సాగర్నగర్, న్యూస్లైన్ : గాయత్రి ఇంజినీరింగ్ కళాశాల (రుషికొండ)కు చెందిన విద్యార్థులు ప్రతిభ చూపారు. హైదరాబాద్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నుంచి బెస్ట్ స్టూడెంట్, బెస్ట్ స్టూడెంట్ ప్రాజెక్ట్ వర్క్ అవార్డులు సాధించారు. కళాశాలకు చెందిన యేచూరి మణిదీప్ ఉత్తమ విద్యార్థిగా అవార్డు పొందారు.
అతనికి బంగారుపతకం, రూ.10వేల నగదును పురస్కారంగా ప్రకటించగా హైదరాబాద్లో గురువారం జరిగిన కార్యక్రమంలో విద్యార్థి తరఫున ఆయన తండ్రి సత్యనారాయణ టీసీఎస్ ఉపాధ్యక్షుడు వి.రాజన్న నుంచి అందుకున్నారు. బెస్ట్ స్టూడెంట్ ప్రాజెక్టు అవార్డును కె.అఖిలానాయుడు, కె.దివ్య, కె.సాహితి మాధురిల బృందం రియల్టైమ్ ట్రాకింగ్ అప్లికేషన్స్ ప్రాజెక్టుకుగాను అందుకున్నారు.
ఈ అవార్డు కింద బంగారు పతకం, రూ.20వేల నగదు అందజేశారు. ఈ అవార్డును గీతం ఇంజినీరింగ్ కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రొఫెసర్ వెంకటరావు అందుకున్నారు. అవార్డులు సాధించిన విద్యార్థులను గీతం ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం అభినందించింది.
‘గాయత్రి’ విద్యార్థులకు అవార్డులు
Published Fri, Mar 21 2014 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 4:57 AM
Advertisement
Advertisement