Heavy rush
-
ఇసుక వేస్తే రాలనంత జనంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
-
పల్లెబాట పట్టిన నగర వాసులు
-
పల్లెకు పోదాం చలో చలో (ఫొటోలు)
-
పండగొచ్చింది.. పల్లెబాట పట్టిన పట్నంవాసులు (ఫొటోలు)
-
సొంతూళ్లకు నగరవాసులు .. రద్దీగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు
-
తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్ లో వేచిఉన్న భక్తులు . నిన్న 64,467 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 40,005 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.77 కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 6 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. -
ఓటు మా బాధత్య.. పల్లెకు బయల్దేరిన నగరవాసులు (ఫొటోలు)
-
Ram Mandir Trust: అయోధ్యకు రాకండి!
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22న అయోధ్యకు పోటెత్తొద్దని ఆలయ నిర్వాహకులు భక్తులకు విజ్ఞప్తి చేశారు. ‘‘ఆ రోజు అయోధ్యలో ఊహించనంతటి రద్దీ ఉంటుంది. కనుక ఎలాగైనా కార్యక్రమాన్ని కళ్లారా చూడాలని అయోధ్య దాకా రాకండి. మీరున్న చోటే ఆలయాల్లో పూజలు చేయండి’’ అని భవ్య రామమందిరం ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ విజ్ఞప్తి చేశారు. జనవరి 16వ తేదీ నుంచే వైదిక కార్యక్రమాలు మొదలవుతాయని చెప్పారు. 80 వేల మంది భక్తులకు బస, భోజన వసతి కలి్పంచేలా అయోధ్యలో ’టెంట్ సిటీ’ని నిర్మిస్తున్నారు. ఆలయ పూజారుల్లో తిరుపతి పూర్వ విద్యార్థి అయోధ్య రామాలయ పూజారిగా ఎంపికైన మోహిత్ పాండే తిరుపతిలో గతంలో వేద విద్య అభ్యసించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయంలో ఎంఏ (ఆచార్య) పట్టా సాధించారు. లక్నోలోని సీతాపూర్కు చెందిన మోహిత్ గాజియాబాద్లోని దుధేశ్వర్ వేద్ విద్యాపీఠ్లో ఏడేళ్ల సామవేదం అభ్యసించారు. తర్వాత వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో వేద విద్యాభ్యాసం కొనసాగించారు. -
సంక్రాంతి ఎఫెక్ట్.. బస్టాండులు కిటకిట (ఫొటోలు)
-
బతుకమ్మ-దసరా పండగకి ఊరెళ్లిపోతా మామ...బస్టాండ్ లు,రైల్వేస్టేషన్లు కిటకిట (ఫొటోలు)
-
కిక్కిరిసిపోతున్న తిరుమల కొండ.. ఎటు చూసిన భక్తులే ( ఫొటోలు)
-
పర్యాటక ప్రదేశాన్ని తలపిస్తోన్న ప్రకాశం బ్యారేజీ...(ఫొటోలు)
-
కిటకిటలాడిన సాగర తీరం.. బీచ్లో యువతీయువకుల సందడి
-
భక్తులతో కిటకిటలాడుతున్న యాదగిరిగుట్ట
-
వైకుంఠ ఏకాదశి : తిరుమలలో పోటెత్తిన భక్తులు
-
అసలు వాళ్ళకి కరోనా అంటే భయం లేదు
-
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో భారీ క్యూలైన్లు
-
సంక్రాంతి పండుగ రద్దీ
-
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిటకిట
-
బుక్ ఫెయిర్ కు పోటెత్తిన జనం
-
శబరిమలలో కొనసాగుతున్న రద్దీ
శబరిమల: కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దేశనలుమూలల నుంచి తరలివచ్చిన స్వామలు మణికంఠుని దర్శించుకుంటున్నారు. స్వామియే శరణం అయ్యప్ప శరణుఘోషతో శబరిమల హోరెత్తుతోంది. మండల పూజల కోసం నిన్న శబరిమల దేవాలయ ద్వారాలు తెరుచుకున్నాయి. డిసెంబర్ 27 వరకు అయప్పస్వామికి నిత్యపూజలు జరుగుతాయి. నాలుగు రోజుల విరామం తర్వాత మళ్లీ జ్యోతి దర్శనం వరకూ స్వామి ఆలయం తెరిచి ఉంటుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేరళప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేసింది. 10 వేల మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేసింది. శబరిమల సంప్రదాయాలను అతిక్రమించే ఎలాంటి చర్యలను సహించబోమని కేరళ దేవాదాయ శాఖ ముందే స్పష్టం చేసింది. -
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పోలీసుల లాఠీచార్జ్
-
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పోలీసుల లాఠీచార్జ్
సాక్షి, హైదరాబాద్ : పండుగ సీజన్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతుంటోంది. ఇలాంటి సమయంలో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు దిగడంతో ఈ రద్దీ మరింతగా పెరిగింది. ప్రయాణికులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బస్సులకు వెళ్దామని భావించిన చాలా మందికి ఆర్టీసీ కార్మికుల సమ్మె షాకిచ్చింది. దీంతో చేసేది ఏమి లేక చాలా మంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుంటున్నారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. ఫ్లాట్ఫామ్పైకి వచ్చిన రైలు ఎక్కేందుకు ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. కుటుంబ సభ్యులు, చిన్న పిల్లలతో కలిసి ఊళ్లకు వెళ్లే వారి పరిస్థితి మరి దారుణంగా తయారైంది. రద్దీ పెరగడంతో ప్రయాణికుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి.. ప్రయాణికులను చెదరగొట్టారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. ప్రయాణికులను లైన్లలో ఉంచి రైలు ఎక్కించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కాచిగూడ, నాంపల్లి స్టేషన్లలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా ప్రయాణికుల రద్దీ
-
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ : ఓటెత్త.. పోటెత్త
-
రైళ్లు కిటకిట...ప్రయాణం కటకట
-
పండుగ ఎఫెక్ట్: సికింద్రాబాద్ స్టేషన్లో సంక్రాంతి రద్దీ
-
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ : పండగా మజాకా
-
తిరుమల: వైకుంఠ ఏకాదశి పోటెత్తిన భక్తులు
-
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..
సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్ట్మెంట్లు నిండి క్యూలైనులో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపుగా 22 గంటల సమయం పడుతుందని సమాచారం. కాలిబాట దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. శనివారం నాడు 93,489 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అంతేకాక స్వామివారి హుండీ రూ. 2.71 కోట్లు తెలుస్తోంది. జూన్ 7వ తేదీన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం కానుంది. -
తిరుమలకు పోటెత్తిన భక్తజనం
-
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు 27 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతున్నది. స్వామివారిని శనివారం 82,660 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ. 2.26 కోట్లు వచ్చింది. నేపాల్ మాజీ ప్రధానమంత్రి బిమిలేంద్ర నిధి శ్రీవారిని దర్శించుకున్నారు. -
వసంత పంచమి.. బాసరకు పోటెత్తిన భక్తులు
సాక్షి, బాసర: ప్రముఖ పుణ్యక్షేత్రమైన నిర్మల్జిల్లా బాసరలోని శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలు నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో చివరి రోజు సోమవారం అమ్మవారి పుట్టిన రోజు కావడంతో బాసర భక్తులతో కిటకిటలాడుతోంది. వేకువజామున 5 గంటల నుంచే అక్షర శ్రీకార పూజలు ప్రారంభించారు. అక్షర శ్రీకార పూజలు, అమ్మవారి దర్శనం కోసం తెల్లవారుజామునుంచే వేలాదిమంది భక్తులు అర్ధరాత్రి నుంచే బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకోవడానికి 4 గంటల సమయం పడుతున్నది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
భక్తులతో తిరుమల కిటకిట
సాక్షి, తిరుమల: సంక్రాంతి పండుగ సందర్భంగా వరుస సెలవులు రావడంతో తిరుమల కొండకు భక్తుల తాకిడి ఎక్కువైంది. ఆదివారం ఉదయం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం 27 కంపార్ట్మెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 9 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. శనివారం శ్రీవారిని 67,744 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,920 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 1.81 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
ముంబైలో సిద్ధివినాయక ఆలయానికి పోటెత్తిన భక్తులు
-
వైకుంఠ దర్శనం: తిరుమల కొండ కిటకిట
సాక్షి, తిరుమల: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమలకు భక్తులు పోటెత్తారు. కంపార్ట్మెంట్లతో పాటు, టీటీడీ ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లు భక్తులతో నిండిపోయాయి. రేపటి వైకుంఠ ద్వార దర్శనానికి ఇప్పటికే లక్షమంది భక్తులు నిరీక్షిస్తున్నారు. సామాన్య భక్తులతో పాటు వీఐపీల తాకిడి పెరిగింది. రేపటికి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అందేకాకుండా కాలిబాటలో గోవిందమాల భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాగా ఏకాదశి పర్వదినాన భక్తుల సౌకర్యార్థం టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. సామాన్య భక్తులు, ప్రముఖులకు వేర్వేరుగా బస, దర్శన ఏర్పాట్లు చేశారు. బుధవారం అర్థరాత్రి నుంచి దివ్యదర్శనం టికెట్ల జారీని నిలిపివేశారు. సర్వదర్శనం మినహా ఐదు రోజుల పాటు దివ్యదర్శనం సహా అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. కనుమ రహదారులను 24 గంటల పాటు తెరిచే ఉంచుతారు. ధనుర్మాస పూజల తర్వాత వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఏకాదశి, ద్వాదశి రెండు రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనంను కల్పించనున్నారు. రేపు ఉదయం 5 గంటల తర్వాత వీఐపీ దర్శనాలను అనుమతిస్తారు. ఉదయం 7.30 గంటల తర్వాత సర్వదర్శనం ప్రారంభం కానుంది. రెండు రోజులు పాటు 40 గంటలకు పైగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కలిగేలా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు 30 మంది కేంద్ర, రాష్ట్ర మంత్రులతోపాటు 200 మందికిపైగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ అధికారులు రానున్నట్టు సమాచారం. ప్రముఖుల బస, దర్శన ఏర్పాట్లు మంత్రులు, రాజ్యాంగపరమైన హోదాల్లో ఉన్న వారు తిరుమలలోని పద్మావతి విచారణ కార్యాలయ పరిధిలోని వెంకటకళా నిలయానికి వెళ్లాల్సి ఉంది. ఇక్కడ ఆరుగురికి మించకుండా దర్శన టికెట్లు, 2కు మించకుండా గదులు కేటాయిస్తారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు రామరాజు నిలయం, సీతా నిలయానికి వెళ్లాలి. ఆరుగురికి మించకుండా దర్శన టికెట్లు, ఒక గది మంజూరు చేస్తారు. అఖిల భారత సర్వీసు అధికారులు సన్నిధానానికి, ఇతర ఉన్నతాధికారులకు గంబుల్ విశ్రాంతి గృహానికి వెళ్లాలి. నలుగురికి మించకుండా దర్శన టికెట్లు, ఒక గదిని కేటాయిస్తారు. సామాన్య భక్తులకు బస, దర్శన ఏర్పాట్లు ఏకాదశి సందర్భంగా వచ్చే సామాన్య భక్తుల కోసం కేంద్రియ విచారణ కార్యాలయంలోని అన్ని కౌంటర్లలో గదులు కేటాయించనున్నారు. ఇక్కడ ఎలాంటి సిఫారసులు స్వీకరించరు. స్వామి దర్శనం కోసం లక్షన్నర మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేసింది. ఇందులో భాగంగానే కాలిబాట దర్శనం కూడా నిలిపివేశారు. ఒకే క్యూలైనులోనే భక్తులను అనుమతించనున్నారు. సామాన్య భక్తులకు ఎండ, వాన, చలి, మంచుకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా షెడ్లు నిర్మించారు. 42 వేల మందికి సరిపడేలా నారాయణగిరి ఉద్యాన వనాల్లో 20 తాత్కాలిక షెడ్లు, వైకుంఠం క్యూకాంప్లెక్స్–2లో 16 వేల మంది, వైకుంఠం క్యూకాంప్లెక్స్–1లో 16 వేల మంది భక్తులు ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఈ సారి వైకుంఠం క్యూ కాంప్లెక్స్–2 నుంచి కల్యాణవేదిక వరకు 2.3 కిలోమీటర్ల నిడివిలో కొత్తక్యూలైను నిర్మించారు. తొలుత కంపార్ట్మెంట్లలోకి భక్తులను అనుమతిస్తారు. అవి నిండిన తర్వాత ఆళ్వార్ట్యాంక్, నారాయణగిరి ఉద్యానవనాలు, వైకుంఠం క్యూకాంప్లెక్స్–2, కర్ణాటక సత్రాలు, అహోబిల మఠం, ఉత్తర మాడ వీధి మీదుగా ఎ టైప్ క్వార్టర్స్, బాట గంగమ్మ గుడి వద్ద రింగ్రోడ్డు నుంచి కల్యాణవేదిక వరకు నిర్మించిన క్యూలైన్లోకి అనుమతిస్తారు. భక్తులు 24 నుంచి 30 గంటలు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తుంది. ఇక్కడ భక్తులకు మరుగుదొడ్లతోపాటు తాగునీటి సౌకర్యం కల్పించారు. సుమారు 2 లక్షల మందికి సరిపడేలా అన్నప్రసాదాలు, మజ్జిగ, కాఫీ, టీ తదితరాలు సిద్ధం చేయాలని టీటీడీ ఈవో అనీల్కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు ఆదేశించారు. -
తిరుమలలో సర్వ దర్శనానికి 26 గంటలు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. 29, 30లలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ శుద్ధి కారణంగా ఉదయం 11 గంటల వరకు దర్శనం నిలిపివేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సర్వ దర్శనం ప్రారంభం కానుంది. 28 నుంచి ఐదు రోజులపాటు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వ దర్శనానికి 26 గంటలు పట్టే అవకాశం ఉంది. సోమవారం 88,507 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగింది. 33,102 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. స్వామివారికి హుండీ ఆదాయం రూ.4కోట్లు వచ్చింది. -
తిరుమలలో భక్తుల రద్దీ
-
తిరుమలలో పోటెత్తిన భక్తులు
-
ఐసెట్ కౌన్సెలింగ్కు పోటెత్తిన విద్యార్థులు
ఎస్కేయూ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు సంబంధించి ఐసెట్–2017 కౌన్సెలింగ్లో భాగంగా గత మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న సర్టిఫికెట్ల పరిశీలనకు గురువారం విద్యార్థులు పోటెత్తారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, అనంతపురం, ఎస్కేయూ హెల్ప్లైన్ కేంద్రాల్లో 721 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. ఎస్కేయూ హెల్ప్లైన్ కేంద్రంలో 411 మంది అభ్యర్థులు హాజరుకావడంతో గురువారం రాత్రి 10 గంటల వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని క్యాంప్ ఆఫీసర్ ప్రొఫెసర్ బీవీ రాఘవులు తెలిపారు. 15న ఐసెట్ కౌన్సెలింగ్ పూర్తికానుంది. -
కిటకిటలాడిన లోక్ అదాలత్
- 3,961 కేసులు రాజీ మార్గంలో పరిష్కారం అనంతపురం లీగల్ : జిల్లాలో జిల్లా న్యాయసేవాప్రాధికార సంస్థ నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లకు విశేష స్పందన లభించింది. 3,961 కేసులు రాజీమార్గంలో శాస్వత పరిష్కారం పొందాయి. శనివారం జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిల్లో నిర్వహించిన జాతీయ లోక్అదాలత్లకు కక్షిదారులు ఉత్సాహంగా తరలివచ్చారు. కోర్టుల్లో పెండింగులో ఉన్న కేసులతో పాటుగా ఇంకా కోర్టు గడప చేరని ప్రీలిటిగేషన్ కేసులు దాదాపు 1,544 పరిష్కారమయ్యాయి. జాతీయ లోక్అదాలత్కు విచ్చేసిన కక్షిదారులందరికీ భోజన వసతి,తాగునీటి సౌకర్యం కల్పించారు. సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్ రెడ్డి, కార్యదర్శి ఎస్.కమలాకర్ రెడ్డి న్యాయసేవాసదన్లో లోక్అదాలత్ నిర్వహించారు. వివిధ కోర్టుల్లో పెండింగులో ఉన్న సివిల్ కేసులు, కుటుంబ తగాదాలు, ఆస్తి తగాదాలు, బకాయిలు, చెక్బౌన్సు కేసులు, రాజీకాదగిన క్రిమినల్ కేసులు, ఇంకా కోర్టులో దాఖలు చేయని వివాదాలను కూడా ఈ లోక్ అదాలత్లో రాజీ మార్గంలో పరిష్కరించారు. -
వన భో‘జనం’
-
పెట్రోల్ బంకుల్లో జనం క్యూ..
-
నోట్ టాపిక్..
-
పెట్రోల్ బంకుల్లో జనం క్యూ..
హైదరాబాద్: రూ. 500, 1000 నోట్ల రద్దుతో సామాన్యులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. జేబులో రూ. 500, 1000 నోట్లు తప్ప చిల్లరలేని వారు.. అవి ఎందుకు పనికిరాకపోవడంతో రోజు వారి అవసరాలకు ఇబ్బందులు పడుతున్నారు. తరువాత నోట్లను మార్చుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఇప్పటికిప్పుడు ఉన్న కనీస అవసరాలను తీర్చుకోవడం కోసం చిల్లర కోసం నానా తంటాలు పడుతున్నారు. పెట్రోల్ బంకుల వద్ద రూ. 500, 1000 నోట్లను మార్చడానికి జనాలు ప్రయత్నిస్తున్నారు. దీంతో పెట్రోల్ బంకుల వద్ద పెద్ద సంఖ్యలో వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. అయితే.. ఇక్కడ సైతం వారికి నిరాశే ఎదురౌతుంది. బంకుల నిర్వాహకులు సరైన చిల్లర ఇస్తేనే పెట్రోల్ పోస్తామని చెబుతున్నారు. అందరూ 500, 1000 నోట్లను మార్చుకోవడానికి పెట్రోల్ కోసం వస్తుండటంతో.. చిల్లర లేదని వారు అంటున్నారు. రూ. 500, 1000 నోట్లను తీసుకోవడానికి బంకుల నిర్వాహకులు నిరాకరిస్తున్నారు. -
యాదాద్రికి పోటెత్తిన భక్తులు
యాదాద్రి: యాదాద్రిలో కోలువు తీరిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. కంపార్టుమెంట్లు అన్ని భక్తులతో నిండిపోయాయి. ఆలయం వెలుపలకు భక్తులు క్యూలో నిలబడ్డారు. ఈ నేపథ్యంలో కొండపైకి వాహన రాకపోకలను అధికారులు నిలిపివేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం కొనసాగుతుంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు అన్ని నిండిపోయాయి. సర్వదర్శనానికి 12 గంటలు, కాలినడక భక్తులకు 10 గంటల సమయం పడుతుంది. సోమవారం శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ సేవ. అలాగే అక్టోబర్ 30వ తేదీన శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఏడుకొండలపై కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండి బయట వరకు భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వ దర్శనానికి 14 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. -
శ్రీవారి ఉదయాస్తమాన సేవలో ప్రముఖులు
తిరుమల: తిరుమలలో శుక్రవారం శ్రీవారి ఉదయాస్తమాన సేవలో చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు పాల్గొన్నారు. అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అయితే తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవరం కూడా కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి... భక్తులు భారీగా క్యూ లైన్లులో నిలబడ్డారు. సర్వదర్శనానికి 14 గంటలు, నడకదారిన వచ్చే భక్తులకు 12 గంటల సమయం పడుతుంది. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం కొనసాగుతుంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం భక్తులు అన్ని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 8 గంటల సమయం పడుతుంది. అయితే ప్రత్యేక ప్రవేశ దర్శనం రెండు గంటల్లో పూర్తి అవుతుంది. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. సర్వదర్శనానికి 12 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటలు సమయం పడుతుంది. అయితే శ్రీవారి పాదల వద్ద అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. -
పదోరోజు మహిషాసుర వర్దిని అవతారం
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలతోపాటు వరుసగా సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం కొనసాగుతుంది. దేవదేవుడు శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు అన్ని నిండిపోయాయి. కంపార్ట్మెంట్ల బయట భక్తులు క్యూలో బారులు తీరారు. సర్వదర్శనానికి 12 గంటలు, నడక భక్తులకు 10 గంటల సమమయ పడుతుంది. నిన్న శనివారం స్వామివారిని 93,119 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. అలాగే నిన్న శ్రీవారి హుండీకి రూ. 2.58 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. -
భక్తజనకీలాద్రి
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. మూలా నక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా త్రిశక్తి స్వరూపిణిౖయెన దుర్గాదేవి తన అంశలోని నిజ స్వరూపాన్ని సాక్షాత్కరింపచేసేలా ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఈ మేరకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను శనివారం శ్రీ సరస్వతీదేవిగా అలంకరించారు. శ్వేతపద్మాన్ని ఆసనంగా అధిష్టించి... వీణ, దండ, కమండలం, అక్షరమాల, నెమలితో కూడిన అభయముద్రను ధరించిన చదువుల తల్లిని దర్శించి భక్తులు తరించారు. ‘ తల్లీ.. మా అజ్ఞానాన్ని తొలగించి.. విజ్ఞానం ప్రసాధించు..’ అని వేడుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి.. భక్తజనకీలాద్రిగా మారింది. – సాక్షి, విజయవాడ -
భక్తుల ఆగ్రహం
-
బాసరలో పోటెత్తిన భక్తులు
-
బస్టాండ్లలో కిక్కిరిసిపోయిన ప్రయాణీకులు
-
తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుమల: తిరుమలలో దేవదేవుడు శ్రీవెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు శనివారం ఆరోరోజు కొనసాగుతున్నాయి. శ్రీవారు హనుమంత వాహనంపై ఊరేగుతున్నారు. అలాగే ఈ రోజు సాయంత్రం 4.00 గంటలకు బంగారు రథంపై ఊరేగనున్నారు. రాత్రికి స్వామివారికి గజవాహన సేవ జరగనుంది. అయితే బ్రహ్మోత్సవాలు... వరుస సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి... క్యూలైన్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, కాలిబాట దర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. కాలిబాట మార్గం నుంచి భారీగా భక్తులు వస్తున్నారు. -
బాసరలో పోటెత్తిన భక్తులు
బాసర: ఆదిలాబాద్ జిల్లా బాసర సరస్వతీ మాత సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. అమ్మ వారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం కావటంతో శనివారం వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు క్యూకట్టారు. వందలాది మంది చిన్నారులకు అర్చకులు అక్షరాభ్యాసం చేయించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు కాళరాత్రి అవతారంలో దర్శనమిస్తున్నారు. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి చేరుకున్నారు. -
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
-
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
విజయవాడ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు... ఆపై అమ్మవారి జన్మనక్షత్రం మూల. ఈ నేపథ్యంలో శనివారం ఇంద్రకీలాద్రిపై కోలువైన శ్రీకనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈ రోజు తెల్లవారుజాము 2.00 గంటల నుంచే భక్తులు సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో ప్రత్యేక దర్శనాన్ని ఆలయ అధికారులు రద్దు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల మధ్య వీఐపీ దర్శనానికి అనుమతి ఇచ్చారు. ఈ రోజు సాయంత్రం దుర్గమ్మకు సీఎం చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్శించనున్నారు. -
శ్రీవారి గరుడ సేవకే టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు
తిరుమల : తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి... బయట క్యూ లైన్లలో బారులు తీరారు. సర్వ దర్శనానికి 12 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. నేడు గరుడ సేవ సందర్భంగా ప్రత్యేక ప్రవేశ దర్శనంతోపాటు వీఐపీ దర్శనాలను అధికారులు రద్దు చేశారు. గరుడ సేవకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ సేవను వీక్షించేందుకు భక్తులకు వీలుగా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం 12.00 గంటల నుంచి భక్తులను ఈ గ్యాలరీల్లోకి అనుమతి ఇస్తారని అధికారులు వెల్లడించారు. ఈ రోజు అర్థరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహనాల రాకపోకలను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. అన్న ప్రసాద కేంద్రంలోనూ భక్తులకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. నేటి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 2.00 గంటల వరకు అన్నప్రసాద వితరణ జరగుతుందని టీటీడీ తెలిపింది. -
దుర్గగుడికి పోటెత్తిన భక్తులు
విజయవాడ : దుర్గగుడికి బుధవారం భక్తులు పోటెత్తారు. దసరా నవరాత్రులు నేపథ్యంలో నేడు ఐదో రోజు సందర్భంగా అమ్మవారు కాత్యాయని అలంకారంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. అయితే క్యూలైన్లో అమ్మవారి దర్శనం కోసం వేచి ఉన్న వృద్ధురాలు స్పృహ కోల్లోయింది. దీంతో ఆలయ సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించారు. -
స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు
విజయవాడ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ వారి దసరా ఉత్సవాలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గమ్మ గర్భాలయం నుంచి అమ్మవారి ఉత్సవ మూర్తులను మంగళవాయిద్యాల నడుమ మహామంటపానికి తరలించారు. వేకువజాము నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. ప్రస్తుతం ఆలయంలో నాలుగు క్యూలైన్లలో భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. వీవీఐపీ, వీఐపీ దర్శనాలకు రూ. 500 , రూ.300 టికెట్లతో ప్రత్యేక క్యూ ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో ఎ. సూర్యకుమారి తెలిపారు. -
స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం కూడా కొనసాగుతుంది. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో 27 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. సర్వదర్శనానికి 10 గంటలు, నడక దారిన వచ్చిన భక్తులకు శ్రీవారిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. . -
పండుగలకు ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: తిరుమల బ్రహ్మోత్సవాలు, దసరా, దీపావళి పర్వదినాల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 52 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలను సిద్ధం చేసింది. దసరా సెలవుల నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ల నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల డిమాండ్కు అనుగుణంగా ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్కుమార్ తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లన్నింటికీ ప్రత్యేక చార్జీలు వర్తిస్తాయి. ఈ మేరకు హైదరాబాద్-తిరుపతి (02764/02763) స్పెషల్ ట్రెయిన్ ఈ నెల 28, అక్టోబర్ 5, 12, 19, 26 తేదీలలో సాయంత్రం 5.55 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 29, అక్టోబర్ 6, 13, 20, 27 తేదీలలో సాయంత్రం 5 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.50 కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్-మైసూర్ (07073/07074) స్పెషల్ ట్రైయిన్ అక్టోబర్ 2, 9, 16, 23, 30 తేదీలలో రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.15 కు మైసూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అక్టోబర్ 3, 10, 17, 24, 31 తేదీలలో సాయంత్రం 6.15 కు మైసూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సంత్రాగచ్చి (కోల్కత్తా)-సికింద్రాబాద్ (02849/02850) స్పెషల్ ట్రైయిన్ అక్టోబర్ 5, 12, 19, 26, నవంబర్ 2, 9, తేదీలలో రాత్రి 11.50 కి సంత్రాగచ్చి నుంచి బయలుదేరి శుక్రవారం తెల్లవారు జామున 4.30 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అక్టోబర్ 7, 14, 21, 28, నవంబర్ 4, 11 తేదీలలో ఉదయం 6.20 కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి శనివారం ఉదయం 10.25 కు సంత్రాగచ్చి చేరుకుంటుంది. సికింద్రాబాద్-విజయవాడ (07757/07758) స్పెషల్ ట్రైయిన్ అక్టోబర్ 2, 9, 16, 23, 30 నవంబర్ 6, 13, 20, 27 తేదీలలో ఉదయం 5.30 కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి అదేరోజు ఉదయం 10.45 కు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదే రోజు సాయంత్రం 5.30 కు విజయవాడ నుంచి బయలుదేరి రాత్రి 10.50 కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్-పాట్నా (02793/02794) స్పెషల్ ట్రెయిన్ ఈ నెల 30, అక్టోబర్ 7, 14, 21, 28, నవంబర్ 4, 11తేదీలలో ఉదయం 8.35 కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4.10 కి పాట్నా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అక్టోబర్ 2, 9, 16, 23, 31, నవంబర్ 8, 13 తేదీలలో మధ్యాహ్నం 12.45 కు పాట్నా నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.20 కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం అధికంగా ఉంది. శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చన భక్తులతో 28 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. శనివారం స్వామివారిని 89,260 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్క రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.52 కోట్లు అని వారు పేర్కొన్నారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం అధికంగా ఉంది. శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో 28 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. శుక్రవారం స్వామివారిని 67, 605 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. నిన్న(శనివారం) 85,434 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
కృష్ణమ్మ తీరం ... భక్తజన సంద్రం
సాక్షి, అమరావతి : కృష్ణాతీరానికి పుష్కరాల పదోరోజు భక్తజనం పోటెత్తింది. ఆదివారం కావడం, మరో రెండురోజుల్లో పుష్కరాలు ముగియనుండటంతో కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లోని ప్రధాన పుష్కర ఘాట్లన్నీ జనసంద్రాన్ని తలపించాయి. ఎండ తీవ్రత, ట్రాఫిక్ జామ్లు, ఇతర ఇబ్బందులను లెక్కచేయకుండా భక్తులు పుష్కర స్నానాలాచరించి పులకించిపోయారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రంలో 29,91,750 మంది స్నానాలు చేయడం విశేషం. ఈ పుష్కరాల్లో ఇదే రికార్డు కావడం గమనార్హం. మొత్తం మీద ఈ పది రోజుల్లో పుష్కర స్నానాలు చేసిన భక్తుల సంఖ్య 1,53,66,036కు చేరింది.విజయవాడ కనకదుర్గమ్మ ఆల యంతో పాటు కృష్ణాతీరంలోని ఆలయాలన్నీ భక్తజనంతో కిటకిటలాడాయి. 23న ఆది పుష్కరాల ముగింపు కృష్ణా పుష్కరాల్లో తొలి 12 రోజుల ఆది పుష్కరాలను మంగళవారం వేడుకగా ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. 23వ తేదీ రాత్రి 7 గంటలకు ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నదికిచ్చే హారతితో ఆది పుష్కరాలు ముగుస్తాయి. ఈ సందర్భంగా కృష్ణా హారతి ప్రాంతంలో ప్రభుత్వం భారీగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనుంది. ఆది పుష్కరాల ముగింపు సంద ర్భంగా వెయ్యి మంది కళాకారులతో కూచిపూడి నాట్య ప్రదర్శన నిర్వహిస్తారు. -
తెలుగు రాష్ట్రాల్లో పుష్కరాలకు పోటెత్తిన భక్తులు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్నానం ఆచరించేందుకు భక్తులు తెల్లవారే పుష్కర ఘాట్లకు చేరుకున్నారు. విజయవాడలోని సంగమం, పద్మావతి, జగ్గయ్యపేట సమీపంలోని వేదాద్రి ఘాట్లలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. అలాగే గుంటూరు జిల్లాలోని అమరావతి, సీతానగరం ఘాట్లలో భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కర్నూలు జిల్లాలో సంగమేశ్వరం, పాతాళగంగ, లింగాలగట్టు ఘాట్లకు భక్తులు భారీ గా తరలివచ్చారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిని శ్రీదుర్గామల్లేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. భక్తులు భారీగా తరలిరావడంతో దేవాలయ ప్రాంతం జనసంద్రంగా మారింది. దీంతో భక్తులను అదుపు చేయలేక పోలీసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ రోజు ఉదయం 9.00 గంటల వరకు 75 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. తాగేందుకు మంచి నీరు దొరకక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలోని మట్టపల్లి, వాడపల్లి, నాగార్జునసాగర్ ఘాట్లలో భక్తుల రద్దీ భారీగా ఉంది. మహబూబ్నగర్ జిల్లాలోని బీచుపల్లి, గొందిమళ్ల, సోమశిల ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కృష్ణా పుష్కరోత్సవం ఆదివారం 10వ రోజుకు చేరుకుంది. మరో రెండు రోజుల్లో ఈ పుష్కరాలు ముగియనున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలోని భక్తులు పుణ్యస్నానం ఆచరించేందుకు పయనమవుతున్నారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 22 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 9 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 5 గంటలు సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. -
తెలుగు రాష్ట్రాల్లో పుష్కరాలకు పోటెత్తిన భక్తులు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు శుక్రవారం ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని విజయవాడలో పద్మావతి, వేదాద్రిలోని ఘాట్లలో భక్తుల రద్దీ పెరిగింది. గుంటూరు జిల్లాలోని అమరావతి, సీతానగరం ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కర్నూలు జిల్లా సంగమేశ్వరం, పాతాళగంగ ఘాట్లో భక్తులు పోటెత్తారు. అలాగే తెలంగాణలోని మట్టపల్లి, వాడపల్లి, నాగార్జునసాగర్లోని ఘాట్లలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మహబూబ్నగర్ జిల్లా బీచుపల్లి, గొందిమళ్ల, సోమశిల ఘాట్లలో భక్తులు సంఖ్య భారీగా పెరిగింది. -
దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
విజయవాడ : ఓ వైపు కృష్ణా పుష్కరాలు... మరోవైపు వరుస సెలవులు రావడంతో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. ఆమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఐదు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. గత అర్థరాత్రి నుంచి ఇప్పటి వరకు 50 వేల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. -
గోదావరి అంత్య పుష్కరాల్లో అపశృతి
ధవళేశ్వరం : గోదావరి అంత్యపుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించడానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన ధవళేశ్వరంలోని కేదారలంక ఘాట్లో ఆదివారం చోటుచేసుకుంది. పవిత్ర స్నానం కోసం నదిలోకి దిగిన యువకుడు ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి గాలింపు చర్యలు చేపడుతున్నారు. అంత్య పుష్కరాలకు పోటెత్తిన భక్తులు గోదావరి అంత్య పుష్కరాలకు భక్తజనం పోటెత్తారు. పుణ్య స్నానాలు ఆచరించడానికి ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో.. పుష్కర గ్రామీణ ఘాట్లన్ని కిటకిటలాడుతున్నాయి. పెనుగొండలోని సిద్ధాంతం, పెరవలి తీపర్రు, గన్నవరం వైనతేయ గోదావరి, నిడదవోలు పెండ్యాల, నరసాపురం వశిష్ట గోదావరి, గోష్పాద క్షేత్రాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. -
బాసరలో భక్తుల రద్దీ
బాసర (ఆదిలాబాద్) : బాసరలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. గోదావరి అంత్యపుష్కరాలను పురస్కరించుకొని ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రస్తుతం అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. -
యాదాద్రికి పోటెత్తిన భక్తులు
యాదాద్రి : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. శ్రీ లక్ష్మీ నర్సింహ స్వామిని దర్శించుకోవడానికి ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. ప్రస్తుతం స్వామివారి సర్వ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా గుట్టపైకి వాహనాలను అనుమతించడం లేదు. -
తిరుమలలో పెరిగిన రద్దీ
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఏడు కంపార్టుమెంట్లు నిండి ఉన్నాయి. శ్రీవారి సర్వ దర్శనానికి ఏడు గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు ఆరు గంటల సమయం పడుతోంది. అదే విధంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు గంటల్లో పూర్తి అవుతోంది.