తిరుమల : తిరుమలలో శనివారం భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ విపరీతంగా ఉండటంతో కాలిబాట క్యూలైన్లో తోపులాటలు జరిగాయి. దీంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వేసవి సెలవులు ముగిసే దశకు చేరుకోవటం, వారాంతపు సెలవులతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. అదేవిధంగా లగేజీ డిపాజిట్ చేసే చోట కనీస సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు.
సర్వదర్శనం, కాలిబాట భక్తులతో రెండు వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండాయి. వెలుపల క్యూలైన్లు రెండు కిలోమీటర్లు విస్తరించాయి. సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. ఇక శనివారం సుమారు 40 వేల మంది దాకా భక్తులు కాలిబాటల్లో నడిచి వచ్చారు. వీరికి 10 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభించనుంది.
కాలిబాట క్యూలైన్లలో తోపులాట
Published Sat, Jun 4 2016 8:06 PM | Last Updated on Mon, Sep 4 2017 1:40 AM
Advertisement
Advertisement