‘కూటమి’ వేధింపులు.. గుంటూరు మేయర్‌ రాజీనామా | Guntur Mayor Kavati Manohar Naidu Resigns | Sakshi
Sakshi News home page

‘కూటమి’ వేధింపులు.. గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు రాజీనామా

Published Sat, Mar 15 2025 5:24 PM | Last Updated on Sat, Mar 15 2025 6:25 PM

Guntur Mayor Kavati Manohar Naidu Resigns

గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు రాజీనామా చేశారు. కూటమి సర్కార్‌ తనను ఎంతగానో అవమానించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మేయర్ చాంబర్‌కు ఇవ్వాల్సిన సిబ్బందిని తొలగించారని..

సాక్షి, గుంటూరు: గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు రాజీనామా చేశారు. కూటమి సర్కార్‌ తనను ఎంతగానో అవమానించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రాజీనామా పత్రాన్ని కలెక్టర్‌కు పంపా. నా ప్రమేయం లేకుండా స్టాండింగ్‌ కమిటీ పెడుతున్నారు. నా ఛాంబర్‌కు కూడా తాళం వేశారు. నెలరోజుల క్రితం జరిగిన స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల కోసం టీడీపీ నేతలు మా కార్పొరేటర్లను కొనుగోలు చేశారు. కార్పొరేటర్ల ఇంటికెళ్లి బెదిరించారు’’ అని మనోహర్‌ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘ఈ నెల 17 తేదిన స్టాండింగ్ కమిటి సమావేశం నిర్వహిస్తున్నామని అధికారులు నాకు సమాచారం ఇచ్చారు. స్టాండింగ్ కమిటికి నేనే ఛైర్మన్‌ను. స్టాండింగ్ కమిటీలో ఏం ప్రతిపాదనలు ఉండాలి. ఎక్కడ పెట్టాలి. ఎప్పుడు పెట్టాలి అనేది నేను నిర్ణయించాలి. కానీ నాకు తెలియకుండా. నా ప్రమేయం లేకుండా స్టాండింగ్ పెడుతున్నారు. నా ఛాంబర్‌కు తాళం వేశారు. నేను ఛాంబర్‌కు వెళ్తే అధికారులు డ్రామాలు ఆడుతున్నారు.

‘‘గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన నాటినుంచి ఇంత దారుణమైన అవమానం ఏ మేయర్‌కు జరగలేదు. నాపై కూడా కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వైఎస్‌ జగన్‌ దయవల్లే నేను మేయర్‌ అయ్యాను. పీవీకే కూరగాయలు మార్కెట్ పేరు మార్చితే చూస్తూ ఊరుకోం’’ అని మనోహర్‌ నాయుడు హెచ్చరించారు.

గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా

 

 

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement