వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ శనివారం కూడా కొనసాగుతుంది.
తిరుమల: వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ శనివారం కూడా కొనసాగుతుంది. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు 27 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 10 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 8 గంటల సమయం పడుతుంది. శ్రీవారిని శుక్రవారం 62,431 మంది భక్తులు దర్శించుకున్నారు.