తిరుమల: ఆదివారం సెలవు దినం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 57,504 మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 22 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 10 గంటలు, 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న కాలిబాట భక్తులకు 5 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభిస్తోంది.