శేషాచలం అడవుల్లో మళ్లీ మంటలు | fire accident in seshachalam forest | Sakshi
Sakshi News home page

శేషాచలం అడవుల్లో మళ్లీ మంటలు

Published Fri, Apr 3 2015 7:08 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

fire accident in seshachalam forest

రేణిగుంట: శేషాచల అడవుల్లో మళ్లీ మంటలు చెలరేగాయి. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి సమీపంలో ఈ మంటలు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు వదిలేయడంతో వ్యాపించిన మంటలు అమరరాజా ఫ్యాక్టరీ, తారకరామా నగర్ వైపు వ్యాపించాయి. ఫ్యాక్టరీ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

ఫ్యాక్టరీ వెనుక భాగం నుంచి తారకరామా నగర్ వైపు మంటలు వ్యాపించడంతో స్థానికులు ఆందోళన చెందారు. తిరుపతి డీఎఫ్‌వో శ్రీనివాసులు, రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప, సీఐ బాలయ్య, అగ్నిమాపక శాఖ అధికారులు రంగంలోకి దిగి స్థానికుల సహకారంతో రెండు గంటలకుపైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. డీఎఫ్‌వో శ్రీనివాసులు ప్రమాదం గురించి మాట్లాడుతూ... శేషాచల అడవుల్లోని 3.5 హెక్టార్లలో మంటలు వ్యాపించాయని, అదుపు చేసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement