Guntur
-
నేడు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నిక
-
గుంటూరులో టీడీపీ బరితెగింపు..
-
గుంటూరు జిల్లాలో KLEF యూనివర్సిటీపై కేసు నమోదు
-
తల్లి కష్టాన్ని చూడలేక.. భుజం కాసిన బిడ్డలు!
అమ్మ కష్టాన్ని చూడలేక ఈ చిన్నారులు(అక్కా, తమ్ముడు) చలించిపోయారు. పొట్ట కూటి కోసం వలస వచ్చిన ఈ తల్లి పొలం నుంచి వస్తూ వంటకు పుల్లలు పోగు చేసుకుని, ఆ పుల్లల మోపు తలపై పెట్టుకుని, మరో పెద్ద కట్టెను భుజాన వేసుకుని వస్తోంది. తల్లి కష్టాన్ని చూడలేక ఆమె భుజాలపై ఉన్న పెద్ద కట్టెను చిన్నారులిద్దరూ తమ భుజాలపైకి తీసుకుని దాదాపు నాలుగు కిలోమీటర్లు నడిచారు. గుంటూరు జిల్లా (Guntur District) వట్టిచెరుకూరు మండలం ఐదో మైలు సమీపంలో కనిపించిన ఈ దృశ్యం చూపరులను కట్టిపడేసింది. – ప్రత్తిపాడుమంచు జల్లులో తడిసి ప్రకృతి పులకిస్తోంది.. వెండి చినుకులు ఆకుల అంచులపై నుంచి సుతారంగా జాలువారుతూ నేలను మురిపెంగా ముద్దాడుతుంటే.. మట్టి తడిసి ముద్దవుతోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోన సీమ జిల్లా మలికిపురం మండలం గుడిమళ్ల లంకగ్రామంలో మంగళవారం ఉదయం మంచు కురుస్తున్న దృశ్యం అబ్బురపరిచింది.– సాక్షి ఫొటోగ్రాఫర్, రాజమండ్రిహెల్మెట్ ధరించి వాహనాలు నడిపి ప్రాణాలు కాపాడుకోవాలని, ఫిబ్రవరి 1 నుంచి తప్పనిసరిగా హెల్మెట్ (Helmet) వాడాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కే.వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. ఆమె ఏలూరులో (Eluru) హెల్మెట్ ధరించని వాహనదారులకు మంగళవారం అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించని పలువురికి చలానా విధించారు. – సాక్షి ఫోటోగ్రాఫర్, ఏలూరు కీడల్లో రాణించాలన్న వారి పట్టుదల ముందు రన్నింగ్ ట్రాక్ చిన్నబోయింది. ఉత్తి కాళ్లపై విద్యార్థినులు పోటీల్లో పరుగు పెట్టిన తీరు ఆకట్టుకుంది. విశాఖపట్నంలో మంగళవారం రాష్ట్ర స్థాయి రన్నింగ్ పోటీలు నిర్వహించగా... ఇందులో కొంత మంది విద్యార్థినులు కాళ్లకు షూ లేనప్పటికీ.. పోటీల్లో ఇలా పాల్గొన్నారు. – సాక్షి ఫోటోగ్రాఫర్, విశాఖపట్నం ఫిషింగ్ హర్బర్లో భారతీయ మత్స్య పరిశోధనా సంస్థ, విశాఖపట్నం (Visakhapatnam) ఆధ్వర్యంలో రెండు పరిశోధనా నౌకల్లో ప్రజలు, విద్యార్థులు సందర్శన కోసం ఓపెన్ హౌస్ నిర్వహించారు. మత్స్య షికారి, మత్స్య దర్శిని నౌకల సందర్శనకు విద్యార్థులు భారీగా బారులు తీరారు. – సాక్షి ఫోటోగ్రాఫర్, విశాఖపట్నంచదవండి: అమ్మకడుపులో రాచపుండు -
టీడీపీ నేతలు అధికార దుర్వినియోగం చేస్తున్నారు
-
కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలు: అంబటి
సాక్షి, గుంటూరు: కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు పాల్పడుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొంతమంది కార్పొరేటర్లు పార్టీ మారారని.. కూటమి బలం ప్రకారం స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు పోటీ చేయకూడదన్నారు. ఎమ్మెల్యేలు సిగ్గు విడిచి కార్పొరేటర్లు ఇళ్లకి వెళ్లి ప్రలోభాలకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక్కో కార్పొరేటర్కి యాభై లక్షలు ఇస్తామంటున్నారు. కార్పొరేటర్లను కొంటున్న విధానాన్ని ప్రజలు గమనించాలి. కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని అంబటి మండిపడ్డారు.ప్రజాస్వామ్యానికి టీడీపీ విఘాతం: అప్పిరెడ్డివైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ, కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ నేతలు ప్రలోభాలకు పాల్పడుతున్నారని.. లక్షల రూపాయలు కార్పొరేటర్లకు వెదజల్లుతున్నారన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు ప్రజాస్వామ్యానికి విఘాతం కల్గిస్తున్నారు.. మా కార్పొరేటర్లు నిజాయితీగా వైఎస్సార్సీపీకి మద్దతు ఇస్తున్నారు. ప్రజాస్వామ్యబద్దంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగాలి’’ అని అప్పిరెడ్డి హితవు పలికారు.ప్రజాస్వామ్యానికి టీడీపీ తూట్లు: మనోహర్మేయర్ కావటి మనోహర్ మాట్లాడుతూ, ఆరు స్టాండింగ్ కమిటీ సభ్యులను గెలుచుకునే బలం మాకుంది. కేంద్ర మంత్రి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. కూటమి బలం కేవలం పదకొండు సభ్యులు మాత్రమే. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ కార్పొరేటర్లను బెదిరిస్తున్నారని మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మాజీ ఎంపీ నందిగం సురేష్కు బెయిల్
సాక్షి, గుంటూరు: మాజీ ఎంపీ నందిగం సురేష్కు బెయిల్ మంజూరైంది. గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది.టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యథేచ్ఛగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తూ.. ఇష్టానుసారం కేసులను బనాయిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగానే మాజీ ఎంపీ నందిగం సురేష్ను కూడా అరెస్టు చేశారు. దాదాపు ఐదు నెలలుగా నందిగం సురేష్ జైలులో ఉన్నారు. ఆధారాలు లేకుండా సురేష్పై కేసులు పెట్టారంటూ కూటమి సర్కార్పై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. -
‘ఊసరవెల్లి చంద్రబాబు.. పెట్టుబడుల రాకపోవడంతో యూటర్న్’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. స్వతంత్ర్య సమరయోధుల ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పార్టీ నేతలు. రిపబ్లిక్ డే సందర్బంగా జాతీయ జెండాను మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక, ఏపీలోని పలు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నేతలు జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ సమానంగా ఎదగాలనే దృక్పథంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాం. పేదరికం లేని సమాజం కోసం మనమంతా కృషిచేయాలి. మనల్ని మనం పరిపాలించుకుంటూ ఎంతో పురోభివృద్ధిలోకి వెళుతున్నాం. బ్రిటీష్ పాలకుల నుంచి విముక్తి కోసం బానిస సంకెళ్ళు తెంచుకుని పరిపాలించుకోవాలని అనేక మంది పోరాటాలు చేశారు.ఈ క్రమంలో మనల్ని మనం పరిపాలించుకునే సర్వసత్తాక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకున్నాం. అందరూ సమానంగా ఎదగాలనే దృక్పథంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడా లేని కార్యక్రమాలను మన పాలనలో చూశాం. ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యంగా ఎదగాలనే మన ప్రయత్నం కొనసాగించాలి. పేదరికాన్ని పారద్రోలి స్వతంత్ర భారతాన్ని నిర్మించుకోవడానికి మనమంతా కృషిచేయాలని పార్టీ తరఫున ప్రజలకు విజ్క్షప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా వేడుకల్లో పార్టీ నేతలు పాల్గొన్నారు. విశాఖలో వేడుకలు..విశాఖలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండానుమాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆవిష్కరించారు. అనంతరం అమర్నాథ్ మాట్లాడుతూ..‘మన రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలులో లేదు. రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోంది. రాష్ట్ర ప్రజల హక్కులను వైఎస్సార్సీపీ కాపాడుతుంది. విజయసాయి రెడ్డి రాజీనామా గురించి ఆయనే చెప్పారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని మాట్లాడారు. తన లాంటి వారిని వెయ్యి మందిని తయారు చేయగలరని సాయిరెడ్డి చెప్పారు.నాయకులను ఏ విధంగా తయారు చేయాలో వైఎస్ జగన్కు తెలుసు. వైఎస్ జగన్ ఒక టార్చ్బేరర్. చంద్రబాబు మీద నమ్మకం లేకనే గతంలో టీడీపీ రాజ్యసభ సభ్యులు నలుగురు టీడీపీని వీడిచారా. నాయకుల మీద రాజకీయంగా ఒత్తిడి ఉంటుంది. కొంతమంది తట్టుకుంటారు మరి కొంతమంది తట్టుకొని నిలబడలేరు. పెట్టుబడులు రాకపోయేసరికి దావోస్ పర్యటనపై చంద్రబాబు మాట మార్చారు. దావోస్ పర్యటన ఒక మిథ్య అంటూ మాట్లాడుతున్నారు. పదిసార్లు దావోస్ వెళ్లి వచ్చిన తరువాత మిథ్య అని తెలిసిందా? అంటూ ప్రశ్నించారు. విజయవాడలో..విజయవాడలో జాతీయ జెండా ఎగురవేసిన సెంట్రల్ నియోజకవర్గ మాజీ MLA మల్లాది విష్ణు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ..‘రాజ్యాంగ అమలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. రాజ్యాంగ వ్యతిరేక శక్తులు రాజ్యమేలుతున్నాయి. రాజ్యాంగానికి అనుగుణంగా పని చేయాల్సిన సంస్థలు వ్యతిరేకంగా పని చేస్తున్నాయి. గవర్నర్ చేత ప్రభుత్వం అన్ని అబద్దాలు చెప్పించింది.దావోస్ పర్యటనలో ఒక్క పరిశ్రమ రాలేదు. పరిశ్రమలు తీసుకురాకుండా ఎదురుదాడి చేస్తున్నారు. షేక్ హాండ్స్ కోసం కాదు దావోస్కు వెళ్లేది. సంక్షేమ పథకాలు అమలు చేస్తామని నేడు ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. మూడు పార్టీలు భిన్నమైన ఆలోచనతో ముందుకు వెళ్తున్నాయి. ఓటు ద్వారా, నియంతృత్వం ద్వారా ఓటు హక్కును వినియోగించుకొన్నామని చెప్పే వాళ్ళు ముందుకు రావాలి.. ప్రభుత్వాన్ని ప్రశించాలి. విద్య, వైద్యాల్లో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఆసుపత్రుల్లో పిల్లలను ఎత్తుకెళ్తున్నారు.. కనీసం మందులు కూడా లేవు. వ్యవస్థలను ప్రక్షాళన చేయాలి. తప్పులు ఎవరు చేస్తున్నారు, ఎవరు అబద్ధాలు, ఎవరు ప్రజల్లో మోసం చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి అని కామెంట్స్ చేశారు.వైఎస్సార్ జిల్లాలో..వైఎస్ఆర్ జిల్లాలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ జెండా ఎగురవేసిన జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాష, మేయర్ సురేష్ బాబు. ఈ సందర్భంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఎన్టీఆర్ జిల్లాలో..ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది త్యాగం ఫలితంగా ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. గత ఐదేళ్లలో అంబేద్కర్, మహాత్మా గాంధీ ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లిన నాయకుడు వైఎస్ జగన్. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సుసాధ్యం చేసిన వ్యక్తి వైఎస్ జగన్. రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడంలో వైఎస్ జగన్ అడుగుజాడల్లో మేము వెళ్తాం అని అన్నారు. -
నాకు చెప్పకుండా ఎలా వస్తావ్..?.. గుంటూరు ఈస్ట్ టీడీపీలో వర్గపోరు
సాక్షి, గుంటూరు: నగరంలోని ఈస్ట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో వర్గపోరు బయటపడింది. ఆర్టీసీ కాలనీలో లోకేష్ పుట్టినరోజు వేడుకలకు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హాజరు కాగా, తనకు చెప్పకుండా మా డివిజన్లోకి ఎలా వస్తారంటూ ఎమ్మెల్యేను డివిజన్ పార్టీ అధ్యక్షుడు యాసిన్ అడ్డుకున్నారు.ఎమ్మెల్యే నసీర్ అహ్మద్కు యాసిన్ వర్గీయులు వార్నింగ్ ఇవ్వడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్పై యాసీన్ వర్గీయులు దాడికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.తంబళ్లపల్లె టీడీపీలో..కాగా, తంబళ్లపల్లె టీడీపీలో ఇప్పటికే వర్గపోరు నడుస్తుండగా.. లోకేష్ బర్త్డేతో అది రచ్చకెక్కింది. డిప్యూటీ సీఎం, సీఎం అంటూ లోకేష్పై సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకున్న వేళ ఈ ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది. మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్బంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆ పార్టీలో రెండు వర్గాల మధ్య చిచ్చును మరింత రాజేశాయి. ఈ క్రమంలో నారా లోకేష్ సహా ఇతర మంత్రులు ఉన్న ఫ్లెక్సీలను చించిపాడేసింది మరో వర్గం. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తతలు చోటుచేసుకోగా.. కేసు నమోదైంది.తంబళ్లపల్లె టీడీపీలో మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్సెస్ ఇంఛార్జి దాసరిపల్లి జై చంద్రారెడ్డి వర్గాల మధ్య చాలాకాలంగా వర్గపోరు నడుస్తోంది. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని ఆకర్షించే ఉద్దేశంతో పోటాపోటీగా ఫ్లెక్సీలు వెలిశాయి. బుధవారం రాత్రి శంకర్ వర్గీయులు పట్టణంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. శంకర్ ప్రధాన అనుచరుడు, మండల బీసీ సెల్ అధ్యక్షుడు పురుషోత్తం బాబు ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదే సమయంలో.. ఇంఛార్జి జైచంద్రారెడ్డి విడిగా తన అనుచరులతో లోకేష్ పుట్టినరోజు కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు.అందులో శంకర్కు చోటు లేకుండా చూసుకున్నారు కూడా!. అయితే రాత్రికి రాత్రే కేవలం శంకర్ వర్గం ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలను ఎవరో చించేశారు. చంద్రారెడ్డి ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలు మాత్రం అలాగే ఉన్నాయి. దీంతో ఇది చంద్రారెడ్డి వర్గీయుల పనిగా పురుషోత్తం అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. -
తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద టీడీపీ ఓవరాక్షన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద టీడీపి కార్యకర్తలు ఓవరాక్షన్కు దిగారు. కార్లు, బైకులపై వచ్చి హడావుడి చేశారు. పార్టీ ఆఫీసు ముందు వాహనాలను ఆపి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా వాహనాల్లో వచ్చి హల్ చల్ చేశారు. -
కమిషనర్ పులి శ్రీనివాసులు అక్రమాలకు పాల్పడ్డారు: మనోహర్ నాయుడు
-
గుంటూరు మేయర్, కమిషనర్ మధ్య వివాదం
-
మీటింగ్కు కమిషనర్ డుమ్మా.. గుంటూరు మేయర్ సంచలన వ్యాఖ్యలు
గుంటూరు, సాక్షి: మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి కమిషనర్ పులి శ్రీనివాసులు డుమ్మా కొట్టడంపై మేయర్ కావట్టి మనోహర్ నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరద సహాయం పేరుతో ఖర్చుపెట్టిన నిధులకు లెక్క చెప్పాల్సి వస్తుందని కారణంతోనే కమిషనర్ సమావేశాలకు రావట్లేదని ఆయన ఆరోపించారు. శుక్రవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. ..మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు(Puli Srinivasulu) ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.. ప్రభుత్వాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారు. మేయర్ నిర్ణయించిన తర్వాత ఖచ్చితంగా సమావేశం నిర్వహించాల్సిందే. ఈనెల 4వ తేదీన జరిగిన సమావేశంలో విజయవాడ వరదల సహాయం కింద ఖర్చుపెట్టి అంశం మీద ప్రశ్న లేవనెత్తాం. ఆ సమావేశం నుంచి ఆయన అర్ధాంతరంగా వెళ్లిపోయారు. అప్పటి నుంచి కమిషనర్ సమాధానం చెప్పకుండా తప్పించుకోవడానికి నాటకాలు ఆడుతున్నారు. నగర వరద బాధితుల సహాయం పేరుతో కార్పొరేషన్ సొమ్మును9 కోట్ల 24 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఎంతెంత సాయం చేశారన్నదానిపై మంత్రులు, ఎమ్మెల్యేలకే క్లారిటీ లేకుండా పోయింది. మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసరావు 9 కోట్ల 24 లక్షలు దోచేశారు. పైగా ఖర్చులకు సంబంధించిన తప్పుడు నివేదిక అందించారు. కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోటేశ్వరరావు ఖాతాలో కోటి రూపాయలు జమ చేశారు. కనీసం ఎవరెవరికి ఎంత చెల్లించారో కూడా కమిషనర్ చెప్పటం లేదు. ప్రజల సొమ్మును దోచేసిన కమిషనర్ పై వెంటనే విచారణ చేయాలని ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి లేఖలు రాస్తా. మున్సిపల్ కమిషనర్(Municipal Commissioner) కు ఓపిక, సహనం ఉండాలి. నేనొక ఐఏఎస్ని.. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అంటే కుదరదు. ప్రజలకు ఆయన జవాబుదారిగా వ్యవహరించాలి. పది రోజుల క్రితం కౌన్సిల్ జరుగుతుండగా మధ్యలో అర్ధాంతరంగా కమీషనర్ పులి శ్రీనివాస్ వెళ్లిపోవడం మంచి పద్ధతి కాదు. పులి శ్రీనివాస్ కేవలం మేయర్ను, కార్పొరేటర్లను మాత్రమే కాదు.. 11 లక్షల మంది జనాల్ని అవమానించారు. ఆయన మేయర్, డిప్యూటీ మేయర్ ఉన్న సిబ్బందిని కూడా ఏకపక్షంగా తొలగించారు. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు.ఇవాళ కౌన్సిల్ సమావేశం నిర్వహించమని ఎనిమిదో తారీకు కమిషనర్ పులి శ్రీనివాసులుకు లెటర్ రాశాను. అయినా ఆయన రాలేదు. ఎక్కడ తాను చేసిన అవినీతి చెప్పాల్సి వస్తుందోనని కమిషనర్ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల పేరుతో సమావేశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ప్రజల సొమ్మును దోచేసిన కమిషనర్ సమాధానం చెప్పకుండా తప్పించుకోలేరు.. అని మేయర్ కావట్టి మనోహర్ నాయుడు అన్నారాయన. -
గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ తీరుపై అంబటి రాంబాబు ఆగ్రహం
-
‘కూటమి’ అరాచకాలను ప్రశ్నిస్తాం.. ఎదిరిస్తాం: అంబటి
సాక్షి, గుంటూరు: పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు(Namburu Sankara Rao) కార్యాలయంపై దాడి చేసిన టీడీపీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ ఎస్పీకి వైఎస్సార్సీపీ(YSRCP) నేతలు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆ పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు. కొందరు తన కార్యాలయంలోకి చొరబడి ఫ్లెక్సీలు చింపి, అక్కడ ఉన్న పార్టీ నాయకులు, కార్యాలయ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారని.. ఈ అంశంపై ఇవాళ(బుధవారం) జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినట్లు నంబూరు శంకర్రావు తెలిపారు.సహించం.. కచ్చితంగా తిప్పి కొడతాం: నంబూరు శంకర్రావు..మా కార్యాలయంపై దాడి చేసి తమ సిబ్బందిపై తిరిగి కేసులు పెట్టారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదు. గత కొన్ని నెలల క్రితం పెదకూరపాడులో వైఎస్సార్సీపీ నేత సాంబిరెడ్డి కాళ్లు నరికారు. మా పార్టీ, కార్యకర్తలపై పెదకూరపాడులో దాడులు జరుగుతున్నాయి. గతంలో కొమ్మలపాటి శ్రీధర్, కన్నా లక్ష్మీనారాయణ, నేను పనిచేశాం. ఇలాంటి ఘటనలను ఇకపై మేము సహించేది లేదు.. కచ్చితంగా తిప్పి కొడతాం.నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలను ఉపేక్షించేది లేదు. తప్పకుండా ప్రశ్నిస్తాం. ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. వచ్చిన పదవి అవకాశాన్ని మంచిగా ఉపయోగించాలి. నియోజకవర్గ అభివృద్ధిపై, ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలి’’ అని నంబూరు శంకర్రావు పేర్కొన్నారు.చంద్రబాబు ఇకనైనా కళ్లు తెరవాలి: అంబటి రాంబాబుమాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పోలీసులు రాజకీయ ఒత్తిడికి గురవుతున్నారని.. కూటమి నేతలు ఏడు నెలల్లో చేయకూడని అరాచకాలు చేశారని మండిపడ్డారు. ‘‘ఐదేళ్లు పాటు పెదకూరపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన శంకర్రావుపై దాడి చేస్తామంటున్నారు. గతంలో నియోజకవర్గంలో రైతులను పరామర్శించేందుకు వెళ్లగా ఆయన కారుపై దాడికి పాల్పడ్డారు.. ఇది సహించరాని ఘటన. కచ్చితంగా పెదకూరపాడు వెళ్తాం.. కార్యకర్తల సమావేశం నిర్వహిస్తాం. పోలీసులే మాకు రక్షణ కల్పించాలి.ఇదీ చదవండి: ఇదేం బ్రొమాన్స్ బాబోయ్.. మోదీ పగలబడి నవ్వింది అందుకే!..రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో అరాచక పాలన సాగుతుంది. చంద్రబాబు ఇకనైనా కళ్లు తెరవాలి. పిల్లిని గదిలో వేసి కొడితే పులి అవుతుంది ఆ విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో రోజు రోజుకీ సమస్యలు ముదురుతున్నాయి. పండుగ కూడా చేసుకోకుండా దాడులు చేస్తున్నారు. ఇలాంటి దాడులను ఎదిరించి, ధైర్యంగా నిలబడతాం. టీడీపీ చేసే ప్రతి దాడిని, దౌర్జన్యాన్ని ప్రజలకు వివరిస్తాం’’ అని అంబటి రాంబాబు తెలిపారు. -
మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర రావు కార్యాలయంపై పచ్చ గూండాల దాడి
-
గుంటూరు మున్సిపల్ కమిషనర్ తీరుపై డిప్యూటీ మేయర్ ఫైర్
-
గుంటూరులో మంత్రి సత్యకుమార్కు చేదు అనుభవం
-
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
-
ఏం.. తమాషాలు చేస్తున్నారా?.. పట్టాభిపురం పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి,అమరావతి: గుంటూరు పట్టాభిపురం పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకోవద్దని ఆదేశాలు జారీ చేశాం. అయినా ఎందుకు తలదూరుస్తున్నారు’ అంటూ మండిపడింది. మంగళవారం హైకోర్టులో డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు సోదరి వజ్ర కుమారి, వసంత ఇంటి వ్యవహార కేసు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశించినా.. సివిల్ వ్యవహారంలో పట్టాభిపురం పోలీసులు జోక్యం చేసుకుంటున్నారంటూ వజ్రకుమారి, వసంతల తరఫున న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమ వ్యతిరేక వర్గానికి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తమ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారని చెప్పారు. అనంతరం, తమ ఆదేశాలను ధిక్కరించిన పట్టాభిపురం పోలీసులపై హైకోర్టు న్యాయమూర్తి పై విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆదేశాలను కచ్చితంగా అమలు అయ్యేటట్లు చూడాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశించారు. కోర్టు ఆదేశాల్ని ధిక్కరిస్తే సదరు పోలీసులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. -
టాలీవుడ్ డైరెక్టర్కు షాక్.. మాట్లాడుతుండగా మూకుమ్మడి దాడి!
ఇటీవల థియేటర్లలో విడుదలైన చిత్రం డ్రింకర్ సాయి. ఈ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టిపై దాడి జరిగింది. సక్సెస్ టూర్లో భాగంగా గుంటూరుకు వెళ్లిన ఆయన శివ థియేటర్ వద్ద మాట్లాడుతుండగా ఊహించని విధంగా ఆయనపై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అయితే డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టిపై మంతెన సత్యనారాయణ ఫాన్స్ దాడి చేసినట్లు తెలుస్తోంది. సినిమాలో ఆయన్ను కించపరిచేలా సీన్లు తీశారని విచక్షణ రహితంగా దాడి చేసినట్లు సమాచారం.కాగా.. డ్రింకర్ సాయి చిత్రాన్ని కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో తెరకెక్కించారు. ధర్మ, ఐశ్వర్య శర్మ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం డిసెంబర్ 27న థియేటర్లలో విడుదలైంది. ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించారు. ఓ డ్రింకర్ ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. #DrinkerSai దర్శకుడు మీద దాడి చేసిన మంతెన సత్యనారాయణ అభిమానులు.. pic.twitter.com/xQ7JL6IQbZ— Suresh PRO (@SureshPRO_) December 29, 2024 -
డ్యూటీ... డ్యాన్సుల్లో ట్రాక్ రికార్డ్
విశిష్ట రైల్వే సేవా పురస్కారానికి ఎంపికైన ఉద్యోగిగా గుంటూరుకు చెందిన జవ్వాది వెంకట అనూష వార్తల్లో నిలిచింది. దిల్లీ ప్రగతి మైదాన్ లో జరిగిన 69వ రైల్వే సేవా పురస్కారాల కార్యక్రమంలో అతి విశిష్ట రైల్వే సేవా పురస్కారాన్ని అందుకున్న అనూష కూచిపూడి నృత్యకారిణి కూడా. మనసు ఉంటే మార్గం ఉన్నట్టే... ఒక్క పడవ అని ఏమిటి ఎన్ని పడవల మీద అయినా ప్రయాణం అద్భుతంగా సాధ్యం అవుతుంది!నేర్చుకోవడానికి వ్యక్తులకు మించిన పాఠశాలలు ఉంటాయా?అనూషకు నాన్న ఒక పాఠశాల. ఆయన రైల్వేలో ఇంజినీర్. వృత్తిపట్ల అంకితభావం తండ్రి నుంచే నేర్చుకుంది. తాను కూడా నాన్నలాగే రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంది. జవ్వాది వెంకట నాగ సుబ్రమణ్యంతో అనూషకు వివాహం జరిగింది. ఆయన అప్పుడు కేరళ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. 2008లో మళ్లీ సివిల్స్ రాసి ఐఎఎస్కు ఎంపిక అయ్యారు. ‘మరింత కష్టపడాలి’ అనే పాఠాన్ని భర్త నుంచి నేర్చుకున్న అనూష ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజినీర్ (ఐఆర్ఎస్ఈ)గా ఎంపిక అయింది.ఇక కళలకు సంబంధించి అమ్మ తనకు పాఠశాల.తల్లి స్ఫూరితో కూచిపూడి నేర్చుకుంది. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత వేదాంతం రామలింగశాస్త్రి శిష్యురాలైన అనూష యూరోపియన్ తెలుగు అసోసియేషన్, అమెరికన్ తెలుగు అసోసియేషన్ కార్యక్రమాలలో చిన్నప్పుడే ప్రదర్శనలు ఇచ్చింది. ఈ ఏడాది జూన్ లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం, సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో భోపాల్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చింది.నృత్యంలో ‘భేష్’ అనిపించుకున్న అనూష ఉద్యోగ జీవితంలో ‘ది బెస్ట్’ అనిపించుకుంది.‘గుంటూరు డివిజన్ కు 2022లో వచ్చాను. కృష్ణకెనాల్ జంక్షన్ నుంచి కృష్ణా నదివైపు ఉన్న ట్రాక్ వీక్గా ఉండేది. దీనికోసం ప్రతి ఏటా 50 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చేది. జియో టైల్స్, జియో బ్రిడ్జెస్ వేసి కొత్త తరహాలో ట్రాక్ను పటిష్టపరిచాము. దీనివల్ల ఇప్పుడు ఏడాదికి రెండు లక్షలు కూడా ఖర్చు అవ్వడం లేదు. పెద్ద పెద్ద యంత్రాలు వాడకుండా ఎన్నో పనులను వినూత్న రీతిలో పూర్తి చేశాము. దీనికి కూడా జీఎం నుంచి ప్రశంసలు అందుకున్నాను. ఈ ప్రయోగాలు గుంటూరు డివిజన్ కు బోలెడంత పేరు తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే రైల్వేబోర్డు నన్ను గుర్తించింది. అతి విశిష్ట రైలు సేవా పురస్కారం దక్కింది. మన కష్టం వల్ల వచ్చిన ఫలితాన్ని చూసినప్పుడు వృత్తిపట్ల అంకితభావం మరింతగా పెరుగుతుంది’ అంటుంది అనూష. వృత్తి జీవితంలో, కూచిపూడి నృత్యకారిణిగా ఆమె మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆశిద్దాం.ఎన్నో అడ్డంకులు... అయినా సరే ముందుకు వెళ్లాం!నా భర్త అస్సాం కేడర్ ఐఏఎస్ కావడంతో నాకు కూడా నార్త్ ఈస్ట్ రైల్వేలో పోస్టింగ్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా వచ్చింది. అక్కడ తీవ్రవాదంతో పాటు బ్రహ్మపుత్ర వరదల సమస్య ఎక్కువగా ఉన్న కారణంగా ఏడాదిలో ఎనిమిది నెలలు ΄్లానింగ్, నాలుగు నెలలు మాత్రమే ఎగ్జిక్యూషన్ ఉండేది. అక్కడ ఉన్న పరిస్థితుల్లో రైలు నడిచేలా చర్యలు తీసుకోవడంతోపాటు సిబ్బందిని కాపాడుకోవడం కూడా ఒక పెద్ద టాస్క్లా ఉండేది. ఎన్నో ఇబ్బందులను అధిగమిస్తూ ముందుకు సాగాము. రెండు వర్గాల మద్య పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ సమయంలో రైల్వే కూడా రాష్ట్ర పరిధిలోకి వచ్చింది. మేం కూడా వారితో కలిసి ప్రశాంతత నెలకొల్పే విషయంలో గట్టిగా పనిచేశాం. గౌరీపూర్ నుంచి బిలాస్పూర్ వరకూ కొత్త రైల్వేలైన్ వేసిన సమయంలో బ్రహ్మపుత్రపై పెద్ద పెద్ద బ్రిడ్జీల నిర్మాణం విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాము. భూసేకరణ కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. అన్నింటిని అధిగమించి రైల్వే లైన్ పూర్తి చేయడం పెద్ద అచీవ్మెంట్. దీనికి గుర్తింపుగా రైల్వే జీఎం అవార్డు వచ్చింది.– జవ్వాది వెంకట అనూష– దాళా రమేష్బాబు, సాక్షి ప్రతినిధి గుంటూరుఫోటోలు: షేక్ సుభానీ, లక్ష్మీపురం -
‘హామీలు ఇచ్చి మర్చిపోవడం చంద్రబాబుకి అలవాటే’
సాక్షి,గుంటూరు : కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ చార్జీల పెంపు ద్వారా రాష్ట్ర ప్రజలపై ఏకంగా రూ.15,485 కోట్ల భారాన్ని మోపింది. ఛార్జీల పెంపునకు నిరసనగా వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ పోరుబాట కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి పార్టీ నేతలు వైఎస్సార్సీపీ పోరుబాట పోస్టర్ను ఆవిష్కరిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం గుంటూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో ‘విద్యుత్ చార్జీల బాదుడుపై వైఎస్సార్సీపీ పోరుబాట’ పేరుతో పోస్టర్ను ఆవిష్కరించింది. పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, నూరి ఫాతిమాలు పాల్గొన్నారు. పోస్టర్ ఆవిష్కరణ అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఈనెల 27న రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించనున్నాం. ఆరు నెలల క్రితం ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది. వైఎస్సార్సీపీ పాలనలో విద్యుత్ ఛార్జీలు పెంచారని తాము అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచమని చెప్పారు. ఛార్జీలు తగ్గిస్తామన్నారు. కానీ భారీ మొత్తంగా విద్యుత్ ఛార్జీలు పెంచారు. రెండు నెలల్లో రూ. 15484 కోట్ల భారం మోపారు. కూటమి నేతలకు రాష్ట్ర ప్రజలకు శఠగోపం పెట్టారు. ఏరు దాటాక తెప్ప తగలేయడం, ఎన్నికలకు ముందు హమీలివ్వడం.. ఆ తర్వాత వాటిని మర్చిపోవడం చంద్రబాబుకు అలవాటేనని ఎద్దేవా చేశారు.ప్రజలు అండగా వైఎస్సార్సీపీ పోరు బాట : భూమన వైఎస్సార్సీపీ పోరు బాట పోస్టర్ను ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. చంద్రబాబు ,పవన్ కళ్యాణలు ఎన్నికలకు ముందు విద్యుత్ భారాన్ని మోపమని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు. రెండు విడతలగా 15 వేల కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల భారం మోపారు. సూపర్ సిక్స్లో ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రతి నెలా డైవర్ట్ చేస్తున్నారు.ప్రతి పేదవాడి ఇంటికి 200యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి. అబద్దపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు ఒక్క హామీని నెరవేర్చలేదు. ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపి, ధరలు పెంచి వారి నడ్డివిరుస్తోంది కూటమి ప్రభుత్వం. ప్రజల పక్షాన పోరాడేందుకు వైఎస్సార్సీపీ ఉంటుంది. గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ విధంగా పోరాటాలు చేశారో.. అదే విధంగా మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం.మూడు లక్షల కోట్లు రూపాయలు ప్రజలకు నేరుగా అందించిన ఘనత వైఎస్ జగన్దే. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ఆందోళన చేపడతాం. డిసెంబర్ 27వ తేదీ విద్యుత్ కార్యాలయాల్లో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై వినతి పత్రాన్ని ఇస్తాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. -
గుంటూరులో కొనసాగుతున్న టీడీపీ నేతల అరాచకం
-
పూర్తిగా చంద్రముఖిలా మారిన చంద్రబాబు.. వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో కుంభకోణాల మీద కుంభకోణాలు జరుగుతున్నాయి. చంద్రబాబు పూర్తిగా చంద్రముఖిగా మారిపోయారు.. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా.. ఇలా మాఫియాలు చేస్తున్నారన్నారని వైఎస్ జగన్ అన్నారు. ఇలాంటి సమయంలోనే మనం గొంతు విప్పాలని పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. నాయకులుగా ఎదగడానికి ఇదొక అవకాశమని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వైఎస్ మాట్లాడుతూ.. ‘ఆరు నెలలు తిరక్కముందే చంద్రబాబు ప్రభుత్వంమీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం మీదా లేదు. ప్రతి కుటుంబానికి మనం మంచి చేశాం. కానీ, చంద్రబాబు అంతకంటే ఎక్కడు చేస్తానంటూ, ప్రతీ ఇంట్లో ప్రతీ ఒక్కరికీ ఒక హామీ ఇచ్చాడు. మనం కూడా అలాంటి హామీలు ఇద్దామని చాలామంది నాతో అన్నారు. గడచిన ఐదేళ్లలో చరిత్రలో ఎప్పుడూ చూడని మార్పులు మనం తీసుకువచ్చాం. ఎన్నికల మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేశాం. మేనిఫెస్టోకు పవిత్రత తీసుకువచ్చాం, ప్రతీ హామీని తూచా తప్పకుండా అమలు చేశాం.చరిత్రలో వైఎస్సార్సీపీ ఒక్కటే..కోవిడ్ లాంటి సమస్యలు వచ్చినా, ప్రభుత్వ ఆదాయాలు తగ్గినా, ఖర్చు పెరిగినా, సాకులు చూపకుండా, కారణాలు చెప్పకుండా ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను, వాగ్దానాలను అమలు చేశాం. బడ్జెట్లోనే సంక్షేమ క్యాలెండర్ ప్రకటించాం. క్యాలెండర్ ప్రకారం ప్రతీ పథకాన్ని అమలు చేశాం. దేశ చరిత్రలో అమలు చేసిన పార్టీ ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే. చంద్రబాబు మాటలను పదిశాతం ప్రజలు నమ్మారు, నమ్మించగలిగారు. అందుకనే పరాజయం పాలయ్యాం. జగన్ చేశాడు కదా.. చంద్రబాబు కూడా చేస్తాడేమోనని కొంతమంది అనుకున్నారు. ఆరు నెలలు కూడా గడవకముందే చంద్రబాబు మోసాలు, అబద్ధాలు మన అందరికీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని లేపడమే, పులినోట్లో తలపెట్టడమే అని ఆరోజు చెప్పాను. దాన్ని ఇవాళ చంద్రబాబు నిజం చేస్తున్నారు. జగన్ పలావు పెట్టాడు, చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. ఇప్పుడు పలావు పోయిందీ, బిర్యానీ పోయిందీ. ఉన్న పథకాలు పోయాయి.. ఇస్తానన్న పథకాలు రావడంలేదు. ఇప్పుడు ప్రజలపై బాదుడే బాదుడు మొదలైంది. ఆరు నెలల్లోనే ప్రజలపై కరెంటు ఛార్జీల రూపంలో భారం వేశాడు.అంతా మాఫియానే.. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. స్కామ్ల మీద స్కాంలు నడుస్తున్నాయి. శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా.. ఇలా మాఫియాలు నడుస్తున్నాయి. మైనింగ్ జరగాలన్నా, ఏ కాంట్రాక్టు చేయాలన్నా ప్రతీ ఎమ్మెల్యే నుంచి మొదలుకుని ముఖ్యమంత్రి వరకూ నాకింత.. నీకింత అనే కార్యక్రమం నడుస్తోంది. మనం అంతా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ దిశగా పార్టీ అడుగులు వేయాలి. ప్రభుత్వం మీద వ్యతిరేకత పార్టీకి సానుకూలంగా మారాలంటే ప్రజా సమస్యలపై కలిసి పోరాటం చేయాలి. దీనిపై పార్టీ నాయకత్వాన్ని అంతా చైతన్యం చేస్తున్నాం. ఆరు నెలలకే మనం పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు పాలన అలా నడుస్తోంది.రైతులు ఆగం..రైతులకు మనం ఏడాదికి ఇచ్చే రూ.13,500 ఎగిరిపోయింది.. చంద్రబాబు ఇస్తానన్న రూ.20వేలు ఇవ్వని పరిస్థితి ఉంది. ఉచిత పంటల బీమాను ఎత్తివేశారు. ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. పంటలకు ఎక్కడా గిట్టుబాటు ధరలు దొరకడం లేదు. ధాన్యం కొనుగోలు సమయంలోనే రైతులకు ఎఫ్టీవో ఇచ్చే వాళ్లం. రూ.300-400 తక్కువ రేటుకు రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తోంది. దీనిపై ఇది వరకే మనం కార్యక్రమం చేశాం. ఈనెల 27న కరెంటు ఛార్జీల మీద నిరసన వ్యక్తం చేస్తూ మరో కార్యక్రమం చేస్తున్నాం. పెరిగిన బిల్లులు చూపిస్తూ వాటిని కాల్చివేస్తున్న పరిస్థితులు చేస్తున్నాం. కరెంటు ఛార్జీల పెంపు మీద నిరసన కార్యక్రమాన్ని నియోజకవర్గాల స్థాయిలో చేపడుతున్నాం. మళ్లీ జనవరి 2న ఫీజు రియింబర్స్మెంట్, వసతి దీవెనమీద నిరసనలకు ప్లాన్ చేశాం.మన ప్రభుత్వ హయాంలో ప్రతీ త్రైమాసికానికి తల్లుల ఖాతాల్లోకి డబ్బులు పంపాం. జనవరి ఒకటో తేదీ నాటికి నాలుగు త్రైమాసికాలుగా ఫీజులు చెల్లించడం లేదు. అలాగే వసతి దీవెన బిల్లు కూడా పెండింగ్లో ఉన్నాయి. మొత్తంగా రూ.3,900 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. దీంతో చదువులకు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. డబ్బులు కట్టలేక పిల్లలు చదువులు మానేస్తున్నారు. వీరికి అండగా జనవరి 3న జిల్లా కేంద్రంగా పార్టీ కార్యక్రమం చేస్తుంది:కష్టం ఎల్ల కాలం ఉండదు..ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు, నష్టాలు ఉంటాయి. కేసులు కూడా పెడతారు, జైల్లో కూడా పెడతారు. ప్రతీ కష్టానికి ఫలితం ఉంటుంది. చీకటి తర్వాత వెలుగు కూడా వస్తుంది. ఎవరికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా.. నావైపు చూడండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. నా భార్య బెయిల్ పిటిషన్ కనీసంగా 20 సార్లు పెట్టి ఉంటుంది. కింద కాంగ్రెస్, పైన కాంగ్రెస్. ఎన్ని కష్టాలు పెట్టినా.. నేను ముఖ్యమంత్రిని కాలేదా?. ఇది ప్రతీ ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఎల్లకాలం కష్టాలు ఉండవు. ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి పరిస్థితులనైనా ఢీకొనేలా ఉందాం. మీ అందరికీ జగనన్న, పార్టీ తోడుగా ఉంటుంది.సాగునీటి సంఘాల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. సచివాలయ స్థాయిలో ఇవ్వాల్సిన నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా చేశారు. వీఆర్వోలను మండల కేంద్రాలకు రప్పించి, పోలీసులను కాపలాగా పెట్టించి ఎన్నికలు జరిపారు. అలాంటప్పుడు ఎన్నికలు జరపడం ఎందుకు. రాజీనామాలు చేసి బయటకు వస్తే, రైతులు సంతోషంగా ఉన్నారా? లేదా? తెలుస్తుంది.విజన్ పేరిట మరో డ్రామా..విజన్ 2047 పేరిట మరో డ్రామా జరుగుతోంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు, ఎల్లో మీడియా వారి మేనిఫెస్టోపై ఊదరగొట్టారు. ఈ మేనిఫెస్టోకు దిక్కులేదు, ఇప్పుడు 2047కు అర్థం ఏముంటుంది?. ఇప్పుడు చంద్రబాబు వయస్సు దాదాపు 80 ఏళ్లు. ఒక మనిషిని అభివృద్ధి బాటలో పట్టించడమే విజన్ అని నేను నమ్ముతాను. ఇప్పటి పిల్లాడు 20 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలన్నదానిపై మనం ఆలోచనలు చేస్తే అది విజన్ అవుతుంది. అలాంటి ఆలోచనలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసింది. ప్రైవేటు స్కూల్స్.. గవర్నమెంటు స్కూల్స్తో పోటీపడే పరిస్థితిని తీసుకు వచ్చాం. ఉన్నత విద్యలో విద్యార్థులు అత్యాధునిక కోర్సులు చదువుకునేలా ఎడెక్స్తో ఒప్పందం చేసుకున్నాం. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్శిటీల కోర్సులను నేర్చుకునే అవకాశం కల్పించాం.విజన్ మనది.. ఆరోగ్య రంగంలో కూడా విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చాం. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్ వ్యవస్థను తీసుకువచ్చాం. ప్రివెంటివ్ కేర్ విషయంలో అనేక చర్యలు తీసుకున్నాం. ఆర్బీకే వ్యవస్థ ఒక విజన్. ప్రతీ ఎకరాకు ఈ-క్రాప్ చేయడం విజన్. ప్రతీ ఎకరాకు ఉచిత పంటల బీమా తీసుకురావడం ఒక విజన్.రైతులకు కనీస మద్దతు ధర వచ్చేలా చేయడం ఒక విజన్. ఈ మార్పులన్నీ వచ్చింది వైయస్సార్సీపీ హయాంలోనే..మన ప్రభుత్వం రాక ముందు ఒక రూపాయి ప్రజలకు ఇస్తే.. అది నేరుగా ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి ఉండేదా?. హయంలో ఎక్కడా దళారీ లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేర్చగలిగాం. గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రజల ఇంటి వద్దకే సేవలు అందించి గొప్ప విజన్ను తీసకురాగలిగాం. కానీ, రంగ రంగుల కథలు చెప్తున్నారు. దానికి విజన్ అని పేరుపెడుతున్నారు. దాన్ని విజన్ చేయడం అనరు.. దగా చేయడం అంటారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పెన్షన్లు కట్ చేశారు. కొత్త పెన్షన్లు ఒకరికి ఇవ్వకపోగా.. ఉన్న పెన్షన్లు కట్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం పోరుబాటకు సిద్ధం కావాలి అని సూచనలు చేశారు.