మహబూబ్నగర్: మహబూగ్నగర్ జిల్లాలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జూరాల 220 కేవీ సబ్స్టేషన్లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. మంటలు అంతకంతకూ వ్యాపిస్తూ భారీగా ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి సహాయక చర్యల్లో పాల్గొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అయినా భారీ నష్టం వాటిల్లింది. కోట్ల రూపాయిల్లో ఉంటుందని భావిస్తున్నారు.