mayor
-
జగన్ కోసం దేనికైనా సిద్ధం.. ఎల్లో మీడియాకి వార్నింగ్
-
విశాఖ మేయర్ అవిశ్వాస తీర్మానంపై కరణం ధర్మశ్రీ కామెంట్స్
-
పోలీసులు పచ్చచొక్కాలు తొడుక్కున్నారు: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం మేయర్ పదవిని అడ్డదోవలో దక్కించుకునేందుకు కూటమి పార్టీలు చేస్తున్న కుట్రలకు పోలీసులు పావులుగా మారుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం సందర్బంగా పోలీసులతో వైఎస్సార్సీపీ కార్పోరేటర్లను ప్రలోభపెట్టడం, భయపెట్టడానికి తెలుగుదేశం నేతలు చేస్తున్న ప్రయత్నాలపై వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేసింది.అనంతరం కలెక్టరేట్ బయట గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ పోలీస్ అధికారులు పచ్చచొక్కాలు వేసుకున్నట్లుగా రాజకీయ ప్రయోజనాల కోసం చట్టాలను అతిక్రమించి పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్సీపీ కార్పోరేటర్ల ఇళ్ళకు అర్ధరాత్రి సమయాల్లో వెళ్ళి మహిళలను బెదిరించడం దారుణమని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎటువంటి అరాచకాలకైనా పాల్పడవచ్చుననే ధీమాతో కూటమి నేతలు ఉన్నారు. వైఎస్సార్సీపీ మేయర్పై తెలుగుదేశం పార్టీకి మూడింట రెండొంతుల మెజార్టీ లేకపోయినప్పటికీ అవిశ్వాస తీర్మానం పెట్టారు. వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన కొందరిని ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకున్నారు. ఎన్ని చేసినప్పటికీ వైఎస్సార్సీపీకి చాలా స్పష్టమైన మెజారిటీ ఉంది. అయినా కూడా ఏదో ఒకటి చేసి మేయర్ పదవిని చేజిక్కించుకోవాలనే కుట్రతో కూటమి పార్టీలు పనిచేస్తున్నాయి.ఈ నెల 19న అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు నోటీసులు జారీ చేశారు. వైఎస్సార్సీపీ కార్పోరేటర్లను బెదిరిస్తున్నారు. నిన్న ఒక కార్పోరేటర్ ఇంటికి రాత్రి సమయంలో పోలీసులను పంపి, వారి కుటుంబసభ్యులను బెదిరించారు. మహిళలను పోలీస్స్టేషన్కు రావాలని ఒత్తిడి చేశారు. పోలీసులు చట్టాలను కాపాడటానికి ఉన్నారా? తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసేందుకు ఉన్నారా? ఖాకీ దుస్తులు తీసేసి, పచ్చచొక్కాలతో తెలుగుదేశం పార్టీకి సెక్యూరిటీ ఏజెన్సీగా పనిచేస్తున్నారా? దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశాం.సత్తా ఉంటే అవిశ్వాసంలో బలం నిరూపించుకోవాలిఅవిశ్వాస తీర్మానంలో తెలుగుదేశం తమ బలం ఏమిటో నిరూపించుకోవాలి. భయపెట్టి, పోలీసులతో బెదిరింపులకు గురి చేసి పదవులను దక్కించుకోవాలని అనుకుంటున్నారు. ఎల్లకాలం పరిస్థితులు ఇలాగే ఉంటాయని అనుకోవద్దు. రాజకీయాల్లో మార్పు సహజం. అధికార యంత్రాంగం పనిచేయాల్సింది రాజకీయ పార్టీల కోసం కాదు. అంబేద్కర్ రాజ్యాంగం పరిధిలో పనిచేస్తారా? లేక లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం కోసం పనిచేస్తున్నారా?విలువైన భూములను ప్రైవేటుపరంవిశాఖలోని విలువైన పదిహేను వందల కోట్ల రూపాయల భూములను లులూ సంస్థకు ఏకంగా తొంబై తొమ్మిది సంవత్సరాలకు నామమాత్రపు లీజుకే కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేనా సంపద సృష్టి అంటే? ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడంలో మీకున్న ప్రయోజనాలు ఏమిటీ? ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, పీ4 అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. -
‘జీవీఎంసీ మేయర్ పీఠాన్ని నిలబెట్టుకుంటాం’
విశాఖ : సంఖ్యా బలం లేకపోయినా విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని వైఎస్సార్సీపీ రిజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు. తాము జీవీఎంసీ మేయర్ పీఠాన్ని నిలబెట్టుకుంటామన్నారు కన్నాబాబు. ఈరోజు(ఆదివారం) విశాఖలో బొత్స సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కన్నబాబు, గుడివాడ్ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.అనంతరం కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘ టీడీపీ ఎప్పుడూ సిగ్గుమాలిన నీతిలేని రాజకీయం చేస్తుంది. కుట్రపూరితంగా మేయర్ పై అవిశ్వాసం ఇచ్చారు. రాష్ట్ర పాలనను కూటమికి ఇచ్చారు. స్థానిక సంస్థలు వైఎస్సార్సీపీకి ఇచ్చారు. భయపెట్టి మా వాళ్లను తీసుకెళ్తున్నారు. బొత్స అధ్యక్షతన మా కార్పోరేటర్లతో సమావేశం నిర్వహించాం. దొడ్డిదారి రాజకీయాలకు టీడీపీ పేటెంట్.. కూటమి తీరును ఖండిస్తున్నాం. . అదే సమయంలో వారి కుట్రలను ఎదుర్కొంటాం. అనైతికి రాజకీయాలు మానేయాలని సీఎం చంద్రబాబుకి హితవు పలుకుతున్నా’ కన్నబాబు పేర్కొన్నారు.అవిశ్వాస తీర్మానం ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటి?టీడీపీకి సంఖ్యాబలం లేకపోయినా అవిశ్వాస తీర్మానం ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ప్రలోభాలకు గురిచేసి, భయపెట్టి వైఎస్సార్సీపీ కార్పోరేటర్లను కూటమి చేర్చుకుంటుంది. 30, 40 మందితో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని కూటమి సర్కార్ భావిస్తోంది. మా రాజకీయం మేం చేసఆం.. మా వారిని మేం కాపాడుకుంటాం. మా వ్యూహ రచనలతో మేయర్ పీఠాన్ని కాపాడుకుంటాం.’ అని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.విలువలు వదిలేసి.. మేయర్ పదవిపై కన్నేసి -
విలువలు వదిలేసి.. మేయర్ పదవిపై కన్నేసి
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)లో సంఖ్యా బలం లేనప్పటికీ.. బలవంతంగా మేయర్ పీఠాన్ని లాక్కునేందుకు కూటమి కుటిల యత్నాలకు పాల్పడుతోంది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు బెదిరింపులకు పాల్పడుతూ.. ప్రలోభాలకు గురిచేస్తూ బరితెగిస్తున్నారు. అందులో భాగంగానే జీవీఎంసీ మేయర్పై అవిశ్వాస తీర్మానానికి కూటమి పార్టీల కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిర్ ప్రసాద్కు నోటీసు ఇచ్చారు..డబ్బు ఎర.. లొంగనివారికి బెదిరింపులుకూటమిలో చేరితే దాదాపు రూ.25 లక్షలు ఇస్తామంటూ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు ఎర వేస్తున్నట్టు తెలిసింది. అక్కడికీ లొంగకపోతే మరింత ఎక్కువ ఇస్తామంటూ నమ్మబలుకుతున్నారు. మీ వార్డుల్లో పెద్దఎత్తున పనులకు సహకరిస్తాం.. అని ప్రలోభ పెడుతున్నారు. ఈ ఆఫర్లకు ఒప్పుకోని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లను బెదిరిస్తున్నారు. అవిశ్వాసానికి 64 మంది కార్పొరేటర్లు అవసరం..2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో మొత్తం 98 కార్పొరేటర్ల స్థానాలకు గాను వైఎస్సార్సీపీ 58 కైవసం చేసుకుని మేయర్ పదవిని చేజిక్కించుకుంది. టీడీపీ(30), జనసేన (3), సీపీఐ, సీపీఎం, బీజేపీ ఒక్కొక్కటి నెగ్గాయి. స్వతంత్రులు 4 స్థానాల్లో గెలిచారు. ఇద్దరు టీడీపీ కార్పొరేటర్లు మరణించగా జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపొందింది. దీంతో వైఎస్సార్సీపీ బలం 60కి చేరింది. 21వ వార్డు కార్పొరేటర్ వంశీకృష్ణ శ్రీనివాస్ తొలుత ఎమ్మెల్సీగా తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ వార్డుకు ఉప ఎన్నిక జరగక ఖాళీగా ఉంది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల సంఖ్య 59, టీడీపీ సభ్యుల సంఖ్య 28కి తగ్గింది.స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ నుంచి 12 మంది టీడీపీలో, ఏడుగురు జనసేనలో చేరారు. స్వతంత్రులు నలుగురు జనసేనకు మద్దతు తెలపడంతో ఆ పార్టీ బలం 14కి చేరింది. ప్రస్తుతం కూటమికి 55 మంది, వైఎస్సార్సీపీకి 40, సీపీఐ, సీపీఎంలకు ఒక్కో సభ్యుడు ఉన్నారు. అవిశ్వాసం పెట్టాలంటే 2/3 మెజార్టీ కార్పొరేటర్లు (64) ఉండాలి. -
గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా
-
‘కూటమి’ వేధింపులు.. గుంటూరు మేయర్ రాజీనామా
సాక్షి, గుంటూరు: గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేశారు. కూటమి సర్కార్ తనను ఎంతగానో అవమానించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రాజీనామా పత్రాన్ని కలెక్టర్కు పంపా. నా ప్రమేయం లేకుండా స్టాండింగ్ కమిటీ పెడుతున్నారు. నా ఛాంబర్కు కూడా తాళం వేశారు. నెలరోజుల క్రితం జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల కోసం టీడీపీ నేతలు మా కార్పొరేటర్లను కొనుగోలు చేశారు. కార్పొరేటర్ల ఇంటికెళ్లి బెదిరించారు’’ అని మనోహర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఈ నెల 17 తేదిన స్టాండింగ్ కమిటి సమావేశం నిర్వహిస్తున్నామని అధికారులు నాకు సమాచారం ఇచ్చారు. స్టాండింగ్ కమిటికి నేనే ఛైర్మన్ను. స్టాండింగ్ కమిటీలో ఏం ప్రతిపాదనలు ఉండాలి. ఎక్కడ పెట్టాలి. ఎప్పుడు పెట్టాలి అనేది నేను నిర్ణయించాలి. కానీ నాకు తెలియకుండా. నా ప్రమేయం లేకుండా స్టాండింగ్ పెడుతున్నారు. నా ఛాంబర్కు తాళం వేశారు. నేను ఛాంబర్కు వెళ్తే అధికారులు డ్రామాలు ఆడుతున్నారు.‘‘గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన నాటినుంచి ఇంత దారుణమైన అవమానం ఏ మేయర్కు జరగలేదు. నాపై కూడా కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వైఎస్ జగన్ దయవల్లే నేను మేయర్ అయ్యాను. పీవీకే కూరగాయలు మార్కెట్ పేరు మార్చితే చూస్తూ ఊరుకోం’’ అని మనోహర్ నాయుడు హెచ్చరించారు. -
మేయర్ అనే కాదు.. మహిళా అని కూడా చూడకుండా..
-
చిన్న పిల్లని అలా ఎలా ట్రోల్ చేస్తారు.. మేయర్ భాగ్యలక్ష్మి ఫైర్..
-
గ్రేటర్ మేయర్ లవ్స్టోరీ అలా మొదలైంది..!
నాకు క్రికెట్ అంటే ఇష్టం.. మా ఆయన సాయిరెడ్డికి బాస్కెట్ బాల్ అంటే ఇష్టం.. క్రీడా మైదానంలోనే తమ ప్రేమకు పునాది పడిందని హైదరబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తమ ప్రేమ కబుర్లు చెప్పుకొచ్చారు.. వాలంటైన్స్ డే సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రేమ సంగతులు పంచుకున్నారు.. నిత్యం స్పోర్ట్స్ స్టేడియంలో కలుసుకునే మేం మా చదువులు అయ్యాకే పెళ్లి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అలా మా డిగ్రీ, పీజీ అయ్యే వరకు ఎనిమిదేళ్ల పాటు ప్రేమించుకున్నాం. మా నాన్నకు నేను గారాలపట్టీ కావడం వల్ల నా ఇష్టాన్ని ఆయన కాదనలేక పోయారు. మా ఆయన తల్లిదండ్రులు, వారి బంధువులు కూడా అంతా మా ప్రేమను అంగీకరించి ఆశీర్వదించారని చెప్పుకొచ్చారు. నేను క్రికెట్ బాగా ఆడేదాన్ని, బాబీ బాస్కెట్ బాల్ ఆటగాడు.. అలా క్రీడా మైదానాల్లో తరచూ కలుసుకునేవాళ్లం.. మా ప్రేమ విషయాన్ని మా ఇద్దరి ఇళ్లలో చెప్పాం. మా నాన్నకు నా మీద ఉన్న ప్రేమతో నా ప్రేమను కాదనలేకపోయారు. పెళ్లి కాగానే అమెరికా వెళ్లిపోయాం.. 18 ఏళ్ల తర్వాత ఇండియాకు తిరిగొచ్చాం.. నాకు రాజకీయాల్లోకి వెళ్లాలని ఉందని చెప్పగానే గో ఏ హెడ్ అంటూ ప్రోత్సహించారు. మాదేమో పొలిటికల్ ఫ్యామిలీ.. మా ఆయనదేమో బిజినెస్ ఫ్యామిలీ.. అయినా కూడా ఏ ఒక్క రోజు కూడా బాబీ నన్ను ఇబ్బంది పెట్టకపోగా రాజకీయాల్లో వెళ్లేందుకు, నిలదొక్కుకునేందుకు ఎంతో ప్రోత్సాహంగా నిలబడ్డాడు. ఇప్పటికీ మేం ఎంతో ప్రేమగా ఉంటామంటూ తన భర్తను తాను బాబీ అని.. తననేమో విజ్జి అని ప్రేమగా పిలుచుకుంటామంటూ తమ లవ్ జర్నీ చెప్తూ మురిసిపోయారు. (చదవండి: ట్రూ హార్ట్స్..వన్ హార్ట్..! 'కళ' కలిపిన ప్రేమ జంటలు..!) -
డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా టీడీపీ గూండాగిరి
-
chandigarh: మేయర్ ఎన్నికల్లో బీజేపీ విజయం
చండీగఢ్: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఘోర పరాజయం పాలయ్యాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విజయం సాధించింది. బీజేపీకి చెందిన హర్ప్రీత్ కౌర్ బాబ్లా మేయర్గా ఎన్నికయ్యారు. ఈ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా క్రాస్ ఓటింగ్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి మొత్తం 19 ఓట్లు వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు మొత్తంగా 17 ఓట్లు వచ్చాయి. మొత్తం 36 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ పార్టీలో మొత్తం 16 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ-కాంగ్రెస్కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు క్రాస్ ఓట్ చేశారు. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ల సంఖ్య 13, కాంగ్రెస్ కౌన్సిలర్ల సంఖ్య 6. ఓటింగ్ సమయంలో సభలో మొత్తం 35 మంది కౌన్సిలర్లు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం చండీగఢ్ మేయర్ ఎన్నికల(Chandigarh Mayoral Election) కేసులో సుప్రీంకోర్టు పంజాబ్- హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జైశ్రీ ఠాకూర్ను స్వతంత్ర పరిశీలకునిగా నియమించింది. ఈసారి చండీగఢ్ మేయర్ పదవికి ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేలా చూస్తామని ఆ సమయంలో కోర్టు చెప్పింది.గత ఏడాది ఫిబ్రవరి 20న చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో సుప్రీంకోర్టు కీలక తీసుకుంది. నాడు సుప్రీంకోర్టు(Supreme Court) ఓట్ల లెక్కింపును తిరిగి నిర్వహించాలని ఆదేశించింది. చెల్లనివిగా ప్రకటించిన 8 బ్యాలెట్లను చెల్లుబాటు అయ్యేవిగా ప్రకటించారు. బ్యాలెట్ పత్రాలను పరిశీలించి, వీడియో చూసిన తర్వాత ఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు, రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిహ్ను మందలించి, షోకాజ్ నోటీసు జారీ చేశారు.ఇది కూడా చదవండి: ఆకాశం నిర్మలంగా ఉన్నా ప్రమాదం ఎలా జరిగింది?.. ట్రంప్ సందేహం -
కరీంనగర్లో బీఆర్ఎస్కు బిగ్ షాక్
సాక్షి,కరీంనగర్: బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా భావించే కరీంనగర్లో ఆ పార్టీకి తాజాగా బిగ్ షాక్ తగలింది. ఆ పార్టీకి చెందిన కరీంనగర్ నగర మేయర్ సునీల్రావుతో పాటు 10 మంది కార్పొరేటర్లు కమలం తీర్థం పుచ్చుకోనున్నారు. శనివారం(జనవరి25) కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో వీరంతా బీజేపీలో చేరనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి బీఆర్ఎస్ పార్టీకి ప్రతి ఎన్నికలోనూ కరీంనగర్ ప్రజలు అండగా నిలబడ్డారు. ఉప ఎన్నికల్లోనూ పార్టీకి ఘన విజయాలు అందించారు.2023 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కరీంనగర్ ప్రజలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే గెలిపించారు. అయితే తర్వాత ఏడాది 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ పడింది. ఇక్కడి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎంపీగా బండి సంజయ్ ఘన విజయం సాధించి కేంద్ర మంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో కరీంనగర్లో పార్టీకి కీలక నేతగా ఉన్న సునీల్రావు బీజేపీలోకి వెళుతుండడం పార్టీ వర్గాలను కలవరపరుస్తోంది. -
మేయర్పై అవిశ్వాసం
సాక్షి, సిటీబ్యూరో: నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మాన అంశం మంగళవారం నగరంలో హాట్ టాపిక్గా మారింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ జూబ్లీహిల్స్ నివాసంలో జరిగిన విందుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సంభాషణల్లో మేయర్పై అవిశ్వాసం అంశం కూడా ప్రస్తావనకొచ్చింది. మేయర్ పదవీ బాధ్యతలు స్వీకరించి వచ్చే నెల ఫిబ్రవరి 10వ తేదీకి నాలుగేళ్లు పూర్తి కానుండటం, ఆ తర్వాత అవిశ్వాస తీర్మానానికి అవకాశం ఉన్న నేపథ్యంలో మిగ తా అంశాలతో పాటు దీనిపై కూడా కొద్దిసేపు మా ట్లాడినట్లు తెలిసింది. విందుకు పలువురు నేతలు హాజరు కావడం.. మేయర్పై అవిశ్వాసానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు కూడా అవకాశం ఉండటంతో ఇదే అంశంపై చర్చ జరిగిందనే ప్రచారం వైరల్గా మారింది. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో, జీహెచ్ఎంసీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. పార్టీ మారినందునే.. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మేయర్ పదవి కోసం ఎంతోమంది పోటీ పడినా.. గద్వాల్ విజయలక్ష్మికే బీఆర్ఎస్ అవకాశం కల్పించింది. కాగా.. ఆమె కనీస కృతజ్ఞత లేకుండా గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉంది. దీంతో అవిశ్వాసం అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. కేవలం కుటుంబ కార్యక్రమంగా జరిగిన ఈ సమావేశంలో, తాము రాజకీయాల్లో ఉన్నందున రాజకీయ అంశాలు కూడా పిచ్చాపాటీగా చర్చకు వచ్చాయని పార్టీ నాయకుడొకరు తెలిపారు. వివిధ అంశాలతో పాటు మేయర్పై అవిశ్వాసం కూడా ప్రస్తావనకు వచ్చిందిని, అంతకు మించి ఎక్కువ చర్చ జరగలేదని చెప్పారు. బహుశా వచ్చే శనివారం.. లేదంటే ఆదివారం నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు తదితరులతో కేటీఆర్ సమావేశం నిర్వహించనున్నారని సమాచారం. ఆ రోజు రాజకీయ అంశాలతో పాటు రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తదితరాలపై ఎజెండాకు అనునుగుణంగా సమావేశం జరగనున్న ట్లు తెలిసింది. అదే సమావేశంలో మేయర్పై అవిశ్వాసానికి సంబంధించి కూడా విస్తృతంగా చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇంతకీ ఏం జరగనుంది? మేయర్పై అవిశ్వాసం పెడితే ఏం జరగనుంది? గద్వాల్ విజయలక్ష్మి మేయర్ పదవిని కోల్పోక తప్పదా? అనే ప్రశ్నలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనలు, ప్రస్తుతం జీహెచ్ఎంసీలో ఆయా పార్టీల బలాలు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటే పదవి పోయేంత ప్రమాదమేమీ లేదని మున్సిపల్ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. నిబంధనల మేరకు కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుల్లో (స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు) 50 శాతం మంది అవిశ్వాస తీర్మానాన్ని కోరుతూ.. నిరీ్ణత ప్రొఫార్మా ద్వారా సంతకాలు చేసి హైదరాబాద్ జిల్లా కలెక్టర్కు అందజేయాలి. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు మొత్తం 196 మంది ఉండగా, అందులో 98 మంది సంతకాలు చేస్తేనే అది సాధ్యం, బీఆర్ఎస్కు కార్పొరేటర్లు, ఎక్స్అఫీషియోలు కలిసి 71 మంది సభ్యుల బలం ఉంది. ఆ పార్టీలు కలిసి వచ్చేనా? అవిశ్వాసం పెట్టాలంటే మరోపార్టీ కలిసి రావాలి. ఎంఐఎం ప్రస్తుతం కాంగ్రెస్తో సఖ్యతగా ఉండటం తెలిసిందే. కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్తో కలిసి నడుస్తుందని చెప్పలేం. ఇక మిగిలింది బీజేపీ. అది సైతం బీఆర్ఎస్తో కలిసే పరిస్థితి లేదు. ఒకవేళ అవిశ్వాసం కోసమే రెండింటిలో ఏదో ఒక పార్టీ సభ్యులు లోపాయికారీగా సంతకాలు చేసి.. అవిశ్వాసం కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినా అవిశ్వాసం నెగ్గే పరిస్థితి లేదు. జీహెచ్ఎంసీలోని సంబంధిత సెక్షన్ 91–ఎ మేరకు మొత్తం ఓటు హక్కున్న సభ్యుల్లో మూడొంతుల మెజారిటీ ఉంటేనే అవిశ్వాసానికి కోరం ఉన్నట్లు లెక్క. ఆ లెక్కన ప్రస్తుతమున్న కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియోలను పరిగణనలోకి తీసుకుంటే 131 మంది సభ్యుల బలం ఉండాలి. బీఆర్ఎస్తో బీజేపీ కలిసినా, లేక ఎంఐఎం కలిసినా అది సాధ్యం కాదు. బీఆర్ఎస్, బీజేపీ కలిస్తే మొత్తం బలం 116 అవుతుంది. బీఆర్ఎస్, ఎంఐఎం కలిసినా 122 అవుతుంది. కోరమే ఉండనప్పుడు అవిశ్వాసం ముందుకు వెళ్లే పరిస్థితే ఉండదని జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనల గురించి తెలిసిన నిపుణులు చెబుతున్నారు. -
గుంటూరు మేయర్, కమిషనర్ మధ్య వివాదం
-
అక్కడ అనారోగ్యం నిషిద్ధం
నిషిద్ధ ప్రకటనలంటే ఎలా ఉంటాయి? చెత్త వేయొద్దనో, ఫలానా ప్రాంతంలోకి ప్రవేశించొద్దనో ఉంటాయి. కదా! కానీ దక్షిణ ఇటలీలో ఉన్న కాలాబ్రియా ప్రాంతంలోని చిన్న పట్టణమైన బెల్కాస్ట్రో మాత్రం వింతైన ప్రకటన చేసింది. ఆ పట్టణంలో ప్రజలు అనారోగ్యానికి గురికావడం నిషిద్ధం! అవును!! ‘‘వైద్య సాయం అవసరమమ్యే ఎలాంటి అనారోగ్యానికీ లోనవొద్దు. ముఖ్యంగా అత్యవసర చికిత్స అవసరమయ్యే ఎలాంటి అనారోగ్యం బారినా పడొద్దు’’అంటూ బెలాస్ట్రో మేయర్ ఆంటోనియో టార్చియా ఉత్తర్వులు జారీ చేశారు! అంతేకాదు.. గృహ ప్రమాదాలను నివారించడానికి హానికారకమైన ఎలాంటి కార్యక్రమాలూ నిర్వహించొద్దని, ఇల్లు విడిచి ప్రయాణాలు చేయొద్దని, ఆటలు నేర్చుకోవద్దని, ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవద్దని... ఇలా పలు ఆదేశాలతో ఏకంగా ఆర్డినెన్సే జారీ చేశారు! మరోవైపు పర్యాటకులను తమ పట్టణానికి స్వాగతించారు కూడా. ‘‘మా చిన్న గ్రామంలో ఓ వారం పాటు నివసించండి. సురక్షితంగా ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆరోగ్యం పాడైతే ఎలాంటి వైద్య సేవలు కావాలన్నా 45 కి.మీ. దూరంలోని కాటాంజారో వెళ్లాల్సి ఉంటుంది’’అంటూ వారినీ హెచ్చరించారు! నగరానికి పెద్ద దిక్కయిన మేయరే ఇలాంటి ఆదేశాలివ్వడం ఆశ్చర్యమే అయినా అందుకు కారణం లేకపోలేదు. 1,300 మంది జనాభా ఉన్న బెల్కాస్ట్రోలో ఉన్నది ఒకే ఒక ఆరోగ్య కేంద్రం. దాన్నీ తరచూ మూసేస్తారు. వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండరు. ఎమర్జెన్సీ వస్తే కాటంజారో నగరమే దిక్కు. పరిస్థితులను మార్చేందుకు ఎన్నోసార్లు విఫలయత్నం చేసిన మీదట మేయర్ చివరికిలా వ్యంగ్య ప్రకటన చేశారు! అదీ సంగతి. సమస్యలను పరిష్కరించేలా ప్రాంతీయ, ఆరోగ్య అధికారులను రెచ్చగొట్టేందుకే ఇలా ఉత్తర్వులిచి్చనట్టు మేయర్ తెలిపారు. పట్టణంలోని ప్రజారోగ్య కేంద్రం క్రమం తప్పకుండా తెరుచుకునేదాకా ఆర్డినెన్స్ అమల్లో ఉంటుందన్నారు. బెలాస్ట్రో ఇటలీలోని అత్యంత పేద ప్రాంతాలలో ఒకటైన కాలాబ్రియా పరిధిలో ఉంటుంది. యువకులు భారీగా నగరాలకు వలస పోతారు. జనాభా క్షీణిస్తుండటంతో పల్లె, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తే డబ్బు చెల్లించడానికి కూడా ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి. అక్కడ అనేక పట్టణాలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
న్యూ ఇయర్ వేడుకల్లో బడంగ్పేట మేయర్ పారిజాత
రంగారెడ్డి: బడంగ్పేట మేయర్ శ్రీమతి చిగిరింత పారిజాత కొత్త సంవత్సర వేడుకల్లో సందడి చేశారు. మంగళవారం సాయంత్రం ఆల్మాస్గూడలో బోయపల్లి వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించిన వేడుకలకు హాజరయ్యారు. మేయర్ పారిజాత సమక్షంలో జరిగిన వేడుకల్లో అసోషియేషన్ సభ్యులు హుషారుగా గడిపారు. పలువురికి సన్మానాలు చేసి ఆమె బహుమతులు అందజేశారు. అలాగే కాలనీ సమస్యలను పరిష్కరిస్తామని ఆమె అన్నారు. మరోవైపు కార్పొరేటర్ సాంరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటిదాకా చేసిన సేవల్ని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు సత్కరించారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు ఎ. జనార్ధన్, ప్రధాన కార్యదర్శి పి.కవిత, కోశాధికారి సీహెచ్ వినోబా చారి తదితరులు పాల్గొన్నారు. -
కుర్చీ కోసమే మాధవీరెడ్డి పంతం: మేయర్ సురేష్బాబు
సాక్షి,వైఎస్ఆర్జిల్లా:ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఏకపక్షంగా,నియంతలా వ్యవహరిస్తున్నారని కడప మేయర్ సురేష్బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం(డిసెంబర్23) కడప మునిసిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఎమ్మెల్యే చేసిన గలాటాపై సురేష్బాబు సాక్షి టీవీతో మాట్లాడారు.‘తనకు కుర్చీ వేయలేదని ఎమ్మెల్యే రెండు సార్లు సమావేశాన్ని అడ్డుకున్నారు.దౌర్జన్యానికి దిగి సమావేశ ఎజెండా పేపర్లను చించివేశారు. ఇలా చేస్తున్న ఆమెకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఎక్కడుంది?మిగిలిన కార్పొరేషన్లలో మీ ఎమ్మెల్యేలు,మంత్రులు ఎక్కడ కూర్చుంటున్నారు..?మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచారని గౌరవిస్తే మా ఇంటిపైనే చెత్త వేయించింది.కార్పొరేటర్లపై నోటికొచ్చినట్లు మాట్లాడారు. వందలాది మంది కార్యకర్తలతో కార్పొరేషన్పైకి దండెత్తారు. ఇదెక్కడి సభ్యత?ఒక ప్రజాప్రతినిధి వ్యవహరించాల్సిన తీరు ఇదేనా..?ఎమ్మెల్యే,పిరాయింపు సభ్యులను సస్పెండ్ చేసినా బయటకు వెళ్ళలేదు.ఎజెండా పేపర్లను చింపి సభను అడ్డుకున్నారు.వాళ్ళని బయటకు పంపడంలో అధికారులు వైఫల్యం చెందారు.పార్టీలకు అతీతంగా మేము గౌరవం ఇచ్చినా ఆమె నిలబెట్టుకోలేదు.ప్రజాసమస్యలు చర్చించడానికి యుద్ధానికి వచ్చినట్లు వస్తారా?ఎమ్మెల్యే మాధవి రెడ్డి తీరును ఎవరూ హర్షించడం లేదు.ఫిరాయింపు సభ్యులు మా పార్టీ సభ్యులపై దాడికి దిగారు.ఇది ప్రజాస్వామ్యంలో సరైన చర్య అని ఎవరైనా అంటారా? మొదటి సారి ఎమ్మెల్యే అయిన ఆమె తన హక్కులు ఏంటో ముందు తెలుసుకోవాలి.ఆమె ప్రజాసమస్యల కంటే తన పంతం ముఖ్యం అన్నట్లు వ్యవహరిస్తున్నారు.15 అర్థికసంఘం పనులు ఆమోదించి పంపాలి..కానీ ఆమె సమావేశం జరగనివ్వడం లేదు.బాధ్యతాయుతమైన ఒక ప్రజాప్రతినిధి ఇలా వ్యవహరిస్తే ఎలా’అని సురేష్బాబు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. కార్పొరేషన్ సమావేశపు ఎజెండాను కడప కార్పొరేషన్ ఏకపక్షంగా ఆమోదించింది. ఎజెండా మొత్తాన్ని ముక్తకంఠంతో ఆమోదిస్తున్నట్లు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు చేతులెత్తారు. ఇదే సమయంలో పలు అభివృద్ధి పనులకు కార్పొరేషన్ ఆమోదం తెలిపింది. సస్పెండ్ చేసినా అజెండా ఆమోదాన్ని అడ్డుకునేందుకు ఎమ్మెల్యే మాధవీరెడ్డి ప్రయత్నించారు. అయితే, మెజార్టీ సభ్యుల మద్దతుతో ఎజెండాలోని అంశాలకు ఆమోదం దక్కింది. ఇదీ చదవండి: కుర్చీ కోసం ఎమ్మెల్యే దౌర్జన్యం -
నిజామాబాద్ మేయర్ భర్త చంద్రశేఖర్పై దాడి
-
టీడీపీ ఎమ్మెల్యేకి అనంతపురం మేయర్ స్ట్రాంగ్ కౌంటర్
-
సాక్షి ఎడిటర్ పై కేసు.. విశాఖ మేయర్ స్ట్రాంగ్ రియాక్షన్
-
లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు..మేయర్ సహా 15 మంది మృతి
బీరుట్: లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రమయ్యాయి. దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన తాజా వైమానిక దాడుల్లో ఖనా నగర మేయర్ అహ్మద్ కహిల్ మరణించినట్లుగా నబాతియే ప్రావిన్స్ గవర్నర్ హువైదా టర్క్ వెల్లడించారు.ఈ దాడుల్లో ఖనా మేయర్తో సహా 15మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.పౌరుల ఇళ్ల మధ్య ఉన్న హెజ్బొల్లా తీవ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ మంగళవారం అర్ధరాత్రి భీకర దాడులు చేసింది.ఈ దాడుల్లో మేయర్ సహా పలువురు మృతి చెందారు.దాడిలో ధ్వంసమైన భవనాల శిథిలాల నుంచి 15 మృతదేహాలను వెలికి తీశామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ఇజ్రాయెల్పై 50 రాకెట్లతో హెజ్బొల్లా దాడి -
మేయరా...అయితే మాకేంటి?
వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలా ద్రిపై విజయవాడ నగ ర మేయర్కు సోమవా రం ఘోర అవమానం ఎదురైంది. కొండపై ఆమెను అడుగడుగునా అధికారులు అవమానించారు. ఆమె కారు ను పదేపదే నిలిపివేశారు. ఆమె కారులోంచి బయటకు వచ్చి తాను మేయర్ని అని, తనకు ప్రొటోకాల్ ఉంటుందని చెబుతున్నా ఎవరూ లెక్క చేయలేదు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. కష్టాలుపడి కొండపైకి చేరుకున్న ఆమెను ఆలయ చిన్న రాజగోపురం వద్ద పోలీసులు, దేవస్థానం సిబ్బంది నిలిపివేశారు.దీంతో ఆమె కొద్దిసేపు పక్కనే నిలబడి ఎదురు చూశారు. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్న మీడియా ఆమె వద్దకు వచ్చి వీడియో తీస్తుండగా అప్పటికప్పుడు సిబ్బంది స్పందించి గేట్ తీసి ఆమెను లోపలకు పంపించారు. రూ.300 క్యూ లైన్ నుంచి అమ్మవారికి నమస్కారం చేసుకొని మేయర్ బయటకు వచ్చేశారు. సాధారణంగా మేయర్ వచ్చినప్పుడు ఆమెకు ప్రొటోకాల్ అధి కారులు స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం చేయించి, ఆశీర్వాదాలను, ప్రసాదాలను అందించి పంపాల్సి ఉంటుంది.బీసీ మహిళను అవమానించారు ‘అమ్మవారి దర్శనానికి వస్తే నన్ను అవమానించారు. దేవస్థానం చెప్పిన సమయంలోనే నేను కొండపైకి వచ్చాను.నాకు వెహికల్ పాస్ ఇవ్వమని కలెక్టర్, సీపీ, నగర కమిషనర్ను కోరాను. మీరు మేయర్.. మిమ్మల్ని ఎవరు ఆపుతారని అధికారులు అన్నారు. కానీ నాకు అడుగడుగునా అడ్డంకులే. నేను మేయర్ని అని అందరికీ చెప్పుకోవాలి్సన పరిస్థితి కల్పించారు. పోలీసులు, దేవస్థానం అధికారుల తీరు సరిగాలేదు. గతంలో ఏనాడైనా ఇలా జరిగిందా..? కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరం. నగర పాలకసంస్థ సహకారం లేకుండా భవానీదీక్షలు, దసరా ఉత్సవాలను నిర్వహించగలరా? మేయర్ను అందులోనూ బీసీ వర్గానికి చెందిన మహిళను కావాలనే నన్ను అవమానించారు. –రాయన భాగ్యలక్ష్మి, మేయర్ విజయవాడ -
‘నువ్వు మేయర్ అయితే నాకేంటి? ఏం తమాషాలు చేస్తున్నావా?’
చిత్తూరు అర్బన్: గాంధీ జయంతి రోజే నగర ప్రథమ పౌరురాలైన మహిళా మేయర్కు అవమానం జరిగింది. నడిరోడ్డుపై కలెక్టర్, ఉన్నతాధికారులు, ప్రజలు చూస్తుండగానే మహిళా మేయర్ ఆముదపై ట్రాఫిక్ సీఐ నిత్యబాబు దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం, ఏకవచనంతో రెచి్చపోవడం అందరినీ నివ్వెరపరిచింది. ఓ దశలో మేయర్ను కొట్టడానికి మీదిమీదికి వెళుతున్నాడేంటి అంటూ చుట్టూ ఉన్న జనం నోరెళ్లబెట్టారు.బుధవారం మహాత్ముడి జయంతిని పురస్కరించుకుని చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచడానికి మేయర్ ఆముద, కలెక్టర్ సుమిత్కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పలువురు అధికారులు వచ్చారు. అధికారుల వాహనాలతో పాటు ఎమ్మెల్యే వాహనాలు రోడ్డుకు ఓవైపు పార్కింగ్ చేశారు. మేయర్ వాహనానికి స్థలం లేకపోవడంతో మరోవైపు పార్కింగ్ చేశారు. అప్పటికే అక్కడకు చేరుకున్న ట్రాఫిక్ సీఐ నిత్యబాబు.. మేయర్ కారును అక్కడి నుంచి తీసేయాలని చెప్పాడు.కార్యక్రమం అయిపోగానే వెళ్లిపోతామని మేయర్ డ్రైవర్ చెప్పినా సీఐ అంగీకరించలేదు. దీంతో డ్రైవర్ కారును కొద్దిసేపు పీసీఆర్ కళాశాల చుట్టూ తిప్పి.. కార్యక్రమం అయిపోవస్తుండటంతో కార్యక్రమం జరిగే ప్రాంతానికి కారును తీసుకొచ్చాడు. మేయర్ కారులోకి ఎక్కి, బయల్దేరబోతుండగా సీఐ మళ్లీ వచ్చారు. కారు అద్దాలను బాదుతూ బండి తీయాలంటూ రచ్చ చేశారు.ఇదీ చదవండి: ఇసుక బంద్.. చేతులెత్తేసిన చంద్రబాబు సర్కార్లోపల మేయర్ ఉన్నారని, వెళ్లిపోతున్నామని డ్రైవర్ చెబుతున్నా సీఐ వినలేదు. దీంతో ఆగ్రహించిన మేయర్ వాహనం దిగి కిందకు వచ్చారు. తమ వాహనానికి ముందు, వెనుక కలెక్టర్, ఎమ్మెల్యే కార్లు ఉంటే ఎలా వెళతామని ప్రశి్నంచారు. దీంతో సీఐ మరింతగా రెచి్చపోయారు. ‘నువ్వు మేయరైతే నాకేంటి? డ్రైవర్తో మాట్లాడుతుంటే నువ్వు వస్తావెందుకు? ఏం తమాషా చేస్తున్నావా?’ అంటూ ఏక వచనంతో సంబోధిస్తూ ఓ దశలో మేయర్పైకి సీఐ దూసుకెళ్లారు. -
పెదవుల అందం.. పదవికి చేటు!
ఆడాళ్లు అనుకువగా ఉండడం అసాధ్యమంటారు పెద్దలు.. ఇది అక్షరాలా నిజం అనిపించే ఘటన చెన్నై నడిరోడ్డున కార్పొరేషన్ కార్యాలయం సాక్షిగా చోటు చేసుకుంది. ఒక ఒరలో రెండు కత్తులు.. సాధ్యం కాదనేలా.. కార్పొషన్ను శాసించే మేయర్కు.. ఆమెకు సహాయకారిగా ఉండే మహిళా దఫేదార్కు మధ్య ఏర్పడిన చిరు వివాదం.. చిలికిచిలికి గాలివానలా మారి రచ్చకెక్కింది. చివరికి ఒకరి ఉద్యోగానికి ఎసరు తెచ్చింది... అదెలాగో మీరూ చూడండి! సాక్షి, చెన్నై: నగర కార్పొరేషన్లో మహిళలు పెదావుల కు వేసుకునే లిప్స్టిక్ వ్యవహారం బుధవారం పెద్ద చర్చకే దారి తీసింది. మేయర్ ప్రియ వెన్నంటి ఉండే మహిళా దఫేదార్ మాధవి బదిలీ ఈ లిప్స్టిక్ గొడవను తెరమీదకు తెచ్చింది. వివరాలు.. చెన్నై కార్పొరేషన్లో గత 15 ఏళ్లుగా మాధవి పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె డీఎంకే మేయర్ ఆర్ ప్రియకు దఫేదార్గా ఉన్నారు. హఠాత్తుగా మాధవిని మనలి మండలానికి బదిలీ చేశారు. అలాగే ఆమెకు ఓ మెమో జారీ చేయడంతో ఈ వ్యవహారం లిప్స్టిక్ గొడవను తెరమీదకు వచ్చింది. మేయర్ ఆర్.ప్రియతో సమానంగా మాధవి లిప్స్టిక్ వేసుకుని రావడమే ఈ బదిలీకి కారణం అనే చర్చ జోరందుకుంది.మేయర్ వేసుకునే రంగులోనే లిప్స్టిక్ను ఆమె అనేక సందర్భాలలో వేసుకుని రావడాన్ని ప్రియ పీఏలు ఖండించినట్టు సమాచారం. చిన్నతనం నుంచి తాను లిప్స్టిక్ వాడుతున్నాని, తనకు నచ్చిన రంగు,ఫ్లేవర్ వాడుతానని, దీనిని హఠాత్తుగా మార్చుకోమడం సబబు కాదని వారికి మాధవి సూచించిన నేపథ్యంలో ఈ బదిలీ వేటు పడటమే కాకుండా, ఆమె సరిగ్గా పనిచేయడం లే దంటూ మెమో జారీ చేసినట్టు కార్పొరేషన్లో చర్చ ఊ పందుకుంది. ఈ విషయంగా మాధవి మీడియాతో మాట్లాడుతూ, తాను వేసుకునే లిప్స్టిక్, మేయర్ వేసుకునే లిప్స్టిక్ ఒకే విధంగా ఉందని పేర్కొంటున్నారని వాపోయారు. తనకు నచ్చిన రంగు తాను వాడుతున్నానని, ఇది తన వ్యక్తిగతం అని వ్యాఖ్యలు చేశారు. పురుష దఫేదార్ ఇంటికి వెళ్లి పోయినా, తాను మాత్రం కుటుంబాన్ని సైతం వీడి మేయర్కు వెన్నంటి రేయింబవళ్లు శ్రమించినందుకు మంచి గుర్తింపునే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా వీరికి మరో రెండేళ్లు పదవి ఉండవచ్చునని, తాను ఓ ఉద్యోగిని అని, తన జర్నీ మరింతగా కార్పొరేషన్లో కొనసాగాల్సి ఉంటుందని వ్యాఖ్యనించడం కొనమెరుపు. -
అంతర్జాతీయ వేదికగా వైఎస్ జగన్ పాలనపై ప్రశంసలు
సాక్షి, అనంతపురం: అంతర్జాతీయ వేదికగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనపై ప్రశంసలు దక్కాయి. రష్యాలో జరిగిన మేయర్ల సదస్సుకు వర్చువల్గా హాజరైన అనంతపురం మేయర్ మహ్మద్ వాసీం.. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ అమలు చేసిన విద్యా సంస్కరణలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. పాఠశాలల్లో నాడు-నేడు, ట్యాబుల పంపిణీ, ఇంగ్లీష్ మీడియం వంటి వైఎస్ జగన్ చేసిన మంచిని అంతర్జాతీయ డిజిటల్ వీక్ సెమినార్లో మేయర్ వివరించారు. కాగా, రాష్ట్రంలో పెట్టుబడులను పెద్దఎత్తున ప్రోత్సహించేలా గత సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలకు మరోసారి కేంద్రం గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. సులభతర వాణిజ్య ర్యాంకులు (ఈవోడీబీ)–2022 ర్యాంకుల కోసం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ రూపొందించిన వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక–2022 అమల్లో ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో నిలిచింది. గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల కంటే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందంజంలో ఉంది.ఇదే విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ రెండు రోజుల క్రితం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రకటించారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న పారిశ్రామిక సంస్కరణలను ప్రశంసిస్తూ ఆంధ్రప్రదేశ్ పనితీరు భేష్ అని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: వైఎస్ జగన్ నిర్ణయాలకు కేంద్రం గుర్తింపు -
కడపలో టీడీపీ చెత్త పాలిటిక్స్.. భగ్గుమన్న వైఎస్సార్సీపీ
వైఎస్సార్ కడప, సాక్షి: వైఎస్సార్ కడపలో టీడీపీ నేతలు ఓవర్ యాక్షన్కు పాల్పడ్డారు. మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు చెత్త వేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. గత మూడు రోజులుగా చెత్తపై ఎమ్మెల్యే మాధవి రెడ్డి అనవసర రాజకీయం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం చెత్తను కార్పొరేటర్లు మేయర్ ఇంటి ముందు వెయ్యాలని టీడీపీ నేతలను మాధవి రెడ్డి రెచ్చగొట్టారు. దీంతో ఇవాళ టీడీపీ నేతలను మేయర్ ఇంటి వద్దకు పంపించి చెత్తను వేయాలని ఆదేశించారు. టీడీపీ ఎమ్మెల్యే, నేతలు చేస్తున్న చెత్త పాలిటిక్స్పై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న కడప నగరంలో ఇలాంటి రెచ్చగొట్టి రాజకీయాలు చేయవద్దని వైఎస్సార్సీపీ నేతలు సూచిస్తున్నారు. ఇన్ని ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెచ్చగోట్ట రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.మేయర్ ఆగ్రహంతన ఇంటి ముందు చెత్త వేసిన టీడీపీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ ఎదుట మేయర్ సురేష్ బాబు ధర్నాకు దిగారు. ఆయనకు మద్దతుగా వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా చేరి ధర్నాలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై సురేష్బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చెత్త పై టీడీపీ నేతలను రెచ్చగొట్టి తన ఇంటి ముందు చెత్త వేసేలా ఎమ్మెల్యే చేయడం దుర్మార్గం. హుందాగా వ్యవహరించాలని గతంలోనూ ఆమెను మేం కోరాం. గెలిచిన మూడు నెలలకే ఇలాంటి నీచపు రాజకీయాలా?. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది. కడపలో టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పనులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు మునుపెన్నడూ లేవు. టీడీపీ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోంది. ఇంటికొచ్చి చెత్త వేస్తుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కడపలో అల్లర్లు చేస్తున్నారు. హత్యారాజకీయాలు చేస్తున్నారు. నా ఇంటి ముందు చెత్త వేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి. కఠినంగా శిక్షించాలి. -
మేయర్ విదేశీ యాత్ర దుమారం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: నగర మేయర్ సునీల్రావు అమెరికా పర్యటన వివాదం చివరికి కలెక్టర్ వద్దకు చేరింది. ఇటీవల మేయర్ 14 రోజులపాటు తాను అమెరికా వెళ్తున్నానని కమిషనర్, కార్పొరేటర్లకు ముందుగానే సమాచారం ఇచ్చారు. దీనిపై కార్పొరేటర్లతో పాటు, డిప్యూటీ మేయర్ కూడా తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ఆయన వెళ్తూవెళ్తూ.. డిప్యూటీ మేయర్కు ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వకుండా వెళ్లారని, ఇది నిబంధనలకు విరుద్ధమని, తాను బీసీ మహిళ అయినందునే మేయర్ చిన్నచూపు చూస్తున్నారని ఆక్షేపించారు. మరోవైపు మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్, బీసీ సంఘాలు కలెక్టర్కు ఫిర్యాదు చేశాయి. ఆయన పర్యటన నిబంధనలకు విరుద్ధమని ఆరోపించాయి. ఆయన 33 రోజులపాటు పర్యటించేలా టికెట్లు బుక్ చేశారని, వాస్తవానికి 14 రోజులకు మించి విదేశాలకు వెళ్లినట్లయితే.. నిబంధనలకు ప్రకారం డిప్యూటీ మేయర్కు ఇన్చార్జి అప్పగించాలన్న వాదన తెరమీదకు తీసుకొచ్చారు.వెలుగుచూసిందిలా..వాస్తవానికి మేయర్ సునీల్రావు వ్యక్తిగత పనులపై అమెరికా వెళ్లారు. ఈనెల 23న వెళ్లి.. సెప్టెంబర్ 25న (33 రోజులు) వచ్చేలా ఆయన బుక్ చేసుకున్న టికెట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వివాదం రాజుకుంది. ఆయన తీరుపై సొంత పార్టీ, విపక్ష కార్పొరేటర్లు కూడా విమర్శించారు. నిబంధనల ప్రకారం.. 14 రోజులు దాటితే తనకు బాధ్యతలు ఇవ్వాలని, కానీ.. తాను బీసీ మహిళను అనే వివక్షతోనే మేయర్ సునీల్రావు తనకు ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వలేదని డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి ఆరోపించారు. అసలు మేయర్ పర్యటనకు అధికారిక అనుమతే లేదంటూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ చట్టం 2009 34(2) ప్రకారం తనకు ఇన్చార్జి మేయర్గా అవకాశం కల్పించాలని ఫిర్యాదులో విన్నవించారు. కాగా, ఈ విషయంపై బల్దియాలోని ప్రతి విభాగం, ప్రతి ఉద్యోగి చర్చించుకోవడం ప్రారంభించారు. మేయర్ వివరణ కోరిన కలెక్టరేట్మేయర్పై వరుస ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ కార్యాలయం నుంచి మేయర్ను వివరణ కోరింది. దానికి ఆయన సమాధానమిస్తూ.. తాను మున్సిపల్ కమిషనర్కు సమాచారం ఇచ్చాకే విదేశీ పర్యటనకు వచ్చానని, నిబంధనల మేరకు తాను అనుమతి తీసుకున్నానని, ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని వివరణ ఇచ్చారు.6న ఇండియాకు: మేయర్తాను నిబంధనల ప్రకారం మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పేయికి సమాచారం ఇచ్చానని, తనది కేవలం వ్యక్తిగత పర్యటన మాత్రమేనని మేయర్ సునీల్రావు తెలిపారు. తాను కేవలం 14 రోజుల వరకే అందుబాటులో ఉండనని కార్పొరేటర్లకు ముందస్తుగానే సమాచారమిచ్చానని పేర్కొన్నారు. తాను బుక్ చేసిన టికెట్లను సాకుగా చూపి తనపై దాడికి దిగడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. ఆ టికెట్లను ఎప్పుడైనా రీ షెడ్యూల్ చేసుకోవచ్చని, వచ్చే నెల 6వ తేదీన కరీంనగర్లో ఉంటానని వెల్లడించారు. ఆయన చెప్పిన ప్రకారం మేయర్ 14 రోజుల పర్యటన ముగుస్తుంది. కాగా, ఈ వ్యవహారమంతా టీ కప్పులో తుపానులా సమసిపోనుందని నగర ప్రజలు చర్చించుకుంటున్నారు. -
నమ్మక ద్రోహం
పదేళ్ల రాజకీయ జీవితం.. ముచ్చటగా మూడు పారీ్టలు.. తెలుగుదేశం పార్టీలో కార్పొరేటర్గా గెలిచి మేయర్గా ఎన్నిక.. మూడేళ్లకే అప్పటి ఎమ్మెల్యేతో విభేదాలు.. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్ సీపీలో చేరిక.. వైఎస్సార్ సీపీలోనూ కార్పొరేటర్గా గెలిచి మేయర్గా ఎన్నిక.. నాలుగేళ్లకు అప్పటి ఎమ్మెల్యేతో విబేధాలు.. మళ్లీ తెలుగుదేశం పారీ్టలో మంగళవారం చేరడం.. ఇదీ ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు పొలిటికల్ ప్రొఫైల్. పదవుల కోసం పారీ్టలో చేరడం, మళ్లీ పారీ్టకి వెన్నుపోటు పొడవటం, మళ్లీ ఇంకో పారీ్టలో చేరడం.. షాడో మేయర్ పెదబాబుకు వెన్నతో పెట్టిన విద్యలా మారింది. తాజాగా మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో రెండోసారి టీడీపీలో చేరుతున్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు నగర రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. 2019లో హైకోర్టు కేసులతో ఏలూరు కార్పొరేషన్ ఎన్నిక వాయిదా పడి, 2021లో జరిగింది. మొత్తం 50 డివిజన్లకుగాను 47 డివిజన్లలో అప్పటి వైఎస్సార్ సీపీ విజయం సాధించింది. ఎన్నికలకు ముందు టీడీపీని వీడి మేయర్ నూర్జహాన్ దంపతులు వైఎస్సార్ సీపీలో చేరారు. అప్పటి ఎమ్మెల్యే బడేటి బుజ్జితో ఇబ్బందులు, అవమానాలు ఎక్కువగా ఉన్నాయని, టీడీపీలో వేధింపులు బాగా ఉన్నాయని చంద్రబాబునాయుడుకు చెప్పినా పట్టించుకోలేదని, ఇలా రకరకాల కారణాలు చెప్పి పార్టీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. బీసీ వర్గానికి చెందిన మహిళ కావడం, రాజకీయంగా నూర్బాషా సామాజికవర్గానికి మంచి ప్రాధాన్యం ఇవ్వాలని యోచనతో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్గా అవకాశం ఇచ్చి రెండో పర్యాయం మేయర్గా ఎంపిక చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నన్ని రోజులూ అంతా బాగానే నడిచింది. ఎన్నికలకు కొద్ది నెలల ముందు నుంచి ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నానితో విబేధాలు ఉన్నాయని అందరికీ చెబుతూ నిత్యం ఆయనతోనే సమావేశాల్లో పాల్గొంటూ ఉండేవారు. కట్ చేస్తే.. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఓటమిపాలు కావడంతో పదవి కోసం తెలుగుదేశం బాట పట్టారు. దీనిపై నగరంలో తీవ్ర చర్చ సాగుతోంది. పదేళ్ల ప్రస్ధానంలో మూడు పారీ్టలు మూడోసారి పార్టీ మారుతున్న లీడర్లు అంటూ ప్రచారం జరుగుతోంది. కార్పొరేటర్లతో రహస్య భేటీ ‘మంగళవారం టీడీపీలో చేరుతున్నాను.. మీరందరూ కూడా టీడీపీలోకి వస్తే మనకు ఉన్న రెండేళ్ల పదవీకాలం బాగా వాడుకోవచ్చు, అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. లేకపోతే నష్టపోతారు.. వచ్చేవాళ్లు రండి.. తరువాత జరిగే పరిణామాలకు నేనేమి బాధ్యుడిని కాదు’ అంటూ రెండు రోజుల క్రితం తన నివాసంలో కార్పొరేటర్లతో భేటీ నిర్వహించి తన రాజకీయ భవిష్యత్ను ప్రకటించడంతో పాటు కార్పొరేటర్లను పరోక్షంగా హెచ్చరించారు. ఇక వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా రెండు పర్యాయాలు ఏలూరు మార్కెట్ కమిటీ చైర్మన్గా మంచెం మైబాబుకు అవకాశం ఇచ్చారు. అలాగే రాజకీయంగానూ పార్టీ అధిక ప్రాధాన్యం ఇచ్చింది. అధికారం కోల్పోగానే జంపింగ్ నేతల జాబితాలో చేరారు. ఇక మరో నేత ఏలూరు నగర వైఎస్సార్ సీపీ అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ కుమార్తెకు పార్టీ అధికారంలోకి రాగానే కార్పొరేటర్గా అవకాశం ఇవ్వడం, అలాగే స్మార్ట్ సిటీ చైర్మన్గా నియమించారు. సాంకేతిక కారణాలతో స్మార్ట్ సిటీ రద్దయిన క్రమంలో ఇడా చైర్మన్గా బొద్దాని శ్రీనివాస్కు అవకాశం కలి ్పంచారు. నామినేట్ పదవితో పాటు ఐదేళ్ల పాటు నగర పార్టీ అధ్యక్షుడిగా ప్రాధాన్యం ఇచ్చినా ఆర్థిక ప్రయోజనాల కోసం టీడీపీ బాటపట్టారు. మంగళవారం మేయర్ దంపతులతో పాటు బొద్దాని శ్రీనివాస్, మంచెం మైబాబులు టీడీపీలో చేరనున్నారు. -
బల్దియాలో అంతే!.. మధ్యాహ్నం 12 గంటలైనా విధులకు రాని సిబ్బంది
సాక్షి,హైదరాబాద్: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం... బుధవారం ఉదయం 10.35 గంటలు⇒ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఒకటో అంతస్తులోని ఒక కార్యాలయంలోకి వెళ్లారు. ఎంతమంది సిబ్బంది ఉన్నారో చూశారు. అవాక్కయ్యారు. 20 మందికి పైగా ఉండాల్సిన సెక్షన్లో ఐదుగురే ఉన్నారు. మిగతా వారేరీ? అంటే..ఇంకా రాలేదు అనే సమాధానం వచి్చంది.⇒ అలాగే ఒక్కో కార్యాలయం చూసుకుంటూ ఒక అంతస్తు తర్వాత మరో అంతస్తుకు జీహెచ్ఎంసీలో వివిధ విభాగాలున్న ఆరంతస్తుల వరకు వెళ్లారు. అన్ని చోట్లా దాదాపుగా అవే సీన్లు. ఉద్యోగులు 10.30 గంటలకే కార్యాలయాల్లో ఉండాల్సి ఉండగా, 11 గంటలు దాటినా లేరు. 11.30 గంటలవుతున్నా పూర్తిస్థాయిలో లేరు. ⇒ అప్పుడే వస్తున్నవారిని చూసి ఆఫీస్ టైమెప్పుడు? ఎప్పుడు వస్తున్నారంటే ఆలస్యమైందంటూ తడబడుతూ సమాధానమిచ్చారు. మ. 12 గంటలైనా ఇంకా వస్తున్న వారున్నా రు. ఆ తర్వాత వచి్చన వారు సైతం ఉన్నారు. మేయర్ ఆకస్మిక విషయం ఒక్కసారిగా గుప్పుమనడంతో చాలామంది హడావుడిగా వచ్చారు. అన్ని విభాగాల్లో దాదాపుగా ఇవే పరిస్థితులుండటంతో మేయర్ మండిపడ్డారు. ⇒ ప్రజాప్రభుత్వంలో ఇలా ఉంటే నడవదని, ‘ఉండాలనుకుంటే ఉండొచ్చు..లేకుంటే వెళ్లిపోవచ్చు’ అని సీరియస్ అయ్యారు. రేపట్నుంచి 10.35 గంటల వరకు మాత్రం హాజరు రిజిస్టర్లు కార్యాలయాల్లో ఉంచి, 10.40 గంటలకు తన కార్యాలయానికి పంపించాల్సిందిగా అధికారులకు సూచించారు. రాని వారికి మెమోలు జారీ చేయాల్సిందిగా అడిషనల్ కమిషనర్ (పరిపాలన) నళిని పద్మావతికి సూచించారు.‘ఫేస్ రికగ్నిషన్’ అమలు చేస్తాం.. తనిఖీల అనంతరం మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ, క్రమశిక్షణ, సమయపాలన పాటించని వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమయానికి రానివారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగులపై హెచ్ఓడీల పర్యవేక్షణ ఉండాలన్నారు. పలు విభాగాల్లో ఉద్యోగులు ఆలస్యంగా వస్తూ, సాయంత్రం 4 గంటలకే వెళ్తున్నట్లు తన దృష్టికి రావడంతోపాటు పలు ఫిర్యాదులందడంతో ఈ తనిఖీ నిర్వహించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఫేస్ రికగి్నషన్ అటెండెన్స్ను కూడా అమల్లోకి తెచ్చే ఆలోచన ఉందన్నారు. ఇది ఇక్కడ మామూలే.. మేయర్ తనకీ విషయం ఇప్పుడే తెలిసినట్లు చెప్పినప్పటికీ, బల్దియాలో అది సాధారణ తంతు. అందుకే ఒకసారి బల్దియాలో చేరిన వారు బదిలీలైనా పోకపోవడానికున్న కారణాల్లో ఇదీ ఒకటి. బల్దియా వ్యవహారాల గురించి బాగా తెలిసిన వారి సమాచారం మేరకు, మధ్యాహ్నం 12 గంటలైనా చాలామంది విధులకు రారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ‘లంచ్ టైమ్’ మొదలవుతుంది. బల్దియాలో సాధారణ లంచ్బ్రేక్ అంటూ లేదు. ఎవరిష్టం వారిది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకూ అది నడుస్తుంటుంది. 4 గంటలు దాటాక ఇళ్లకు తిరుగుముఖం ప్రారంభమవుతుంది. పై ఆదాయం వచ్చే వారు మాత్రం సీట్లలో సాయంత్రం 5.30 గంటలు దాటినా ఉంటారు. ఇక, కార్యాలయాల్లో ఉండేవారిలో సైతం అందరూ పనులు చేస్తున్నారని చెప్పలేం. కొందరు కంప్యూటర్లలో గేమ్స్ ఆడుతుంటారు. కొందరు ఎక్కువ సమయంలో ఫోన్లలో యూట్యూబ్ చిత్రాలు చూస్తుంటారు. బల్దియాలోని వైఫై సదుపాయంతో నిరి్వరామంగా ఫోన్లు, కంప్యూటర్లతో కాలం గడుపుతారు. అలాగని అంకితభావంతో పనిచేస్తున్నవారు లేరని చెప్పలేం. కాకపోతే వారి సంఖ్య స్వల్పం. ఉదయం సమయానికే వచ్చి పొద్దుపోయేంత వరకు తలమునకలుగా పనులు చేసే వారూ ఉన్నారు. అలాంటి వారివల్లే బల్దియా బతుకుతోంది. నిజంగా చర్యలుంటాయా ? మేయర్ హెచ్చరికల్ని ఎవరైనా ఖాతరు చేస్తారా అన్నది అనుమానమే. గతంలో ఆహార కల్తీ తనిఖీలకు సంబంధించి ఏ రోజు ఎన్ని తనిఖీలు జరిపారో, ఏం చర్యలు తీసుకున్నారో ఏ రోజుకారోజు సాయంత్రం తనకు నివేదికలు పంపాలని ఆదేశించారు. అది ఏమాత్రం అమలవుతుందో సంబంధిత విభాగానికి, మేయర్ కార్యాలయానికే తెలియాలి. బయోమెట్రిక్ ఉత్తుత్తిదేనా ? కారి్మకులతోపాటు కమిషనర్ దాకా బయోమెట్రిక్ హాజరు వేయాలని గతంలో చెప్పారు. ఒకరిద్దరు కమిషనర్లు సైతం దాన్ని పాటించారు. కనీసం ఉద్యోగులైనా బయోమెట్రిక్ హాజరును వినియోగిస్తున్నారో, లేదో తెలియని పరిస్థితి మేయర్ తనిఖీతో వెల్లడైంది. నిజంగా వినియోగిస్తే అంత ఆలస్యంగా ఎందుకు వస్తారు? ఒకవేళ ఆలస్యంగా వచ్చినా వారికి పూర్తి జీతాలెందుకు చెల్లిస్తున్నారు? అన్నవాటికి సంబంధిత అధికారులే సమాధానం చెప్పాలి. కొన్ని సీట్లు ఖాళీగా ఉండటం తనిఖీలో గుర్తించిన మేయర్..ఆ సీట్లు ఎవరివి అంటే వారి పేర్లు కూడా సహచరులు చెప్పలేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కొన్ని సెక్షన్లలో నాలుగైదు రోజులకోమారు వచ్చి ఒకేసారి అన్ని రోజులకూ సంతకాలు పెట్టుకుంటారనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. అలాంటప్పుడు ఇక బయోమెట్రిక్ ఎందుకు..దాని నిర్వహణకు లక్షలాది రూపాయల వ్యయమెందుకు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జోన్లు..సర్కిళ్లలో.. ప్రధాన కార్యాలయంలో పరిస్థితి ఇలా ఉంటే జోన్లు, సర్కిళ్లలోనూ ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అక్కడ ఇంకో సదుపాయం కూడా ఉంది. లేని వారి గురించి సంబంధిత సెక్షన్లలో అడిగితే ప్రధాన కార్యాలయానికి పనిమీద వెళ్లారని టక్కున సమాధానం చెబుతారు. సర్క్యులర్ జారీ మేయర్ ఆదేశాల నేపథ్యంలో చర్యలకు సిద్ధమైన సంబంధిత అడిషనల్ కమిషనర్ (పరిపాలన) నళిని పద్మావతి ఆ మేరకు సర్క్యులర్ జారీ చేశారు. ఉద్యోగులంతా కార్యాలయ వేళల మేరకు ఉదయం 10.30 గంటలకల్లా హాజరు కావాలి. పది నిమిషాల గ్రేస్ సమయం మాత్రం ఉంటుంది. అంటే 10.40 గంటల వరకు మినహాయింపు ఇస్తారు. జిల్లా ఆఫీస్ మాన్యువల్ మేరకు మూడు పర్యాయాలు అంతకంటే ఆలస్యంగా వస్తే ఒక సీఎల్గా పరిగణిస్తారు. తరచూ ఆలస్యంగా హాజరయ్యే వారిపై తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. -
అరుదైన గౌరవం.. రష్యా లైబ్రరీలో వైఎస్ జగన్ గ్రామ స్వరాజ్యం పుస్తకం
-
బ్రిక్స్ మేయర్ల సదస్సుకు అనంతపురం మేయర్
జూన్ 21న రష్యాలోని కజాన్ నగరంలో జరుగుతున్న వివిధ దేశాలకు చెందిన మేయర్ల సదస్సుకు అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం సలీం హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుండి అనంతపురం ఏకైక నగరం కావడం విశేషం. దేశంలో జైపూర్, కాలికట్, త్రిస్సూర్ మరియు నాగర్ కోయిల్ నుండి మేయర్లు పాల్గొంటున్నారు.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో పేద ప్రజలకు అందిన సంక్షేమం.. జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాన్ని రష్యాలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో ప్రదర్శించారు. అనంతపురం మేయర్ మహమ్మద్ వాసీం. ప్రపంచ వ్యాప్తంగా 50 మంది మేయర్లు రష్యా బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొన్నారు.ఏపీ నుంచి బ్రిక్స్ సమావేశాల్లో అనంతపురం మేయర్ మహమ్మద్ వాసీం ఒక్కరే పాల్గొన్నారు. గత ఐదు సంవత్సరాల వ్యవధిలో అనంతపురం నగరపాలక సంస్థ లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా జరిగిన గ్రామ స్వరాజ్యం వివరాలతో కూడిన ఓ పుస్తకాన్ని తయారు చేసిన మేయర్ మహమ్మద్ వాసీం... దానిని రష్యాలోని కజాన్ నగరంలో ఉన్న లైబ్రరీకి అందజేశారు. -
జగనన్న వల్లే నాకు ఈ అవకాశం
-
వైఎస్ఆర్ సీపీ మేయర్ కు అరుదైన గౌరవం
-
అనంతపురం మేయర్కు అరుదైన గౌరవం
అనంతపురం కార్పొరేషన్: అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ మహమ్మద్ వసీం సలీంకు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 21న రష్యాలోని కజాన్ నగరంలో బ్రిక్స్ దేశాల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే మేయర్ల సదస్సుకు ఆహ్వానం అందింది. ఈ సదస్సులో వివిధ దేశాల నుంచి 50 మందికి పైగా మేయర్లు పాల్గొననున్నారు. భారత్ నుంచి ఐదుగురు మేయర్లకు ఆహ్వానం అందగా..అందులో అనంతపురం మేయర్ ఒకరు. మిగిలిన వారిలో జైపూర్, క్యాలికట్, త్రిసూర్, నాగర్ కోయిల్ మేయర్లు ఉన్నారు. అనంతపురం మేయర్కే ఎందుకంటే.. అనంతపురానికి, రష్యాకు చారిత్రక సంబంధం ఉంది. 550 ఏళ్ల కిందట రష్యన్ యాత్రికుడు అఫానసీ నికితిన్ విజయనగర సామ్రాజ్యంలో భాగమైనటువంటి అనంతపురాన్ని సందర్శించాడు. ఆ∙అంశాలు ఇటీవల కజాన్లో జరిగిన అసోసియేషన్ వ్యవస్థాపక సమావేశంలో చర్చకు వచి్చ.. అనంతపురం ప్రాధాన్యతను గుర్తు చేశాయి. కాగా, అనంతపురం నగరాన్ని సందర్శించిన రష్యన్ యాత్రికుని రచనలను పరిగణనలోకి తీసుకుని మేయర్ల సదస్సుకు అనంతపురం నగరాన్ని ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉంది అని మేయర్ అన్నారు. -
‘నన్నే తప్పుదోవ పట్టిస్తారా?’..అధికారిని కొట్టినంత పనిచేసిన మేయర్
ఓ నగర మేయర్ మున్సిపల్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్నే తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారంటూ అంటూ సదరు అధికారిపై ఫైల్ను విసిరేశారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వైరల్గా మారాయి.కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే సమావేశంలో ఓ అధికారిపై ఫైలు విసిరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అధికారి ఆమెను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడంతో ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది.పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో డ్రైన్ క్లీనింగ్, ఇతర సమస్యలపై అధికారుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో స్థానిక జోన్-3 జోనల్ ఇంజనీర్ నుల్లా శుభ్రపరిచే సమీక్షకు సంబంధించి ఆమెను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడంతో ప్రమీలా పాండే సదరు అధికారిపై మండిపడినట్లు సమాచారం. ఇంజనీర్ తన మండలంలో మార్చిలో నుల్లా క్లీనింగ్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అయితే ఇదే విషయంలో మేయర్ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. మేలో నుల్లా క్లీనింగ్ ప్రారంభించినప్పుడు, జోనల్ ఇంజనీర్ మార్చిలో పని ప్రారంభించినట్లు ఎలా చెబుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొట్టినంత పనిచేయబోయారు. చేతిలో ఫైల్ని సదరు అధికారిపై విసిరేశారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా..పలువురు నెటిజన్లు మేయర్కు అండగా నిలుస్తోన్నారు. #WATCH | Uttar Pradesh: Kanpur Mayor Pramila Pandey throws a file at an officer during a meeting of officials held on drain cleaning and other issues in the Kanpur Municipal Corporation office. pic.twitter.com/rsrEQHBveg— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 12, 2024 -
వరుస దాడులు..భయాందోళనలో ప్రజలు..
-
బ్యాంకాక్లో పీర్జాదిగూడ కార్పొరేటర్లు
ఉప్పల్: ఎక్కడైనా అవిశ్వాసం పేరు వినపడితే చాలు.. రిసార్టులు, స్టార్ హోటళ్లలో క్యాంపులు, వైజాగ్, బెంగళూరు, గోవా తదితర ప్రాంతాలకు టూర్లు వేసేవారు. ఆయా ప్రాంతాల్లో విలాసవంతంగా గడిపి వచ్చేవారు. ఈసారి మాత్రం కాస్ట్లీ టూర్ అంటూ పీర్జాదిగూడ కార్పొరేషన్ పేరు మార్మోగిపోతోంది. పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్రెడ్డి కార్పొరేటర్లతో పాటు వారి కుటుంబ సభ్యులను తీసుకొని ఏకంగా బ్యాంకాక్ ఎగిరిపోయారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లను టార్గెట్ చేస్తూ.. శివారు కార్పొరేషన్ అయిన పీర్జాదిగూడ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు శత విధాలా ప్రయత్నాలు చేస్తున్న విషయం విదితమే.. ఇందులో భాగంగా ఈ నెల 6న కాంగ్రెస్ నేతలు, కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్ను సంప్రదించగా వచ్చే నెల 5న తీర్మానం తేదీని ఖరారు చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్పొరేటర్లను టార్గెట్ చేస్తూ వారిని వెంబడిస్తూ కాంగ్రెస్ నేతల తీరుతో పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్రెడ్డి ఏకంగా మీడియా, పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన ఘట్కేసర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు సైతం చేశారు. కాగా.. తమ మద్దతుదార్లయిన కార్పొరేటర్లకు విదేశీ టూర్ను ఆఫర్ చేశారు. అంతా ఆశ్చర్యపోయేలా కాస్ట్లీ టూర్కు తీసుకెళ్లడంతో ఆయా పార్టీల నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఆధ్వర్యంలో ఇంత ఖరీదైన టూర్ ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. ఏకంగా కార్పొరేటర్లను, వారి భర్తలను విదేశీ పర్యటనకు తీసుకెళ్లి ఆనంద డోలికల్లో ముంచెత్తడం గమనార్హం. -
లండన్ మేయర్గా మూడోసారి సాదిక్ ఖాన్
లండన్: పాక్ సంతతికి చెందిన లేబర్ పార్టీ నేత సాదిక్ ఖాన్(53) లండన్ మేయర్గా భారీ మెజారిటీతో వరుసగా మూడోసారి గెలుపొందారు. మొత్తం ఓట్లలో 43.8 శాతం అంటే 10,88,225 ఓట్లు సాదిక్ ఖాన్కు పడగా కన్జర్వేటివ్ పారీ్టకి చెందిన ప్రధాన ప్రత్యర్ధి సుసాన్ హిల్కు 8,11,518 ఓట్లు పడ్డాయి. స్వతంత్ర అభ్యరి్థగా బరిలోకి దిగిన ఢిల్లీలో జన్మించిన వ్యాపారవేత్త తరుణ్ గులాటి ఓట్ల వేటలో విఫలమయ్యారు. మేయర్ పదవికి మొత్తం 13 మంది పోటీ పడ్డారు. లండన్ మేయర్ 89 లక్షల మంది జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తారు. 2000వ సంవత్సరంలో పదవి ఏర్పాటయ్యాక వరుసగా మూడు పర్యాయాలు మేయర్గా ఎన్నికైన నేతగా సాదిక్ ఖాన్ రికార్డు సృష్టించారు. నాలుగేళ్ల పదవీ కాలానికిగాను 2016, 2020 ఎన్నికల్లో ఆయన మేయర్గా ఎన్నికయ్యారు. -
ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా?
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైల్లో ఉన్నంత వరకూ మేయర్ ఎన్నిక వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రిసైడింగ్ అధికారిని నామినేట్ చేసే హక్కు ఎల్జీకి ఉన్నప్పటికీ, ప్రిసైడింగ్ అధికారిగా ఎవరిని నామినేట్ చేయాలనే విషయంలో సీఎం సూచన తప్పనిసరి. సీఎం జైలులో ఉన్నందున సంబంధిత ఫైలును ఢిల్లీ ప్రధాన కార్యదర్శి ఎల్జీ కార్యాలయానికి పంపించాల్సి వచ్చింది.ప్రిసైడింగ్ అధికారిని నామినేట్ చేయకపోవడంతో ఏప్రిల్ 26న మేయర్ ఎన్నిక జరగలేదు. దీంతో ప్రస్తుత మేయర్ షెల్లీ ఒబెరాయ్ తన బాధ్యతలను కొనసాగించనున్నారు. ఆమె ఎంసీడీ సాధారణ సమావేశాలను నిర్వహించడాన్ని కొనసాగిస్తునే ఉంటారు. అయితే ఇటువంటి సందర్భాల్లో ఆర్థిక, విధానపరమైన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. -
పార్టీ మారినా.. నో ఫియర్!!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా ఆమె పదవికి ఢోకా లేదు. అలాగే డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నా ఆమె పదవికీ నష్టం లేదు. ఎన్నికైన పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వేరే పార్టీకి మారితే అనర్హత వేటుపడే ప్రమాదం ఉన్నా మేయర్, డిప్యూటీ మేయర్లకు మాత్రం పదవులు పోయే ప్రమాదం లేదు. జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనల మేరకు కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ పారీ్టలు మారినా వారి పదవులు పోయే అవకాశం లేదు. మొత్తం పాలక మండలిలో మెజార్టీ సభ్యుల అవిశ్వాస తీర్మానం ద్వారా మాత్రమే వారి పదవులు పోయే ప్రమాదం ఉన్నా, బాధ్యతలు చేపట్టాక నాలుగేళ్ల వరకు కూడా అలాంటి అవకాశం లేదు. అందుకే వారు ఏ పారీ్టకి మారినా దాదాపు మరో ఏడాది వరకు వారి çపదవులకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ప్రస్తుత పాలకమండలిలో మేయర్గా విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్గా శ్రీలత బాధ్యతలు స్వీకరించింది 2021 ఫిబ్రవరి 11న. 2025 ఫిబ్రవరి 10 వరకు వారి పదవులకు వచి్చన ముప్పు ఏమీ లేదు. ఒకవేళ వారి పనితీరు బాగాలేదనో, మరో కారణంతోనో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలనుకున్నా అప్పటి వరకు ఆగాల్సిందే. కాబట్టి.. ఇప్పుడు జీహెచ్ఎంసీలో పార్టీల బలాబలాలు, అవిశ్వాస తీర్మానాలు అనేవి అసలు అంశమే కాదని అటు అధికారులతో పాటు ఇటు రాజకీయ నేతలు సైతం చెబుతున్నారు. నాలుగేళ్ల గడువు తర్వాత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా వారి పదవులకు మిగిలి ఉండేది స్వల్ప సమయం మాత్రమే. అప్పటికి పార్టీల బలాబలాల్లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. మారనున్న బలాబలాలు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరికలు భారీగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మేయర్ పార్టీ మారుతుండగా, ఇదివరకే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, డిప్యూటీ మేయర్ దంపతులు శ్రీలత, శోభన్రెడ్డిలు సైతం కాంగ్రెస్లో చేరడం తెలిసిందే. ఇదే వరుసలో దాదాపు ఇరవైమంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి సైతం కొందరిని లాగే ప్రయత్నాల్లో కాంగ్రెస్ ఉన్నట్లు తెలిసింది. ఫలించిన కాంగ్రెస్ వ్యూహం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచి్చనప్పటి నుంచే జీహెచ్ఎంసీ మేయర్గా ప్రతిపక్ష పార్టీ వారుండరాదనే పట్టుదలతో ఉంది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసేది తమ ప్రభుత్వమే అయినందున మేయర్, డిప్యూటీ మేయర్లు కూడా తమ పార్టీ వారే ఉండాలనే వ్యూహంతో పనిచేసింది. ఆ దిశగా సఫలమైన కాంగ్రెస్ ఇక కార్పొరేటర్లపైనా వల వేయనుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ సభ్యులు గెలిచింది ఇద్దరే అయినప్పటికీ, ప్రస్తుతం ఆ సంఖ్య డజనుకు చేరింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బీజేపీల నుంచి దాదాపు 30 మంది వరకు కాంగ్రెస్లో చేరతారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని, ఎమ్మెల్యేలు పారీ్టలు మారితే వారి అనుయాయులు, అనుచరులుగా ఉన్న కార్పొరేటర్లు కూడా పార్టీ మారతారని చెబుతున్నారు. తమ డివిజన్లలో ఎక్కువ అభివృద్ధి పనులు జరగాలంటే, అందుకు అవసరమైన నిధులు పొందాలంటే అధికార పారీ్టలో ఉంటేనే సాధ్యమని కార్పొరేటర్లు సైతం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల నాటికే కాంగ్రెస్ సభ్యుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందనే అభిప్రాయాలున్నాయి. -
ఆంధ్రా అమ్మాయి... జవహర్నగర్ మేయర్
బాపట్ల టౌన్: బాపట్ల మండలం, ముత్తాయపాలెం గ్రామానికి చెందిన పమిడిబోయిన శాంతి తెలంగాణ రాష్ట్రంలోని జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఎంపికయ్యారు. ఆమె బాపట్ల మండలం, ముత్తాయపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్య అభ్యసించారు. 2000లో తెనాలి మండలం, దావులూరిపాలెం గ్రామానికి చెందిన కోటేష్గౌడ్తో వివాహమైంది. గడిచిన 20 సంవత్సరాల నుంచి హైదరాబాద్లోనే నివాసం ఉంటున్నారు. 2021లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 18వ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆ పార్టీ కార్పొరేటర్లంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో ముత్తాయపాలెం గ్రామానికి చెందిన మహిళ శాంతి మేయర్గా ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
సీనియర్ , డిప్యూటీ మేయర్ బీజేపీ కైవసం
చండీగఢ్: సర్వోన్నత న్యాయస్థానం జోక్యంతో చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో భంగపాటుకు గురైన బీజేపీ చివరకు సీనియర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో విజయబావుటా ఎగరేసింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆప్ అభ్యరి్ధకి పడిన 8 ఓట్లను చెల్లనివిగా ప్రకటించి బీజేపీ నేత మేయర్ అయ్యేలా చేసిన రిటరి్నంగ్ అధికారిపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన దరిమిలా చండీగఢ్ సీనియర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు సైతం అందరి దృష్టినీ ఆకర్షించాయి. సోమవారం జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండు విజయాలను నమోదుచేసుకుంది. ఫిబ్రవరి 19వ తేదీన ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు బీజేపీలో చేరడంతో 35 సభ్యులుండే మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ బలం మరింత పెరిగింది. దీంతో సీనియర్ మేయర్ ఎన్నికల్లో ఆప్ మద్దతు పలికిన కాంగ్రెస్ అభ్యర్థి గుర్ప్రీత్ గబీపై బీజేపీ అభ్యర్థి కుల్జీత్ సంధూ విజయం సాధించారు. డెప్యూటీ మేయర్ ఎన్నికల్లోనూ ఆప్ మద్దతు పలికిన కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలా దేవిపై బీజేపీ అభ్యర్ధి రాజీందర్ శర్మ గెలిచారు. -
ఛండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురు దెబ్బ!
పంజాబ్, హర్యానా రాజధాని చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపల్ కార్పొరేషన్ సీనియర్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నేత కుల్జీత్ సంధు విజయం సాధించారు. అలాగే డిప్యూటీ మేయర్ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించింది. డిప్యూటీ మేయర్గా బీజేపీ అభ్యర్థి రాజిందర్ కుమార్ శర్మ గెలుపొందారు. మీడియా దగరున్న సమాచారం ప్రకారం చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి చెందిన కుల్జీత్ సింగ్ సంధుకు మొత్తం 19 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి గురుప్రీత్ సింగ్ గబీకి 16 ఓట్లు వచ్చాయి. శిరోమణి అకాలీదళ్ కౌన్సిలర్ హర్దీప్ సింగ్ బీజేపీకి ఓటు వేశారు. దీంతో బీజేపీ అభ్యర్థి మూడు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఒక ఓటు చెల్లదని ప్రకటించారు. గతంలో మేయర్ ఎన్నికల్లో గందరగోళం నెలకొన్న నేపధ్యంలో ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. కోర్టు ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ప్రిసైడింగ్ అధికారిని కోర్టు మందలించింది. అనంతరం డిప్యూటీ మేయర్, సీనియర్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరిగాయి. కాగా కొద్ది రోజుల క్రితం ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. వీరు ఇప్పుడు బీజేపీకి ఓటు వేశారు. దీంతో బీజేపీ విజయం సాధించింది. గతంలో కాంగ్రెస్, ఆప్లకు 20 మంది కౌన్సిలర్లు ఉండేవారు. వీరిలో ముగ్గురు బీజేపీలో చేరడంతో ‘ఇండియా కూటమి’ కౌన్సిలర్ల సంఖ్య 17కు తగ్గింది. అదే సమయంలో బీజేపీకి అకాలీ, కిరణ్ ఖేర్ మద్దతు పలకడంతో ఆ పార్టీకి మొత్తం 19 ఓట్లు వచ్చాయి. -
బీజేపీకిలోకి ముగ్గురు కౌన్సిలర్లు.. ఆసక్తికరంగా చండీగఢ్ రాజకీయాలు
చండీగఢ్: బీజేపీకి భారీ షాక్ తగిలింది. చంఢీగఢ్ మేయర్ పదవికి ఆ పార్టీ నేత మనోజ్ సోంకర్ ఆదివారం సాయంత్రం రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై నేడు(సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ క్రమంలో సోంకర్ రజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఎన్నికల రిటర్నింగ్ అధికారితో కలిసి బీజేపీ చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో మోసాలకు పాల్పడిందని ఆప్, కాంగ్రెస్లు ఆరోపిస్తున్నాయి. జనవరి 30న జరిగిన ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కుల్దీప్ కమార్ను ఓడించి మేయర్గా గెలుపొందారు. బీజేపీకి 16 ఓట్లు రాగా.. కాంగ్రెస్ ఆప్కు సంబంధించి ఉమ్మడి అభ్యర్ధి కుల్దీప్ సింగ్కు 12 ఓట్లు సాధించారు. అయితే ఆప్ అభ్యర్థికి వచ్చిన 8 ఓట్లు చెల్లవని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో ఆప్ కౌన్సిలర్ ఒకరు సుప్రీంను ఆశ్రయించారు. చదవండి: Kejriwal: ఈడీ విచారణకు ఆరో‘సారీ’! రిటర్నింగ్ అధికారిపై సుప్రీం కోర్టు మండిపాటు ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు ఫిబ్రవరి 5న విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఎన్నికల అధికారిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసినట్లు వీడియో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది. 'ఎన్నికల నిర్వహణ తీరు ఇదేనా? ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఇది ప్రజాస్వామ్యం హత్యే. ఆయనపై విచారణ జరపాలి' అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల బ్యాలెట్ పేపర్లు, వీడియోగ్రఫీని భద్రపరచాలని పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. రిటర్నింగ్ అధికారి వ్యక్తిగతంగా హజరు కావాలని చెప్పి, తదుపరి విచారణను ఫిబ్రవరి 19కు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా ఆప్ నుంచి ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో చేశారు. పూనవ్ దేవి, నేహా, గుర్చరణ్ కాలా ఆదివారం కాషాయ కండువా కప్పుకున్నారు. మొతం 35 మంది సభ్యులున్న చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ 14 మంది కౌన్సిలర్లు ఉండగా తాజా చేరికలతో ఆ సంఖ్య 17కు చేరింది. వీరికి శిరోమణి అకాలీదళ్కు చెందిన ఓ కౌన్సిలర్ మద్దతు కూడా ఉంది. అంతేగాక బీజేపీ చండీగఢ్ ఎంపీ కిరణ్ ఖేర్కు కూడా ఎక్స్ ఆఫీషియోగా ఓటు హక్కును కలిగి ఉన్నారు. దీంతో బీజేపీకి మద్దతు సంఖ్య మొత్తం 19కి చేరింది. ఇక ఆప్కు 10 మంది కౌన్సిలర్లు ఉండా కాంగ్రెస్కు ఏడుగురు ఉన్నారు. -
వలస పక్షి ఖబడ్ధార్...షర్మిలపై ఫైర్
-
మాజీ మంత్రి మల్లారెడ్డికి భారీ షాక్!
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ నియోజకవర్గంలోని 19 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరనున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గం మేడ్చల్లోని జవహర్నగర్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్యపై 19 మంది అసమ్మతి కార్పొరేటర్లు అవిశ్వాసం తీర్మానం ఇచ్చిన సంగతి తెలిసిందే. కావ్య ఒంటెద్దు పోకడలకు సొంత పార్టీ అసమ్మతి కార్పొరేటర్లు మేడ్చల్ జిల్లా కలెక్టర్కు అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చి వైజాగ్ టూర్కు వెళ్లినట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కొత్తగా ఎన్నుకున్న మేయర్తో అసమ్మతి కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి మల్లారెడ్డికి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిల మధ్య విభేదాలన్న విషయం తెలిసిందే. ఇక.. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టికి మలిపెద్ది సుధీర్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. చదవండి: TS: ప్రభుత్వ సలహాదారుల నియామకం -
లండన్ మేయర్ ఎన్నికల బరిలో ఇద్దరు భారత సంతతి వ్యాపారవేత్తలు
లండన్: ప్రతిష్టాత్మక లండన్ మేయర్ పదవికి భారత సంతతికి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు పోటీ పడనున్నారు. మే 2వ తేదీన జరగనున్న ఈ ఎన్నికలో వీరిద్దరూ స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దీంతో, 2016 నుంచి లండన్ మేయర్గా కొనసాగుతున్న పాక్ సంతతికి చెందిన సాదిక్ ఖాన్కు గట్టి పోటీ ఎదురుకానుంది. ఢిల్లీలో జన్మించిన తరుణ్ గులాటి(63) స్ట్రాటజిక్ అడ్వైజర్గా లండన్లో 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్లో భారత్ పర్యటన సమయంలో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అదేవిధంగా, ప్రాపర్టీ వ్యాపారి శ్యామ్ భాటియా(62) మేయర్ ఎన్నికల బరిలో నిలవనున్నట్లు తాజాగా ప్రకటించారు. గులాటి ఎన్నికల ట్యాగ్ లైన్ ‘విశ్వాసం–అభివృద్ధి’కాగా, భాటియా ‘అంబాసిడర్ ఆఫ్ హోప్’ట్యాగ్లైన్తో ముందుకు వెళ్తున్నారు. చదవండి: ఎవరీ ఎర్రసముద్రపు హౌతీలు! -
చివరి దాకా బీఫారం కోసం కొట్లాడతా
హైదరాబాద్: బీఫారం కోసం చివరి వరకు అధిష్టానంతో కొట్లాడతానని, కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్పేట మేయర్ చిగురింత పారిజాత అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. నియోజకవర్గంలోని గడపగడపకూ తిరిగి పార్టీని బలోపేతం చేశానని చెప్పారు. పార్టీ నిర్ణయం తనను, కార్యకర్తలను ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని హైకమాండ్ వద్ద తన పేరు ఖరారైనప్పటికీ మన బలం చూసి ఇతరులు భయపడి టికెట్ రాకుండా కుట్రలు చేశారని ఆరోపించారు. చివరివరకు అధిష్టానం తనను గుర్తించి న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని వ్యక్తులు మోసం చేశారు తప్ప పార్టీ ఎప్పుడు మోసం చేయలేదన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కానుకగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. 20 ఏళ్ల నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉన్నానని, కాంగ్రెస్ పార్టీ కన్న తల్లిలాంటిదని, కట్టె కాలే వరకు కాంగ్రెస్లోనే ఉంటానని పారిజాత స్పష్టం చేశారు. -
విశ్వనగరమే ధ్యేయంగా ముందుకు..
మాదాపూర్: కొండాపూర్ డివిజన్ పరిధిలోని దుర్గం చెరువు వద్ద 7.0 ఎంఎల్డీ సామర్థ్యంతో రూ.15 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన మురుగునీటి శుద్దికేంద్రం(ఎస్టీపీ)ను సోమవారం మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్టీపీతో దుర్గంచెరువు ప్రాంత ప్రజలకు ఎంతో ఊరట లభిస్తుందన్నారు. అలాగే మురుగు నీటి నుంచి చెరువులకు విముక్తి లభిస్తుందన్నారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. మురుగునీటి శుద్ధిలో హైదరాబాద్ నగరం దేశంలోనే ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 772 ఎల్ఎండీ సీవరేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ అనుమతి ఇచ్చిందన్నారు. దీనికోసం రూ. 3866.21 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, హెచ్ఎండీఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు హమీద్ పటేల్, నార్నే శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, సింధు ఆదర్శ్రెడ్డి, మంజుల రఘునాథ్రెడ్డి, మాజీ కార్పొరేటర్లు సాయిబాబా, మాధవరం రంగారావు పాల్గొన్నారు. దుర్గం చెరువులో వాటర్ ఫౌంటెన్లు ప్రారంభం సందర్శకులను ఆకట్టుకునేందుకు దుర్గం చెరువులో ఏర్పాటు చేసిన మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్లను స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ప్రారంభించారు. దాదాపు 60 మీటర్లు పొడవులో..మ్యూజిక్కి అనుగుణంగా రంగులు వెదజల్లుతున్న ఫౌంటెన్లు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతి రోజు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ పనిచేస్తుందని అధికారులు తెలిపారు. -
మంత్రి సబితారెడ్డికి పోటీగా బరిలో మేయర్ పారిజాత?
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా బడంగ్పేట్ మేయర్ చిగురింత పారిజాత పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. నియోజకవర్గం నుంచి డీసీసీ అధ్యక్షుడు చల్లానర్సింహారెడ్డి సహా సీనియర్ నాయకులు దేప భాస్కర్రెడ్డి, కొత్త మనోహర్రెడ్డి తీవ్రంగా పోటీపడ్డారు. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన కొత్త మనోహర్రెడ్డి ఇటీవల కర్ణాటక వెళ్లారు. డిప్యూటీ సీఎంతో పై రవీ చేయించారు.అయినా అధిష్టానం మాత్రం చిగురింతవైపే మొగ్గు చూపినట్లు సమాచారం. అభ్యర్థి పేరు అధికారికంగా ఇంకా వెల్లడించాల్సి ఉంది. సర్పంచ్గా మొదలైన ప్రస్థానం చిగురింత పారిజాత మొదట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్గా గెలుపొందారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. మంత్రి సబితారెడ్డి ఆశీస్సులతో బడంగ్పేట్ మేయర్ పీఠాన్ని అధిష్టించారు. ఆమెకు గతంలో బాలాపూర్ సర్పంచ్గా పని చేసిన అనుభవం ఉంది. ఆ తర్వాత కొద్ది రోజులకే అధికార బీఆర్ఎస్ను వీడి మళ్లీ సొంతగూటికి చేరుకున్నారు. అప్పటి నుంచి మంత్రికి పోటీగా బరిలో నిలిచేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇటీవల తుక్కుగూడ వేదికగా నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభ ఏర్పాట్లు కూడా మేయర్ దంపతులే చూసుకున్నట్లు తెలిసింది. బడంగ్పేట్, మీర్పేట్, జల్పల్లి మున్సిపాలిటీల్లో వీరికి మంచి పట్టుంది. -
తల్లిగా లాలిస్తూ.. మేయర్గా పాలన చేస్తూ..
తిరువనంతపురం: తిరువనంతపురం మేయర్ ఆర్య రాజేంద్రన్పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు నెలన్నర శిశువును చంకనెత్తుకుని విధులు నిర్వర్తిస్తున్న ఆమె ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు తెగ స్పందించారు. ఒక్క అమ్మకు మాత్రమే ఉన్న కళ ఇది అని తల్లితనాన్ని కొనియాడుతున్నారు. ఆర్య రాజేంద్రన్ మేయర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో తన నెలన్నర శిశువును ఒడిలో లాలిస్తూ.. ఓవో ఫైల్స్పై సంతకాలు చేస్తున్నారు. ఈ ఫొటోలు బయటకు రాగా.. నెటిజన్లు ప్రశంసించారు. ఇటు.. వ్యక్తిగతంగా.. అటు.. వృత్తిపరమైన బాధ్యతలను మహిళలు మేనేజ్ చేయగలరని కామెంట్లు పెడుతున్నారు. మహిళలు తల్లితనం కోసం వృత్తిపరమైన లక్ష్యాలను పక్కకుపెట్టాల్సిన అవసరం లేదంటూ స్పందించారు. ఆర్య రాజేంద్రన్ ఫొటో బయటకు వచ్చిన నేపథ్యంలో పనిచేసే ప్రదేశాల్లో పిల్లల సంరక్షణ సెంటర్ల ప్రాధాన్యతల గురించి చర్చిస్తున్నారు. పనిచేసే ప్రదేశాల్లో తగినన్ని ఏర్పాట్లపై ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయని ఆరోపణలు చేస్తున్నారు. అటు.. ప్రభుత్వ కార్యాలయాల్లోకి పిల్లల్ని తీసుకురాకూడదు కదా..? అంటు మరికొందరు ప్రశ్నించారు. కేవలం ఫొటో షూట్ స్టంట్స్గా పేర్కొన్న మరికొంత మంది నెటిజన్లు.. సాధారణంగా రోజూవారి కూలీ చేసుకునేవారికి ఇది సాధ్యమవుతుందా..?అంటూ కామెంట్లు పెట్టారు. ఆర్య రాజేంద్రన్(24) 2020లో 21 ఏళ్లకే మేయర్గా పదవీ బాధ్యతలు చేపట్టి దేశంలోనే అత్యంత పిన్న వయస్కులైన మేయర్గా రికార్డ్కెక్కారు. అదే రాష్ట్రానికి చెందిన సీపీఐఎమ్ ఎమ్మెల్యే సచిన్ దేవ్ను వివాహం చేసుకున్నారు. సచిన్ కూడా దేశంలోనే అత్యంత చిన్న వయస్సులో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వారికి ఈ ఏడాది ఆగష్టు 10న ఓ ఆడ శిశువు జన్మిచింది. ఇదీ చదవండి: నూతన పార్లమెంట్: ఆరు దర్వాజలకు ఆరు జంతువులు కాపలా.. అవి దేనికి ప్రతీక.. -
కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం.. మునేశ్ గుర్జర్ సస్పెండ్
జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మునేశ్ గుర్జర్కు బిగ్ షాక్ తగిలింది. గుర్జర్పై రాజస్థాన్ ప్రభుత్వం వేటువేసింది. ఓ భూమి లీజ్ వ్యవహారంలో ఆమె భర్త లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేస్తూ గెహ్లాట్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల ప్రకారం.. మేయర్ మునేశ్ గుర్జర్ భర్త సుశీల్ గుర్జర్ ఓ భూమి లీజ్ వ్యవహారంలో లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో బాధితుల నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ శనివారం ఏసీబీక అధికారులకు చిక్కాడు. మేయర్ స్వగృహంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో మేయర్ మునేశ్ గుర్జర్ కూడా ఇంట్లోనే ఉన్నారు. ఇక, ఆమె ఇంటి నుంచి ఏసీబీ అధికారులు రూ.40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. లంచం వ్యవహారంలో మేయర్ హస్తం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, కేసు విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో ఆమెపై చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమెను కూడా సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు నంబర్ 43 కార్పొరేటర్ పదవి నుంచి కూడా సస్పెండ్ చేసింది. మరోవైపు.. ఈ కేసులో నారాయణ్ సింగ్, అనిల్ దూబే అనే మరో ఇద్దరిని కూడా ఏసీబీ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. నారాయణ్ సింగ్ నివాసంలోనూ మరో రూ.8 లక్షల నగదు లభ్యమైనట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ఘటనతో రాజస్థాన్లోని కాంగ్రెస్ సర్కార్పై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఇది దోపిడీ, అబద్ధాల ప్రభుత్వమని మండిపడింది. ఇదిలా ఉండగా.. రాజస్థాన్లో ఈ ఏడాది ఎన్నికల జరగనున్న నేపథ్యంలో మేయర్ లంచం కేసు వ్యవహారం హస్తం పార్టీకి తలనొప్పిగా మారింది. Breaking News: Mayor Munesh Gurjar निलंबित। कहा, 'कांग्रेस के बड़े नेता ने साज़िश कर फंसाया है'! pic.twitter.com/AajGDCt6IO — Rajasthan Tak (@Rajasthan_Tak) August 6, 2023 ఇది కూడా చదవండి: మహారాష్ట్రలో కీలక పరిణామం.. ఎన్సీపీలో మళ్లీ చీలిక..? -
రష్యాలో విషాదం: వేడి నీటి పైపు పగిలి నలుగురు మృతి!
రష్యాలోని మాస్కోలో ఒక షాపింగ్ మాల్లో వేడి నీటి పైపు పగిలి నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 70 మంది గాయపడ్డారు. టాస్ అనే వార్తా సంస్థకు మాస్కో మేయర్ సెర్గీ సోబియానిన్ ఈ విషయాన్ని తెలియజేశారు. షాపింగ్ మాల్లో జరిగిన ప్రమాదం నలుగురి ప్రాణాలను బలిగొందని మేయర్ టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా తెలిపారు. మృతుల కుటుంబాలకు, స్నేహితులకు సంతాపం తెలిపారు. తొమ్మిది మంది ఆసుపత్రిలో చేరిక.. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం మాల్లోని పైపు పగిలిపోవడంతో మాల్లోని కొంత భాగంలోకి వేడినీరు ప్రవేశించింది. ఈ ఘటనలో 70 మంది గాయపడ్డారు. మరో 20 మంది ప్రమాదంలో చిక్కుకున్నారు. ఒక వైద్య అధికారి.. టాస్ వార్తా సంస్థతో మాట్లాడుతూ పైపు పగిలిపోవడంతో పది మంది వేడి నీళ్ల బారిన పడ్డారని, వారిలో తొమ్మిది మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. నలుగురిపై క్రిమినల్ కేసు నమోదు ఈ ఉదంతంపై రష్యన్ ఇన్వెస్టిగేటివ్ కమిటీ దర్యాప్తు ప్రారంభించింది. నలుగురు నిందితులపై గ్రూప్ క్రిమినల్ కేసు పెట్టామని ఇన్వెస్టిగేటివ్ కమిటీ ప్రతినిధి యులియా ఇవనోవా మీడియాకు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంలో రెస్క్యూ టీమ్ నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించింది. ఇది కూడా చదవండి: బైడెన్పై అభిశంసనకు సిద్ధమైన రిపబ్లికన్లు -
ఇంట్లోనే ఉండండి.. అత్యవసరమైతేనే బయటకు రండి
హిమాయత్నగర్: నగర ప్రజల ప్రాణాలను రక్షించడమే తమకు అత్యంత ప్రధానమని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. సెలవులు ఉన్నాయి కదా అని ఎవరూ బయటకు రావొద్దంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రజల అవసరాల కోసం, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నగర వ్యాప్తంగా జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది కలిసికట్టుగా పని చేస్తున్నారన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా గ్రీవెన్స్, ట్విట్టర్, టోల్ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. గ్రీవెన్స్కు వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నామన్నారు. ఇందుకోసం నగర వ్యాప్తంగా 429 రెస్క్యూ టీంలు పని చేస్తున్నాయన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను మేయర్ శనివారం సందర్శించారు. కంట్రోల్ రూమ్కు వస్తున్న ఫోన్ కాల్స్, ఇతర ఫిర్యాదుల పట్ల సిబ్బంది పనితీరు ఎలా ఉందనే విషయాల్ని ఆమె దాదాపు గంట సేపు సమీక్షించారు. రూ.780 కోట్లతో 30 ప్రాంతాల్లో పనులు విస్తారమైన వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ గ్రీవెన్స్ సెల్కు ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదుల సంఖ్య 946. వీటిలో శిథిలావస్థ భవనాలు, చెట్లు విరిగి పడిపోవడం, రోడ్లపై నీరు నిలిచిపోవడం, మ్యాన్హోల్స్ నుంచి నీరు పొంగడం తదితర సమస్యలు ఉన్నాయన్నారు. వీటిని తమ సిబ్బంది పరిష్కరిస్తూ వస్తున్నారన్నారు. నాలా పరీవాహక ప్రాంతాల వద్ద ఎస్ఎన్డీపీ కింద రూ.780 కోట్లతో 30 ప్రాంతాల్లో పనులు జరిగాయన్నారు. ఇంకా ఆరు చోట్ల మాత్రమే పనులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. 429 రెస్క్యూ టీంలు వర్షాల కారణంగా ప్రజల అవసరాలు తీర్చేందుకు, ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు చేర్చేందుకు 429 రెస్క్యూ టీమ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ధ్వంసమైన రోడ్లను బాగు చేసేందుకు సీఆర్ఎంపీకి చెందిన 29 టీంలు పని చేస్తున్నాయని మేయర్ తెలిపారు. లోతట్టు ప్రాంతమైన గాజులరామారాం వద్ద నిలిచిపోయిన నీరును తొలగించేందుకు తమ సిబ్బంది పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. ► విద్యాసంస్థలకు, ప్రైవేటు సెక్టార్లకు, ఇతరత్రా కార్యాలయాలకు ప్రభుత్వం సెలవులు ఇచ్చిన నేపథ్యంలో.. కొందరు బయటకు వచ్చేందుకు ఇష్టపడతారని.. అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని.. ఇళ్లల్లోనే సేఫ్గా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నట్లు మేయర్ విజయలక్ష్మి సూచించారు. వారం తర్వాత వారిపై సీరియస్ యాక్షన్ నగరంలో ఇప్పటి వరకు 483 శిథిలావస్థ భవనాలను గుర్తించామన్నారు. కూల్చేందుకు వెళ్లిన క్రమంలో మరమ్మతులు చేసుకుంటామని వాటి యజమానులు కోరడంతో కొంత గడువు ఇచ్చినట్లు చెప్పారు. వీరందరికీ నోటీసులు ఇచ్చామని, ఇప్పటికే 87 భవనాలను కూల్చివేశామని మేయర్ తెలిపారు. 92మంది రిపేర్ చేసుకోగా, 135 మంది ఖాళీ చేశారని, 19 భవనాలను సీజ్ చేశామని, 150 ప్రాసెస్లో ఉన్నాయన్నారు. వీటికి సంబంధించిన యజమానులు వారంలో రిపేర్ చేసుకోకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుందన్నారు. -
వైఎస్ఆర్ సీపీ హయాంలోనే మహిళలకు అధిక ప్రాధాన్యత దక్కింది
-
విదేశాలకు మేయర్ ప్రియ
సాక్షి, చైన్నె: చైన్నె కార్పొరేషన్ మేయర్ ప్రియ విదేశీ పర్యటనకు వెళ్లారు. వారం రోజులు ఆమె స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీలలో అధికారిక పర్యటన చేయనున్నారు. గత ఏడాది జరిగిన నగర పాలక సంస్థల ఎన్నికల ద్వారా చైన్నె రాజకీయ తెరపైకి ప్రియ వచ్చిన విషయం తెలిసిందే. కార్పొరేటర్గా తొలిసారి డీఎంకే తరఫు ఎన్నికలతో మేయర్ పదవికి అర్హత సాధించారు. అతిపిన్న వయస్సులో చైన్నె మేయర్ పగ్గాలు చేపట్టి నగరాభివృద్ధిలో దూసుకెళ్తున్నారు. ప్రజల వద్దకే మేయర్ అంటూ నేరుగా ఆయా ప్రాంతాలకు వెళ్లి మరీ విజ్ఞప్తులను స్వీకరించి పరిష్కరిస్తున్నారు. ఈ పరిస్థితులలో పర్యావరణ పరిరక్షణ, వేస్ట్ మేనేజ్ మెంట్ అంశాలపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఆమెను విదేశీ పర్యటనకు ఎంపికచేయడం విశేషం. శనివారం రాత్రి చైన్నె నుంచి డెప్యూటీ మేయర్ మహేశ్వరర్, పలువురు అధికారులతో కలిసి ఆమె విదేశీ పర్యటనకు వెళ్లారు. ఈనెల 24వ తేదీ చైన్నెకు తిరుగు పయనం కానున్నారు. ఆయా దేశాల్లో అమల్లో ఉన్న పథకాలను చైన్నెలో అమలు చేయడానికే ఈ పర్యటన అని అధికారులు పేర్కొన్నారు. -
బర్మింగ్హమ్ లార్డ్ మేయర్గా బ్రిటిష్ ఇండియన్
లండన్: ఇంగ్లాండ్లోని బర్మింగ్హమ్ నగర లార్డ్ మేయర్గా బ్రిటిష్–ఇండియన్ కౌన్సిలర్ చమన్లాల్ ఎన్నికయ్యారు. తద్వారా బర్మింగ్హమ్ తొలి బ్రిటిష్–ఇండియన్ మేయర్గా ఆయన రికార్డు సృష్టించారు. సిక్కు మతంలోని రవిదాసియా వర్గానికి చెందిన చమన్ లాల్ భారత్లోని పంజాబ్ రాష్ట్రం హోషియార్పూర్ జిల్లాలోని పఖోవాల్ గ్రామంలో జన్మించారు. బ్రిటిష్ ఇండియా సైన్యంలో పనిచేసిన ఆయన తండ్రి సర్దార్ హర్నామ్సింగ్ బంగా 1954లో ఇంగ్లాండ్కు వలస వచ్చారు. బర్మింగ్హమ్లో స్థిరపడ్డారు. చమన్లాల్ 1964లో తన తల్లి సర్దార్నీ జై కౌర్తో కలిసి ఇంగ్లాండ్కు చేరుకున్నారు. అప్పటి నుంచి బర్మింగ్హమ్లోనే నివసిస్తున్నారు. చమన్ లాల్ 1971లో విద్యావతిని వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజకీయాలపై ఆసక్తితో చమన్లాల్ 1989లో లేబర్ పార్టీలో చేరారు. అసమానతలు, వివక్షకు వ్యతిరేకంగా జరిగిన సామాజిక పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారు. -
ఇదేం విడ్డూరం.. 16 ఏళ్ల బాలికను పెళ్లాడిన 65 ఏళ్ల మేయర్!
ప్రేమకే కాదు, పెళ్లికి కూడా వయసుతో సంబంధం లేదని నిరూపించాడు ఓ వ్యక్తి. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఆరు పదుల వయసు దాటిన ఆయన తాజాగా పట్టుమని 20 ఏళ్లు కూడా లేని మైనర్ను మనువాడాడు. 65 ఏళ్ల మేయర్.. 16 ఏళ్ల పాపను పెళ్లాడటమే కాకుండా పిల్లనిచ్చిన అత్తకు ఏకంగా ప్రభుత్వ శాఖలో పదోన్నతి కూడా కల్పించాడు. ఈ వింత పెళ్లి బ్రెజిల్ దేశంలో వెలుగుచూసింది. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం ఈ పెళ్లి వ్యవహారం మేయర్ను ఇరకాటంలో పడేసింది. వివరాలు.. దక్షిణ బ్రెజిల్లోని పరానా రాష్ట్రం అరౌకారియా సిటీ మేయర్ అయిన 65 ఏళ్ల హిస్సామ్ హుస్సేన్ దేహైనీ గత ఏప్రిల్ నెలలో తన కంటే 49 ఏళ్లు వయస్సులో చిన్నదైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చదవండి: తిండి లేదు.. తిప్పలు పడింది.. విశ్వాసమే మళ్లీ నెగ్గింది! కాగా బ్రెజిల్లో అమ్మాయిల కనీసం వివాహ వయసు 16 ఏళ్లు. అక్కడి చట్టాల ప్రకారం 16 ఏళ్లు దాటిన యువతులు తల్లిదండ్రుల అనుమతితో తమకు నచ్చిన వారిని వివాహం చేసుకోవచ్చు. తాజాగా మేయర్ సదరు అమ్మాయికి ఏప్రిల్ 11న, 16 ఏళ్లు నిండటంతో మరుసటి రోజే అంటే ఏప్రిల్ 12న ఆమెను పెళ్లాడాడు. అంతేగాక అప్పటికే విద్యాశాఖలో తక్కువ జీతంతో పనిచేస్తున్న వధువు తల్లిని సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శిగా నియమించాడు. ఇదే ప్రస్తుతం అతని కొంప ముంచింది. కూతురిని పెళ్లాడటం కోసం తల్లికి లంచంగా పదోన్నతి కట్టబెట్టినట్లు డిప్యూటీ మేయర్ సీమా ఆరోపించింది. దీంతో మేయర్పై వచ్చిన అవినీతి, బంధుప్రీతి ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. కాగా దేహైనీకి ఇది మూడో వివాహం. ఇప్పటికే ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చాడు. కొత్త భార్యకు పదహారేళ్లే కావడంతో ఆమె కాలేజీకి వెళ్తోంది. చదవండి: వయాగ్రాపై బ్యాన్.. ఉడుం నూనె కోసం ఎగబడుతున్న యువత..! -
అతి పిన్న వయస్సులో మేయర్గా ఎన్నికై త్రివేణి సూరి
సాక్షి,బళ్లారి: బళ్లారి నగర మేయర్ ఎన్నిక ఉత్కంఠభరితంగా ముగిసింది. బుధవారం సిటీ కార్పొరేషన్ కార్యాలయంలో నగర మేయర్, ఉపమేయర్ ఎన్నిక జరిగింది. రెండో అవధి కింద నగర మేయర్ స్థానం ఎస్సీ జనరల్కు, ఉపమేయర్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడంతో మేయర్ స్థానం కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు పోటీ పడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 4వ కార్పొరేటర్ త్రివేణి సూరి, 7వ కార్పొరేటర్ ఉమాదేవి శివరాజ్, 35వ వార్డు కార్పొరేటర్ కుబేరాతో పాటు బీజేపీకి చెందిన 16వ వార్డు కార్పొరేటర్ నాగరత్న ప్రసాద్లు మేయర్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ చెందిన ముగ్గురిలో హైకమాండ్, స్థానిక ఎమ్మెల్యే నాగేంద్ర 4వార్డు కార్పొరేటర్ త్రివేణి ఎంపికకు కార్పొరేటర్లతో కలిసి మద్దతు సూచించడంతో పార్టీ సూచన మేరకు పోటీలో నిలిచిన కుబేరా, ఉమాదేవిలు ఇద్దరు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. బీజేపీ తరఫున బరిలో నాగరత్న ప్రసాద్ ఇక మేయర్ స్థానానికి కాంగ్రెస్ తరపున త్రివేణి సూరి, బీజేపీ తరపున నాగరత్న ప్రసాద్ పోటీలో ఉండగా ఎన్నికల అధికారి, నగర కమిషనర్, అధికారులు ఎన్నికను నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి త్రివేణి సూరికి సిటీ కార్పొరేషన్లోని 39 వార్డులకు గాను 21 మంది కాంగ్రెస్, 5 మంది స్వతంత్ర కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యే నాగేంద్ర, రాజ్యసభ సభ్యుడు నాసీర్ హుస్సేన్ల ఓటు హక్కుతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు 28 మంది చేయి ఎత్తి మద్దతు తెలిపారు. ఇక 13 మంది కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, ఎమ్మెల్సీ వై.ఎం.సతీష్, లోక్సభ సభ్యుడు దేవేంద్రప్ప ఓటు హక్కుతో బీజేపీ అభ్యర్థినికి 16 మంది మద్దతు దక్కింది. దీంతో మేయర్గా కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కమేలా త్రివేణి సూరి ఎంపికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఉపమేయర్గా జానకి ఏకగ్రీవం ఇక ఉపమేయర్ స్థానానికి ఒకే ఒకరు 33వ కార్పొరేటర్ జానకి నామినేషన్ వేసిన నేపథ్యంలో ఆమె ఉపమేయర్గా ఏకగ్రీవంగా ఎంపికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. మేయర్ స్థానం కోసం ఉదయం నుంచి ఉత్కంఠత నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు పోటీ చేయడంతో చివరి క్షణం వరకు ముగ్గురు తమకే మేయర్ స్థానం కావాలని భీష్మించుకుని కూర్చొన్నారు. అయితే ఎట్టకేలకు కుబేరా, ఉమాదేవిల నామినేషన్ ఉపసంహరించుకునే విధంగా నేతలు చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. నూతన మేయర్, ఉపమేయర్లను ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు అధికారులు, కార్పొరేటర్లు అభినందించారు. చిన్న వయస్సులో మేయర్గా ఎన్నికై న త్రివేణి బళ్లారి నగర మేయర్గానే కాకుండా రాష్ట్రంలోని మహానగర పాలికెల్లో ఇప్పటి వరకు అతి పిన్న వయస్సులో మేయర్గా ఎన్నికై త్రివేణి సూరి రికార్డు సృష్టించారు. 10వ తరగతి స్థానిక సెయింట్ఫిలోమినా స్కూలులో పూర్తి చేసిన అనంతరం పారా మెడికల్ కోర్సు పూర్తి చేసిన తర్వాత అనూహ్యంగా తల్లిదండ్రుల సూచనతో 21 ఏళ్లకే 4వ వార్డు కార్పొరేటర్గా ఎన్నికై న త్రివేణి 23వ ఏట బళ్లారి నగర ప్రథమ పౌరురాలుగా బాధ్యతలు తీసుకున్నారు. బుధవారం నిర్వహించిన ఎన్నికల్లో చిన్న వయస్సులో త్రివేణి సూరికి అదృష్టం వరించి మేయర్ స్థానం దక్కించుకున్నారు. పలువురు ప్రముఖులు పోటీ చేసినా ఆమెనే మేయర్ పదవి వరించింది. తల్లీకూతుళ్లిద్దరినీ వరించిన మేయర్ పదవి మరో విశేషం ఏమిటంటే నూతన మేయర్గా ఎన్నికై న త్రివేణి తల్లి సుశీలబాయి కూడా 2018–19లో నగర మేయర్గా పని చేశారు. తల్లీకూతుళ్లిద్దరినీ మేయర్ పదవి వరించడం నగరంలో చర్చనీయాంశమైంది. అనంతరం నూతన మేయర్ విలేకరులతో మాట్లాడుతూ నగర మేయర్ అవుతానని తన కలలో కూడా ఊహించలేదన్నారు. తన తండ్రి ప్రోత్సాహంతో గతంలో తన తల్లి సుశీలాబాయి ఐదేళ్లు కార్పొరేటర్గా, ఒక ఏడాదిపాటు నగర మేయర్గా సేవ చేసిందని గుర్తు చేశారు. మళ్లీ తండ్రి కమేలా సూరి తనను రాజకీయాల్లోకి రావాలని సూచించడంతో ఉద్యోగానికి వెళ్లకుండా నగర కార్పొరేటర్గా పోటీ చేసి గెలుపొందానన్నారు. ప్రస్తుతం మేయర్ పట్టం వరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్పొరేటర్లందరి సహకారంతో మేయర్గా నగరాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. మేయర్ తండ్రి సూరి మాట్లాడుతూ గతంలో తన భార్యకు, ప్రస్తుతం తన కుమార్తెకు మేయర్ పదవి దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. -
విశాఖకే తలమానికం
డాబాగార్డెన్స్: విశాఖ నగరంలో జీ–20 సదస్సు నిర్వహించడం గర్వకారణంగా భావిస్తున్నట్టు మేయర్ గొలగాని హరి వెంకటకుమారి తెలిపారు. జీ–20 సమ్మిట్ ఏర్పాట్లు, అతిథులు, పర్యాటకులకు కల్పించిన సౌకర్యాలపై బుధవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. ‘విశాఖ కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఇక్కడి ప్రజలు తరఫున కృతజ్ఞతలు. జీ–20 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అద్భుతం. ఈ సదస్సుకు దాదాపు 40 దేశాల నుంచి 200 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. వారికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. షీలానగర్ నుంచి ఎన్ఏడీ, తాటిచెట్లపాలెం, తెలుగుతల్లి ఫ్లైఓవర్ వరకు కోట్లాది రూపాయలతో సుందరీకరణ పనులతో పాటు రోడ్లు, విద్యుత్ అలంకరణ, ఆకర్షణీయమైన పెయింటింగ్ పనులు చేపట్టాం. సాగరతీరంలో కోస్టల్ బ్యాటరీ నుంచి రాడిసన్ హోటల్ వరకు విశాఖ తీర అందాలు అతిథులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాం. ఆర్.కె.బీచ్, సాగర్నగర్, గుడ్లవానిపాలెం, సీతకొండ తదితర ప్రాంతాల్లో వ్యూ పాయింట్లను అతిథులు మెచ్చే విధంగా ఆకర్షణీయంగా రూపొందించాం. ప్రాంతాలు తెలిపే సూచిక బోర్డుల ఏర్పాటు, వేలాడుతున్న కేబుల్ వైర్లను తొలగించాం. ఎక్కడా వ్యర్థాలు లేకుండా అన్ని చర్యలు చేపట్టాం. దేశ ఔన్నత్యాన్ని చాటే విధంగా పలు ప్రాంతాలను తీర్చిదిద్దాం.’అని మేయర్ వివరించారు. ప్రజల భాగస్వామ్యం కావాలి ‘జీ–20 సదస్సు విశాఖకే తలమానికం. విశాఖ నగర పౌరులుగా గొప్ప కార్యక్రమంలో భాగస్వాములవుదాం. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా పరిశుభ్రంగా ఉంచుదాం. దేశ విదేశీ ప్రతినిధులకు మన సంస్కృతి, సంప్రదాయాలను చూపిద్దాం.’అని మేయర్ పిలుపునిచ్చారు. ఈ సదస్సు ఉద్దేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆమె వివరించారు. ‘యోగా ఆల్ పేరిట వైఎస్సార్ సెంట్రల్ పార్క్, వుడా పార్కులో యోగా తరగతులు నిర్వహించాం. ‘మాక్ జీ–20 కాన్క్లేవ్’పేరిట బుధవారం విద్యార్థులతో సదస్సు చేపట్టాం. 24న సాగరతీర స్వచ్ఛత పేరిట బీచ్ క్లీనింగ్, 25న చిత్రలేఖనం పోటీలు, 26న వైజాగ్ సిటీ మారథాన్, వైజాగ్ కార్నివాల్ పేరిట థింసా, కోలాటం, వీరనాట్యం, కూచిపూడి వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ‘ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులు ముడసర్లోవలోని సోలార్ ప్రాజెక్టు, కాపులుప్పాడలోని జిందాల్ రీసైక్లింగ్ ప్లాంట్, జీవీఎంసీలోని కమాండ్ కంట్రోల్ ఆపరేషన్, తాగునీటి ప్రాజెక్టు, కై లాసగిరి, ఆర్కేబీచ్ తదితర ప్రాంతాలను తిలకించనున్నారు’అని మేయర్ తెలిపారు. కోట్లాది రూపాయలతో నగర సుందరీకరణ ‘రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జీ–20 సదస్సుకు సంబంధించి కోట్లాది రూపాయలతో చేపట్టిన సుందరీకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. జోన్–1 పరిధిలో రూ.412.86 లక్షలతో 20 పనులు, జోన్–2 పరిధిలో రూ.1353.77 లక్షలతో 73 పనులు, జోన్–3 పరిధిలో 1371.62 లక్షలతో 59 పనులు, జోన్–4 పరిధిలో 1908.65 లక్షలతో 35 పనులు, జోన్–5 పరిధి–ఏలో 752.44 లక్షలతో 33 పనులు, బిలో రూ.169.91 లక్షలతో 11 పనులు, జోన్–8 పరిధిలో రూ.1908.89 లక్షలతో 27 అభివృద్ధి పనులు ప్రారంభించాం. ఇందులో దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. విద్యుత్కు సంబంధించి రూ.1168.47 లక్షలతో 56 పనులు, మెకానికల్కు సంబంధించి 287.41 లక్షలతో 4 పనులు, పీడీ–1కి సంబంధించి రూ.932.25 లక్షలతో 12 పనులు, పీఎల్ అండ్ సీకి సంబంధించి రూ.878.99 లక్షలతో 53 పనులు జరుగుతున్నాయి. మొత్తంగా ఇప్పటి వరకు 70 శాతం పైబడి పనులు పూర్తయ్యాయి’ అని మేయర్ వివరించారు. హెల్ప్డెస్క్ల ఏర్పాటు ‘జీ–20 సదస్సుకు విశాఖ వేదికగా నిలవడం సంతోషంగా ఉంది. ఈ సమావేశాలకు 40 దేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. విదేశాంగ మంత్రులు, రాయబారులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. రెండు స్టార్ హోటళ్లలో సమ్మిట్ జరగనుంది. అతిథుల కోసం నగరంలోని వివిధ స్టార్ హాటళ్లలో 300 గదులు బుక్ చేశారు. హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేస్తున్నారు.’ అని మేయర్ వివరించారు. -
మహిళా దినోత్సవ సందర్భంగా చిత్తూరు మేయర్ పై స్పెషల్ స్టోరీ
-
మేయర్ ఇంట్లో 5000 వీధి కుక్కల్ని వదలాలి: RGV
-
Shelly Oberoi: మేయర్ పీఠంపై మాజీ ప్రొఫెసర్
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్పై పదిహేనేళ్లుగా కొనసాగుతున్న బీజేపీ ఆధిపత్యానికి చెక్ పెట్టింది ఆప్. డిసెంబర్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే ఎన్నికల్లో.. ఆప్ స్పష్టమైన విజయం సాధించినప్పటికీ రెండు నెలలపై సభ్యుల ఆందోళనతో, ఎల్జీ నిర్ణయంతో.. మేయర్ ఎన్నికపై హైడ్రామా కొనసాగింది. తాజాగా సుప్రీం కోర్టు తీర్పు ఊరటతో ఆప్ విజయం సునాయసమైంది. ఆ పార్టీ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్.. బుధవారం జరిగిన ఢిల్లీ మేయర్ ఎన్నికలో ఘన విజయం సాధించారు. ఆమె నేపథ్యాన్ని ఓసారి పరిశీలిస్తే.. షెల్లీ ఒబెరాయ్(39).. హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ నుంచి కామర్స్లో ఉన్నత డిగ్రీ పూర్తి చేశారు. ఐఐఎం కోజికోడ్(కేరళ)లో మేనేజ్మెంట్ పూర్తి చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్గా గతంలో పని చేసిన ఆమె.. మొట్టమొదటిసారి కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. ఈస్ట్ పటేల్ నగర్ వార్డ్(86వ వార్డ్) నుంచి ఆమె కౌన్సిలర్గా నెగ్గారు. 2013-14 నుంచి ఆప్లో కొనసాగుతున్న ఆమె.. 2020లో మహిళా మోర్చా విభాగానికి వైస్ ప్రెసిడెంట్గా పని చేశారు. ప్రచార సమయంలో షెల్లీ ఒబెరాయ్ జనాల్లోకి వెళ్లిన తీరుపై విస్తృతంగా చర్చ కూడా జరిగింది. షెల్లీ ఒబెరాయ్.. ఇండియన్ కామర్స్ అసోషియేషన్లో లైఫ్టైం మెంబర్. ఇందిరా గాంధీ ఒపెన్ యూనివర్సిటీ నుంచి ఆమె స్కూల్ మేనేజ్మెంట్ స్టడీస్లో పీహెచ్డీ చేశారు. ఐసీఏ కాన్ఫరెన్స్ నుంచి గోల్డ్ మెడల్ను అందుకున్నారు. పలు దేశీయ,అంతర్జాతీయ సదస్సుల నుంచి ప్రశంసలు సైతం దక్కించుకున్నారు. షెల్లీ ఒబెరాయ్ తండ్రి సతీష్ కుమార్ వ్యాపారవేత్త. తల్లి సరోజ్ గృహిణి. ఆమెకు ఒక సోదరి, సోదరుడు ఉన్నారు. కిందటి నెలలో మేయర్ ఎన్నిక సజావుగా జరిగేందుకు ఆదేశాలు జారీ చేయాలని ఆమె సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిషన్పైనే తాజాగా ఆప్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది న్యాయస్థానం. ::సాక్షి ప్రత్యేకం -
ఢిల్లీ మేయర్ పీఠం ఆప్దే..
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మేయర్ పదవిని ఆప్ చేజిక్కించుకుంది. మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. బీజేపీపై ఆప్ 34 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. దీంతో, బీజేపీకి ఊహించని షాక్ తగిలినట్టు అయ్యింది. కాగా, ఢిల్లీ మేయర్గా ఆప్ నేత షేల్లీ ఒబెరాయ్(39) ఎన్నికయ్యారు. ఇక, మేయర్ ఎన్నికల్లో షెల్లీ ఒబెరాయ్కి 150 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాకు 116 ఓట్లు వచ్చాయి. దీంతో, బీజేపీపై 34 ఓట్ల ఆధిక్యంతో ఆప్ అభ్యర్థి విజయం సాధించారు. అనంతరం, ఆప్ నేతలు ఒబెరాయ్కు అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యమే గెలిచిందన్నారు. గెలుపు అనంతరం షెల్లీ ఒబెరాయ్ మాట్లాడుతూ.. ఈ సభను రాజ్యాంగబద్ధంగా నిర్వహిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మీరందరూ సభ గౌరవాన్ని కాపాడుతారని, సజావుగా జరిగేందుకు సహకరిస్తారని ఆశిస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు. ఇక, ఆప్ గెలుపుపై ఆ పార్టీ నేతలు స్పందించారు. ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం గెలిచింది. గూండాయిజం ఓడిపోయింది. ఢిల్లీ మేయర్గా ఎన్నికైనా షెల్లీ ఒబెరాయ్కు అభినందనలు. తర్వాత, అలె ఇక్బాల్ డిప్యూటీ మేయర్ అవుతారు. మోసపూరితంగా వ్వహరించి బీజేపీ మేయర్ పదవిని దక్కించుకోవాలని రాజకీయం చేసింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక, ఆప్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 250 స్థానాలకుగానూ ఆప్ 134, బీజేపీ 104, కాంగ్రెస్ 9 వార్డులను దక్కించుకున్నాయి. షెల్లీ ఒబెరాయ్ వివరాలు ఇవే.. షెల్లీ ఒబెరాయ్(39).. గతంలో ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేశారు. ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఆమె కౌన్సిలర్గా నెగ్గారు. ఈ క్రమంలోనే మేయర్గా ఎన్నికవడం విశేషం. ఇక ఆలె మొహమ్మద్ ఆరుసార్లు ఎమ్మెల్యే, ఆప్ నేత అయిన షోయబ్ ఇక్బాల్ తనయుడు. పదిహేడు వేల ఓట్ల మెజార్టీతో ఈ ఎన్నికల్లో నెగ్గారు. #WATCH | Aam Aadmi Party's Shelly Oberoi elected as the new mayor of Delhi. pic.twitter.com/wAd8WNUFwx — ANI (@ANI) February 22, 2023 -
బాలుడి ప్రాణానికి బాధ్యులు ఎవరు..?
-
బీఆర్ఎస్లో తిరుగుబావుటా.. మంత్రి మల్లారెడ్డి ఆదేశాలు బేఖాతరు!
అధికార పార్టీ బీఆర్ఎస్లో తిరుగుబాటు జెండా ఎగురుతోంది. నగర పాలక సంస్థ, మున్సిపాలిటీల్లో సొంత పార్టీ మేయర్లు, చైర్మన్ల పైనే అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసులు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్కు అందజేయడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 13 పురపాలక సంఘాలు ఉండగా, మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు ఆయన ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. కలెక్టర్కు అవిశ్వాసం నోటీసులు సమర్పించడంపై బీఆర్ఎస్ కేడర్ను తీవ్ర అయోమయానికి గురిచేస్తోంది. సొంత బంధువులు ప్రాతినిధ్యం వహిస్తున్న పురపాలక సంఘాల్లో కూడా కౌన్సిలర్లు మంత్రి మల్లారెడ్డి గీత దాటడంతో పాటు విపక్షాలతో చేతులు కలపడం వంటి విషయాలు రాజకీయ వర్గాలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాష్ట్రంలోనే అత్యధిక పురపాలక సంఘాలు కలిగిన శాసన సభా నియోజకవర్గంగా మేడ్చల్కు పేరుంది. ఇక్కడనే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డి ఆదేశాలను బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పాటించక పోవడంతో పట్టును కోల్పోతున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో వ్యక్త మవుతోంది. అలాగే మేడ్చల్ నియోజకవర్గంలోని పలు పురపాలక సంఘాలకు చెందిన డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా అదే పార్టీకి చెందిన మేయర్లు, చైర్మన్లపై అవిశ్వాసం నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన మంత్రి మల్లారెడ్డి వివిధ మార్గాల ద్వారా అసమ్మతి వాదులను బుజ్జగించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. బుధవారం ‘మన ఊరు–మన బడి’ కింద మరమ్మతులు పూర్తయిన ప్రభుత్వ పాఠశాలల భవనాల ప్రారం¿ోత్సవానికి హాజరైన మంత్రి మల్లారెడ్డి పోచారం, పీర్జాదిగూడ, బోడుప్పల్ పురపాలక సంఘాల్లోని అసమ్మతి వాదులతో సమావేశమై.. బుజ్జగింపుల పర్వానికి తెర లేపినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా... మంత్రి మల్లారెడ్డిపై దాదాపు నెల రోజుల కిందట మల్కాజిగిరి ఎమ్మెల్యే, సీనియర్ బీఆర్ఎస్ నేత మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో సమావేశమైన జిల్లాకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు పలు ఆరోపణలతో తిరుగుబావుటా ఎగురవేసిన విషయం తెల్సిందే. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలను ఖాతరు చేయకుండా నామినేటెడ్ పదవులను మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గం వారికి కట్టబెట్టారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. అలాగే తమ నియోజక వర్గాల్లో అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు విషయంలో కలెక్టర్ను మంత్రి పక్కదారి పట్టిస్తున్నారని ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి వ్యవహార శైలిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యేలు అప్పట్లోనే మీడియా సమావేశంలో ప్రకటించారు. జవహర్నగర్ బాటలో మరికొన్ని.. మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్నగర్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్యపై 20 మంది కార్పొరేటర్లు ఇటీవల కలెక్టర్కు అవిశ్వాస నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ మర్రి దీపికపై 15 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం తీర్మానానికి సంబంధించిన నోటీసు కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2019 సె క్షన్ 37 అనుసరించి నో కాన్ఫిడెన్స్ మోషన్ పిటిషన్ చైర్మన్కు వ్యతిరేకంగా సమర్పిస్తున్నట్లు వారు నోటీసులో పేర్కొన్నారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మరో 4 పురపాలక సంఘాలకు చెందిన అధికార బీఆర్ఎస్కు చెందిన అ మ్మతి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీసులు కలెక్టర్ కు అందజేసేందుకు సిద్ధమవుతున్నారు. -
ఏపీకి మరో 20 ఏళ్ళు సీఎం వైఎస్ జగనే ఉంటారు : బంగి అనంతయ్య
-
అమెరికాలో భారత సంతతి వ్యక్తి ఘనత.. తొలి సిక్కు మేయర్గా రికార్డ్
కాలిఫోర్నియా: భారత సంతతికి చెందిన మైకి హోతి అనే వ్యక్తి అమెరికాలో అరుదైన ఘనత సాధించారు. ఉత్తర కాలిఫోర్నియాలోని ‘లోది’ నగర మేయర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నగర చరిత్రలోనే తొలి సిక్కు మేయర్గా రికార్డ్ సృష్టించారు. మాజీ మేయర్ మార్క్ చాండ్లర్స్ పదవీ కాలం పూర్తవగా నవంబర్లో ఎన్నికలు జరిగాయి. మేయర్ ఎన్నిక కోసం బుధవారం భేటీ అయ్యారు కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు. బుధవారం జరిగిన సమావేశంలో.. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్వుమన్ లీసా క్రెయిగ్.. హోతి పేరును మేయర్గా ప్రతిపాదించారు. ఆయనను మేయర్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కౌన్సిలర్లు. మరోవైపు.. లీసా క్రెయిగ్ను ఉప మేయర్గా ఎన్నుకున్నారు. అంతకు ముందు మైకి హోతి.. 5వ జిల్లాకు కౌన్సిలర్గా, ఉప మేయర్గానూ సేవలందించారు. మేయర్గా ఎన్నికైన విషయాన్ని స్వయంగా ఆయనే ట్వీట్ చేశారు. ‘ లోది నగర 117వ మేయర్గా బాధ్యతలు చేపట్టడం ఎంతో గర్వకారణంగా ఉంది. ’ అని ట్విట్టర్లో రాసుకొచ్చారు మైకి హోతి. మైకి హోతి తల్లిదండ్రులు భారత్లోని పంజాబ్కు చెందిన వారు. ఆర్మ్స్ట్రాంగ్ రోడ్లో సిక్కు ఆలయాన్ని స్థాపించడంలో ఆయన కుటుంబం కీలక పాత్ర పోషించినట్లు స్థానిక మీడియో వెల్లడించింది. Honored to be sworn in as the 117th Mayor of the City of Lodi #lodica #209 pic.twitter.com/dgmrYyz5gk — Mikey Hothi (@mikey_hothi) December 23, 2022 ఇదీ చదవండి: అమెరికా వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్న్యూస్! -
కిషన్ రెడ్డి కేంద్ర నిధులు తేలేకపోయారు: మేయర్ విజయలక్ష్మి
-
రచ్చ రచ్చగా GHMC కౌన్సిల్ సమావేశాలు
-
చర్చ లేదు రచ్చే.. రసాభాసగా జీహెచ్ఎంసీ సమావేశం..
సాక్షి, హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేని విధంగా జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ఎలాంటి చర్చ లేకుండా రచ్చతోనే అర్ధాంతరంగా ముగిసింది. గందరగోళం.. రసాభాసలతో, సభ్యుల సస్పెన్షన్లు ఉంటాయో, ఉండవో కూడా తెలియని అయోమయంతో అభాసుపాలైంది. జీహెచ్ఎంసీ చరిత్రలోనే తొలిసారిగా సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు సభకు అధ్యక్షత వహించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రకటించారు. అనంతరం కొద్ది సేపటికి సభనే ముగించారు. శనివారం జరిగిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ఆద్యంతం రచ్చే అయింది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి (2023–24)సంబంధించిన బడ్జెట్ ప్రత్యేక సమావేశం, నగర ప్రజల సమస్యలపై చర్చించాల్సిన సాధారణ సమావేశం రెండూ ఒకేరోజు ఏర్పాటు చేశారు. అజెండా మేరకు తొలుత బడ్జెట్ సమావేశంలో భాగంగా మేయర్ బడ్జెట్ ప్రతిలోని వివరాలు చదవడం ప్రారంభించగానే బీజేపీ సభ్యులు అడ్డుకొని పోడియం వైపు దూసుకెళ్లారు. ప్రశ్నోత్తరాలపై పట్టుబట్టడంతో.. ► తొలుత బడ్జెట్ బదులు ప్రజల సమస్యలపై ప్రశ్నోత్తరాలు నిర్వహించాలని పట్టుబట్టారు. గందరగోళంతో మేయర్ సభను పదినిమిషాలు వాయిదా వేశారు. తిరిగి సమావేశమయ్యాక సైతం వారు ఆందోళన కొనసాగిస్తుండగానే మేయర్ బడ్జెట్కు ఆమోదం తెలిపేవారి చేతులెత్తాలని చెప్పి, బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులను పరిగణనలోకి తీసుకొని ఆమోదం పొందినట్లు ప్రకటించారు. దాన్ని అడ్డుకుంటూ బీజేపీ సభ్యులు మేయర్ పోడియం ముందు బైఠాయించారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేశారు.గందరగోళం తీవ్రంగా మారడంతో మరోసారి సభను 15 నిమిషాలు వాయిదా వేశారు. తిరిగి 11.50 గంటలకు సమావేశం ప్రారంభమయ్యాక సైతం అదే సీన్ పునరావృతమైంది. బీజేపీ సభ్యులు పోడియం చుట్టుముట్టారు. బడ్జెట్పై చర్చ జరగకుండానే బడ్జెట్ను ఎలా ఆమోదిస్తారంటూ పట్టుబట్టారు. ► ఆమోదం పొందాక తిరిగి చర్చ ప్రశ్నే లేదని, ప్రశ్నోత్తరాలు ప్రారంభిస్తానని, తొలుత మీకే అవకాశమిస్తానని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. ప్రశ్నల కోసం పేర్లు పిలవగా ఒకరిద్దరు బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు లేచి మాట్లాడారు. వారు మాట్లాడుతున్నప్పటికీ బీజేపీ ఆందోళన ఆగలేదు. వీధిదీపాలు వెలగడం లేవని ఎంఐఎం.. అభివృద్ధి కార్యక్రమాలకు ఢిల్లీ వారు నగరానికి అవార్డులిస్తున్నా, గల్లీ వారికి కనిపించడం లేవని బీఆర్ఎస్ ప్రస్తావించాయి. బీజేపీ సభ్యులెంతసేపటికీ పోడియం దిగి రాకపోవడం.. గందరగోళ పరిస్థితి సద్దుమణగకపోవడంతో రెండు మూడు పర్యాయాలు సస్పెన్షన్ హెచ్చరికలు చేసిన మేయర్ 12.11 గంటలకు పోడియంవద్ద ఉన్న బీజేపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు, మేయర్, కమిషనర్ తమ సీట్లనుంచి లేచి వెళ్లిపోయారు. తిరిగి 12.44 గంటలకు సీట్లోకి వచి్చన మేయర్ మాట్లాడుతూ ‘మంచిగా చెబుతున్నా కూర్చోండి. చర్చిద్దాం’ అన్నా పోడియంను చుట్టుముట్టిన వారు వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలో సమావేశాన్ని ముగిస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. రూ. 6224 కోట్లతో బడ్జెట్ ఆమోదం 2023–24 ఆర్థిక సంవత్సరానికి రూ.6224 కోట్ల బడ్జెట్ మెజారిటీ సభ్యులతో సభ ఆమోదం పొందినట్లు మేయర్ ప్రకటించారు. స్టాండింగ్ కమిటీ ఆమోదించిన బడ్జెట్ను యథాతథంగా ఆమోదించారు. బీజేపీ, కాంగ్రెస్ ధర్నాలు.. ప్రజా సమస్యలపై చర్చించాలని, అభివృద్ధి పనులి్నచేపట్టాలనే డిమాండ్లతో బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు వేర్వేరుగా ఆందోళనలు, ధర్నాలు చేశారు. కాంగ్రెస్ సభ్యులు మేయర్ చాంబర్ ఎదుట ‘సేవ్ డెమోక్రసీ.. సేవ్ జీహెచ్ఎంసీ’ ప్లకార్డులను ప్రదర్శించారు. బీజేపీ సభ్యులు మేయర్ ప్రవేశ ద్వారం ఎదుట ధర్నా చేశారు. పోలీసులు వారిని అక్కడినుంచి తరలించారు. సస్పెన్షన్ ఉంటుందా.. ? జీహెచ్ఎంసీ నిబంధనల మేరకు సభ్యులను సస్పెండ్ చేసే అధికారం లేనట్లు మునిసిపల్ వ్యవహారాల నిపుణుడొకరు పేర్కొన్నారు. సభను నిర్వహించలేని పరిస్థితులు ఎదురైతే అందుకు కారణమైన వారిని బయటకు పంపించడమో, లేక సభనే ముగించడమో మినహా సభ్యులను సస్పెండ్ చేయడమన్నది ఉండదని, గతంలో సైతం ఎలాంటి సస్పెన్షన్లు లేకపోవడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మేయర్ తెలిసో, తెలియకో సస్పెండ్ చేస్తున్నానని ప్రకటించాక పునరాలోచనలో పడి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నయాపైసా తెప్పించని కిషన్రెడ్డి: మేయర్ విజయలక్ష్మి సమావేశానంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ మాట్లాడుతూ.. సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి కేంద్రమంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్రెడ్డి జీహెచ్ఎంసీతో పాటు పరిసరాల్లోని మున్సిపాలిటీలకూ ఒక్క పైసా తేలేకపోయారన్నారు. మున్సిపాలిటీలకు వచ్చే నిధులు ఇప్పించలేక పోయారన్నారు. బీజేపీ సభ్యులు బడ్జెట్ గురించి కానీ, ప్రజల సమస్యల గురించి కానీ చర్చించకపోవడంతో వారికి సమస్యలపై పట్టింపు లేదని వెల్లడైందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లు ఎస్సార్డీపీ, ఎస్ఎన్డీపీ, సీఆర్ఎంపీల ద్వారా జీహెచ్ఎంసీ నిధులతోనే ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు. బీజేపీ వారికి మాట్లాడేందుకు విషయం లేనందునే గందరగోళానికి దిగారని ఆరోపించారు. మహిళా మేయర్ను అని కూడా చూడకుండా పోడియంను చుట్టిముట్టి అగౌరవంగా ప్రవర్తించారన్నారు. జీహెచ్ఎంసీకి కేంద్ర మంత్రి నిధులిస్తారా? హెచ్ఎంసీలో పాలన గాడి తప్పింది. నిధులెలా వస్తున్నాయో.. ఎలా ఖర్చు చేస్తున్నారో తెలియడం లేదు. ఎక్కడ వసూలైన నిధుల్ని అక్కడ వినియోగించాలి. పాతబస్తీ నుంచి ట్యాక్సుల రూపేణా ఎంత వసూలవుతుందో.. ఎంత ఖర్చు చేస్తున్నారో, అలాగే న్యూసిటీనుంచి ఎంత వసూలవుతుందో, ఎంత వెచి్చస్తున్నారో వెల్లడించాలి. హైటెక్సిటీలో హంగులు తప్ప ఇంకెక్కడా ఏమీ లేదు. గోడలకు రంగులేసి విశ్వనగరం చేస్తున్నామని చెబుతున్నారు. జీహెచ్ఎంసీ ఇండిపెండెంట్ బాడీ. ఎలా నడపాలో చేతగాక కేంద్రమంత్రి కిషన్రెడ్డిని ప్రస్తావిస్తూ నిధులివ్వలేదనడం విడ్డూరంగా ఉంది. – బండ కార్తీకరెడ్డి, మాజీ మేయర్, బీజేపీ నాయకురాలు చదవండి: Roundup 2022: నిషా ముక్త్ షహరే.. డ్రగ్ ఫ్రీ సిటీ దిశగా! -
మేయర్ ను అడ్డుకున్న పార్టీ కార్యకర్తలు
-
కాలేజ్కి వెళ్లే యువకుడు మేయర్గా ఎన్నికై చరిత్ర సృష్టించాడు
యూఎస్లో అతి పిన్న వయస్కుడైన మేయర్గా 18 ఏళ్ల యువకుడు జైలెన్ స్మిత్ చరిత్ర సృష్టించాడు. అమెరికాలో అర్కాన్సాస్లోని ఒక చిన్నపట్టణంలో తన ప్రత్యర్థిని ఓడించి మేయర్గా ఎన్నికైన అతి పిన్నవయస్కుడిగా నిలిచాడు. ఈ మేరకు స్మిత్ మంగళవారం అమెరికాలోని ఒక చిన్న పట్టణం ఎర్లేకు మేయర్గా ఎన్నికయ్యారు. అతను తన ప్రత్యర్థి పారిశుధ్య విభాగంలోని సూపరింటెండెంట్ నేమీ మాథ్యూస్ను 235 భారీ మెజార్టీ ఓట్లతో ఓడించాడు. స్మిత్ ఈ ఏడాదే స్కూల్ నుంచి పట్టుభద్రుడయ్యాడు. అర్కాన్సాస్లో మిస్సిస్సిప్పి నదికి పశ్చిమాన 30 మైళ్ల దూరంలో ఉన్న ఎర్లే పట్టణంలో సుమారు 1,831 మంది జనాభా ఉంది. ప్రచారంలో స్మిత్ ప్రజా భద్రతను మెరుగుపర్చడం, పాడుబడిని గృహాలు, భవనాలను పునరుద్ధరించడం వంటి ప్రణాళికలను అభివృద్ధిపరుస్తున్నాని హామీతో ఈ మేయర్ పదవికి ఎన్నికయ్యారు. (చదవండి: తొందరగా వెళ్లాలని పట్టాలు దాటుతోంది..సడెన్గా ట్రైయిన్ రావడంతో..) -
ఏపీ సంక్షేమ పథకాలకు లండన్ ఎంపీ కితాబు
సాక్షి, అనంతపురం: లండన్లో కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బాబ్బ్లాక్మెన్ను అనంతపురం మేయర్ వసీం శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నాలుగుసార్లు ఎంపీగా గెలిచినా ఆయన చాలా నిరాడంబరంగా తనతో గంటపాటు ముచ్చటించారని మేయర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల బ్రోచర్ను అందించి వివరించానన్నారు. సచివాలయ – వలంటీర్ వ్యవస్థ, అమ్మ ఒడి తదితర సంక్షేమ పథకాలు భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దేందుకు ఎంతో దోహదం చేస్తాయని ఆయన కితాబునిచ్చారన్నారు. ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులు ఎప్పటికీ మహోన్నతులుగానే ఉంటారని ప్రశంసించారన్నారు. లండన్లోని కట్టడాలు, కొత్త ఆలోచనలను అనంతపురం నగరపాలక సంస్థలో అమలు పరిచేందుకు చర్యలు తీసుకుంటామని మేయర్ తెలిపారు. చదవండి: (అమ్మ ఇక లేదు.. ప్రేమ పెళ్లి విషాదాంతం) -
US midterm elections 2022: లాస్ ఏంజెలిస్ మేయర్గా నల్లజాతి మహిళ
లాస్ ఏంజెలిస్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భాగంగా జరిగిన లాస్ ఏంజెలిస్ మేయర్ పదవిని మొట్టమొదటిసారిగా ఒక నల్లజాతి మహిళ కైవసం చేసుకుంది. లాస్ ఏంజెలిస్కు ఒక మహిళ మేయర్ కావడం ఇదే తొలిసారి. 40 లక్షల జనాభా ఉన్న లాస్ఏంజెలిస్ను పలు సమస్యలు చుట్టుముట్టిన వేళ రిపబ్లికన్ అభ్యర్థి, కుబేరుడు రిక్ కరుసోపై డెమొక్రటిక్ మహిళా అభ్యర్థి కరీన్ బాస్ దాదాపు 47,000 ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 70 శాతానికిపైగా ఓట్ల లెక్కింపు పూర్తవడంతో కరీన్ బాస్ గెలుపు దాదాపు ఖరారైనట్లే. రెండేళ్లక్రితం అధ్యక్ష ఎన్నికల వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు చెందిన ఉపాధ్యక్ష అభ్యర్థుల షార్ట్ లిస్ట్లోనూ కరీన్ పేరు ఉండటం గమనార్హం. లాస్ ఏంజెలిస్ మేయర్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా రిక్ కరుసో ఏకంగా దాదాపు రూ.817 కోట్లకుపైగా ఖర్చుపెట్టినట్లు వార్తలొచ్చాయి. ‘ ఈ ఎన్నికలు మనీకి సంబంధించినవి కాదు. మనుషులకు సంబంధించినవి’ అని ప్రచారం సందర్భంగా కరీన్ బాస్ వ్యాఖ్యానించడం ప్రస్తావనార్హం. -
మజ్లిస్ ఎంపీతో ‘బండి’కి ఏం పని?
కరీంనగర్: ‘ఔరంగాబాద్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్కు ఏం పని? అక్కడ ఏం వ్యాపారాలు చేస్తున్నారో చెప్పాలి’ అని కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్సింగ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజకీయాల్లో మాటల యుద్ధాలే ఉండాలి తప్ప ప్రత్యక్ష దాడులకు తావులేదన్నారు. ఎమ్మెల్సీ కవిత సీఎం కూతురు అయినందునే ఆమెను లక్ష్యంగా చేసుకొని ప్రణాళిక ప్రకారం దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీ బండి సంజయ్పైనా అనేక ఆరోపణలు ఉన్నాయని, అలాగని టీఆర్ఎస్ శ్రేణులు ఆయన ఇంటి ముందు ధర్నా చేశాయా? అని ప్రశ్నించారు. ఔరంగాబాద్ మజ్లిస్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ను బండి సంజయ్ ఎందుకోసం కలిశారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ మేరకు ఇంతియాజ్ జలీల్కు బండి సంజయ్ చార్మినార్ ప్రతిమను అందిస్తున్న ఫొటోను విలేకరుల ముందు ప్రదర్శించారు. కరీంనగర్ ప్రజలను విభజించాలనుకోవడం దుర్మార్గమన్నారు. -
‘డబుల్’తో సంబంధం లేదు
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుల్లో జీహెచ్ఎంసీకి ఎలాంటి సంబంధం లేదని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం అందిన 7.09 లక్షల దరఖాస్తులు అసంపూర్తిగా ఉన్నాయని, కులం, మతం, వయసు, ఓటరు గుర్తింపు కార్డు వివరాల సేకరణ మాత్రమే జీహెచ్ఎంసీ చేపట్టిందని ఆమె తెలిపారు. ఆయా వివరాలను సేకరించి పూర్తి సమాచారంతో సంబంధిత జిల్లా కలెక్టర్లకు అందజేస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె జాతీయ జెండాను ఎగురవేశారు. కమిషనర్ లోకేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. మేయర్ ప్రసంగంలో ప్రధాన అంశాలివీ.. మురికి వాడల్లోని పేద నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా ప్రయోగాత్మకంగా శేరిలింగంపల్లి జోన్ చందానగర్ సర్కిల్లో ఏడాదికి 600 మందికి ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్యాలు పెంచేందుకు త్వరలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నాం. నగరంలోని అన్ని కాలనీల్లో నూరు శాతం పచ్చదనం లక్ష్యం సాధించేందుకు, దాని ద్వారా సెల్ఫ్హెల్ప్ గ్రూపుల్లోని మహిళలకు ఆదాయం లభించేందుకు తొలిదశలో 3 వేల కాలనీల్లో మొక్కల పెంపకం బాధ్యతల్ని అప్పగించాం. ప్రజల రక్షణ కోసం 1456 మురికివాడలు, 975 పార్కుల్లో రూ. 20 కోట్లతో దాదాపు 8వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ అవయవాలు, సహాయ పరికరాలను 4,749 మందికి త్వరలో పంపిణీ చేస్తాం. నగరంలోని 185 చెరువుల్ని దశలవారీగా అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేపట్టాం. భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్లు ప్రస్తుతమున్న రెండింటికి తోడు మరో రెండు చారి్మనార్, సికింద్రాబాద్ల వైపు ఏర్పాటు కానున్నాయి. ఎస్సార్డీపీ ద్వారా 16 ఫ్లైఓవర్లు, 5 అండర్ పాస్లు, 6 ఆరోఓబీలు, ఆర్యూబీలు అందుబాటులోకి వచ్చాయి. మరో 18 çపనులు పురోగతిలో ఉన్నాయి. వాటిలో వీలైనన్ని పనుల్ని డిసెంబర్లోగా పూర్తిచేస్తాం. రహదారుల నిర్వహణలో భాగంగా రూ.409 కోట్లతో 1,740 పనులు పూర్తయ్యాయి. సీఆర్ఎంపీ ద్వారా ఇప్పటి వరకు 678.41 కి.మీ రోడ్ల రీకార్పెటింగ్కు రూ.783.16 ఖర్చయింది. రెండు దశల్లో రూ. 49.15 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 34 ఆధునిక వైకుంఠ ధామాల్లో 28 పూర్తయ్యాయి. (చదవండి: కంటోన్మెంట్ విలీనంపై.. తేలేదెప్పుడు?) -
మధ్యప్రదేశ్లో ‘ఆప్’ పాగా.. మేయర్ పీఠం కైవసం
భోపాల్: దేశ రాజధాని ఢిల్లీతోపాటు పంజాబ్లో అధికారం దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యప్రదేశ్లో కూడా కాలుమోపింది. సింగ్రౌలీ మున్సిపల్ ఎన్నికల్లో మేయర్గా ఆప్ అభ్యర్థి రాణి అగర్వాల్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి ప్రకాశ్ విశ్వకర్మను 9,352 ఓట్ల తేడాతో ఓడించారు. కాంగ్రెస్ అభ్యర్థి మూడో స్థానానికి పరిమితమయ్యారు. మధ్యప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ నెగ్గడం ఇదే తొలిసారి. 2014లో తొలిసారి జిల్లా పంచాయతీ సభ్యురాలిగా ఎన్నికైన రాణి అగర్వాల్.. తాజాగా సింగ్రౌలీ మేయర్గా విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమె పోటీ చేసినప్పటికీ పరాజయం పాలయ్యారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఆమెకు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రచారంలో పాల్గొని రోడ్ షో నిర్వహించారు. తాజా ఫలితాల్లో రాణి అగర్వాల్ విజయం సాధించటంతో సింగ్రౌలీ మేయగా గెలిచారు. సింగ్రౌలీ మేయర్గా ఎన్నికైన రాణి అగర్వాల్తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన ఆప్ నేతలకు ఆ పార్టీ కన్వినర్ అరవిందక్ కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కోసం కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆప్ నిజాయతీ రాజకీయలాను దేశవ్యాప్తంగా ప్రజలందరూ విశ్వసిస్తున్నారని అన్నారు. ఇదీ చూడండి: Margaret Alva: విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా -
నవ్వుతూ సేవ చేయ్! లేదంటే జరిమాన: ప్రభుత్వ ఉద్యోగులకు ఆదేశాలు
Smile Or Get Fined: ఫిలిప్పీన్స్ మేయర్ స్థానిక ప్రభుత్వం అందించే సేవల స్థాయిని మెరుగుపరిచే నిమిత్తం ఒక సరికొత్త పాలసీని తీసుకు వచ్చాడు. ఫిలిప్పీన్స్ ప్రధాన ద్వీపం లుజోన్లో క్యూజోన్ ప్రావిన్స్లోని ములానే పట్టణంలో అరిస్టాటిల్ అగ్యురే కొత్త మేయర్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన అధికారం చేపట్టిన వెంటనే స్మైల్ పాలసీ అనే కొత్త పాలసీని ప్రవేశ పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవ చేస్తూనే ప్రశాంతంగా, స్నేహపూర్వక వాతావరణంలో వారి సమస్యలను విని సాయం అందించేలా చిత్తశుద్ధితో పనిచేసేందుకు ఈ స్మైల్ పాలసీ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. స్థానికులు, ఎక్కువగా కొబ్బరి వ్యాపారులు, మత్స్యకారులు తమ పన్నులు చెల్లించడానికి లేదా సహాయం కోరడానికి వెళ్ళినప్పుడు టౌన్ హాల్ సిబ్బంది తమతో అనుచితంగా వ్యవహరిస్తున్నారంటూ ...ఫిర్యాదులు రావడంతోనే ప్రతిస్పందనగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అగ్యురే తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల వైఖరి మార్చేందుకే ఈ పాలసీని తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ పాలసీని పాటించని ఉద్యోగులకు ఆరు నెలల జీతానికి సరిపడా మొత్తం జరిమానగా విధించబడటం లేదా విధుల నుంచి తొలగించడం వంటివి జరుగుతాయని స్పష్టం చేశారు. అగ్యురే ఎన్నికలలో పోటీ చేయడానికి ముందు ఆక్యుపేషనల్ థెరపిస్ట్గా పనిచేశారు. ఈ మేరకు అగ్యురే మాట్లాడుతూ... వ్యాపార అనుకూలమైన మున్సిపాలిటీగా ఉండేందుకే ఈ పాలసీని తీసుకువచ్చాం. తమ ప్రభుత్వ ఉద్యోగులు ఈ నిబంధనలు పాటిస్తారనే విశ్వసిస్తున్నానని చెప్పారు. (చదవండి: అగ్నిపర్వతం వద్ద సెల్ఫీ తీసుకోబోయి... అందులోనే పడిపోయాడు ఆ తర్వాత...) -
పదవి కాపాడుకునేందుకు మేయర్ పడరాని పాట్లు!
కుత్బుల్లాపూర్: శివారు ప్రాంత రాజకీయం రసవత్తరంగా మారుతుంది.. ఇప్పటికే నగరం నగర శివారు ప్రాంతాల్లో ఉన్న మున్సిపాలిటీలు.. నగర పంచాయతిలలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పార్టీలు మారుతూ తమ అధిష్టానానికి ఝలక్ ఇస్తున్న నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఇదే పరిస్థితి నెలకొంది. అధికార టిఆర్ఎస్ కార్పొరేటర్లు క్యాంపు రాజకీయాలకు ఆస్కారం ఇవ్వడంతో మేయర్ ఒక మెట్టు దిగి ప్రతి ఒక కార్పొరేటర్కు ఎంతో కొంత ముట్టజెప్పే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ► కాగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు 2019 జనవరి నెలలో జరిగాయి. ఈ ప్రాంతంలో మొత్తం 27 మంది అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు గెలుపొందగా ఆరు గురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. అయితే మెజారిటీ సభ్యులు ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ లో స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ రాజులు కలిసి కొలను నీలా గోపాల్రెడ్డిని మేయర్గా, డిప్యూటీ మేయర్ ధనరాజ్యాదవ్లను ఎంపిక చేశారు. అంతవరకు బాగానే ఉంది రెండేళ్లపాటు సాఫీగా సాగిన వీరి ప్రయాణం మూడవ సంవత్సరం దగ్గరపడుతున్న కొద్దీ టెన్షన్ మొదలైంది. క్యాంపు రాజకీయాలకు... ► మొత్తం 27 మంది కార్పొరేటర్లు టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు కాగా వారిలో ఏకంగా 17 మంది స్థానిక టీఆర్ఎస్ నేతతో గత నెలలో శ్రీశైలం టూర్ కి వెళ్లి క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు. దీంతో ఏదో జరిగిపోతుందన్న ఆందోళనతో మేయర్ భర్త గోపాల్రెడ్డి ఎమ్మెల్సీ రాజు, ఎమ్మెల్యే వివేకానందలకు ఈ విషయా న్ని చేరవేశారు. క్యాంపులో ఉన్న 17 మందితో పాటు మరో ముగ్గురు కార్పొరేటర్లు జత కలవడంతో వారి సంఖ్య ఏకంగా 20 కి చేరింది. దీంతో ‘రాజీ’ఫార్ములాకు వచ్చిన మేయర్ భర్త ఒ క్కొక్కరికి ఇంత చొప్పున ఇస్తానని హామీ ఇచ్చి ఊపిరి పీల్చుకున్నాడు. అయితే సమయానికి డబ్బులు ఇవ్వకపోవడంతో మరోసారి ఆ నో టా.. ఈ నోటా ఈ ఒప్పందం విషయం బహిర్గతం కావడంతో ఆయా పార్టీల నాయకులు ఈ విషయంపై ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా స్వతంత్రంగా గెలిచిన ఆరుగురు కార్పొరేటర్లు ఈ విషయంలో తటస్థంగా ఉండడం విశేషం. గిట్టని వాళ్ల పని ఇది... ► ఈ విషయంపై నిజాంపేట మేయర్ భర్త గోపాల్ రెడ్డిని వివరణ కోరగా ఖండించారు. కొంతమంది గిట్టనివాళ్లు ఇలా చెప్పుకుంటున్నారని, తాను ఎందుకు డబ్బులు ఇస్తానని ప్రశ్నించారు. అదంతా అబద్ధపు ప్రచారమని, తాను ఎవరికీ డబ్బులు ఇస్తానని చెప్పలేదు అంటూ వివరణ ఇచ్చారు. -
మొసలిని పెళ్లాడిన మేయర్.. దాన్ని ముద్దుపెట్టుకుంటూ ఫోటోకు పోజులు
శని ఉందని చెట్టుతోనో, పుట్టతోనో ముందు పెళ్లి చేస్తే... అది పోతుందనే సంప్రదాయం మనదగ్గరా ఉంది. కానీ మొసలిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అని అనుమానంతో చూడకండి. ఈ మెక్సికన్ మేయర్ చేసుకున్నాడు. వందల ఏళ్ల పాత సంప్రదాయంలో భాగంగా అతను మొసలిని పెళ్లి చేసుకోవడమే కాదు... దాన్ని ముద్దుపెట్టుకుంటూ ఫొటోలకు పోజులు కూడా ఇచ్చాడు. వివరాల్లోకి వెళ్తే.. కప్పల పెళ్లిళ్లు చేస్తే, వరదపాశం వండి బండమీదపోసి తింటే.. వరదలు పారే వర్షాలు కురుస్తాయని మన దగ్గర కొన్ని నమ్మకాలున్నాయి కదా! అలా మెక్సికోలోనూ ఓ పాత పద్ధతి ఉంది. అక్కడ గ్రామ పెద్ద మొసలిని పెళ్లి చేసుకుంటే... వర్షాలు బాగా కురిసి, పంటలు బాగా పండుతాయని, చేపలు సమృద్ధిగా దొరుకుతాయని నమ్మకం. ఇంకేముంది.. ఈ ఏడు కూడా అలాగే జరగాలని సాన్ పెడ్రో హామెలుల గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. మేయర్ విక్టర్ హ్యూగో సోసాకు కూడా మొసలితో పెళ్లి చేయాలనుకున్నారు. పెళ్లి కూతురు మొసలిని... పెళ్లి దుస్తుల్లో అందంగా అలంకరించారు. తెల్లని ముసుగును కూడా కప్పారు. సంప్రదాయ సంగీతం, మేళ తాళాలు, నృత్యాల మధ్య వధువును వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం వరుడు మేయర్, వధువు మొసలిని పెళ్లి చేసుకున్నాడు. ఈ గ్రామం అన్నింటా సమృద్ధిగా ఉండాలని ప్రార్థనలు కూడా చేశాడు. ఇక వేడుక మొత్తం ఆ మొసలి పెళ్లికూతురిని ముద్దు పెడుతూనే ఉన్నాడు ఆ మేయర్. మరి ముద్దులు పెడుతుంటే ఆ మొసలి అతడిని ఏమీ అనలేదా అన్న అనుమానం వస్తోంది కదూ! ఫొటో జాగ్రత్తగా చూడండి దాని మూతిని తాడుతో కట్టేశారు. చదవండి: పాకిస్తాన్లో ఘోరం.. లోయలో పడిన బస్సు..19 మంది మృతి In an age-old ritual, a Mexican mayor married his alligator bride to secure abundance. Victor Hugo Sosa sealed the nuptials by kissing the alligator's snout https://t.co/jwKquOPg93 pic.twitter.com/Vmqh4GpEJu — Reuters (@Reuters) July 1, 2022 -
Hyderabad: కారు దిగిన మేయర్.. కాంగ్రెస్లో చేరిక
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు బడంగ్పేట కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డికి రాజీనామా లేఖ పంపించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బడంగ్పేట కార్పొరేషన్ అభివృద్ధిని కాంక్షించి కాంగ్రెస్ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచిన తాను ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. అప్పటి నుంచి పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అహర్నిశలు కష్టపడ్డామని, అంకితభావంతో సేవలు అందించామన్నారు. ఆత్మాభిమానం చంపుకోలేకే టీఆర్ఎస్ను వీడి తిరిగి కాంగ్రెస్లో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. కాగా మేయర్తో పాటు 23వ కార్పొరేటర్ రాళ్లగూడం సంతోషి శ్రీనివాస్రెడ్డి, 20వ డివిజన్ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్రెడ్డి సైతం టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. వీరంతా సోమవారం హస్తినలో రాహుల్గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. -
TS: బీజేపీ సభ వేళ టీఆర్ఎస్కు ఊహించని షాక్
Badangpet Mayor Chigirintha Parijatha Narasimha Reddy: తెలంగాణలో అధికారం కోసం బీజేపీ ప్లాన్స్ రచిస్తున్న వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గులాబీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీకి బడంగ్పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె తన రాజీనామా లేఖను జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి పంపించారు. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖలో గులాబీ పార్టీకి, క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో కొన్ని అనివార్య, వ్యక్తిగత కారణాల వల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. పార్టీలో తనకు సహాకరించిన ప్రతీ ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బడంగ్ పేట అభివృద్ధిని కాంక్షించి పార్టీలో చేరడం జరిగిందని, అప్పటి నుంచి నేటి వరకూ పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమం విజయవంతం చేయడం కోసం కృషి చేశామని ఆమె పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: బీజేపీ సమావేశాలు.. తెలంగాణ పోలీస్ అత్యుత్సాహం -
గులాబీకి గుడ్బై.. హస్తం గూటికి చేరే దిశగా అడుగులు!
సాక్షి, హైదరాబాద్: గ్రూపు రాజకీయాలతో విసిగిపోయిన గులాబీ నేతలు ఆ పార్టీకి షాక్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. హస్తం గూటికి చేరే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపిన నేతలు.. కారు దిగడానికి దాదాపుగా ముహూర్తం ఖరారు చేసుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం మారిన సమీకరణలతో కాంగ్రెస్కు గుడ్బై చెప్పి.. టీఆర్ఎస్ కండువా కప్పుకొన్న నేతలు తాజాగా సొంతగూటికి వెళ్లడానికి పావులు కదుపుతున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం గులాబీదళంలో చేరిన కార్పొరేటర్లు కూడా ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. తాజాగా బడంగ్పేట నగర పాలక సంస్థ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు టీఆర్ఎస్కు ఝలక్ ఇవ్వనున్నట్లు ఇప్పటికే సంకేతాలిచ్చారు. ఈ మేరకు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిని కలిసి సంప్రదింపులు కూడా జరిపారు. ఆరుగురు కార్పొరేటర్లతో కలిసి ఒకట్రెండు రోజుల్లో హస్తం గూటికి చేరేందుకు రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరేకాకుండా.. గతంలో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మరో నేత కూడా గులాబీకి గుడ్బై చెప్పనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరంతా హస్తినలో రాహుల్గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి గెలిచిన అనంతరం టీఆర్ఎస్లో చేరి మంత్రి పదవి చేజిక్కించుకున్న సబితా ఇంద్రారెడ్డితో పొసగని నేతలు పక్క చూపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోతుండటం అధికార పార్టీని ఇరకాటంలో పడేస్తోంది. ఎల్బీనగర్లోనూ... ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన కీలక నేత కూడా సొంతగూటి వైపు చూస్తున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొంది, ఆ తర్వాత అధికార పార్టీలో చేరారు. దీంతో అప్పటి నుంచి ఆయన అధికార టీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజా రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆయన పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. హస్తం గూటికొ ప్పుడు చేరనున్నారనే అంశంపై ఆయన స్పష్టత ఇవ్వడం లేదు. టీకేఆర్ను బుజ్జగించిన కేటీఆర్ గత ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన తీగల కృష్ణారెడ్డి రెడ్డి సైతం కారు దిగేందుకు దాదాపు సిద్ధమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కూడా ఇటీవల ఆయన నివాసానికి చేరుకుని పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన తన పుట్టిన రోజు సందర్భంగా సన్నిహితులు, వర్గీయులతో ప్రత్యేకంగా సమావేశమై ఇదే అంశంపై చర్చించారు. ఆయన కోడలు తీగల అనితా హరినాథ్రెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్గా కొనసాగుతున్నారు. ఇదే సమయంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీగల కృష్ణారెడ్డిని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడారు. రాజకీయ వారసత్వ విషయంలో ఆయనకు హామీ ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో ఆయన పార్టీని వీడే యోచన నుంచి వెనక్కి తగ్గినట్లు సమాచారం. మేయర్ సహా ఇద్దరు కార్పొరేటర్లపై వేటు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు సహా 23వ డివిజన్ కార్పొరేటర్ రాళ్లగూడెం శ్రీనివాసరెడ్డి, 20వ డివిజన్ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్రెడ్డిలను టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి శనివారం రాత్రి ప్రకటించారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించి, పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. (చదవండి: ‘మేం బ్యాంకుల్ని మాత్రమే.. మీరు దేశాన్నే దోచుకుంటున్నారు’) -
జోష్లో వంతెన ఓపెనింగ్.. పాపం బొక్కలు విరగ్గొట్టుకున్నారు
Mexican Footbridge Collapses: నేటీకి కొన్ని దేశాల్లో పురాతన కట్టడాలు, బ్రిడ్జీలు, భవనాలు చక్కుచెదరకుండా ఉన్నాయి. కానీ, నేటి ఇంజనీర్లు కట్టిన కట్టడాలు, బ్రిడ్జీలకు గ్యారెంటీ లేకుండా పోతోంది. తాజాగా ఓ బ్రిడ్జీ కట్టి.. ఓపెనింగ్ చేసిన కాసేపటికే కూలిపోయింది. దీంతో అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. క్యూర్నావాకా నగరం కట్టిన ఓ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం రోజునే కూలిపోయింది. ఫుట్ బ్రిడ్జ్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మేయర్ జోస్ లాయిస్ ఉరియో స్టెగుయ్కు ఊహించని షాక్ తగిలింది. వంతెన ప్రారంభం తర్వాత మేయర్ సహా సిటి కౌన్సిల్ సభ్యులు బ్రిడ్జీపై నడుచుకుంటూ వెళ్లారు. ఇంతో వంతెన ఒక్కసారిగా కూలిపోవడంతో వారందరూ కింద పడిపోయారు. Footbridge collapse during reopening ceremony in Mexico pic.twitter.com/Kn4X554Ydk — Adrian Slabbert (@adrian_slabbert) June 9, 2022 సుమారు 10 అడుగుల ఎత్తులో ఉండే ఆ ఫుట్ బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో బ్రిడ్జీ మీద ఉన్నవారంతా కింద నీటిలో ఉన్న రాళ్లపై పడిపోయారు. ఈ ఘటనలో మేయర్, 20 మంది సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఎనిమిది మందికి ఎముకలు విరిగిపోయాయినట్టు స్థానిక మీడియో తెలిపింది. వంతెన ప్రారంభం రోజునే ఇలా జరగడంతో ఇంజనీర్పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
లండన్లో తొలి దళిత మేయర్గా మొహిందర్ కె.మిధా
లండన్: భారత సంతతికి చెందిన నాయకురాలు, యూకేలో ప్రతిపక్ష లేబర్ పార్టీ కౌన్సిలర్ మొహిందర్ కె.మిధా పశ్చిమ లండన్లోని ఈలింగ్ కౌన్సిల్ మేయర్గా ఎన్నికయ్యారు. తద్వారా యూకేలో తొలి దళిత మహిళా మేయర్గా రికార్డుకెక్కారు. మొహిందర్ కె.మిధా ఎన్నిక పట్ల లేబర్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఇది తమకు గర్వకారణమనియూకేలోని ‘ఫెడరేషన్ ఆఫ్ అంబేడ్కరైట్, బుద్ధిస్ట్ ఆర్గనైజేషన్’ చైర్మన్ సంతోష్దాస్ చెప్పారు. మంగళవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో మిధాను 2022-23 తదుపరి ఏడాది కాలానికి ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలను బ్రిటిష్ దళిత సంఘాలు గర్వించదగ్గ ఘట్టంగా పేర్కొంటున్నాయి. -
క్లీన్ ఏలూరుకు ‘క్లాప్’
ఏలూరు టౌన్: పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలం. వ్యక్తిగత, ఇల్లు, చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఇళ్ల నాని ప్రత్యేక శ్రద్ధతో ఏలూరు నగరాన్ని క్లీన్గా ఉంచేందుకు జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లాప్ ప్రోగ్రామ్ను పక్కాగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి ఇంటికీ మూడు రంగుల చెత్త డబ్బాలు పంపిణీ చేయగా, చెత్త సేకరణకు ప్రత్యేకంగా వాహనాలనూ ఏర్పాటు చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ చెత్తసేకరణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చెత్తసేకరణ చేస్తూ యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. 60 వాహనాలు ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలోని 60 వేల గృహాల నుంచి చెత్తసేకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. నగరంలో సుమారు 79 సచివాలయాల పరిధిలో 60 చెత్త సేకరణ వాహనాలు ఏర్పాటు చేశారు. ఒక్కో చెత్త సేకరణ వాహనంలో డ్రైవర్, ఒక శానిటరీ సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకున్నారు. కార్పొరేషన్ పాలక మండలి నగరంలోని గృహాలకు 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి ప్రతి ఇంటికీ మూడు రంగుల డస్ట్బిన్స్ పంపిణీ చేసింది. ఒక బుట్టలో తడి చెత్త, మరో బుట్టలో పొడి చెత్త, ఇంకో బుట్టలో ప్రమాదకర వ్యర్థాలను వేరుచేసి చెత్త సేకరణ వాహనానికి అందించేలా ప్రణాళిక తయారు చేసి అమలు చేస్తున్నారు. యూజర్ చార్జీలు తప్పనిసరి స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న ఇంటింటా చెత్తసేకరణలో విధిగా యూజర్ చార్జీలు వసూలు చేయాల్సిందేనని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు పరిసరాల పరిశుభ్రతకు చెత్త సేకరణ చేస్తూనే ప్రజల నుంచి సేవా పన్ను వసూలు చేయాలని ఆదేశించింది. యూజర్ చార్జీలు వసూలు చేయని రాష్ట్రాలకు స్వచ్ఛ భారత్ నిధులను నిలిపివేస్తామని హెచ్చరించింది. దీంతో ఏలూరు నగరంలోనూ సేవా పన్ను వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పారదర్శక సేవలకు చార్జీలు ఏలూరు నగరంలో చెత్తసేకరణ సేవలకు చార్జీలు వసూలును అత్యంత పారదర్శకంగా వసూలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. స్లమ్ ఏరియాలో ఒక్కో ఇంటికి నెలకు రూ.60, సాధారణ ప్రాంతాల్లో రూ.100 వసూలు చేస్తుండగా, హాస్పిటల్స్, మాల్స్, పెద్దషాపులు, హోటల్స్, సినిమా థియేటర్లు, కమర్షియల్ ఇలా 3500 ప్రాంతాల్లో రోజువారీ చెత్త అధారంగా పన్ను వసూలు చేసేలా చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా ఈ నెల నుంచీ ఈపాస్ మిషన్ల ద్వారా చార్జీలు వసూలు చేసేలా చర్యలు తీసుకున్నారు. నగదు, క్రెడిట్, డెబిట్, ఇతర విధానాల్లో చార్జీలు వసూలు చేయటంతోపాటు తప్పనిసరిగా రశీదు అందజేస్తారు. నగర ప్రజలు సహకరించాలి నగర ప్రజలు సహకరిస్తే రాబోయే కాలంలో క్లీన్ ఏలూరుగా చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. నగరంలో సుమారు 60 వేల ఇళ్ల నుంచి నిత్యం చెత్తను సేకరించేందుకు సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతి రోజూ ఒక్కో వ్యక్తి ద్వారా అరకేజీ చెత్త తయారవుతుందని ప్రభుత్వ అంచనా. యూజర్ చార్జీలను పారదర్శకంగా సేకరించేందుకు ఈపాస్ విధానాన్ని అమలు చేస్తున్నాం. ప్రజలకు మెరుగైన సేవలు అందించటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. – షేక్ నూర్జహాన్, ఏలూరు నగర మేయర్ రోడ్లపై చెత్త, వ్యర్థాలు వేయకండి నగరాన్ని చెత్త రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. నగరంలోని ప్రజలు చెత్త సేకరణకు సిబ్బందికి సహకరించాలి. రోడ్లపైనా, డ్రెయినేజీల్లోనూ చెత్త, వ్యర్థాలు వేయవద్దు. చెత్త ఒక రోజు మర్చిపోయినా మరుసటి రోజు వరకు వ్యర్థాలను ఇంటివద్దనే ఉంచి చెత్త సేకరణ వాహనాలకు అందించాలి. ఇష్టారాజ్యంగా రోడ్లపై, డ్రెయినేజీల్లో వేయటంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. – డి.చంద్రశేఖర్, ఏలూరు నగర కమిషనర్ -
మేయర్ వర్సెస్ మాజీ మేయర్
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం మేయర్ సునీల్రావు అధ్యక్షతన జరిగిన నగరపాలక సంస్థ సాధారణ సర్వ సభ్య సమావేశం రసాభాసగా జరిగింది. అధికార పార్టీ కార్పొరేటర్లే మంచినీటి సరఫరాపై నిరసన తెలిపారు. మాజీ మేయర్ రవీందర్సింగ్, మేయర్ మధ్య నీటి మోటార్ల విషయంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. అలాగే పాలకవర్గ సభ్యులు ఆయా డివిజన్లలో సమస్యలను సభ దృష్టికి తీసుకురాగా.. అన్నింటినీ పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని మేయర్ పేర్కొన్నారు. సర్వసభ్య సమావేశంలో నగర అభివృద్ధికి సంబందించి రూపొందించిన 15 ఎజెండా అంశాలపై పాలకవర్గ సభ్యులు చర్చించి ఆమోదం తెలిపారు. బీజేపీ కార్పొరేటర్ జితేందర్ మాట్లాడుతూ, నల్లా ఆన్లైన్ సమస్యలు పరిష్కరించాలని, ఇంటినంబర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని కోరారు. కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ, మంచినీటి పైప్ లైన్ పనులు వేగంగా పూర్తి చేసి తాగునీరందించాలన్నారు. వేసవికాలంలో కావడంతో మంచినీటి సమస్యను కార్పొరేటర్లు సభా దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలు పరిష్కరిస్తాం: మేయర్ దేశంలోనే ప్రతిరోజూ నిరంతరంగా మంచినీటి సరఫరా చేస్తున్న ఏకైక నగరం కరీంనగర్ అని మేయర్ సునీల్రావు అన్నారు. కొద్దిరోజులుగా సరఫరాలో సాంకేతిక సమస్య తలెత్తిందని, సమస్య పరిష్కారానికి అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మిడ్మానేరు నుంచి లోయర్ మానేరు డ్యాంకు నీటి విడుదల చేయాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. మిడ్ మానేరు గేట్లకు చిన్న మరమ్మతు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో నీరు విడుదల చేయక నగరంలో సమస్య తలెత్తిందని వివరించారు. వేసవిలో ప్రజలకు మంచినీరు ప్రధానం కాబట్టి నీటిసరఫరాలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణిహరిశంకర్, కమిషనర్ సేవా ఇస్లావత్, డిప్యూటీ కమిషనర్ త్రియంభకేశ్వర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. – నగరంలో మంచినీటి సరఫరా విషయంలో ప్రస్తుతం ఉన్న మోటార్లు పని చేస్తున్నా.. అనవసరంగా కొత్తవి కొంటున్నారు. కమీషన్ల కోసమే ఇదంతా చేస్తున్నారు. – రవీందర్సింగ్, మాజీ మేయర్ మీ పాలనలో మంచినీటి సరఫరాకు నాసిరకం మోటార్లు కొనుగోలు చేశారు. అవి పనిచేయకపోవడంతో ఇప్పుడు కొత్త మోటార్లు కొంటున్నాం. – సునీల్రావు, మేయర్ -
కోల్డ్ బ్లడెడ్ కిల్లర్: అతని టార్గెట్ ఒంటరి పురుషులే
Targeting sleeping homeless men: యూఎస్లో తుపాకీలతో దాడుల జరిపే కొంతమంది నేరస్తుల గురించి విన్నాం. జాతి వివక్షతతో దాడులు చేసేవాళ్లు కొందరైతే. మరికొందరూ మా దేశంలోకి ఎందుకు వచ్చారంటూ స్థానిక రౌడిలు కాల్పులు జరపడం చూశాం. కానీ ఇక్కడొక వ్యక్తి ఒంటరిగా ఉన్న పురుషుల పైనే దాడి చేస్తాడంటా. పైగా వారిని హతమార్చేంత వరకు వదలడట. వివరాల్లోకెళ్తే...న్యూయార్క్ వాషింగ్టన్ డీసీలలో వరుస హత్యలు జరిగాయి. ఈ జంట నగరాల్లో నిరాశ్రయులై ఒంటరిగా ఉన్న పురుషుల పైనే నిందితుడు దాడి చేశాడు. అతను ఇప్పటి వరకు ఐదుగురుని మట్టుబెట్టడు. పైగా గత రెండు రోజుల్లో చేసిన దాడిలో ఇద్దరూ మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే అతను ఒంటరిగా ఉన్న పురుషులనే టార్గెట్ చేస్తున్నాడని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్, డీసీ వాషింగ్టన్ మేయర్ మురియెల్ బౌసర్లు అనుమానం వ్యక్తం చేశారు. వారు ఆ నేరస్తుడిని కోల్డ్ బ్లడెడ్ కిల్లర్గా వ్యవహరించారు. అలాగే అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఈ మేరకు మేయర్లు జంట నగరాల్లో నిరాశ్రయులై ఒంటరిగా ఉండే పురుషుల కోసం ఒక హెచ్చరిక జారీ చేశారు. మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ కేసును విచారిస్తుంది. అంతేకాదు దర్యాప్తులో.. అతను నిరాశ్రయుల పైన దాడులు జరుపుతున్నాడని, తాజాగా మాన్హట్టన్లోని ట్రిబెకా ప్రాంతంలో 43 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తిని హతమార్చడాని వెల్లడించారు. పోలీసుల నిందుతుడి ఫోటోను కూడా విడుదల చేశారు. పైగా నిందితుడి ఆచూకి తెలిపిన వారికి రూ. 19 లక్షల రివార్డు ఇస్తామని కూడా ప్రకటించారు. Tonight, Washington, DC Mayor Muriel Bowser and @NYCMayor spoke about ongoing investigations by the @DCPoliceDept and the @NYPDnews. Following their conversation, Mayor Bowser and Mayor Adams released the following joint statement: https://t.co/MpcefoOowL pic.twitter.com/dbWmLxg1Tb — Mayor Muriel Bowser (@MayorBowser) March 14, 2022 (చదవండి: ఆయువు తీసిన ఆన్లైన్ గేమ్స్!) -
రష్యా బలగాల అరాచకం.. ఉక్రెయిన్ మేయర్ని కిడ్నాప్ చేసి..
Ukrainian officials said Melitopol Mayor Kidnapped: ఉక్రెయిన్ రష్యా మధ్య సాగుతున్న పోరు నేటికి 17వ రోజుకి చేరుకుంది. రష్యా బలగాల దాడిలో ఉక్రెయిన్ అల్లకల్లోలంగా మారిపోయింది. ఇప్పుడప్పుడే కోలుకోలేనంత దారుణంగా దెబ్బతింది. ఒకపక్క వైమానిక క్షిపణి దాడులతో విరుచుకుపడుతున్న రష్యా ఉక్రెయిన్లోని నగరాలను స్వాధీనం చేసుకుంటూ పోతుంది. ఇందులో భాగంగానే రష్యా బలగాలు దక్షిణ ఉక్రెయిన్లోని మెట్రోపోల్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడమే కాక ఆ నగర మేయర్ని కూడా కిడ్నాప్ చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెల్లడించారు. అంతేకాదు సుమారు 10 మంది ఆక్రమణదారుల బృందం మెట్రోపోల్ మేయర్ ఇవాన్ ఫెడోరోవ్ను కిడ్నాప్ చేసిందని ఉక్రెయిన్ పార్లమెంట్ ట్విట్టర్లో పేర్కొంది. అయితే, అతను రష్యా బలగాలకు సహకరించడానికి నిరాకరించినందుకే కిడ్నాప్ చేసినట్లు జెలెన్ స్కీ ఒక వీడియో సందేశంలో ఈ విషయాన్ని ధృవీకరించారు. అంతేకాదు ఆ వీడియోలో మేయర్ను తన సభ్యుల కోసం ప్రాణాలను ఫణంగా పట్టి పోరాడిన గొప్ప ధైర్యశాలిగా పేర్కొన్నారు. నిజానికి ఇది ఆక్రమణదారుల బలహీనతకు సంకేతం, వారు చట్టబద్దమైన స్థానిక ఉక్రెయిన్ అధికారుల ప్రతినిధులను బలవంతంగా తొలగించి ఉగ్రవాద చర్యలకు బీజం వేస్తున్నారు అని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆక్రోశించారు. ఇతి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన చర్యగా పేర్కొన్నారు. ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టుల మాదిరిగినే రష్యన్ బలగాల దురాక్రమణ చర్యలు ఉన్నాయన్నారు. అంతేకాదు రష్యా దురాక్రమణదారులు మెట్రోపోల్ నగర ఆక్రమణకు ముందు ఈ నగరంలో సుమారు లక్షమంది నివాసితులు ఉన్నారు. (చదవండి: రష్యా ఘాతుకం ప్రపంచానికి తెలియాలి.. పుతిన్ పక్కా ప్లాన్తో ఉన్నాడు’) -
మేయరైన ఆటోవాలా
చెన్నై: తమిళనాడులోని కుంభకోణం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా కే. శరవణన్ ఎన్నికయ్యారు. వృత్తిరీత్యా ఆయన ఆటో డ్రైవర్. మేయర్గా ఎన్నికవడం తనకు సంతోషమేనని, అయితే ప్రజలకు సేవ చేస్తూ ఆటో నడపడంలో మరింత ఆనందం ఉందని ఆయన చెప్పారు. మేయర్గా పదవీ స్వీకారం చేసిన తర్వాత నగరంలో డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయడంపై దృష్టి పెడతానని ఆయన చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన 17వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి. ఈ ఎన్నికల్లో డీఎంకేతో కలిసి కాంగ్రెస్ పోటీ చేసింది. (చదవండి: ఆ ఊరిలో మగవాళ్లకు ఇల్లే లేదు! ప్రతి ఇల్లు మహిళలదే) -
నాడు కట్టెలు కొట్టిన మహిళ.. నేడు మేయర్
-
తమిళ రాజకీయాల్లో నవ శకం.. డీఎంకే నయా పంథా
తమిళనాట రాజకీయాల్లో నవ శకం ప్రారంభమైంది. తాజాగా జరిగిన నగర పాలక సంస్థల ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీ ‘యువ’ మంత్రం జపించింది. అంతేకాదు అతివలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి తమిళ రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఫస్ట్ టైమర్స్, యువత, చదువుకున్న వారిని ప్రోత్సహించడంతో డీఎంకేపార్టీ నూతనోత్సాహంతో తొనికిసలాడుతోంది. విద్యావంతులకు పెద్దపీట డీఎంకే తరపున మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికైన వారిలో 30 మంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. వీరిలో ఒక డాక్టర్ కూడా ఉండటం విశేషం. కాంచీపురం మేయర్గా ఎన్నికైన మహలక్ష్మి యువరాజ్.. ఇన్ఫోసిస్లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాన్ని వదులుకుని ఎన్నికల్లో పోటీ చేశారు. ఆస్ట్రేలియాలో ఎంబీఏ చదివిన ఎన్. దినేశ్.. తిరుప్పూర్ మేయర్గా ఎన్నికయ్యారు. అలాగే చెన్నై మేయర్గా ఎన్నికై రికార్డు సృష్టించిన ప్రియా రాజన్ కూడా ఎంకామ్ చేశారు. తంజావూర్ డిప్యూటీ మేయర్ అంజుగమ్ భూపతి.. ఎంబీబీఎస్, ఎండీ చదివారు. ఆశ్చర్యకర ఎంపిక కోయంబత్తూర్ మేయర్గా కల్పనా ఆనందకుమార్, చెన్నై మేయర్గా ప్రియా రాజన్ను ఎంపిక అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణ కుటుంబానికి చెందిన 40 ఏళ్ల కల్పన.. కోయంబత్తూర్కు తొలి మహిళా మేయర్ అయ్యారు. ఆమె స్థానిక డైమండ్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా, కల్పన భర్త ఆనందకుమార్.. ఈ-సేవ కేంద్రం నిర్వహిస్తూ, మానియాకరంపాళయం ప్రాంత డీఎంకే కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు. కల్పన అభ్యర్థిత్వాన్ని ప్రకటించే సమయానికి.. చెన్నైలో ముఖ్యమంత్రి స్టాలిన్ను కలిసేందుకు భర్తతో పాటు ఆమె ప్రభుత్వ బస్సులో ప్రయాణిస్తున్నారని పార్టీ వర్గాలు గుర్తు చేసుకున్నాయి. ప్రియా రాజన్ రికార్డు 51 ఏళ్ల తర్వాత మళ్లీ చెన్నై మేయర్ పీఠాన్ని మహిళ అధిష్టించారు. అంతేకాదు అతిచిన్న వయసులో చెన్నై మేయర్గా ఎన్నికైన ఘనత కూడా ప్రియా రాజన్(28)కు దక్కింది. చెన్నై నగర చరిత్రలో తొలిసారిగా ఎస్సీ సామాజిక వర్గానికి మేయర్ కుర్చీ సొంతమైంది. తారా చెరియన్(1958), కామాక్షి జయరామన్(1971) తర్వాత చెన్నైకి మూడవ మహిళా మేయర్గా ప్రియా రాజన్ నిలిచారు. డీఎంకే నుంచి మేయర్లుగా ఎన్నికైన 20 మందిలో 11 మంది మహిళలు ఉండటం విశేషం. డీఎంకే మిత్ర ధర్మం నగర పాలక సంస్థల ఎన్నికల్లో డీఎంకే విజయఢంకా మోగించి 21 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే మిత్రధర్మాన్ని పాటించి కాంగ్రెస్కు ఒక స్థానాన్ని కట్టబెట్టింది. కుంభకోణం నగర మేయర్ సీటును కాంగ్రెస్ పార్టీకి వదిలిపెట్టింది. అంతేకాదు ఆరు డిప్యూటీ మేయర్ స్థానాలను మిత్రపక్షాలకు ఇచ్చింది. దీంతో కమ్యూనిస్ట్, ఎండీఎంకే, వీసీకే తదితర పార్టీలకు కూడా పదవులు దక్కాయి. 15 డిప్యూటీ మేయర్ స్థానాలకు డీఎంకే పరిమితమైంది. (క్లిక్: మేయర్లు, డిప్యూటీ మేయర్ల జాబితా) స్థాలిన్ ముందుచూపు యువతకు పెద్దపీట వేయడం ద్వారా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ముందుచూపు ప్రదర్శించారు. 20 ఏళ్ల పాటు పార్టీకి సేవలు అందించేలా యువ నాయకులను తయారు చేయాలని ఆయన భావిస్తున్నారు. పార్టీలో ఏళ్లకు తరబడి పాతుకుపోయిన నాయకులతో పోలిస్తే కొత్త తరంపై వ్యతిరేకత తక్కువ ఉంటుంది. యువతకు అవకాశం కల్పిస్తే రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారన్న ఉద్దేశంతో స్టాలిన్.. నగర పాలక సంస్థల్లో వారికి పెద్దపీట వేసి అనుకున్న ఫలితాలు సాధించారు. (చదవండి: చెన్నై మేయర్గా ప్రియా రాజన్) - సాక్షి, వెబ్ స్పెషల్ -
చెన్నై మేయర్గా ప్రియా రాజన్
చెన్నై (తమిళనాడు): గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ మేయర్గా ప్రియా రాజన్ శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కమిషనర్ గగన్దీప్ సింగ్ బేడి అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. మేయర్ పదవికి ప్రియా రాజన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేసినట్టు వెల్లడించారు. తాజా ఎన్నికల్లో తిరు వి కా నగర్లోని 74వ వార్డు నుంచి డీఎంకే పార్టీ తరపున ఆమె గెలుపొందారు. కార్పొరేషన్కు ఎన్నికైన యువ కార్పొరేటర్లలో ఆమె ఒకరు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ చెన్నై మేయర్ పదవిని చేపట్టడం ఇదే మొదటిసారి. అతిచిన్న వయసులో చెన్నై మేయర్ పదవిని చేపట్టిన మహిళగా ఆమె ఖ్యాతికెక్కారు. ప్రియా రాజన్.. పెరంబూర్ మాజీ ఎమ్మెల్యే చెంగై శివమ్ మనవరాలు. చెన్నై మహానగరంలో రహదారులు, పారిశుద్ధ్యం మెరుగుపడేందుకు ప్రాధ్యాన్యత ఇస్తానని ప్రియా రాజన్ తెలిపారు. స్త్రీల సమస్యల పరిష్కారానికి, మహిళా సాధికారతకు పాటు పడతానని ప్రకటించారు. కాగా, డిప్యూటీ మేయర్గా ఎం. మహేశ్కుమార్ ఎన్నికయ్యారు. మిత్రధర్మం పాటించిన డీఎంకే తాజాగా జరిగిన నగర పాలక సంస్థల ఎన్నికల్లో 21 కార్పొరేషన్లను డీఎంకే పార్టీ కైవసం చేసుకుంది. అయితే మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీకి కుంభకోణం నగర మేయర్ పదవిని అప్పగించింది. సేలం, కాంచీపురం డిప్యూటీ మేయర్ల పదవులను కూడా కాంగ్రెస్కు కేటాయించింది. (క్లిక్: మేయర్లు, డిప్యూటీ మేయర్ల జాబితా) -
చక్రం తిప్పిన బీజేపీ.. రెండో స్థానంలో నిలిచినా చండీగఢ్ మేయర్ పీఠం కైవసం
చండీగఢ్: చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సీటును అనూహ్యంగా బీజేపీ కైవసం చేసుకుంది. 35 వార్డులున్న చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారిగా బరిలో దిగినా అత్యధికంగా 14 చోట్ల పార్టీ అభ్యర్థులు గెలిచారు. బీజేపీ 12 చోట్ల గెలిచింది. కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించగా, శిరోమణి అకాలీదళ్ కేవలం ఒకే ఒక్క చోట గెలిచిన విషయం తెల్సిందే. చదవండి: సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. నలుగురు న్యాయమూర్తులకు పాజిటీవ్ కాగా, మేయర్ స్థానం కోసం శనివారం జరిగిన ఓటింగ్ రసవత్తరంగా సాగింది. ఓటింగ్ సమయంలో ఒక శిరోమణి అకాలీదళ్ కౌన్సిలర్, ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. దీంతో 35 సీట్లున్న నగర కార్పొరేషన్లో మేయర్ స్థానానికి జరిగిన ఓటింగ్లో సాధారణ మెజారిటీ 14కు పడిపోయింది. చండీగఢ్ ఎంపీ.. మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్స్–అఫీషియో సభ్యుడి హోదాలో ఓటింగ్లో పాల్గొని బీజేపీకి మద్దతిచ్చారు. ఫలితాలు రాగానే ఒక కాంగ్రెస్ సభ్యుడు బీజేపీ కండువా కప్పుకున్నారు. దీంతో ఆప్, బీజేపీ చెరో 14 మంది సభ్యులతో సమంగా నిల్చాయి. అయితే, శనివారం మేయర్ ఎన్నికలో ఒక ఆప్ సభ్యుని ఓటు చెల్లదని తేల్చడంతో మేయర్ పీఠం బీజేపీ వశమైంది. మహిళా కౌన్సిలర్ సరబ్జిత్ కౌర్ ధిల్లాన్ మేయర్గా గెలిచారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేసిందని ఆప్ వ్యాఖ్యానించింది. కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ కౌన్సిలర్లు కావాలనే గైర్హాజరై బీజేపీకి పరోక్ష మద్దతిచ్చారని ఆప్ ఆరోపించింది. -
ఘనంగా గంగమ్మ జాతర
-
కంప్యూటర్ ఆపరేటర్కు లైంగిక వేధింపులు
సాక్షి, హైదరాబాద్: మహిళా కంప్యూటర్ ఆపరేటర్ను వేధిస్తున్న స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎం. శ్రీనివాస్ను వెంటనే సస్పెండ్ చేయడంతోపాటు మాతృశాఖకు పంపించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సంబంధిత ఆరోగ్యవిభాగం అడిషనల్ కమిషనర్ బాదావత్ సంతోష్ను ఆదేశించారు. బాధితురాలు మేయర్కు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. చార్మినార్ జోన్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని ఆరోగ్య విభాగంలో స్టాటిస్టికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న శ్రీనివాస్ కొంత కాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు చీఫ్ మెడికల్ ఆఫీసర్కు, కొందరు యూనియన్ నేతలకు గత వారమే తన బాధలు తెలియజేశారు. తాజాగా సోమవారం నేరుగా మేయర్ విజయలక్ష్మిని కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. దాంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మేయర్ విజయలక్ష్మి అతన్ని వెంటనే సస్పెండ్ చేయడంతో పాటు మాతృశాఖకు సరెండర్ చేయాల్సిందిగా అడిషనల్ కమిషనర్ను ఆదేశించారు. విషయం తెలిసినప్పటికీ, తగిన విధంగా స్పందించని చీఫ్ మెడికల్ ఆఫీసర్పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన శ్రీనివాస్ గత ఫిబ్రవరిలో పదోన్నతిపై బల్దియాకు వచ్చారు. గ్రేటర్లోని 30 సర్కిళ్లకు గాను 15 సర్కిళ్లకు స్టాటిస్టికల్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. తరచూ చార్మినార్ జోన్కు వెళ్లేవాడని సమాచారం. తన విషయం బహిర్గతమవుతుందని తెలిసి సోమవారం అయ్యప్పమాల ధరించినట్లు జీహెచ్ఎంసీలో ప్రచారం జరుగుతోంది. -
ఎంకి పెళ్లి సుబ్చి చావుకొచ్చిందన్నట్టు.. జీహెచ్ఎంసీ పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: ఎంకి పెళ్లి సుబ్చి చావుకొచ్చిందన్నట్టు.. జీహెచ్ఎంసీలోని స్థానిక ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు పెరగడం వల్ల వారికి సంతోషం కలిగినప్పటికీ, అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న జీహెచ్ఎంసీకి కొంత భారం పెరగనుంది. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం మేయర్, డిప్యూటీ మేయర్ కాక, 148 మంది కార్పొరేటర్లు ఉన్నారు. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఇంకా జరగకపోవడంతో వారు లేరు. ప్రస్తుతం ఉన్నవారిని పరిగణనలోకి తీసుకుంటే మేయర్ గౌరవ వేతనం ఇప్పుడున్న రూ. 50 వేల నుంచి రూ. 65 వేలకు పెరిగింది. డిప్యూట్ మేయర్కు రూ.25 వేల నుంచి రూ.32,500, కార్పొరేటర్లకు రూ.6 వేల నుంచి రూ.7,800 లకు పెరిగింది.పెంపును పరిగణనలోకి తీసుకుంటే కింది విధంగా బల్దియాపై అదనపు భారం పడుతుంది. ఈ పెంపుతో మొత్తం బల్దియా ఖజానాపై ఏడాదికి రూ.34,66,800 భారం పెరిగింది. చదవండి: నచ్చిన సబ్జెక్టు.. మెచ్చిన చోట -
మేయర్ ఎన్నికకు హాజరుకాని టీడీపీ కార్పొరేటర్లు
-
కాకినాడ మేయర్గా సుంకర శివప్రసన్న ఏకగ్రీవ ఎన్నిక
-
కాకినాడ మేయర్గా శివప్రసన్న
కాకినాడ(తూర్పుగోదావరి): తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ నూతన మేయర్గా సుంకర శివప్రసన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్పొరేషన్ ప్రత్యేక సమావేశంలో ఆమె ఎన్నిక జరిగింది. ఆమెపై పోటీ చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రిసైడింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ ప్రకటించారు. డిప్యూటీ మేయర్–1గా 24వ డివిజన్ కార్పొరేటర్ మీసాల ఉదయ్కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎక్స్అఫీషియో సభ్యులు, మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీకి చెందిన డిప్యూటీ మేయర్–2 చోడిపల్లి ప్రసాద్తో పాటు 17 మంది కార్పొరేటర్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకు ఆకర్షితులై స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైఎస్సార్సీపీ కండువాలు వేసుకుని పార్టీకి మద్దతు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ కాకినాడ నగర మాజీ అధ్యక్షుడు నున్న దొరబాబు సోమవారం మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. సామాజిక సమతుల్యం కాకినాడ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా సామాజిక సమతుల్యం పాటించారు. ఎన్నికల సందర్భంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు పదవుల ఎంపికలో సామాజిక సమతుల్యం పాటిస్తానని సీఎం ఇచ్చిన హామీని ఇక్కడ నెరవేర్చారు. మేయర్గా కాపు సామాజికవర్గానికి చెందిన సుంకర శివప్రసన్నకు అవకాశం దక్కగా, డిప్యూటీ మేయర్–1 ఎస్సీ రెల్లి సామాజికవర్గానికి చెందిన మీసాల ఉదయ్కుమార్ను ఎంపిక చేశారు. కొద్దిరోజుల కిందట జరిగిన ఎన్నికలో డిప్యూటీ మేయర్–2గా బీసీ మత్స్యకార వాడబలిజకు చెందిన చోడిపల్లి ప్రసాద్కు అవకాశమిచ్చారు. సీఎం జగన్ సామాజిక న్యాయం: మంత్రి కన్నబాబు సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయం పాటిస్తూ బలహీనవర్గాలకు రాజకీయ పదవులు ఇస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడ కౌన్సిల్ రెండు డిప్యూటీ మేయర్ పదవులను మత్స్యకార, రెల్లి సామాజిక వర్గాలకు ఇచ్చారన్నారు. మాటలతో కాకుండా చేతలతో చేసి చూపించే సీఎం.. వైఎస్ జగన్ అని కన్నబాబు అన్నారు. ఇది కార్పొరేటర్ల విజయం: ఎమ్మెల్యే ద్వారంపూడి మేయర్ల ఎన్నిక కార్పొరేటర్ల విజయం అని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి అన్నారు. సీఎం జగన్ భావాలకు అనుగుణంగా మేయర్గా ఒక మహిళను, రెండు డిప్యూటీ మేయర్ పదవులకు ఒక బీసీ( మత్స్యకార), ఎస్సీ(రెల్లి) కార్పొరేటర్లను ఎన్నుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు. చదవండి: AP: ఐదు కోట్ల డోసులు.. కోవిడ్ టీకాల్లో మరో మైలురాయి డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్కుమార్ -
ఒకే వ్యక్తి ఏకంగా తన ఇంటినే క్యాసెట్ల స్టోర్గా మార్చేశాడు
బ్రిటన్: ఇప్పుడు కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు వచ్చాక మనం పాతరోజుల్లో మన జ్ఞాపకాలను చాలా మరిచిపోయాం అని చెప్పాలో లేక వదిలేశామని అనాలో తెలియదు. కానీ అప్పట్లో ఏదైనా ఒక సినిమా చూడాలన్న, పాటలు వినాలన్నా క్యాసెట్ల షాపు మీదే ఆధారపడే వాళ్లం. వీసీఆర్ కూడా అందరి దగ్గర ఉండేది కాదు. పైగా వాటిన అద్దెకు తెచ్చకుని మరి చూసే వాళ్లం .ఆ ఆనందమే వేరు ఎందుకంటే. (చదవండి: అదో వింతైన రంగురంగుల బల్లి.. ప్లీజ్ కాపాడండి ఒకళ్ల ఇంట్లో వీసీఆర్ ఉంటే అందులో సినిమాలు చూసేందుకు చుట్టుపక్కల వాళ్లు కూడా వచ్చి అందరూ కలసి మాట్లాడుకుంటూ వీక్షించేవారు. ఇప్పుడు ఆ పరిస్థతి లేదు. మన పాత జ్ఞాపకాలను మరిచిపోకుండా 80ల నాటి క్యాసెట్ల నుంచి ఇప్పటి వరకు అన్ని క్యాసెట్లను సేకరించారు యూకేకి చెందిన మేయర్. తన సోంత ఇంటినే క్యాసెట్ల స్టోర్గా మార్చేశారు. చివరిసారిగా 2006లో వీహెచ్ఎస్(వీడియో హోం సిస్టమ్) క్యాసెట్లో విడుదలైన చివరి చిత్రం "హిస్టర్ ఆప్ వైలెన్స్" . ఆ తర్వాత దాదాపు ఆ వీహెచ్ఎస్ / వీసీఆర్ వీడియో క్యాసెట్ల శకం ముగిసిపోయిందనే చెప్పాలి. కానీ మేయర్ క్యాసెట్ల శకం కనుమరుగైనందకు తనకు ఏమాత్రం బాధగా లేదని ఎందుకంటే లివర్పూల్లోని ఫెయిర్ఫీల్డ్లోని ఒక పాత స్టోర్ బ్లాక్బాస్టర్ అనేక వీడియో క్యాసెట్లనూ దాదాపు 10 వేలు సేకరించానని చెప్పాడు. ఈ మేరకు అతను ఉద్యోగం చేసుకుంటూనే దేశమంతా తిరిగి చాలా క్యాసెట్లను సేకరిస్తానని అంటున్నాడు. అంతేకాదు నిజం చెప్పాలంటే పాతరోజుల నుండి తన ఇల్లు వీడియో క్యాసెట్లతో నిండిపోయిన పెద్ద స్టోర్లా ఉండేదని ప్రస్తుతం దాన్ని ఒక మ్యూజియం మార్చి అన్ని రకాల క్యాసెట్లు లభించే ప్రధాన స్టోర్గా మార్చేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు. (చదవండి: ప్రపంచంలోనే తొలి చైల్డ్ ఆర్టిస్ట్) -
గర్భిణీకి తీవ్ర రక్తస్రావం.. ప్రాణం పోసిన మేయర్
సాక్షి,రామగుండం(కరీంనగర్): ప్రజాపాలనలో నిత్యం బిజీగా ఉంటున్న రామగుండం నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ బంగి అనిల్కుమార్ సకాలంలో స్పందించి గర్భిణీకి మంగళవారం ఆపరేషన్ నిర్వహించి ప్రాణం పోశారు. మంథని మండలం గుంజపడుగు ప్రాంతానికి చెందిన దుస్స రమ్యకృష్ణ అనే గర్భిణికి పురుటి నొప్పులు ఎక్కువకావడంతో మంగళవారం గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి రెండోకాన్పుకోసం తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు ప్రసవంకోసం ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. శస్త్ర చికిత్స చేస్తున్న సమయంలో రమ్యకృష్ణకు తీవ్ర రక్తస్రావం అయింది. వైద్యం అందిస్తున్నప్పటికీ రక్తస్రావం అదుపులోకి రాలేదు. కంట్రోల్ కాలేదు. వెంటనే విషయాన్ని సీనియర్ జనరల్ సర్జన్ అయిన నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్కుమార్కు తెలిపారు. సకాలంలో స్పందించిన మేయర్ హుటాహుటిన ఆపరేషన్ థియేటర్కు చేరుకుని, సదరు గర్భిణికి శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ సక్సెస్కావడంతో పండంటి బాబుకు రమ్మకృష్ణ జన్మనిచ్చింది. తల్లి, శిశువు ఆరోగ్యంగా ఉండడంతో ఆమె భర్త అశోక్కుమార్, కుటుంబసభ్యులు, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు. సకాలంలో స్పందించి శస్త్రచికిత్స అందించిన నగర మేయర్ను ఆస్పత్రి వైద్యులతోపాటు రమ్యకృష్ణ కుటుంబసభ్యులు అభినందించారు. డాక్టర్లు శౌరయ్య, శ్రవంతి, కళావతితోపాటు ఆపరేషన్ థియేటర్ సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: మూసీ ప్రవాహంలో మృతదేహం కలకలం -
చెత్త దిబ్బల వద్ద షూటింగ్.. అయితే పైసలు కట్టాల్సిందే!
న్యూఢిల్లీ: సాధారణంగా చెత్త అంటే వ్యర్థపదార్థంగానూ, లేక పెద్దగా ఉపయోగపడని వస్తువుగా పరిగణిస్తారు. అయితే ఓ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రం వ్యర్థాలు ద్వారా కూడా పైసలు వసూలు చేయడానికి సిద్ధమయ్యారు. వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీలో పేరుకుపోతున్న చెత్త దిబ్బల వద్ద వీడియోలు, షూటింగ్ తీసే వారి నుంచి ఛార్జీలు వసూలు చేయాలని తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం.. వీరి పరిధిలో ఎక్కడైనా చెత్త దిబ్బల వద్ద వెబ్ సిరీస్, ఇతర షూటింగ్ల చేయాలనుకునే వారు ప్రతిరోజూ రూ.75,000 చెల్లించాలని మేయర్ శ్యామ్ సుందర్ అగర్వాల్ తెలిపారు. దీంతో పాటు ల్యాండ్ఫిల్ సైట్ సమీపంలో షూటింగ్ కోసం రూ. 2 లక్షలు చెల్లించాలని తెలిపారు. అంతే కాకుండా ముందుగా సెక్యూరిటీ డిపాజిట్గా రూ.25,000 చెల్లించాలని, వాటిని 2 వారాల్లో తిరిగి ఇస్తామన్నారు. అయితే, ఈ ఛార్జీలపై ఓ వెసులుబాటును కూడా కల్పించారు. ఎవరైనా పేరుకుపోతున్న చెత్త, వాటి తొలగింపు సమస్యపై డాక్యుమెంటరీ తీసినా లేదా సామాజిక సందేశాన్ని అందించేందుకు షూటింగ్ చేసేవారి నుంచి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయబోమని తెలిపారు. కాకపోతే అందుకోసం తమకు ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు. చదవండి: కిల్లర్ చైర్.. దీని కథ వింటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే.. -
కాకినాడ మేయర్ పై అవిశ్వాస తీర్మానం
-
‘కార్లలో తిరిగితే బాగానే కనిపిస్తుంది.. మోటార్ సైకిళ్లపై తిరగండి’
సాక్షి, హైదరాబాద్: ‘కార్లలో తిరిగితే బాగానే కనిపిస్తుంది. కార్లలో మెయిన్ రోడ్లమీదే తిరుగుతాం. గల్లీల్లో, బస్తీల్లో ప్రజల బాధలు తెలియాలంటే మోటార్సైకిళ్లపై వెళ్లండి. క్షేత్రస్థాయిలో వర్షాల వల్ల ఎన్ని ప్రాంతాలు దెబ్బతిన్నాయి.. ఎక్కడ ఎన్ని గుంతలు పడ్డాయి.. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అన్నది క్లియర్గా తెలుస్తుంది’ అని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులకు సూచించారు. తగిన చర్యలు తీసుకోవాలి: మేయర్ నగరంలో వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లు, తాగునీటి ఇబ్బందులు, తదితర సమస్యలు తెలుసుకునేందుకు జోనల్ అధికారులు, డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీర్లు క్షేతస్థ్రాయిలో మోటార్ సైకిళ్లపై పర్యటించాలని ఆమె ఆదేశించారు. రోడ్లపై గుంతలు తదితరమైన వాటికి తక్షణం మరమ్మతులు చేపట్టాలని, లోతట్టు ప్రాంతాల్లో నిల్వనీటిని తొలగించడంతోపాటు సదరు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా తక్షణచర్యలు చేపట్టాలన్నారు. వరద ప్రభావ ప్రాంతాల్లో అందుతున్న సహాయ చర్యలను పరిశీలించేందుకు బుధవారం మేయర్ అంబర్పేట, నారాయణగూడ, హిమాయత్నగర్, బషీర్బాగ్ తదితర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఆదేశాలు జారీచేశారు. పేరుకుపోయిన చెత్తకుప్పలను వెంటనే తొలగించాలని వైద్యాధికారులను ఆదేశించారు. విరిగిన చెట్లను, వీధిదీపాలకు ఆటంకంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలన్నారు. అనంతరం తన చాంబర్లో జోనల్ కమిషనర్లతో వర్షబాధితులకు పునరావాస కార్యక్రమాలతోపాటు వినాయకచివితి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. మండపాల వద్ద చెత్తకుండీలు వినాయక మండపాల వద్ద పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కమిటీ సభ్యులకు తగిన సహకారం అందజేయాలని, ప్రతి మండపం వద్ద ఒక చెత్తకుండీ ఏర్పాటు చేయాలని సూచించారు. మరో రెండు రోజులు వర్షాలు తీవ్రంగా కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. సమీక్ష సమావేశంలో అడిషనల్ కమిషనర్ (శానిటేషన్) బి.సంతోష్, జోనల్ కమిషనర్లు రవికిరణ్, అశోక్ సామ్రాట్, ఉపేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మమత, చీఫ్ ఇంజనీర్ శ్రీధర్, డిప్యూటి కమిషనర్లు పాల్గొన్నారు. చదవండి: మొదట తక్కువ ధరకు అమ్ముతారు.. బానిసగా మారిన తర్వాత.. -
అక్కయపాలెం సచివాలయాన్ని పరిశీలించిన విశాఖ నగర మేయర్
-
Zarifa Ghafari: నా చావుకై ఎదురు చూస్తున్నాను
అఫ్ఘాస్తాన్లో ఒక మహిళా మేయర్ ‘నేను వారి రాకకై ఎదురు చూస్తున్నాను. నా చావుకై ఎదురు చూస్తున్నాను’ అంది. ఆ దేశ విద్యాశాఖామంత్రి అయిన మహిళ ‘నేను ఏ తప్పూ చేయలేదు. నా భవిష్యత్తు తెలియదు’ అంటోంది. వారిద్దరే కాదు అఫ్ఘానిస్తాన్లో లక్షలాది స్త్రీలు, బాలికలు తమ భవిష్యత్తు మీద బెంగతో కన్నీరుమున్నీరవుతున్నారు. తాలిబన్ పాలనలో గతంలో వారు చాలా నిర్బంధం అనుభవించారు. ఈసారి కూడా అదే జరిగితే ఏదో సాధించాలనే తమ కలలు మరణించక తప్పవని అంటున్నారు. గత ఇరవై ఏళ్లలో అఫ్ఘానిస్తాన్లో స్త్రీలు తమ హక్కుల కోసం పోరాడారు. విద్యా హక్కు కోసం, ఉపాధి హక్కు కోసం మతం లోపల, ప్రభుత్వంతో పోరాడారు. అక్కడ పార్లమెంట్లో కూచోగలిగారు. ఇంకా చెప్పాలంటే రాష్ట్రపతి పదవికి కూడా ఒక మహిళ పోటీ చేసి ఓడిపోయింది. చైనాలో అఫ్ఘాన్ ప్రభుత్వం తాలిబన్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించినప్పుడు తాలిబన్లతో తమ వాదన వినిపించేందుకు ముగ్గురు ఆఫ్ఘాన్ మహిళా హక్కుల కార్యకర్తలు హాజరయ్యి వార్తలు సృష్టించారు. స్త్రీలకు సమాన అవకాశాలు లభించే పరిస్థితులు ఏర్పడుతున్న సందర్భంలో హటాత్తుగా అఫ్ఘానిస్తాన్ పరిణామాలు మారిపోయాయి. ఆ దేశం తాలిబన్ల వశం అయ్యింది. చరిత్ర పునరావృత్తం అవుతుందేమోనని భయవిహ్వలత అక్కడి స్త్రీలలో వ్యాపించింది. బట్టలు కొనుక్కోవాలి ఆగస్టు రెండోవారంలో తాలిబన్లు కాబూల్ వైపు వస్తూ ఉండగా కాబూల్లో ఉన్న స్త్రీలు, పిల్లలు ఏదో ఒక ఆశ పెట్టుకునే ఉన్నారు. కాని తాలిబన్లు అందరూ ఊహించిన దాని కంటే వేగంగా ఆగస్టు 15న కాబుల్ను హస్తగతం చేసుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ఆష్రాఫ్ ఘని ప్రజలను వారి ఖర్మానికి వదిలిపెట్టి దేశం విడిచి పారిపోయాడు. ఆగస్టు 15న కాబూల్లోని స్త్రీలు, మహిళలకు చీకటి రోజు. టీచర్లు, ఉద్యోగినులు, విద్యార్థినులు... తమ భవిష్యత్తు తెలియక అగమ్యగోచరం అయ్యారు. ముఖ్యంగా వారంతా నిండుగా శరీరాన్ని కప్పి ఉంచే బురఖాల కోసం రోడ్ల మీదకు పరిగెత్తారు. తాలిబన్లు స్త్రీల దుస్తుల విషయంలో నిరంకుశంగా ఉంటారు. ‘పాదాలు నగ్నంగా కనిపించే శాండల్స్ వేసుకున్నా వారు సహించరు’ అని ఒక విద్యార్థిని అంది. ఆ సమయంలో మార్కెట్లో దుకాణాలు మూతపడ్డాయి. మార్కెట్లు మూతపడ్డాయి. రోడ్డు మీద పిట్ట లేదు. స్త్రీలు దిక్కుతోచక పబ్లిక్ పార్క్కు చేరారు. భవిష్యత్తుకు సంబంధించిన బెంగ ఒకటి. తాలిబన్లు ‘నిఖా’ కోరితే కాదనలేని పరిస్థితి ఒకటి. నిజంగా ఇది భయానకం. నేను విద్యా శాఖా మంత్రిగా బాగానే పని చేశాను. ఎవరికీ ఏ నష్టం కలిగించలేదు. నేను నా మంత్రి పదవి వల్ల తాలిబన్ల చేతిలో శిక్ష అనుభవించననే అనుకుంటున్నాను. కాని ఏం జరుగుతుందో చెప్పలేను. – రంగిన హమీది, విద్యాశాఖ మంత్రి ప్రపంచమా... స్పందించు... తాలిబన్లకు కాబూల్ హస్తగతం కావడంతోటే అక్కడి మహిళా దర్శకురాలు సహ్రా కరిమి కెమెరా తీసుకొని రోడ్డు మీద పడింది. కాబూల్ దృశ్యాలు చిత్రించి పోస్ట్ చేస్తూ ‘ఇది సినిమాలో భయానక సన్నివేశం కాదు. నిజ దృశ్యం’ అని రాసింది. ‘ప్రపంచమా దయచేసి మౌనంగా ఉండకు... వాళ్లు మమ్మల్ని చంపడానికి వస్తున్నారు’ అని ఆమె పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. విశేషం ఏమిటంటే గత వారమే కాబూల్లో ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. ఇప్పుడు కళల పట్ల, సినిమాల పట్ల తాలిబన్ల వైఖరి ఏమిటనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే వారు మొదటిసారి పాలన చేసినప్పుడు (1996–2001) స్త్రీలను చాలా నిర్బంధంలో పెట్టారు. చదువుకు, క్రీడలకు, ఉద్యోగాలకు చివరకు ఒంటరిగా తిరగడానికి కూడా నిబంధనలు విధించారు. అవన్నీ ఇప్పుడు అక్కడి స్త్రీలకు పీడకలలు ఇస్తున్నాయి. చరిత్రలో మేము నశిస్తాం తాలిబన్లు అధికారం చేజిక్కించుకోవడంతోటే ఇరానియన్ జర్నలిస్ట్ మాసి అలినెజాద్ పోస్ట్ చేసిన ఒక బాలిక వీడియో ప్రపంచాన్ని కదిలించింది. ‘మేము అఫ్ఘానిస్తాన్ వాళ్లం కనుక లెక్కలో లేము. మేము మెల్లగా చరిత్రలో నశిస్తాం’ అని ఆ బాలిక కన్నీరు కార్చింది. ఇక తైక్వాండో దివ్యాంగ క్రీడాకారిణి జకియా ఖుదాదదీ బాధ మరొకటి. ఆమె సెప్టెంబర్ 5న టోక్యోలో జరగనున్న పారా ఒలింపిక్స్లో పాల్గొనడానికి అన్నీ సిద్ధం చేసుకుంది. ఇప్పుడు తాలిబన్ల రాకతో ఆమె నెత్తిన పిడుగు పడింది. ఆమె టోక్యోకు వెళ్లే వీలు ఏ కోశానా లేదు. గత ముప్పై ఏళ్ల అఫ్ఘాన్ చరిత్రలో మొదటిసారి ఒక మహిళ విద్యాశాఖ మంత్రి అయ్యింది. ఆమె పేరు రంగిన హమీది. ఆమె తన భవిష్యత్తు గురించి ఉత్కంఠతో ఉంది. ‘నేను విద్యా శాఖా మంత్రిగా బాగానే పని చేశాను. ఎవరికీ ఏ నష్టం కలిగించలేదు. నేను నా మంత్రి పదవి వల్ల తాలిబన్ల చేతిలో శిక్ష అనుభవించననే అనుకుంటున్నాను. కాని ఏం జరుగుతుందో చెప్పలేను’ అందామె. ఏం చెబుతున్నారు? తాలిబన్లు స్త్రీలను సాధారణ జీవనం గడిపమని అంటున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే వారు 12 ఏళ్ల తర్వాతి వయసు బాలికలకు చదువు నిరాకరిస్తారని, మహిళలకు ఉద్యోగ హక్కు తీసి వేస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే గురుద్వారాలో ఆశ్రయం పొందుతున్న హిందువులు, క్రైస్తవులకు తాలిబన్ నేతలు అభయం ఇచ్చారన్న వార్తలు వస్తున్నాయి. ఏదైనా ఒక అస్పష్ట చిత్రమే ఇప్పుడు. రెండు లక్షల మంది విద్యార్థులతో పోటీ పడి ర్యాంకు సాధించి, గతంలో ఐ.ఎస్.ఐ.ఎస్ బాంబు అటాక్ జరిగితే 40 మంది విద్యార్థినులు చనిపోగా బతికి బట్ట కట్టి ‘అఫ్ఘా్ఘన్ మలాలా’గా బిరుదు పొందిన షంషియ అలిజాదా తాను డాక్టర్ కావాలని కన్న కల పరిస్థితి ఏమిటా అని ఆలోచిస్తోంది. ‘నేను ఆశ కోల్పోను. పోరాడతాను’ అని కూడా అంటోంది. అఫ్ఘానిస్తాన్లో ఏకైక మహిళా మేయర్ జరీఫా గఫారి దిక్కు తోచని స్థితిలో ఉంది. రెండేళ్ల క్రితం మేయర్ అయిన జరీఫా ఈ రెండేళ్లలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. గుర్తింపు పొందింది. ‘ఇవాళ నేను నా భర్త, పిల్లలతో తాలిబన్ల రాక కోసం ఎదురు చూస్తున్నాను. మాకు సాయం చేసేవారు ఎవరూ లేరు. వాళ్లు నాలాంటి దాన్ని వెతుక్కుంటూ వస్తారు. పారిపోవాలంటే ఎక్కడికి వెళ్లను’ అని అందామె. కాని ఆగస్టు 15 నాటి అఫ్ఘాన్ అరాచకం అదుపులోకి వస్తుందా, రాబోయే కొన్ని రోజులలో తాలిబన్ల తాజా వైఖరి ఏమిటో తెలుస్తుందా? వాళ్లు వాళ్ల ప్రజలనే బాధలు పెట్టే కఠోరులవుతారా? లేక ప్రపంచం కోసమైనా కొన్ని సడలింపులు ఇస్తారా? కాలమే చెప్పాలి. అందాక స్త్రీలు తీవ్రమైన ఒత్తిడిని, వేదనను మాత్రం ఎదుర్కొన తప్పదు. మేము అఫ్ఘానిస్తాన్ వాళ్లం కనుక లెక్కలో లేము. మేము మెల్లగా చరిత్రలో నశిస్తాం. – అఫ్ఘాన్ బాలిక తైక్వాండో దివ్యాంగ క్రీడాకారిణి జకియా ఖుదాదదీ -
బంపర్ ఆఫర్.. టీకా వేసుకుంటే ఆపిల్ ఎయిర్పాడ్స్ ఫ్రీ
కరోనా మహమ్మారి ఎదుర్కోవడానికి వ్యాక్సినేషన్ కీలకమని వైద్యులేగాక ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి. అయితే పలు కారణాల వల్ల ఈ ప్రక్రియ అనుకున్నంత వేగంగా జరగడం లేదనే చెప్పాలి. దీంతో అందదూ వ్యాక్సిన్ వేసుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వాలు కొత్త ఐడియాలు, గిఫ్ట్లతో ప్రజల ముందుకు వస్తున్నాయి. అమెరికా రాజధాని వాషింగ్టన్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగం పెంచేందుకు అక్కడి అధికారులు నానా తిప్పలు పడుతున్నారు. తాజాగా ఆ ప్రాంత మేయర్ టీకా వేసుకున్న టీనేజర్లకు బంఫర్ ఆఫర్లు ప్రకటించారు. వ్యాక్సిన్ వేసుకుంటే.. ఆపిల్ ఎయిర్పాడ్స్ ఫ్రీగా ఇవ్వడంతోపాటు అదృష్టం కలిసొస్తే 25 వేల డాలర్ల స్కాలర్షిప్ అందచేస్తామని లేదా ఐప్యాడ్ కూడా దక్కే అవకాశం ఉందంటూ వాషింగ్టన్ డీసీ మేయర్ మేయర్ మురియల్ బౌజర్ ప్రకటించారు. వాషింగ్ట్న్తో పాటు చుట్టుపక్కల ఉన్న టీనేజర్లు తొలి డోసు తీసుకుంటే ఈ ఆఫర్ వర్తిస్తుందని చెప్పారు. కాగా.. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి, డీసీ యువత (12-17) ఎవరైతే బ్రూక్లాండ్ ఎంఎస్, సౌసా ఎంఎస్, జాన్సన్ ఎంఎస్లలో వ్యాక్సిన్ తీసుకుంటారో వాళ్లకు ఎయిర్పాడ్స్ ఇస్తాం. అంతేకాదు 25 వేల డాలర్ల స్కాలర్షిప్, ఐప్యాడ్ గెలుచుకునే అవకాశం కూడా వాళ్లకు ఉంటుంది అని బౌజర్ ట్వీట్ చేశారు. మీరు స్టూడెంట్ అయి ఉండి.. వ్యాక్సిన్ తొలి డోసు వేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ఆ ట్వీట్లో తెలిపారు. -
YSRCongress Party: చేతల్లో సామాజిక న్యాయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ సామాజిక న్యాయాన్ని మరోమారు చేతల్లో చూపించింది. సంక్షేమ పథకాలే కాదు.. పదవుల పంపకాల్లోనూ బడుగు, బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యమిస్తామని రుజువు చేసింది. నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పనుల్లోనూ వారికే ప్రాధాన్యమిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలోని నగరపాలక, పురపాలక సంస్థల పాలక వర్గాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సముచిత స్థానం లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా గత మార్చిలో ఎన్నికలు నిర్వహించిన 12 మునిసిపల్ కార్పొరేషన్లు, 74 మునిసిపాలిటీల్లో శుక్రవారం రెండో డిప్యూటీ మేయర్, రెండో వైస్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో కోరం లేక రెండో మునిసిపల్ వైస్ చైర్పర్సన్ ఎన్నికను శనివారానికి వాయిదా వేశారు. నగరపాలక సంస్థల్లో రెండో డిప్యూటీ మేయర్, పురపాలక సంఘాల్లో రెండో వైస్ చైర్పర్సన్ పదవులకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నగర, పట్టణ ప్రజలకు మరింతగా మెరుగైన సేవలందించేందుకు ఈ పదవులను సృష్టిస్తూ మునిసిపల్ చట్టాన్ని కూడా సవరించింది. ఆ మేరకు రెండో డిప్యూటీ మేయర్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించేందుకు మునిసిపల్ పాలక మండళ్లు ప్రత్యేకంగా సమావేశమయ్యాయి. రాష్ట్రంలో 85 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు పదవులను దక్కించుకున్నారు. వీరిలో బీసీ, మైనార్టీలు 24 మంది, ఎస్సీలు 22 మంది, ఎస్టీలు ఇద్దరు ఉన్నారు. ఈ లెక్కన 56 శాతం మేర బడుగు, బలహీన వర్గాలకు చెందిన మొత్తం 48 మంది రెండో డిప్యూటీ మేయర్/వైస్ చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేయగా, 37 మంది ఓసీ కేటగిరి నుంచి ఆ స్థానాలు పొందారు. కాగా, అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపాలిటీలో టీడీపీ మద్దతుదారుడు రెండో వైస్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. కేటాయింపునకు మించి.. వైఎస్సార్సీపీ గెలుపొందిన 12 మేయర్, 74 మునిసిపల్ చైర్పర్సన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 67 పదవులను కేటాయించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. నిజానికి చట్టప్రకారం 45 పదవులు కేటాయిస్తే సరిపోతుంది. కానీ జనరల్ కేటగిరిలోనూ బలహీన వర్గాలకు సీట్లు ఇచ్చి ప్రాధాన్యం కల్పించారు. 2019 ఎన్నికల్లో 60 శాతం సీట్లు ఇవ్వడమే కాకుండా మంత్రి వర్గంలోనూ 56 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. అంతేకాకుండా 137 నామినేటెడ్ పదవుల్లో 58 శాతం మేర 79 పదవులు ఇచ్చారు. నామినేషన్ పనుల్లో 50 శాతం వారికి కేటాయించడంతో పాటు, వాటిలోనూ సగం మహిళలకే ఇవ్వాలని చట్టం చేసి సామాజిక న్యాయ సాధన దిశగా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో ఒక మహిళ సహా నలుగురు ఈ వర్గాలకు చెందిన వారే ఉన్నారు. 15 ఎమ్మెల్సీ పదవుల్లో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకే 11 కేటాయించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ 60 శాతం టికెట్లు, మున్సిపల్ మేయర్, చైర్ పర్సన్ పదవుల్లో 78 శాతం, వీటిలో 60.46 శాతం మహిళలకు ఇచ్చి రికార్డు సృష్టించారు. బీసీల కోసం ఇదివరకెన్నడూ లేని విధంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు తీసుకువచ్చి సామాజిక న్యాయానికి అసలైన నిర్వచనాన్ని చేతల్లో చూపించారు. ఏలూరు మేయర్ ఎన్నిక ఏకగ్రీవం ఏలూరు టౌన్: ఏలూరు కార్పొరేషన్ నూతన మేయర్గా బీసీ మహిళ షేక్ నూర్జహాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం నిర్వహించిన ఎన్నిక కార్యక్రమంలో మొదటి డిప్యూటీ మేయర్గా గుడిదేశి శ్రీనివాసరావు, రెండో డిప్యూటీ మేయర్గా నూకపెయ్యి సుధీర్బాబు, విప్గా పైడి భీమేశ్వరరావులను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏలూరు కార్పొరేషన్ ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా కొత్తగా కొలువుదీరిన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా, నూర్జహాన్ మేయర్గా ఎన్నిక కావడం ఇది రెండోసారి. కోర్టు తీర్పు కారణంగా ఇక్కడ ఇటీవలే ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించిన విషయం తెలిసిందే. -
పట్టపగలు నడిరోడ్డుపై మేయర్ దారుణహత్య
పాట్నా: సమావేశం ముగించుకుని ఇంటికి వెళ్తున్న మేయర్ను బైక్పై వెంబడించిన దుండగులు ఓ చౌరస్తాకు చేరుకోగానే అడ్డగించి తుపాకీతో కాల్పులు జరిపారు. మూడు రౌండ్లు ఛాతీపై చేయడంతో ఆ మేయర్ కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా వెంటనే స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ మేయర్ శుక్రవారం కన్నుమూశారు. పట్టపగలే ఈ సంఘటన జరగడం బిహార్లోని కఠిహార్లో కలకలం సృష్టించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కఠిహార్ మేయర్ శివరాజ్ పాశ్వాన్ (40) గురువారం ఓ సమావేశం ముగించుకుని ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యలో కొందరు దుండగులు ఆయనను బైక్లపై వెంబడించారు. సంతోశీ చైక్కు చేరుకోగానే దుండగులు ముందుకు వచ్చి శివరాజ్పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికుల సహాయంతో పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. కఠిహార్లోనే పేరుమోసిన గూండా గుడ్డు మియాను హత్య చేసిన కొన్ని గంటల్లోనే మేయర్ కూడా హత్యకు గురి కావడంతో రెండు హత్యలు చేసింది ఒకటే గ్యాంగ్ అని తెలుస్తోంది. హత్యకు ముందు ఏం జరిగిందో పోలీసులు తెలుసుకుంటున్నారు. నిందితులను పట్టుకునేందుకు సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. అయితే ఆ గూండా, మేయర్ హత్యకు కారణం రియల్ ఎస్టేట్ వ్యవహారాలే కారణమని సమాచారం. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మేయర్ హత్య రాజకీయంగా తీవ్ర వివాదాస్పదమవుతోంది. అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య వివాదం కొనసాగుతోంది. -
ఏపీలో శుక్రవారం కొలువుదీరనున్న రెండో డిప్యూటీ మేయర్లు. వైస్ చైర్మన్లు
-
ఈ నెల 30న ఏలూరు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక
సాక్షి, అమరావతి: ఈ నెల 30న ఏలూరు మేయర్, ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఎన్నికలకి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అదే రోజు రాష్ట్రంలోని 11 కార్పోరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో రెండవ డిప్యూటీ మేయర్, రెండవ వైస్ చైర్మన్ ఎంపికకి ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. పరోక్ష పద్దతిలో రెండవ డిప్యూటీ మేయర్, రెండవ వైస్ చైర్మన్ ఎంపిక ఉంటుందని ఎస్ఈసీ పేర్కొంది. 30వ తేదీ ప్రత్యేక సమావేశాలకి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, కార్పోరేషన్ అధికారులను ఎస్ఈసీ ఆదేశించింది. ఎంపికైన కార్పోరేటర్లు, కౌన్సిలర్లు, ఎక్స్ అఫిషియో మెంబర్లకి ఈ నెల 26 లోపు సమాచారమివ్వాలని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్పోరేషన్లు, మున్సిపాలిటీలలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, ఇద్దరు వైస్ చైర్మన్లను నియమించుకునేలా ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. రెండవ డిప్యూటీ మేయర్, రెండవ వైస్ చైర్మన్ల ఎంపిక చేపట్టాలని ఎస్ఈసీని ప్రభుత్వం కోరడంతో ప్రత్యేక సమావేశం నిర్వహణకి నోటిఫికేషన్ జారీ చేసింది. -
జైపూర్ మేయర్ తొలగింపు
జైపూర్: జైపూర్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సౌమ్య గుర్జార్ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు రాజస్తాన్ ప్రభుత్వం ఆదివారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం రాత్రి కమిషనర్ యగ్యా మిత్ర సింగ్ దియో ఓ సమావేశాన్ని నిర్వహించగా, దానికి మేయర్ సౌమ్య గుర్జార్, కౌన్సిలర్లు అజయ్సింగ్ చౌహాన్, పరాస్ జైన్, శంకర్ శర్మలు హాజరయ్యారు. సమావేశంలో వచ్చిన వాదనలో కమిషనర్పై వీరు భౌతికంగా బలప్రయోగం చేయడంతో యగ్యా మిత్ర సమావేశాన్ని మధ్య లోనే నిలిపేసి వెళ్లిపోయారు. ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించే ఓ కంపెనీకి సంబంధించి వీరి మధ్య వాగ్వివాదం జరిగిన ట్లు సమాచారం. తొలగింపుకు గురైన వారిలో శంకర్ శర్మ ఇండిపెండెంట్ కాగా, మిగిలిన ముగ్గురు బీజేపీకి చెందినవారే. రాజస్తాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. దీంతో రాష్ట్ర బీజేపీ ఈ చర్యపై మండిపడింది. మేయర్ పీఠాన్ని తాము గెలవడంతో కాంగ్రెస్ ఓర్వలేకపోతోందని రాష్ట్ర బీజేపీ చీఫ్ సతీశ్ పూనియా ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయన్నారు. -
వరంగల్ మేయర్గా గుండు సుధారాణి ఎన్నిక
-
వరంగల్, ఖమ్మం మేయర్లు వీరే..
సాక్షి, ఖమ్మం: గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తయ్యింది. అనుకున్నట్లుగానే కమ్మ సామాజిక వర్గానికే ఖమ్మం మేయర్ పదవి దక్కింది. 26వ డివిజన్ నుంచి గెలిచిన పునుకొల్లు నీరజ ఖమ్మం మేయర్గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ పదవి మైనార్టీ వర్గానికి దక్కగా.. ఖమ్మం 38వ డివిజన్ కార్పొరేటర్గా గెలిచిన ఫాతిమా పేరును అధిష్టానం ఖరారు చేసింది. వరంగల్ మహా నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక వరంగల్ మేయర్ పీఠానికి 29 వ డివిజన్ కార్పొరేటర్ గుండు సుధారాణి పేరును అధిష్టానం ఖరారు చేసింది. సుధారాణికి మేయర్ పీఠం ఖాయమన్న ప్రచారం ముందు నుంచి జరిగింది.. అధిష్టానం కూడా ఆమె పేరే ప్రకటించింది. డిప్యూటీ మేయర్ పదవికి రిజ్వాన షమీకి దక్కింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలతో చర్చించి అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేసింది. పార్టీ పట్ల విధేయత, అనుభవం, సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ మేయర్ ఎంపిక ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా తెరాస ఎన్నికల పరిశీలకులు బాధ్యతలు నిర్వర్తించారు. మధ్యాహ్నం 3 గంటలకు కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మేయర్, చైర్పర్సన్ల కోసం పరోక్ష ఎన్నిక నిర్వహించారు. మేయర్ అభ్యర్థుల పేర్లతో కూడిన సీల్డ్ కవర్లను టీఆర్ఎస్ అధిష్ఠానం, పార్టీ పరిశీలకులకు అందించింది. వరంగల్కు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, పరిశీలకులుగా వ్యవహరించారు. కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో 8 మంది కార్పొరేటర్లు గైర్హాజరు అయ్యారు. వీరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తద్వారా ఓటింగ్ ప్రక్రియ పూర్తిచేయడం జరిగింది. చదవండి: Municipal Polls: ఆ ఊపు లేదు.. హవా లేదు! -
నేడు మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్ పదవులతో పాటు మరో ఐదు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల భర్తీ కోసం శుక్రవారం పరోక్ష పద్ధతిలో ఎన్నిక జరగనుంది. కార్పొరేషన్లలో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుం టారు. ఈ నెల 3న వెలువడిన ఫలితాల్లో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో మెజారిటీ డివిజన్లు, వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో అన్ని చోట్లా ఇతర పార్టీలు, కో ఆప్షన్ సభ్యుల మద్దతు లేకుండానే మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను టీఆర్ఎస్ కైవసం చేసుకోనుంది. అయితే సజావుగా ఎన్నికల ప్రక్రియ జరిగేందుకు టీఆర్ఎస్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు సిద్దిపేట, అచ్చం పేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలకు రెండు రోజుల క్రితమే పరిశీలకులను నియమించింది. పలువురు మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులతోపాటు కొందరు ముఖ్య నేతలకు ఆ బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే ఆయా ప్రాం తాల పరిధిలోని మంత్రులు, స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తీసుకుని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆశావహుల జాబితాకు తుది రూపం ఇచ్చారు. పేర్లను సీల్డ్ కవర్లలో గురువారం మధ్యా హ్నం పార్టీ పరిశీలకులకు అందజేశారు. వీరు గురువారంరాత్రికే తమకు కేటాయించిన కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీకి చేరుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఎన్నిక జరగనుండగా, పార్టీ కొత్త కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో పరిశీలకులు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సమావేశమవుతారు. ఎన్నిక జరిగే తీరుతెన్నులను వివరించడంతోపాటు, సీల్డ్ కవర్లోని పార్టీ నిర్ణయాన్ని కూడా తెలియచేస్తారు. కో ఆప్షన్ సభ్యులతోపాటు కొత్తగా ఎన్నికైన వారితో కలిసి ఎన్నిక జరిగే సమావేశ మందిరానికి చేరుకుంటారు. రిజర్వేషన్ కేటగిరీ, విధేయత, సీనియారిటీ తదితరాలను ప్రాతిపదికగా తీసుకుని కేసీఆర్ మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. కార్పొరేషన్/ మేయర్/చైర్మన్ మున్సిపాలిటీ ఆశావహులు వరంగల్ గుండు సుధారాణి ఖమ్మం బీసీ లేదా కమ్మ సామాజికవర్గం సిద్దిపేట కడవేర్గు మంజుల/ కొండం కవిత అచ్చంపేట నర్సింహ గౌడ్/ గోపిశెట్టి శివ/ పోరెడ్డి శైలజ జడ్చర్ల దోరేపల్లి లక్ష్మి కొత్తూరు కరుణ/ లావణ్య నకిరేకల్ రాచకొండ శ్రీనివాస్/ కొండ శ్రీనుగౌడ్ -
Telangana: 7న మేయర్, చైర్మన్ల ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలతో పాటు అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు ఈ నెల 7న మధ్యాహ్నం 3.30 గంటలకు నిర్వహించనున్నారు. పరోక్ష పద్ధతిలో జరగనున్న మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం జారీ చేసింది. జిల్లా కలెక్టర్లు నియమించిన గెజిటెడ్ అధికారి ప్రిసైడింగ్ అధికారిగా ఉంటారు. ఆయన ఈ పదవులకు ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేక సమావేశానికి పిలుపునిస్తూ ఈ నెల 6న లేదా అంతకంటే ముందే నోటీసు జారీ చేస్తారు. 7న మధ్యాహ్నం 3 గంటలకు ఆయన తొలుత వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం 3.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్ల ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికైన వార్డు మెంబర్లు, ఎక్స్– అఫీషియో సభ్యులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోకసభ, రాజ్యసభ సభ్యులు ఓటేయడానికి అర్హులు. ఓటు హక్కు ఉన్న సభ్యుల్లో సగం సంఖ్యను ’కోరం’గా పరిగణిస్తారు. మొదటి రోజు కోరం లేక ఎన్నిక నిర్వహించలేని పక్షంలో మరుసటి రోజు ఎన్నిక నిర్వహించాలి. రెండో రోజు లేదంటే ఆ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలి. తదుపరి సమావేశంలో కోరంతో సంబంధం లేకుండా ఎన్నిక జరుగుతుంది. పార్టీ విప్కు అనుగుణంగా చేతులు ఎత్తే పద్ధతిలో ఎన్నిక నిర్వహిస్తారు. పార్టీ విప్ ను ధిక్కరించిన వారు అనర్హతకు గురవుతారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు విప్ ను నియమించి ఆ విషయాన్ని ప్రిసైడింగ్ అధికారికి ఎన్నిక ముందు రోజు 11 గంటల లోపు తెలపాలి. చైర్మన్, డిప్యూటీ చైర్మన్, మేయర్, డిప్యూటి మేయర్ అభ్యర్థి పేరును ఓటు హక్కు కలిగి ఉన్న ఒక సభ్యుడు ప్రతిపాదిస్తే మరొకరు బలపరచాలి. ఒకే అభ్యర్ధి పోటీలో ఉంటే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. చైర్పర్సన్/ మేయర్ ఎన్నిక పూర్తికాకపోతే డిప్యూటీ చైర్పర్సన్/ డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించరాదు. పరోక్ష ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. ఈ ఎన్నికలు జరగనున్న జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు/ ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తూ ఎన్నిక నిర్వహించాలని ఆదేశించారు. విజయోత్సవ ర్యాలీపై ఎన్నికల సంఘం ఇప్పటికే నిషేధం విధించిన విషయం తెలిసిందే. -
ముంబైలో కరోనా కల్లోలం.. చేతులెత్తి మొక్కిన మేయర్
ముంబై: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో విలయ తాండవం చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మహమ్మారి కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేక పోతున్నాయి. ఇదిలా ఉంటే కరోనా దెబ్బకు మహరాష్ట్ర విలవిలలాడుతోంది. ముఖ్యంగా ముంబై నగరం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రతీ రోజూ నమోదవుతున్న కేసులతో పాటు మరణాలు అదే స్థాయిలో పెరుగడం ముంబై వాసులను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై నగర మేయర్ కిషోర్ పెడ్నెకర్ కరోనా నిబంధనలను ప్రజలు తప్పక పాటించాలని వేడుకున్నారు. ముంబై నగరం వ్యాపార, వాణిజ్య కార్యక్రమాలతో ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. ఈ క్రమంలో జనాభా తాకిడి కూడా అధికమే. అంతటి జనాభా ఉన్నప్పుడు అందులో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా అది అందరినీ ప్రమాదంలో పడేస్తుంది. ప్రస్తుతం ముంబైలో కేసుల పెరుగుదలకు ఇదొక కారణమనడంలో సందేహం లేదు. ఓ పక్క కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ ఇంకా కొందరు నిర్లక్ష్యంగా మాస్క్లు ధరించకపోవడం, అవసరం లేకపోయినా బయట సంచరించడం లాంటివి చేస్తూ కేసుల పెరుగుదలకు పరోక్షంగా కారణమవుతున్నారు. ఈ నేపథ్యంలో నగర మేయర్ ముంబై వాసులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీకు చేతులెత్తి మొక్కుతున్నా.. డబుల్ మాస్క్లు పెట్టుకోండి. అవసరం ఉంటేనే బయటకి రండి, లేదంటే రాకండి.. అని వేడుకున్నారు. ( చదవండి: శభాష్ ప్యారే ఖాన్: రూ.కోటితో ఆక్సిజన్ ట్యాంకర్లు ) I request everyone with folded hands to wear a mask, that too double masks. People are requested to not step out of their houses unnecessarily: Mumbai Mayor Kishori Pednekar#COVID19 pic.twitter.com/zyjTAPew6x— ANI (@ANI) May 1, 2021 -
కరోనా విజృంభిస్తోంది.. ఇకనైనా మారండి సారు
బంజారాహిల్స్: కోవిడ్ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన ప్రభుత్వం మైక్రో కంటైన్మెంట్ జోన్లను ప్రకటించింది. ఇందులో భాగంగా ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, యూసుఫ్గూడ జీహెచ్ఎంసీ సర్కిళ్ల పరిధిలో వీర్నగర్, ప్రేమ్నగర్, బాపునగర్, ఎల్లారెడ్డిగూడ. బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్ తదితర ప్రాంతాలను మైక్రో కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించి ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ జోన్లలో జీహెచ్ఎంసీ అధికారులు తగిన జాగ్రత్తలు, పారిశుద్ధ్య సమస్యలపై దృష్టిసారించాల్సి ఉంటుంది. రోజువారి పర్యవేక్షణ కూడా అవసరం. ►పర్యవేక్షణ కరువు.. మేయర్ ►దృష్టిసారిస్తేనే ముందుకు.. ►మైక్రో కంటైన్మెంట్ జోన్లలో మాత్రం గత వారం రోజుల నుంచి సంబంధిత సిబ్బంది, అధికారులు పర్యవేక్షించిన పాపాన పోలేదు. కనీసం అటువైపు తొంగిచూడటం లేదు. ►తాజాగా బుధవారం గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి రోడ్ నెం.12లోని ఎన్బీటీ నగర్ జోన్లో క్రిమి సంహారక స్ప్రే (ఒక శాతం సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని)ను చేయించారు. ఇదంతా రోజువారి కార్యక్రమం కాగా మేయర్ దృష్టిసారిస్తేనే సంబంధిత సిబ్బంది ఒక రోజుకు కదిలారు. మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు.. ►శానిటైజేషన్ చేపట్టేందుకు ఇప్పటిదాకా తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ►ఇటీవల నాలుగు రోజుల పాటు పారిశుద్ధ్య డ్రైవ్ లు మాత్రం నిర్వహించారు. ►మైక్రో కంటైన్మెంట్ ఏర్పాటు చేసినట్లు కొంత మంది అధికారులకు సమాచారమే లేదని తెలుస్తుంది. ►మైక్రో డిపార్ట్మెంట్ జోన్లను ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య శాఖ నుంచి కానీ, ఉన్నతాధికారుల నుంచి కానీ ఎలాంటి ఆదేశాలు, సూచనలు జారీ కాలేదని అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఒకరు స్పష్టం చేశారు. ►ఈ విషయంపై ఖైరతాబాద్ జోన్ జీహెచ్ఎంసీ అధికారులు కూడా మాట్లాడేందుకు ముందుకు రావడం లేదు. ►మైక్రో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ప్రతిరోజూ పారిశుద్ధ్య సిబ్బంది పర్యటించి చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలి. ►ప్రజలు ఇష్టారాజ్యంగా బయట తిరగకుండా నిబంధనలు ఉండాలి. ►ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించిన తర్వాతనే రోడ్లపై తిరగాల్సి ఉంటుంది. ►నిత్యం హైడ్రో క్లోరైట్ స్ప్రే చేయాల్సి ఉంటుంది. ►ఈ ప్రాంతం కంటైన్మెంట్ జోన్లో ఉందని బోర్డులు ఏర్పాటు చేయడమే కాకుండా స్థానికులను అప్రమత్తం కూడా చేయాల్సి ఉంటుంది. ►ఇలాంటి ప్రోటోకాల్స్ ఏవీ మైక్రో ఈ జోన్లలో అమలు చేయడం లేదు. ►తమ నివాసిత ప్రాంతం కంటైన్మెంట్ జోన్లో ఉందనే విషయమే అక్కడ ప్రజలకు తెలియదంటూ కోవిడ్–19పై అధికారులు ఎంత అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ►మాకు ఎలాంటి సూచన లేదు.. మేమేం చేయాలి.. ►సరైన సూచనలు, జాగ్రత్తలు లేకపోతే తాము మాత్రం ఏం చేయాలంటూ జీహెచ్ఎంసీ కింది స్థాయి సిబ్బంది చేతులు దులుపుకుంటున్నారు. ►మేయర్ కదిలింది కాబట్టి ఒక రోజు స్ప్రే చేశారు. ►మరి మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏంటన్నది అధికారులకే తెలియాలి. ►మైక్రో కంటైన్మెంట్ జోన్ అన్నది కాగితం మీదనే కనబడుతున్నదని క్షేత్రస్థాయిలో దాని జాడే లేదని స్థానికులు దుయ్యబడతున్నారు. (చదవండి: హైదరాబాద్లో అసలు కర్ఫ్యూ ఉందా? ఓ యువతి ట్వీట్ ) -
కరోనా కట్టడికి విశాఖ కార్పొరేషన్ చర్యలు
-
GHMC Sanitation: పేరు గొప్ప.. ఊరు దిబ్బ
సాక్షి, హైదరాబాద్: ప్రతియేటా స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ కోసం తాపత్రయ పడే జీహెచ్ఎంసీలో వాస్తవ పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి. వరుసగా మూడో రోజు ఆకస్మిక తనిఖీల్లోనూ మేయర్కు పలు ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తకుప్పలు, అధ్వాన్నపు పారిశుధ్య పరిస్థితులు దర్శనమిచ్చాయి. చెత్త తీసుకువెళ్లేందుకు స్వచ్ఛ ఆటోల వాళ్లు రావడం లేదని పలు ప్రాంతాల్లో ప్రజలు ఫిర్యాదు చేశారు. తమ ప్రాంతాల్లో పారిశుధ్యం జరగడం లేదని నింబోలిఅడ్డాలోని ప్రజలు మేయర్ దృష్టికి తేగా, సంబంధిత ఎస్ఎఫ్ఏ (శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్)ను తొలగించాలని ఆదేశించడంతో అందుకనుగుణంగా సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి చర్యలు తీసుకున్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో.. మేయర్ గద్వాల విజయలక్ష్మి క్షేత్రస్థాయి పర్యటనలతో చెత్త సమస్యలపై ఇప్పుడు దృష్టి సారించినప్పటికీ, జీహెచ్ఎంసీ ఈ అంశాన్ని ఎంతోకాలంగా వదిలేసింది. క్షేత్రస్థాయిలో ఈ పనులు నిర్వహించాల్సిన డీసీలు, ఏఎంఓహెచ్లు, ఎస్ఎఫ్ఏలపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి పట్టు లేకుండా పోయింది. దాంతో ఎవరిష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తున్నారు. పేరుకు బయోమెట్రిక్ హాజరైనప్పటికీ, ఏ ఒక్కరోజు కూడా పారిశుధ్య సిబ్బంది టీమ్స్లోని సభ్యులందరూ హాజరు కారు. ఇవన్నీ పైస్థాయిలోని వారికి తెలియక కాదు. తెలిసినా పట్టించుకోలేదు. కేవలం స్వచ్ఛ ర్యాంకింగ్స్ కోసం.. స్వచ్ఛ సర్వేక్షణ్ బృందాలు నగరానికి తనిఖీలకు వచ్చినప్పుడు హడావుడి చర్యలతో వారిని ఆకట్టుకునే పనులు చేస్తున్నారు. అంతేకాదు.. పౌరస్పందన విభాగంలో మార్కులు పొందేందుకు ప్రజల బదులు జీహెచ్ఎంసీ సిబ్బందే, అసలు విధులు పక్కనపెట్టి ఫీడ్బ్యాక్ పంపించారంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. ర్యాంకుల సర్టిఫికెట్లపై చూపే మోజులో నాలుగోవంతైనా వాస్తవ పరిస్థితులపై దృష్టి సారిస్తే ప్రజలకు చెత్త సమస్యలు తప్పుతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు చేసినా ఉన్నతస్థాయిలోని యంత్రాంగం పట్టించుకోకపోవడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ చదవండి: అదే భయం.. ఎప్పుడేం జరుగుతుందో.. వెళ్లిపోతాం సారు హైదరాబాద్ సిటీ బస్సులు తిరిగేది ఇక ఈ సమయంలోనే! -
GVMC తొలి కౌన్సిలింగ్ ప్రారంభం
-
నాడు కట్టెలు కొట్టిన మహిళ.. నేడు చిత్తూరు మేయర్
చిత్తూరు అర్బన్: చిత్తూరు కార్పొరేషన్ నూతన మేయర్గా ఎన్నికైన అముద ప్రస్థానం.. కష్టాల్లో ఆగిపోకుండా నిలదొక్కుకోవాలనే ఎందరో మహిళలకు ఆదర్శం. కుటుంబం గడవడం కోసం ఒకప్పుడు అముద కట్టెలు కొట్టి అమ్మింది. ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడుతోంది. జగన్ రూపంలో అదృష్టం ఆమె తలుపు తట్టింది. వైఎస్సార్సీపీ తరఫున కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసి గెలవడమేగాక ఇప్పుడు ఏకంగా చిత్తూరు మేయర్గా ఎన్నికైంది. దీనిపై అముద స్పందిస్తూ.. ‘‘మాది పేద కుటుంబం. అమ్మానాన్న చనిపోయేనాటికి నాకు ఊహ కూడా తెలియదు. అక్క నాగభూషణం కుటుంబ బాధ్యత తీసుకుంది. అక్కతోపాటు పనికిపోయేదాన్ని. ఆమె పడుతున్న కష్టం చూసి.. మేముంటున్న చోటి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడివికిపోయి కట్టెలు కొట్టేదాన్ని. వాటిని మోసుకొచ్చి మా కాలనీలో అమ్మితే రూ.20 వచ్చేవి. మేం ముగ్గురు అక్కాచెల్లెళ్లం, ఓ తమ్ముడు. ఇంత కష్టపడితే ఇప్పుడిçప్పుడే జీవితంలో స్థిరపడ్డాం. నేనెవరో కూడా జనానికి తెలియదు. అయితే జగనన్నను చూసి ఓట్లేసి నన్ను గెలిపించారు. ఇప్పుడు మేయర్ను చేశారు. ఇది నా జీవితంలో అస్సలు ఊహించలేదు. ప్రజలకు నమ్మకంగా ఉండి.. పార్టీకి మంచిపేరు తీసుకొస్తాను’’ అని తెలిపారు. చదవండి: మామ అటెండర్గా పనిచేసిన చోట..నేడు కోడలు మేయర్ రాయచోటి మున్సిపల్ చైర్మన్గా కూరగాయల వ్యాపారి -
బడుగు వర్గాలకే పెద్దపీట: 86 స్థానాల్లో ఎవరెవరు?
సాక్షి, అమరావతి: పురపాలక పదవుల్లో వైఎస్సార్సీపీ తరఫున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే సింహభాగం కేటాయిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారు. చట్టం చెప్పిన దానికన్నా ఎక్కువగా ఈ వర్గాలకు పదవులు దక్కేలా కసరత్తు చేశారు. ఆ మేరకు రాష్ట్రంలోని 86 మున్సిపల్, నగర పంచాయతీ చైర్మన్లు, నగర మేయర్ల పదవుల్లో ఏ స్థానాన్ని ఏ సామాజికవర్గానికి కేటాయించింది.. వివరాలివీ.. -
మామ అటెండర్గా పనిచేసిన చోట..నేడు కోడలు మేయర్
తిరుపతి తుడా: మునెయ్య.. ఆరేళ్లక్రితం వరకు తిరుపతి మునిసిపాలిటీలో అటెండర్గా పనిచేశారు. కార్పొరేషన్ స్థాయికి ఎదిగిన తిరుపతికి ఈసారి మొదటిసారి ఎన్నికలు నిర్వహించారు. మునెయ్య కోడలే ఇప్పుడు తిరుపతి కార్పొరేషన్కు తొలి మేయర్గా ఎన్నికయ్యారు. ముప్పై ఏళ్లు సేవలందించిన ఆయన రెవెన్యూ విభాగంలో దఫేదార్(అటెండర్)గా ఆరేళ్లక్రితం రిటైరయ్యారు. అటెండరుగా తాను పనిచేసిన సంస్థకు తన కోడలు మేయరుగా ఎంపిక కావడంపై మునెయ్య, ఆయన కుటుంబీకుల ఆనందానికి పట్టపగ్గాల్లేవు. మునెయ్యకు ఇద్దరు కుమారులు. వైష్ణవి చిన్నపిల్లల ఆస్పత్రి అధినేత డాక్టర్ మునిశేఖర్ పెద్దకుమారుడు. ఈయన భార్యే డాక్టర్ శిరీష. చిన్న కుమారుడు తులసీయాదవ్ టౌన్బ్యాంకు డైరెక్టర్గా పనిచేశారు. వైఎస్సార్ జిల్లా కొర్రపాడుకు చెందిన శిరీష 1980లో జన్మించారు. తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తిచేసి, కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాలనుంచి 2011లో డీజీవో పట్టా పుచ్చుకున్నారు. కొంతకాలం తిరుపతిలోని ఆశాలత టెస్ట్ట్యూబ్ బేబీ సెంటర్లో గైనకాలజిస్ట్గా పనిచేశారు. మునిశేఖర్ను వివాహం చేసుకున్న తర్వాత ఆయనతోపాటు వైష్ణవి చిన్నపిల్లల ఆస్పత్రిలో వైద్య సేవలందిస్తున్నారు. చదవండి: రాయచోటి మున్సిపల్ చైర్మన్గా కూరగాయల వ్యాపారి రాష్ట్ర ప్రాజెక్టులు భేష్: నాబార్డు చైర్మన్ -
సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చేస్తాం: తిరుపతి మేయర్ శిరీషా
-
సీఎం వై ఎస్ జగన్ స్ఫూర్త్రితో ప్రజా సేవ చేస్తాం
-
మహిళకు అవకాశాలు కలిపించిన సీఎంకు కృతజ్ఞతలు
-
మహిళా కార్పొరేటర్లతో జీవీఎంసీ కళకళ
-
బెజవాడ మేయర్ పీఠం వైఎస్సార్సీపీదే: మల్లాది
విజయవాడ: జరిగే మున్సిపల్ ఎన్నికల్లో విజయవాడ మేయర్ పీఠం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధీమా వ్యక్తం చేశారు. 20 నెలల పాలనలో విజయవాడలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. సెంట్రల్ నియోజకవర్గంలో శనివారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. 58వ డివిజన్ అభ్యర్థి అవుతు శైలజతో కలిసి గడపకు గడప ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదలు, మధ్య తరగతి వారి అంశాలను అజెండా పెట్టుకుని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని తెలిపారు. . పాదయాత్రలో జగన్ చూసిన ప్రజల సమస్యలను మ్యానిఫెస్టోలో పథకాలుగా రూపొందించారని గుర్తుచేశారు. విజయవాడలో లక్ష మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని ప్రకటించారు. విద్య, వైద్యానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో రాష్టంలో రూ.70 వేల కోట్లు ప్రజల ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం తమదేనని గర్వంగా తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల సమస్యలు, అవసరాలు ఒక అజెండాగా పెట్టుకున్నట్లు వివరించారు. 20 నెలల పాలనలో విజయవాడలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. విజయవాడ నగర ప్రజలు టీడీపీ అబద్ధపు మాటలు నమ్మే స్థితిలో లేరని గుర్తుచేశారు. తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని విష్ణు డిమాండ్ చేశారు. రూ.600 కోట్ల అభివృద్ధి పనులు టీడీపీకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు చిత్తశుద్ధి ఉంటే బహిరంగ చర్చకు రండి సవాల్ విసిరారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు మరోలా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ప్రభుత్వ పాలనలో నగరంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు సిద్ధాంతాలు వీగి పోయాయని.. కుప్పం ప్రజలు తిరస్కరించారని విష్ణు వివరించారు. -
భార్య మేయరైతే.. ఆనందాన్ని ఆపడం ఎవరితరం?
సాక్షి, మైసూరు: భార్యామణి మేయరైతే భర్త ఆనందానికి పట్టపగ్గాలుంటాయా!, ఆ ఆనందాన్ని దాచుకోకుండా ఉండడం ఎవరితరం? అందుకే భార్య మేయరైన మరుక్షణమే ఆమెను గాల్లోకి ఎత్తి సంతోషాన్ని చాటుకున్నాడు భర్త. బుధవారం కర్ణాటకలోని పర్యాటకనగరి మైసూరు మేయర్ పీఠానికి ఎన్నిక జరిగింది. కాంగ్రెస్–జేడీఎస్ కూటమి నుంచి పోటీ పడిన జేడీఎస్ కార్పొరేటర్ రుక్మిణి ఘన విజయం సాధించారు. దీంతో ఆమె భర్త విజయోత్సాహంతో పొంగిపోయారు. రుక్మిణిని ముద్దాడుతూ ఎత్తుకోవడంతో అందరూ ముసిముసిగా నవ్వుకున్నారు. చదవండి: (కర్ణాటకలో మంకీ ఫీవర్.. తొలి కేసుగా నమోదు) -
ప్రసవం ముందు వరకు డ్యూటీ.. మేయర్పై ప్రశంసలు
జైపూర్ నగర్ నిగమ్ (గ్రేటర్) మేయర్గా పనిచేస్తున్న డాక్టర్ సౌమ్య గుర్జర్ గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం ఈ మహిళా మేయర్పై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేంటి బిడ్డకు జన్మనిస్తే పొగడ్తలు ఎందుకని ఆశ్చర్యపోతున్నారా.. అసలు విషయం ఏంటటే. తను ప్రసవించే కొన్ని గంటల ముందు వరకు కూడా సౌమ్య మేయర్గా తన బాధ్యతలు నిర్వర్తించారు. విధుల్లో పాల్గొని ప్రజా పాలనకు అసలైన అర్థం చెప్పారు. ఈ విషయాన్ని మేయర్ స్వయంగా వెల్లడిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీంతో ప్రస్తుతం సౌమ్య స్టోరీ నెట్టింట్లో వైరల్గా మారింది. నిండు గర్భిని అయిన మేయర్ బుధవారం రాత్రి వరకు అధికారులతో సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆస్పత్రిలో చేరగా గురువారం ఉదయం అయిదు గంటల సమయంలో మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా మేయర్ స్పందిస్తూ.. పని దేవునితో సమానమని పేర్కొన్నారు. ‘పనే నాకు దైవం. బుధవారం రాత్రి వరకు మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్లో పాల్గొన్నాను. ప్రసవ నొప్పులతో 12.30 గంటలకు హాస్పిటల్లో చేరాను. దేవుడి ఆశీస్సులతో గురువారం ఉదయం క్షేమంగా ప్రసవమైంది’ అని ట్వీట్లో వివరించారు.. తొలుత రాజస్తాన్ పదవిలో ఉన్నపపుడు సౌమ్య ఒక బిడ్డకు జన్మనిచ్చారు. అనంతరం జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీచేసి గెలుపొంది ఏకంగా మేయర్ పదవిని దక్కించుకున్నారు. రెండోసారి గర్భం దాల్చారు. అయినా క్రమం తప్పకుండా మేయర్ కార్యాలయానికి వచ్చి విధులు నిర్వర్తించారు. గత నెలలోనే మేయర్ హోదాలో మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ను కూడా సమర్పించారు. ఫిబ్రవరి 7న రాజస్థాన్లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పర్యటనలోనూ ఆమె పాల్గొన్నారు. అయితే గర్భంతో ఉన్న సమయంలో కూడాపనిచేయడం ఉత్తేజంగా, ఒక సవాలుగా ఉందన్నారు. క్రమశిక్షణతో బాధ్యతలు నిర్వర్తిస్తూ అందరి ప్రశంసలు దక్కించుకున్నారు. మహిళా స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచిన సౌమ్యకు దేశ ప్రజల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: 'నేను ఏలియన్ని' మస్క్ షాకింగ్ కామెంట్ వైరల్ : 'హెలికాప్టర్ కొనేందుకు లోన్ ఇప్పించండి' Work is Worship! देर रात तक निगम ऑफिस में मीटिंग ली, प्रसव पीड़ा शुरू होने पर रात्रि 12:30 बजे कुकुन हॉस्पिटल में भर्ती हुई और सुबह 5.14 पर परमपिता परमेश्वर की कृपा से पुत्र को जन्म दिया। मैं और बच्चा दोनों स्वस्थ हैं। pic.twitter.com/nMULHwNGWn — Dr Somya Gurjar (@drsomyagurjar) February 11, 2021 -
ఆశావహులు నిరుత్సాహపడొద్దు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్గా అవకాశం దక్కని కార్పొరేటర్లు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి భవిష్యత్తులో అవకాశాలు వస్తాయని, పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఎన్నిక సజావుగా జరిగేందుకు సహకరించాలని ఆయన కోరారు. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ తరఫున గెలిచిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు గురువారం ఉదయం 8.30 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎక్స్ అఫీషియో సభ్యులు, కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు సమావేశమయ్యారు. మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేర్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. గ్రేటర్లో నెలకొన్న రాజకీయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని విప్ జారీ చేసినట్లు వెల్లడించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా అనుసరించాల్సిన పద్ధతిని మంత్రి వివరించారు. అనంతరం టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలసి బస్సుల్లో తెలంగాణ భవన్ నుంచి జీహెచ్ఎంసీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. బస్సులో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తన ఆటా పాటలతో కార్పొరేటర్లను ఉత్సాహ పరిచారు. ఎన్నిక ప్రక్రియ ముగిసిన తర్వాత మంత్రులు మహమూద్ అలీ, తలసాని, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ కవిత తదితరులతో కలసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నూతన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమర వీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. -
‘మంచిగ ఉంటేనే బట్టకాల్చి మీదేసే రోజులివి’
సాక్షి, హైదరాబాద్: ‘కోట్లాది మందిలో కేవలం కొద్ది మందికి మాత్రమే సందర్భం కలిసి వచ్చి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం వస్తుంది. అది గొప్ప విషయం కాదు. ప్రజాప్రతినిధిగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజాజీవితంలో మంచి పేరు తెచ్చుకోవడం గొప్ప విషయం. మంచిగ ఉంటేనే బట్టకాల్చి మీదేసే రోజులివి. కొద్దిగా అవకాశం ఇస్తే చాలా చెడ్డపేరు వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు కొత్తగా ఎంపికైన జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, టీఆర్ఎస్ కార్పొరేటర్లకు హితువు పలికారు. విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు నివాసముంటున్న హైదరాబాద్ నగరం అసలుసిసలైన విశ్వనగరంగా, మినీ ఇండియాగా భాసిల్లుతోందన్నారు. ఈ నగర వైభవాన్ని మరింత పెంచే విధంగా మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు పాటుపడాలని పిలుపునిచ్చారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, టీఆర్ఎస్ కార్పొరేటర్లు గురువారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించి కర్తవ్య బోధ చేశారు. విజయలక్ష్మికి నియామక పత్రాన్ని అందజేస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో డిప్యూటీ మేయర్ శ్రీలత ప్రతి ఒక్కరినీ ఆదరించాలి... ‘పదవిలో ఉన్న వారు ఎంతో సంయమనం, సహనంతో, సాదాసీదాగా ఉండాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ సహజత్వం కోల్పోవద్దు. వేష భాషల్లో మార్పులు రావద్దు. అసంబద్ధంగా, అవసరం లేని మాటలు మాట్లాడితే వచ్చే లాభమేమీ లేకపోగా కొన్ని సందర్భాల్లో వికటించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. మీ దగ్గరికి వచ్చే వాళ్ల కులం, మతం చూడవద్దు. ప్రతి ఒక్కరినీ ఆదరించాలి. అక్కున చేర్చుకోవాలి. సరైన గౌరవం ఇవ్వాలి. వారు చెప్పేది ఓపికగా వినాలి. చేతనైనంత సాయం చేయాలి. అబద్ధాలు చెప్పవద్దు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి’ అని ముఖ్యమంత్రి చెప్పారు. బస్తీ సమస్యలే ప్రధాన లక్ష్యం కావాలి.. ‘గల్లీ చిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది అనే గోరటి వెంకన్న పాట వినండి. నేను వందసార్లు విన్నా. అందులో బస్తీల్లో ఉండే పేదల కష్టాలు, గోసలున్నాయి. వాటిని అర్థం చేసుకోవాలి. మేయర్, కార్పొరేటర్లు బస్తీల్లో పర్యటించాలి. వారి బాధలు అర్థం చేసుకోవాలి. బస్తీ సమస్యలు తీర్చాలి. అదే ప్రధాన లక్ష్యం కావాలి’అని సీఎం చెప్పారు. ‘హైదరాబాద్కి అనేక అనుకూలతలున్నాయి. మంచి భవిష్యత్తు ఉన్నది. నిజమైన విశ్వనగరమిది. బయటి రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన అనేక మంది ఉన్నారు. నగరంలో సింధ్ కాలనీ ఉంది. గుజరాతి గల్లీ ఉంది. పార్సీగుట్ట ఉంది. బెంగాలీలున్నారు. మలయాళీలున్నారు. మార్వాడీలున్నారు. విభిన్న ప్రాంతాలు, మతాలు, సంస్కృ తుల వారున్నారు. వారంతా హైదరాబాదీలుగా గర్విస్తున్నారు. హైదరాబాద్ ఓ మినీ ఇండియాలాగా ఉంటుంది. అందరినీ ఆదరించే ప్రేమగల నగరం. ఇంత గొప్ప నగరం భవిష్యత్తు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లపై ఉన్నది. మీరు గొప్పగా పనిచేసి ఈ నగర వైభవాన్ని పెంచాలి. ప్రభుత్వం కూడా హైదరాబాద్ను అభివృద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలు చేపడుతుంది. వాటికి సహకరించాలి’అని సీఎం పిలుపునిచ్చారు. అందరికీ మేయర్ పదవి ఇవ్వలేము... అర్థం చేసుకోండి.. ‘ఇంత మంది కార్పొరేటర్లున్నారు. కానీ ఒక్కరికే మేయర్గా అవకాశం దక్కుతుంది. మీలో మేయర్ కావాల్సిన అర్హతలున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ అందరికీ ఇవ్వలేము. నా పరిస్థితుల్లో మీరున్నా అంతే చేయగలరు. అర్థం చేసుకుని, అందరూ కలసికట్టుగా ఈ నగరాన్ని ముందుకు తీసుకుపోవాలి’అని సీఎం కేసీఆర్ అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు, రాజ్యసభ సభ్యులు సురేశ్రెడ్డి, సంతోశ్కుమార్, మంత్రు లు తలసాని, మహమూద్ అలీ, ఇంద్రకరణ్రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ పాల్గొన్నారు. -
బాహాబాహీ: బీజేపీ కార్పొరేటర్లపై మేయర్ దూషణ
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం బుధవారం రసాభాసగా మారింది. బీజేపి, టీఆర్ఎస్ కార్పొరేటర్లు బాహాబాహీకి దిగారు. నినాదాలు, ప్రతినినాదాలు వాగ్వివాదంతో సమావేశాన్ని గందరగోళంగా మార్చారు. మేయర్ సునీల్ రావు బీజేపీ కార్పొరేటర్లను యూజ్ లెస్ ఫెలో అని దూషించడం వివాదాస్పదంగా మారింది. మేయర్ అద్యక్షతన కౌన్సిల్ సమావేశం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రారంభం కాగానే బిజేపి కార్పొరేటర్లు ఎండిపోయిన హరితహారం మొక్కలను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. హరిత హారం అక్రమాలకు నిలయంగా మారిందని, లక్షలు వెచ్చించి నాటిన మొక్కలను ఎందుకు రక్షించడంలేదని పోడియం వద్దకు దూసుకెళ్లి మేయర్ను నిలదీశారు. చదవండి: వ్యాక్సిన్కు జై కొట్టిన తెలుగు ప్రజలు దీంతో మేయర్కు అండగా నిలుస్తూ టీఆర్ఎస్ కార్పొరేటర్లు పోడియం వద్దకు వచ్చి బీజేపీ కార్పొరేటర్లతో వాగ్వివాదానికి దిగారు. నినాదాలు, ప్రతి నినాదాలతో ఒకరినొకరు తోసుకుంటూ బాహాబాహీకి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో మేయర్ సహనం కోల్పోయి బీజేపి కార్పొరేటర్ జితేందర్ను ఉద్దేశించి యూజ్ లెస్ ఫెలో అని దూషించడంతో బీజేపీ కార్పోరేటర్లు ఆగ్రహంతో ఆందోళనకు దిగారు. మేయర్ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. మేయర్ తీరును నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆధిపత్యం కోసం ఇరుపార్టీలు ప్రయత్నిస్తు ప్రజాసమస్యలను పక్కదారి పుట్టిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత సమావేశంలో సైతం ఇలానే బీజేపీ, టీఆర్ఎస్ కార్పొరేటర్ లు గొడవపడి సమావేశాన్ని రసాభాసగా మార్చారు. చదవండి: చచ్చినా ఇక్కడ నుంచి కదలను: భార్య గోడు -
నిన్ను చంపేస్తాం..
ముంబై: నగర మేయర్, శివసేన నాయకుడు కిషోరి ఫెడ్నెకర్ను చంపేస్తామని గుర్తుతెలియని దుండగులు ఆయనకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో మేయర్ ఫిర్యాదు మేరకు దుండగులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. గతేడాది డిసెంబర్ 21న తన మొబైల్కు గుర్తుతెలియని ఓ వ్యక్తి ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించాడని, ఆ వ్యక్తి హిందీలో మాట్లాడుతున్నారని ఇటీవల దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన విలేకరులతో అన్నారు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. 2019 నవంబర్లో ముంబై మేయర్గా ఫెడ్నెకర్ ఎన్నికయ్యారు. చదవండి: (కామాంధుల క్రూరత్వం: పక్కటెముకలు, కాలు విరిచి) -
21 ఏళ్లకే విజయం: దేశంలో తొలి మేయర్
తిరువనంతపురం\: వయసు కేవలం 21 సంవత్సరాలు. చదువుతున్నది బీఎస్సీ రెండో సంవత్సరం. దక్కిన పదవి కీలకమైన నగరానికి మేయర్. కేరళ రాజధాని తిరువనంతపురం మేయర్గా ఆర్య రాజేంద్రన్ అనే విద్యార్థిని పేరు ఖరారైంది. త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. దేశంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన మేయర్గా ఆర్య రాజేంద్రన్ రికార్డుల్లోకి ఎక్కనున్నారు. ప్రస్తుతం తిరువనంతపురంలోని అల్ సెయింట్స్ కాలేజీలో బీఎస్సీ మ్యాథమెటిక్స్ సెకండియర్ చదువుతున్నారు. సీపీఎం విద్యార్థి విభాగమైన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. సీపీఎం చిన్నారుల విభాగమైన బాలసంఘం కేరళ రాష్ట్ర అధ్యక్షురాలిగానూ పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువనంతపురంలోని ముడవన్ముగళ్ వార్డు కౌన్సిలర్గా సీపీఎం టికెట్పై పోటీ చేశారు. కేరళలో స్థానిక ఎన్నికల్లో పోటీకి దిగిన అత్యంత పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు. సమీప ప్రత్యర్థిపై ఘన విజయం సాధించారు. తిరువనంతపురం ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ మెజార్టీ స్థానాలు గెలుచుకుంది. దీంతో మేయర్ పీఠం ఆ పార్టీకే దక్కనుంది. అయితే, మేయర్ అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగిన ఇద్దరు సీపీఎం నేతలు ఓడిపోయారు. ఆర్య రాజేంద్రన్ పేరును సీపీఎం జిల్లా నేతలు తెరపైకి తీసుకు రాగా అగ్ర నాయకత్వం అంగీకరించింది. దీంతో ఆర్య రాజేంద్రన్ మేయర్ పదవి చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. పార్టీ అప్పగించిన బాధ్యతను ఆనందంగా స్వీకరిస్తానని ఆమె చెప్పారు. ప్రజలకు సేవ చేయడంతోపాటు తన చదువును కొనసాగిస్తానని తెలిపారు. ఆర్య తండ్రి రాజేంద్రన్ ఎలక్ట్రీషియన్, తల్లి ఎల్ఐసీ ఏజెంట్. ఇప్పటిదాకా రికార్డు తెలుగమ్మాయి పేరిటే.. దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మేయర్గా రికార్డు ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్య పేరిట ఉంది. ఆమె 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్టిక్కెట్పై పోటీ చేశారు. 26 ఏళ్ల వయసులోనే మేయర్గా ఎన్నికయ్యారు. -
మేయర్ ఎన్నిక జరిగేదిలా..
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ ఒక్కపార్టీకీ స్పష్టమైన ఆధిక్యత రాకపోవడంతో మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మేయర్ ఎన్నిక ఎలా జరుగుతుంది. ఎవరెవరు ఎన్నుకుంటారనే అంశాలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. 150 మంది కార్పొరేటర్లతో పాటు గ్రేటర్ పరిధిలోని రాజ్యసభ, లోక్సభ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉంటారు. గ్రేటర్లో 45 మంది ఎక్స్అఫీషియో సభ్యులు, 150 కార్పొరేటర్లతో కలిపి మొత్తం 195 మంది మేయర్ ఎన్నికలో ఓటర్లుగా ఉంటారు. వీరు మేయర్ను, డిప్యూటీ మేయర్ను ఎన్నుకుంటారు. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎన్నిక నిర్వహిస్తారు. జీహెచ్ఎంసీ చట్టం మేరకు విధివిధానాలు ఇలా ఉంటాయి. – సాక్షి, హైదరాబాద్ ► మేయర్ను ఎన్నుకునేందుకు కార్పొరేటర్లు, ఎక్స్అఫీషియో సభ్యులు తమకు అందిన నోటీసు(ఆహ్వానం)తో రావాల్సి ఉంటుంది. ► ఎన్నికకు కనీసం మూడు రోజుల ముందు సమాచారం పంపుతారు. ► తొలుత ఎన్నికైన పాలకమండలి సభ్యులతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం మేయర్ ఎన్నిక నిర్వహిస్తారు. ► తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీలో ప్రమాణపత్రాలు ఉంచుతారు. ► మేయర్ అభ్యర్థిత్వానికి ఒకరు పేరును ప్రతిపాదించాలి. మరొకరు బలపరచాలి. ► చెయ్యి పైకెత్తడం ద్వారా ఓటింగ్ ఉంటుంది.. ఎవరికి అనుకూలంగా ఎందరు చేతులెత్తారో లెక్కిస్తారు. ► పోలైన ఓట్లలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారిని మేయర్గా ప్రకటిస్తారు. ► ఈ తరహాలో డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా. ► తొలుత మేయర్, తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించాలి. ► ఎన్నిక నిర్వహించాలంటే ఎక్స్అఫీషియోలతో సహ మొత్తం ఓటర్లలో కనీసం 50 శాతం మంది హాజరు ఉండాలి. దీన్ని కోరంగా పరిగణిస్తారు. కోరం లేని పక్షంలో గంటసేపు వేచి చూస్తారు. అప్పటికీ లేకపోతే మర్నాటికి వాయిదా వేస్తారు. ► మర్నాడు కూడా కోరం లేకపోతే ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. అక్కడినుంచి వచ్చే సూచనలకు అనుగుణంగా కోరం లేకపోయినప్పటికీ ఎన్నిక నిర్వహిస్తారు. ► జీహెచ్ఎంసీలో ఎక్స్అఫీషియోలుగా పేర్లు నమోదు చేసు కున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకూ మేయర్ ఎన్నికలో ఓటు హక్కు ఉంటుంది. అయితే వీరు తాము మరే పురపాలికలోనూ ఓటు వేయలేదనే డిక్లరేషన్పై సంతకం చేయాలి. ► మేయర్ పదవికి పోటీ చేసేందుకు మాత్రం కార్పొరేటర్లే అర్హులు. ► గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేస్తాయి. ► ఎన్నికకు 24 గంటల ముందు పార్టీ అధ్యక్షుడు లేదా ఆయన అధీకృతంగా నియమించిన వారు విప్ జారీ చేయవచ్చు. ఈ విషయాన్ని ఎన్నికల ప్రిసైడింగ్ అధికారికి తెలియజేయాలి. ఇదిలాఉండగా.. విప్ ఉల్లంఘించిన వారు ఒకవేళ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటే, తుదితీర్పు మేరకు చర్యలుంటాయి. అప్పటివరకు వారి పదవికి ఢోకా ఉండదని సంబంధిత అధికారి తెలిపారు. -
కార్పొరేటర్ సింధుకు ప్రగతి భవన్ నుంచి పిలుపు
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కు కొత్త మహిళా మేయర్ ఎవరన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరించింది. 31 మంది ఎక్స్అఫీషియో సభ్యుల బలం గులాబీ పార్టీకి ఉన్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ 98ను అందుకోలేదు. ఈ నేపథ్యంలో ఇతరుల మద్దతు కూడగట్టుకొని మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలి. టీఆర్ఎస్ నుంచి ఎవరికి ఛాన్స్ దొరుకుతుందనేది ఆసక్తికరంగా మారింది. రేసులో పలుపేర్లు వినిపిస్తుండగా... భారతీనగర్ డివిజన్ నుంచి గెలిచిన వి.సింధును ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతిభవన్కు పిలిపించుకున్నారు. దాంతో ఆమెనే మేయర్ పీఠం వరించనుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆశావహులు చాలామందే ఉన్నారు. టీఆర్ఎస్ నాయకుడు మన్నె గోవర్థన్రెడ్డి భార్య, వెంకటేశ్వరకాలనీ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయశాంతి, ఎంపీ కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి పేర్లు ప్రముఖంగా ప్రచారంలో ఉన్నాయి. వీరంతా రెండో పర్యాయం గెలిచినవారే. వీరితోపాటు ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి పేరు కూడా వినిపిస్తోంది. ఈసారి మేయర్ సీటు జనరల్ మహిళకు రిజర్వు కావడంతో ఓసీల నుంచే అవకాశం కల్పించనున్నారని బలంగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి సింధును పిలవడం ఇందుకు ఊతమిస్తోంది. జీహెచ్ఎంసీగా అవతరించాక జరిగిన తొలి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నుంచి మహిళా మేయర్గా కార్తీకరెడ్డి బాధ్యతలు చేపట్టడం తెలిసిందే. -
హైదరాబాద్ పేరు మార్చేస్తే... బంగారం వస్తదా?
ఎంఐఎం, బీజేపీ మతపిచ్చి పార్టీలు.. హైదరాబాద్ ఈ పిచ్చోళ్ల చేతిలో రాయి కావొద్దు. అగ్గి పెట్టడం సులభం, కానీ ఆర్పేదెవరు? విషయం లేనప్పుడు విషం నింపడమే పని. సబ్జెక్ట్ లేకుండా మాట్లాడి మమ్మల్ని విలన్గా చూపాలనే బీజేపీ ప్రయత్నం. -కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారిస్తే ఏమొస్తుంది? ఇంటింటికీ బంగారం ఏమైనా వస్తదా? పేర్లు మార్చడం కాదు.. పురోగతి కావాలి. నగర రూపురేఖలు మార్చాలి. పనితీరు మారాలి’అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఆరేళ్లలో హైదరాబాద్ అభివృద్ధికి చేసిన పనులను ప్రజల ముందు పెట్టాం. అభివృద్ధిని కొనసాగించేందుకు మరోమారు ఓటు వేయమని కోరాం. ఎక్స్అఫీషియో ఓట్ల అవసరం లేకుండా... టీఆర్ఎస్ కార్పొరేటర్ల మెజారిటీతోనే మేయర్ పీఠాన్ని దక్కించుకుం టుంది. ప్రస్తుత గ్రేటర్ ఎన్నికల్లో వందకు పైగా డివిజన్లలో కాస్త అటూఇటుగా ఫలితం సాధిస్తాం. బీజేపీకి దేశ ప్రధాని పదవి అప్పగిస్తేనే మార్పు సాధ్యం కాలేదు. గ్రేటర్ మేయర్ పదవి ఇస్తే ఏం మారుస్తారు. ఇలాంటి వారితో కొట్లాడటం మా దౌర్భాగ్యం’ అని కేటీఆర్ అన్నారు. ఆదివారం మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో కేటీఆర్ ఇంకా ఏమన్నారంటే.. ఎంఐఎంతో పొత్తు లేదు తెలంగాణలో బీజేపీ పోటీ చేయడం కొత్తేమీ కాదు. గతంలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ఆరు లోక్సభ స్థానాల్లో గెలిచింది. అడపాదడపా బీజేపీ కొన్ని చోట్ల గెలుస్తున్నా స్థిరంగా ఫలితాలు సాధించడం లేదు. గ్రేటర్ ఎన్నికల్లో హిందుత్వ ఎజెండాను బలంగా చొప్పించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను హైదరాబాద్ ప్రజలు తిరస్కరిస్తారని గట్టిగా నమ్ముతున్నాం. గతంలో కేంద్రంలో బీజేపీకి పలు సందర్భాల్లో అంశాల వారీగా మేము మద్దతు ఇచ్చినట్లుగానే రాష్ట్రంలో ఎంఐఎం మాకు మద్దతు పలికింది. ఎంఐఎంతో మాకు ఎన్నికల పొత్తు లేదు. మాది సంకీర్ణ ప్రభుత్వం కాదు. ఆదివారం గోషామహల్ నియోజకవర్గంలోని జుమ్మేరాత్ బజార్లో కేటీఆర్ రోడ్ షో మతాన్ని బూచిగా చూపొద్దు 132 కోట్ల దేశ జనాభాలోని 30 కోట్ల ముస్లింలను బూచిగా చూపుతూ పిల్లల్లో మతపరంగా విషం నింపడం దేశానికి మంచిది కాదు. ఎంఐఎంపై బీజేపీ పోటీ చేస్తే మేము వద్దంటున్నామా. మేము కూడా చాలా డివిజన్లలో ఎంఐఎంతో పోటీ పడుతున్నాం. గ్రేటర్ ఎన్నికల్లో బిన్లాడెన్, అక్బర్, బాబర్ ప్రస్తావన ఎందుకు. వారేమైనా హైదరాబాద్ ఓటర్లా? బండి సంజయ్, ఒవైసీ లేదా టీఆర్ఎస్ లీడర్లు ఎవరైనా మతకలహాలు, ఘర్షణలు సృష్టిస్తే ఊచలు లెక్కపెట్టిస్తాం. నగరంలో పెట్టుబడులు, ఉపాధికి అడ్డువచ్చే వారిని ఉపేక్షించేది లేదు. ఎన్నికలొస్తేనే వ్యాక్సిన్ గుర్తుకొస్తదా? ప్రధాని మోదీ నగర పర్యటన ప్రపంచ వాక్సిన్ హబ్ హైదరాబాద్ అనే అంశాన్ని తేటతెల్లం చేసింది. బీహర్, గ్రేటర్ ఎన్నికలు వస్తేనే వాళ్లకు వాక్సిన్ గుర్తుకు వస్తుంది. ఆరేండ్లలో ప్రధాని రాష్ట్రానికి రెండుసార్లు వచ్చారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు ప్రధాని రావడాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు. బండి సంజయ్వి పగటి కలలు గ్రేటర్ ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రద్దవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదం. మధ్యంతర ఎన్నికలకు మేము సిద్దం. మోదీని రద్దు చేయమనండి. ప్రభుత్వం కూలిపోతుందని బండి సంజయ్ పగటి కలలు కంటున్నారు. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారిస్తే ఇంటింటికీ బంగారం వస్తుందా? గతంలో మద్రాస్, అలహాబాద్, ఫైజాబాద్ పేర్లు మార్చితే ఏం ఒనగూరింది. మారాల్సింది పేర్లు కాదు.. పనితీరు. యోగి ఆదిత్యనాథ్ నుంచి తెలుసుకునే స్థితిలో మేము లేము. పిచ్చొళ్ల చేతిలో రాయి కానివ్వొద్దు... ‘ఆవుకథ’తరహాలో ‘హిందూ, ముస్లిం, పాకిస్తాన్’మినహా బీజేపీకి వేరే అంశాలు ఉండవు. ఎంఐఎం, బీజేపీలు మతపిచ్చి పార్టీలు... హైదరాబాద్ ఈ పిచ్చోళ్ల చేతిలో రాయి కావొద్దు. అగ్గి పెట్టడం సులభం, కానీ ఆర్పేదెవరు? విషయం లేనప్పుడు విషం నింపడమే పని. సబ్జెక్ట్ లేకుండా మాట్లాడి మమ్మల్ని విలన్గా చూపాలనే బీజేపీ ప్రయత్నం హైదరాబాద్లో ఫలితాన్ని ఇవ్వదు. ఒకరు సమాధులు కూలగొడుతామంటే ఇంకొకరు మరేదో కూలగొడతామంటారు. కూల్చే వాళ్లు కావాలా.. నిర్మించే వాళ్లు కావాలా? దేశ ఖజానాకు నిధులు సమకూర్చుతున్నాం కేంద్రానికి రాష్ట్రం నుంచి చెల్లించిన నిధులన్నీ తిరిగి రావాలని కోరుకోవడం లేదు. తెలంగాణ దేశానికి నిధులు సమకూర్చడాన్ని గర్వకారణంగా భావిస్తున్నాం. యోగి లాంటి వారు కనీసం తెలంగాణకు కృతజ్ఞతలు అయినా చెప్పాలి. బీజేపీకి మేము కూడా మిత్రులమే. రాజకీయాల్లో శత్రువులు ఉండరు. ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు. దేశ ప్రయోజనాల కోసం రేపు బీజేపీకి సహరించాల్సి వస్తే... సిద్దాంతపరంగా ఏకీభవిస్తే మద్దతు ఇస్తాం. గ్రేటర్ ఎన్నికల తర్వాత మా పార్టీ జాతీయ రాజకీయాలకు సంబంధించిన కార్యాచరణను మీరే చూస్తారు. వ్యవస్థలను గౌరవించాలి కదా... ప్రధాని హోదాను తగ్గించడం మాకు ఇష్టం లేదు. రాజకీయ ఉద్దేశంతోనే ఆయన హైదరాబాద్ పర్యటనకు వచ్చారనే విషయం ప్రజలకు తెలుసు. ఎక్కడైనా రాష్ట్రాల్లో కొన్ని మర్యాదలు ఉంటాయి. పాటిస్తే వ్యవస్థకు మంచిది. ఎన్నికల్లో మేము తీరికలేకుండా ఉన్నా ఆయనకు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యాం. ప్రధాని, ముఖ్యమంత్రి వ్యక్తులు కాదు.. వ్యవస్థ. దాని గౌరవాన్ని పెంచాలి. బీజేపీలో వారసులు లేరా? కుటుంబ రాజకీయాలకు బీజేపీలోనే... రాజ్నాథ్సింగ్, యడియూరప్ప, వసుంధరాజే, మనేకా వంటి ఎందరో ఉదాహరణలుగా ఉన్నారు. తమ అసమర్థత దాచుకునేందుకు ఇలాంటి అంశాలను బీజేపీ మాట్లాడుతూ ఉంటుంది. నేను సిరిసిల్ల నుంచి ప్రజాస్వామ్యబద్దంగా ప్రతీసారి మెజారిటీ పెంచుకుంటూ విజయం సాధించా. ప్రజలకు ఇష్టం లేకుంటే మమ్మల్ని ఇంటికి పంపుతారు. కాంగ్రెస్ క్షీణదశలో ఉంది కాంగ్రెస్ పార్టీ గురించి ఆ పార్టీ నేతలే చెప్పుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ దానంతట అదే క్షీణిస్తోంది. ఆ స్థానంలోకి ఎవరు వస్తారో కాంగ్రెస్కు సంబంధించిన తలనొప్పి. ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ.. ఇలా ఎవరితోనో ఒకరితో మేము కొట్లాడాలి. రోజూ ఒకరితోనే కొట్లాడితే మజా ఏం ఉంటుంది. హైదరాబాద్ మేలుకోరి ఓటేయండి టీఆర్ఎస్ కార్పోరేటర్ల మీద అక్కడక్కడ అసంతృప్తి ఉన్నా హైదరాబాద్, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఈసారి ఓటేయండి. కార్పోరేటర్లకు శిక్షణ, ప్రజల భాగస్వా్మ్యం, వార్డు కమిటీల ద్వారా కార్పోరేటర్ల వ్యవస్థను గాడిలో పెడతాం. ఈసారి పోలింగ్ శాతం ఎలా ఉన్నా ప్రజల మద్దతు మాకు ఉంటుంది. అందరూ ఓటింగ్లో పాల్గొనండి. అందరికీ వ్యాక్సిన్... ఏడాదిన్నర పట్టొచ్చు వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిన పడుతుంది. కోవిడ్ వాక్సిన్ అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు మరో ఏడాదిన్నర పట్టొచ్చు. -
ప్రజలు మా వైపే
మేము ఏ ఎన్నికనూ చిన్నదిగా చూడం. మేము హైదరాబాద్కు సీఎంను కొట్టడానికి రాలేదు. మేము చేసింది, చేయబోయేది చెప్పడానికి, ఎన్నికల్లో పోరాడటానికే వచ్చాం. ఓట్లు, సీట్ల కోసం ఈ పోటీ కాదు.. మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకే.. -అమిత్ షా సాక్షి, హైదరాబాద్: చీకటి పొత్తులు ఎందుకని, టీఆర్ఎస్కు దమ్ముంటే ఎంఐఎంతో బహిరంగంగా పొత్తుపెట్టుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. మజ్లిస్– టీఆర్ఎస్లు పొత్తు పెట్టుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని, అదేదో బాహాటంగా చేయాలని... లోపాయికారీ వ్యవహారాలెందుకని నిలదీశారు. మజ్లిస్, టీఆర్ఎస్ల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల వల్లే హైదరాబాద్లో వరదలు వచ్చాయని, 7 లక్షల మంది ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. సీఎం నివాసం పరిసర ప్రాంతాల్లోని కాలనీలు కూడా మునిగిపోయాయన్నారు. బీజేపీ గెలిస్తే అక్రమ నిర్మాణాలన్నింటినీ తొలగిస్తామని, వరదల్లేని హైదరాబాద్గా చేస్తామన్నారు. వరదల సమయంలో కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ ఐటీ హబ్కు మౌలిక సదుపాయాలు కల్పించాల్సింది గ్రేటర్ మున్సిపల్ కార్పొరేçషన్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే సమగ్ర వసతులు కల్పించి హైదరాబాద్ను ప్రపంచస్థాయి ఐటీ హబ్గా తీర్చిదిద్దుతామని అమిత్షా తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆదివారం హైదరాబాద్కు వచ్చిన ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నగరంలో సిటిజన్ ఛార్టర్ అమలు ఏమైందన్నారు. రోహింగ్యాల విషయంలో అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంటులో ఏం మాట్లాడారో అంతా చూశారని, అక్కడ అడ్డుపడుతూ ఇక్కడ రాజకీయం చేస్తున్నారన్నారు. చిత్తశుద్ధి ఉంటే రోహింగ్యాలపై చర్యలు చేపట్టాలని రాతపూర్వకంగా ఇవ్వాలని, అప్పుడు తామేం చేస్తామో చేసి చూపిస్తామన్నారు. హైదరాబాద్ను పాకిస్తాన్లో కలపాలని ఎవరు చూశారో అసద్ చెప్పాలన్నారు. తాము గెలిస్తే నిజాం సంస్కృతి నుంచి హైదరాబాద్కు విముక్తి కల్పిస్తామని, నయా హైదరాబాద్గా తీర్చిదిద్దుతామన్నారు. ప్రజలు ఓట్లు వేసి బీజేపీని గెలిపించాలని కోరారు. వంద రోజుల ప్రణాళిక ఏమైంది... తాము ఏ ఎన్నికను చిన్నదిగా చూడమని, ఎన్నికలంటే ఎన్నికలేనన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు చిన్నవి కానేకాదన్నారు. తాము హైదరాబాద్కు సీఎంను కొట్టడానికి రాలేదని, సీఎం కేసీఆర్ 100 ఏళ్లు ఉండాలని కోరుకుంటున్నామన్నారు. తాము చేసింది, చేయబోయేది చెప్పడానికి, ఎన్నికల్లో పోరాడటానికే వచ్చామన్నారు. ఓట్లు, సీట్ల కోసం ఈ పోటీ కాదని, మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకేనన్నారు. రోడ్షోలో ప్రజాస్పందన చూస్తుంటే మేయర్ పీఠం బీజేపీదేనన్నది స్పష్టమైందన్నారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కేసీఆర్చెప్పిన వంద రోజుల ప్రణాళిక ఏమైందన్నారు. ఐదేళ్లలో ఎందుకు చేయలేదన్నారు. ఫామ్హౌస్ నుంచి బయటకు ఎందుకు రావడం లేదన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఏవి? హైదరాబాద్కు 1.35 లక్షల ఇళ్లను మోదీ ఇస్తే అందులో 1,100 కూడా కట్టలేదన్నారు. సీఎం చెప్పిన డబుల్ బెడ్రూం ఇళ్లు ఏమయ్యాయన్నారు. నగర పరిసరాల్లో రూ.10 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పిన 15 డంప్యార్డులు ఏమయ్యాయని ప్రశ్నించారు. మూసీ చుట్టూ ఆరు లేన్ల రోడ్లు ఎక్కడున్నాయని, హుస్సేన్సాగర్ ప్రక్షాళన ఏమైందన్నారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులపై భారం తగ్గించేందుకు నగరానికి నలువైపులా నిర్మిస్తామన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఎక్కడున్నాయని అడిగారు. తాము హైదరాబాద్కు ఈఎస్ఐ, ఎయిమ్స్ ఆసుపత్రులను ఇచ్చామన్నారు. కేసీఆర్ తన రాజకీయ కారణాలతోనే పేదలకు రూ.5 లక్షల విలువైన వైద్యం అందే ఆయుష్మాన్ భారత్ను తెలంగాణలో అమలు చేయడం లేదన్నారు. కేంద్రం రాష్ట్రానికి బయో డైవర్సిటీ రీసెర్చ్ సెంటర్ ఇచ్చిందన్నారు. జాతీయ రహదారులు నిర్మించామన్నారు. మెట్రో ఇచ్చామని, దానిని మోదీ ప్రారంభించారన్నారు. 40,800 మందికి ముద్ర రుణాలను ఇచ్చామన్నారు. ఆదివారం సికింద్రాబాద్లోని నామాలగుండు వద్ద అమిత్ షా రోడ్ షో 3 లక్షల మంది వీధివ్యాపారులకు రుణాలు కరోనా కష్టకాలంలో వీధి వ్యాపారులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ యోజన కింద ఒక్క తెలంగాణలోనే 3 లక్షల మందికి రుణాలు ఇచ్చామని, అందులో జీహెచ్ఎంసీలోనే 30 వేల మందికి ఇచ్చామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్న సమయంలోనూ మోదీ విధానాల వల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐలు) వచ్చాయని, అందులో హైదరాబాద్కూ వచ్చాయన్నారు. తద్వారా ఐటీ సెక్టార్ అభివృద్ధిలో ఉందని, ఉద్యోగులకు వర్క్ ఫ్రం ఎనీవేర్ కల్పించి హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగులకు ప్రయోజనం కల్పించామన్నారు. తాము గెలిస్తే జీహెచ్ఎంసీలో పారదర్శకతో కూడిన సుపరిపాలనను అందిస్తామని, కుటుంబపాలన నుంచి అభివృద్ధి వైపు తీసుకెళ్తామన్నారు. తాము చెప్పిందే చేస్తామని, తమకు అవకాశం ఇస్తే హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉంటామన్నారు. కేసీఆర్కు ఆయన, ఆయన కుటుంబం మినహా మరెవరూ పట్టరని, తాము అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామన్నారు. సచివాలయానికి వెళితే కదా... కేంద్రం ఏమిచ్చిందో తెలిసేది జీహెచ్ఎంసీలో అవినీతి తగ్గితే బడ్జెట్ పెరుగుతుందన్నారు. కేంద్రం ఏం ఇచ్చిందని మాట్లాడే ముందు సీఎం ఫామ్హౌస్ను వదిలి బయటకురావాలని, రెగ్యులర్గా సెక్రటేరియట్కు వెళితే కేంద్రం ఏం ఇచ్చిందో తెలుస్తుందన్నారు. వరదసహాయం కింద రూ. 500 కోట్లు ఇచ్చామన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష స్థానానికి చేరుకున్నామని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం తమకు వస్తుందన్నారు. కేసీఆర్ విధానాలే తమకు లాభిస్తాయన్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని విమానం అద్దెకు తీసుకొని 16 రాష్ట్రాల్లో కేసీఆర్ తిరిగారని, చివరకు ఆయనకే సీట్లు తగ్గిపోయాయన్నారు. పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీది ఇదే పరిస్థితి అన్నారు. ప్రజాస్వామ్యంలో అందరికి తిరిగే హక్కు ఉంటుందని, కేసీఆర్ తిరిగితే తిరుగనివ్వండి అని పేర్కొన్నారు. వ్యవసాయ బిల్లులు రైతులకు మేలు చేసేవేనని, వాటిపై అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. తాము రైతులను గౌరవిస్తామన్నారు. కేసీఆర్లా రాజకీయం చేయమన్నారు. మతకలహాలపై మాట్లాడుతూ... బీజేపీ దేశంలో అనేక రాష్ట్రాల్లో, నగరాల్లో అధికారంలో ఉందని, అక్కడ శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో విమర్శలు చేసిన వారే సమాధానం చెపాలన్నారు. ఫోన్ ట్యాపింగ్పై ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామన్నారు. తాను భాగ్యలక్ష్మి దేవాలయానికి అమ్మవారి దర్శనానికి మాత్రమే వెళ్లానన్నారు. ఈ విలేకరుల సమావేశంలో అమిత్షాతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జీహెచ్ఎంసీ ఎన్నికల ఇన్ఛార్జి భూపేంద్రయాదవ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. -
గ్రేటర్ బరి: మేయర్ పీఠంపై మహిళ గురి
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో రాజకీయ పార్టీల అగ్రనేతలు, అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించారు. గ్రేటర్ పీఠాన్ని మరోమారు దక్కించుకుంటామనే ధీమాతో ఉన్న టీఆర్ఎస్.. అభ్యర్థుల ఖరారు మొదలుకుని, సమన్వయం, ప్రచారం తదితర అంశాల్లో ఇతర పార్టీల కంటే ముందంజలో ఉంది. ప్రస్తుత ఎన్నికల్లో డివిజన్ స్థాయి రిజర్వేషన్లలో ఎలాంటి మార్పులు లేనప్పటికీ గ్రేటర్ మేయర్ పీఠాన్ని మాత్రం జనరల్ మహిళా కేటగిరీకి రిజర్వు చేశారు. దీంతో డివిజన్ స్థాయిలో విజయం సాధించి, గ్రేటర్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు టీఆర్ఎస్లో సుమారు డజను మంది మహిళా నేతలు ఆసక్తి చూపుతున్నారు. అయితే పార్టీలో పలువురు నాయకుల వారసులు మేయర్ పీఠాన్ని ఆశిస్తున్నా.. సామాజికవర్గ సమీకరణలు, విధేయత, సమర్థత ఆధారంగా ఎంపిక జరుగుతుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. శివారు డివిజన్లకే అవకాశం? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 150 డివిజన్లు.. 24 శాసనసభ స్థానాల పరిధిలో విస్తరించి ఉన్నాయి. ఇందులో 84 డివిజన్లు శివారు నియోజకవర్గాల పరిధిలో ఉండగా, 66 డివిజన్లు పాత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ పరిధిలో ఉన్నాయి. 2016 గ్రేటర్ ఎన్నికల్లో శివారు డివిజన్ చర్లపల్లి నుంచి గెలుపొందిన బొంతు రామ్మోహన్కు మేయర్ పీఠం దక్కింది. ఈసారి కూడా నగరం వెలుపల ఉన్న డివిజన్ల వారికే మేయర్ పదవి దక్కుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ కోర్ సిటీ నుంచి ఎన్నికైన వారికి మేయర్ పదవి దక్కితే శివారు డివిజన్ల నుంచి డిప్యూటీ మేయర్ను ఎంపిక చేసే అవకాశం ఉంది. వారసుల పోటాపోటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సీనియర్ రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులు కార్పొరేటర్ సీట్లను ఆశించినా కొందరికే అవకాశం దక్కింది. మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, మల్లారెడ్డి, సబితారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ కుటుంబ సభ్యులు టికెట్లు ఆశించినట్లు ప్రచారం జరిగినా అభ్యర్థుల జాబితాలో చోటు దక్కలేదు. కానీ ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ల కుటుంబాలకు చెందిన సుమారు అరడజను మందికి కార్పొరేటర్లుగా టికెట్ దక్కడంతో వారు మేయర్ పీఠాన్ని ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుత మేయర్ రామ్మోహన్ భార్య శ్రీదేవితో పాటు ఎంపీ కె.కేశవరావు, ఎమ్మెల్యేలు బేతి సుభాష్రెడ్డి, సాయన్న, దివంగత నేతలు పి.జనార్ధన్రెడ్డి, చింతల కనకారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తదితరుల కుటుంబ సభ్యులు కార్పొరేటర్ అభ్యర్థులుగా టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగారు. సామాజిక సమీకరణాలు.. విధేయత గ్రేటర్ పీఠం జనరల్ మహిళకు కేటాయించిన నేపథ్యంలో ఓసీ సామాజికవర్గానికి చెందిన పలువురు అభ్యర్థులు మేయర్ పదవిని ఆశిస్తున్నారు. టికెట్ల కేటాయింపులో రెడ్డి సామాజికవర్గానికి ఏకంగా 31 డివిజన్లు కేటాయించగా, ఇందులో సగానికి పైగా మహిళలు ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ సామాజికవర్గానికి అవకాశం వస్తుందని పార్టీలో అంతర్గతంగా లెక్కలు వేస్తున్నారు. అయితే రాజకీయ వారసులు కాకుండా పార్టీ నాయకత్వం పట్ల విధేయులుగా ఉండే వారికే మేయర్ పీఠం దక్కే సూచనలు ఉన్నాయని కొందరు నేతలు అంటున్నారు. టీఆర్ఎస్లో ‘మేయర్’ ఔత్సాహికులు ►బంజారాహిల్స్ డివిజన్ నుంచి వరుసగా రెండోసారి పోటీ చేస్తున్న ఎంపీ కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి, ఖైరతాబాద్ డివిజన్ నుంచి బరిలో ఉన్న దివంగత పి.జనార్ధన్రెడ్డి కుమార్తె విజయారెడ్డి ఔత్సాహికుల జాబితాలో ఉన్నట్టు చెబుతున్నారు. ►ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ భార్య బొంతు శ్రీదేవి (చర్లపల్లి), ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి భార్య బేతి స్వప్నారెడ్డి (హబ్సిగూడ), కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత (కవాడిగూడ) కూడా మేయర్ రేసులో ఉన్నట్లు సమాచారం. ►మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు సుసరితారెడ్డి (మూసారాంబాగ్), మరో మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయశాంతి (అల్వాల్) ఔత్సాహికుల జాబితాలో ఉన్నారు. ►రెండు పర్యాయాలు ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రామ్మోహన్గౌడ్ భార్య ముద్దగోని లక్ష్మీప్రసన్నగౌడ్ (బీఎన్రెడ్డి), టీఆర్ఎస్ కార్మిక విభాగం నేత మోతె శోభన్రెడ్డి భార్య శ్రీలత (తార్నాక) కూడా మేయర్ పీఠాన్ని ఆశిస్తున్నట్లు తెలిసింది. ►రాజకీయ వారసత్వాన్ని పక్కన పెట్టే పక్షంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సన్నిహితుడు దుర్గాప్రసాద్రెడ్డి భార్య పద్మావతిరెడ్డి, ప్రస్తుత హఫీజ్పేట్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్గౌడ్, సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ పేర్లు కూడా తెరమీదకు వచ్చే అవకాశముందని అంటున్నారు. -
అమెరికా ఎన్నికలు: మేయర్గా ఎన్నికైన కుక్క..
వాషింగ్టన్: అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇంకా పూర్తిగా వెలువడలేదు. కానీ ఓ చిన్న పట్టణం మాత్రం విల్బర్ బీస్ట్ అనే కుక్కను తన మేయర్గా ఎన్నుకుంది. ఫాక్స్ న్యూస్ ప్రకారం, కెంటకీలోని రాబిట్ హాష్ అనే ఓ చిన్న పట్టణం ఫ్రెంచ్ బుల్డాగ్ను తమ కొత్త నాయకుడిగా ఎన్నుకుంది. ఇక మేయర్గా ఎన్నికైన విల్బర్ బీస్ట్ ఈ ఎన్నికల్లో 13,143 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు రాబిట్ హాష్ హిస్టారికల్ సొసైటీ తెలిపింది. "రాబిట్ హాష్లో మేయర్ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. మొత్తం 22, 985 ఓట్లు పోలవ్వగా.. విల్బర్ 13,143 ఓట్లతో (అత్యధికంగా గెలిచిన మొత్తం)మేయర్గా గెలుపొందింది" అంటూ రాబిట్ హాష్ హిస్టారికల్ సొసైటీ బుధవారం ఫేస్బుక్లో ప్రకటించింది. జాక్ రాబిట్ బీగల్, గోల్డెన్ రిట్రీవర్ అనే రెండు కుక్కలు వరుసగా రెండవ, మూడవ స్థానంలో నిలిచాయి. లేడీ స్టోన్, 12 ఏళ్ల బార్డర్ కోలీ అనే కుక్క, పట్టణానికి రాయబారిగా తన స్థానాన్ని నిలుపుకుంది. కెంటకీ.కామ్ ప్రకారం, ఒహియో నది వెంబడి ఉన్న ఒక ఇన్కార్పొరేటెడ్ కమ్యూనిటీ అయిన రాబిట్ హాష్, 1990 ల నుంచి కుక్కను దాని మేయర్గా ఎన్నుకుంటుంది. కమ్యూనిటీ నివాసితులు హిస్టారికల్ సొసైటీకి $ 1 విరాళం ఇవ్వడం ద్వారా ఓటు వేస్తారు. ఇక మేయర్గా ఎన్నికైన విల్బర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, రాబిట్ హాష్ హిస్టారికల్ సొసైటీ, ఇతర స్వచ్ఛంద సంస్థల కోసం డబ్బును సేకరించడంలో సహాయపడుతుంది. విల్బర్ ప్రతినిధి అమీ నోలాండ్ అనే వ్యక్తి ఫాక్స్ న్యూస్తో మాట్లాడుతూ.. ‘స్థానికంగా, ప్రపంచవ్యాప్తంగా తనకు మద్దతు తెలుపుతూ.. నమ్మకంతో ఓటు వేసిన అందరికి పూచ్ కృతజ్ఞతలు తెలిపారు’ అన్నారు. (యూఎస్ ఎలక్షన్స్: చరిత్ర సృష్టించిన నల్లజాతి గే) "కెంటకీలోని నది కుగ్రామ పట్టణమైన రాబిట్ హాష్ను సంరక్షించడానికి ఇది చాలా అర్ధవంతమైన కారణం, ఉత్తేజకరమైన సాహసం" అని వ్రాతపూర్వక ప్రకటనలో తెలిపారు. అలానే ‘ఈ పట్టణం సందర్శకులకు స్వాగతం పలుకుతుంది. అన్ని వయసుల వారికి మేం సంతోషాన్ని కలిగించే కార్యక్రమాలను నిర్వహిస్తాం. ఈ పట్టణాన్ని సందర్శించి గొప్ప అనుభూతులను సొంతం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం’ అని అమీ నోలాండ్ తెలిపారు. -
ఎంపీ గారూ.. రూ.7 వేల కోట్లు ఎక్కడ?
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ ఎంపీ గారూ.. కరోనా కట్టడికి కేంద్రం నుంచి రూ.7 వేల కోట్లు వచ్చాయని చెబుతున్నారు అవెక్కడ ఉన్నాయో చూపించాలని మేయర్ వై.సునీల్రావు డిమాండ్ చేశారు. మంగళవారం ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం ఇచ్చిన నిధులు దుర్వినియోగం చేశారని ఎంపీ బండి సంజయ్కుమార్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంటులో స్వయంగా కేంద్ర మంత్రి తెలంగాణకు రూ.290 కోట్లు కేటాయించామని వెల్లడించారన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ యువతను రెచ్చగొడుతూ రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. గత ఎన్నికల్లో ఆసరా పెన్షన్ల విషయంలో కేంద్రం రూ.800 ఇస్తోందని తప్పుడు ప్రచారం చేసి, ఓట్లు దండుకున్నాడని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ది మీరేనని, గెలిచిన నాటి నుంచి ఇప్పటివరకు దేశంలో ఏం అభివృద్ధి చేశారో, ఎన్ని నిధులు ఇచ్చారో వెల్లడించాలని, అవసరమైతే బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. మాజీ ఎంపీ వినోద్కుమార్ చొరవతోనే స్మార్ట్సిటీతో పాటు జాతీయ రహదారులు వంటి ఎన్నో పనులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ఏడాదిన్నర కాలంలో ఎంపీ కోటా నిధులు తప్ప ప్రత్యేకంగా నిధులు తీసుకురావడంలో, అభివృద్ధి పనులు చేపట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ, విద్యుత్ బిల్లులు పేద ప్రజలకు, రైతాంగానికి గుదిబండగా మారనున్నాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో బీజేపీపై పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు గందె మాధవి, కాశెట్టి లావణ్య, బండారి వేణు, ఐలేందర్ యాదవ్, చాడగొండ బుచ్చిరెడ్డి, తోట రాములు, గుగ్గిళ్ల జయశ్రీ, గంట కల్యాణి, నాంపెల్లి శ్రీనివాస్, తాడెపు శ్రీదేవి, నేతికుంట యాదయ్య, కుర్ర తిరుపతి తదితరులు పాల్గొన్నారు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ‘బండి’ చొప్పదండి: ఎంపీ బండి సంజయ్కుమార్ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. కరోనా నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.200 కోట్లు ఇచ్చామని పార్లమెంట్లో కేంద్ర మంత్రి ప్రకటిస్తే, రూ.7వేల కోట్లు ఇచ్చారని ఎంపీ పేర్కొనడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. చొప్పదండిలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిధుల మంజూరుపై జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఎంపీగా గెలిచి, కరీంనగర్కు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. జీఎస్టీ బకాయిలు రాష్ట్రానికి ఇప్పించి, నిజమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అనిపించుకోవాలని సూచించారు. ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, ఏఎంసీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘నిరూపిస్తే.. రాష్ట్రం విడిచి వెళ్లిపోతాను’
లక్నో: బీజేపీ మాజీ మేయర్ ఒకరు ముస్లిం యువతుల మతం మార్చి.. వారికి హిందూ యువకులతో వివాహం జరిపిస్తున్నారని ఒక ముస్లిం యువతి ఆరోపించింది. ఈ మేరకు ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన యువతి అలీగఢ్ బీజేపీ మాజీ మేయర్ శకుంతల భారతిపై సంచలన ఆరోపణలు చేసింది. మాజీ మేయర్ తన సోదరిపై ఒత్తిడి తెచ్చి.. మతం మార్చి హిందూ యువకుడితో వివాహం చేశారని ఆరోపించింది. వివరాలు.. అలీగఢ్కు చెందిన ఓ ముస్లిం యువతి ఈ నెల 7న ఇంటి నుంచి వెళ్లిపోయింది. దాంతో ఆమె కుటుంబ సభ్యులు ఓ హిందూ యువకుడి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ సోదరి ఇంట్లో నుంచి బంగారు నగలు, డబ్బు తీసుకుని ఓ హిందూ యువకుడితో పరారయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు యువతి కోసం గాలించడం ప్రారంభించారు. (వాజ్పేయితో ఉన్న వీడియోను షేర్ చేసిన మోదీ) ఈ లోపు యువతి కుటుంబ సభ్యులు బీజేపీ మాజీ మేయర్ శకుంతల భారతి ముస్లిం యువతుల మతం మార్చి.. వారిని హిందూ యువకులకు ఇచ్చి వివాహం చేస్తున్నారని ఆరోపించారు. దానిలో భాగంగానే తన సోదరికి హిందూ యువకుడితో వివాహం చేసిందని తెలిపారు. పోలీసులు ఇంటి నుంచి వెళ్లి పోయిన యువతిని గుర్తించి.. పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. సదరు యువతి తన ఇష్ట ప్రకారమే ఇంటి నుంచి వెళ్లి పోయి.. హిందూ యువకుడిని వివాహం చేసుకున్నట్లు పోలీసులకు తెలిపింది. తాను మేజర్నని.. వివాహం విషయంలో ఎవరి బలవంతం లేదని పేర్కొంది. ఆర్యసమాజంలో వివాహం చేసుకున్నట్లు తెలిపింది. తన సోదరి అసత్య ఆరోపణలు చేస్తుందని వెల్లడించింది. ఇందులో మాజీ మేయర్కు ఎలాంటి సంబంధం లేదంది. తాను హిందూ యువకుడిని వివాహం చేసుకోవడం తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేదన్నది. అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అని సదరు యువతి పోలీసులకు తెలిపింది. ఈ ఆరోపణలపై శకుంతల భారతి స్పందించారు. ‘సదరు యువతి వివాహం గురించి నాకు ఏం తెలియదు. అనవసరంగా నా మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు. అధికారులు దీని గురించి పూర్తిగా దర్యాప్తు చేసి వాస్తవాలను వెల్లడించాలి. వారు చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే.. నేను రాష్ట్రం విడిచి వెళ్లి పోతాను’ అన్నారు. -
‘వాసన రావడం లేదా.. అయితే కరోనానే’
బెంగళూరు: మాల్స్కు వెళ్లి షాపింగ్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఒకసారి మీ ముక్కు సరిగా పని చేస్తుంది లేనిది చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక మీదట బెంగళూరులో షాపింగ్ మాల్స్లోకి వచ్చే వారికి టెంపరేచర్తో పాటు స్మెల్ టెస్ట్ కూడా చేయాలని నగర మేయర్ గౌతమ్ కుమార్ సూచించారు. ఎవరైనా వాసనను గుర్తించలేకపోతే.. వారికి కరోనా సోకినట్లే అంటున్నారు గౌతమ్ కుమార్. ఈ క్రమంలో మంగళవారం మేయర్ మాట్లాడుతూ.. ‘మాల్స్లోకి వచ్చే వారు ఎవరైనా స్మెల్ టెస్ట్లో ఫెయిలయితే.. వారిని లోనికి అనుమతించకండి. ఎందుకంటే కరోనా సోకిన వారు రుచి, వాసన గుర్తించలేరు. దీని గురించి కర్ణాటక ముఖ్యమంత్రికి, ఆరోగ్యశాఖ మంత్రి లేఖ రాస్తాను. మాల్స్లో స్మెల్ టెస్ట్లు చేయడం తప్పని సరి చేస్తూ ఆదేశించాల్సిందిగా లేఖలో కోరతాను’ అన్నారు గౌతమ్ కుమార్. (వైద్యుడి కుటుంబాన్ని వెంటాడిన కరోనా) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించిన దాని ప్రకారం కరోనా రోగుల్లో జ్వరం, గొంతు నొప్పి వంటి సాధారణ లక్షణాలతో పాటు వాసన, రుచి కోల్పోవడం వంటి వాటితో కూడా బాధపడుతున్నట్లు వెల్లడించింది. కానీ ఇంతవరకు ఒక్క కరోనా రోగిలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపించలేదని సమాచారం. అయితే రుచి, వాసన కోల్పోటం అనే లక్షణాలు కరోనాలో మాత్రమే కాక ఫ్లూ, ఇన్ఫ్లూఎంజా ఉన్నప్పుడు కనిపిస్తాయంటున్నారు వైద్యులు. వ్యాధి ప్రారంభ దశలో ఈ లక్షణాలు కన్పిస్తాయని వీటిని గుర్తించిన వెంటనే చికిత్స అందించవచ్చని వైద్యులు తెలిపారు.ఆకస్మికంగా రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలను కరోనా పరీక్షకు ప్రామాణికంగా గత నెలలో ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. -
మేయర్కు కరోనా.. ఆందోళనలో సిబ్బంది
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కరోనా కలకలం రేగింది.. సాక్షాత్తు మేయర్కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె భర్త, అత్త, పీఆర్ఓకు కూడా పరీక్షలు నిర్వహించగా వారందరికీ పాజిటివ్గా తేలింది. వారిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మేయర్కు పాజిటివ్గా తేలడంతో రెండు రోజుల క్రితం జరిగిన సమీక్షలో పాల్గొన్న అధికారుల్లో ఆందోళన మొదలైంది. నగర పాలక సంస్థలోని పలువురు అధికారులు, ఉద్యోగులకు కరోనా లక్షణాలు బయటపడటంతో వారందరూ హోం క్వారంటైన్లో ఉన్నారు. కాగా.. మేయర్ను కాంటాక్ట్ అయిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. కామారెడ్డి: జిల్లాలో కరోనా హడలెత్తిస్తోంది. ఇప్పటి వరకూ దాదాపు 35కు పైగా కుటుంబాలకు కరోనా బారినపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా చాలా కుటుంబాల్లో ఇంటిల్లిపాది మొత్తానికి కరోనా వైరస్ సోకుతుండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. (వారికి భవిష్యత్తులో కరోనా సోకే అవకాశం) -
లైంగిక ఆరోపణలు : మేయర్ బలవన్మరణం
సియోల్ : దక్షిణ కొరియా తదుపరి అధ్యక్ష పదవికి పోటీపడతారని భావిస్తున్న సియోల్ మేయర్ ‘మీటూ’ ఆరోపణలు ఎదుర్కొంటూ బలవన్మరణానికి పాల్పడ్డారు. సియోల్ మేయర్ పార్క్ వాన్సూన్ మృతదేహాన్ని నగరానికి సమీపంలోని పర్వత ప్రాంతంపై కనుగొన్నారు. మీటూ ఆరోపణలతో వివిధ రంగాల ప్రముఖులపై బాధిత మహిళలు ఆరోపణలు గుప్పిస్తున్న క్రమంలో పార్క్ వాన్సూన్ విషాదాంతం చోటుచేసుకుంది. ఆయన అధికార నివాసంలో లభించిన సూసైడ్ నోట్లో ఈ ప్రపంచాన్ని వీడుతున్నందుకు అందరూ తనను క్షమించాలని రాసుకున్నారు. తన దహన సంస్కారాలు నిర్వహించి అస్తికలను తన తల్లితండ్రుల సమాధుల వద్ద చల్లాలని ఆయన కోరారు. తన కుటుంబాన్ని బాధపెట్టినందుకు కుటుంబ సభ్యులు తనను మన్నించాలని పార్క్ వాన్సూన్ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ప్రస్తావించకుండా బై ఎవిరివన్ అంటూ లేఖను ముగించారు. దశాబ్ధ కాలంగా సియోల్ మేయర్గా కొనసాగుతున్న పార్క్ దక్షిణ కొరియా రాజకీయాల్లో, పాలక డెమొక్రటిక్ పార్టీలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు. గతంలో తన కార్యదర్శిగా పనిచేసిన మహిళ తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మరుసటి రోజే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. కాగా 2015లో పార్క్ వద్ద కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ఆయన తనను లైంగిక వేధింపులకు గురిచేశారని పనివేళల్లో అభ్యంతరకరంగా ప్రవర్తించేవారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఆయన అండర్వేర్ ధరించి ఉన్న సెల్ఫీలను తనకు పంపి మెసెంజర్ యాప్లో అసభ్యకర కామెంట్లు చేసేవారని ఫిర్యాదు చేశారు. పార్క్ చర్యలతో తనకు విపరీతంగా భయం వేసేదని, సియోల్నగర ప్రజలు, నగర ప్రయోజనాల కోసం వాటిని భరించానని ఆమె పేర్కొన్నారు. మహిళ ఫిర్యాదును ధ్రువీకరించిన పోలీసులు వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు. మరోవైపు పార్క్ మరణించడంతో ఆయనకు వ్యతిరేకంగా మహిళ చేసిన ఫిర్యాదులపై విచారణ సైతం ముగిసిపోనుంది. చదవండి : హీరోయిన్ మెటీరియల్ కాదన్నారు