అల్పపీడన ద్రోణి ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఆవరించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
అల్పపీడన ద్రోణి ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఆవరించి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే పశ్చిమ బంగాళఖాతంలో ఓ మోస్తరుగా రుతుపవనాలు బలపడ్డాయని తెలిపింది. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు పడతాయని పేర్కొంది. అలాగే దక్షిణ కోస్తాలో వడగాల్పులు కొనసాగనున్నాయని వాతావరణ కేంద్రం చెప్పింది.