జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం
Published Sat, Aug 8 2015 6:42 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
ఆదోని: కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ఓ జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం జరిగింది. ఆలూరు రోడ్డులోని వెంకటేశ్వర జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్లులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో శనివారం సాయంత్రం మంటలు లేచాయి. అక్కడి పనివారు సత్వరమే స్పందించి స్థానికుల సహకారంతో మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.8 లక్షల విలువైన పత్తి దగ్ధమైనట్టు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement