
గసగసాల గింజపై శ్రీరామపట్టాభిషేక ఘట్టం
తాజాగా ఏటికొప్పాక గ్రామానికి చెందిన హస్తకళాకారుడు శ్రీశైలపు చిన్నయాచారి గసగసాల గింజపై శ్రీరామపట్టాభిషేక ఘట్టాన్ని రూపొందించి అందరినీ అబ్బురపరిచాడు. తాటిముళ్లతో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడిని వారి ఆయుధాలతో కూడిన చిత్రాలను లిఖించాడు. దీనిని తయారు చేయడానికి 18 రోజుల సమయం పట్టిందని, భవిష్యత్తులో కూడా మరిన్ని సూక్ష్మ కళాఖండాలను తయారుచేస్తానని చిన్నయాచారి తెలిపారు.