ఎన్నికల కమిషనర్గా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లో సుప్రీంకోర్టు నిమ్మగడ్డ రమేష్కుమార్ సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలకు రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ హృషికేష్రాయ్లతో కూడిన ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, రాకేష్ ద్వివేది వాదనలు వినిపించారు. నిమ్మగడ్డ తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, టీడీపీ నేత వర్ల రామయ్య తరఫున ఏకే గంగూలీ, బసవ ప్రభు పాటిల్, పీఎస్ నర్సింహ తదితరులు విచారణకు హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున రోహత్గీ, ద్వివేది వాదనలు వినిపిస్తూ.. ‘కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప గవర్నర్ తన రాజ్యాంగ అధికారాలను మంత్రి మండలి సిఫారసు మేరకే ఉపయోగిస్తారు. షంషేర్ సింగ్ వర్సెస్ పంజాబ్ కేసులో ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు దీనిని స్పష్టం చేస్తోంది. ఎన్నికల కమిషనర్ నియామక అధికారం గవర్నర్కే తప్ప రాష్ట్రానికి లేదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. రమేష్కుమార్ నియామకం కూడా అప్పటి మంత్రి మండలి సిఫారసు మేరకే జరిగింది. కమిషనర్ నియామక సిఫారసు అధికారం మంత్రి మండలికి లేదంటే నిమ్మగడ్డ నియామకం కూడా చెల్లదు. అధికరణ 243కే, అధికరణæ 243 జెడ్ఏ ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం నిర్ణయించే అధికారం రాష్ట్ర శాసన వ్యవస్థకు ఉంది’ అని చెప్పారు. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని రోహత్గీ విన్నవించారు. దర్మాసనం జోక్యం చేసుకుని రాజ్యాంగ నైతికత ప్రాతిపదికన ఆర్డినెన్స్ రద్దు చేయడం తొలిసారి చూస్తున్నామని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. హైకోర్టు తీర్పుపై ప్రస్తుతం స్టే ఇవ్వలేమని, ప్రభుత్వం తన పిటిషన్లో లేవనెత్తిన అంశాలపై లోతుగా విచారించాల్సి ఉందని పేర్కొంది. రెండు వారాల తరువాత పూర్తిస్థాయి వాదనలు వింటామని చెబుతూ నిమ్మగడ్డ తదితరులకు నోటీసులు జారీచేసింది. రెండు వారాల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది. -
నిమ్మగడ్డకు సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆర్డినెన్స్ రద్దు వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది. మంత్రిమండలి సలహా మేరకు గవర్నర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను నియమించడం చెల్లదని హైకోర్టు తీర్పునిచ్చిందని, కోర్టు ఆదేశాల ప్రకారం గతంలో నియమితులైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకం కూడా చెల్లదని ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేది వాదనలు వినిపించారు. కోర్టు తప్పుపట్టిన నిబంధనతో నియమించబడిన రమేష్ కుమార్ తిరిగి ఎలా కొనసాగింపబడతారని ప్రశ్నించారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం.. న్యాయవాది లేవనెత్తిన అంశాలపై రెండు వారాల్లోగా సమధానం చెప్పాలని మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్తో సహా ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. తాజా వివాదంపై పిటిషనర్ (ప్రభుత్వం) లేవనెత్తిన అంశాలపై వాదనలు వింటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇరువర్గాల వాదనలు వినేందుకు నోటీసులు జారీచేశామని తెలిపింది. అలాగే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నిమ్మగడ్డ రమేష్ తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించారు. కాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని, సర్వీసు నిబంధనలను సవరిస్తూ జారీచేసిన ఆర్డినెన్స్ను హైకోర్టు రద్దుచేయడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో జూన్ 1న పిటిషన్ దాఖలు చేసింది. (నిమ్మగడ్డ నియామకమే చెల్లదు) -
'నిమ్మగడ్డ'ను నియంత్రించండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా కొనసాగకుండా నిమ్మగడ్డ రమేశ్కుమార్ను నియంత్రించాలంటూ హైకోర్టులో మంగళవారం మరో పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నియామకం విషయంలో గవర్నర్దే విచక్షణాధికారమని.. ఈ విషయంలో రాష్ట్ర మంత్రిమండలికి ఎటువంటి అధికారం లేదంటూ ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్ కొనసాగడానికి వీల్లేదంటూ రిటైర్డ్ ఐజీ డాక్టర్ ఎ.సుందర్కుమార్ దాస్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును అమలుచేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని.. అందువల్ల ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించకుండా నిమ్మగడ్డ రమేశ్ను నియంత్రిస్తూ ఆదేశాలు జారీచేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిమ్మగడ్డను సంజాయిషీ అడగండి 2016లో అప్పటి మంత్రి మండలి సిఫారసు మేరకు నియమితులైన నిమ్మగడ్డ.. ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా ఏ అధికారంలో ఆ పదవిలో కొనసాగుతున్నారో సంజాయిషీ అడగాలని దాస్ తన కో–వారెంటో పిటిషన్లో హైకోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, ఎన్నికల సంఘం కార్యదర్శులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అలాగే, నిమ్మగడ్డను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు. అంతేకాక.. 2016లో నిమ్మగడ్డ రమేశ్ను ఎన్నికల కమిషనర్గా నియమిస్తూ అప్పటి ప్రభుత్వం జారీచేసిన జీఓ 11ను కొట్టేయాలని కోరారు. ఎస్ఈసీగా ముఖ్య కార్యదర్శి స్థాయికి తక్కువ కాని అధికారిని ప్రభుత్వ సిఫారసు మేరకు గవర్నర్ నియమించాలంటున్న ఏపీ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్–200 (2)ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, దీనిని రద్దుచేయాలని అభ్యర్థించారు. రాజ్యాంగంలోని అధికరణ 243కే(1) ప్రకారం.. ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో విచక్షణాధికారం గవర్నర్దేనని, రాష్ట్రం చేసే చట్టానికి లోబడి కమిషనర్గా నియామకం ఉండాల్సిన అవసరంలేదని వివరించారు. కానీ, ఏపీ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 200 (2) మాత్రం.. మంత్రి మండలి సిఫారసు మేరకు ఎన్నికల కమిషనర్ నియామకం జరగాలని చెబుతోందని, దీని ప్రకారమే 2016లో అప్పటి మంత్రి మండలి సిఫారసు మేరకు నిమ్మగడ్డ రమేశ్ ఎన్నికల కమిషనర్ అయ్యారన్నారు. కానీ, ఎస్ఈసీ నియామకం పూర్తిగా గవర్నర్ విచక్షణపైనే ఆధారపడి ఉంటుందే తప్ప, మంత్రి మండలి సిఫారసు మేరకు కాదని హైకోర్టు తీర్పునిచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ కొనసాగడానికి వీల్లేదని దాస్ అన్నారు. -
ఏస్ఈసీ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: ఏజీ శ్రీరామ్
-
నిమ్మగడ్డ నియామకమే చెల్లదు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్కుమార్ను పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ ఇన్చార్జి కార్యదర్శి జీవీ సాయిప్రసాద్ శుక్రవారం జిల్లా కలెక్టర్లకు జారీచేసిన సర్క్యులర్ను ఉపసంహరించుకున్నట్లు శనివారం ఆయన మరో సర్క్యులర్ను విడుదల చేశారు. ప్రభుత్వం నుంచి తదుపరి సమాచారం వచ్చేవరకు శుక్రవారం నాటి సర్క్యులర్ ఉపసంహరణలో ఉంటుందని తాజా సర్క్యులర్లో సాయిప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారులు, అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి, కమిషనర్కు కూడా తాజా సర్క్యులర్ సమాచారాన్ని ఆయన చేరవేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఎవరిని నియమించాలని సిఫారసు చేసే అధికారం రాష్ట్ర మంత్రి మండలికి లేదని రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో.. అసలు ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్కుమార్ నియామకమే చెల్లదని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ (ఏజీ) సుబ్రహ్మణ్య శ్రీరామ్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో నిమ్మగడ్డ రమేష్ తనను తాను ఎన్నికల కమిషనర్గా పునరుద్ధరించుకుంటూ జారీచేసుకున్న ఉత్తర్వులు కూడా చెల్లవని ఆయన స్పష్టంచేశారు. నిమ్మగడ్డ స్వీయ పునరుద్ధరణ ఉత్తర్వులు చట్ట పరిధిని అతిక్రమించి చేసుకున్న.. అమలుచేయడానికి వీల్లేని ఉత్తర్వులుగా పరిగణించాలని ఆయన తేల్చిచెప్పారు. ఎన్నికల కమిషనర్గా తనను తాను పునరుద్ధరించుకున్న తరువాత నిమ్మగడ్డ జారీచేసిన ఆదేశాలు ఏవీ కూడా చెల్లుబాటు కావన్నారు. ఏపీ పంచాయతీరాజ్ చట్టం–1994లోని సెక్షన్–200 కింద ఎన్నికల కమిషనర్గా ఎవరిని నియమించాలని సిఫారసు చేసే అధికారం, అర్హతలను నిర్ణయించే అధికారం మంత్రి మండలికి లేదన్న హైకోర్టు తీర్పువల్ల, చట్టం వచ్చిన 1994వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల కమిషనర్ల నియామకాలేవీ కూడా చెల్లబోవని ఆయన తెలిపారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు నిలుపుదల కోసం హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసి ఉన్నామని.. ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన వివరించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సర్వీసు నిబంధనలను, పదవీ కాలాన్ని సవరిస్తూ, కొత్త ఎన్నికల కమిషనర్గా జస్టిస్ కనగరాజ్ను నియమిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్, జీఓలను రద్దుచేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై శ్రీరామ్ శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్ చెప్పిన వివరాలిలా ఉన్నాయి.. మాట్లాడుతున్న అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్య శ్రీరామ్. చిత్రంలో గోపాలకృష్ణ ద్వివేది, ప్రవీణ్ ప్రకాష్ 1994 నుంచి నియమితులైన వారికీ ఈ తీర్పు వర్తిస్తుంది.. ‘ఓ ముఖ్య కార్యదర్శి హోదా ఉన్న వ్యక్తిని ఎన్నికల కమిషనర్గా నియమించవచ్చని పంచాయతీరాజ్ చట్టం–1994లోని సెక్షన్–200 చెబుతోంది. అయితే, ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పువల్ల అధికరణ 234కే(2)కు అనుగుణంగా ఎన్నికల కమిషనర్ను నియమించే అధికారం రాష్ట్రానికి లేదన్నది తేలింది. ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారి ఎన్నికల కమిషనర్గా కావడానికి వీల్లేదు. ఎన్నికల కమిషనర్గా నియమించే వ్యక్తి అర్హతలను నిర్ణయించే అధికార పరిధి రాష్ట్రానికి లేనప్పుడు, ముఖ్య కార్యదర్శి హోదాలో ఉన్న వ్యక్తి ఎన్నికల కమిషనర్గా నియమితులై ఉంటే, వారిని నియమించే అధికారం కూడా రాష్ట్రానికి లేదు. చట్ట ప్రకారం ప్రభుత్వానికి ఫలానా అధికారం లేదని కోర్టు తేలిస్తే, ఆ తీర్పు.. ఇప్పటికే నియమితులై వారికీ, ఇకపై నియమితులు కాబోయే వారికీ వర్తిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్–200, 1994 సంవత్సరంలో వచ్చి ఉంటే, అప్పటి నుంచి ఈ తీర్పు వర్తిస్తుంది. దీని ప్రకారం హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు రమేష్కుమార్కు సైతం వర్తిస్తుంది. ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో మంత్రి మండలి, ముఖ్యమంత్రి సిఫారసును గవర్నర్ పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదు, ఇలాంటి నిబంధన ఉండటానికి వీల్లేదని ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ విషయంలోనూ, అధికరణ 243కే విషయంలో కూడా హైకోర్టు చెప్పింది’.. అని శ్రీరామ్ వివరించారు. నిమ్మగడ్డ పేరును చంద్రబాబే సిఫారసు చేశారు ‘నిమ్మగడ్డ రమేష్ నియామకం రమాకాంత్రెడ్డి నియామకం తరువాత జరిగింది. ఇందుకు సంబంధించిన ఫైల్ ఒకటి నడిచింది. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 16.11.2015న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీఆర్ బిశ్వాల్ను ఎన్నికల కమిషనర్గా సిఫారసు చేశారు. ఆ ఫైల్పై చంద్రబాబు సంతకం చేశారు. ఇది జరిగిన సుమారు ఓ నెల తరువాత 12.12.2015న సవరించిన సిఫారసును పంపారు. నిమ్మగడ్డ రమేష్ను ఎన్నికల కమిషనర్గా నియమించాలని సిఫారసు చేస్తున్నామని అందులో పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ను నియమించే విషయంలో రాష్ట్ర మంత్రి మండలి సిఫారసు మేరకు గవర్నర్ నడుచుకోరాదని ఈ తీర్పు చెప్పిందంటే, నిమ్మగడ్డ రమేష్ నియామకం కూడా న్యాయ విరుద్ధమే అవుతుంది. గవర్నర్ తన విచక్షణాధికారం మేరకే వ్యవహరించాలి తప్ప మంత్రి మండలి సిఫారసు మేరకు కాదన్న హైకోర్టు తీర్పును అమలుచేయాల్సి వస్తే, ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ నియామకం ఏ మాత్రం చెల్లుబాటు కాదు’.. అని చెప్పారు. ‘నిమ్మగడ్డ’ఆదేశాలేవీ చెల్లుబాటు కావు ‘అంతేకాదు.. ఎన్నికల కమిషన్కు హైకోర్టులో న్యాయవాది (స్టాండింగ్ కౌన్సిల్)గా వీవీ ప్రభాకరరావు ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తరఫున ఆయన కోర్టులో కౌంటర్లు దాఖలు చేశారు. ఈరోజు ఉదయం నిమ్మగడ్డ రమేష్ తన ఫోన్ నుంచి వీవీ ప్రభాకరరావుకు స్వయంగా ఫోన్చేసి, స్టాండింగ్ కౌన్సిల్ పోస్టుకు రేపటిలోగా రాజీనామా చేయాలని అడిగారు. ఎన్నికల కమిషన్లో కొత్త రక్తం నింపాలని భావిస్తున్నట్లు ఆయనతో నిమ్మగడ్డ రమేష్ చెప్పారు. కొత్త స్టాండింగ్ కౌన్సిల్ను సోమవారం కల్లా నియమించనున్నట్లు నిమ్మగడ్డ చెప్పారు. కొంత సమయం కావాలని ప్రభాకర్రావు కోరినా కూడా నిమ్మగడ్డ గడువు సాధ్యంకాదని స్పష్టంచేశారని ప్రభాకరరావు నాకు చెప్పారు. దీనిపై ప్రభాకరరావు ఏజీగా నన్ను అభిప్రాయం కోరారు. ఎన్నికల కమిషనర్గా స్వీయ పునరుద్ధరణే చెల్లనప్పుడు నిమ్మగడ్డ ఇచ్చే ఇలాంటి ఆదేశాలు చట్ట పరిధిలోకి రావని నేను స్పష్టంగా చెప్పాను. వాటికి లోబడి ఉండాల్సిన అవసరంలేదని స్పష్టంచేశాను. ప్రభుత్వం స్టే కోసం దరఖాస్తు చేసి ఉన్నాం. సుప్రీంకోర్టుకు సైతం వెళ్తున్నాం. నిమ్మగడ్డ చర్యలకు హైకోర్టు తీర్పు మద్దతునిచ్చే విధంగా లేదు. హైకోర్టు తీర్పు అధికారిక కాపీ ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు వచ్చింది. దానిని చదివి ఈ పాయింట్లు లేవనెత్తడం జరిగింది’.. అని శ్రీరామ్ వివరించారు. గడువు విధించనప్పుడు తీర్పు అమలుకు రెండు నెలల గడువు ఉంటుంది ‘హైకోర్టు తీర్పు నేపథ్యంలో పరిస్థితులు ఇలా ఉండటంవల్లే, ఈ తీర్పుపై అప్పీల్కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై నా అభిప్రాయం అడిగారు. నేను స్పష్టంగా చెప్పాను. పరిస్థితులు ఇలా ఉండగా.. నిమ్మగడ్డ రమేష్కుమార్ జారీచేసుకున్న స్వీయ పునరుద్ధరణ ఉత్తర్వులు, ఆ తరువాత జారీచేసిన ఆదేశాలను ఎలా అమలుచేయాలన్న సందిగ్థతతో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి నన్ను అభిప్రాయం కోరారు. కోర్టు ధిక్కార నిబంధనల ప్రకారం.. ఏదైనా తీర్పులో నిర్ధిష్ట కాల వ్యవధిని న్యాయస్థానం విధించకుంటే, ఆ తీర్పును అమలుచేసేందుకు ప్రభుత్వానికి రెండు నెలల గడువు ఉంటుంది. ఒకవేళ న్యాయస్థానం రమేష్ను ఎన్నికల కమిషనర్గా పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసి ఉంటే, అప్పుడు ప్రభుత్వం అందుకు అనుగుణమైన ఉత్తర్వులు జారీచేసి ఉండేది. కానీ, ప్రభుత్వం ఇప్పటివరకు అలా ఉత్తర్వులేవీ ఇప్పటివరకు జారీచేయలేదు. ఈ నేపథ్యంలో.. నిమ్మగడ్డ రమేష్ చేసుకున్న స్వీయ పునరుద్ధరణ ఉత్తర్వులు హైకోర్టు తీర్పునకు అనుగుణంగా లేవు. ఇలాంటి ప్రొసీడింగ్స్ ఆయన ఇవ్వజాలరు. వాటిని అమలుచేయలేని నిర్ణయాలుగా పరిగణించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని నేను ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పాను’.. అని శ్రీరామ్ వివరించారు. -
ఎస్ఈసీ అంశంపై సుప్రీంకు వెళ్తున్నాం: ఏపీ ఏజీ
-
ఆ అధికారం నిమ్మగడ్డకు లేదు: ఏపీ ఏజీ
సాక్షి, అమరావతి: నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య వివాదంపై ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఎన్నికల అధికారిగా తిరిగి బాధ్యతలు చేపట్టినట్లుగా.. నిమ్మగడ్డ రమేష్కుమార్ ప్రకటించుకున్నారని.. హైకోర్టు తీర్పును అనుసరించి ఇది చట్ట విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజయవాడ కార్యాలయం నుంచి సర్క్యులర్ విడుదల చేసి హైదరాబాద్లోని తన ఇంటికి వాహనాలు పంపించాలన్నారు. ఎస్ఈసీగా కొనసాగమని నిమ్మగడ్డ రమేష్కుమార్కు ..హైకోర్టు నేరుగా ఎక్కడా చెప్పలేదు. నిమ్మగడ్డ మాత్రం తనంతట తానే .. బాధ్యతలు స్వీకరించినట్లుగా సర్క్యులర్ విడుదల చేశారు. సుప్రీంకోర్టు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే హైకోర్టులో ఒక పిటిషన్ వేశాం. అప్పటి వరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కూడా కోరాం. రాష్ట్ర ఎన్నికల అధికారిని నియమించే అధికారం రాష్ట్రానికి లేదు అంటే.. నిమ్మగడ్డ రమేష్కుమార్కు కూడా ఈ నిబంధనే వర్తిస్తుంది. అలాంటప్పుడు నిమ్మగడ్డ రమేష్కుమార్ను ప్రభుత్వం ఎలా నియమిస్తుంది? నిమ్మగడ్డ రమేష్కుమార్ను కూడా అప్పటి సీఎం చంద్రబాబు సలహా మేరకే నియమించారు. గవర్నర్ నిర్ణయంలో మంత్రి మండలి సలహా అవసరం లేదంటే.. అప్పటి సీఎం చంద్రబాబు ఇచ్చిన సలహా కూడా చెల్లదు. నిమ్మగడ్డ రమేష్కుమార్ నియామకం కూడా చెల్లదు. హైకోర్టు తీర్పులో కాలవ్యవధి స్పష్టంగా చెప్పకుంటే.. 2 నెలల కాలవ్యవధి ఉంటుంది. హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేష్కుమార్ స్వీయ నియామకం చేసుకునే అధికారం లేదు. ఎస్ఈసీ స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్న ప్రభాకర్ను రేపటిలోగా రాజీనామా చేయమని నిమ్మగడ్డ రమేష్కుమార్ ఆదేశించారు. ఈ విషయం ప్రభాకర్ నాకు ఫోన్ చేసి చెప్పారు. నాకు కొంత సమయం కావాలని ప్రభాకర్ నిమ్మగడ్డను కోరారు. నిమ్మగడ్డ రమేష్కుమార్ మాత్రం రేపటిలోగా రాజీనామా చేయమని ఆదేశించారు. తాజా తీర్పుపై స్టే ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం హైకోర్టును కోరింది. ఎస్ఈసీ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్తున్నాం. హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేష్కుమార్ నియామకం కూడా చట్ట విరుద్ధం. సాధారణంగా ప్రభుత్వ న్యాయనిపుణులు ఎప్పుడూ మీడియా ముందుకు రారు. కానీ ఇది రాజ్యాంగ అంశాలు... హైకోర్టు తీర్పుతో కూడినందున మీడియా ముందుకు రావాల్సివచ్చింది. నిమ్మగడ్డ రమేష్కుమార్ స్వీయ ప్రకటితం చేసుకోవడం చట్టవిరుద్ధమని ప్రభుత్వానికి చెప్పాను. ఎవరిని ఎస్ఈసీగా నియమించాలనే విషయంలో... రాష్ట్ర ప్రభుత్వానికి జోక్యం చేసుకునే అధికారం లేదని హైకోర్టు చెప్పింది. అదే విషయం నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకంలోనూ వర్తిస్తుంది’ అని శ్రీరామ్ అన్నారు. (చదవండి: ఎన్నికల కమిషనర్ ‘ఆర్డినెన్స్’ రద్దు) -
పారదర్శకంగా ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణకే సంస్కరణలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విప్లవాత్మక సంస్కరణల అమలులో భాగంగానే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా హైకోర్టు రిటైర్డు జడ్జి వి.కనగరాజ్ను సర్కారు నియమించింది. హైకోర్టు రిటైర్డు జడ్జి పర్యవేక్షణలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడంవల్ల పోటీచేసే అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజాస్వామ్యవాదులు ప్రశంసించారు. కానీ.. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్కుమార్ను కొనసాగించాలని శుక్రవారం హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై వివిధ పార్టీల ప్రముఖులు స్పందిస్తూ తమ అభిప్రాయాలు తెలిపారు. టీడీపీకి అనుకూలంగా నిమ్మగడ్డ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా విధులు నిర్వహించే క్రమంలో నిమ్మగడ్డ రమేశ్కుమార్ టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని, వాటికి సంబంధించి పలు ఆధారాలు కూడా ఉన్నాయని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. రాజ్యాంగ పదవిని నిర్వహించే వారికి రాజ్యాంగ విధులు తెలిసి ఉండాలనే అంశాన్ని నిమ్మగడ్డ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ రాజ్యాంగబద్ధమే: ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్థూలంగా నిర్ణయం తీసుకుందని.. హైకోర్టు తీర్పులోని పూర్వాపరాలను న్యాయనిపుణులు అధ్యయనం చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు చెప్పారు. న్యాయ వ్యవస్థపై తమ పార్టీకి, ప్రభుత్వానికి అపారమైన గౌరవం ఉందన్నారు. న్యాయస్థానాలిచ్చే తీర్పుల్లో కొన్ని సందర్భాలలో న్యాయం జరగలేదనే అభిప్రాయం ఉండటం సహజమని, అలాంటపుడు పై కోర్టుల్లో అప్పీల్ చేసుకునే రాజ్యాంగ హక్కు ఎవరికైనా ఉంటుందని అన్నారు. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన స్థానంలో ఉండి రమేశ్కుమార్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదని, కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోం శాఖకు ఆయన రాసిన లేఖ అందుకు ఓ ఉదాహరణని అభిప్రాయపడ్డారు. పాలనా వ్యవస్థను అదుపుచేయడం సరికాదు: స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందిస్తూ.. రాజ్యాంగ వ్యవస్థలు హద్దులు పాటించాలని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని మరో వ్యవస్థ నియంత్రించాలనుకోవడం సరికాదన్నారు. ఈ విషయంపై ప్రజల్లో చర్చ జరుగుతోందన్నారు. న్యాయ వ్యవస్థ ద్వారా పాలనా వ్యవస్థను అదుపు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. నిష్పక్షపాతంగా నిర్వహించేందుకే.. స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించడానికే రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలను అమల్లోకి తెచ్చింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషన్కు నూతన జవసత్వాలు చేకూర్చడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా హైకోర్టు రిటైర్డు జడ్జిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదించింది. ఈ మేరకు ఏపీ పంచాయతీరాజ్ చట్టం–1993లో సెక్షన్–200కు సవరణలు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్పై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఏప్రిల్ 10న ఆమోదముద్ర వేశారు. ఈ ఆర్డినెన్స్ ద్వారా నాటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ పదవీకాలం ముగిసింది. దీంతో.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రిటైర్డు హైకోర్టు జడ్జి వి.కనగరాజ్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా గవర్నర్ నియమిస్తూ గత ఏప్రిల్ 11న ఉత్తర్వులు జారీచేశారు. -
ఎన్నికల కమిషనర్ ‘ఆర్డినెన్స్’ రద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని, సర్వీసు నిబంధనలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్ను హైకోర్టు రద్దుచేసింది. అలాగే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి. కనగరాజ్ను నియమిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను కూడా రద్దుచేసింది. నిమ్మగడ్డ రమేశ్ను ఎన్నికల కమిషనర్గా పునరుద్ధరిస్తూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. పదవీ కాలం పూర్తయ్యే వరకు రమేశ్ను ఎన్నికల కమిషనర్గా కొనసాగనివ్వాలని చెప్పింది. ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994లోని సెక్షన్ 200 ప్రకారం నియమితులైన ఎన్నికల కమిషనర్ మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్ల అన్ని ఎన్నికల నిర్వహణ పర్యవేక్షణ, ఓటర్ల జాబితా తయారీపై నియంత్రణ, మార్గదర్శకత్వం చేయజాలరని హైకోర్టు స్పష్టంచేసింది. అలాగే, పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 2 (39), సెక్షన్ 2(40), సెక్షన్ 200లోని నిబంధనలను ప్రభుత్వం ఓసారి పున:పరిశీలన చేయాలని, వీటి విషయంలో రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్, తదనుగుణ జీఓలను సవాలుచేస్తూ నిమ్మగడ్డ రమేశ్, కామినేని శ్రీనివాస్, వడ్డే శోభనాద్రీశ్వరరావులతో పాటు మరికొందరు వేర్వేరుగా 13 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం 332 పేజీల తీర్పు వెలువరించింది. ఈ ఆర్డినెన్స్, జీఓలు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగాలేవని పేర్కొంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం సర్వీసు నిబంధనల్లో భాగం కాదని.. ఆర్డినెన్స్ ద్వారా దానిని కుదించే అధికారం ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది. ఆర్డినెన్స్ తీసుకొచ్చేంత అత్యవసర పరిస్థితులేవీ లేవని.. ఎన్నికల కమిషనర్ తొలగింపు ప్రక్రియను రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిందని హైకోర్టు గుర్తుచేసింది. ఆర్డినెన్స్ జారీచేసే అధికారం గవర్నర్కు ఉందని.. అయితే, ప్రస్తుత కేసులో జారీచేసిన ఆర్డినెన్స్ మాత్రం రాజ్యాంగానికి అనుగుణంగా లేదని ధర్మాసనం పేర్కొంది. సర్వీసు నిబంధనలు పదవీ కాలాన్ని నిర్ణయించే అధికారం మాత్రమే ప్రభుత్వానికి ఉందని హైకోర్టు స్పష్టంచేసింది. అయితే,ఎస్ఈసీ నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలు, అర్హతలను నిర్ణయించి మంత్రిమండలి సిఫార్సుల మేరకు ఆర్డినెన్స్ ద్వారా నియమించే అధికారం రాష్ట్ర శాసన వ్యవస్థకు లేదని చెప్పింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను నియమించే విచాక్షణాధికారం రాజ్యాంగంలోని అధికరణ 243కే (1) ప్రకారం గవర్నర్కు ఉందని తెలిపింది. సుప్రీంకోర్టుకెళ్తాం.. తీర్పు అమలును నిలిపేయండి ఇదిలా ఉంటే.. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు వీలుగా ఈ తీర్పు అమలును నిలిపేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. ఈ తీర్పు అమలును నిలుపుదల చేయని పక్షంలో తమ న్యాయ ప్రయోజనాలు దెబ్బతింటాయని ప్రభుత్వం ఆ పిటిషన్లో పేర్కొంది. వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా ధర్మాసనం ఈ తీర్పు వెలువరించిన వెంటనే, తీర్పు అమలుపై స్టే గురించి అడ్వకేట్ జనరల్ ప్రసావించేందుకు సిద్ధమవుతుండగా, వెబ్ కాన్ఫరెన్స్ కనెక్షన్ కట్ అయిందని తెలిపింది. ఈలోపు ధర్మాసనం తన కోర్టు ప్రొసీడింగ్స్ను ముగించిందని పేర్కొంది. సీపీసీ నిబంధనల ప్రకారం తీర్పు అమలుపై స్టే విధించే అధికారం న్యాయస్థానానికి ఉందని ప్రభుత్వం తెలిపింది. ఈ పిటిషన్ను ధర్మాసనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. ఎస్ఈసీగా రమేష్కుమార్ బాధ్యతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా తాను తిరిగి బాధ్యతల్లో చేరినట్లు పేర్కొంటూ నిమ్మగడ్డ రమేష్కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో శుక్రవారం సాయంత్రం సర్కులర్ జారీ చేశారు. -
నిమ్మగడ్డ తొలగింపు విచారణ రేపటికి వాయిదా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపుపై వేసిన పిటిషన్ విచారణను హైకోర్టు రేపటి(బుధవారం)కి వాయిదా వేసింది. మంగళవారం పిటిషనర్ల వాదనలను సుదీర్ఘంగా విన్న ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ సత్యనారాయణలతో కూడిన బెంచ్ విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో బుధవారం(ఏప్రీల్ 29)న హైకోర్టులో మరోసారి నిమ్మగడ్డ తొలగింపుపై వాదనలు కొనసాగనున్నాయి. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపుపై ఏపీ ప్రభుత్వం గతవారం తుది కౌంటర్ను హైకోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే. నిమ్మగడ్డ తొలగింపుపై హైకోర్టులో తుది అఫిడవిట్ టీడీపీ అడ్డా నుంచే నిమ్మగడ్డ లేఖ? -
నిమ్మగడ్డ నిర్ణయం ఏకపక్షం
సాక్షి, అమరావతి: ‘స్థానిక’ ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తూ నిమ్మగడ్డ రమేశ్కుమార్ తీసుకున్న నిర్ణయం పూర్తిగా ఏకపక్ష నిర్ణయమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జస్టిస్ వి. కనగరాజ్ హైకోర్టుకు నివేదించారు. తననే లక్ష్యంగా ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేసిందన్న నిమ్మగడ్డ ఆరోపణల్లో వాస్తవంలేదని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయంలో ఏ చట్టం చేసినా అది కమిషనర్కే వర్తిస్తుందని, అలాంటప్పుడు దానిని ఓ వ్యక్తి లక్ష్యంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్గా చెప్పడానికి వీల్లేదన్నారు. గవర్నర్కు దురుద్దేశాలు అంటగట్టడం, ఆయన వివేచనను ప్రశ్నించడం వంటివి చేయడానికి వీల్లేదన్నారు. ప్రభుత్వ ఆర్డినెన్స్, తదనుగుణ జీఓలను సవాలు చేస్తూ నిమ్మగడ్డ రమేష్కుమార్, ఇతరులు దాఖలు చేసిన వ్యాజ్యాలన్నింటినీ కొట్టేయాలని ఆయన హైకోర్టును అభ్యర్థించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని, సర్వీసు నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్, తదనుగుణ జీఓలను సవాలు చేస్తూ నిమ్మగడ్డ రమేష్కుమార్ వ్యాజ్యం దాఖలు చేయడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జస్టిస్ వి.కనగరాజ్ కూడా కౌంటర్ దాఖలు చేశారు. ఆయన కౌంటర్లోని ముఖ్యాంశాలు.. ► బాధిత వ్యక్తిగా నిమ్మగడ్డ రమేశ్ స్వయంగా పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి, ఇదే అంశంపై మిగిలిన వ్యక్తులు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, రిట్ పిటిషన్లు దాఖలు చేయడానికి వీల్లేదు. ఇటువంటి వ్యాజ్యాలపై సాధారణంగా హైకోర్టు విచారణ చేపట్టదు. ► ఎన్నికల కమిషనర్ సర్వీసు నిబంధనలను, పదవీ కాల పరిమితిని సవరిస్తూ ఏప్రిల్ 10న ప్రభుత్వం జారీచేసిన జీఓ 617 వల్ల ఎన్నికల కమిషనర్గా సర్వీసు నిలిచిపోయిందని నిమ్మగడ్డ రమేశ్ చెబుతున్నారు. వాస్తవానికి ఇది తప్పు. ► ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని, సర్వీసు నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్లోని క్లాజ్ 5 ప్రకారం ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చిన రోజు నుంచి ఎన్నికల కమిషనర్గా నియమితులైన వ్యక్తి సర్వీసు నిలిచిపోతుంది. అంతే తప్ప జీఓ 617 వల్ల కాదు. ► రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను గవర్నర్ నియమిస్తారు. ఎన్నికల కమిషనర్ సర్వీసు నిబంధనలను, పదవీ కాలాన్ని కూడా ఆయనే నిర్ణయిస్తారు. ఎన్నికల కమిషనర్ విషయంలో చేసే ఏ చట్టమైనా ఎన్నికల కమిషనర్ను ఉద్దేశించే చేయబడుతుంది. కాబట్టి ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకునే ఆర్డినెన్స్ను తీసుకువచ్చిందన్న నిమ్మగడ్డ వాదన అర్థరహితం. ► అలాగే, గవర్నర్కు దురుద్దేశాలు అంటగట్టడానికి వీల్లేదు. ఆయన వివేచనను కూడా ప్రశ్నించజాలరు. ఆ పిటిషన్ మొత్తం కాపీ పేస్టే.. ప్రభుత్వ ఆర్డినెన్స్, తదనుగుణ జీఓలను సవాలు చేస్తూ నిమ్మగడ్డకు మద్దతుగా మాజీమంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్లోని 13 పేరాలను కామినేని యథాతథంగా తన పిటిషన్లో వాడారు. నిమ్మగడ్డ ఏప్రిల్ 11న కామినేని ఏప్రిల్ 12న పిటిషన్ దాఖలు చేశారు. దీనిని బట్టి నిమ్మగడ్డ రమేశ్ తన పిటిషన్ను కామినేని శ్రీనివాస్కు పంపారని అర్ధం చేసుకోవచ్చు. అంతేకాక.. కామినేని తన వృత్తిని మెడికల్ ప్రాక్టీషనర్గా, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీగా పిటిషన్లో పేర్కొన్నారు. ఇది కోర్టును ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించడమే. ఫిర్యాదులు పరిశీలించి విచారణ జరపాలి ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు 54,594 నామినేషన్లు వచ్చాయి. ఈ స్థానాల విషయంలో వచ్చిన ఫిర్యాదులు కేవలం 0.078 శాతం మాత్రమే. అలాగే, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 15,185 నామినేషన్లు వచ్చాయి. వీటిపై వచ్చిన ఫిర్యాదులు కేవలం 0.092 శాతం మాత్రమేనని జస్టిస్ వి.కనగరాజ్ తన కౌంటర్లో ప్రస్తావించారు. అంతేకాక.. ► ఫిర్యాదులన్నింటినీ కలిపి చూడకుండా, ఆ ఫిర్యాదులు ఏమిటో పరిశీలించి, వాటిపై విచారణ జరిపితేనే వాటిలో ఎంత వాస్తవం ఉందో తెలుస్తుంది. ► మార్చి 15కు ముందు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వులు, సలహాలు జారీచేయలేదు. అయినప్పటికీ అదేరోజు నిమ్మగడ్డ రమేశ్కుమార్ స్థానిక ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ► దీనిని బట్టి ఎన్నికల కమిషనర్గా ఆయన ఎటువంటి సంప్రదింపుల ప్రక్రియను చేపట్టలేదని అర్థమవుతోంది. కాబట్టి ఆయన నిర్ణయం పూర్తిగా ఏకపక్ష నిర్ణయం. ► ఎన్నికల కమిషనర్గా తొలగించేందుకే ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని నిమ్మగడ్డ చేస్తున్న ఆరోపణల్లోనూ వాస్తవంలేదు. ఎన్నికల సంస్కరణలో భాగంగానే ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. స్థానిక ఎన్నికలు నిష్పక్షపాతంగా, న్యాయంగా జరపడమే ఈ ఆర్డినెన్స్ ప్రధాన ఉద్దేశం. ► ప్రభుత్వం జారీచేసిన జీఓ ప్రకారం నేను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు చేపట్టాను. ఈ విషయంలో నిమ్మగడ్డ చేసిన ఆరోపణలను తోసిపుచ్చుతున్నా. ► వాస్తవానికి ఏ చట్టాన్నైనా తెచ్చే శాసనపరమైన అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దీనిని ఎవ్వరూ తప్పుపట్టజాలరు. ఈ విషయంలో పిటిషనర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ► నిమ్మగడ్డ రమేశ్నే ఎన్నికల కమిషనర్గా కొనసాగించాలని సుప్రీంకోర్టు లేదా ఇతర ఏ కోర్టు కూడా ఎక్కడా చెప్పలేదు. ► ఇక వడ్డే శోభనాద్రీశ్వరరావు, గండూరు మహేశ్లు తమ వ్యాజ్యాల్లో నిమ్మగడ్డ రమేశ్ తనకు రక్షణ కావాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారంటూ ప్రస్తావించారు. వాస్తవానికి ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఈ విషయానికి సంబంధించి ఎలాంటి నోట్ ఫైళ్లు లేవు. ఎవరినీ సంప్రదించక్కర్లేదు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసే విషయంలో ఎవరినీ సంప్రదించాల్సిన అవసరంలేదని రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ హైకోర్టుకు నివేదించారు. ఎన్నికల సంఘం కార్యదర్శితో కూడా మాట్లాడాల్సిన అవసరంలేదని తన రిప్లై కౌంటర్లో పేర్కొన్నారు. ఎన్నికల వాయిదా నిర్ణయం అత్యంత గోప్యమైనదని తెలిపారు. తన పిటిషన్లో కౌంటర్ దాఖలు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి రామసుందర్రెడ్డి ప్రభుత్వాన్ని సమర్థించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఎన్నికలను వాయిదా వేసేందుకు కేంద్ర ప్రభుత్వాధికారులతో సంప్రదించలేదని చెప్పడం సరికాదన్నారు. ఎన్నికల కమిషనర్ సర్వీసు నిబంధనలను, పదవీ కాలాన్ని సవరిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్, జీఓలను సవాలుచేస్తూ నిమ్మగడ్డ రమేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఎన్నికల సంఘం కార్యదర్శి రామసుందర్రెడ్డిలు వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కౌంటర్లకు నిమ్మగడ్డ తిరుగు సమాధానాలు (రిప్లై కౌంటర్) ఇచ్చారు. -
నిమ్మగడ్డ తొలగింపుపై హైకోర్టులో తుది అఫిడవిట్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు కారణాలపై ప్రభుత్వం తుది అఫిడవిట్ను హైకోర్టులో శుక్రవారం సమర్పించింది. ఇప్పటికే ప్రభుత్వం ప్రిలిమినరీ కౌంటర్ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా, అఫిడవిట్లో ఏపీ ప్రభుత్వం కీలక అంశాలు పేర్కొంది. రాష్ట్రంలో ఎన్నికల సంఘ సంస్కరణల్లో భాగంగా కొత్త కమిషర్ను నియమించామని తెలిపింది. రిటైర్డ్ జడ్జిని ఎస్ఈసీగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని గుర్తు చేసింది. (నిమ్మగడ్డ లేఖ విషయంలో సంచలన నిజాలు) మిగిలిన రాష్ట్రాల్లో ఎస్ఈసీల కాలపరిమితి వివరాలను కూడా ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. 2014లో రాష్ట్రవ్యాప్తంగా 221 హింసాత్మక ఘటనలు జరగ్గా.. 2020లో 88 ఘటనలు జరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఎస్ఈసీగా బాధ్యాయుత పదవిలో ఉన్న రమేష్కుమార్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేశారని ప్రభుత్వం తెలిపింది. పోలీసులు, పరిపాలనా యంత్రాంగంపై నిమ్మగడ్డ ఆరోపణలు అవాస్తవమని చెప్పింది. తనను కావాలనే ఎస్ఈసీ పదవి నుంచి తప్పించారని.. నిమ్మగడ్డ రమేష్కుమార్ వేసిన పిటిషన్ అవాస్తవమని ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. (రమేష్ కుమార్ పిటిషన్పై కీలక వాదనలు) -
రాజ్యాంగమిచ్చిన అధికారం మేరకే ఆర్డినెన్స్
సాక్షి, అమరావతి: రాజ్యాంగంలోని అధికరణ 213 ప్రకారం సంక్రమించిన న్యాయమైన అధికారాన్ని అనుసరించే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని, సర్వీసు నిబంధనలను సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. ఈ ఆర్డినెన్స్కు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా జస్టిస్ వి.కనగరాజ్ బాధ్యతలు కూడా స్వీకరించారని వివరించింది. అధికరణ 243(కె), ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994లోని నిబంధనలను అనుసరించే ఆర్డినెన్స్ను తీసుకొచ్చామని తెలిపింది. నిమ్మగడ్డ రమేష్కుమార్ను తప్పించేందుకే ఈ ఆర్డినెన్స్ను తీసుకొచ్చామన్న వాదనలో ఏ మాత్రం వాస్తవంలేదని స్పష్టంచేసింది. అధికరణ 243(కె)(2) ప్రకారం సర్వీసు నిబంధనల్లో పదవీ కాలం భాగం కాదని పేర్కొంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మేళనం ఎలా ఉండాలన్నది అధికరణ 243(కె) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని వివరించింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో సంస్కరణల కొనసాగింపు ఫలితమే ప్రస్తుత ఆర్డినెన్స్ అని.. ఈ ఆర్డినెన్స్ నేపథ్యంలో పిటిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ముగిసిందని కోర్టు కు నివేదించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలన్నది ప్రభుత్వ విధానప రమైన నిర్ణయమని, ఈ విషయంలో ప్రభుత్వానికి ఉద్దేశాలు అంటగట్టడం సరికాదంది. తమ ఈ కౌం టర్ను పరిగణనలోకి తీసుకుని నిమ్మగడ్డ రమేష్కుమార్ దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలను కొట్టేయాలని రాష్ట్ర ప్రభు త్వం హైకోర్టును అభ్యర్థించింది. ఎస్ఈసీ పదవీ కాలం, సర్వీసు నిబంధనలను సవరిస్తూ తీసుకొచ్చిన ఆర్డి నెన్స్, తదనుగుణ జీఓలను, కమిషనర్గా జస్టిస్ వి.కనగరాజ్ నియామకాన్ని సవాలు చేస్తూ నిమ్మగడ్డ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలి సిందే. ఈ వ్యాజ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది కౌంటర్ దాఖలు చేశారు. సంస్కరణల్లో భాగమే ఈ ఆర్డినెన్స్ ‘ఎన్నికలు నిష్పాక్షికంగా, ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అవసరమైన సంస్కరణలు తేవాలని నిర్ణయించి, ఈ విషయాన్ని మార్చిలోనే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశాం. ఈ సంస్కరణలపై పలు సమావేశాల్లో చర్చించాకే ఈ ఆర్డినెన్స్ను తీసుకువచ్చాం. అందువల్ల దీనిని హడావుడిగా జారీచేశామన్న పిటిషనర్ ఆరోపణల్లో వాస్తవంలేదు. ఎన్నికల కమిషనర్గా తనను కొనసాగించాలని ఒత్తిడి చేసే ప్రాథమిక హక్కూ పిటిషనర్కు లేదు. విధానపరమైన నిర్ణయాల్లో భాగంగా చట్ట సవరణలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది’ అని ద్వివేది వివరించారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం ‘రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమాత్రం సంప్రదించకుండా ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను ప్రభుత్వానికి పంపడానికి కన్నా ముందు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకే తెలియజేశారు. ఎన్నికల వాయిదా విషయంలో కమిషనర్ది ఏకపక్ష నిర్ణయం. అలాగే వైద్య శాఖ నుంచి ఎటువంటి నివేదిక కోరలేదు.’ అని ఆయన విన్నవించారు. అంతేకాక.. ‘కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ గురించి నిమ్మగడ్డ ఆ పిటిషన్లో ప్రస్తావించలేదు. ఇందులో ఆయన ఆరోపణలను తోసిపుచ్చుతూ రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ కేంద్రానికి రెండు లేఖలు రాశారు. ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం లేదా బహుళ అధికారుల బృందం మార్గదర్శకంలో జరిగే అవకాశాలను చూడాలని కేంద్రాన్ని కోరే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్న విషయాన్ని కేంద్రానికి తెలియజేశాం’ అని ద్వివేది తన కౌంటర్లో పేర్కొన్నారు. -
నిర్ణయాలు తీసుకోకుండా.. కమిషనర్ను నిలువరించలేం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) కనగరాజ్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా నిలువరించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ దాఖలు చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రతివాదుల వాదనలు వినకుండా ప్రస్తుతం అలాంటి ఉత్తర్వులు ఏవీ జారీ చేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో ఈ నెల 16 కల్లా కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కార్యదర్శి, ఎన్నికల కమిషనర్ జస్టిస్ వి.కనగరాజ్లను ఆదేశించింది. 17వ తేదీ నాటికి ప్రతివాదుల కౌంటర్లకు సమాధానం ఇవ్వాలని పిటిషనర్లకు స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడు వ్యాజ్యాలు దాఖలు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం, సర్వీసు నిబంధనలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆర్డినెన్స్, జీఓను జారీచేసింది. ఎన్నికల కమిషనర్గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి.కనగరాజ్ను నియమిస్తూ కూడా ఉత్తర్వులిచ్చింది. వీటిని సవాలు చేస్తూ నిమ్మగడ్డతో పాటు పలువురు టీడీపీ, బీజేపీ నేతలు, మరికొందరు మొత్తం ఏడు వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. నిమ్మగడ్డ తరఫున డీవీ సీతారామమూర్తి, ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఎన్నికల కమిషన్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి, ఎన్నికల కమిషనర్ కనగరాజ్ తరఫున సీనియర్ న్యాయవాది సత్యనారాయణ ప్రసాద్లు హాజరయ్యారు. -
కార్యాలయ సిబ్బందితో ఎస్ఈసీ సమావేశం
సాక్షి, విజయవాడ: ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా సర్వ సన్నద్ధంగా ఉండాలని ఏపీ ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజ్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన రాష్ట్ర ఎన్నికల కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల యథాతథ స్థితిని ఎన్నికల కమిషనర్కు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధుల్లో సమన్వయంతో సమర్థవంతంగా పనిచేయాలని కోరారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపన లో పంచాయతీ రాజ్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చేరాలని స్థానిక సంస్థలను ఏర్పాటు చేశారన్నారు. ఎన్నికల నిర్వహణకు సమయానుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి కీలక భూమిక పోషిస్తుందని జస్టిస్ కనగరాజ్ పేర్కొన్నారు. -
ఎస్ఈసీపై తప్పుడు ప్రచారం
సాక్షి, అమరావతి: రాష్ట్ర కొత్త ఎన్నికల కమిషనర్ జస్టిస్ వి.కనగరాజ్పై టీడీపీ తన అనుకూల సోషల్ మీడియా గ్రూపుల్లో నీచ రాజకీయాలకు పాల్పడుతూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన రిటైర్డ్ జడ్జి కనగరాజ్కు మతం రంగు పులుముతూ తప్పుడు ఫోటోలను వైరల్ చేస్తోంది. ఓ చర్చి పాస్టర్ ఫొటోను.. ఎన్నికల కమిషనర్ కనగరాజ్ ఫొటోగా పేర్కొంటూ దుష్ప్రచారానికి దిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమితులైంది జస్టిస్ వి.కనగరాజ్ అయితే ఆయన స్థానంలో క్రిస్టియన్ పాస్టర్ జె.కనకరాజ్ అనే వ్యక్తిని చూపించి మతం పేరుతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తోంది. గత రెండు రోజులుగా టీడీపీ అనుకూల సోషల్ మీడియా గ్రూపుల ద్వారా ఈ తప్పుడు ప్రచారం యథేచ్ఛగా కొనసాగుతుండటం గమనార్హం. తెలుగుదేశం పార్టీ కీలక నేతల ఆధ్వర్యంలోనే.. టీడీపీ కీలక నేతల ఆధ్వర్యంలోనే ఈ దుష్ప్రచారం కొనసాగుతోందని తెలుస్తోంది. మతం పేరుతో జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారంపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించినట్టు సమాచారం. ఆదివారమూ విధులకు హాజరైన కనగరాజ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా శనివారం బాధ్యతలు చేపట్టిన జస్టిస్ కనగరాజ్ ఆదివారం కూడా విధులకు హాజరయ్యారు. ఉదయం కార్యాలయానికి వచ్చిన ఆయన తన ఛాంబర్కే పరిమితమయ్యారు. సోమవారం కార్యాలయ అధికారులు, అన్ని స్థాయిల ఉద్యోగులతో కమిషనర్ సమావేశమవుతారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. లాక్డౌన్ కారణంగా మార్చి 23వ తేదీ నుంచి కార్యాలయ అధికారులు, ఉద్యోగులలో ఎక్కువ మంది ఇంటి నుంచి పనిచేస్తున్నారు. ఇలాంటి వారందరూ సోమవారం కార్యాలయంలో తమ విధులకు హాజరుకానున్నారు. -
రాజ్యాంగం ప్రకారమే..
సాక్షి, అమరావతి: హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించేలా, పదవీకాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదించేలా రాజ్యాంగబద్ధంగా, చట్ట ప్రకారమే పంచాయతీరాజ్ చట్టం–1994 సెక్షన్–200కి రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసిందని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాజ్యాంగంలోని అధికరణ 243(కే) ప్రకారం శాసనసభ రూపొందించిన చట్టం ప్రకారమే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం, సర్వీసు నిబంధనలను గవర్నర్ నిర్ణయించాలని, ఆ మేరకే గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వ్యవహరించారని పేర్కొంటున్నారు. అలహాబాద్ హైకోర్టు (లక్నో బెంచ్) ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా న్యాయనిపుణులు ఉదహరిస్తున్నారు. నిబంధనల ప్రకారమే.. రాష్ట్రంలో మద్యం, ధన ప్రభావమన్నది లేకుండా స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా హైకోర్టు రిటైర్డు జడ్జిని నియమించేలా, ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదిస్తూ పంచాయతీరాజ్ చట్టం–1994 సెక్షన్–200కి సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్పై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల 10న ఆమోదముద్ర వేశారు. ఈ ఆర్డినెన్స్ ప్రకారం నిమ్మగడ్డ రమేష్కుమార్ పదవీకాలం ముగియడంతో రిటైర్డు హైకోర్టు జడ్జి వి.కనగరాజ్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా గవర్నర్ నియమించారు. ఈ వ్యవహారంలో రాజ్యాంగంలోని అధికరణ 243(కే), ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం–1994 సెక్షన్–200 ఉల్లంఘించారంటూ కొందరు చేస్తున్న వాదనల్లో ఏమాత్రం వాస్తవం లేదని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. గవర్నర్ నిర్ణయమే ఫైనల్.. ► శాసనసభ చేసిన చట్టంలోని నిబంధనల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం, సర్వీసు నిబంధనలను గవర్నర్ నిర్ణయిస్తారని రాజ్యాంగంలోని అధికరణ 243(కే) చెబుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను హైకోర్టు న్యాయమూర్తి స్థ్దాయితో పరిగణించాలి. ఇతర కారణాల వల్ల తప్ప ఆయన్ను విధుల నుంచి తొలగించకూడదు. ఒకవేళ తొలగించాల్సి వస్తే హైకోర్టు జడ్జి తొలగింపునకు అనుసరించే పద్ధతిని అమలు చేయాలి. నిరూపితమైన దుర్వినియోగం, అసమర్థత కారణాలను చూపుతూ ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్ ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాక రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా మాత్రమే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను తొలగించవచ్చు. ► స్థానిక సంస్థల ఎన్నికల సంస్కరణలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా హైకోర్టు రిటైర్డు జడ్జిని నియమించేలా, పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదించేలా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం–1994 సెక్షన్–200కు సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్పై రాజ్యాంగంలోని అధికరణ 243(కే) ప్రకారమే గవర్నర్ ఆమోదించారంటూ న్యాయనిపుణులు తేల్చి చెబుతున్నారు. నిమ్మగడ్డది పదవీ విరమణే.. ► రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్కుమార్ను తొలగించారని కొందరు చేస్తున్న ఆరోపణల్లో వీసమెత్తు వాస్తవం లేదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం–1994లోని సెక్షన్–200కు సవరణలు చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం.. రమేష్కుమార్ పదవీలో కొనసాగడానికి అర్హత కోల్పోయారు. ► 2016 ఏప్రిల్ 1న ఐదేళ్ల పదవీ కాలానికి నియమితులైన రమేష్ కుమార్ తాజాగా తెచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం ఈనెల 10 నుంచే పదవిలో కొనసాగే అవకాశం లేదు. అంటే ఆయన పదవీ విరమణ చేసినట్లు స్పష్టమవుతోంది. ► ఈ ప్రక్రియ అత్యంత స్పష్టంగా, పారదర్శకంగా జరిగిందని న్యాయనిపుణులు చెబుతున్నారు. పంచాయతీరాజ్ చట్టం–1994లోని సెక్షన్–200 తాజా సవరణ ప్రకారం పదవీ కాలాన్ని మూడేళ్లకే కుదించడం వల్ల రమేష్కుమార్ను పదవి నుంచి తొలగించారన్న ప్రశ్నే తలెత్తదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. యూపీ హైకోర్టు తీర్పే తార్కాణం.. – పదవీ కాలంపై గవర్నర్దే తుది నిర్ణయం ఉత్తరప్రదేశ్ శాసనసభ 2007లో ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలానికి సంబంధించి మార్పులు చేసింది. అయితే ఆ మార్పులు చెల్లవంటూ నాడు యూపీ ఎన్నికల కమిషనర్గా ఉన్న అపర్మితా ప్రసాద్సింగ్ అలహాబాద్ హైకోర్టు(లక్నో బెంచ్)ను ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై(డబ్ల్యూపీ 3457)పై విచారించిన న్యాయస్థానం 2007 ఆగస్టు 23న కీలక తీర్పు ఇచ్చింది. ‘రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం సర్వీసు నిబంధనలకు సంబంధించినది కాదు. అధికరణ 243(కే) కేవలం సర్వీసు నిబంధనలకు మాత్రమే వర్తిస్తుంది. పదవీ కాలానికి సంబంధించిన మార్పు విషయంలో కాదు. సర్వీసు నిబంధనలు, పదవీ కాలం నిర్ణయంలో గవర్నర్దే అంతిమ అధికారం. పదవీ కాలంలో మార్పులు చేస్తూ చేసిన చట్టం వల్ల అనర్హత ఎదురైనప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్వయంచాలక పదవీ విరమణ పొందుతారు’ అని స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది. ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే – అవిభాజ్య ఏపీ హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వి.ఈశ్వరయ్య ‘‘ఎన్నికల కమిషనర్ కాల పరిమితి, సర్వీసు నిబంధనలను రూపొందించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాజ్యాంగం ఈ అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని ప్రకారమే ఎన్నికల కమిషనర్ కాల పరిమితిని, సర్వీసు నిబంధనలను సవరించింది. కరోనా వైరస్ వల్ల శాసనసభను హాజరుపరిచే పరిస్థితులు లేవు కాబట్టి ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇందులో ఎంత మాత్రం తప్పులేదు. ఇక్కడ చూడాల్సింది ప్రభుత్వం నిబంధనల ప్రకారం చేసిందా లేదా అన్నదే తప్ప నిమ్మగడ్డ రమేశ్ విషయంలోనా, మరొకరి విషయంలోనా అన్నది కాదు. ఇక రెండో విషయం ఏమిటంటే... ఎన్నికల కమిషనర్గా నియమితులైన జస్టిస్ కనగరాజ్ న్యాయమూర్తిగా పనిచేశారు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా అపార అనుభవం ఆయన సొంతం. ప్రస్తుతం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. అలాంటి వ్యక్తి రాజ్యాంగాన్ని చదవకుండా, పంచాయతీరాజ్ చట్టాన్ని చూడకుండానే కమిషనర్గా బాధ్యతలు చేపట్టారా? ప్రభుత్వం ప్రతిదీ చట్ట ప్రకారమే చేసింది కాబట్టి ఆయన సంతృప్తి చెందారు. అందుకే కమిషనర్గా బాధ్యతలు చేపట్టేందుకు అంగీకరించారు. అధికరణ 243కే చదివితే కమిషనర్ కాల పరిమితి వేరు, సర్వీసు నిబంధనలు వేరన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనిపై అసలు చర్చే అవసరం లేదు. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడకూడదు’’ ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు.. – చిత్తవరపు నాగేశ్వరరావు, హైకోర్టు సీనియర్ న్యాయవాది ‘నిమ్మగడ్డ రమేశ్కుమార్ను ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తొలగించలేదు. ఈ విషయంలో రాజకీయ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ తెచ్చింది. దీని ద్వారా చట్ట సవరణ చేసింది. కమిషనర్ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదించింది. ఇప్పటికే రమేష్కుమార్ ఎన్నికల కమిషనర్గా మూడేళ్లు పూర్తి చేశారు. దీంతో చట్ట ప్రకారం ఆయన పదవీ కాలం ముగిసింది. ఇదే సమయంలో ప్రభుత్వం ఎన్నికల కమిషనర్గా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఉంటారని ఆర్డినెన్స్లో పేర్కొంది. దీని ప్రకారం రమేశ్కుమార్ పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో రిటైర్డ్ జడ్జిని కమిషనర్గా నియమించింది. ఇందులో రాజ్యాంగ విరుద్ధం ఏముంది? టీడీపీ ఎందుకింత రాద్ధాంతం చేస్తోందో అర్థం కావడం లేదు. చట్టానికి వక్రభాష్యం చెబుతున్నారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వారు అంతే బాధ్యతగా ఉండాలి తప్ప ప్రజలను తప్పుదోవ పట్టించడం తగదు’’ ఆదర్శ వ్యవస్థ కోసమే ఆర్డినెన్స్ – నిమ్మగడ్డ నిష్క్రమణ అందులో భాగమే – ఎన్నికల ప్రకియలో న్యాయకోవిదుడి నియామకం వ్యవస్థకు మేలు చేస్తుంది – ఇది ఎన్నికల తీరునే సమూలంగా మార్చేసే ప్రక్రియ ఎన్నికల ప్రక్రియలో ఒక ఆదర్శప్రాయమైన వ్యవస్థ కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిందని, అది అమలు చేయడంలో భాగంగానే నిమ్మగడ్డ నిష్క్రమణ జరిగిందని, అంతేతప్ప ఆయన్ను తొలగించలేదని న్యాయ నిపుణులు, రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ప్రక్రియలో ఓ దళితుడిని, న్యాయ కోవిదుడిని నియమించడం వ్యవస్థకు మేలు చేస్తుందని, సామాజికంగానూ ఎంతో ఉపకరిస్తుందని, దేశానికి ఇది అనుసరణీయమని పేర్కొంటున్నారు. న్యాయమూర్తిగా పనిచేసిన వారిని ఎన్నికల కమిషనర్గా నియమించడం ఎన్నికల తీరునే సమూలంగా మార్చేసే ప్రక్రియగా అభివర్ణిస్తున్నారు. ఇక ఇలాంటి ఆర్డినెన్స్లు గతంలోనూ వచ్చాయని, ఇవేమీ కొత్త కాదని స్పష్టం చేస్తున్నారు. 1993లో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) హోదాలో టి.ఎన్ శేషన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదం కావడం, నిరంకుశంగా వ్యవహరిస్తున్నారే విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్ర ఎన్నికల సంఘంలో మరో ఇద్దరు కమిషనర్లను నియమించారు. దీన్ని సవాల్ చేస్తూ శేషన్ నాడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా పిటిషన్ను కొట్టివేస్తూ ఇద్దరు కమిషనర్ల నియామకాన్ని న్యాయస్థానం సమర్ధించడం గమనార్హం. -
ఏపీ కొత్త 'ఎస్ఈసీ'
-
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా జస్టిస్ కనగరాజ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా జస్టిస్ వి.కనగరాజ్ నియమితులయ్యారు. మద్రాస్ హైకోర్టులో తొమ్మిదేళ్లపాటు జడ్జిగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఆయన ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్గా కొనసాగుతున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక అర్హతలు, పదవీ కాలంపై రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆర్డినెన్స్ తెచ్చిన విషయం తెలిసిందే. తాజా ఆర్డినెన్స్కు అనుగుణంగా శనివారం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర కొత్త ఎన్నికల కమిషనర్ నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారని అందులో పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే జస్టిస్ కనగరాజ్ విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. వివిధ విభాగాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజ్భవన్లో గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిసి ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు చేపట్టినట్టు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఎన్నికల కమిషనర్తో పలువురి భేటీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే కనగరాజ్ విధులకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్యామలరావు, డీజీపీ గౌతమ్ సవాంగ్, విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, డీసీపీ విక్రాంత్ పాటిల్ తదితరులు వేర్వేరుగా కలిశారు. కనగరాజ్కు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్–డైరెక్టర్ విజయ్కుమార్ కూడా కలిసి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రస్తుత ఎన్నికల స్థితిపై చర్చించారు. విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను కలిసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.కనగరాజ్ రికార్డు స్థాయిలో తీర్పులు ► తమిళనాడులోని సేలం, చెన్నైల్లో విద్యాభ్యాసం. 1972లో మద్రాస్ లా కాలేజీ నుంచి లా ఉత్తీర్ణత. ► 1973లో లాయర్గా ప్రాక్టీస్. ► 24 ఏళ్లపాటు న్యాయవాదిగా పనిచేశాక 1997 ఫిబ్రవరి 24న మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు. ► తొమ్మిదేళ్లల్లో రికార్డు స్థాయిలో 69 వేల కేసులకు తీర్పులు. వీటిలో కీలకమైన 1,010 తీర్పులు లా జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. ► 2002–05 మధ్య అంబేద్కర్ లా వర్సిటీ సెనేట్ మెంబర్గా పనిచేశారు. ► 2006 జనవరిలో జడ్జిగా పదవీ విరమణ. అనంతరం సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్గా ప్రాక్టీస్. -
ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ కనగరాజ్
-
ఏపీ ఎన్నికల కమిషనర్గా జస్టిస్ కనగరాజ్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నూతన ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)గా రిటైర్డ్ జడ్జి జస్టిస్ కనగరాజ్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ నూతన ఎస్ఈసీగా జస్టిస్ కనగరాజ్ శనివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ జడ్జిని నియమించాలని ఏపీ ప్రభుత్వం నిన్న (శుక్రవారం) ఆర్డినెన్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ మేరకు జస్టిస్ కనగరాజ్ను ఎస్ఈసీగా ప్రభుత్వం నియమించింది. తమిళనాడుకు చెందిన జస్టిస్ కనగరాజ్ మద్రాస్ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. 1973 నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్న జస్టిస్ కనగరాజ్ 1997లో మద్రాస్ హైకోర్ట్ జడ్జిగా నియమితులయ్యారు. హైకోర్టు జడ్జిగా అనేక కీలకమైన జడ్జిమెంట్లు ఇచ్చారు. తమిళనాడు అంబేద్కర్ యూనివర్సిటీకి సెనెట్గా ఆయన వ్యవహరించారు. 2006లో హైకోర్టు జడ్జిగా పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి సుప్రీం కోర్టులో సీనియర్ అడ్వకేట్గా ఆయన ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు. (చదవండి: రాష్ట్ర ఈసీగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి) మర్యాద పూర్వక భేటీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమితులైన సందర్భంగా జస్టిస్ కనగరాజ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. -
పదవీ కాలం 5 నుంచి 3 ఏళ్లకు కుదింపు..
-
రాష్ట్ర ఈసీగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి
సాక్షి, అమరావతి: మద్యం, ధనం ప్రభావమన్నది లేకుండా నిష్పక్షపాతంగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ఇటీవల అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నియమించేలా చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం–1994 సెక్షన్–200కు చేసిన సవరణల ఆర్డినెన్స్కు గవర్నర్ విశ్వభూషణ్ ఆమోద ముద్ర వేయడంతో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. పారదర్శకత కోసమే.. ► ఇప్పటి వరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్లుగా నియమితులవుతూ వచ్చారు. ఇక మీదట హైకోర్టు రిటైర్డ్ జడ్జి.. ఎస్ఈసీ కానున్నారు. ► రిటైర్డ్ ఐఏఎస్లు ప్రభుత్వ పెద్దల వద్ద పని చేసి ఉండటం వల్ల చాలా సందర్భాల్లో వారి ‘నిష్పాక్షికత’ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలనే లక్ష్యంతో ఎన్నికల సంస్కరణల్లో కొనసాగింపుగా ఎస్ఈసీగా హైకోర్టు రిటైర్డ్ జడ్జిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ► ఈ నిర్ణయం దేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో నూతన ఒరవడి సృష్టించనుంది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం దేశంలో ఇదే ప్రథమం కానుంది. ఇందువల్ల అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని ప్రజాస్వామ్యవాదులు, న్యాయనిపుణులు, విశ్లేషకులు, మేధావివర్గాలు అభిప్రాయ పడుతున్నారు. ఆదిలోనే ఎన్నికల సంస్కరణకు శ్రీకారం ► పంచాయతీ రాజ్, మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి అభ్యర్థులు మద్యం, డబ్బులు పంపిణీ వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే అటువంటి వారు గెలిచినప్పటికీ ఆయా పదవుల్లో కొనసాగటానికి అనర్హులుగా పరిగణించేలా రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో సంస్కరణలకు శ్రీకారం చుట్టడం తెలిసిందే. ► గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీ పాలక వర్గాలకు మరిన్ని అధికారాలు కల్పిస్తూ చట్ట సవరణ చేసింది. ► ప్రస్తుతం అనుసరిస్తున్న సుదీర్ఘమైన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను ప్రలోభాలకు తావివ్వని విధంగా కేవలం 13 రోజుల వ్యవధికి తగ్గించింది. ► ఎన్నికల్లో గెలిచిన తర్వాత గ్రామ పంచాయతీ సర్పంచ్ సంబంధిత గ్రామంలోనే నివసించాలని, గ్రామ పంచాయతీ కార్యాలయానికి క్రమం తప్పకుండా హాజరు కావాలని నిబంధన విధించింది. ► ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఓటర్లను ప్రలోభ పెట్టడం, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా చేయటం వంటి నేరాలకు పాల్పడినట్లయితే 3 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.10,000 వరకు జరిమానా విధించడానికి అవకాశం కల్పిస్తూ చట్టంలో మార్పులు చేసింది. గరిష్టంగా రెండు పర్యాయాలు ► రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని 5 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు కుదించినట్లు ఆర్డినెన్స్లో పేర్కొన్నారు. మరో 3 సంవత్సరాల పదవీ కాలాన్ని గవర్నర్ తన అభీష్టం మేరకు పొడిగించడానికి అవకాశం కల్పించారు. ► ఒక వ్యక్తిని గరిష్టంగా ఎస్ఈసీగా రెండు పర్యాయాలు (3+3 ఏళ్లు) మాత్రమే కొనసాగించాలని పరిమితి విధించారు. ► ప్రస్తుతం ఎస్ఈసీగా పని చేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్కుమార్ 2016 ఏప్రిల్ 1వ తేదీన ఆ బాధ్యతల్లో చేరారు. నాలుగేళ్లకు పైగానే ఆ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. తాజా ఆర్డినెన్స్ ప్రకారం.. ఎస్ఈసీ పదవీకాలం మూడేళ్లు. ఫలితంగా నిమ్మగడ్డ పదవీకాలం పూర్తయింది. దీంతో ఆయన స్థానంలో.. ఆర్డినెన్స్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం కొత్త ఎస్ఈసీని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది.