ఉన్నత చదువులకెళ్లి తిరిగిరాని లోకాలకు.. | Guntur Student Died in Germany Dead Body Reached Village | Sakshi
Sakshi News home page

ఉన్నత చదువులకెళ్లి తిరిగిరాని లోకాలకు..

Published Fri, Feb 7 2020 1:30 PM | Last Updated on Fri, Feb 7 2020 1:30 PM

Guntur Student Died in Germany Dead Body Reached Village - Sakshi

కుమారుడి మృతదేహాన్ని వద్ద రోదిస్తున్న తల్లి, కుటుంబ సభ్యులు

గుంటూరు, ముప్పాళ్ల: ఉన్నత చదువుల కోసం వెళ్లిన బిడ్డ శవమై తిరిగి రావటాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేక పోయింది. కుటుంబ వారసుడు కళ్లముందు శవమై కనిపించటంతో వారి రోదన మిన్నంటింది. ఉన్నతంగా వస్తాడనుకుంటే శవమై వచ్చాడయ్యా అంటూ కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. మండల కేంద్రమైన ముప్పాళ్లకు చెందిన లోకసాని మోహన్‌రెడ్డి(25) ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లాడు. తమ బిడ్డ చదువుల కోసం తల్లిదండ్రుల తీవ్రంగా కష్టపడ్డారు. ఈ క్రమంలో పది రోజుల క్రితం మోహన్‌రెడ్డి అకాల మృతి చెందాడు. గురువారం ఉదయం మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. బిడ్డ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement