devotees
-
వీడియో వైరల్: జాతరలో అపశ్రుతి.. కుప్పకూలిన 120 అడుగుల రథం
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు శివార్లలో ఊరేగింపు సందర్భంగా 120 అడుగుల రథం కూలిన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనేకల్లోని హుస్కూర్లో శనివారం మద్దురమ్మ జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా వంద అడుగులకుపైగా ఎత్తైన రెండు రథాలను ఆలయ నిర్వాహకులు సిద్ధం చేశారు.కాగా, ఊరేగింపు సందర్భంగా రెండు రథాలను తాళ్ల సహాయంతో భక్తులు లాగారు. అయితే ఈదురు గాలుల వల్ల120 అడుగుల ఎత్తైన రథం అదుపుతప్పి ఒక పక్కకు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి చెందగా.. పలువులు గాయపడ్డారు. వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.మృతి చెందిన వ్యక్తిని తమిళనాడులోని హోసూర్కు చెందిన లోహిత్గా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఏడాది కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ఇదే ఉత్సవంలో రథం కూలిపోవడంతో.. పార్క్ చేసిన అనేక వాహనాలు దెబ్బతిన్నాయి, అయితే, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. -
అన్నదాన క్షేత్రంలో అరాచక పర్వం!
కాశినాయన క్షేత్రం నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పెద్దలు తొలుత తిరుమల లడ్డూ నాణ్యతపై లేనిపోని విమర్శలు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. ఆపై అదే తిరుమలలో ఎలాంటి జాగ్రత్త తీసుకోకపోవడంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు మరణించారు. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు మరో హిందూ వ్యతిరేక చర్యకు నడుం బిగించారు. ఇందుకు కాశీనాయన క్షేత్రం వేదికైంది. దీనులకు దేవాలయం.. అన్నార్తులను ఆదరించి అక్కున చేర్చుకునే అపర అన్నపూర్ణ నిలయంగా భాసిల్లుతున్న ఈ క్షేత్రంలో కనిపించేదల్లా.. నిత్యాన్నదానం, స్వచ్ఛంద విరాళాల తత్వం, లాభాపేక్షలేని సేవా భావం! పచ్చటి నేలలోని ఆ ప్రశాంత క్షేత్రంలో ఒక్కసారిగా కల్లోలం చెలరేగింది. కూటమి సర్కారు వరుసగా కూల్చివేతలు కొనసాగించింది. కాశీనాయన క్షేత్రంలో పలు నిర్మాణాలను కూల్చివేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాషాయ వ్రస్తాలు ధరించి దక్షిణాది రాష్ట్రాలలో పర్యటిస్తూ పలు ఆలయాలు దర్శించిన, సనాతన ధర్మానికి పరిరక్షకునిగా చెప్పుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిధిలోని అటవీశాఖ కాశీనాయన క్షేత్రంలో కూల్చివేతలు చేపట్టడం గమనార్హం. ఆయన మాత్రం దీనిపై నోరుమెదపడంలేదు. ఎన్నో ఏళ్లుగా పేదల కడుపునింపుతున్న ఓ ధార్మీక క్షేత్రంపై కూటమి ప్రభుత్వం ఇలా కత్తిగట్టినట్టు ఎందుకు వ్యవహరిస్తున్నదో ఎవరికీ అంతుబట్టడం లేదు. నిత్యాన్నదానం, గో సంరక్షణ నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బెడుసు పల్లి గ్రామానికి చెందిన మున్నెల్లి సుబ్బారెడ్డి, కాశమ్మల రెండో సంతానమైన కాశిరెడ్డి యవ్వనంలోనే ఇంటిని వదిలి ఆథ్యాత్మికత వైపు అడుగులు వేశారు. వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ గరుడాద్రి వద్ద తపస్సులో నిమగ్నమయ్యారని, ఆయనకు జ్యోతిలక్ష్మీనరసింహస్వామి ప్రత్యక్షమై మార్గ నిర్దేశం చేశారని ప్రతీతి. తన గురువు అతిరాస గురవయ్య ఉపదేశం మేరకు ఆలయాల జీర్ణోద్ధరణకు పూనుకున్నారు. నిత్యాన్నదానం, గో సంరక్షణకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. 1995 డిసెంబరు ఆరో తేదీ దత్తపౌర్ణమి రోజు మహాసమాధి అయ్యారు. ఆయన సేవలకు గుర్తుగా 1999లో కలసపాడు, బి.కోడూరు పరిధిలోని పలు పంచాయతీలతో శ్రీ అవధూత కాశినాయన (ఎస్ఎకేఎన్) మండలం ఏర్పాటైంది. ఎంతో పవిత్రమైన కాశినాయన క్షేత్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక కూల్చివేతలు మొదలయ్యాయి. గతేడాది డిసెంబరు, ఈ ఏడాది జనవరి, మార్చి 7వతేదీన జ్యోతి క్షేత్రంలోని కుమ్మరి అన్నదాన సత్రం, విశ్వ బ్రాహ్మణ అన్నదాన సత్రం, గోవుల దాణా షెడ్డు, గోశాల షెడ్డు, మరుగుదొడ్లను కూల్చి వేశారు. జ్యోతిలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కొద్దిదూరంలో శివరంగారెడ్డి నిర్మించిన గెస్ట్హౌస్ను కూలగొట్టారు. ఓ వర్గానికి చెందిన వారు ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్కళ్యాణ్ ద్వారా ఈ పని చేయించారనే అనుమానాలు కాశినాయన భక్తుల్లో వ్యక్తమవుతున్నాయి. ఎండలో అలమటిస్తున్న గోవులు వందకు పైగా అన్నదాన సత్రాలురాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం తదితర జిల్లాల్లో విస్తృతంగా పర్యటించిన కాశిరెడ్డి అవధూత కాశీనాయనగా పూజలు అందుకున్నారు. స్థానిక ప్రజలు ఆయనకు నిత్యం పూజలు నిర్వహిస్తూ 13 హెక్టార్ల పరి«ధిలో గుడి, గోశాల, అన్నదాన సత్రాలు, వసతి గృహాలు నిర్మించారు. పలు నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. కాశీనాయన క్షేత్రాన్ని నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. రాయలసీమతో పాటు వివిధ ప్రాంతాల్లో కాశీనాయన పేరిట వందకు పైగా అన్నదాన సత్రాలు కొనసాగుతున్నాయి. అటవీశాఖకు 50 ఎకరాలు..నల్లమల అటవీ ప్రాంతంలో వందల ఏళ్లుగా జ్యోతిలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఆ గుడి వద్ద అన్నదానం ఏర్పాటుకు చేరుకున్న కాశీనాయన అక్కడే శివైక్యం చెందారు. 1997 నుంచి క్షేత్రం దినదిన ప్రవర్థమానంగా వెలుగొందుతోంది. అటవీశాఖ తొలుత అటవీప్రాంతంగా, ఆ తరువాత రిజర్వు ఫారెస్టుగా 2000–2003 నుంచి చెబుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలంలోని 50 ఎకరాలను క్షేత్రం నిర్వాహకులు అటవీశాఖకు కేటాయింపజేశారు. గతంలో రాష్ట్ర, కేంద్ర అటవీశాఖ ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరిగాయి. విషయం కోర్టు వరకు కూడా వెళ్లింది. దానిపై అటవీశాఖ సానుకూల దృక్పథంతో ఉన్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.అన్నదానసత్రంలో భోజనం చేస్తున్న భక్తులు కొసమెరుపేమిటంటే.. తిరుమల తొక్కిసలాటఘటనపై పవన్ కళ్యాణ్ హడావిడి చేయగా ఇపుడు కాశీనాయన క్షేత్రం కూల్చివేతలపై నారాలోకేష్ తాపీగా రంగంలోకి దిగారు. క్షమాపణలు చెబుతున్నానని, కూల్చిన నిర్మాణాలను పునరి్నర్మీస్తామని చెబుతుండడం ఏదో డ్రామాలా కనిపిస్తున్నదని పలు హిందూ ధార్మీక సంస్థలు విమర్శిస్తున్నాయి.దాతల సహకారం అపూర్వంఎక్కడి నుంచి వస్తాయో.. ఎలా వస్తాయో మాకే అంతుబట్టదు. దాతల సహకారం మేం ఊహించిన దానికన్నా ఎప్పుడూ ఎక్కువే ఉంటుంది. వెయ్యి మందికి అన్నదానం చేస్తున్నామంటే పదివేల మందికి సరిపడా సరుకులు స్వచ్ఛందంగా క్షేత్రానికి చేరుతుంటాయి. ఆలయ నిర్మాణానికి కూడా అదేవిధంగా సాయం అందుతోంది. వారి తోడ్పాటుతోనే మహత్తర క్షేత్రం నిర్మితమవుతోంది. ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని భక్త కోటి కోరుకుంటోంది. – బి.చెన్నారెడ్డి, ఆలయ ప్రధాన నిర్వాహకులుధర్మానికి అండగా నిలవండి ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్న ధార్మిక ఆశ్రమాలను సాకులు చెబుతూ కూల్చడం అభ్యంతరకరం. ఇలాంటి వందలాది ఆశ్రమాలను, ధార్మికవేత్తలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వ చర్యలుండాలి. ధర్మ ప్రచారానికి అండగా నిలవాలి.– శ్రీనివాసానందస్వామి, కాశీనాయన క్షేత్రం50 ఎకరాలు ఇచ్చాం..కాశీనాయన క్షేత్రం సుమారు 13 హెక్టార్లలో విస్తరించింది. అభివృద్ధి పనులు కొన్నేళ్లుగా ఆగిపోయాయి. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అటవీభూమికి ప్రత్యామ్నాయంగా ఇప్పటికే 50 ఎకరాలను పెనగలూరు మండలంలో ఇచ్చాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే ఆశిస్తున్నాం.– జీరయ్య, ఆలయ ప్రధాన అర్చకుడు -
స్వర్ణ దేవాలయంలో భక్తులపై దాడి.. ఐదుగురికి గాయాలు
అమృత్సర్: పంజాబ్లోని అమృత్సర్లో గల స్వర్ణదేవాలయం(Golden Temple)లో దారుణం చోటుచేసుకుంది. ఆలయానికి వచ్చిన భక్తులపై ఒక వ్యక్తి ఇనుప రాడ్తో దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు ఆలయ సిబ్బందితో పాటు ముగ్గురు భక్తులు గాయపడ్డారు. ఈ ఘటనతో స్థానికులు, భక్తులు ఉలిక్కిపడ్డారు.శిరోమణి గురుద్వారా కమిటీ(Shiromani Gurdwara Committee) ప్రతినిధి ప్రతాప్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం ఆలయంలో అనుమానస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని సిబ్బంది ప్రశ్నించగానే అతను దాడికి పాల్పడ్డాడు. ఆలయ సిబ్బందితో పాటు అక్కడున్న భక్తులపై రాడ్తో దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఈ కేసు గురించి పోలీసులు మాట్లాడుతూ దాడికి పాల్పడిన వ్యక్తి హర్యానాకు చెందినవాడని, ఈ ఘటన అనంతరం ఆలయ సిబ్బంది అతనిని పట్టుకుని తమకు అప్పగించారన్నారు. గాయపడిన భక్తులు మోహాలీ, బఠిండా, పటియాలా నుంచి వచ్చినవారని తెలిపారు. గాయపడినవారందరినీ గురు రామ్దాస్ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తితో పాటు వచ్చిన ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆలయ సిబ్బంది కోరుతున్నారు.పోలీస్ కమిషనర్ గురుప్రీత్ సింగ్ భుల్లార్ మీడియాతో మాట్లాడుతూ దర్బార్ సాహిబ్ కాంప్లెక్స్(Darbar Sahib Complex)లోని రెండవ అంతస్థులో అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని ఆలయంలో పనిచేస్తున్న జస్బీర్ సింగ్ గుర్తించి, కిందకు రమ్మని కోరగా, అందుకు అతను నిరాకరించాడన్నారు. దీంతో జస్బీర్ సింగ్ రెండవ అంతస్థుకు వెళ్లి అతనిని కిందకు దిగాలని కోరారు. అయితే అతను వెంటనే ఒక రాడ్తో జస్బీర్ సింగ్పై దాడి చేశాడు. దీనిని చూసిన ఇతర సిబ్బంది ఆ వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపధ్యంలో వారు కూడా గాయపడ్డారు. నిందితుడిని జుల్ఫాన్గా పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని గురుప్రీత్ సింగ్ తెలిపారు.ఇది కూడా చదవండి: West Bengal: హోలీ వేళ యువకుని హత్య -
కొండరాళ్లలో దొరికిన అమ్మ...కొండంత అమ్మ!
కొలిచిన భక్తులకు కొంగుబంగారంగా శ్రీ కొండలమ్మ తల్లి భక్తుల నమ్మకాన్ని చూరగొంటున్నారు. తల్లి చెంతకు వచ్చి తమ కోర్కెలు కోరినంతనే ఆ కోర్కెలను తీర్చే కల్పతరువుగా ప్రసిద్ధి గాంచారు ఈ అమ్మవారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం కొండలమ్మ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచారు. కొండరాళ్లలో దొరకటం వలన ఆ తల్లిని కొండలమ్మ అనే పేరుతో భక్తులు పిలుస్తున్నారు.వ్యాపారం, ఉద్యోగం, సంతానం, వివాహం, రాజకీయ పదవులు, పారిశ్రామికం, సినిమా అవకాశాలు ఒకటేమిటి? ఏ రంగానికి చెందిన వారైనా భక్తితో నమ్మి అమ్మ వద్ద తలచుకుంటే చాలు వారికి వరాల జల్లు కురిపిస్తుంది కొండలమ్మ తల్లి. బిడ్డ పుట్టినా, పెళ్లి జరిగినా పిల్లాపాపలు, నూతన వధూవరులు తమ కోర్కెలు తీరాక తల్లి సన్నిధిలోనే తమతమ మొక్కుబడులను చెల్లించుకోవటం పరిపాటిగా వస్తోంది. భక్తితో కొలవటంతో తృప్తి చెందక తమ ఇంటిలో ఆ తల్లి పేరును అనుకున్నదే తడవుగా స్తుతించాలనే దృక్పథంతో కొండలమ్మను ఆ భక్తులు తలచుకుంటున్నారు. ఆ ఊరిలోనే కాదు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా కొండా, కొండలమ్మ, కొండయ్య, కొండబాబు వంటి పేర్లతో ఆ దేవత పేరును తమ కడుపున పుట్టిన బిడ్డలకు పెట్టుకుంటున్నారు. ఆ తల్లి చల్లని సన్నిధిలో వివాహాలు, అన్నప్రాశన, ఊయలలో వేయటం వంటి శుభ కార్యక్రమాలను భక్తులు జరుపుకుని దీవెనలను ΄పొందుతున్నారు మహిమలతో తల్లి కీర్తి చాలా తక్కువ కాలంలోనే దశదిశలకు వ్యాపించింది. అమ్మవారి ఆలయానికి ప్రతి ఆదివారం కృష్ణాజిల్లా నుంచే గాక ఇరు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి మొక్కుబడులు చెల్లిస్తున్నారు. ఆది, గురువారాల్లో 25వేల మంది భక్తులు తల్లిని దర్శించుకుంటున్నారు. అమ్మవారు కొలువైన ప్రాంతం మచిలీపట్నం–నూజివీడు–కత్తిపాడు ప్రధాన రహదారి కావటంతో ఎవరు రోడ్డు వెంబడి వెళ్లినా ఆమె దర్శనం కొరకు నిలుస్తున్నారు. వాహనాల్లోనే గాక నడిచి వెళ్లినా రాకపోకల్లో అమ్మవారిని దర్శించుకోవాల్సిందే. కొండరాళ్లలో దొరికిన అమ్మఈ దేవాలయానికి దాదాపు దశాబ్దాల చరిత్ర ఉంది. వేమవరంలో రహదారి పక్కనే దివాన్ సాహెబ్ కోడ్డు మురుగు కాలువకు రివిట్మెంట్ కడుతున్నారు. ఆ గోడను కొండరాళ్లతో నిర్మిస్తుండగా వాటిలో ఒకరాయి అమ్మవారిని పోలినట్లుగా పనివారికి కనబడింది. ఆ రాయిని నిర్మాణంలో కలపకుండా పక్కన పెట్టారు. కొద్ది రోజులకు ఆ రాయిని రోడ్డు పక్కన నిలబెట్టి... పసుపు, కుంకుమలు చల్లి భక్తులు పూజలు చేసేవారు. అక్కడికి బాతులు పెంచుకునేవారు వచ్చారు. ఆ రాయి పక్కనే కుటీరం ఏర్పాటు చేసుకున్నారు. అమ్మవారి విగ్రహం పక్కనే ఉండటం వలన ఆ బాతులు విపరీతంగా గుడ్లు పెట్టేవని పెంపకం దారులకు నమ్మకం ఏర్పడింది. ఆ బాతుల యజమానికి విపరీతమైన లాభాలు వచ్చాయి. సీజన్ పూర్తి కావటంతో ఆ బాతుల యజమాని గుంటూరు వలస వెళ్లుటకు నిర్ణయించుకున్నాడు. బాతుల్ని లారీలో వేసుకునేటపుడు వాటితోపాటు అమ్మవారిని కూడా తీసుకెళ్లారు. గుంటూరు వెళ్లగానే అక్కడ బాతుల్ని దించారు. వాటితోపాటు అమ్మవారిని దించగా వెంటనే బాతులు మొత్తం హఠాత్తుగా మృత్యువాతపడ్డాయి. వెంటనే అతను మరలా అమ్మవారిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చేశాడు. ప్రస్తుతం అమ్మవారు పూజలందుకుంటున్న స్థానంలోనే నిలి΄పాడు. ఈ నిదర్శనం చుట్టుపక్కల ప్రాంతాల్లో అనతికాలంలో మౌఖికంగా ప్రచారం జరిగింది. అప్పటి నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు విరివిగా వచ్చి పాల పొగగళ్లు సమర్పించి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు.శోభాయమానంగా నవరాత్రులు...తల్లి సన్నిధిలో ఏటా దసరా నవరాత్రి మహోత్సవాలు శోభాయమానంగా జరుçగుతాయి. దుర్గాష్టమి రోజున కనకడప్పుల వాద్యాలు, బాణాసంచా, చిత్ర విచిత్ర వేషధారణలతో చుట్టుపక్కలున్న గ్రామాల్లో అమ్మవారి భారీ ఊరేగింపు సాగుతుంది. ఆ రోజు 20 వేల మంది భక్తులకు అన్నసమారాధన ఉంటుంది. నవరాత్రుల్లో భక్తుల ఉల్లాసం కొరకు సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలు ఉంటాయి. తొలుత కొండలమ్మ మూలవిరాట్ను దర్శించుకునే ఆలయం చిన్నదిగా ఉండేది. ఆ తర్వాత భారీ ఆలయాన్ని దేవాదాయ శాఖ వారు నిర్మించి అభివృద్ధి చేయటం జరిగింది. అనివేటి మండపాన్ని నిర్మించారు. ఈ మండపంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ విగ్రహానికే దసరా ఉత్సవాలకు దేవతా స్వరూపాలను అలంకరిస్తున్నాం. ఈ తల్లి మూలవిరాట్ నేల మీదనే తల వరకే దర్శనమిస్తుంది. మనసులో మాట అనుకున్నంతనే అవి తీరుస్తున్న అమ్మవారికి భక్తుల నుంచి తాకిడి నానాటికీ పెరిగి΄ోతుంది. సినీ నటులు, నిర్మాతలు, దర్శకులు, రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు, రైతులు ఒక్క రంగమే కాదు అన్ని రంగాలకు చెందిన భక్తులు ఏం కోరుకుంటే అది తీరుస్తూ వారి నుంచి పూజలందుకుంటున్నారు అమ్మవారు. మొక్కుబడులు తీర్చుకునే భక్తులు కొండలమ్మకు పాల పొంగళ్లను సమర్పిస్తారు. – అయికా రాంబాబుసాక్షి, గుడ్లవల్లేరు, కృష్ణాజిల్లా -
Mahakumbh: చివరి పుణ్యస్నానాలకు పోటెత్తిన జనం.. తాజా ఫొటోలు
కోట్లాది మంది భక్తుల విశ్వాసం, అఖాడాలు సాధువుల ఆశీస్సులతో ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా(Kumbh Mela) చివరి దశకు చేరుకుంది.మహాశివరాత్రి వేళ పవిత్ర స్నానం ఆచరించడానికి మహా కుంభమేళాకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. మహా కుంభమేళాలో ఐక్యత, సామాజిక సామరస్యాల అద్భుతమైన సంగమం కనిపిస్తోంది.మహాశివరాత్రి(Mahashivratri) నాడు మహా కుంభమేళాలో భక్లులు స్నానాలు చేసేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. సంగమం వద్ద జనం గుమిగూడకుండా సమీపంలోని ఘాట్లలో పవిత్ర స్నానం చేయాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 64 కోట్లకు పైగా భక్తులు మహా కుంభమేళాను సందర్శించారు. మహాశివరాత్రి నాడు ఈ సంఖ్య మరింత పెరగనుంది. మహాశివరాత్రికి ముందు రోజు సాయంత్రం నుంచే ఘాట్ల వద్దకు భక్తజనం చేరుకున్నారు.మహా శివరాత్రి రోజున మహా కుంభమేళాకు చేరుకున్న ప్రతి ఒక్కరూ గంగానదిలో స్నానం చేస్తున్నారు. అనంతరం గంగా మాతను పూజిస్తున్నారు.మహా కుంభ ప్రాంతంలో యాత్రికుల రాక రాత్రింబవళ్లు కొనసాగుతోంది. సంగమ స్థలిలో పూజా సామగ్రి విరివిగా విక్రయిస్తున్నారు. భద్రతా సిబ్బంది భక్తుల రద్దీని నియంత్రించడంలో బిజీగా ఉన్నారు.మహా కుంభమేళా సంప్రదాయాలు మహా శివరాత్రి పూజతో పూర్తవుతాయి. మహాశివరాత్రి సందర్భంగా సూర్యోదయానికి ముందే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడం ప్రారంభించారు.మహాశివరాత్రి సందర్భంగా మహా కుంభమేళాలో స్నానానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కోటి మందికి పైగా భక్తులు మహాకుంభ నగరంలో ఉన్నారు.భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నందున అధికార యంత్రాంగం పలు ఏర్పాట్లు పూర్తి చేసింది. జనసమూహాన్ని నియంత్రించేందుకు అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.మహా కుంభమేళాలో భద్రతా ఏర్పాట్ల కోసం 37,000 మంది పోలీసులను మోహరించారు. అలాగే 14,000 మంది హోమ్ గార్డులను నియమించారు.భక్తుల భద్రత కోసం 2,750 ఏఐ ఆధారిత సీసీటీవీలు, మూడు వాటర్ పోలీస్ స్టేషన్లు, 18 వాటర్ పోలీస్ కంట్రోల్ రూములు, 50 వాచ్ టవర్లు ఏర్పాటు చేశారు.చివరి స్నానానికి భక్తుల రద్దీ(Crowd of devotees) ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నందున, మంగళవారం సాయంత్రం నాటికే కుంభమేళా ప్రాంతాన్ని ‘నో వెహికల్ జోన్’గా ప్రకటించారు. మహాశివరాత్రి నాడు సజావుగా పుణ్య స్నానాలు జరిగేలా చూసేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇది కూడా చదవండి: Mahakumbh: ఉప్పొంగుతున్న ఉత్సాహం.. శివభక్తుల పారవశ్యం -
Mahakumbh: ఉప్పొంగుతున్న ఉత్సాహం.. శివభక్తుల పారవశ్యం
నేడు (బుధవారం) మహాశివరాత్రి(Mahashivratri).. మహా కుంభమేళాకు చివరి రోజు.. సంగమ తీరంలో భక్తులు సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. మహా కుంభమేళాకు వచ్చిన భక్తుల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది. చివరి స్నాన ఉత్సవం వేళ భారీ సంఖ్యలో జనం ప్రయాగ్రాజ్ చేరుకుంటున్నారు. భక్తులు పవిత్ర త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరిస్తున్నారు. మహా కుంభమేళాను దృష్టిలో ఉంచుకుని అధికారులు భారీగా సన్నాహాలు చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతాన్ని ఇప్పటికే వాహన రహిత జోన్గా ప్రకటించారు. ప్రయాగ్రాజ్కు వెళ్లే రహదారులపై భారీగా జనసమూహం కనిపిస్తోంది. #WATCH | Prayagraj: "I cannot express my sentiments in words... We came here with a lot of excitement... We came here because it is the last day of the #MahaKumbh2025. We are fortunate to have the blessings of Maa Ganga...," says a devotee at the Maha Kumbh pic.twitter.com/UtkHStrcMc— ANI (@ANI) February 26, 2025మహాకుంభమేళా(Mahakumbh Mela)లో పుణ్యస్నానాలు ఆచరించేవారి సంఖ్య మొత్తంగా 67 కోట్లకు చేరుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రయాగ్రాజ్, వారణాసి, అయోధ్యలలో, మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రయాగ్రాజ్కు వచ్చే జనం అటు వారణాసి, ఇటు అయోధ్యలను సందర్శిస్తున్నారు.#WATCH प्रयागराज: महाशिवरात्रि के अवसर पर श्रद्धालु पावन स्नान के लिए महाकुंभ में पहुंच रहे हैं। ड्रोन वीडियो त्रिवेणी संगम से है। #MahaKumbh2025 pic.twitter.com/h6DwRka6IS— ANI_HindiNews (@AHindinews) February 26, 2025మహాశివరాత్రి సందర్భంగా ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభ్లో స్నానం చేయడానికి వచ్చే సాధువులు, భక్తులతో పాటు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అభినందనలు తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం ప్రజలంతా సమాజ సంక్షేమానికి కట్టుబడి ఉండేందుకు ప్రేరణ కల్పిస్తుందని ఆయన అన్నారు.#WATCH | Uttar Pradesh: Devotees continue to arrive in large numbers at Triveni Sangam in Prayagraj to be a part of #MahaKumbh2025 on its last day. The Mela will conclude today, 26th February, on Maha Shivratri. pic.twitter.com/sTAs4XF2kD— ANI (@ANI) February 25, 2025మహా కుంభమేళాకు వచ్చిన ఒక భక్తురాలు మాట్లాడుతూ ‘నా భావాలను మాటల్లో వ్యక్తపరచలేను.మేము ఎంతో ఉత్సాహంతో ఇక్కడికి వచ్చాం.. ఇది 2025 మహా కుంభమేళాలో చివరి రోజు.. అందుకే మేము ఇక్కడికి వచ్చాం. గంగా మాత ఆశీస్సులు అందుకోవడం మా అదృష్టం’ అని అన్నారు.#WATCH वाराणसी: महाशिवरात्रि के अवसर पर पूजा करने के लिए काशी विश्वनाथ मंदिर में भक्तों की भीड़ उमड़ रही है। pic.twitter.com/R7GOmiWHTA— ANI_HindiNews (@AHindinews) February 26, 2025మహాశివరాత్రికి ముందే ప్రయాగ్రాజ్ మహాకుంభానికి చేరుకున్న భక్తుల సంఖ్య 65 కోట్లు దాటింది. మహాశివరాత్రి నాడు భక్తుల పవిత్ర స్నానాలు సజావుగా సాగేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Chief Minister Yogi Adityanath) స్థానిక అధికారులతో నిరంతరం టచ్లో ఉంటున్నారు. మరోవైపు ఈరోజు భక్తులు పవిత్ర స్నానాలు చేసేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఘాట్లలో భక్తులు పవిత్ర స్నానాలను క్రమశిక్షణతో చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళాలో నేటి శివరాత్రితో ముగియనుంది. VIDEO | Devotees in large numbers head towards Triveni Sangam to take holy dip on the occasion of Maha Shivratri. #Mahashivratri2025 #MahaKumbh2025 pic.twitter.com/teaCWZWh7x— Press Trust of India (@PTI_News) February 25, 2025ఇది కూడా చదవండి: Maha Kumbh: ఆఖరిరోజు పుణ్య స్నానాలకు ఎంత మంది అంటే.. VIDEO | Devotees in large numbers head towards Triveni Sangam to take holy dip on the occasion of Maha Shivratri. #Mahashivratri2025 #MahaKumbh2025 pic.twitter.com/teaCWZWh7x— Press Trust of India (@PTI_News) February 25, 2025 -
Mahashivratri 2025: శివరాత్రికి ఉపవాసం, ఇంట్రస్టింగ్ టిప్స్
మహాశివరాత్రి శైవభక్తులకు ఎంతో ఇష్టమైన పండుగ. అలాగే ఆ పరమశివుడికి కూడా మహాశివరాత్రి ఎంతో ప్రీతికరమైన పర్వదినం. ఫాల్గుణ మాసంలో చీకటి పక్షంలో పద్నాలుగో రోజున వస్తుంది,శివర్రాతి రోజు భక్తకోటి శివుడికి అభిషేకాలు చేస్తారు. రోజంతా పచ్చి గంగ కూడా ముట్టకుండా ఉపవాసం ఉంటారు. శివనామస్మరణతో రాత్రంతా జాగరణ చేస్తారు. మహాశివరాత్రి సాయంత్రం శివలింగాన్ని పూజిస్తారు. దీపాలు వెలిగించి, రాత్రంతా ఆలయంలో గడుపుతారు. భారతదేశంలోని అనేక దేవాలయాలలో, రాత్రిపూట శివుడు, పార్వతిని అద్భుతమైన ఊరేగింపుగా పల్లకీపై తీసుకువెళతారు.మహాశివరాత్రి ధ్యానానికి కూడా మంచి సమయం. ఈ రోజు ఉపవాసం ఉండటం వల్ల జీర్ణక్రియ బాగుంటుందని శాస్త్రాలు, పురాణ పండితులు చెబుతున్న మాట. ఆయుర్వేద పరంగా కూడా ఉపవాసం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆధ్యాత్మికంగా మనిషిని నిశ్చలంగా ఉంచడానికి, మనసును శుద్ధి చేయడానికి ఉపయోపడుతుంది. మహాశివరాత్రి రోజు మంత్ర జపం, ధ్యానం, జాగరణ చేయడం వల్ల ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతుంది. ఉపవాసం ఆధ్యాత్మిక అభివృద్ధికి సహాయపడుతుంది. శరీరంలో శక్తి పెరుగు తుంది. శివరాత్రి సమయంలో ఉపవాసం అంటే శివునికి దగ్గరగా ఉండటం అని అర్థం. పంచేద్రియాలను దేవుడిపై నిమగ్నం చేస్తూ ఈ ఉపవాసం చేయాలట.అయితే మన శక్తి, ఆరోగ్యస్థాయిని బట్టి ఉపవాసం చేయాలి. అనారోగ్యంతో ఉన్నవాళ్లు కఠిన ఉపవాసం చేయాల్సిన అవసరం లేదని భక్తితో శివుణ్ణి తలచుకుని, విశ్వాసంతో పూజచేసుకొని, ఉంగలిగితనంత అంటే, ఒక పూట లేదా, ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా ఉపవాసం ఉండి "ఓం నమః శివాయ" అని జపాన్మి స్మరించుకుంటే, ఆత్మకు శాంతిని, శివుని ఆశీస్సులను అందిస్తుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా బీపీ, షుగర్, ఇతర తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉంటే ఉపవాసాన్ని శక్తిని బట్టి సాధ్యమైనంత తొందరగా ముగించేయాలి. చదవండి: Shivaratri2025 పుణ్యప్రదం.. జ్యోతిర్లింగ దర్శనం ఉపవాస రకాలునిర్జల ఉపవాసం.. 24 గంటల పాటు ఆహారం, నీరు కూడా తీసుకోకూడదు. ఆరోగ్యం సహకరిస్తేనే ఈ ఉపవాసం చేయాలి.జల ఉపవాసం.. రోజంతా ఆహారం లేకుండా నీరు మాత్రమే తాగాలి.ద్రవ ఉపవాసం.. ఈ ఉపవాసంలో టీ, కొబ్బరి నీరు, నిమ్మకాయ నీరు మాత్రమే తీసుకోవాలి.పాలు, పండ్ల ఉపవాసం.. పాలు, పండ్లు, పెరుగు, మజ్జిగ, గింజలు మొదలైనవి తీసుకోవచ్చు.సాత్వికాహార ఉపవాసం.. ఆరోగ్యం బాగా లేకపోతే సగ్గుబియ్యం, మఖానా, డ్రై ఫ్రూట్స్, సాబుదాన కిచిడి, గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు ఉడకబెట్టిన బంగాళాదుంపలు వంటి తేలికపాటి సాత్వికాహారాన్ని ఉప్పు లేకుండా తినాలి.నీరసం రాకుండా ఉండాలంటేముందు మానసికంగా సిద్ధంగా ఉండాలి. చిత్తం ఆ పరమ శివుడిమీద పెడితే అస్సలు ఆకలే అనిపించదని భక్తులు చెబుతున్న మాట. భక్తితో, శివనామస్మరణతో రోజంతా గడపాలి. ఒకవేళ శారీరకంగా బాగా నీరసం అనిపిస్తే జాగ్రత్త పడాలి. ఉపవాసం తర్వాత మొదట పండ్లు, నానబెట్టిన గింజలు లేదా గోరువెచ్చని నిమ్మకాయ నీరు వంటివి తీసుకోవాలి. ఉపవాసం ఉన్న వ్యక్తి పండ్లు మాత్రమే తినాలి. ఈ రోజున, అరటిపండ్లు, ఆపిల్స్, బొప్పాయి, కొబ్బరి, దానిమ్మ మొదలైన పండ్లను తీసుకోవచ్చు.ఆహారంలో ఫైబర్, ప్రొటీన్లు ఎక్కువగా ఉండి, క్యాలరీలు తక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటే మంచిది.మాంసాహారం: శివరాత్రి పర్వదింన ఉపవాసం ఉండేవారు శాకాహారం మాత్రమే తినాలి. -
Maha Kumbh: ఆఖరిరోజు పుణ్య స్నానాలకు ఎంత మంది అంటే..
ప్రయాగ్రాజ్: ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఉత్సవంగా పేరొందిన మహాకుంభమేళా ఫిబ్రవరి 26 శివరాత్రి పర్వదినంతో ముగియనుంది. మహా కుంభమేళా చివరి అమృత స్నానంలో కోటి మందికి పైగా భక్తులు పాల్గొంటారని స్థానిక అధికారులు అంచనా వేశారు. ఈ నేపధ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విస్తృత రీతిలో భద్రతా ఏర్పాట్లు చేసింది.జనవరి 13న మహా కుంభమేళా(Maha Kumbh) ప్రారంభమైనది మొదలు ఇప్పటివరకు దాదాపు 64 కోట్ల మంది భక్తులు గంగా, యమున, సరస్వతి నదుల సంగమమైన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. రైళ్లు, విమానాలు, రోడ్డు మార్గాలలో కోట్లాదిమంది భక్తులు ప్రయాగ్రాజ్కు తరలివస్తున్నారు. శివరాత్రి( Mahashivratri) సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు నగరంలోనికి ఎటువంటి వాహనాలను అనుమతించరు. అయితే వాటి పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించారు.ప్రయాగ్రాజ్కు వెళ్లే అన్ని ప్రధాన రహదారులలో మోటార్బైక్లపై 40 పోలీసు బృందాలను మోహరించారు. కుంభమేళా చివరి రోజు మహాశివరాత్రి ఒకరోజు అయినందున ప్రయాగ్రాజ్లోని శివాలయాలను సందర్శించేందుకు భక్తులకు అనుమతినివ్వనున్నారు. ఆయా శివాలయాలలో శాంతిభద్రతలను కాపాడేందుకు ఇప్పుటికే అదనపు పోలీసు సిబ్బందిని నియమించారు. కాగా మహా కుంభమేళా ప్రారంభంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(UP Chief Minister Yogi Adityanath) ఈ కార్యక్రమానికి 45 కోట్లకు పైగా భక్తులు వస్తారని అంచనా వేశారు. ఈ సంఖ్య ఫిబ్రవరి 11 నాటికే నమోదయ్యింది. తరువాతి మూడు రోజుల్లో ఆ సంఖ్య 50 కోట్లు దాటింది. తాజాగా.. 60 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారని ప్రభుత్వం ప్రకటించింది. మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేయడం వలన జీవన్మరణ చక్రం నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ‘ఆ గోధుమలతోనే జుట్టూడింది’ -
Mahashivratri: మనోభీష్టాలు నెరవేర్చే.. ఐదు విశిష్ట శివాలయాలు..
రేపు (ఫిబ్రవరి 26, బుధవారం) మహాశివరాత్రి.. దేశంలోని శివాలయాలన్నీ శివనామస్మరణలతో మారుమోగిపోనున్నాయి. మహాశివుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరనున్నారు. మహాశివరాత్రి సందర్భంగా పలు శివాలయాలను ఇప్పటికే అందంగా ముస్తాబు చేశారు. మనదేశంలో పలు పురాతన శివాలయాలు ఉన్నాయి. వీటిలో ఐదు శివాలయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.కేదార్నాథ్కేదార్నాథ్ దేవాలయం ఉత్తరాఖంఢ్లోని రుద్రప్రయాగలో ఉంది. ఇది నాలుగు ధామ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. కేదార్నాథ్, బద్రీనాథ్ దేవాలయాలు ఉత్తరాఖండ్లోని రెండు ప్రధాన పుణ్యక్షేత్రాలు.సోమనాథ్ గుజరాత్లోని కథియావర్ ప్రాంతంలో సముద్ర తీరంలో సోమనాథ్ ఆలయం ఉంది. ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ ఆలయ వైభవం గురించి మహాభారతం, భగవద్గీత, స్కంద పురాణాలలో కూడా ఉందని చెబుతారు. శివుణ్ణి తన ప్రభువుగా భావించిన చంద్రుడు ఇక్కడ తపస్సు చేశాడని అంటారు.త్రయంబకేశ్వర్ త్రయంబకేశ్వర్ ఆలయం మహారాష్ట్రలోని గోదావరి నది ఒడ్డున ఉంది. ఈ ఆలయం నల్ల రాతితో నిర్మితమయ్యింది. ఇక్కడికి వచ్చిన శివ భక్తుల కోరికలు తప్పక నెరవేరుతాయని చెబుతుంటారు.దక్షేశ్వర్ఉత్తరాఖంఢ్లోని హరిద్వార్లో దక్షేశ్వర శివాలయం ఉంది. ఈ ఆలయంలోని శివలింగానికి అభిషేకం చేస్తే పలు ప్రయోజనాలు కలుగుతాయని చెబుతుంటారు.అమర్నాథ్ అమర్నాథ్ ఆలయం జమ్ముకశ్మీర్లో ఉంది. ఈ ఆలయం ఒక గుహ రూపంలో ఉంటుంది. ఈ పవిత్ర గుహలో దాదాపు 10 అడుగుల ఎత్తున సహజ శివలింగం మంచుతో ఏర్పడుతుంది. ఆషాఢ పూర్ణిమ నుండి రక్షాబంధన్ వరకు భక్తులు అమరనాథుణ్ణి దర్శనం చేసుకునేందుకు తరలివస్తుంటారు.ఇది కూడా చదవండి: Mahashivratri: నేపాల్కు 10 లక్షలమంది భారతీయులు -
అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు భక్తులు మృతి
సాక్షి, అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఓబులవారి పల్లె మండలం గుండాలకోన వద్ద ఏనుగుల దాడిలో ముగ్గురు భక్తులు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శివరాత్రి సందర్భంగా వై.కోట సమీపంలోని గుండాల కోనకు దర్శనానికి బయలుదేరిన భక్తులను ఏనుగులు తొక్కి చంపాయి. మృతులు ఉర్లగడ్డ పోడు గ్రామానికి చెందిన వ్యక్తులుగా సమాచారం. మృతులను వంకాయల దినేష్, తుపాకుల మణమ్మ, చంగల్ రాయుడుగా గుర్తించారు.పార్వతీపురం మన్యం జిల్లాలో..మరో ఘటనలో పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం పెదమేరంగిలో ఏనుగులు హల్చల్ చేశాయి. తెల్లవారుజామున సాయి గాయత్రి మోడరన్ రైస్ మిల్ షట్టర్లను విరగగొట్టి మిల్లులోనికి చొరబడ్డాయి. మిల్లులో భద్రపరిచిన ధాన్యం, బియ్యం నిల్వలను నాశనం చేశాయి. నెల రోజుల్లో రెండు సార్లు ఇదే మిల్పై దాడి చేయడంతో సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దశాబ్దాలుగా ఏనుగుల సమస్య..కాగా, చిత్తూరు జిల్లాలోని కౌండిన్య అభయారణ్యంలో ఏనుగుల సమస్య దశాబ్దాలుగా ఉంది. అడవిదాటి వచ్చి ఏనుగులు రైతుల పంటలను నాశనం చేస్తున్నాయి. మరోవైపు ఏనుగుల దాడుల్లో జనాలు మృత్యువాత పడుతున్నారు. ఏనుగులు సైతం వివిధ కారణాలతో మరణిస్తున్నాయి. అడవిలోంచి ఏనుగులు బయటకు రాకుండా కట్టడి చేసేందుకు ఇప్పటివరకు అటవీశాఖ చేపట్టిన సోలార్ ఫెన్సింగ్, కందకాల తవ్వకం వల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది.కర్ణాటక టైప్ పేరిట గతంలో చేపట్టిన హ్యాంగింగ్ సోలార్ సిస్టం సైతం ప్రయోగాత్మకంగానే ముగిసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కుంకీ ఏనుగుల ద్వారా ఇక్కడి ఏనుగులను కట్టడి చేసేందుకు పలమనేరు మండలంలోని ముసలిమొడుగు వద్ద కుంకీ ఎలిఫెంట్ ప్రాజెక్టు పనులు చేపడుతోంది. ఇదే తరహాలో రామకుప్పం మండలంలో ననియాల క్యాంపును గతంలో ఏర్పాటు చేసినా ఈ ఏనుగులు కనీసం అడవిలోని ఓ ఏనుగును సైతం అదుపు చేయలేదు. ఈ నేపథ్యంలో ఇక్కడికి రానున్న కుంకీ ఏనుగులు అడవి ఏనుగులను కట్టడి చేస్తాయా? అనే అనుమానం ఇక్కడి రైతుల్లో నెలకొంది. -
Mahashivratri: నేపాల్కు 10 లక్షలమంది భారతీయులు
ఫిబ్రవరి 26.. మహాశివరాత్రి.. ‘హరహర మహాదేవ..శంభో శంకర’(Hara Hara Mahadeva..Shambho Shankara) అంటూ శివనామస్మరణలతో మారుమోగనున్న శివాలయాలు. భక్తిపావశ్యంలో శివభక్తులు మునిగితేలే వేళ.. నేపాల్లోని పశుపతినాథ్ ఆలయానికి లెక్కకుమించినంతమంది భారతీయులు తరలివెళ్లనున్నారు. మహాశివరాత్రి సందర్భంగా నేపాల్లోని పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించేందుకు భారత్ నుంచి సుమారు పది లక్షల మంది భక్తులు తరలివెళుతున్నారు. భాగమతి నది ఒడ్డున ఉన్న ఐదవ శతాబ్దపు ఈ ఆలయంలో శివరాత్రి పూజలు నిర్వహించేందుకు నాలుగువేల మంది సాధువులతో పాటు, వేలాదిమంది భక్తులు తరలివస్తున్నారని పశుపతినాథ ఆలయ ట్రస్ట్ అధికారులు తెలిపారు. మహాశివరాత్రి నిర్వహణకు సన్నాహాలు పూర్తయ్యాయని పశుపతి ట్రస్ట్ ప్రతినిధి తెలిపారు.శివరాత్రి(Shivaratri) రోజున భక్తుల భద్రతకు 10 వేల మంది భద్రతా సిబ్బందిని నియమించారు. అలాగే 5,000 మంది స్వచ్ఛంద సేవకులను భక్తులకు సేవలు అందించనున్నారు. మహాశివరాత్రి నాడు తెల్లవారుజామున 2.15 గంటలకు పశుపతినాథ్ ఆలయం తెరుచుకుంటుందని, ఆలయంలోని నాలుగు ద్వారాల నుండి భక్తులు మహాశివలింగాన్ని దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో మద్యం, మాంసం, చేపల అమ్మకం, వినియోగాలను నిషేధిస్తూ ఖాట్మండు జిల్లా పరిపాలన కార్యాలయం(Kathmandu District Administration Office) నోటీసు జారీ చేసింది. సోమవారం నుండి గురువారం వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది. దీనిని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. హిమాలయాలు శివుని నివాసమని హిందువులు ప్రగాఢంగా నమ్ముతారు. నేపాల్లో పెద్ద సంఖ్యలో శైవులు ఉన్నారు. వీరు శివుణ్ణి ప్రధానంగా ఆరాధిస్తుంటారు.ఇది కూడా చదవండి: Delhi: రేఖా గుప్తా జీతమెంత? కేజ్రీవాల్ పింఛనెంత? -
Maha Shivratri: మహాశివరాత్రి ఎలా మొదలయ్యిందంటే..
ఫిబ్రవరి 26న దేశవ్యాప్తంగా మహాశివరాత్రి(Mahashiratri) వేడుకలు నిర్వహించనున్నారు. ఆరోజున హృదయపూర్వకంగా శివపార్వతులను అర్చిస్తే మనసులోని కోరికలు నెరవేరుతాయని పెద్దలు చెబుతుంటారు. శివరాత్రి సందర్భంగా దేశంలోని వివిధ ఆలయాలను ముస్తాబు చేస్తుండగా, మరికొన్ని శివాలయాల్లో ఇప్పుటికే శివరాత్రి వేడుకలు మొదలయ్యాయి. ప్రతీనెలలోనూ మాస శివరాత్రి వస్తుంది. అయితే ఏడాదికి ఒక్కసారి వచ్చే మహాశివరాత్రికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ పర్వదినం చేసుకోవడం వెనుక పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే వీటిలో ఒక కథ ఎంతో ప్రాచుర్యం పొందింది. దాని ప్రకారం ప్రకారం ఫాల్గుణమాసం, కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి తిథిరోజున తొలిసారి మహాశివుడు జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిచ్చాడని చెబుతారు. ఆనాటి నుంచి ఇదే తిథి నాడు శివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇదే రోజున శివుడు నిరాకారం నుంచి సాకార రూపం(Physical form)లో కనిపించాడని చెబుతారు.పురాణాల ప్రకారం పాల్గుణం, కృష్ణపక్షంలోని చతుర్ధశి తిథి రోజునే పార్వతీమాత మహాశివుణ్ణి వివాహమాడిందని చెబుతారు. అందుకే మహాశివరాత్రి రోజున శివపార్వతుల కల్యాణం నిర్వహిస్తారు. శివరాత్రి పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో విశేష రీతిలో పూజలు నిర్వహిస్తారు. ఆరోజున మహేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు ఆలయాల వెలుపల బారులుతీరి ఉంటారు.ఇది కూడా చదవండి: Mahakumbh: ముఖ్యమంత్రి యోగి మరో రికార్డు -
మహా ’కాసుల’ మేళా!
సాక్షి, బిజినెస్ బ్యూరో: మహా కుంభమేళా కాసులు కురిపిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు కోట్లాది మంది భక్తులను ఆకర్షిస్తున్న ఈ వేడుక.. వస్తువులు, సేవల ద్వారా రూ.3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం నమోదు చేయనుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనా వేసింది. ఇది భారత్లో అతిపెద్ద ఆర్థిక కార్యక్రమాలలో ఒకటిగా నిలిచిందని సీఏఐటీ సెక్రటరీ జనరల్, చాందినీ చౌక్ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. 144 ఏళ్లకోసారి జరిగే మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభం కాగా ఈ నెల 26 వరకు కొనసాగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మతపర, ఆధ్యాత్మిక సమావేశంగా గుర్తింపు పొందిన ఈ కుంభమేళాలో కోట్లాదిమంది భక్తులు పాల్గొన్నారు. అంచనాలను మించి..విశ్వాసం, ఆర్థిక వ్యవస్థ మధ్య సంబంధాన్ని ఈ కార్యక్రమం దృఢంగా నిర్వచించిందని ఖండేల్వాల్ అన్నారు. ‘డైరీలు, క్యాలెండర్లు, జనపనార సంచులు, స్టేషనరీ తదితర మహాకుంభ నేపథ్య ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం స్థానిక వాణిజ్యాన్ని పెంచుతోంది. కచి్చతమైన బ్రాండింగ్ కారణంగా అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. మహా కుంభమేళా ప్రారంభానికి ముందు 40 కోట్ల మంది ప్రజలు వస్తారని అంచనా వేశారు.అలాగే దాదాపు రూ.2 లక్షల కోట్ల విలువైన వ్యాపార లావాదేవీలు జరుగుతాయని భావించారు. అయితే దేశవ్యాప్తంగా నెలకొన్న అపూర్వ ఉత్సాహం కారణంగా.. ఉత్సవాలు ముగిసే నాటికి ఇంకా భారీ సంఖ్యలో ఈ మహా కుంభమేళాలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. తద్వారా భారీ స్థాయిలో రూ.3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం నమోదు అయ్యే అవకాశం ఉందని ఖండేల్వాల్ చెప్పారు. భారీగా ఆర్థిక కార్యకలాపాలుఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ఈ కార్యక్రమం గణనీయ ప్రోత్సాహాన్ని అందించిందని, కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించిందని సీఏఐటీ వెల్లడించింది. ఆతిథ్యం, వసతి, ఆహారం, పానీయాలు, రవాణా, మతపర దుస్తులు, పూజా సామగ్రి, హస్తకళలు, వ్రస్తాలు, దుస్తు లు, వినియోగ వస్తువులు, ఆరోగ్య సంరక్షణ, వెల్నెస్ సేవలు, మీడియా, ప్రకటనలు, వినోదం, పౌర సేవలు, టెలికం, మొబైల్, ఏఐ ఆధారిత సాంకేతికత, సీసీటీవీ కెమెరాలు, ఇతర పరికరాలు వంటి అనేక వ్యాపార విభాగాల్లో పెద్ద ఎత్తున ఆర్థిక కార్యకలాపాలు నమోదయ్యాయని వివరించింది. 150 కిలోమీటర్ల పరిధిలో లబ్ధిమహాకుంభ మేళా ఆర్థిక ప్రయోజనాలు ప్రయాగ్రాజ్కు మాత్రమే కాకుండా 150 కిలోమీటర్ల పరిధిలో ఉన్న నగరాలు, పట్టణాలకు కూడా విస్తరించాయి. అయోధ్య, వారణాసి, ఇతర మతపర ప్రదేశాలకు యాత్రికులు వెల్లువెత్తారు. మహాకుంభ మేళా భారత్లో వ్యాపారం, వాణిజ్యం, సాంస్కృతిక వ్యవస్థ రూపురేఖలను సానుకూలంగా మారుస్తుందని, ఏళ్ల తరబడి కొత్త రికార్డును సృష్టిస్తుందని భావిస్తున్నారు. -
హరోం హర అంటున్న సినీ స్టార్స్
మహా శివరాత్రి పర్వదినం (ఫిబ్రవరి 26) సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నాయి. శివుడికి ఎంతో ఇష్టమైన రోజు అయిన మహా శివరాత్రికి జాగరణ చేసేందుకు భక్తులు శివాలయాలకు పోటెత్తుతారు. ఆ రోజు శివాలయాలన్నీ హరోం హర అంటూ శివనామ స్మరణతో మార్మోగుతాయి. సినిమా ఇండస్ట్రీకి కూడా మహా శివుడితో ప్రత్యేక అనుబంధం ఉందనే చెప్పాలి. శివుడి నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో చిత్రాలు వచ్చి, ప్రేక్షకులను అలరించాయి. తాజాగా పరమేశ్వరుడి నేపథ్యంలో పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. అలాగే శివ భక్తి నేపథ్యంలో పాటలు కూడా ఉన్నాయి. ఆ చిత్రాల విశేషాల గురించి తెలుసుకుందాం.శివుడి నేపథ్యంలో...తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలైన అక్కినేని నాగార్జున, ధనుష్ నటిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో రష్మికా మందన్న హీరోయిన్. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్తో కలిసి ఎస్వీసీ ఎల్ఎల్పీ బ్యానర్పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శివుడి నేపథ్యం ఉంటుందని తెలుస్తోంది. గత ఏడాది మహా శివరాత్రి కానుకగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ని విడుదల చేశారు మేకర్స్. ఆహార దేవతగా భావించే అన్నపూర్ణా దేవి నుంచి శివుడు భిక్ష తీసుకుంటున్న ఫొటో పోస్టర్లో ఉంది.అంటే... ఈ కథలో శివుడి గురించి ఏదో ఒక లైన్ టచ్ చేసి ఉంటారని కచ్చితంగా ఊహించవచ్చు. పైగా మహా శివరాత్రి కానుకగా ప్రత్యేకించి ఆ పోస్టర్ విడుదల చేయడం కూడా శివుడి నేపథ్యం ఉంటుందని చెప్పకనే చెప్పింది యూనిట్. ఈ సినిమాలో మురికి వాడల్లో నివశించే వ్యక్తిగా ధనుష్ పాత్ర ఉంటుంది. అలాగే ముంబైకి చెందిన ఓ ధనవంతుడి పాత్రలో నాగార్జున కనిపించనుండగా, రష్మికా మందన్న మధ్యతరగతి యువతి పాత్ర చేస్తున్నారు. నటుడు జిమ్ సర్భ్ ఓ బిలియనీర్ బిజినెస్ మ్యాన్గా కనిపిస్తారు. శివ భక్తుడి కథమంచు విష్ణు టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై మంచు మోహన్బాబు పాన్ ఇండియన్ మూవీగా నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 25న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదలకానుంది.ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉంది ‘కన్నప్ప’ యూనిట్. పరమశివుడికి వీర భక్తుడైన కన్నప్ప నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. కన్నప్పలోని వీరత్వం, భక్తిని మేళవించి ఈ మూవీ తెరకెక్కించారు ముఖేశ్ కుమార్ సింగ్. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ శివుడి పాత్ర చేయడం విశేషం. శివ తాండవం చేస్తున్న అక్షయ్ కుమార్ పోస్టర్ని చిత్ర బృందం విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది.శివుడిగా ఆయన పాత్ర ఎలా ఉండబోతోందో ఆ పోస్టర్ ద్వారా చూపించింది యూనిట్. అంతేకాదు... ఈ సినిమా నుంచి విడుదలైన ‘శివ శివ శంకరా...’ పాటకి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్కి పెద్ద పీట వేశారు. ఈ మూవీలో తిన్నడు పాత్రలో మంచు విష్ణు, రుద్ర పాత్రలో ప్రభాస్, పార్వతీ దేవిగా కాజల్ అగర్వాల్ నటించారు. మధుబాల, ప్రీతీ ముకుందన్, ఐశ్వర్య, దేవరాజ్, విష్ణు మంచు కుమార్తెలు అరియానా, వివియానా వంటి వారు ఇతర పాత్రల్లో నటించారు. శివ తాండవం పాప వినాశక సాక్షాత్ సాంబ శివ అంటూ ఆడి పాడుతున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘భైరవం’. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించారు. ఈ మూవీలో అదితీ శంకర్, ఆనంది, దివ్యా పిళ్లై కథానాయికలు. పెన్ స్టూడియోస్పై డా. జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్పై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రంలో శివుడి నేపథ్యంలో ఓ పాట తెరకెక్కించారు మేకర్స్. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘భైరవం’ థీమ్ సాంగ్ను విడుదల చేసింది యూనిట్. ఈ పాటలో పరమ శివుని భయం, బలం ఈ రెండింటినీ తన హావభావాలు, నృత్యంతో అద్భుతంగా కనబరిచారు సాయి శ్రీనివాస్. చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించిన ఈ పాటని శంకర్ మహదేవన్ తనదైన శైలిలో పాడారు. ఓ ఆలయం ముందు ఈ పాటను చిత్రీకరించారు.‘‘ఈ నెల 26న రానున్న మహా శివరాత్రిని పురస్కరించుకుని ఈ ఆధ్యాత్మిక పాటని విడుదల చేశాం. పరమ శివుడి దైవిక సారాన్ని అందంగా ప్రజెంట్ చేసి, లోతుగా ప్రతిధ్వనించే ఎమోషన్స్ని ఈ పాట ఆవిష్కరిస్తుంది. సాయి శ్రీనివాస్ పాత్ర శివ తాండవం ప్రేరణ స్ఫూర్తితో మెస్మరైజ్ చేస్తుంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. జటాధరవైవిధ్యమైన కథా నేపథ్యం ఉన్న చిత్రాలు, పాత్రలను ఎంచుకుని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు హీరో సుధీర్బాబు. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘జటాధర’. వెంకట్ కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియో సమర్పణలో ఉమేశ్ కేఆర్ భన్సల్, ప్రేరణా అరోరా నిర్మిస్తున్నారు. సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్గా రూపొందుతున్న చిత్రం ‘జటాధర’. అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ తిరిగే కథ ఇది.అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, పురాణ చరిత్ర వీటి నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కూడా పరమ శివుడితో ముడిపడిన కథే అని సమాచారం. పైగా టైటిల్ని బట్టి చూస్తే ఇదే వాస్తవం అనిపిస్తుంది. జటాధరుడు అని పరమ శివుణ్ణి పిలుస్తారనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని నిధిని మాత్రమే కాకుండా ఆలయ చరిత్ర, పురాణ కథల్ని కూడా చూపించబోతున్నారు మేకర్స్. ఈ సినిమాలో సుధీర్ బాబు పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది.పరమ శివుని భక్తురాలుహీరోయిన్ తమన్నా లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘ఓదెల 2’. ‘ఓదెల రైల్వేస్టేషన్’ (2021)కి సీక్వెల్గా ‘ఓదెల 2’ రూపొందుతోంది. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ అందించడం విశేషం. తొలి భాగాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ అశోక్ తేజ రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహా, యువ, నాగ మహేశ్, వంశీ, గగన్ విహారి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్పై డి. మధు నిర్మిస్తున్నారు.సూపర్ నేచురల్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో శివ భక్తురాలైన శివ శక్తి నాగసాధు పాత్రలో నటిస్తున్నారు తమన్నా. తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఓదెల మల్లన్న స్వామి ఎలా కాపాడారు? అనే అంశంతో ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. మల్లన్న స్వామి అంటే శివుడే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా షూటింగ్ సింహ భాగం వారణాసిలోని కాశీలో జరిగింది. శనివారం విడుదలైన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.ఇవే కాదు... మరికొన్ని సినిమాలు కూడా శివుడి నేపథ్యంలో తెరకెక్కుతున్నాయి. -
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లో 10 కంపార్టుమెంట్లో వేచిఉన్న భక్తులు . శుక్రవారం అర్ధరాత్రి వరకు 65,327 మంది స్వామివారిని దర్శించుకోగా 22,804 మంది భక్తులు తలనీలాలు సమరి్పంచారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.52 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది -
Mahashivratri: కాశీ విశ్వేశ్వరుని నిరంతర దర్శనం.. 8 గంటల పాటు కల్యాణం
వారణాసి: ఫిబ్రవరి 26.. మహాశివరాత్రి(Mahashivratri) వేళ భక్తులు కాశీవిశ్వేశ్వరుణ్ణి మరింత సమయం దర్శించుకునేందుకు అవకాశం కలిగింది. 26న తొలి మంగళహారతి మొదలుకొని 27న జరిగే శయన హారతి వరకూ భక్తులు మహాశివుణ్ణి దర్శించుకోవచ్చు. ఆ రోజున పార్వతీ పరమేశ్వరుల కల్యాణం ఎనిమిది గంటలపాటు జరగనుంది.కాశీ విశ్వనాథుని ఆలయ అధికారి విశ్వభూషణ్ శివరాత్రి ఏర్పాట్ల గురించి మీడియాకు తెలిపారు. ఫిబ్రవరి 25న శయన హారతి అనంతరం గర్భగుడిని మూసివేస్తామన్నారు. అనంతరం 26న తెల్లవారుజామున 2:30కి మహాశివునికి మంగళహారతి ఇస్తామన్నారు. ఇది పూర్తయ్యాక దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. ఫిబ్రవరి 27న జరిగే శయన హారతివరకూ ఆలయం తలుపులు తెరిచేవుంటాయన్నారు. ఈ సమయంలో భక్తులు స్వామివారిని సందర్శించుకోవచ్చన్నారు. మహా శివరాత్రివేళ సప్తరుషి శృంగార హారతి ఉండదన్నారు.ఫిబ్రవరి 26న రాత్రి 8 గంటలపాటు శివపార్వతుల కల్యాణం(marriage of Shiva and Parvati) జరగనున్నదని విశ్వభూషణ్ తెలిపారు. ఈసారి మహాశివరాత్రికి 14 లక్షలకు పైగా భక్తులు తరలివస్తారనే అంచనాలున్నాయన్నారు. భారీగా భక్తులు వస్తున్నందున అందరికీ దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.ఇది కూడా చదవండి: Mahakumb: నేడు, రేపు జనప్రవాహం.. పర్యవేక్షణలో సీఎం యోగి -
Mahakumb: నేడు, రేపు జనప్రవాహం.. పర్యవేక్షణలో సీఎం యోగి
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్(Prayagraj)లో జనవరి 13 నుంచి ప్రారంభమైన మహాకుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. భక్తులు తండోపతండాలుగా త్రివేణీ సంగమంలో స్నానం చేసేందుకు తరలివస్తున్నారు. ఈ నేపధ్యంలో సంగమతీరం నిత్యం భక్తుల రద్దీతో ఉంటోంది. ఫిబ్రవరి 26తో కుంభమేళా ముగుస్తున్న తరుణంలో ఈ శనివారం, ఆదివారం (ఫిబ్రవరి 22, 23) రోజుల్లో భక్తులు మరింతగా పోటెత్తే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు.కుంభమేళా చివరిదశకు చేరుకుంది. ఈరోజు, రేపు చాలామందికి సెలవుదినాలు కావడంతో వారంతా సంగమతీరానికి భారీగా తరలివస్తున్నారు. దీనిని గమనించిన ప్రభుత్వ అధికారులు(Government officials) తగిన ఏర్పాట్లు చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సంగమతీరంతో పాటు హనుమాన్ మందిరం ప్రాంతాల్లో ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కూడా ప్రయాగ్రాజ్లోనే ఉన్నారు. ఈయన కూడా కుంభమేళా ఏర్పాట్లను పర్యవేక్షించే పనిలో ఉన్నారు.ప్రయాగ్రాజ్లోని ప్రస్తుత పరిస్థితుల గురించి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్(డీఎం) కుమార్ మందార్ మీడియాతో మాట్లాడుతూ ‘వారాంతంలో భక్తుల రద్దీ ఏర్పడనున్న తరుణంలో మరిన్ని ఏర్పాట్లు చేశాం. ఇక్కడికి వచ్చేవారికి పటిష్టమైన భద్రతను అందించేందుకు చర్యలు చేపట్టాం. సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీచేశాం. ముందస్తుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీల సమీక్షా సమావేశం జరిగింది. ప్రవిత్ర స్నానాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పర్యవేక్షిస్తున్నాం’ అని అన్నారు. ఇది కూడా చదవండి: Mahakumbh: స్నానపు దృశ్యాలు అప్లోడ్ చేసిన వారిపై చర్యలు -
సూర్యాపేట : పెద్దగట్టు జాతరలో బోనం ఎత్తిన ఎమ్మెల్సీ కవిత (ఫొటోలు)
-
మహా కుంభ్కు 55 కోట్ల మంది
మహాకుంభ్ నగర్: ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభ్ మేళా సందర్భంగా త్రివేణీ సంగమంలో ఇప్పటి వరకు 55 కోట్ల మంద పుణ్య స్నానాలు ఆచరించారని యూపీ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. దేశంలోని 143 కోట్ల జనాభాలో 110 కోట్ల మంది సనాతన ధర్మ పరాయణులు కాగా వీరిలో దాదాపు సగం మంది పుణ్నస్నానాలు ఆచరించినట్లయిందని తెలిపింది. మొత్తం జనాభాలో ఇది 38 శాతంతో సమానమని తెలిపింది.26వ తేదీకల్లా ఈ సంఖ్య 60 కోట్లకు మించిపోనుందని అంచనా వేసింది. జనవరి 13న ప్రారంభమైన కుంభ మేళా ఈ నెల 26వ తేదీన మహా శివరాత్రి పర్వదినంతో ముగియనుండటం తెలిసిందే. ఈ కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద మత, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమంగా నిలిచిపోనుందని యూపీ ప్రభుత్వం తెలిపింది. హోటల్ పరిశ్రమకు పెద్ద ఊతం మహాకుంభ మేళాకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ప్రయాగ్రాజ్లోని అన్ని రకాల హోటళ్లు, రెస్టారెంట్ల పరిశ్రమ 20 నుంచి 30 వృద్ధి నమోదు చేసుకుందని ప్రభుత్వం తెలిపింది. అదాయ మార్జిన్లు కూడా 5 నుంచి 10 శాతం పెరిగాయంది. సందర్శకుల రాకతో టూర్, ట్రావెల్ పరిశ్రమ కూడా బాగా లబ్ధి పొందిందని వివరించింది. ఈ నెల 26వ తేదీ వరకు ప్రయాగ్రాజ్లోని మూడు, నాలుగు నక్షత్రాల హోటళ్లు, లాడ్జీలు, లగ్జరీ టెంట్ హౌస్లు పెద్ద సంఖ్యలో ముందుగానే బుక్కయ్యాయన్నారు.కుంభ మేళా పొడిగింపు అబద్ధం భక్తుల రద్దీ కొనసాగుతున్న దృష్ట్యా మహా కుంభ్ మేళాను మరికొద్ది రోజులు పొడిగించనున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై ప్రయాగ్రాజ్ జిల్లా మేజి్రస్టేట్ రవీంద్ర మందర్ స్పష్టతనిచ్చారు. పవిత్ర దినాలను పరిగణనలోకి తీసుకుంటూ ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం కుంభ మేళా 26వ తేదీ వరకు మాత్రమే కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ తేదీల్లో ఎలాంటి మార్పులూ ఉండవని కుండబద్దలు కొట్టారు. పొడిగింపు అంటూ వస్తున్న వార్తలను పట్టించుకోవద్దని ఆయన ప్రజలను కోరారు. కుంభమేళా కారణంగా ప్రయాగ్రాజ్లో విద్యార్థులెవరూ పరీక్షలను నష్టపోలేదని కూడా ఆయన పేర్కొన్నారు. అనివార్య కారణాలతో ఎవరైనా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షలను మిస్సయినా వారి కోసం ప్రత్యేకంగా నిర్వహించాలని కోరామన్నారు.కాశీకి 17 రోజుల్లో కోటి మంది ప్రయాగ్రాజ్లో మహా కుంభ మేళా జరుగుతున్న వేళ ఫిబ్రవరి 1 నుంచి 17వ తేదీ వరకు కాశీ విశ్వనాథుని ఆలయాన్ని కోటి మంది భక్తులు దర్శించుకున్నారని మంగళవారం అధికారులు తెలిపారు. అత్యంత రద్దీ ఉండే శివరాత్రినాడు కూడా ఇంత రద్దీ లేదన్నారు. ఈ నేపథ్యంలో వారణాసిలోని స్కూళ్లలో 8వ తరగతి వరకు తరగతులను ఈ నెల 27వ తేదీ వరకు రద్దు చేశామన్నారు. వారణాసిలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లతోపాటు మైదాగిన్, గొడొవ్లియా, దశాశ్వమేథ వంటి ముఖ్య ప్రాంతాల్లో తీవ్రమైన రద్దీ నెలకొందని వివరించారు. ప్రాముఖ్యమున్న గంగా ఆరతి కార్యక్రమాన్ని నామమాత్రంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 27 నుంచి తిరిగి ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో చేపడతామని వివరించారు. -
దురాజ్పల్లి : పెద్దగట్టు జాతరకు పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)
-
ఆ రోజు ఇల్లు కదలరు.. ముద్ద ముట్టరు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: తెలవారకముందే ఊళ్ల వెంట తిరుగుతూ పాత ఇనుప సామాగ్రి కొనుగోలు చేసి, వాటిని అమ్ముకుని పొట్టపోసుకునే ఆ కుటుంబాలు.. వారంలో ఒక రోజు మాత్రం ఇల్లు వదిలి బయటకు వెళ్లరు. ఆ రోజు ఇల్లు, వాకిలి కూడా ఊడ్చరు. పొయ్యి వెలిగించేది అసలే లేదు. రోజంతా వాళ్లు ఆధ్యాత్మిక చింతనలోనే గడుపుతారు. వాళ్లే లహరి కృష్ణ భక్తులు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రమన్నుకుచ్చ ప్రాంతంలో బుడగ జంగాల కులానికి చెందిన 110 కుటుంబాలున్నాయి. వారు దశాబ్దాలుగా శ్రీ లహరి కృష్ణ ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు. ప్రతి ఇంటి ముందు లహరి కృష్ణకు సంబంధించిన జెండా ఒకటి రెపరెపలాడుతూ ఉంటుంది. ఈ సంప్రదాయంలో కొబ్బరికాయ (Coconut) కొట్టడం, అగరొత్తులు వెలిగించడం ఉండవు. ఏటా అక్టోబర్ 3న జెండా పండుగ నిర్వహిస్తారు. పండుగపూట శాకాహార భోజనం.. అదీ అందరూ ఒకే చోట చేస్తారు. ఆ 24 గంటలు ప్రత్యేకంవీరు శుక్రవారం (Friday) సాయంత్రం 6 గంటల నుంచి శనివారం (Saturday) సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేక దినచర్యను పాటిస్తారు. ఆ సమయంలో ఇంట్లో పొయ్యి వెలిగించరు. పిల్లల కోసం ముందు రోజు వండిన ఆహారంలో కొంత మిగిలించి శనివారం తినిపిస్తారు. పెద్దవాళ్లయితే ఆ రోజంతా ఏమీ తినరు. సిగరెట్, బీడీలు, మద్యం ముట్టరు. శనివారం కనీసం ఇళ్లు, వాకిళ్లు కూడా ఊడవరు. అందరూ శనివారం ఇంటి వద్దే ఉంటారు. చదవండి: ‘చెప్పు’కోలేని బాధలు.. అన్నదాత అవస్థలుఎంత పని ఉన్నా శనివారం సాయంత్రం 6 గంటల తర్వాతే బయటకు వెళతారు. శనివారం ఎవరైనా చనిపోయినా అంత్యక్రియలు కూడా చేయరు. గ్రామంలోని శ్రీ లహరి కృష్ణ స్తుతి ధ్యాన మందిరంలో శనివారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాతే బయటకు వెళతారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్.. ఇలా అన్నింటినీ పాటిస్తామని వీరు చెబుతున్నారు. అందరం నియమాలు పాటిస్తాంఇక్కడ ఉన్న వాళ్లందరూ పేద, మధ్య తరగతివారే. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు ఇంట్లో పొయ్యి వెలిగించరు. లహరి కృష్ణ సమాజంలోని అన్ని కుటుంబాలు ఈ ఆచారాన్ని పాటిస్తాయి. – దాసరి శ్రీనివాస్, ధ్యానమందిరం నిర్వాహకుడు -
#MahaKumbh2025 : మాఘ పూర్ణిమ స్నానాలు కుంభమేళాకు పోటెత్తిన జనం (ఫొటోలు)
-
Mahakumbh-2025: పోటెత్తిన జనం.. కొనసాగుతున్న మాఘ పూర్ణిమ స్నానాలు
ప్రయాగ్రాజ్: యూపీలోని ప్రయాగ్రాజ్లో నేడు మాఘ పూర్ణిమ సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఈ నేపధ్యంలో కుంభమేళా అధికారులు ప్రయాగ్రాజ్ నగరంలోనికి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అలాగే క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. మాఘపౌర్ణమి వేళ మూడు నుంచి కోట్ల నాలుగు కోట్లమంది భక్తులు పవిత్ర స్నానాలు చేసేందుకు త్రివేణీ సంగమానికి తరలివస్తారని అధికారులు భావిస్తున్నారు. #WATCH प्रयागराज, यूपी: माघपूर्णिमा के अवसर पर चांद पूरा दिखा। पवित्र स्नान के लिए त्रिवेणी संगम पर श्रद्धालु पहुंच रहे हैं।#MahaKumbh2025 pic.twitter.com/W9s7csNnim— ANI_HindiNews (@AHindinews) February 12, 2025మాఘపౌర్ణమి ఏర్పాట్ల గురించి కుంభమేళా అధికారి వివేక్ చతుర్వేది మాట్లాడుతూ ఈరోజు(బుధవారం) మాఘపౌర్ణమి సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుంచే ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి తరలివస్తున్నారు. భారీసంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భక్తులు, పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. ఈ స్నానాలు ఈ రోజంతా కొనసాగనున్నాయన్నారు. #WATCH प्रयागराज: 'माघी पूर्णिमा' के अवसर पर पवित्र डुबकी लगाने के लिए त्रिवेणी संगम पर महाकुंभ मेला क्षेत्र में श्रद्धालुओं की भारी भीड़ पहुंची। #MahaKumbh2025 pic.twitter.com/iA38Vex2Ta— ANI_HindiNews (@AHindinews) February 11, 2025మహాకుంభమేళాకు ఈరోజు 31వ రోజు. ఈరోజున ఐదవ పవిత్ర స్నానాలు కొనసాగుతున్నాయి. భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అధికారులు కుంభమేళా ప్రాంతంలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. కుంభమేళాలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు మాట్లాడుతూ జనం ఎటువంటి వదంతులను నమ్మవద్దని సూచించారు. పోలీసులు కుంభమేళా ప్రాంతంలో అడుగడునా ఉన్నారని, వారు ఎటువంటి వరిస్థితి తలెత్తినా వెంటనే నివారిస్తారన్నారు.కుంభమేళా ప్రాంతంలో ఏర్పాటుచేసిన తాత్కాలిక వైద్యశిబిరాలలోని సిబ్బంది మాట్లాడుతూ ఇక్కడ 30 మంది నిపుణులైన వైద్యులు సేవలు అందిస్తున్నారని, 500కు పైగా నర్సింగ్ సిబ్బంది కూడా విధుల్లో ఉన్నారని తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు కుంభమేళా జరిగే ప్రాంతాన్నంతటినీ నో వెహికిల్ జోన్గా ప్రకటించారు. దీంతో కేవలం అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతులు కల్పించారు. బయటి నుంచి వచ్చే ఏ వాహనాలను కూడా నగరంలోనికి అనుమతించడం లేదు. #WATCH| #MahaKumbh2025 | प्रयागराज: 'माघी पूर्णिमा' के अवसर पर महाकुंभ में श्रद्धालु स्नान के लिए पहुंच रहे हैं। ड्रोन वीडियो त्रिवेणी संगम से है। pic.twitter.com/U0mD6gCp5m— ANI_HindiNews (@AHindinews) February 11, 2025ఇది కూడా చదవండి: Mahakumbh: చక్కెర, గోధుమలు, మైదా గోడౌన్లు ఖాళీ.. దొరకని పాలు, బ్రెడ్ #WATCH प्रयागराज: 'माघी पूर्णिमा' के अवसर पर पवित्र डुबकी लगाने के लिए श्रद्धालुओं की भारी भीड़ अरैल घाट पहुंची।#MahaKumbh2025 pic.twitter.com/3g08taJquH— ANI_HindiNews (@AHindinews) February 11, 2025 -
Maha Kumbh: మిగిలినవి అమృత స్నానాలు కాదు.. కారణమిదే
మహా కుంభమేళాలోని మూడవ, చివరి అమృత స్నానం వసంత పంచమి(ఫిబ్రవరి 3) నాడు ప్రశాంతంగా ముగిసింది. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ఈ సమయంలో మూడు ప్రముఖ రోజులలో అమృత స్నానాలు జరిగాయి. ఇంకో రెండు పుణ్యస్నానాలు కూడా ఉన్నాయి. అయితే పండితులు వాటిని అమృత స్నానాలుగా పరిగణించరు.మాఘ పూర్ణిమ(ఫిబ్రవరి 12), మహాశివరాత్రి(ఫిబ్రవరి 26) రోజులలో కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. అయితే ఈ స్నానాల సమయంలో అమృత ఘడియలు లేవని చెబుతారు. మొఘలుల కాలం నుండి నాగ సాధువులకు ప్రత్యేక గౌరవం ఇస్తూ, వారికి ప్రత్యేక రాజ స్నానాల హోదాను కల్పించారు. ఆది శంకరాచార్యులు(Adi Shankaracharya) ధర్మ సంరక్షకునిగా నాగ సాధువుల బృందాన్ని ఏర్పాటు చేశారు. నాగ సాధువులకు మొదట స్నానం చేసే హోదాను కూడా శంకరాచార్యులే కల్పించారని చెబుతారు.నాగ సాధువులు వసంత పంచమి నాడు అమృత స్నానం చేశాక వారి నివాసస్థానాలకు వెళ్లిపోతారు. అమృత స్నానాల నిర్ణయం వెనుక మరో కారణం కూడా ఉంది. సూర్యుడు మకర రాశిలో.. బృహస్పతి వృషభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే రాజ స్నానాలు చేస్తారు. వీటినే అమృత స్నానాలు అని కూడా ఉంటారు. మాఘ పూర్ణిమ(Magha Purnima) నాడు, బృహస్పతి వృషభరాశిలో ఉంటాడు. సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అదేవిధంగా శివరాత్రి రోజున కూడా సూర్యుడు కుంభ రాశిలోనే ఉంటాడు. ఫలితంగా అది పవిత్ర స్నానం అవుతుంది. కానీ దానికి అమృత స్నానం అనే స్థితి లభించదు.ఇది కూడా చదవండి: 5న ప్రధాని మోదీ కుంభస్నానం -
కుంభమేళా నుంచి అయోధ్యకు జనప్రవాహం
అయోధ్య: యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. వీరిలోని చాలామంది అయోధ్యకు చేరుకుని, బాలరాముణ్ణి దర్శించుకుంటున్నారు. దీంతో అయోధ్యలోనూ జనప్రవాహం కనిపిస్తోంది. కుంభమేళా ప్రారంభమైనది మొదలు ప్రతిరోజూ రెండున్నర నుండి మూడు లక్షల మంది భక్తులు అయోధ్యకు వస్తున్నారు. దీంతో గరిష్ట సంఖ్యలో భక్తులు రాంలల్లాను దర్శనం చేసుకునేందుకు వీలుగా ఆలయాన్ని ప్రతిరోజూ 18 గంటల పాటు తెరిచి ఉంచుతున్నారు. ఉదయం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు భక్తులకు శ్రీరాముణ్ణి దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఆలయానికి భక్తులు పోటెత్తుతుండటంతో కొన్ని నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం రెండవ అంతస్తుతో పాటు శిఖరంపై నిర్మాణ పనులు, సప్త మండపం, శేషావతార్ ఆలయం పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో జాప్యం జరుగుతోంది. ఆలయ ప్రాకారాలు, స్తంభాలపై కుడ్యచిత్రాలను రూపొందించే పనులు కూడా మందకొడిగా కొనసాగుతున్నాయి. దర్శన్ మార్గ్ ప్రక్కనే ఉన్న యాత్రికుల సౌకర్యాల కేంద్రంలో జరుగుతున్న నిర్మాణ పనులను కూడా నిలిపివేశారు.రామ్ మందిర్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ భక్తులకు సులభ దర్శనం కల్పించేందుకు కొన్ని పనులు నిలిపివేశామన్నారు. గడచిన 10 రోజుల్లో 70 లక్షలకు పైగా భక్తులు అయోధ్యను సందర్శించారని తెలిపారు. ఉదయం నాలుగు గంటల నుండి సరయు నదిలో భక్తులు స్నానాలు చేస్తున్నారు. అయోధ్యకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచే కాకుండా, విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. విదేశీ భక్తులు కూడా సరయు నదిలో స్నానం చేసిన తర్వాత రామ్లల్లా దర్శనం చేసుకుంటున్నారు. ఇది కూడా చదవండి: Mahakumbh-2025: నేడు మరో సరికొత్త రికార్డు.. -
అలాంటి దుస్తులతో రావొద్దు: ముంబై సిద్ధివినాయక ఆలయ ట్రస్ట్
ఇటీవలి కాలంలో ఫ్యాషన్ పేరుతో రకరకాల దుస్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. వీటిని యువత ధరిస్తున్నారు. అయితే సంప్రదాయవాదులు ఇటువంటి దుస్తులను వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఆలయాల్లోకి ఇటువంటి దుస్తులు ధరించి రావడం తగినది కాదని వారంటున్నారు. ఈ నేపధ్యంలో ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయంలో డ్రెస్ కోడ్ను అమలు చేయబోతున్నది.ముంబైలోని సిద్ధివినాయక ఆలయంలో వచ్చే వారం నుండి డ్రెస్ కోడ్ అమలుకానుంది. పొట్టి స్కర్టులు లేదా శరీరాన్ని బహిర్గతం చేసే దుస్తులు ధరించి, ఆలయానికి ఎవరైనా రావడాన్ని నిషేధిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. శ్రీ సిద్ధివినాయక గణపతి ఆలయ ట్రస్ట్ (ఎస్ఎస్జీటీటీ) ఆలయానికి వచ్చేవారి కోసం డ్రెస్ కోడ్ను ప్రకటించింది. భక్తులు తప్పనిసరిగా శరీరాన్ని కప్పి ఉంచే దుస్తులను ధరించాలని ఎస్ఎస్జీటీటీ తెలిపింది. భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించాలని పేర్కొంది.ఇకపై చిరిగినట్లు కనిపించే ప్యాంట్లు, పొట్టి స్కర్టులు లేదా శరీర భాగాలు కనిపించే దుస్తులు ధరించిన భక్తులను ఆలయంలోనికి అనుమతించబోమని ట్రస్ట్ పేర్కొంది. ఆలయంలో పూజల సమయంలో క్రమశిక్షణ లేకపోవడం, కొందరు అభ్యంతరకరమైన దుస్తులు ధరించి రావడంపై పలువురు భక్తులు ఆందోళన వ్యక్తం చేశారని ట్రస్ట్ పేర్కొంది. ఆలయ పవిత్రతను కాపాడటానికే డ్రెస్ కోడ్ను అమలు చేయాలని నిర్ణయించినట్లు ఆలయ ట్రస్ట్ పేర్కొంది.ఇది కూడా చదవండి: ఆ లోపాలే తొక్కిసలాటకు కారణం: మల్లికార్జున ఖర్గే -
Mahakumbh-2025: తొక్కిసలాట అనంతరం సీఎం యోగి వినతి
ప్రయాగ్రాజ్: యూపీలోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతోంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు చేసేందుకు ఈరోజు(బుధవారం) సంగమ తీరానికి లేక్కలేనంతమంది భక్తులు వచ్చారు. ఈ నేపధ్యంలో తొక్కిసలాట చోటుచేసుకుంది.ఈ ఘటన గురించి తెలియగానే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను అప్రమత్తం చేశారు. అలాగే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. దీనితో పాటు భక్తులకు ఒక విజ్ఞప్తి చేశారు. యూపీ సర్కారు కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు పలు ఘాట్లను నిర్మించిందని తెలిపారు. అక్కడ కూడా స్నానాలు చేయవచ్చని సూచించారు. పుణ్యస్నానాల సందర్భంగా ఎటువంటి వదంతులు వ్యాపించినా పట్టించుకోవద్దని కోరారు.మరోవైపు ఈరోజు ఉదయం తొక్కిసలాట చోటుచేసుకున్న కారణంగా అన్ని అఖాడాలు అమృత స్నానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. దీనిని నిరంజన్ కంటోన్మెంట్ అఖాడ పరిషత్ అధ్యక్షుడు శ్రీమహంత్ రవీంద్ర గిరి మీడియాకు తెలిపారు. తొక్కిసలాటలో కొందరు మహిళలు, పిల్లలు గాయపడ్డారని తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అధికారులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: Mahakumbh-2025: యూపీ, బీహార్ సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్ జామ్.. 70 కి.మీ. పొడవునా.. -
మౌని అమావాస్య.. త్రివేణి సంగమ స్థలిలో కీలక ఘట్టం
సాక్షి న్యూఢిల్లీ: మహా కుంభమేళా(Maha Kumbh)లో మరో కీలక ఘట్టానికి త్రివేణి సంగమ స్థలి సిద్ధమైంది. బుధవారం అత్యంత పవిత్రమైన మౌని అమావాస్య(Mauni Amavasya) కావడంతో కుంభమేళా జరుగుతున్న త్రివేణి సంగమ ప్రాంతంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తజనకోటి మునుపెన్నడూలేనంత పెద్ద ఎత్తున తరలివస్తోంది. బుధవారం ఒక్కరోజే సుమారు పది కోట్ల మంది భక్తులు పవిత్రస్నానాలు ఆచరిస్తారని అంచనా. అందుకు తగ్గట్టుగానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విస్తృతస్థాయిలో భారీ ఏర్పాట్లు చేసింది. రోజూ కోటి, కోటిన్నర మంది భక్తులు మేళాకు వస్తుండగా బుధవారం ఒక్కరోజే అత్యధిక స్థాయిలో వచ్చినాసరే తోపులాటల వంటి ఘటనలు సంభవించకుండా ప్రభుత్వం తగు ఏర్పాట్లుచేసింది.గంగానది ప్రవాహం పొడవునా ఎక్కడైనా స్నానం ఆచరించేలా మరిన్ని ఘాట్లను స్నానాలకు అనువుగా అందుబాటులోకి తెచ్చింది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అందుకే సామాన్యులు, సన్యాసులు, సంతులు, సాధువులు, నాగ సాధువులు, కిన్నెరలు తరలివస్తున్నారు. నేడు శ్రవణ నక్షత్రంలో మౌని అమావాస్య వస్తోంది. దీంతో ఈరోజుకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.ఈ శుభ ముహుర్తంలో పుణ్యస్నానం ఆచరించాలని కోట్లాది మంది ఆసక్తిగా కనబరుస్తున్నారు. అమృత స్నానం(రాజ స్నానం) తర్వాత దానధర్మాలు చేస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలొస్తాయని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా శివుడిని స్మరించుకుంటూ భక్తులు తమ పూర్వీకులకు నీరాజనాలు అర్పిస్తారు. ఇలా చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. ఇప్పటి వరకు పుణ్య స్నానాలు ఆచరించిన వారి సంఖ్య 15 కోట్లు దాటగా బుధవారం మౌని అమావాస్య సందర్భంగా ఒక్కరోజే పది కోట్లు భక్తులు వచ్చే అవకాశముంది. -
ఒక్క రోజులో 1.5 కోట్ల మంది పుణ్యస్నానాలు
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తాజాగా జనవరి 27 (సోమవారం) రాత్రి 10 గంటల వరకు ఒక్కరోజులో 1.5 కోట్లకు పైగా భక్తులు త్రివేణీ సంగమంలో స్నానమాచరించారు.జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళాలో ఇప్పటివరకూ 14 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేశారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుంభమేళాలో పాల్గొని, పవిత్ర స్నానం చేశారు. ఈ సమయంలో ఆయన వెంట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బాబా రామ్దేవ్ తదితరులు ఉన్నారు.మహా కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు తరలివస్తున్నారు. ఇటాలియన్ భక్తుడైన ఆంటోనియో తాను భారతదేశంలో జరిగే కుంభమేళాను చూడాలనే తన కలను నెరవేర్చుకున్నానని తెలిపారు. 10 సంవత్సరాలుగా ఇక్కడికి రావాలనుకుంటున్నానని, ఇప్పుడు కుంభమేళా సమయంలో వచ్చానని మీడియాకు తెలిపారు. కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అలాంటి 12 కుంభమేళాల తరువాత వచ్చిన మహా కుంభమేళా ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో జరుగుతోంది. జనవరి 13న ప్రారంభమైన ఈ కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది.ఇది కూడా చదవండి: ఎవరెస్ట్ ఎక్కాలంటే రూ. 21 లక్షలు కట్టాల్సిందే -
మహా కుంభమేళా.. ‘కొబ్బరి’ ఆనంద హేల
సాక్షి, అమలాపురం/అంబాజీపేట: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలు తరలివస్తున్న మహా కుంభమేళా (Maha Kubh Mela) గోదావరి జిల్లాల్లోని కొబ్బరి మార్కెట్కు (Coconut Market) పెద్ద వరమే అయింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్(Prayagraj) కేంద్రంగా జరుగుతున్న ఈ మహా కుంభమేళాకు వస్తున్న భక్తులు నదీ మాతకు అర్పించేందుకు కురిడీ కొబ్బరిని విరివిగా వినియోగిస్తుండడంతో దీనికి డిమాండ్ పెరిగి ధర రికార్డు స్థాయిలో పెరిగింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉత్పత్తయ్యే కురిడీ కొబ్బరి ఉత్తరాది రాష్ట్రాలకూ ఎగుమతి అవుతుంది. మహా కుంభమేళా కారణంగా ఎగుమతులు విపరీతంగా పెరిగాయి. దీంతో ఇప్పటివరకు అంతంతమాత్రంగా ఉన్న ఈ కురిడీ రకం ధర అనూహ్యంగా పెరిగింది. కొబ్బరి మార్కెట్కు కేరాఫ్ అడ్రస్ అయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేట (Ambajipeta) కొబ్బరి మార్కెట్లో కురిడీ కొబ్బరి వెయ్యి కాయల ధర రూ.17 వేల నుంచి రూ.20 వేల వరకూ ఉంది. పాతకాయలో గండేరా రకం వెయ్యి కాయల ధర రూ.20 వేలు వరకు పలుకుతోంది. దీనిలో గటగట రకం రూ.17,500 వరకూ ఉండగా, కొత్త కాయలో గండేరా రకం రూ.19 వేలు, గటగటా రకం రూ.16 వేలుగా ఉంది. కురిడీ కొబ్బరి మార్కెట్ చరిత్రలో గండేరా రకం వెయ్యి కాయలకు రూ.20 వేల ధర పలకడం ఇదే తొలిసారి. 2016లో వచ్చిన రూ.18 వేలు మాత్రమే ఇప్పటి వరకూ గరిష్ట ధరగా ఉంది. ఈ రికార్డుకు ఇప్పుడు బ్రేక్ పడింది.ఉత్తరాది రాష్ట్రాల్లో నదీమ తల్లికి భక్తులు నేరుగా కొబ్బరి కాయలు అర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు మహాకుంభమేళా కారణంగా కురిడీ కొబ్బరికి డిమాండ్ పెరిగింది. దీనికితోడు కురిడీ కొబ్బరి అధికంగా తయారయ్యే తమిళనాడు, కేరళలో సైతం దీని లభ్యత తగ్గింది. ఈ రెండు కారణాలతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కురిడీ ఎగుమతి పెరిగింది. రోజుకు రూ.8 లక్షలు విలువ చేసే కురిడీ కొబ్బరి 20కి పైగా లారీల్లో ఎగుమతి అవుతోందని అంచనా. సాధారణ రోజుల్లో జరిగే ఎగుమతులకు కుంభమేళా ఎగుమతులు కూడా తోడవడం కురిడీ ధర పెరుగుదలకు కారణమైందని మార్కెట్వర్గాలు చెబుతున్నాయి.ఎనిమిదేళ్ల తరువాత మంచి ధర2016లో గండేరా రకానికి రూ.18 వేల ధర వచ్చింది. ఎనిమిదేళ్ల తరువాత కురిడీకి రూ.20 వేలు వచ్చింది. తమిళనాడు నుంచి ఉత్తరాదికి కురిడీ ఎగుమతులు తగ్గడం, కుంభమేళా కారణంగా డిమాండ్ వచ్చింది. గతం కన్నా మన ప్రాంతం నుంచి కూడా ఎగుమతులు తగ్గాయి. కానీ ధర పెరగడం వల్ల కురిడీకి మార్కెట్లో ఊహించని ధర వచ్చింది.– అప్పన శ్యామ్, కురిడీ వ్యాపారి, అంబాజీపేట -
తిరుమల కొండపై అపచారం
-
మహాకుంభమేళాకు ఐదోరోజు పోటెత్తిన భక్తులు
-
Mahakumbh 2025: చూపుతిప్పుకోనివ్వని దృశ్యాలు
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా సందర్భంగా పవిత్ర సంగమం ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కటౌట్లు ఇక్కడికి వచ్చేవారిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. కుంభమేళాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.మహాకుంభమేళా సందర్భంగా పంచాయితీ అఖాడా ఇస్తున్న బడా హారతి భక్తులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం జరుగుతున్న మహా కుంభమేళాలో 40 నుండి 50 కోట్ల మంది భక్తులు పాల్గొంటారని అంచనా.మహా కుంభమేళా సందర్భంగా ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ అలియాస్ కమల అఖాడ శ్రీ నిరంజని అధిపతి స్వామి కైలాసానంద గిరి నుండి ఆధ్యాత్మిక దీక్షను పొందారు.2025 మహా కుంభమేళా సందర్భంగా జరిగిన శోభా యాత్రలో ఇస్కాన్ భక్తులు పాల్గొంటున్నారు. ఇతర దేశాల నుండి కూడా పెద్ద సంఖ్యలో ఇస్కాన్ భక్తులు కుంభమేళాకు తరలివస్తున్నారు. వారు చేసే కీర్తనలు, భజనలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.మహా కుంభమేళా ప్రాంతంలో తీవ్రమైన చలి ఉన్నప్పటికీ భక్తులు అత్యంత ఉత్సాహంతో త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తున్నారు. ‘హర్ హర్ మహాదేవ్’, ‘జై శ్రీరామ్’, ‘జై గంగా మాతా’ అని నినాదాలు చేస్తూ భక్తులు సంగమం వద్ద స్నానాలు ఆచరిస్తున్నారు.మహాకుంభ ఉత్సవంలో సాధుసన్యాసులు భజన కీర్తలను ఆలపిస్తూ, ఆధ్యాత్మిక ప్రసంగాలు సాగిస్తున్నారు. వీరిని దర్శించుకునేందుకు జనం క్యూ కడుతున్నారు. మహా కుంభమేళాలో లక్షలాది మంది సాధువులు పాల్గొంటున్నారు.విహంగ వీక్షణలో మహా కుంభమేళా వేదిక అత్యంత అద్భుతంగా కనిపిస్తోంది. ఫొటోలోని కొంతభాగమే ఇంత అందంగా ఉంటే.. పూర్తి చిత్రం ఎలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.దేశ విదేశాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పర్యాటకులు మహా కుంభమేళాలో సంగమం దగ్గర స్నానాలు ఆచరించారు. మంగళవారం మకర సంక్రాంతి సందర్భంగా వివిధ అఖాడాలకు చెందిన సాధువులు తొలి అమృత స్నానం చేశారు. మకర సంక్రాంతి నాడు త్రివేణి సంగమంలో దాదాపు 3.5 కోట్ల మంది భక్తులు స్నానమాచరించారు.ఇది కూడా చదవండి: Mahakumbh 2025: స్నానానికి 45 నిముషాలు.. ఆర్ఎఫ్ రిస్ట్ బ్యాండ్లో వెల్లడి -
Mahakumbh 2025: స్నానానికి 45 నిముషాలు.. ఆర్ఎఫ్ రిస్ట్ బ్యాండ్లో వెల్లడి
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. త్రివేణీ సంగమానికి చేరుకున్న భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. అయితే ప్రతీభక్తుడు పుణ్య స్నానానికి ఎంత సమయం కేటాయిస్తున్నాడు? తాజాగా దీనికి సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి.భక్తుల సంఖ్యను తెలుసుకునేందుకు..త్రివేణీ సంగమంలో స్నానమాచరిస్తున్న ప్రతి భక్తుడు స్నాన ఘాట్లో సగటున 45 నిమిషాలు గడుపుతున్నాడని వెల్లడయ్యింది. రేడియో ఫ్రీక్వెన్సీ రిస్ట్ బ్యాండ్ల ద్వారా సేకరించిన డేటా ఈ వివరాలను తెలియజేసింది. ఇదేవిధంగా ఆర్ఎఫ్ రిస్ట్ బ్యాండ్ నుండి సేకరించిన డేటాను మేళాకు హాజరయ్యే భక్తుల సంఖ్యను లెక్కించేందుకు కూడా సంబంధిత అధికారులు ఉపయోగిస్తున్నారు.మహా కుంభమేళాకు వచ్చే భక్తుల వాస్తవ సంఖ్యను తెలుసుకునేందుకు అధికారులు ప్రత్యేక పద్దతిని ఉపయోగిస్తున్నారు. అదే ఆర్ఎఫ్ రిస్ట్ బ్యాండ్. దీనిని యాత్రికుల మణికట్టుకు కట్టారు. ఈ ఆర్ఎఫ్ రిస్ట్ బ్యాండ్ల నుండి సేకరించిన డేటా ప్రకారం, మకర సంక్రాంతి, పుష్య పూర్ణిమ రోజుల్లో భక్తులు స్నాన ఘాట్ల వద్ద సగటున 45 నిమిషాలు గడిపారని వెల్లడయ్యింది. ఘాట్ చేరుకోవడం నుండి స్నానం చేసి, తిరిగి వచ్చే వరకు 45 నిముషాలు పట్టిందని తేలింది.ఐదు లక్షల మంది ఉచిత ప్రయాణాలుఘాట్ వద్ద భక్తులు సగటున ఎంత సమయం గడుపుతారో తెలుసుకోవడం ద్వారా రద్దీని నియంత్రించగలుగుతామని పోలీసు అధికారులు తెలిపారు. ఆర్ఎఫ్ రిస్ట్ బ్యాండ్ డేటా అనాలిసిస్ టెక్నాలజీ నుండి పొందిన ఫలితాలు జనసమూహ నిర్వహణకు సహాయపడతాయని ఎస్ఎస్పీ రాజేష్ కుమార్ ద్వివేది తెలిపారు. కాగా పుష్య పూర్ణిమ, మకర సంక్రాంతి పండుగల సందర్భంగా జనం మధ్య చోటుచేసుకున్న తోపులాటలో 200 మందికి పైగా జనం గాయపడ్డారు. వీరికి చికిత్స అందిస్తున్నామని స్థానిక ఆసుపత్రి ఆర్థోపెడిక్స్ విభాగానికి చెందిన సర్జన్ డాక్టర్ వినయ్ యాదవ్ తెలిపారు. గడచిన నాలుగు రోజుల్లో దాదాపు ఐదు లక్షల మంది ప్రయాణికులు షటిల్ బస్సులలో ఉచితంగా ప్రయాణించారు. గురువారం నుండి ప్రయాణికులు సాధారణ రోజుల మాదిరిగానే ఈ బస్సులలో ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు.93 ఏళ్ల తర్వాత..1932లో ప్రయాగ్రాజ్ నుండి లండన్కు ఒక విమానాన్ని నడిపారు. ఇప్పుడు 93 ఏళ్ల తర్వాత బుధవారం ప్రయాగ్రాజ్ విమానాశ్రయం నుండి అంతర్జాతీయ విమానం బయలుదేరింది. ఈ విమానం అమెరికన్ బిలియనీర్ మహిళా వ్యవస్థాపకురాలు లారెన్ పావెల్ జాబ్స్ కోసం ఇక్కడికి వచ్చింది. ఈ విమానం భూటాన్కు వెళ్లింది. జాబ్స్ కొద్ది రోజుల పాటు భూటాన్లో ఉంటారని సమాచారం. బ్రిటిష్ పాలనలో ప్రయాగ్రాజ్ నుండి అంతర్జాతీయ విమానాలు నడిచేవి. 1932 వరకు ఇక్కడి నుండి లండన్ కు నేరుగా విమానం ఉండేది.ఇది కూడా చదవండి: Mahakumbh 2025: నేడు అంతర్జాతీయ ప్రతినిధుల బృందం పవిత్ర స్నానాలు -
Mahakumbh 2025: మహాకుంభమేళాలో మూడో రోజు విశేషాలు..
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. దేశవిదేశాల నుంచి భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు.ఈరోజు(బుధవారం) మహాకుంభమేళాలో మూడవ రోజు. అత్యంత భారీస్థాయిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి, పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసేందుకు వివిధ ఘాట్ల వద్ద భక్తులు ఉదయం నుంచే క్యూలు కడుతున్నారు. మహా కుంభమేళా(Great Kumbh Mela) ప్రారంభమైనది మొదలుకొని ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు గంగా మాత హారతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీంతో సంగమతీరం నిత్యం భక్తులతో కిటకిటలాడుతోంది.మంగళవారం మకర సంక్రాంతి(Makar Sankranti) సందర్భంగా సాధువులతో పాటు భక్తులు తొలి అమృత స్నానం చేశారు. 13 అఖాడాలకు చెందిన సాధువులు ఒకరి తర్వాత ఒకరుగా స్నానం చేశారు. మకర సంక్రాంతి నాడు సుమారు 3.50 కోట్ల మంది భక్తులు గంగా సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. సోమవారం మొదటి స్నానోత్సవం నాడు 1.65 కోట్ల మంది భక్తులు స్నానం చేశారు. ఈ విధంగా రెండు రోజుల్లో మొత్తం 5.15 కోట్ల మంది సంగమంలో స్నానం చేశారు.ఈసారి జరుగుతున్న మహా కుంభమేళా ఎంతో ప్రత్యేకమైనది. 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న కుంభమేళా ఇది. సంగమ తీరంలోని 4,000 హెక్టార్ల ప్రాంతంలో ఈ ఉత్సవం జరుగుతోంది. మహా కుంభమేళాలో స్నానం చేసిన భక్తులు తాము సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. కుంభమేళా తొలిరోజున సంగమతీరంలో స్నానాలాచరిస్తున్న వారిపై హెలికాప్టర్ నుంచి పూలవర్షం కురిపించారు.ఇది కూడా చదవండి: Mahakumbh: ఉత్సాహం ఉరకలేస్తోంది: బల్గేరియా పర్యాటకులు -
Maha Kumbh: పుణ్యస్నానాలు ప్రారంభం
ప్రయాగ్రాజ్: యూపీలోని ప్రయాగ్రాజ్లో గంగా, యమున, అదృశ్య సరస్వతి సంగమం ఒడ్డున 45 రోజుల పాటు వైభవంగా జరిగే కుంభమేళా సోమవారం (జనవరి 13) వేకువజామునే ప్రారంభమయ్యింది. సముద్ర మథనం సమయంలో కలశం నుంచి వెలువడిన కొన్ని చుక్కల అమృత బిందువులు ప్రయాగ్రాజ్లోని త్రివేణీ సంగమంలో పడ్డాయి. ఈ నేపధ్యంలోనే ఇక్కడ కుంభమేళా జరుగుతోంది. ఫిబ్రవరి 26 వరకు ఈ మహా ఉత్సవం కొనసాగనుంది.సంగమతీరంలో భక్తులు తమ భక్తిప్రపత్తులను చాటుకుంటున్నారు.సాధారణ భక్తులతో పాటు సంగమతీరంలో బాబాలు, స్వామీజీలు కూడా కనిపిస్తున్నారు.భక్తుల రద్దీ మధ్య వారి భద్రతను నిర్ధారించడానికి ఆర్ఏఎఫ్, పోలీసులు, సీఆర్పీఎఫ్ బృందాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి. #WATCH | Prayagraj, Uttar Pradesh | Teams of RAF, Police and CRPF are present at the spot to ensure the safety and security of devotees as an ocean of crowd arriving at Mela Kshetra for #MahaKumbh2025 - what is considered to be the biggest gathering of human beings pic.twitter.com/vy0vHdsAsA— ANI (@ANI) January 13, 2025రాత్రంతా క్యూకట్టిన భక్తులు మహా కుంభమేళాలో మొదటి స్నానం కోసం సంగమం వైపు కదులుతున్నారు. జనసమూహం అంతకంతకూ పెరుగుతోంది.#WATCH | Prayagraj | NDRF teams and water police of Uttar Pradesh Police deployed at places to ensure the safety and security of devotees as #MahaKumbh2025 begins with the 'Shahi Snan' on the auspicious occasion of Paush Purnima, today pic.twitter.com/VMJ3yXw9oI— ANI (@ANI) January 12, 2025మహా కుంభమేళా(maha kumbh 2025)లో తొలి స్నానం చేయాలనే తపన వృద్ధులలో కనిపిస్తోంది. చలి అధికంగా ఉన్నప్పటికీ, వృద్ధులు, మహిళలు పుణ్యస్నానాలు చేయడానికి సిద్దమయ్యారు.విదేశీ భక్తుల బృందం కూడా పవిత్ర స్నానం ఆచరించింది. మహా కుంభమేళాలో తొలి స్నానం చేయాలని భక్తులు ఉత్సాహం చూపుతున్నారు. గంగామాతపై పాటలు పాడుతూ సంగమతీరానికి చేరుకుంటున్నారు.#WATCH | Prayagraj, Uttar Pradesh | A group of foreign devotees to take holy dip as #MahaKumbh2025 - the biggest gathering of human beings in the world begins with the 'Shahi Snan' on the auspicious occasion of Paush Purnima, today pic.twitter.com/V71rKvSXgL— ANI (@ANI) January 12, 2025మహా కుంభమేళా మొదటి రోజున సంగమంలో స్నానం చేసిన బ్రెజిల్కు చెందిన ఫ్రాన్సిస్కో అనే భక్తుడు మీడియాతో మాట్లాడుతూ తాను యోగా సాధన చేస్తుంటానని, మోక్షం కోసం పరితపిస్తున్నానని అన్నారు. #WATCH | Prayagraj, Uttar Pradesh | A devotee from Gujarat's Vadodara sings devotional songs as she arrives at #MahaKumbh2025 to be part of the biggest gathering of human beings in the world pic.twitter.com/IEnULvEGBa— ANI (@ANI) January 12, 2025ఇది కూడా చదవండి: Maha Kumbh: 15 లక్షలకుపైగా విదేశీ పర్యాటకుల రాక #WATCH | Prayagraj | A Brazilian devotee at #MahaKumbh2025, Fransisco says, "I practice Yoga and I am searching for Moksha. It's amazing here, India is the spiritual heart of the world... Water is cold but the heart is filled with warmth." pic.twitter.com/as1oBQXmGl— ANI (@ANI) January 12, 2025 -
తిరుమలలో తగ్గిన భక్తులు
-
తొక్కిసలాట ఎఫెక్ట్: వైకుంఠ ద్వార దర్శనానికి భారీగా తగ్గిన భక్తులు
సాక్షి, తిరుపతి: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు భారీగా తగ్గారు. దశాబ్ద కాలంలో అత్యల్పంగా వైకుంఠ ద్వార దర్శనాలు జరిగాయి. తిరుపతి తొక్కిసలాట(Tirupati stampede)తో భక్తులు భయబ్రాంతులకు గురవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులను టీటీడీ(TTD) భయబ్రాంతులకు గురిచేయడంతో కూటమి ప్రభుత్వంపై భక్తుల్లో అనుమానాలు కలుగుతున్నాయి. 70 వేలు టోకెన్లు విడుదల చేయగా కేవలం 53 వేల మంది భక్తులే దర్శనాలు చేసుకున్నారు. టీటీడీ వైఫల్యంతో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు దక్కలేదు. పోలీసులు దురుసు ప్రవర్తనశ్రీనివాసం గెస్ట్హౌస్ వద్ద పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దర్శనానికి వచ్చే భక్తులపై పోలీసులు చేయి చేసుకున్నారు. భక్తుల పట్ల సంయమనం పాటించాలని చెప్పున్నా పోలీసులు వినడం లేదు. దర్శనం టికెట్లకు క్యూలైన్లోకి వెళ్లేవారిని అడ్డగించడంపై భక్తుడు నిలదీశాడు.శనివారం రాత్రి నుంచి రెండో విడత టోకెన్ల జారీ ప్రారంభమైంది. భయంభయంగానే.. మొదటి విడత వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన భక్తులను కలవరపాటుకు గురిచేస్తోంది. శనివారం నుంచి రెండో విడత టోకెన్ల జారీ చేస్తుండడంతో పలువురు క్యూలైన్లోకి వెళ్దామా? వద్దా? అనే సందిగ్ధంలో పడ్డారు. తిరుపతి నగరంలో శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్లో టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు నాటి చేదు ఘటన గురించే చర్చించుకుంటున్నారు. తొక్కిసలాట ఘటన విషయంలో ప్రభు త్వం, టీటీడీ తీసుకున్న చర్యలపైనా విమర్శలు గుప్పిస్తున్నారు.ఇదీ చదవండి: ఏడు చేపల కథ! -
ఆన్లైన్ బుకింగ్పై అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరగ నున్న మహాకుంభమేళాకు వెళ్లాలనుకునే భక్తులందరూ ఆన్ లెన్ బుకింగ్లపై జాగ్రత్తగా వ్యవహరించాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ) సూచించింది. ఆన్ లైన్లో హోటల్, ధర్మశాల, గెస్ట్హౌస్ బుకింగ్ల సమయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 45 రోజులపాటు జరిగే ఈ కుంభమేళాకు లక్షలాది మంది సందర్శకులు రాను న్నందున యాత్రికులను మోసం చేయడానికి సైబర్ నేరస్తులు నకిలీ వెబ్సైట్లు, లింక్లను సృష్టించే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ఎలాంటి రిజర్వేషన్ లేకుండానే తగ్గింపు ధరలకే వసతిని అందిస్తామంటూ మోసగాళ్లు భక్తులను ఆకర్షిస్తారని.. హోటళ్లు, ధర్మశాల, టెంట్ సిటీలకు ముందస్తు చెల్లింపులను వసూలు చేయడానికి మోసపూరిత వెబ్సైట్లు, నకిలీ బుకింగ్ లింక్లను ఏర్పాటు చేసే అవకాశం ఉందని పేర్కొంది.టీజీసీఎస్బీ సూచనలు..⇒ అధికారిక మార్గాల్లోనే వసతిని బుక్ చేసుకోండి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ధ్రువీకరించబడిన సంప్రదింపు నంబర్లు, వెబ్సైట్లను ఉపయోగించండి. ఈ అధికారిక వెబ్సైట్ https://kumbh.gov.in/en/ Wheretostaylist అందుబాటులో ఉంది.⇒ అసాధారణంగా తక్కువ ధరలకు వసతిని అందించే తెలియని లింక్లు లేదా ప్రకటనలపై క్లిక్ చేయవద్దు.⇒ తెలియని ఖాతాలకు లేదా అనధికారిక బుకింగ్ ప్లాట్ఫారమ్ల ద్వారా ముందస్తు చెల్లింపులు చేయవద్దు.⇒ అధికారికంగా క్రాస్–చెక్ చేయడం లేదా రాష్ట్ర అధికారు లను నేరుగా సంప్రదించడం ద్వారా ఏదైనా వసతి లేదా సర్వీస్ ప్రొవైడర్ ప్రామాణికతను ధ్రువీకరించుకోండి.⇒ వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని ఆన్లైన్లో పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.⇒ ఒకవేళ మోసానికి గురైనట్లయితే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930కు కాల్ చేయడం ద్వారా లేదా www. cybercrime. gov. in లో అధికారిక సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ను సందర్శించి ఫిర్యాదు చేయండి.⇒ సైబర్ భద్రతపై మరింత సమాచారం కోసం.. tgcsb.tspolice.gov.in ని సందర్శించండి. -
తొక్కిసలాట ఎఫెక్ట్.. తిరుమలలో భారీగా తగ్గిన భక్తులు
-
దొడ్లో పశువులు వేసినట్లు వేశారు.. ఈ పాపం టీటీడీదే!
-
తిరుపతిలోని 2 ప్రాంతాల్లో భక్తుల మధ్య తోపులాట
-
తిండి లేదు, నీళ్లు లేవు.. సంచలన నిజాలు బయట పెట్టిన తిరుపతి భక్తులు
-
Maha Kumbh Mela: 16 ఏళ్లకే ఇంటిని వదిలి.. తాళాల బాబా సాధన ఇదే..
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి మహాకుంభమేళా నిర్వహించనున్నారు. ఇందుకు బారీఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. కుంభమేళాకు సాధుసన్యాసులతో పాటు సామాన్యులు కూడా లక్షలాదిగా తరలిరానున్నారు. సంగమతీరంలో పుణ్యస్నానాలు ఆచరించనున్నారు.కుంభమేళా(Kumbh Mela) సందర్భంగా ఇప్పుటికే పలువురు బాబాలు ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. వీరిలో ఒకరే హరిశ్చంద్ర విశ్వకర్మ కబీరా బాబా. ఇతనిని చాబీవాలే బాబా(తాళాల బాబా) అని పిలుస్తుంటారు. ఈ బాబా ఎప్పుడూ తన వెంట 20 కిలోల తాళంచెవులను మోసుకెళుతుంటారు. ఈయనను ప్రయాగ్రాజ్లోని వారు బహువింతగా చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీకి చెందిన హరిశ్చంద్ర విశ్వకర్మ కబీరా బాబా తన 16 ఏళ్ల వయసులోనే తన ఇంటిని విడిచిపెట్టి, ఆధ్యాత్మిక చింతనా మార్గాన్ని అవలంబించారు.తాళాల బాబా మీడియాతో మాట్లాడుతూ ‘నా తల్లిదండ్రులు సన్యాసమార్గం అవలంబించారు. వారు నాకు హరిశ్చంద్ర అని పేరు పెట్టాడు. ఆ పేరును నిలబెట్టుకునేందుకు నేను నా ఆధ్యాత్మిక జీవన ప్రయాణం(Spiritual life journey) ప్రారంభించాను. హరిశ్చంద్రుడు మనందరికీ సన్మార్గాన్ని చూపాడు. నేను హరిశ్చంద్రుడు అందించిన మార్గాన్ని అనుసరిస్తున్నాను. ఇందుకోసం చిన్నతనంలోనే ఇంటిని విడిచిపెట్టాను. సత్యమార్గాన్ని అనుసరించడం ద్వారా జీవితంలో ముక్తిని పొందేందుకు ప్రయత్నిస్తున్నాను.సమాజంలో ప్రబలంగా ఉన్న దురాచారాలు, ద్వేషాలను తొలగించడంలో తనవంతు పాత్రను పోషించేందుకే ఇంటిని విడిచిపెట్టానని బాబా తెలిపారు. నా జీవన మార్గంలో లెక్కకుమించినన్ని పాదయాత్రలు చేశాను. ఎన్నోకష్టనష్టాలను ఎదుర్కొంటూ సత్యమార్గాన్ని విడవకుండా ముందుకు సాగుతున్నాను. రాబోయే మహాకుంభ మేళాను ఘనంగా నిర్వహించేందుకు ప్రధాని మోదీ, సీఎం యోగి అమితమైన కృషి చేస్తున్నారు. తాను ధరించిన తాళాలు హృదయరాముని దర్శింపజేస్తాయని’ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని వణికిస్తున్న 10 వైరస్లు.. కరోనాకు ముందే.. -
కాశీలోనూ కుంభమేళా ఉత్సాహం.. పోటెత్తనున్న భక్తులు
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి మహాకుంభమేళా జరగనుంది. ఇప్పుడు కుంభమేళా ఉత్సాహం వారణాసి(కాశీ)లోనూ కనిపిస్తోంది. కుంభమేళాకు తరలివచ్చే భక్తులు తప్పక వారణాసికి కూడా వస్తారని స్థానిక అధికారులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో పలు ఏర్పాట్లు చేస్తున్నారు.కుంభమేళా(Kumbh Mela)కు వచ్చే లక్షలాది మంది యాత్రికులు సంగమ స్నానం ముగించుకున్నాక నేరుగా వారణాసికి వచ్చి, గంగలో స్నానం చేసి విశ్వనాథుని దర్శనం చేసుకుంటారు. ఈ విధంగా చూస్తే కుంభమేళా సందర్భంగా కాశీకి వచ్చే యాత్రికుల సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. కుంభమేళా రోజుల్లో విశ్వనాథుని దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ స్వామివారి దర్శన సమయాల్లో మార్పులు చేసింది. 2024 జనవరి 13 నుండి ఫిబ్రవరి 12 వరకూ విశ్వనాథుని ఐదు హారతులతో కూడా మార్పులు చేసింది.జనవరి 13 నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు సాధారణ రోజులలో మంగళ హారతి సమయం తెల్లవారుజాము 2.45, భోగ్ హారతి ఉదయం 11.35, సప్తఋషి హారతి రాత్రి 7.00, శృంగర్-భోగ్ హారతి రాత్రి 8.45, శయన హారతి రాత్రి 8.45కు నిర్వహించనున్నారు. మహా కుంభమేళా సమయంలో అంటే జనవరి 20, 27, ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీలలో శృంగార-భోగ్ హారతి రాత్రి 9 గంటలకు, శయన హారతి రాత్రి 10.45 గంటలకు నిర్వహించనున్నారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాశీ విశ్వనాథ్ ధామ్(Kashi Vishwanath Dham)లో పౌర్ణమి రోజు ఇచ్చే హారతి వేళల్లోనూ మార్పులు చేశారు. జనవరి 13, ఫిబ్రవరి 12 తేదీలలో బాబా విశ్వనాథుని సప్తఋషి హారతి సాయంత్రం 6.15 గంటలకు ప్రారంభమవుతుంది, శృంగార-భోగ్ హారతి సాయంత్రం 6.15 గంటలకు, తిరిగి రాత్రి 8 గంటలకు జరుగుతుంది. మంగళ హారతి, మధ్యాహ్న భోగ్ హారతి, శయన హారతి సమయాలలో ఎటువంటి మార్పులు ఉండబోవు.మహాకుంభమేళా.. మహాశివరాత్రి(Mahashivratri)(ఫిబ్రవరి 26)తో ముగియనుంది. ఆ రోజున విశ్వనాథుని దర్శనం, పూజల కోసం నాగా సాధువులు, అఖాడాలే కాకుండా పెద్ద సంఖ్యలో భక్తులు కూడా తరలి వస్తారు. ఆ రోజున తెల్లవారుజామున 2.15 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. మధ్యాహ్నం జరిగే భోగ్ హారతి 11.35 గంటలకు ప్రారంభమై 12.35 వరకు కొనసాగనుంది. మహాశివరాత్రి నాటి రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6.30 గంటల వరకు నాలుగు గంటలపాటు హారతి కార్యక్రమం ఉంటుంది.ఇది కూడా చదవండి: కనిపించని ఏసీ కోచ్.. కంగుతిన్న ‘రిజర్వేషన్’ ప్రయాణికులు.. తరువాత? -
Maha Kumbh 2025: ప్రయాగ్రాజ్ను తీర్థరాజం అని ఎందుకంటారు?
జనవరి 13 నుంచి యూపీలోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరగనుంది. ఈ నేపధ్యంలో ప్రయాగ్రాజ్లో సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీంతో నగరంలోని ప్రతీవీధి కొత్త కళను సంతరించుకుంది. కుంభమేళాకు తరలివచ్చే భక్తులకు స్వాగతం పలికేందుకు అన్ని శాఖలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.కుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్లోని పురాతన ఆలయాలు, ఆశ్రమాలకు మరమ్మతులు చేశారు. కొన్ని చోట్ల కారిడార్లు నిర్మించారు. శిథిలావస్థకు చేరిన ఆలయాలను పునరుద్ధరించారు. ప్రస్తుతం జరుగుతున్న ఏర్పాట్లను చూస్తుంటే, మహాకుంభమేళాకు వచ్చే భక్తులు ఇక్కడి పర్యాటక ప్రదేశాలను చూసి మైమరచిపోవడం ఖాయమనినిపించేలా ఉన్నాయని స్థానికులు అంటున్నారు.ప్రయాగ్రాజ్లోని భరద్వాజ ఆశ్రమం ఎంతో ప్రాధాన్యత కలిగినది. ఇక్కడ పర్యాటక శాఖ కారిడార్ను నిర్మించింది. ఈ కారిడార్కు ఇరువైపులా మహర్షి భరద్వాజునికి సంబంధించిన చిత్రాలను ఏర్పాటు చేశారు. శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు ఈ ఆశ్రమానికి వచ్చిన చిత్రాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. సీతారాములకు ఇక్కడి నుండే భరద్వాజ మహర్షి చిత్రకూట్కు వెళ్లే మార్గం చూపాడని చెబుతారు. అలాగే లంకలో విజయం సాధించిన శ్రీరాముడు ఇక్కడికి వచ్చి భరద్వాజుని ద్వారా సత్యనారాయణుని కథను విన్నాడని చెబుతారు. ఇలాంటి ఎన్నో పురాణగాథలు ప్రయాగ్రాజ్తో ముడిపడి ఉన్నాయి.ఈ ప్రదేశానికున్న పవిత్రతను దృష్టిలో ఉంచుకుని బ్రహ్మ దేవుడు ఈప్రాంతాన్ని తీర్థరాజం అని పిలిచాడని చెబుతారు. దీని అర్థం అన్ని పుణ్యక్షేత్రాలకు రాజు. ఈ ప్రదేశాన్ని వేదపురాణాలు, రామాయణం, మహాభారతాలలో ప్రయాగగా పేర్కొన్నారు. పద్మపురాణం ప్రకారం ప్రయాగలోని గంగా యమునా తీరంలో స్నానం చేస్తే కోట్లాది అశ్వమేధ యాగాల ఫలితాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ తీర్థరాజం గురించి మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. శేష భగవానుని సూచనల మేరకు బ్రహ్మ దేవుడు అన్ని తీర్థయాత్రల పుణ్యాన్ని తూచాడు. తీర్థ ప్రదేశాలు, ఏడు సముద్రాలు, ఏడు ఖండాలు ఒక వైపు ఉంచారు. మరోవైపు తీర్థరాజం ప్రయాగను ఉంచారు. ఈ నేపధ్యంలో తీర్థరాజం ప్రయాగ అత్యంత బరువుతో భూమిని తాకిందట.కాగా పర్యాటక శాఖ ప్రయాగ్రాజ్లో పలు ఆలయాల పునరుద్ధరణకు ఎర్ర ఇసుకరాయిని వినియోగించింది. ఇవి ఎంతో మన్నికైన రాళ్లుగా గుర్తింపుపొందాయి. మరోవైపు స్థానిక అధికారులు కుంభమేళా సందర్భంగా నగరంలోని పలుప్రాంతాల్లో 10 సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రయాగ్రాజ్లోని పర్యాటక ప్రాంతాలు, ఆలయాలకు సంబంధించిన సమాచారంతో కూడిన బుక్లెట్లను భక్తులకు పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధం చేశారు.ఇది కూడా చదవండి: World Braille Day: బ్రెయిలీ లిపి అంటే ఏమిటి? ఎలా ఆవిష్కృతమయ్యింది? -
క్యూబాలో వింత ఆచారం
కోరికలు తీర్చాలనో.. అవి తీరినందుకు మొక్కు చెల్లించుకోవడానికో ఆలయాల్లో పొర్లు దండాలు పెట్టడం చూస్తూనే ఉంటాం. క్యూబాలో కూడా ఇలాంటి సంస్కృతే ఉండటం విశేషం. పొర్లు దండాలు కాకున్నా సెయింట్ లాజరస్ ఊరేగింపు సందర్భంగా భక్తులు నేలపై పాకుతూ వెళ్తుంటారు. అందుకోసం భక్తులు పేదరికానికి ప్రతీకగా సంచులతో చేసిన బట్టలు వేసుకుంటారు. మోచేతులు, కాళ్లు రక్తమోడుతున్నా పట్టించుకోకుండా పాకుతారు. హవానా శివార్లలోని ఎల్ రిన్కాన్ అనే చిన్న చర్చికి చెప్పుల్లేకుండా నడిచి వెళ్తారు. కోర్కెలు తీర్చాల్సిందిగా లాజరస్ను మొక్కుకుంటారు. ఇది తాతల నాటి సంప్రదాయమట. ఏదేమైనా దాన్ని కచ్చితంగా ఆచరిస్తామని చెబుతారు వాళ్లు. క్యూబా నాస్తికత్వాన్ని వీడి 1992లో లౌకిక రాజ్యంగా మారింది. అక్కడ ఇటీవల బహిరంగ మత విశ్వాస ప్రదర్శనలు పెరిగాయి. 200 ఏళ్ల క్రితం బానిసలుగా వచ్చిన ఆఫ్రికన్లు యోరుబా మతంలోని శాంటరియా శాఖను తమతో తీసుకొచ్చారు. కొందరేమో బలవంతంగా కాథలిక్ మతంలోకి మారారు. దేశమంతటా ఈ రెండు మతాల సమ్మిళిత వాతావరణం ఉంటుంది. 1959 విప్లవం తరువాత క్యూబాలో వ్యవస్థీకృత మతాన్ని అణచివేసి శాంటరియా చాలావరకు విస్తరించింది. అది మతం కాదని క్యూబా ఆధ్యాత్మిక సంస్కృతి అని చెబుతుంటారు. ఇప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించింది. రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచి అమెరికాతో శత్రుత్వమున్నా ఒబామా హయాంలో దౌత్య సంబంధాలు కాస్త మెరుగయ్యాయి. కానీ 2016లో డొనాల్డ్ ట్రంప్ రాకతో క్యూబాపై ప్రతికూల ప్రభావం పడింది. మళ్లీ ట్రంప్ రాకతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడుతుందని క్యూబన్లు భయపడుతున్నారు. ఈ క్లిష్ట సమయాల్లో మత విశ్వాసాలను నమ్ముకుంటున్నారు. -
కుంభమేళాకు వెళుతున్నారా? వీటిని తప్పకుండా దర్శించండి
దేశంలో ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా జరుగుతుంటుంది. యూపీలోని ప్రయాగ్రాజ్లోగల గంగా, యమున, సరస్వతుల సంగమాన ఈ మహోత్తర కార్యక్రమం జరగనుంది. జనవరి 13 నుండి జరిగే కుంభమేళాకు పెద్ద ఎత్తున భక్తజనం తరలిరానున్నారు. కుంభమేళాకు హాజరయ్యేవారు సమీపంలోని కొన్ని ప్రాంతాలను తప్పనిసరిగా దర్శిస్తుంటారు. ఆ వివరాలు..త్రివేణీ సంగమంమహా కుంభమేళాలో స్నానానికి అత్యంత ప్రత్యేకమైన ప్రదేశం త్రివేణి సంగమం. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే ప్రదేశం ఇది. ఇక్కడే కుంభ స్నానం ఆచరిస్తారు.నాగ్ వాసుకి ఆలయంప్రయాగ్రాజ్లోని నాగ్ వాసుకి దేవాలయాన్ని ఇటీవలే పునరుద్ధరించారు. ఈ ఆలయ శిల్పకళ ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ప్రయాగ్రాజ్కు వచ్చేవారు ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శిస్తుంటారు.శయన హనుమంతుడుప్రయాగ్రాజ్లోని దర్గంజ్ ప్రాంతంలో గంగా నది ఒడ్డున ఉన్న హనుమంతుని ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. దీనిని సంకట్ మోచన హనుమాన్ దేవాలయం అని అంటారు. సమర్థ గురు రాందాస్ ఇక్కడ హనుమంతుని శయన విగ్రహాన్ని ప్రతిష్టించారని చెబుతారు. ఈ ఆలయంలో ఇతర దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి.ఆలోప్ శంకరి ఆలయంప్రయాగ్రాజ్లోని అలోపి బాగ్లోని అలోప్ శాంకరీ ఆలయం ఎంతో పురాతనమైనది. ఈ ఆలయం సంగమ తీరానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడకు నిత్యం భక్తులు తరలివస్తుంటారు.వేణుమాధవ దేవాలయంప్రయాగ్రాజ్లోని నిరాలా రోడ్లో ఉన్న ఈ ఆలయంలో విష్ణువు ధరించిన పన్నెండు రూపాల విగ్రహాలు ఉన్నాయి. శాలిగ్రామ శిలతో చేసిన విష్ణుమూర్తి విగ్రహం ఎంతో సుందరంగా కనిపిస్తుంది. కుంభమేళాకు వచ్చేవారు ఈ ఆలయాన్ని తప్పనిసరిగా దర్శిస్తుంటారు.ప్రయాగ్రాజ్ మ్యూజియంప్రయాగ్రాజ్ మ్యూజియం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రయాగరాజ్ సాంస్కృతిక వారసత్వాన్ని ఇక్కడ భద్రపరిచారు. ఇక్కడ గంగా గ్యాలరీని దర్శించి, పలు శాస్త్రీయ అంశాలు తెలుసుకోవచ్చు.శంకర విమాన మండపంప్రయాగ్రాజ్లో 130 అడుగుల ఎత్తైన శంకర విమాన మండప ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని దక్షిణ భారత శైలిలో నిర్మించారు. ఈ ఆలయంలో ఆదిశంకరాచార్య, కామాక్షి దేవి, తిరుపతి బాలాజీ తదితర విగ్రహాలు ప్రతిష్ఠితమయ్యాయి.ఆనంద్ భవన్ప్రయాగ్రాజ్లోని ఆనంద్ భవన్కు ఎంతో చరిత్ర ఉంది. ఇది దేశ మొదటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ అధికారిక నివాసం. దీన్ని మ్యూజియంగా మార్చి దేశ స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన ఆనవాళ్లను ఇక్కడ ఉంచారు.విక్టోరియా మెమోరియల్ప్రయాగ్రాజ్లో ఇటాలియన్ పాలరాయితో నిర్మించిన విక్టోరియా మెమోరియల్ ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. నాడు ఒక గొడుగు కింద క్వీన్ విక్టోరియా విగ్రహం నెలకొల్పారు. తరువాత విగ్రహం తొలగించినప్పటికీ, గొడుగు అలానే కనిపిస్తుంటుంది.తేలియాడే రెస్టారెంట్గంగా నదిలో తేలియాడే రెస్టారెంట్ పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. గంగానదిలో పడవ ప్రయాణం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ పడవలో కూర్చొని భోజనం చేయవచ్చు? అలాగే గంగా ఒడ్డున జరిగే కార్యక్రమాలను కూడా చూడవచ్చు.ఇది కూడా చదవండి: Sanjay Gandhi Birthday: ఇందిరకు నచ్చని మేనక?.. అయినా సంజయ్తో పెళ్లెలా జరిగింది? -
ఊదీ ఏం బోధిస్తోంది..?
బాబా తన దర్శనార్థం వచ్చే భక్తుల నుంచి దక్షిణ తీసుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. కొందరి దగ్గర అయితే అడిగి మరీ తీసుకునేవారు. అలా వసూలు చేసిన మొత్తాన్ని సర్వసంగ పరిత్యాగి అయిన సాయి ఏం చేసుకుంటారనే కదా అందరి సందేహం... సాయిబాబా తన భక్తులనుంచి శ్రద్ధను, భక్తి విశ్వాసాలను దక్షిణగా కోరారు. ఎందుకంటే శ్రద్ధ, భక్తి విశ్వాసాలే ఏ పనిని చేయడానికైనా అత్యంత ఆవశ్యకాలు. అందుకే ఆయన భక్తులనుంచి శ్రద్ధ, సబూరి రూపంలో దక్షిణను అడిగి మరీ తీసుకునేవారు. వాటిని తనకిస్తే వారి జీవితాలను తీయబరుస్తానని చెబుతూ... ‘‘శ్రద్ధ, సబూరి అనే రెండు కాసులను ఎవరు దక్షిణగా సమర్పిస్తారో వారిని పరిపూర్ణంగా అనుగ్రహిస్తాను. భక్తులలోని ఉన్నతమైన శ్రద్ధాభక్తులే వారిని ఆధ్యాత్మికంగా సౌశీల్యవంతులుగా తీర్చిదిద్దుతాయి. నా పలుకులను విశ్వసించే వారు ధన్యులు’’ అని ఆయన పదే పదే బోధించేవారు. ఆయన బోధలను ఆచరించిన వారికి ఆయన అనుగ్రహంతో సకలైశ్వర్యాలు చేకూరతాయన టంలో సందేహం లేదు. తన వద్ద పోగుపడిన ధనంలో ఎక్కువభాగం దానం చేసి, మిగతా దానితో వంట చెరుకును కొనేవారు. ఈ కట్టెలను బాబానే స్వయంగా ధునిలో వేసి మండించేవారు. మసీదులో బాబా నిత్యం ధునిని వెలిగిస్తూనే ఉండేవారు. అది ఇప్పటికీ అలా మండుతూనే ఉంది. అందులో నుంచి ఉద్భవించే బూడిదనే ఊదీ అంటారు. బాబా ఆ ఊదీనే తీసి భక్తులకు ఇళ్లకు తిరిగి వెళ్లేముందు ఆశీర్వదించి వారికి అందించేవారు. ఒక్కోసారి దానితోనే వైద్యం చేసేవారు. చిటికెడు ఊదీని బాబా తన భక్తుల నుదుటిపై పెట్టారంటే వారికి సర్వ రోగాలూ నయమయేవి.ఊదీ ద్వారా భక్తులకు బాబా ఏం బోధించారంటే... ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ అశాశ్వతాలు. పంచభూతాలచే రూ΄÷ందిన మన శరీరాలన్నీ సౌఖ్యాలు అనుభవించిన తరువాత పతనమైపోయి శిథిలమై బూడిదవుతాయి. ఈ విషయాన్నే నిరంతరం గుర్తు చేసేందుకే బాబా భక్తులకు ఊదీ ప్రసాదాన్ని అందించేవారు. ఈ ఊదీ వల్లనే బ్రహ్మము నిత్యమని, ఈ జగత్తు అశాశ్వతమని, ప్రపంచంలో గల మన బంధువులు, కొడుకుగాని, తండ్రిగాని, తల్లిగాని, మనవారు కారని బాబా బోధించారు. మనం ఎందరితో ఎన్ని రకాలుగా ఎంతగా ఎన్ని బంధాలు, అనుబంధాలు పెనవేసుకున్నా, అవేవీ శాశ్వతం కావని, ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగానే వచ్చాము, తిరిగి ఒంటరిగానే వెళ్తామన్న సత్యాన్ని బోధించేవారు.ఊదీకి ఆధ్యాత్మిక విశేషమే కాదు, భౌతికప్రాముఖ్యం కూడా ఉంది. ఊదీ అనేక విధాలుగా శారీరక మానసిక రోగాలకు ఔషధంగా పనిచేసేది. రోగులకు, బాధార్తులకు స్వస్థత కలిగించేది. తాము ధరించిన ఊదీ ద్వారా భక్తుల చెవిలో నిత్యానిత్యాలకు గల తారతమ్యం, అనిత్యమైన దానిపై అభిమాన రాహిత్యం గంట మోతవలె వినిపించి, చెడుపనులు, చెడు తలంపుల నుంచి దూరం చేస్తాయి. అలాగే ఊదీ ధరించిన వారికి ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే బాబా భక్తులు తప్పనిసరిగా నుదుట విభూది ధరిస్తారు. -
Kumbh Mela: కుంభమేళాలో పాల్గొన్న ప్రధానులు వీరే
ప్రయాగ్రాజ్: వచ్చే ఏడాది(2025) జనవరి 13 నుంచి యూపీలోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా లక్షలాదిమంది భక్తులు గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. విదేశాల నుంచి కూడా భక్తులు ప్రయాగ్రాజ్కు తరలిరానున్నారు.స్వాతంత్య్రానంతరం కుంభమేళాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళాలో సాధువులతో పాటు రాజకీయ ప్రముఖులు, సామాన్యులు కూడా పాల్గొంటున్నారు. నాటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని పలువురు రాజకీయ ప్రముఖులు వివిధ సమయాల్లో జరిగిన కుంభమేళాలలో పాల్గొంటూవస్తున్నారు. ताकि सनद रहे : पहले प्रधानमंत्री पंडित जवाहरलाल नेहरू भी कुंभ में स्नान कर चुके हैं और जनेऊ भी धारण किए हुए हैं।#KumbhMela2019 pic.twitter.com/06DUeCHBwr— Vinod Kapri (@vinodkapri) January 18, 2019పండిట్ జవహర్లాల్ నెహ్రూ (1951)భారత తొలి ప్రధాని పండిట్ నెహ్రూ కుంభమేళాను భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా అభివర్ణించారు. నెహ్రూ 1951లో జరిగిన కుంభమేళాకు హాజరయ్యారు.ఇందిరా గాంధీభారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కూడా కుంభమేళా నిర్వహణకు సహకారం అందించడమే కాకుండా, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందిరాగాంధీ హయాంలో కుంభమేళాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.అటల్ బిహారీ వాజ్పేయి (2001)అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ప్రయాగ్రాజ్లో జరిగిన కుంభమేళాలో ఆయన పాల్గొన్నారు. పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు మెరుగైన ఏర్పాట్లు చేశారు. కుంభమేళా ఘనంగా నిర్వహించేందుకు అటల్ బిహారీ వాజ్పేయి విశేష కృషి చేశారు.నరేంద్ర మోదీ (2019)2019లో జరిగిన కుంభమేళాలో ప్రధాని నరేంద్ర మోదీ గంగాస్నానం చేసి, ఈ కార్యక్రమం భారతీయ సంస్కృతికి విశిష్ట చిహ్నంగా అభివర్ణించారు. కుంభమేళాలో పరిశుభ్రత, మెరుగైన వసతుల కల్పనపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారించారు.త్రివేణీ సంగమం కేంద్రంగా..ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమంగా కుంభమేళా గుర్తింపు పొందింది. యూపీలోని ప్రయాగ్రాజ్లో వచ్చే ఏడాది జనవరిలో జరిగే మహాకుంభమేళాలో భక్తులు గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమంలో స్నానం చేయనున్నారు. ఈ సారి కుంభమేళాను మరింత ఘనంగా నిర్వహించేందుకు యూపీ సర్కారు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. ఈ సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో బాలీవుడ్ ప్రముఖులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.అలరించనున్న సాంస్కృతి కార్యక్రమాలుగాయకుడు, స్వరకర్త శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్, సోనూ నిగమ్, విశాల్ భరద్వాజ్, రిచా శర్మ, శ్రేయా ఘోషల్ తదితరులు తమ గానమాధుర్యంతో భక్తులను అలరించనున్నారు. కుంభమేళా సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమాలు జనవరి 10 నుంచి ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.శంకర్ మహదేవన్ సంగీత కార్యక్రమంజనవరి 10న ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ తన పాటలతో అలరించనున్నారు. జానపద గాయని మాలినీ అవస్థి జనవరి 11న తన సంగీత ప్రదర్శన ఇవ్వనున్నారు. జనవరి 18న గాయకుడు కైలాష్ ఖేర్ ప్రదర్శన ఉండవచ్చని సమాచారం. జనవరి 19న సాయంత్రం సోనూ నిగమ్ తన గానంతో మ్యాజిక్ చేయనున్నారు. జనవరి 20న ప్రముఖ జానపద గాయని మైథిలీ ఠాకూర్, జనవరి 31న కవితా పౌడ్వాల్, ఫిబ్రవరి 1న విశాల్ భరద్వాజ్, ఫిబ్రవరి 2న రిచా శర్మ, ఫిబ్రవరి 8న జుబిన్ నౌటియల్, ఫిబ్రవరి 10న రసిక శేఖర్, ఫిబ్రవరి 10న హన్స్రాజ్ రఘువంశీ, ఫిబ్రవరి 14న శ్రేయా ఘోషల్ తదితరులు తమ మధురమైన స్వరంతో భక్తులను అలరించనున్నారు.ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్కు శాంతి పరిరక్షక దళం?.. ఏం జరగనుంది? -
ISKCON Temple: ఇస్కాన్ అంటే ఏమిటి? ఈ ఆలయాల్లో రోజూ ఏం చేస్తారు?
న్యూఢిల్లీ: ఇటీవల బంగ్లాదేశ్లోని ఇస్కాన్ ఆలయంపై జరిగిన దాడి వార్త ప్రధాన శీర్షికల్లో నిలిచింది. అలాగే ఇస్కాన్కు చెందిన సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్ను బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్టు చేయడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఆగ్రహం తెప్పించింది. ఈ నేపధ్యంలో చాలాచోట్ల ఇస్కాన్ దేవాలయానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ ఇస్కాన్ను ఎవరు నెలకొల్పారు? ఈ సంస్థ లక్ష్యమేమిటి?కృష్ణ భక్తికి ప్రసిద్ధి చెందిన ఇస్కాన్ దేవాలయాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. దీనిని 1966లో శ్రీల ప్రభుపాద స్థాపించారు. ఆయన కోల్కతాలో జన్మించారు. తనకున్న అపార శ్రీకృష్ణ భక్తిని పరివ్యాప్తం చేస్తూ 1965లో హరే కృష్ణ ఉద్యమాన్ని ప్రారంభించారు. భగవద్గీతతో పాటు వేద గ్రంథాలలోని ఆధ్యాత్మికతను, భక్తిని వ్యాప్తి చేయడమే హరే కృష్ణ ఉద్యమ లక్ష్యం. శ్రీల ప్రభుపాద ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత ‘హరే కృష్ణ, హరే రామ్’ అంటూ శ్రీకృష్ణ భక్తిని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వెయ్యికిపైగా ఇస్కాన్ దేవాలయాలు ఉన్నాయి. వీటిలోని కొన్ని ఆలయాలు అక్కడి వాస్తుశిల్ప కళకు ప్రసిద్ధి చెందాయి. లండన్, బెర్లిన్, న్యూయార్క్లలో లెక్కకు మించిన కృష్ణ భక్తులు కనిపిస్తారు. వీరిలో చాలామంది క్రమం తప్పకుండా ఇస్కాన్ను సందర్శిస్తారు. ఇస్కాన్ దేవాలయాల్లో మనోహరమైన రాధాకృష్ణుల విగ్రహాలు కనిపిస్తాయి.ఇస్కాన్ ఆలయాల్లో ప్రతి రోజూ హరినామ సంకీర్తన జరుగుతుంది. ఆలయానికి వచ్చే భక్తులకు ఉచితంగా ప్రసాదం అందజేస్తారు. ఇస్కాన్ దేవాలయాలలో శ్రీమద్ భాగవతం, భగవద్గీతలపై బోధనలు ఉంటాయి. ఇస్కాన్ ప్రధాన కార్యాలయం మాయాపూర్ (పశ్చిమ బెంగాల్)లో ఉంది. ఇక్కడి భక్తులు శ్రీ చైతన్య మహాప్రభు అందించిన సూత్రాలను పాటిస్తారు.ఇది కూడా చదవండి: మహా కుంభమేళాకు ఐఆర్సీటీసీ ప్రత్యేక ఏర్పాట్లు.. టిక్కెట్ల బుకింగ్ షురూ -
తెలంగాణ అన్నవరం.. యాదగిరిగుట్ట
సత్యనారాయణస్వామి వ్రతాలకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం.. తెలంగాణ అన్నవరంగా ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం క్షేత్రం తర్వాత.. ఆ స్థాయిలో యాదగిరిగుట్టలోనే వ్రతాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏటా లక్షకు పైనే వ్రతాలు నిర్వహిస్తుండటం విశేషం. కార్తీకమాసం, శ్రావణమాసంలో వ్రతాలు ఆచరించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వ్రత పూజల కోసం కొండ దిగువన అధునాతన మండపం నిర్మించారు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా దేవస్థానం సౌకర్యాలు కల్పిస్తుండడంతో ఏటేటా వ్రతాల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ మంచే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు పలు రాష్ట్రాల భక్తులు వచ్చి వ్రత పూజలు చేస్తున్నారు. – సాక్షి, యాదాద్రిరోజూ అయిదు బ్యాచ్లుగా వ్రతాలుయాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించుకునేందుకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కొండ దిగువన వ్రత మండపంలో శ్రీస్వామి ఫొటోతో కూడిన పీటలు ఏర్పాటు చేశారు. టికెట్పై భక్తులకు పూజా సామగ్రిని దేవస్థానం అందజేస్తుంది. రోజూ ఐదు బ్యాచ్ల్లో వ్రతాలు జరుగుతున్నాయి. కార్తీకపౌర్ణమి వంటి ప్రత్యేక రోజుల్లో 700 జంటలు వ్రతాలు ఆచరించేలా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. వ్రత సమయాలను వివరిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. వ్రతాలు జరుగుతున్న సమ యంలో భక్తుల కుటుంబసభ్యులు.. మండపం బయట నీడలో కూర్చునేందుకు ప్రత్యేకంగా జర్మనీ టెంట్ ఏర్పాటు చేశారు. వ్రతాల అనంతరం కొండపై ప్రసాదాల కొనుగోలుకు ఇబ్బంది కలగకుండా.. వ్రత మండపం పక్కనే ప్రత్యేక ప్రసాదం కౌంటర్ ఏర్పాటు చేశారు. కార్తీక దీపాలు వెలిగించేందుకు ఏర్పాట్లు చేశారు. వ్రతాలు పూర్తికాగానే వ్రత మండపం హాళ్లను పారిశుధ్య సిబ్బందితో శుభ్రం చేయిస్తున్నారు. భక్తుల వాహనాలకు హెలిపాడ్ స్థలంలో పార్కింగ్ సౌకర్యం కల్పించారు.ప్రత్యేక ప్రసాదాల కౌంటర్కార్తీకమాసంలో యాదగిరిగుట్ట క్షేత్రంలో పెద్ద సంఖ్యలో వ్రతాలు జరుగుతాయి. భక్తు లకు ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేశాం. ఈసారి కార్తీకమాసం మొదలైనప్పటి నుంచి ఆదివారం వరకు 16 వేల వ్రతాలు జరిగాయి. కార్తీక మాసం చివరి వరకు భక్తులు వస్తూ వ్రతాలు ఆచరిస్తుంటారు. భక్తులు ఇబ్బంది పడకుండా వ్రత మండపం వద్ద ప్రత్యేకంగా ప్రసాదం కౌంటర్ ఏర్పాటు చేశాం. – భాస్కర్రావు, ఈవో, యాదగిరిగుట్ట దేవస్థానం సకల శుభాలు కలుగుతాయిశ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం వల్ల సకల శుభాలు కలుగుతాయి. కొన్ని వందల సంవత్సరాల నుంచి శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో భక్తులు వ్రతాలు చేస్తున్నారు. కార్తీకమాసంలో వ్రతాలు చేసేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఇక్కడ శివకేశవులు కొలువై ఉన్నారు. కార్తీకమాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనది. – నర్సింహమూర్తి, దేవస్థానం అర్చకుడువ్రతం చేయిస్తే పుణ్యం నా తల్లిదండ్రులతో కలి సి వ్రత పూజకు వస్తాను. ప్రతి కార్తీక మాసంలో, వీలైనప్పుడు యాద గిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆ లయంలో వ్రతం చేయించి మొక్కులు తీర్చుకుంటాం. ఈసారి కూడా కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి వ్రతం చేశాం. – స్వర్ణలత, బాలానగర్పదేళ్లుగా వ్రతం చేస్తున్నాంయాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి అలయంలో వ్రత పూజ చేస్తే మంచి జరుగుతుందని భావించి ప్రతి కార్తీక మాసంలో ఆలయానికి వస్తాం. కార్తీక మాసంలోనే మా వివాహ వార్షికోత్సవం కావడంతో కలిసి వస్తోంది. వ్రత పూజ చేసిన తరువాత శివుడిని, లక్ష్మీనరసింహస్వామి వారిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకుంటాం. – వందనపు కరుణశ్రీ, సంస్థాన్ నారాయణపురం. -
Mahakumbh Mela 2025: మహాకుంభమేళా జరిగే తేదీలు.. ప్రాంతాలు ఇవే..
లక్నో: దేశంలో 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళా ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఈ మేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటారు. మహాకుంభమేళాలో పుణ్యస్నానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. 2025 జనవరిలో నిర్వహించే బోయే మహాకుంభమేళాకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహా కుంభమేళా ఏఏ ప్రాంతాల్లో ఏఏ తేదీల్లో జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో 2025 జనవరి 13న పౌష్య పూర్ణిమ నుంచి కుంభమేళా ప్రారంభం కానుంది. ఇది 2025, ఫిబ్రవరి 26న శివరాత్రితో ముగియనుంది. అంతకుముందు 2013లో ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా నిర్వహించారు.పుణ్యస్నానాలు- తేదీలుమొదటి పుణ్యస్నానం జనవరి 13న పౌష్య పూర్ణిమ రోజున జరగనుంది.జనవరి 14న మకర సంక్రాంతి శుభ సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు చేయనున్నారు.జనవరి 29న మౌని అమావాస్య నాడు పుణ్యస్నానాలు ఆచరించనున్నారు.ఫిబ్రవరి 3న వసంత పంచమి శుభ సందర్భంగా పుణ్యస్నానాలు చేయనున్నారు.ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ రోజున పుణ్యస్నానాలు చేయున్నారు.ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున కుంభమేళాలో చివరి పుణ్యస్నానాలు చేయనున్నారు.మహాకుంభమేళాలో పుణ్యస్నానాలను అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున సాధువులు, నాగా సాధువులు, ఇతర శాఖల మహంత్లు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. వారు స్నానం చేసిన తరువాత సామాన్య భక్తులకు పుణ్యస్నానాలు చేసే అవకాశం లభిస్తుంది. మనదేశం నుంచే కాకుండా విదేశాల నుండి కూడా కోట్లాది మంది హిందువులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఇక్కడకు తరలి వస్తుంటారు. మహాకుంభమేళా జరిగే సమయంలో త్రివేణిసంగమంలోని నీరు అమృతంలా మారుతుందని చెబుతుంటారు. మహాకుంభమేళా సమయంలో పుణ్య స్నానాలు చేయడం వల్ల పాపాలు నశించి, మోక్షం లభిస్తుందని హిందువులు నమ్ముతారు.పుణ్యస్నానాలు- ప్రాంతాలుప్రయాగ్రాజ్యూపీలోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు కేంద్రంగా నిలుస్తుంది. ఇక్కడి త్రివేణి సంగమంలో భక్తులు పూజలు, పుణ్యస్నానాలు చేస్తారు. గంగా, యమున, సరస్వతి నదుల సంగమం ఇది. ఇక్కడ సరస్వతి నది అదృశ్యంగా ఉంటుందని అంటారు.హరిద్వార్కుంభమేళా సమయంలో లక్షలాది మంది భక్తులు ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో పుణ్యస్నానాలు చేస్తారు. గంగానది.. పర్వతాలను వీడి ఇక్కడి నుంచే మైదానాలలోకి ప్రవేశిస్తుంది. హరిద్వార్.. హిమాలయ పర్వత శ్రేణిలోని శివాలిక్ పర్వతాల దిగువన ఉంది. హరిద్వార్ను తపోవన్, మాయాపురి, గంగాద్వార్, మోక్ష ద్వార్ అని కూడా పిలుస్తుంటారు.నాసిక్నాసిక్లో జరిగే కుంభమేళాను నాసిక్ త్రయంబక్ కుంభమేళా అని కూడా అంటారు. దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్వరం ఒకటి. త్రయంబకేశ్వరంలో 12 ఏళ్లకు ఒకసారి సింహస్థ కుంభమేళా జరుగుతుంది. కుంభమేళా సందర్భంగా, వేలాది మంది భక్తులు గోదావరి పవిత్ర జలాల్లో స్నానాలు చేస్తారు. ఇక్కడ శివరాత్రిని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు.ఉజ్జయినిఉజ్జయినిలో క్షిప్రా నది ఒడ్డున పుణ్యస్నానాలు చేస్తారు. ఈ సందర్భంగా భక్తులు మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శిస్తారు. ఉజ్జయిని నగరం మధ్యప్రదేశ్కు పశ్చిమాన ఉంది.యూపీ రవాణాశాఖ సన్నాహాలుఉత్తరప్రదేశ్ రవాణాశాఖ మహాకుంభమేళా సందర్భంగా ఏడు వేల ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళిక రూపొందించింది. వీటిలో 200 ఎయిర్ కండిషన్డ్ బస్సులు కూడా ఉండనున్నాయి. మహిళలు, వృద్ధ యాత్రికులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని రవాణాశాఖ భావిస్తోంది. ఇది కూడా చదవండి: Jharkhand: ఇలా గెలిచి.. అలా రాజీనామాకు సిద్ధమై.. ఏజేఎస్యూలో విచిత్ర పరిణామం -
అద్వైత సిద్ధికి.. అమరత్వ లబ్దికి..!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: పుణ్యక్షేత్రాలను దర్శించే భక్తుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోంది. కార్తీక మాసంలో శైవక్షేత్రాలు, బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల, దసరా నవరాత్రుల్లో అమ్మవారి క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడటం సాధారణమే. కానీ.. ఇటీవల కాలంలో దేశంలోని ప్రముఖ ఆలయాల్లో రోజువారీ భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 25, 30 ఏళ్ల కిందట సాధారణ, మధ్య తరగతి కుటుంబాలకు రోజువారీ జీవితం గడవడమే కష్టంగా ఉండేది. దీంతో సమీపంలోని ఆలయాలకు వెళ్లి.. మొక్కులు తీర్చుకునేవారు. ప్రస్తుత తరుణంలో ప్రజల ఆర్థిక, కొనుగోలు శక్తి పెరిగింది. అందులోనూ కోవిడ్ సంక్షోభం జనం ఆలోచన తీరును పూర్తిగా మార్చేసింది. ఉన్నంతలో మంచిగా బతుకుతూ.. సంపాదించిన మొత్తంలో తమ సంతోషాలకు కొంత ఖర్చు చేయాలనే ధోరణి పెరిగింది. ఈ నేపథ్యంలో యువకులు పర్యాటక ప్రాంతాల సందర్శనకు ప్రాధాన్యత ఇస్తుంటే.. మధ్య వయసు, పెద్దవారితో పాటు ఇంటిల్లిపాది పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫలితంగా ప్రధాన ఆలయాలకు భక్తుల తాకిడి పెరిగింది. మారిన జీవనశైలీ కారణమే ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయాయి. భార్య, భర్త, పిల్లలు మాత్రమే కుటుంబంగా ఉన్నారు. భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగాలు చేసేవారు, వ్యాపారస్తులు వ్యక్తిగత జీవితం కంటే వృత్తిపరమైన జీవితంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీంతో ఒంటరి జీవితం గడుపుతున్నామనే భావనతో ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో ఏడాదిలో కనీసం రెండుసార్లు కుటుంబంతో బయటకు వెళ్లేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో మహిళలు ఆలయాలసందర్శనకే మొగ్గు చూపుతున్నారు. స్వర్ణ దేవాలయం ప్రపంచంలోనే టాప్ అమృతసర్లోని స్వర్ణ దేవాలయాన్ని రోజూ సగటున లక్షమంది భక్తులు దర్శించుకుంటున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే ఈ క్షేత్రం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకుని ప్రపంచంలోనే అత్యధిక భక్తులు దర్శించే క్షేత్రంగా పేరొందింది. తిరుమలకు రోజుకు సగటున 70 వేల మంది వెళ్తుండగా.. ఆ క్షేత్రం రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో జమ్మూలోని వైష్ణోదేవి ఆలయం మూడో స్థానంలో నిలిచింది. తరువాత స్థానం షిర్డీకి దక్కింది. ఈ క్షేత్రంలో రోజుకు సగటున 25 వేల మంది భక్తులు వెళ్తున్నారు. అయోధ్యలో కొత్త రామ మందిరం నిర్మించిన తర్వాత అక్కడ కూడా ప్రస్తుతం రోజూ లక్షమందికిపైగా భక్తులు వెళ్తున్నారు. ఆ తరువాత స్థానాల్లో శ్రీశైలం, సింహాచలం, అన్నవరం, విజయవాడ కనకదుర్గ ఆలయాలు ఉన్నాయి. ఇటీవల తిరువణ్ణామలైలోని అరుణాచలం క్షేత్రాన్ని తెలుగు వారు ఎక్కువగా దర్శించుకుంటున్నారు. దీంతో పాటు ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు మొత్తం చూడాలనుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. 7.50 లక్షల ఆలయాలు ప్రపంచంలో అత్యధిక ఆలయాలు ఉన్న దేశం భారత్. ఇక్కడ 7.50 లక్షల ఆలయాలు ఉన్నాయి. ఇవికాకుండా 25,700 చర్చిలు, 6,414 గురుద్వారాలు, 8,949 జైన్ టెంపుల్స్ ఉన్నాయి. ఆయా మతాలకు చెందిన సంబంధిత క్షేత్రాలను దర్శించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని కుటుంబాలు లేదా ఒక సమూహంగా ఆలయాలను సందర్శించేందుకు వీరంతా ‘టూర్ ఆపరేటర్ల’ను కలుస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై లాంటి కేంద్రాలతో పాటు జిల్లా, పట్టణ కేంద్రాల్లో కూడా టూర్ ఆపరేటర్లు ప్రత్యేక యాత్ర ప్యాకేజీలను ప్రకటిస్తున్నారు. బస్సు, రైలుతో పాటు ఈ ప్యాకేజీలలో విమానాలను చేర్చి తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలను సౌకర్యవంతంగా చూపిస్తున్నారు. గత ఐదేళ్లలో ప్రముఖ పుణ్యక్షేత్రాల పరిధిలోని విమానాశ్రయాలలో ప్రయాణికుల రాకపోకల సంఖ్య 11 నుంచి 75 శాతం పెరిగిందంటే టెంపుల్ టూరిజానికి డబ్బును ఖర్చు చేయడంలో ప్రజలు ఏమాత్రం వెనుకాడటం లేదని స్పష్టమవుతోంది. -
తిరుపతిలో కార్తీక పౌర్ణమి సందడి.. భక్తుల కోలాహాలం (ఫొటోలు)
-
కార్తీకాన శివరూపం.. కమనీయం ఆ దర్శనం! (ఫోటోలు)
-
ప్రముఖ దేవాలయంలో ఏసీ నుంచి కారుతున్న నీళ్లు.. తాగేందుకు ఎగబడుతున్న భక్తులు
ప్రజల్లో దైవ భక్తి రోజురోజుకి శృతి మించుతోంది. ప్రముఖ దేవాలయంలో ఏర్పాటు చేసిన ఏసీల నుంచి కారే నీటిని తాగుతున్నారు. ఒంటిపై చల్లుకుని పునీతులం అయ్యామని తెగ సంబరపడిపోతున్నారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వ్రిందావన్ నగరంలో ప్రముఖ ప్రసిద్ధ ‘బాంకే బిహారీ’ అనే శ్రీకృష్ణుని దేవాలయం ఉంది. అయితే ఆ దేవాలయంలో దైవ దర్శనానికి భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. వస్తూ.. వస్తూ తమ వెంట టీ తాగే కప్పులను తెచ్చుకుంటున్నారు. శ్రీకృష్ణుడి దర్శనం అనంతరం గుడికి వెనుక భాగంలో ఏనుగు శిల్పం నుంచి కారుతున్న నీటిని దక్కించుకునేందుకు ఎగబడుతున్నారు.Serious education is needed 100%People are drinking AC water, thinking it is 'Charanamrit' from the feet of God !! pic.twitter.com/bYJTwbvnNK— ZORO (@BroominsKaBaap) November 3, 2024ఆ నీటిని టీ కప్పుల్లో నింపుకున్న భక్తులు తాగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కొంతమంది భక్తులు నీటిని సేకరించడానికి కప్పులను ఉపయోగిస్తుండగా.. మరికొందరు చేతిలో తీర్ధం తీసుకున్నట్లుగా ఏసీ నుంచి కారే నీటిని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. వెలుగులోకి వచ్చిన పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఆలయ నిర్మాణ సమయంలో ఏసీలను ఏర్పాటు చేశారు. ఆ ఏసీల నుంచి కారే నీటిని బయట విడుదలయ్యేలా ఏనుగు ఆకారంలో ఉండే గొట్టాలను అమర్చారు. ఇప్పుడు ఏనుగు ఆకారంలో ఉండే గొట్టాల ద్వారా విడుదలవుతున్న నీటినే భక్తులు తాగుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో.. వీడియోలు తీసిన వారు.. ఏనుగు శిల్పం నుంచి ఏసీ విడుదల చేసే నీరు కారుతుందని చెబుతున్న మాటలు వినబడుతున్నాయి. అయినప్పటికీ అనేక మంది ఆలయానికి వెళ్లేవారు నీటిని తాగడం లేదంటే తమపై చల్లుకోవడం చేస్తున్నారు. మరికొందరు ఏనుగు శిల్పం నోటి నుండి కారుతున్న 'చరణ్ అమృతం’ (దేవుడు తమని ఆశీర్వదిస్తున్నారనే సూచికగా) భావిస్తున్నారు. శ్రీకృష్ణుడి పాదాల నుండి వస్తున్న పవిత్ర జలం అంటూ భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు.PLEASE DO NOT DRINK AIR CONDITIONING WATER!Cooling and air conditioning systems are breeding grounds for many types of infections including fungus, some really hellish. Exposure to air conditioning condensed water can lead to a terrifying disease known as Legionnaires'… https://t.co/FhOly0P7Dj— TheLiverDoc (@theliverdr) November 3, 2024వైరల్ అవుతున్న వీడియోలపై డాక్టర్లు సైతం స్పందిస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోల్లో.. దేవాలయంలో అమర్చిన ఏసీల నుంచి వచ్చే నీరని తాగొద్దని కోరుతున్నారు. ఏసీ నుంచి వచ్చే నీటిని తాగడం వల్ల ప్రాణాంతకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకుతుందని హెచ్చరిస్తున్నారు. -
వేడి వేడి కిచిడీ పడి ఇద్దరు భక్తులకు తీవ్ర గాయాలు..
ఉత్తరప్రదేశ్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మధురలోని ఆశ్రమం వద్ద ప్రసాదం కోసం క్యూలో వేచి ఉన్నఇద్దరు మహిళా భక్తులపై 'కిచిడీ' వడ్డించే వ్యక్తి జారిపడి వేడి ఆహారం వారిపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. క్యూలో నిలబడిన మరో ఎనిమిది మంది మహిళలకు కూడా పాత్రలోని వేడి వేడి కిచిడీ పడటంతో స్వల్ప గాయపడ్డారు. గాయపడిన భక్తులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని ఆగ్రాలోని ఎస్ఎన్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారిని ప్రథమ చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేశారు. కాగా ఇద్దరు భక్తులను పశ్చిమ బెంగాల్కు చెందిన మహిళలుగా గుర్తించారు.మధురలోని బృందావన్ ప్రాంతంలోని గౌరీ గోపాల్ ఆశ్రమంలో శుక్రవారం ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం భక్తులందరూ పరిక్రమ మార్గ్ సంత్ కాలనీలో ఉన్న గౌరీ గోపాల్ ఆశ్రమానికి చేరుకోగా.. బయట ప్రసాదం పంపిణీ చేస్తుండటాన్ని గమనించారు. బియ్యం, పప్పుతో చేసిన కిచిడీని తీసుకునేందుకు భక్తులు క్యూలో నిల్చున్నారు. ఈక్రమంలో కిచిడీని పాత్రను తీసుకొస్తున్న వ్యక్తి జారిపడిపోయాడు. అతని చేతిలోని వేడి ఆహారం పక్కన నిలబడి ఉన్న మహిళలపై పడినట్లు జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వందనా అగర్వాల్ చెప్పారు. ఈ సంఘటన భక్తులను భయాందోళనకు గురిచేసిందని, గాయపడిన 10 మంది మహిళలను ఆసుపత్రికి తరలించినట్లు ఆమె తెలిపారు. -
ఇంట్లో కూర్చుని.. అయోధ్యలో దీపం వెలిగించండిలా..
అయోధ్య: యూపీలోని అయోధ్యలో ఈ నెల 30 భారీ ఎత్తున దీపోత్సవం నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా అయోధ్యలో లక్షల దీపాలు వెలిగించనున్నారు. అయితే అందరికీ ఈ వేడుకలను వెళ్లే అవకాశం ఉండదు. అటువంటివారికి అయోధ్య డెవలప్మెంట్ అధారిటీ శుభవార్త చెప్పింది.ఏ ప్రాంతంలోని వారైనా వారి ఇంటిలోనూ కూర్చొని అయోధ్యలో ఘనంగా జరిగే దీపోత్సవంలో పాల్గొనవచ్చు. ఇందుకోసం అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. శ్రీరాముని పేరిట ఒక దీపం’ పేరుతో శ్రీరాముని భక్తులు తమ ఇంట్లో కూర్చొని దీపోత్సవంలో భాగస్వాములు కావచ్చు.ఇందుకోసం అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ దివ్య అయోధ్య యాప్ ద్వారా భక్తులకు ఆన్లైన్ బుకింగ్ ఎంపికను ఇచ్చింది. ఈ యాప్ ద్వారా భక్తులు దీపాలు వెలిగించవచ్చు. అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ సెక్రటరీ సత్యేంద్ర సింగ్ మాట్లాడుతూ.. దీపోత్సవ్కు హాజరుకాలేని భక్తులు ఇంట్లో కూర్చొనే దీపాలు వెలిగించే అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. ‘దివ్య అయోధ్య యాప్’ సాయంతో ఆన్లైన్ బుకింగ్ ద్వారా దీపం వెలిగించినవారికి డిజిటల్ ఫోటోతో పాటు అయోధ్య ప్రసాదం పంపిస్తామన్నారు.ఇది కూడా చదవండి: ఆర్మీ శునకం ‘ఫాంటమ్’ ఇకలేదు -
అయోధ్య: దీపోత్సవానికి ముస్తాబు.. పుష్ఫ వర్షానికి ఏర్పాట్లు
అయోధ్య: యూపీలోని రామనగరి అయోధ్య దీపోత్సవానికి ముస్తాబవుతోంది. తాజాగా అవధ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తన బృందంతో కలిసి రామ్ కీ పైడీ, దీపోత్సవ్ సైట్లను పరిశీలించారు. అక్టోబరు 22న అయోధ్యలో దీపోత్సవం జరగనుంది. దీనికిముందు అవధ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రతిభా గోయల్, ఆమె బృందం రామ్ కీ పైడీ వద్ద వేద పండితుల సమక్షంలో భూమి పూజ చేయనున్నారు. నూతన రామాలయంలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్టించిన తర్వాత జరిగే మొదటి దీపాల పండుగ ఇదే కావడంతో, దీనిని అద్భుతంగా నిర్వహించాలని రామాలయ ట్రస్టు భావిస్తోంది.ఈసారి అయోధ్యలో 25 లక్షల దీపాలు వెలిగించి, నూతన రికార్డు సృష్టించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 40 స్వచ్ఛంద సంస్థలతో పాటు అవధ్ యూనివర్సిటీ, కాలేజీ, 36 ఇంటర్ కాలేజీలకు చెందిన 30 వేల మందికి పైగా విద్యార్థులు దీపాలు వెలిగించనున్నారు. రామ్ కీ పైడీ సహా 55 ఘాట్లపై 28 లక్షల దీపాలు వెలిగించనున్నారు. ఇందుకోసం దాదాపు 90 వేల లీటర్ల నూనెను వినియోగించనున్నారు. అక్టోబర్ 28 నాటికి ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తికానున్నాయి. ఈ ఏడాది దీపోత్సవం నిర్వహిస్తున్న సమయాన హెలికాప్టర్ల నుంచి పూలవర్షం కురిపించనున్నారు. అలాగే అయోధ్య నగరాన్ని పూలతో అందంగా అలంకరించనున్నారు.ఇది కూడా చదవండి: ధర్మ చక్రం: నాలుగు ఆశ్రమాలలో ఏది గొప్పది? -
విజయవాడ: దసరా ఉత్సవాల్లో ఘోర అపచారం
సాక్షి, విజయవాడ: దసరా ఉత్సవాల్లో ఘోర అపచారం జరిగింది. భవానీ భక్తులను దేవాదాయ శాఖ దారుణంగా మోసం చేసింది. ఆగమ శాస్త్రానికి తూట్లు పొడిచిన దుర్గ గుడి అధికారులు.. భక్తులకు ఇతర ఆలయాల్లో ప్రసాదాలు పంపిణీ చేశారు. ఇతర ఆలయాల ప్రసాదాలు దుర్గమ్మ ప్రసాదంగా పంపిణీ చేయడం ఆగమ శాస్త్ర విరుద్ధం. దుర్గగుడికి పెదకాకాని, మోపిదేవి, పెనుగంచిప్రోలు ఆలయాల నుంచి తెచ్చిన 37 వేల లడ్డూలు భవానీ భక్తులతో పాటు దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులకు పంపిణీ చేశారు.ఇతర ఆలయాల నుంచి లడ్డూ ప్రసాదం తెచ్చి దుర్గమ్మ ప్రసాదంగా పంపిణీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవాదాయశాఖ, దుర్గగుడి అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. బెజవాడ దుర్గమ్మ లడ్డూ ప్రసాదం భవానీ భక్తులకు అత్యంత పవిత్రం, ప్రీతికరం. అయితే, లడ్డు ప్రసాదం కొరత రాకుండా ఉండేందుకేనంటూ చేసిన అపచారాన్ని దుర్గగుడి అధికారులు సమర్థించుకుంటున్నారు. సామాన్య భక్తులతో పాటు భవానీ భక్తుల మనోభావాలను దేవాదాయ శాఖ అధికారులు దారుణంగా దెబ్బతీశారు. -
కర్రల సమరం.. జన సంద్రంగా దేవరగట్టు
సాక్షి, కర్నూలు: దేవరగట్టు జనసంద్రంగా మారింది. బన్ని ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు భారీగా వస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు మాళమల్లేశ్వర స్వామి కల్యాణం నిర్వహించనున్నారు. అనంతరం ఊరేగింపుతో బన్నీ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అర్ధరాత్రి ఉత్కంఠ భరితంగా కర్రల సమరం సాగనుంది. కర్ణాటక, తెలంగాణ నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. బన్ని ఉత్సవానికి 800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.‘బన్ని’ ఉత్సవం ప్రత్యేకత ఇదే..గట్టుపై కొలువైన మాత మాళమ్మ, మల్లేశ్వరుని కల్యాణోత్సవం అనంతరం ‘బన్ని’ ఉత్సవంగా జరిగే కార్యక్రమానికి ఎంతో ప్రత్యేకత ఉంది. దేవరగట్టు ఆలయ నిర్వాహణ బాధ్యత మోస్తున్న పరిసర గ్రామాలైన నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు భారీ సంఖ్యలో దేవరగట్టుకు చేరుకుంటారు. అక్కడ చెరువుకట్ట (డొళ్లిన బండే) వద్దకు చేరి కక్షలు, కార్పణ్యాలు లేకుండా కలిసికట్టుగా ఉత్సవాన్ని జరుపుకుందామని పాలబాస తీసుకుంటారు. అనంతరం గ్రామపెద్దలు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న కంట్రోల్ రూం వద్దకు వచ్చి కొండపై జరిగే కల్యాణోత్సవానికి వస్తున్నట్లు సూచనగా వారికి బండారాన్ని ఇచ్చి వెళ్తారు.అనంతరం బాణసంచా పేల్చి ఇనుప తొడుగులు తొడిగిన రింగు కర్రలు, అగ్గి కాగడాలు చేతపట్టి డోలు, మేళతాళాలతో కాడప్ప మఠంలో అప్పటికే అక్కడ ఉంచిన మల్లేశ్వరుని ఉత్సవ విగ్రహాన్ని కొండపైకి తీసుకెళ్తారు. ఆలయంలో ఉన్న మాళమ్మ ఉత్సవ విగ్రహంతో వేదపండితుల భక్తులు జయ జయ ధ్వానాల మధ్య అర్ధరాత్రి వేళ కల్యాణోత్సవం జరిపిస్తారు.అనంతరం ఉత్సవమూర్తులను తీసుకుని జైత్రయాత్రను సాగించడానికి కొండ దిగే వేళ కర్రలు గాలిలోకి లేస్తాయి. దివిటీలు భగ్గుమంటాయి. ఈ సమయంలో కర్రలు భక్తుల తలలకు తగిలి గాయపడతారు. నిట్రవట్టి, బిలేహాల్, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి, అరికెర, అరికెరతాండా, కురుకుంద, లింగంపల్లి తదితర గ్రామాల భక్తులు కల్యాణోత్సవం అనంతరం జరిగే ఈ మొగలాయిలో పాల్గొంటారు. మొగలాయిలో భక్తులు చేతుల్లో ఉన్న కర్రలు తగిలి చాలా మంది గాయపడతారు.ఈ సమయంలోనే చాలా మందిపై దివిటీలు మీద పడటం, భక్తుల తోపులాటలో కిందపడటంతో తీవ్రంగా గాయపడి గతంలో కొందరు మృత్యవాత పడ్డారు. ఉత్సవాల్లో గాయపడిన భక్తులకు స్వామివారికి చల్లే పసుపు (బండారం) అంటిస్తారు. అనంతరం జైత్రయాత్ర స్వామి వారి ఊరేగింపుతో ముల్లబండ, పాదాలగట్టు, రక్షపడికి చేరుకుంటుంది. ఉత్సవ వివరాలు ఇలా..12న శనివారం రాత్రి మాంగల్యధారణ–కల్యాణోత్సవం (బన్ని), అనంతరం జైత్రయాత్ర మొదలై రక్షపడి (రక్త తర్పణం చేయుట) మీదుగా శమీ వృక్షం చేరుతుంది 13న ఉదయం నెరణికి గ్రామ ఆలయ పూజారి భవిష్యవాణి (కార్ణీకం) వినిపిస్తాడు 14న నెరణికి గ్రామ పురోహితుల చేత స్వామి వారికి పంచామృతం, రథోత్సవం15న గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడోత్సవం, సాయంత్రం వసంతోత్సవం, కంకణ విసర్జన 16న మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి -
ఇంద్రకీలాద్రి.. సింధూర శోభితం (ఫోటోలు)
-
దుర్గమ్మ సన్నిధిలో పోలీసుల క్రౌర్యం
సాక్షి ప్రతినిధి, విజయవాడ/వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): మూలా నక్షత్రం రోజు బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో సామాన్య భక్తులపై పోలీసులు దౌర్జన్యపూరితంగా వ్యవహరించారు. మహిళలు, వృద్ధులు, బాలలని కూడా చూడకుండా లాగిపడేశారు. పోలీసుల క్రౌర్యానికి ఓ బాలుడు, మహిళ గాయపడ్డారు. రౌడీలు, నేరస్తులతో కూడా పోలీసులు ఈ విధంగా వ్యవహరించరని పలువురు భక్తులు మండిపడ్డారు. ఎన్నో ప్రయాసలకోర్చి దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు పోలీసుల చేష్టలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీఐపీ దర్శనాల రద్దు ఉత్తి మాటే! మూలా నక్షత్రం కావడంతో వీఐపీల దర్శనాలు రద్దు చేశామని, సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తామని అధికారులు, నేతలు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాల సమర్పణ సమయంలో కూడా మూడు క్యూలైన్లలో భక్తులను దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. అయితే అచరణతో మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది. చంద్రబాబు పట్టు వ్రస్తాల సమర్పణ సమయంలోనే 35 నిమిషాలకు పైగా భక్తులకు దర్శనం నిలిపివేశారు. ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చిన సమయంలోనూ క్యూలైన్లు ఆపారు. మిగతా వీఐపీలూ పెద్ద సంఖ్యలో రావడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. మాటిమాటికీ క్యూలను ఆపడంతో వినాయకుడి గుడి, కుమ్మరిపాలెం సెంటర్ల నుంచి క్యూలైన్లలో చంటి బిడ్డలను తీసుకొని వచ్చే భక్తులకు దర్శనానికి దాదాపు 6 గంటల సమయం పట్టింది. వీఐపీలకు తోడు ఉత్సవ కమిటీ సభ్యులు, అధికార పార్టీ నేతల సంబందీకులు అనేక మంది కింద ఉన్న క్యూలైన్లలో కాకుండా నేరుగా కొండ పైకి చేరుకున్నారు. దీంతో ఓం టర్నింగ్ వద్ద తీవ్ర తోపులాటలు జరిగాయి. మగ పోలీసులే మహిళలను తోసుకుంటూ వెళ్లటం, కొంతమంది కింద పడిపోవటం వంటి ఘటనలు జరిగాయి. ఆ తోపులాటకు కొందరు విలపించారు. ఏటా మూలా నక్షత్రం రోజున భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారని తెలిసినప్పటికీ, పోలీసుల వద్ద నిరి్ధష్టమైన ప్రణాళిక లేకపోవటమే ఈ విధమైన తోపులాటలు, గందరగోళ పరిస్థితులకు కారణమని భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తి వాతావరణం కాక పోలీసు స్టేషన్లో ఉండే పరిస్థితులను సృష్టిస్తున్నారని ఆలయంలోని సిబ్బంది సైతం వ్యాఖ్యానిస్తున్నారు.బాలుడికి, తల్లికి గాయాలు బుధవారం మూలా నక్షత్రం, సరస్వతి దేవి అలంకారం కావడంతో బెజవాడ దుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం రాత్రి 11 గంటల నుంచే వేలాదిగా భక్తులు వచ్చారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి అనుమతించారు. భక్తులకు అడుగడుగునా పోలీసుల నుంచి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఎక్కడెక్కడి నుంచో అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులను సౌకర్యవంతంగా క్యూలో పంపించాల్సిన పోలీసులే వారి పట్ల దౌర్జన్యంగా వ్యవహరించారు. ఇదే క్రమంలో హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చిన ఒక మహిళ, ఆమె కుమారుడు గాయపడ్డారు. కొండ కింద నుంచి ఐదు గంటలపాటు క్యూలో నడుచుకుంటూ ఆ మహిళ కుటుంబం అమ్మవారి చెంతకు చేరింది. అదే సమయంలో మహిళా పోలీసులు ఆమెను, ఆమె కుమారుడిని తోసేయడంతో వారిద్దరూ ముందు ఉన్న బారికేడ్పై పడిపోయారు. బాలుడి తలకు బారికేడ్ బలంగా తగిలింది. చెవికి తీవ్రమైన గాయమైంది. చెంప వాచింది. ఆ బాలుడు నొప్పితో విలవిల్లాడాడు. మహిళ చేతికి గాయమైంది. ఇదేమిటని ప్రశ్నించిన మహిళపై మహిళా పోలీసులు బూతులతో విరుచుకుపడ్డారు. ఆమె చెయ్యిని గిచ్చినట్లుగా ఆ మహిళ మీడియా వద్ద వాపోయారు. కొండపైన ఉన్న హెల్త్ సెంటర్లో సిబ్బంది బాలుడిని పరిశీలించి ఈఎన్టీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. -
ఇంద్రకీలాద్రిలో ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న భక్తులు
-
ఇంద్రకీలాద్రి: వీఐపీ దర్శనాలతో సామాన్య భక్తుల అగచాట్లు
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రికి ప్రోటోకాల్ దర్శనాలు పోటెత్తాయి. ప్రోటోకాల్ దర్శనాలు.. సామాన్య భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. వీఐపీ టైమ్ స్లాట్ దర్శనాలు అమలుకావడం లేదు. సిఫార్సు లెటర్స్ ఉంటే చాలు అంతా వీఐపీలే అన్నట్టుగా, ఉదయం నుంచి సిఫార్సు లెటర్లతో భారీగా క్యూకట్టారు. క్యూలైన్లు ముందుకు కదలక సామాన్య భక్తులు నానా అవస్థలు పడుతున్నారు.500 రూపాయలు టిక్కెట్లు తీసుకున్న భక్తులు నాలుగు గంటలుగా క్యూలైన్లలోనే పడిగాపులు పడుతున్నారు. ప్రోటోకాల్ దర్శనాలపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, అధికారులతో 500 రూపాయల క్యూలైన్లలోని భక్తులు వాగ్వాదానికి దిగారు. ఐదు రూపాయల ఎందుకు పెట్టారంటూ మండిపడ్డారు.మరోవైపు ఇంద్రకీలాద్రిపై లడ్డూలు అందక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు లేదు ఇవ్వటం కుదరదంటూ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఘాట్ రోడ్డులో ఒకే ఒక్క లడ్డూ సేల్ పాయింట్ను అధికారులు ఏర్పాటు చేయడంతో దుర్గమ్మ దర్శనానంతరం ప్రసాదం అందకపోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: గోల్మాల్ సర్కార్.. వరద లెక్కలో ‘బాబు’ లీలలే వేరయా! -
ఘనంగా రేణుకామాత నవరాత్రి వేడుకలు
బుర్హాన్పూర్: మధ్యప్రదేశ్లోని చారిత్రక నగరం బుర్హాన్పూర్. ఇక్కడ వెయ్యేళ్ల పురాతన రేణుకామాత ఆలయం ఉంది. శరదానవరాత్రులు, చైత్ర నవరాత్రులలో ఇక్కడ ఘనంగా వేడుకలు నిర్వహిస్తుంటారు.శరన్నవరాత్రులలో రేణుకా మాత ఆలయ సమీపంలో ప్రతీయేటా జాతర నిర్వహిస్తారు. ఈ జాతర 9 రోజుల పాటు ప్రతీరోజూ ఉదయం 5:00 గంటల నుంచే ప్రారంభమవుతుంది. ఆలయంలో అమ్మవారికి మూడుసార్లు హారతి నిర్వహిస్తారు. నవరాత్రులలో తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలువుతుంది. రేణుకా మాత ఆలయ పూజారి జై శుక్లా మాట్లాడుతూ తమ కుటుంబం ఏడు తరాలుగా ఇక్కడ సేవలు అందిస్తున్నదన్నారు. ఈ ఆలయం సుమారు వెయ్యేళ్లనాటిదని, పెళ్లికానివారు రేణుకామాతను దర్శించుకుంటే వారికి త్వరగా వివాహమవుతుందనే నమ్మకం స్థానికుల్లో ఉన్నదన్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలోని పలు జిల్లాల నుంచి ఇక్కడికి భక్తులు తరలివస్తారు. ఉదయం 5:00 గంటల నుండి రాత్రి 11:00 గంటల వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకోవచ్చు. నవరాత్రుల సందర్భంగా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.ఇది కూడా చదవండి: అగ్ని స్నానమాచరించే అమ్మవారు..! సైన్సుకే అంతు చిక్కని మిస్టరీ! -
అయోధ్యకు పోటెత్తిన భక్తజనం
అయోధ్య: దేశవ్యాప్తంగా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో అమ్మవారి ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. పలు దేవాలయాలకు నిలయమైన అయోధ్యకు చేరుకున్న వేలాది మంది భక్తులు ఉదయం నుండి అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే బాలరాముణ్ణి దర్శించుకుంటున్నారు.నవరాత్రులలో మొదటి రోజున నవదుర్గలలో ఒకరైన శైలపుత్రిని పూజిస్తారు. అయోధ్యలో అన్ని దేవాలయాలు అమ్మవారి పూజలతో కళకళలాడుతున్నాయి. ఇక్కడి ఛోటీ దేవ్కాళి ఆలయంలో భక్తులు క్యూ కట్టి, అక్కడ కొలువైన సీతామాతను ఆరాధిస్తున్నారు. ఈ ఆలయంలో పూజలు చేయడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని పలువురు నమ్ముతుంటారు.అయోధ్యకు చెందిన పండితులు సత్యేంద్ర దాస్ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు నవరాత్రులలో మొదటి రోజు. ఈ రోజున చాలామంది తమ ఇళ్లలో కలశాన్ని ప్రతిష్టించి, తొమ్మిది రోజుల పాటు అమ్మవారి పూజలు నిర్వహిస్తారని తెలిపారు. అయోధ్యకు వచ్చిన భక్తురాలు మీరా మాట్లాడుతూ, ఆలయంలో అమ్మవారి దర్శనం చక్కగా అయ్యిందని, అధికారులు భక్తుల కోసం సకల ఏర్పాట్లు చేశారని అన్నారు. మరో భక్తుడు శైలేంద్ర మాట్లాడుతూ ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని అన్నారు. ఇది కూడా చదవండి: 4న సీఎం నివాసాన్ని ఖాళీ చేయనున్న కేజ్రీవాల్ -
తిరుమల లడ్డూ ప్రసాదంపై బాబు అసత్య ఆరోపణలు
-
ఖైరతాబాద్ గణేశుడి నవరాత్రి ఉత్సవాలు.. వెయ్యిమంది కీచకుల అరెస్ట్
సాక్షి,హైదరాబాద్ : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో కీచకులు రెచ్చిపోయారు. గణేష్ నవరాత్రల్లో మహిళలను తాకుతూ కీచకులు వేధించారు. ఖైరతాబాద్ గణేష్ వద్ద 11 రోజుల్లో సుమారు వెయ్యిమందిని కీచకుల్ని షీటీమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కీచకులను పట్టుకునేందుకు పోలీసులు స్పై ఆపరేషన్ చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకునేందుకు వచ్చిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ పట్టుబడ్డారని, తదుపరి చట్టపరమైన చర్యల కోసం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, తగిన శిక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. -
దయచేసి శ్రీవారిపై రాజకియాలు చెయ్యొద్దు..
-
నిమజ్జనం.. గంటల కొద్దీ ట్రాఫిక్ ఇబ్బందుల్లో జనం
దాదర్: నిమజ్జనోత్సవాలు ముగియడంతో స్వగ్రామాలకు తరలిపోయిన వేలాది మంది భక్తులు ముంబై దిశగా తిరగు పయన మయ్యారు. ఒక్కసారిగా వేలాది వాహనాలు బయటపడటంతో ముంబై–గోవా జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ సమస్య మరింత తీవ్రమైంది. ఇప్పటికే అనేక మంది గౌరీ గణపతులను గురువారం నిమజ్జనం చేసి శుక్రవారం నుంచి తిరుగు పయనమయ్యారు. దీంతో ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడింది. ఇదిలా ఉండగా బుధవారం మళ్లీ ముంబై–గోవా జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. పెద్ద సంఖ్యలో వాహనాలు బయటపడటం ఒక కారణమైతే, రోడ్లపై ఏర్పడిన గుంతలు మరో కారణమని తెలుస్తోంది. సాధారణంగా ముంబై–గోవా జాతీయ రహదారి నిత్యం తేలికపాటి, ట్రక్కులు, ట్యాంకర్లు, కంటైనర్లు, ట్రాలీలు తదితర సరుకులు చేరేవేసే భారీ వాహనాల రాకపోకలతో బిజీగా ఉంటుంది. గణేశోత్సవాల సమయంలో ముంబై నుంచి కొంకణ్ దిశగా వెళ్లే భక్తుల వాహనాల సంఖ్య లక్షల్లో ఉంటుంది. వీరంతా ముంబై–గోవా జాతీయ రహదారినే ఆశ్రయిస్తారు. దీంతో గణేశోత్సవాలు ప్రారంభానికి మూడు రోజుల ముందు నుంచి ఈ రహదారిపై (నిత్యావసర సరుకులు చేరేవేసే వాహనాలు మినహా) భారీ వాహనాలకు నిషేధం ఉండింది. ఉత్సవాలు ముగిసిన రెండు రోజుల వరకు ఈ నియమాలు అమలులో ఉంటాయి. దీన్ని బట్టి ముంబై–గోవా జాతీయ రహ దారి ఏ స్థాయిలో బిజీగా ఉంటుందో ఇట్టే అర్థమైపోతుంది. సాధారణంగా నిమజ్జనోత్సవాలు సాయంత్రం ముగియగానే అదే రోజు అర్ధరాత్రి దాటగానే అనేక మంది తిరుగుపయనమవుతా రు. కానీ ఈ సారి మంగళవారం సాయంత్రం ని మజ్జనోత్సవాలు ముగిసినప్పటికీ అనేక మంది బుధవారం మధ్యాహ్నం తరువాత బయలుదేరారు. బుధవారం మిలాద్ ఉన్ నబీ పండుగ కావడంతో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో గురువారం ఉదయమే విధుల్లో చేరే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఇతర రంగాల్లో పనిచేస్తున్న కారి్మకులు, కూలీలు, వ్యాపారులు బుధవారం మధ్యాహ్నం తరువాత కుటుంబ సభ్యులతో ముంబై దిశగా తిరుగు పయనమయ్యారు. ఇటీవల కరిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ పాడైపోయా యి. ఎక్కడ చూసిన గుంతలు దర్శనమిచ్చాయి. దీనికి తోడు రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు అనేక చోట్ల స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. దీంతో వాహనాల వేగానికి బ్రేక్ పడింది. (వెళ్లి రావయ్యా.. బొజ్జ గణపయ్య! 19 గంటల పాటు సాగిన శోభాయాత్ర )15–17 గంటల ప్రయాణం భక్తుల వాహనాలకు (అప్, డౌన్లో) ప్రభుత్వం టోల్ నుంచి మినహాయింపు నిచ్చినప్పటికీ గుంతల కారణంగా వేగానికి కళ్లెం పడింది. దీంతో పది గంటల్లో పూర్తికావల్సిన ప్రయాణం 15–17 గంటలు పడుతుంది. ముంబై–గోవా జాతీయ రహదారిపై ఎక్కడ చూసినా పికప్ వాహనాలు, టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, సొంత వాహనాలే దర్శనమిచ్చాయి. విపరీతమైన ట్రాఫిక్ జామ్ కారణంగా గంటల తరబడి సీట్లో కూర్చుండలేక అనేక మంది కొద్ది సేపు విశ్రాంతి తీసుకునేందుకు రోడ్డుపక్కనున్న డాబాలను ఆశ్రయించారు. దీంతో డాబా వాలాల బేరాలు జోరందుకున్నాయి. శీతలపానీయాలు, వాటర్ బాటిళ్లు, చీప్స్, తదితర చిరుతిళ్ల ప్యాకెట్లు దొరక్కుండా పోయాయి. కొన్ని చోట్ల మందకొడిగా, మరికొన్ని చోట్ల నిలిచిపోయిన వాహనాలను ట్రాఫిక్ పోలీసులు క్రమబదీ్ధకరించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఒకపక్క గుంతలు, పాడైపోయిన రోడ్లతో వాహనాలు ఎటూ కదలలేని పరిస్థితి. దీంతో వాహనాలు ఇటు ముందుకు వెళ్లలేక అటు తిరిగి వెనక్కి వెళ్లి మరో మార్గం మీదుగా వెళ్లలేక నరకయాతన అనభవించారు. -
సామాన్య భక్తులను పట్టించుకోరా?
తిరుమల: తిరుమలలో ఏర్పాట్లు అస్సలు బాగోలేదని.. ఆదివారం నుంచి క్యూలైన్లో వేచి ఉన్నా శ్రీవారి దర్శన భాగ్యం కలగలేదంటూ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిపై తమిళనాడుకు చెందిన బుల్లితెర నటుడు మహేశ్తో పాటు పలువురు భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆనం మీడియాతో మాట్లాడుతుండగా.. ఆయన్ని ఆలయ అధికారి అని భావించిన తమిళనాడు భక్తులు చుట్టుముట్టేశారు. వీరిలో తమిళ నటుడు మహేశ్బాబు కూడా ఉన్నారు.ఆయన మాట్లాడుతూ.. 10 మంది కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం తిరుమలకు చేరుకున్నట్లు చెప్పారు. ఆదివారం క్యూ లైన్లోకి వెళ్లినా స్వామివారి దర్శన భాగ్యం మాత్రం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్యూ లైన్లలో అన్నప్రసాదాలు కూడా పంపిణీ చేయట్లేదని మరికొందరు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నప్రసాదం, పాలు, మజ్జిగ ఇవ్వకపోవడంతో.. చిన్న పిల్లలతో క్యూ లైన్లలో ఉండలేక బయటకు వచ్చేశామంటూ వాపోయారు. తిరుమలలో ఏర్పాట్లు అస్సలు బాగోలేదంటూ మరో భక్తుడు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆనం స్పందిస్తూ.. అధికారుల ద్వారా శ్రీవారి దర్శనం కల్పిస్తానంటూ సర్దిచెప్పి.. అక్కడి నుంచి జారుకున్నారు. -
వీఐపీ ఏంటి..? జనరల్ ఏంటి..?
-
తిరుమలలో మంత్రి ఆనంను నిలదీసిన భక్తులు
తిరుమల, సాక్షి: తిరుమలలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఓ భక్తుడు మూడు రోజులుగా శ్రీవారి దర్శనం కాలేదని, వీఐపీలు మాత్రమే భక్తులా అంటూ శ్రీవారి దర్శనానికి వచ్చిన మంత్రిని నిలదీశాడు. తిరుమలలో సామాన్య భక్తులకు నరకం చూపిస్తున్నారని అన్నారు.గంటల తరబడి క్యూలైన్లో ఉన్నా ఆహారం అందలేదని, శ్రీవారి దర్శనం చేసుకోలేక పోతున్నామని భక్తులు ప్రశ్నించారు. ఆలయం ముందు భక్తులు ప్రశ్నించడంతో మళ్లీ మాట్లాడుతానంటూ మంత్రి రామనారాయణరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
ప్రపంచ వచనాలు
‘పాప పుణ్యాలనేటటువంటివి/ మీ చేతుల్లో ఉన్నవి/ అయ్యా అంటే స్వర్గం/ ఒరే అంటే నరకం/ కూడల సంగమదేవా!’ ఇది బసవన్న చెప్పిన ఎన్నో వచనాల్లో ఒకటి. కన్నడిగుల విశిష్ట సారస్వతం వారి ‘వచనాలు’. కన్నడ ఉపనిషత్తులుగా ఇవి కీర్తినొందాయి. వీరశైవ భావధార ఉద్ధృతంగా ప్రవ హించిన పన్నెండో శతాబ్దంలో ఇవి వెలువడ్డాయి. ఈ వచనకారులు ఒక్కరు కాదు, లెక్కకు మిక్కిలి. ‘పారేనదికి/ ఒళ్లంతా కాళ్లు/ మండే నిప్పుకి/ ఒళ్లంతా నోళ్లు/ వీచే గాలికి/ ఒళ్లంతా చేతులు/ గుహేశ్వరా/ నీ వాళ్లకి/ ప్రతి అంగం లింగమే’ అన్నాడు అల్లమ ప్రభు. ఛందస్సును అనుసరించకుండా, పాండిత్య ప్రకర్ష లేకుండా, సరళంగా, భావ ప్రధానంగా రాసిన ఈ వచనాలు అందులోని పదాల తూగు వల్ల ఒక లయను కలిగివుంటాయి. కొంతమంది శాస్త్రీయ సంగీత గాయకులు వీటిని ఆలపించడం కద్దు. మానవత్వాన్నీ, కాయక ధర్మాన్నీ ఈ వచనాలు చాటిచెప్పాయి. కులాల మధ్య, స్త్రీ పురుషుల మధ్య తేడాలను నిరసించాయి. జంగముడు ఏ కులానికి, ఏ వృత్తికి చెందినవాడైనప్పటికీ శివునిలా పూజనీయుడే; సహపంక్తి భోజనాదులకు అర్హుడే. ఈ విశాల దృక్పథంతో చెప్పి నందువల్లే వచనాలు భక్తేతరుల ఆదరణనూ చూరగొన్నాయి. వీరశైవ భక్తులను ‘శరణులు’ అన్నారు కాబట్టి, వాళ్లు రాసింది ‘శరణ సాహిత్యం’ అయ్యింది. ఈ సాహిత్యాన్ని మరింతగా ప్రపంచానికి చేరువ చేసే ప్రయత్నాలను బెంగళూరులోని ‘బసవ సమితి’ చేస్తోంది. 173 మంది వచనకారుల ఎంపిక చేసిన 2,500 వచనాలను వివిధ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో భిన్న భాషల్లోకి అనువదింప జేస్తోంది. ఇప్పటికే అరబ్బీ, పర్షియన్ లాంటి సుమారు 30 జాతీయ, అంతర్జాతీయ భాషల్లోకి అనువాదమైన వీటిని 2025 జనవరి కల్లా స్పానిష్, జర్మన్, జపనీస్, చైనీస్, ఫ్రెంచ్, నేపాలీల్లోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. పన్నెండో శతాబ్దంలో కళ్యాణకటకము నేలిన బిజ్జలుని కొలువులో బసవేశ్వరుడు మంత్రిగా పనిచేశాడు. వీరశైవ మతానికి ఎనలేని ప్రాబల్యాన్ని కల్పించాడు. బసవడు ఎంతటి కవియో అంతటి తాత్వికుడు. ‘ఉన్నవాళ్లు/ గుళ్లు గోపురాలు కట్టిస్తారు/ లేనివాణ్ణి/ నేనేమి చెయ్యాలి?/ నా కాళ్ళే స్తంభాలు/ కాయమే కోవెల/ శిరసే బంగారు శిఖరం/ కూడల సంగమదేవా! విను/ చెడితే స్థావరం చెడుతుంది గాని/ జంగమం చెక్కుచెదరదు’ అన్నాడు. బసవన్న స్థాపించిన ఆధ్యాత్మిక సంఘం ‘అనుభవ మంటపం’. దానికి వేదిక ఆయన ఇల్లే. దీనికి అధ్యక్షుడు అల్లమ ప్రభు. అధ్యక్ష సింహాసనం పేరు శూన్య సింహాసనం. అనుభవ మంటపం అనే ఆలోచనే మేధా మథనానికీ, ప్రజాస్వామిక భావమార్పిడికీ ఉత్తేజాన్ని ఇచ్చేది. ఇందులో సుమారు 300 మంది శరణులు పాల్గొనేవారు. వాళ్లలో ‘వీరరాగిణి’ అక్క మహాదేవి సహా 36 మంది స్త్రీలు ఉండటం విశేషం. వీరిలో రకరకాల వృత్తులవాళ్లు ఉన్నారు. ‘కట్టెలమ్ముకొనే మోళిగెయ మారయ్య, చెప్పులు కుట్టే మాదార చెన్నయ్య, తోళ్లు పదునుపెట్టే దోహర కక్కయ్య, బట్టలుతికే మడివాల మాచయ్య, వెదురు బుట్టలల్లే మేదర కేతయ్య, పడవ నడిపే అంబిగర చౌడయ్య...’ వీళ్లు ‘రామనాథా’, ‘సకలేశ్వరదేవా’, ‘అమరగుండ మల్లికార్జునా’, ‘సిద్ధ మల్లికార్జునా’ అంటూ తమ ఇష్టదైవాలను మకుటంగా చేర్చుకొని తమ వచనాలను చెప్పారు. ‘పిడకలు ఏరటంలోనే/ అయిపోతోంది బ్రతుకంతా/ ఇక నేను/ అన్నం వండేదెప్పుడు,/ తినేదెప్పుడు? కూడల సంగమదేవా’ అన్నాడు బసవన్న. ‘సువిశాలమైన కన్నడ సాహిత్య క్షేత్రంలో విహరిస్తుంటే వచనాల దగ్గరకు వచ్చేసరికి మనం ఒక తపోవనంలో అడుగు పెట్టినట్లుగా అనిపిస్తుంది. అక్కడ మనకు తారసపడేవారందరూ రుషులూ, సాధువులే! కల్మషంతో నిండిన మనుషుల అంతరంగాలు శుభ్రపడటానికి వారి బోధలు చాలు అనిపిస్తుంది’ అంటారు ఈ వచనాల్లో కొన్నింటిని ‘మాటన్నది జ్యోతిర్లింగం’గా పాతికేళ్ల క్రితమే తెలుగులోకి అనువదించిన దీవి సుబ్బారావు.తెలుగులో మొట్టమొదట మల్లికార్జున పండితుడు ‘శివతత్వ సారం’లో బసవన్నను స్తుతించాడు. పాల్కురికి సోమనాథుడు ద్విపదల్లో బసవ పురాణము రచించి వీరశైవాన్ని ప్రచారం చేశాడు. ఒక తెలుగు కవి తొలిసారిగా రాసిన స్వతంత్ర పురాణం ఇది. శివభక్తులకు శ్రీశైలం మహోజ్జ్జ్వల సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లింది. బసవన్నకు ముందువాడని చెప్పే దేవర దాసిమయ్య శ్రీశైలం వచ్చి ఆగమాలు, పురాణాలు చదువుకొన్నాడు. అల్లమ ప్రభు శ్రీశైలంలో సమాధి నొందాడు. అక్క మహాదేవి శ్రీశైల కదళీవనంలో కాలం గడిపింది. ‘కొండల్లో కాక కంచెల్లో ఆడుతుందా నెమలి? /కొలనుల్లో కాక కాలువల్లో ఈదుతుందా హంస/ ...చెన్నమల్లికార్జునుడు కాక అన్యుల్ని తలుస్తుందా నా మనస్సు?’ అంటూ తన జీవితాన్ని ఆ చెన్నమల్లికార్జునుడికే అర్పించుకుంది. ‘మిణుగురులు ఎగిరితే/ నా ఆకలిదప్పులు అణగారినాయనుకొంటా/ మబ్బులు కరిగితే/ నా స్నానం కొరకు పంపిన జలమనుకొంటా/ కొండరాయి జారిపడితే/ నా తల్లో తురిమిన పూవనుకొంటా/ నా కంఠం తెగితే/ చెన్నమల్లికార్జునా!/ అది నీకర్పితమనుకొంటా’ అని పాడుకుంది. ఆమె తపస్సు చేసిందని చెప్పే ‘అక్క మహాదేవి గుహలు’ ఏ శ్రీశైల యాత్రికుడికైనా దర్శనీయ స్థలం.‘ఆవగింజంత సుఖానికి/ సాగరమంత సంకటం/ తన్నే కోల్పోయి/ నిధిని సాధించానంటే/ అందమేముంది?/ గుహేశ్వరా’ అన్నాడు అల్లమ ప్రభు. భక్తి పరవశంలో రాసినవైనప్పటికీ, అంతకుమించిన తాత్విక చింతననూ, మానవ స్వభావాన్నీ ఈ వచనాలు ఆవిష్కరించాయి. అంతేనా? ప్రతి భాషా మేలిమి సాహిత్యాన్నీ అలా పూనిక వహించి ఎల్లలు దాటించాలన్న ప్రేరణను కూడా ఇస్తున్నాయి. -
ఖైరతాబాద్ గణనాథుడి చివరి పూజలు
-
ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
ముంబై లాల్బాగ్చా రాజా గణపతి ఐకానిక్ ఫస్ట్ లుక్ (ఫోటోలు)
-
Mumbai: తప్పక చూడాల్సిన ఐదు అద్భుత గణపతులు
ముంబై: సెప్టెంబర్ 7 నుంచి దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. వినాయకుని జన్మదినోత్సవం సందర్భంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. మహారాష్ట్రలో 10 రోజుల పాటు గణేష్ ఉత్సవాలను భారీ స్థాయిలో నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో గణపతి భారీ విగ్రహాలను వీధుల్లోని అద్భుత వేదికలలో ప్రతిష్టిస్తారు. ముంబైలో ఏర్పాటు చేసే ఐదు గణపతి విగ్రహాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. వాటిని చూసేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు.లాల్బాగ్చా రాజాసెంట్రల్ ముంబైలోని లాల్బాగ్ మార్కెట్లోని లాల్బాగ్ పోలీస్ స్టేషన్ సమీపంలోని 'లాల్బాగ్చా రాజా' అత్యంత ప్రసిద్ది చెందిన వినాయక మండపంగా పేరొందింది. లాల్బాగ్లో ప్రతిష్టించిన గణపతి విగ్రహాన్ని నవసాచ గణపతి అంటారు. ఈ రూపంలోని గణేశుడు అన్ని కోరికలను తీరుస్తుంటాడని చెబుతారు. 10 రోజుల పాటు ఇక్కడ జరిగే గణేష్ ఉత్సవాల్లో ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దర్శనం కోసం క్యూ కడతారు.అంధేరీచా రాజాముంబయిలో గణేశోత్సవాలను చూసేందుకు వచ్చే భక్తులు తప్పనిసరిగా అంధేరీచా రాజాను సందర్శిస్తుంటారు. అంధేరీచా రాజాను 'నవసాల పవనార గణపతి' లేదా 'కోరికలను నెరవేర్చే గణేశుడు' అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం అంధేరీచా మండపం థీమ్ విభిన్నంగా ఉంటుంది. ఇది భక్తులను అమితంగా ఆకట్టుకుంటుంది.ముంబైచా రాజాముంబైలోని అత్యంత ప్రసిద్ధి చెందిన లాల్బాగ్చా రాజా గణేష్ మండపానికి కొద్ది దూరంలో మరొక ప్రసిద్ధ గణపతి మండపం ఉంది. గణేష్ గల్లీలో ఉన్న ఈ మండపంలో కొలువైన గణపతిని ముంబైచా రాజా అని పిలుస్తారు. ముంబైలోని పురాతన గణేష్ మండపాలలో ఒకటైన ముంబైచా రాజా 1928 నుండి పూజలందుకుంటున్నాడు. ఈ గణేష్ మండపం థీమ్ ప్రతి సంవత్సరం ఎంతో భిన్నంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ముంబై చా రాజాను సందర్శించి, ఆశీస్సులు పొందుతారు.జీఎస్బీ సేవా మండల్ముంబైలోని కింగ్స్ సర్కిల్లో ఉన్న జీఎస్బీ సేవా మండల్లోని గణపతి విగ్రహం దేశంలోనే అత్యంత సంపన్నమైనదిగా చెబుతారు. ఈ ఆకర్షణీయమైన విగ్రహాన్ని బంగారు, వెండి ఆభరణాలతో అలంకరిస్తారు. పంచధాతు (బంగారం, వెండి, రాగి, జింక్,తగరం) మిశ్రమంతో ఈ విగ్రహాన్ని రూపొందిస్తారు.ఖేత్వాడిచా గణరాజ్ప్రకాశవంతమైన లైట్లు, పూలతో అలంకరించిన ఖేత్వాడిచా గణరాజ్ మండపం దక్షిణ ముంబైలోని ఖేత్వాడి ప్రాంతంలో ఉంది. ఇది 40 అడుగులకుపైగా ఎత్తు కలిగివుంటుంది. 1959లో తొలిసారి ఇక్కడ గణపతిని నెలకొల్పారు. ఈ పూజా వేదిక ముంబైలోని ప్రముఖ గణపతి మండపాలలో ఒకటి. -
Haryana: రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి
హర్యానాలోని జింద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 8 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం నర్వానాలోని బిధరానా గ్రామ సమీపంలో హిసార్-చండీగఢ్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.కురుక్షేత్రలోని మార్చేడి గ్రామం నుంచి రాజస్థాన్లోని గోగమేడికి వెళ్తున్న టాటా ఏస్ను వెనుక నుంచి వచ్చిన ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మార్చేడి గ్రామానికి చెందిన 15 మంది రాజస్థాన్లోని గోగమేడికి టాటా కారులో వెళుతున్నారు.వీరి వాహనం నర్వానాలోని బిధరానా గ్రామం సమీపంలోకి చేరుకున్న సమయంలో హిసార్-చండీగఢ్ జాతీయ రహదారిపై బిధరానా- సిమ్లా మధ్య కలపతో కూడిన ట్రక్కు.. టాటా కారును వెనుక నుండి ఢీకొంది. దీంతో టాటా కారు ఒక గుంతలో బోల్తా పడింది. ఆ సమయంలో హైవే మీదుగా వెళుతున్న కొందరు డ్రైవర్లు బాధితులకు సహాయం అందించారు. అనంతరం నర్వాణ పోలీసులు ఏడు అంబులెన్సులను సంఘటనా స్థలానికి పంపారు. బాధితులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాధితులలో ఏడుగురు మరణించినట్లు ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆగ్రోహ ఆస్పత్రికి తరలించారు. -
శ్రీశైలం వెళ్తున్నారా.. ఎస్పీ విజ్ఞప్తి ఇదే
నాగర్ కర్నూలు, సాక్షి: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారి నల్లమల అటవీ ప్రాంతంలో అక్కడక్కడ డ్యామేజ్ అయింది. దీంతో వాహనాలు వెళ్ళడానికి అవకాశం లేకుండా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, వివిధ జిల్లాల నుంచి వయా కల్వకుర్తి, అచ్చంపేట మీదుగా శ్రీశైలం వెళ్లే భక్తులు కొన్ని రోజులపాటు తాత్కాలికంగా తమ దర్శన కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సూచించారు. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను వెళ్దండ మండలం కోట్రా జంక్షన్ వద్ద, వంగూరు మండలం కొనేటిపురం టోల్ ప్లాజా దగ్గర ఆపివేయడం జగురుతుందని తెలిపారు. కాబట్టి శ్రీశైలం వెళ్లే భక్తులు, వాహనదారులు ఈ విషయంలో పోలీసువారికి సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.మరోవైపు.. భారీ వర్షాలతో నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నాగనులు కల్వర్ట్ దగ్గర వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. నీళ్లలో కొట్టుకుపోతున్న వ్యక్తిని పోలీస్ కానిస్టేబుల్స్ తకిఖాన్, రాము కాపాడారు. జిల్లాలోని కోడెర్లో భారీ వర్షానికి ఇంటి మిద్దె కూలిపోయింది. ఇంటిలో ఎవ్వరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బిజినపల్లి మండలం లట్టుపల్లి సమీపంలో కేఎల్ఐ కాలువ తెగటంతో వందలాది ఎకరాల పంటలు నీట మునిగింది. -
లడ్డూ ప్రసాదం.. భక్తులకు టీటీడీ షాక్
-
TTD: లడ్డూలు ఇక రెండే
తిరుమల/తిరుపతి కల్చరల్: తిరుమల శ్రీవారి లడ్డూ అంటే భక్తులకు ఎంతో సెంటిమెంట్. స్వామివారి దర్శనం జన్మజన్మల పుణ్యఫలంగా భావించే వీరికి ఈ లడ్డూ ప్రసాదం స్వీకరించడం ద్వారా స్వామి అనుగ్రహం లభిస్తుందని వారి ప్రగాఢ విశ్వాసం. అందుకే తిరుమలకు వచ్చేవారు సరాసరి 10–20 లడ్డూలను తీసుకెళ్తారు. ఇలా తీసుకెళ్లిన వీటిని ఆఫీసుల్లో.. ఇంటి చుట్టుపక్కల వారికి భక్తిప్రపత్తులతో పంచిపెట్టడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఇంత విశిష్టత కలిగిన శ్రీవారి లడ్డూపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తాజాగా ఆంక్షలు విధిస్తూ కోతలు పెట్టింది. ఉచితంగా ఇచ్చే లడ్డూకు అదనంగా కేవలం రెండు మాత్రమే విక్రయించాలని నిర్ణయించింది. పైగా.. ఆధార్ కార్డు ఉంటేనే అంటూ మెలిక పెట్టింది. దీనిని గురువారం నుంచే అమలు చేస్తోంది. గతంలో కోరినన్ని లడ్డూలు ఇచ్చేవారని, ఇప్పుడు కొత్తగా ఉచిత లడ్డుతో పాటు కేవలం రెండు అదనపు లడ్డూలకే పరిమితం చేయడం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం దళారీ వ్యవస్థను అరికట్టేందుకు భక్తులు కోరినన్ని లడ్డూలు ఇస్తే కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వ నిర్ణయం దళారీ వ్యవస్థను పెంచిపోషించేలా ఉందని వారు విమర్శిస్తున్నారు. కాగా, ఈ విషయంపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ దళారులను అరికట్టేందుకే ఆధార్తో లడ్డూ ప్రసాదాలు విక్రయించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. -
తిరుమల భక్తులకు టీటీడీ షాక్ ఆధార్ ఉంటేనే లడ్డూలు..
-
ఉడుపిలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
నేడు(సోమవారం) దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుతున్నాయి. దక్షిణాది మధురగా పేరొందిన కర్నాటకలోని ఉడుపిలో జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. దేశం నలుమూలల నుంచి భక్తులు శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి చూసేందుకు ఉడుపికి తరలివస్తున్నారు.ఆలయంలో ఈ రోజున తెల్లవారుజాము నుంచే స్వామివారికి పూజలు ప్రారంభమయ్యాయి. ఇవి రోజంతా కొనసాగనున్నాయి. కర్నాటకలోని అత్యంత పురాతన దేవాలయాలతో ఉడుపి ఒకటి. ఈ ఆలయంలోని శ్రీకృష్ణుని విగ్రహం ఎంతో విశిష్టమైనదని చెబుతారు. జన్మాష్టమి సందర్భంగా ఆలయాన్ని సాంప్రదాయక కళారీతిలో అలంకరించారు. ఉడిపిలోని వీధులు, వివిధ దేవాలయాలను ప్రత్యేకంగా అలంకరించారు.ఆలయం చుట్టూ ఉన్న వీధుల్లో అందమైన ముగ్గులు వేసి, వాటిని పూలతో అందంగా తీర్చిదిద్దారు. ఈరోజు ఉడుపిలో జరుగుతున్న శ్రీకృష్ణాష్టమి వేడుకలకు సంబంధించిన వీడియోను ట్విట్టర్(ఎక్స్)యూజర్ అను సతీష్ తన అకౌంట్ నుంచి షేర్ చేశారు. ఈ వీడియోలో శ్రీకృష్ణునికి పూలతో చేసిన అందమైన అలంకరణను, ఆలయశోభను చూడవచ్చు. Krishna Janmashtami TodayDivine Darshan of Udupi Shri Krishna to bless our day.. Janmashtami wishesShri Krishna's blessings to all 🙏✨️ pic.twitter.com/k43CJIQMFe— Anu Satheesh 🇮🇳🚩 (@AnuSatheesh5) August 26, 2024 -
మధురలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ప్రారంభం
సోమవారం (ఆగస్టు 26) శ్రీ కృష్ణ జన్మాష్టమి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఘనంగా వేడుకలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో యూపీలోని మధురలో గల శ్రీకృష్ణుని ఆలయం సోమవారం తెల్లవారుజాము నుంచి భక్తుల కోసం 20 గంటల పాటు తెరిచివుంటుందని శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్ తెలిపింది.మధుర శ్రీకృష్ణుని ఆలయంలో నేటి (శనివారం) నుంచి ఉత్సవాలు ప్రారంభమై గురువారం వరకు కొనసాగుతాయని శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవాసమితి కార్యదర్శి కపిల్ శర్మ, సభ్యులు గోపేశ్వర్ చతుర్వేది తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆలయాన్ని 20 గంటల పాటు తెరిచి ఉంచుతామన్నారు. సోమవారం స్వామివారి మంగళ హారతి కార్యక్రమంలో షెహనాయ్ వాదన ఉంటుందన్నారు. ఉదయం 5.30 నుండి దర్శనాలు మొదలువుతాయన్నారు. ఉదయం 11.00 గంటలకు స్వామివారికి పంచామృతాభిషేకం జరుగుతుందన్నారు.జన్మాష్టమి నాడు సాయంత్రం వేళ శ్రీకృష్ణ లీలా మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో భరత్పూర్ గేట్ నుంచి ఊరేగింపు ప్రారంభమై హోలీగేట్, ఛట్టా బజార్, స్వామి ఘాట్, చౌక్ బజార్, మండి రాందాస్, డీగ్ గేట్ మీదుగా శ్రీకృష్ణ జన్మస్థలానికి చేరుకుంటుందన్నారు. ఆలయంలో స్వామివారి అలంకరణ అద్భుతంగా ఉండబోతుందని అన్నారు. ఆలయానికి వెళ్లే అన్ని మార్గాల్లో జిల్లా యంత్రాంగం షూ షెడ్లు, లగేజీ షెడ్లు ఏర్పాటు చేసిందన్నారు. అలాగే వైద్య శిబిరాలు, విచారణ కేంద్రాలు కూడా ఏర్పాటవుతున్నాయని తెలిపారు. -
శ్రావణ శుక్రవారం కావడంతో ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
-
అమర్నాథ్ యాత్ర రికార్డులు బద్దలు!
అమర్నాథ్ యాత్రికులు గత రికార్డులను బద్దలుకొట్టారు. యాత్ర ప్రారంభమైన తొలిరోజు నుంచే అమర్నాథ్ దర్శనానికి భక్తులు బారులు తీరారు. యాత్ర ముగియడానికి ఇంకా ఎనిమిది రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే ఇప్పటికే అమర్నాథ్ సందర్శకుల సంఖ్య గత 12 సంవత్సరాల రికార్డును అధిగమించింది.జూన్ 29 నుండి ప్రారంభమైన ఈ యాత్రలో ఇప్పటివరకు 5.10 లక్షల మందికి పైగా భక్తులు పవిత్ర గుహను సందర్శించారు. 2011లో యాత్రా సమయంలో మొత్తం 6.34 లక్షల మంది భక్తులు, 2012లో 6.22 లక్షల మంది భక్తులు మంచు శివలింగాన్ని సందర్శించుకున్నారు. ఈసారి యాత్ర ఆగస్ట్ 19న రక్షాబంధన్ రోజున ముగియనుంది.అమర్నాథ్ను ఇప్పటి వరకు సందర్శించిన భక్తుల సంఖ్య 5,11,813 దాటింది. వర్షం కారణంగా పహల్గామ్, బాల్తాల్ మార్గంలో యాత్ర ఒక్కసారి మాత్రమే వాయిదా పడింది. గత ఏడాది జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో యాత్ర నాలుగుసార్లు వాయిదా పడింది. యాత్ర సాగే రెండు మార్గాల్లో 125 లంగర్లు ఏర్పాటు చేయడంతో భక్తులకు ఆహారానికి ఎటువంటి ఇబ్బంది కలుగలేదు. జమ్మూలోని యాత్రి నివాస్, చంద్రకోట్ యాత్రి నివాస్, శ్రీనగర్లోని పాంథా చౌక్లలో తాత్కాలిక శిబిరంలో యాత్రికులకు వసతి, వైద్య సదుపాయాలు కల్పించారు. గత 12 ఏళ్లలో అమర్నాథ్ను సందర్శించుకున్న భక్తుల సంఖ్య ఇలా ఉంది.సంవత్సరం యాత్రికుల సంఖ్య2011 6.34 లక్షలు2012 6.22 లక్షలు2013 3.53 లక్షలు2014 3.73 లక్షలు2015 3.52 లక్షలు2016 2.20 లక్షలు2017 2.60 లక్షలు2018 2.85 లక్షలు2019 3.42 లక్షలు2020, 2021లలో కరోనా కారణంగా యాత్ర జరగలేదు.2022 3.04 లక్షలు2023 4.50 లక్షలు2024 ఇప్పటివరకు 5.10 లక్షలు -
శివనామస్మరణతో మారుమోగిన ఆలయాలు
ఉత్తరాదిన ఈరోజు శ్రావణమాసంలోని నాల్గవ సోమవారం. ఈ సందర్భంగా భక్తులు శివాలయాలకు చేరుకుని పూజలు చేస్తున్నారు. దీంతో ఆలయాలలో భక్తుల రద్దీ కనిపిస్తోంది. ఈ నేపధ్యంలోనే ఉజ్జయిని మహాకాళీశ్వరునికి ఘనంగా భస్మహారతి నిర్వహించారు. దీనిని తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. #WATCH | Ujjain, Madhya Pradesh: Bhasma Aarti performed at Mahakaleshwar Temple on the fourth Monday of the holy month of 'Sawan'. pic.twitter.com/8da9zfvocK— ANI (@ANI) August 11, 2024ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో భక్తులు గంగా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించారు.#WATCH | Deoghar, Jharkhand: Devotees gather in huge numbers to offer prayers, on the fourth Monday of 'Sawan' month. pic.twitter.com/4zGvX14YB5— ANI (@ANI) August 11, 2024జార్ఖండ్లోని డియోఘర్లో శివాలయాయాలలో పూజలు నిర్వహించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.#WATCH | Uttar Pradesh: Devotees gather in huge numbers to offer prayers, on the fourth Monday of 'Sawan' month, at Shri Mankameshwar Mahadev Mandir in Prayagraj pic.twitter.com/qd3iu6iBPL— ANI (@ANI) August 12, 2024ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని మంకమేశ్వర్ మహాదేవ్ ఆలయానికి భక్తులు పోటెత్తారు.ఢిల్లీలోని గౌరీ శంకర్ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. #WATCH | Devotees gather in huge numbers to offer prayers, on the fourth Monday of 'Sawan' month, at Shri Gauri Shankar Mandir in Delhi pic.twitter.com/JXKpEOSO8t— ANI (@ANI) August 12, 2024 -
శ్రీశైలంలో తెలంగాణ భక్తులపై పచ్చ సైకోల దాడి
-
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 65,535 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న హుండీ ఆదాయం రూ.3.81 కోట్లు.నేడు అంగప్రదక్షిణ టోకెన్ల ఆన్లైన్ కోటా విడుదలఆగస్టు 10వ తేదీ శనివారం రోజున తిరుమల ఆలయంలో అంగప్రదక్షిణ చేసుకునే భక్తులకు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు 250 టోకెన్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్లైన్లో అంగప్రదక్షిణ టోకెన్లను బుక్ చేసుకోవాలని కోరుతోంది. -
కేదార్నాథ్లో చిక్కుకున్న భక్తులు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ఉత్తరాఖండ్లో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. బాధితులను రక్షించేందుకు వైమానిక దళానికి చెందిన చినూక్, ఎంఐ 17 హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. కేదార్నాథ్ మార్గంలో చిక్కుకుపోయిన 6,980 మందికి పైగా యాత్రికులకు రక్షించారు. ఇంకా 1,500 మందికి పైగా భక్తులు, స్థానికులు ఇప్పటికీ పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. వీరిలో 150 మంది తమ కుటుంబాలను సంప్రదించలేని స్థితిలో ఉన్నారు.సోన్ప్రయాగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ విశాఖ అశోక్ భదానే మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు ఒక యాత్రికుడు మృతిచెందారు. కేదార్నాథ్ మార్గంలో చిక్కుకున్న 150 మందికి పైగా కుటుంబ సభ్యులు ఈ ప్రాంతంలో మొబైల్ కనెక్టివిటీ లేకపోవడంతో తమ కుటుంబసభ్యులను సంప్రదించలేకపోతున్నారని ఆయన తెలిపారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ధామితో టెలిఫోన్లో మాట్లాడారు. విపత్తు అనంతరం జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలకు అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ల సాయంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం 599 మందిని విమానంలో, 2,380 మందిని కాలినడకన సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. -
హైదరాబాద్ : అమ్మవారి రంగం ఊరేగింపుల్లో హోరెత్తిన భక్తులు (ఫొటోలు)
-
బాలరామునికి బంగారు, వెండి కానుకల వెల్లువ
అయోధ్యలో కొలువైన బాలరాముని దర్శనానికి వచ్చిన భక్తులు స్వామివారికి అత్యంత విలువైన కానుకలు సమర్పిస్తున్నారు. బాలరాముడు ప్రతిరోజూ భక్తుల నుంచి కానుకలతోపాటు భారీ మొత్తంలో విరాళాలను కూడా అందుకుంటున్నాడు.బాలరామునికి భక్తుల నుంచి పెద్ద ఎత్తున బంగారు, వెండి ఆభరణాలు కానుకలుగా అందుతున్నాయి. వీటిని పర్యవేక్షించేందుకు ట్రస్ట్ ద్వారా ఇద్దరు సంఘ్ కార్యకర్తలు నియమితులయ్యారు. వీరు ఆభరణాలను విరాళంగా ఇచ్చే భక్తుల పేర్లు, చిరునామా, మొబైల్ నంబర్ను నమోదు చేస్తుంటారు. వీరు షిఫ్టుల వారీగా పనిచేస్తుంటారు. భక్తుల నుంచి అందిన ఆభరణాలను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాకర్లో జమచేస్తారు.భక్తులు విరాళాల కౌంటర్ వద్ద సమర్పించే నగదును కూడా ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తారు. రామ్ లల్లా ఆభరణాలకు రక్షణ అందించేందుకు రిటైర్డ్ ఆర్మీ జవానును నియమించారు. ఆయన ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో రామ్ లల్లాను అలంకరించినప్పుడు లాకర్ నుండి నగలను తీసి, సంబంధిత పూజారులకు అందిస్తారు. తిరిగి రాత్రిపూట వాటిని భద్రపరుస్తారు. ఆభరణాలకు రక్షణగా ఇద్దరు గన్నర్లు రోజుకు మూడు షిఫ్టుల్లో కాపలాగా ఉంటారు. ఆలయంలో భద్రత కల్పించేందుకు 20 మంది రిటైర్డ్ ఆర్మీ సిబ్బందిని నియమించారు. -
కేదార్నాథ్కు పోటెత్తిన భక్తజనం
ఈ రోజు శ్రావణమాసం(ఉత్తరాదివారికి)లోని తొలి సోమవారం. నేడు మహాశివునికి ప్రీతిపాత్రమైన రోజుగా భావిస్తారు. అందుకే కేదార్నాథ్కు భక్తులు పోటెత్తుతున్నారు. ఈరోజు మహేశ్వరుణ్ణి దర్శించుకుని పూజలు చేయాలని భక్తులు అభిలషిస్తున్నారు.ఈరోజు ఉత్తరాఖండ్లోని కేదారేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు నిన్నరాత్రి నుంచే భక్తులు బారులు తీరారు. ధామ్ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ, భక్తులు మహాశివుని దర్శనం కోసం క్యూలో వేచివుంటున్నారు. ఉత్తరాదిన శ్రావణమాసం జూలై 22 నుండి ప్రారంభమై, ఆగస్టు 19 వరకూ ఉంటుంది. ఈసారి శ్రావణ మాసంలో ఐదు సోమవారాలు ఉన్నాయి. ఈ రోజుల్లో భక్తులు మహాశివుణ్ణి పూజిస్తుంటారు. -
విశాఖ సింహాచల గిరి ప్రదక్షిణకు తరలి వచ్చిన భక్తజనం (ఫొటోలు)
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 20 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటలు సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 67,223 కాగా, నిన్న తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 24,549. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.66 కోట్లు.శ్రీగోవిందరాజ స్వామివారి ఆలయంలో గత మూడు రోజులుగా చేపట్టిన జ్యేష్టాభిషేక మహోత్సవం గురువారంతో ఘనంగా ముగిసింది. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం కవచాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. తర్వాత అర్చకులు శతకలశ స్నపనం, మహాశాంతి హోమం చేపట్టారు.శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామి ఉత్సవమూర్తులను ఆలయంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేసి అక్కడ వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. కవచ ప్రతిష్ట, అక్షతారోహణం నిర్వహించి బ్రహ్మఘోష వినిపించారు. ఆస్థానం చేపట్టారు.తర్వాత కవచాలకు పూజలు, హారతి సమరి్పంచి స్వామి, అమ్మవార్లకు కవచ సమర్పణ చేశారు. సాయంత్రం ఉభయ నాంచారులతో కలిసి స్వామివారు తిరుచ్చిపై అధిరోహించి ఆలయ ప్రధాన వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈఓ శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్లు నారాయణ, మోహన్రావు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు ధనుంజయులు, రాధాకృష్ణ పాల్గొన్నారు. -
ఆషాఢంలో దుర్గ గుడికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 31 కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 18 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(సోమవారం) 75,054 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 26,239 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 4.72 కోట్లుగా లెక్క తేలింది. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్లో భక్తులు వేచిఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటలు.. ప్రత్యేక దర్శనానికి 6 గంటలు సమయం పడుతోంది.నిన్న శ్రీవారిని 65,392 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 29,015 కాగా, నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.23 కోట్లు. -
శ్రీవారి భక్తులపై ప్రాంక్ వీడియో..
-
తిరుమల క్యూలో ప్రాంక్ వీడియో
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భద్రతలోని డొల్లతనం, సిబ్బంది నిర్లక్ష్యం బట్టబయలైంది. శ్రీవారి దర్శనానికి వెళ్లే క్యూలైన్లలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకుకెళ్లేందుకు అనుమతి లేనప్పటికీ తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి అక్కడి సిబ్బంది కళ్లుగప్పి ఏకంగా మొబైల్ఫోన్ తీసుకెళ్లాడు. అంతటితో ఆగకుండా ఏకంగా ఓ ప్రాంక్ వీడియోని చిత్రీకరించడం.. ఆ తర్వాత దానిని తన ఇన్స్ట్రాగాం పేజీలో పోస్టు చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. వివరాలివీ.. తమిళనాడుకు చెందిన ఓ వివాదాస్పద యూట్యూబర్ టీటీఎఫ్ వాసన్ ఇటీవల తన మిత్రులతో కలిసి మొబైల్ఫోన్తో దర్శన క్యూలోకి ప్రవేశించాడు. నారాయణగిరి షెడ్లలో వేచి ఉన్న భక్తులతో తాళాలు తీస్తున్నట్లు నటించాడు. వాసన్ను చూసిన కంపార్టుమెంటులోని భక్తులు టీటీడీ ఉద్యోగిగా భావించి గేట్లు తీస్తారేమోనన్న భావనతో ఒక్కసారిగా పైకిలేవడంతో టీటీఎఫ్ వాసన్ వెకిలి నవ్వులు నవ్వుతూ పరిగెడుతూ రావడాన్ని తన మిత్రులు ఫోన్లో చిత్రీకరించారు. ఈ వీడియోలను టీటీఎఫ్ ఫ్యామిలీ అనే తన ఇన్స్ట్రాగాం పేజీలో వాసన్ పోస్ట్చేయడంతో తమిళనాడులో ఇది వైరల్ అయింది. దర్శన క్యూల్లో భక్తులపై ప్రాంక్ వీడియోల చిత్రీకరణపై తమిళనాడులో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆకతాయి చేష్టలు చేసిన వాసన్ను అరెస్టుచేయాలని సామాజిక మాధ్యమాల్లో భక్తులు డిమాండ్ చేస్తున్నారు.విచారణకు టీటీడీ విజిలెన్స్ ఆదేశాలు..ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రాంక్ వీడియోలు తీయడం హేయమైన చర్య అని ఒక ప్రకటనలో ఖండించింది. ప్రాంక్ వీడియోలు చిత్రికరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. సాధారణంగా నారాయణగిరి షెడ్స్ దాటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి ప్రవేశించక ముందే భక్తుల నుండి మొబైల్ ఫోన్లు డిపాజిట్ చేసుకుంటారని టీటీడీ తెలిపింది. కానీ, ఒకరిద్దరు ఆకతాయిల చేష్టలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని టీటీడీ ఆ ప్రకటనలో పేర్కొంది. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. -
సాకార్ హరి ఆశ్రమంపై నిరంతర నిఘా
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఇటీవల జరిగిన తొక్కిసలాట పెనువిషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 121 మంది మృతి చెందారు. ఈ ఉదంతంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో మెయిన్పురిలోని బిచ్వాన్ పట్టణంలో ఉన్న సాకర్ హరి ఆశ్రమంపై నిరంతర పోలీసు నిఘా కొనసాగుతోంది. హత్రాస్ ఘటన అనంతరం సకార్ హరి ఆశ్రమానికి వచ్చే బాబా అనుచరుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. హత్రాస్ ఘటన జరిగి ఏడు రోజులు గడిచాయి. కేసు దర్యాప్తునకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు, నిందితులను హత్రాస్ పోలీసులు జైలుకు తరలిస్తున్నారు. అదేవిధంగా పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు ఆశ్రమంపై కన్నేసి ఉంచాయి. ఇంటెలిజెన్స్ శాఖ సిబ్బంది స్థానికుల కదలికలపై నిఘా పెట్టింది. -
ఇవేం కష్టాలు తిరుమలేశా!
సాక్షి, టాస్క్ఫోర్స్: శ్రీవారి భక్తులకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. క్యూలైన్లలో అష్టకష్టాలు పడుతున్నారు. కనీసం కూర్చునేందుకు అవకాశం లేక.. ఆహారం మాట దేవుడెరుగు మంచినీళ్లు అందించే దిక్కులేక అలమటిస్తున్నారు. ఆదివారం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రూ.300 టికెట్ తీసుకున్న భక్తులు సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటలు దాటినా క్యూలైన్లోనే నిలబడాల్సి వచ్చింది. అంత సమయం వేచిఉన్నా మంచినీరు, అన్న ప్రసాదం, చిన్న పిల్లలకు పాలు కూడా సరఫరా చేయలేదు. తమకు ఎదురైన ఇబ్బందులతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూర్చునేందుకూ గతి లేదు ప్రత్యేక దర్శనాలకు వచ్చిన భక్తులను కంపార్ట్మెంట్లో ఉంచాల్సింది పోయి గంటల తరబడి క్యూలైన్లో నిలబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము నిలబడిన ప్రాంతంలో బాత్రూమ్ నీళ్లు విడిచిపెట్టడంతో కూర్చోవటానికి వీలులేకుండా పోయిందని మండిపడ్డారు. తిరుమలలో పరిస్థితిపై ఓ భక్తుడు టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేశారు. ‘రూ.300 తీసుకుని గంటలు గంటలు లైన్లో నిలబెట్టడం ఏమిటి. కూర్చుందామనుకుంటే బాత్ రూమ్ నీరు విడిచిపెట్టారు. తాగటానికి మంచినీరు లేదు. అన్న ప్రసాదం లేదు. చిన్న పిల్లలకు పాలు లేక ఏడుస్తున్నారు. వినిపిస్తోందా’ అని ప్రశ్నించారు. ‘తిరుమల ప్రక్షాళన అంటే ఇదేనా. ఇప్పటికంటే గత ప్రభుత్వ పాలనలోనే పరిస్థితి బాగుంది’ అని పలువురు భక్తులు వాపోయారు. టీటీడీ పరిపాలన భవనంలో సోదాలు తిరుపతి (అలిపిరి): గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఆదివారం విజిలెన్స్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం స్థానిక టీటీడీ భవనంలో సోదాలు చేపట్టింది. పరిపాలన భవనంలోని పలు విభాగాల్లో ముఖ్యమైన ఫైళ్లను అధికారులు స్వా«దీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. -
ఘోరం... నేరం...
మానవ బలహీనతను సొమ్ము చేసుకోవడానికి నమ్మకాన్ని వాటంగా మార్చుకోవడం చరిత్రలో తరచూ కనిపించేదే. ఎవరికీ ఏ ఇబ్బందీ కలగనంత వరకేమో కానీ... ప్రజల అమాయకత్వాన్ని స్వార్థానికి వాడుకుంటున్నప్పుడు, ఆ ప్రక్రియ ఆఖరికి ప్రాణాంతకంగానూ మారినప్పుడు చూస్తూ సహించలేం. సమకాలీన సమాజంలో అలాంటి అనుభవాల్ని భరించలేం. ఉత్తరప్రదేశ్లోని హాథ్రస్ జిల్లా ఫూల్రాయ్ వద్ద మంగళవారం జరిగిన ధార్మిక సభ, అక్కడ తొక్కిసలాటను చూసినప్పుడు అదే అనిపిస్తుంది. 121 మంది అమాయక భక్తులు మరణించిన హాథ్రస్ ఘటన ఘోర విషాదం. పాదధూళితో, పంపులో నీళ్ళతో సమస్త సమస్యలూ పరిష్కారమవుతాయని అమాయక ప్రజల్ని నమ్మిస్తున్న ఓ పెద్ద మనిషి తప్పిదానికి అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలిశాయి. పాలకులు ఎప్పటి లానే సంతాపాలు తెలిపారు. నష్టపరిహారాలు ప్రకటించారు. సిట్ దర్యాప్తుకూ ఆదేశించారు. కానీ, తరచూ జరుగుతున్న ఇలాంటి దుర్ఘటనల్ని నివారించాల్సిన బాధ్యత లేదా? ప్రమాదవేళ తూతూ మంత్రంగా స్పందించి, ఆనక నివారణ చర్యలపై నిమ్మకు నీరెత్తినట్టుంటే సరిపోతుందా? తాజా హాథ్రస్ ఘటనకు కేంద్రబిందువైన స్వయం ప్రకటిత దైవదూత నారాయణ్ సాకార్ హరి అలియాస్ భోలే బాబా కథ సుదీర్ఘమైనదే. ఆయన అసలు పేరు సూరజ్ పాల్. ఆధ్యాత్మిక గురువుగా మారక ముందు యూపీ పోలీసుల స్థానిక ఇంటెలిజెన్స్ విభాగంలో సాధారణ హెడ్ కానిస్టేబుల్. ఉద్యోగంలో ఉండగానే తాను ఆధ్యాత్మికత వైపు మొగ్గాననీ, అందుకే 1990లలో చేస్తున్న ఉద్యోగం మానేసి దైవమార్గం పట్టాననీ ఆయన కథనం. ఉత్తరప్రదేశ్లో ఓ చిన్న గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన ఆయన చలువ కళ్ళద్దాలు, శ్వేత వస్త్రధారణతో పేరు, పలుకుబడి గల బాబాగా అవతరించడం ఆశ్చర్యమే. ఇవాళ యూపీ, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా తదితర ప్రధాన హిందీ రాష్ట్రాల్లో ఆయనకు లక్షలాది భక్తులు పోగుబడడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. చనిపోయిన బిడ్డను బ్రతికిస్తానంటూ 23 ఏళ్ళ క్రితం శ్మశానంలో గందరగోళం చేయడం మొదలు లైంగిక అత్యాచార ఆరోపణల దాకా ఈ బాబాపై అనేక కేసులున్నాయి. నాలుగేళ్ళ క్రితం 2020 జనవరిలో షాజహాన్పుర్లో ఈయన సత్సంగంలోనే ప్రసాద వితరణ వేళ మంటలు చెలరేగి, తొక్కిసలాట జరిగింది. సమయానికి అగ్నిమాపక దళం రావడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ, దోవ కూడా సరిగ్గా లేని తాజా హాథ్రస్ ఘటనాస్థలిలో కనీసం అంబులెన్స్ లాంటివైనా లేకపోవడం ఘోరం, నేరం.హాథ్రస్ ఘటనపై కఠిన చర్యలు చేపడతామని యూపీ సీఎం గర్జించారు కానీ, ఈ దుర్ఘటనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో అసలు భోలే బాబా పేరే పెట్టలేదు. ఇక, ఇంత భారీ దుర్ఘటన జరిగాక సదరు బాబా ఎవరికీ కనిపించకుండా పరారీలో ఉన్నారు. హాథ్రస్ ఘటన అత్యాశకూ, అపరిమిత నిర్లక్ష్యానికీ ప్రతీక. ఈ ఘటనలో తిలా పాపం తలా పిడికెడు. సత్సంగమంటూ 80 వేల మందికే అనుమతి తీసుకొన్నా, రెండున్నర లక్షల మందికి పైగా జనాన్ని అనుమతించడం ఎవరి తప్పు? తగినన్ని ప్రవేశ, నిష్క్రమణ మార్గాలైనా లేకుండా అంత భారీ ఆధ్యాత్మిక సభ జరిపిన నిర్వాహకులను ఏమనాలి? ‘నా పాదధూళి ఇంటికి తీసుకెళ్ళి సమస్యల్లో ఉన్నవారికి రాస్తే అన్నీ చక్కబడతాయి’ అని అమాయకుల బలహీనతతో ఆడుకొని, ఇంత ఘోరానికి కారకుడైన మహానుభావుణ్ణి ఏం చేయాలి? ఇంత జరిగాక కూడా ఆయన తన వకీలు ద్వారా ఈ దుర్ఘటన వెనుక అసాంఘిక శక్తుల కుట్ర ఉందంటూ నెపం నెట్టేసే పని చేస్తుంటే పాలకులు ఏం చేస్తున్నట్టు? హాథ్రస్ ఘటన లాంటివి మనకు కొత్త కాదు. గతంలోనూ ఇలాంటివి అనేకం జరిగాయి. 2005లో మహారాష్ట్రలోని వాయిలో మంధరాదేవి గుడి వద్ద తొక్కిసలాటలో 340 మందికి పైగా చనిపోయారు. 2008లో రాజస్థాన్లో చాముండా దేవి ఆలయం వద్ద కనీసం 250 మంది, హిమాచల్ ప్రదేశ్లోని నైనాదేవి గుడి వద్ద 162 మంది తొక్కిసలాటల్లోనే దుర్మణం పాలయ్యారు. చరిత్ర పుటల్లో వెనక్కి వెళితే, 70 ఏళ్ళ క్రితం 1954లో స్వాతంత్య్రానంతరం జరిగిన తొలి కుంభమేళాలో అలహా బాద్లో జరిగిన తొక్కిసలాటలో 800 మంది ప్రాణాలు కోల్పోవడం గుండెల్ని మెలిపెట్టే విషాదం. రద్దీని నియంత్రించే వ్యవస్థలు లేకపోవడం, భారీగా జనం తరలివచ్చే సందర్భాలకు తగ్గట్టు ముందస్తు ప్రణాళికా రచన చేయకపోవడం, సామాన్యుల నియంత్రణే కష్టంగా ఉండే సమయంలో వీఐపీల తాకిడి ఎక్కువై యంత్రాంగమంతా వారి సేవల్లో తరించడం లాంటి లోపాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. అది మరింత విషాదం. భారతదేశంలో నూటికి 79 తొక్కిసలాటలు ధార్మిక సమ్మేళనాలు, తీర్థయాత్రల్లో జరుగుతున్నవేనని 2013లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్లో ప్రచురితమైన ఓ అధ్యయనం తేల్చింది. పైపెచ్చు, మన దేశంలో అనేక ఆలయాలు కొండల పైన, నదీ తీరాల్లో, ప్రయాణానికి సంక్లిష్టమైన ఇతర ప్రాంతాల్లో నెలకొన్నందున తొక్కిసలాటల ముప్పు ఎక్కువ. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ధార్మిక సమ్మేళనాలు నిర్వహిస్తుంటే వేలు, లక్షల్లో జనం రాకతో ఆ ప్రాంతాలు క్రిక్కిరిసి పోతున్నాయి. అలాంటి చోట్ల ప్రాథమిక వసతులే కాదు... కనీసం సరైన ప్రవేశ మార్గాలు, అత్యవసర పరిస్థితుల్లో నిష్క్రమణ మార్గాలు సైతం ఉండట్లేదు. ఇవన్నీ ప్రమాదాలకు కారణాలే. వీటిని నివారించాలంటే జనసమ్మర్దాన్ని నియంత్రించే యంత్రాంగం కీలక పాత్ర పోషించాలి. 2014లోనే జాతీయ విపత్తుల ప్రాధికార సంస్థ జనసమ్మర్ద నియంత్రణపై మార్గదర్శకాలు ఇచ్చింది. కానీ, అవి ఎక్కడా అమలైనట్టు లేవు. తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజా ఘటనతోనైనా పాలకులు నిద్ర లేస్తారా? ఓట్ల రాజకీయాల్ని వదిలేసి, మూఢనమ్మకాలు ప్రోత్సహించేవారికి ముకుతాడు వేస్తారా? -
సత్సంగ్లో మృత్యుకేళి.. 116 మంది భక్తుల దుర్మరణం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ జిల్లా ఫూల్రాయ్ గ్రామంలో మాటలకు అందని తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 116 మంది భక్తులు మృత్యువాత పడ్డారు. వీరిలో 108 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. సత్సంగ్ ముగిశాక బయటకు వచ్చే క్రమంలో ఒకరిపై ఒకరు పడిపోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇటీవలి కాలంలో జరిగిన ఘోరమైన సంఘటన ఇదే కావడం గమనార్హం.మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొక్కిసలాటలో ఏకంగా 116 మంది మరణించడం పట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రధానమంత్రి కార్యాలయం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించాయి.హత్రాస్: అప్పటిదాకా భోలే బాబా ప్రవచనాలు, భక్తుల కీర్తనలు, ఆధ్యాత్మిక శోభతో కళకళలాడిన సత్సంగ్ నిమిషాల వ్యవధిలోనే శోక సముద్రంగా మారిపోయింది. ప్రవచనాలు వినేందుకు వచి్చన బాబా భక్తులు విగతజీవులయ్యారు. సత్సంగ్ ముగిసిన తర్వాత ఇళ్లకు వెళ్లే తొందరలో జనమంతా టెంట్ నుంచి ఒక్కసారిగా బయటకు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఒకరిపై ఒకరు పడిపోయారు. ఊపిరాడక 116 మంది కన్నుమూశారు. మృతుల్లో 108 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ జిల్లా ఫూల్రాయ్ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దేశంలో ఇటీవలి కాలంలో జరిగిన ఘోరమైన సంఘటన ఇదే కావడం గమనార్హం. పలువురు క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 89 మంది ఘటనా స్థలంలోనే కన్నుమూశారు. మరికొందరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసలేం జరిగింది? ఉత్తరప్రదేశ్తోపాటు వివిధ రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో భక్తులున్న సాకార్ విశ్వ హరి భోలే బాబా ఫూల్రాయ్ గ్రామంలో సత్సంగ్ నిర్వహించేందుకు స్థానిక సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ నుంచి అనుమతి తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం భక్తులకు గంటన్నరకు పైగా ఆధ్యాత్మిక బోధ చేశారు. టెంట్ లోపల నిర్వాహకులే ఏర్పాట్లు చేసుకున్నారు. టెంట్ బయట స్థానిక పోలీసులు భద్రత కలి్పంచారు. సత్సంగ్ పూర్తయిన తర్వాత వీరంతా ఒకేసారి బయటకు వచ్చేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. అయితే కార్యక్రమం పూర్తయ్యాక తన వాహనం వద్దకు తిరిగి వెళ్తున్న బాబా ఆశీస్సులు తీసుకొనేందుకు, ఆయన అడుగులు వేసిన చోట పవిత్రమైన మట్టిని సేకరించేందుకు భక్తులు ఎగబడడంతో తొక్కిసలాట జరిగిందని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ వెల్లడించారు. సత్సంగ్ జరిగిన ప్రాంతం బురదమయంగా ఉండడంతో భక్తులు జారిపడ్డారని, దాంతో తొక్కిసలాట జరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. సరైన ఏర్పాట్లు చేయలేదని, అందుకే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని భక్తులు ఆరోపించారు. దర్యాప్తు బృందం ఏర్పాటు తొక్కిసలాట సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. క్షతగాత్రులను, మృతదేహాలను వాహనాల్లో హత్రాస్ మెడికల్ సెంటర్తోపాటు సమీపంలోని ఎటాహ్ జల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో విసిరేసినట్లుగా పడి ఉన్న శవాలు, వాటి చుట్టూ కూర్చొని రోదిస్తున్న కుటుంబ సభ్యుల హృదయ విదారక దృశ్యాలు కలచివేశాయి. పెద్ద సంఖ్యలో క్షతగాత్రులు ఉన్నారని, వారికి చికిత్స అందించడం లేదని స్థానికులు మండిపడ్డారు. ఆసుపత్రిలో ఒకే ఒక్క డాక్టర్ ఉన్నారని, ఆక్సిజన్ సదుపాయం లేదని ఆరోపించారు.ఫూల్రాయ్ తొక్కిసలాటపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని పేర్కొంది. సత్సంగ్ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సత్సంగ్కు 80 వేల మంది హాజరవుతారన్న అంచనాతో నిర్వాహకులు అనుమతి తీసుకున్నారని యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పారు. కానీ, అంతకంటే ఎక్కువ మంది హాజరయ్యారని తెలిపారు. భోలే బాబా పరారీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సంతాపం తెలిపిన ప్రధాని మోదీ హత్రాస్ తొక్కిసలాటపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంగళవారం లోక్సభలో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ప్రధానమంత్రి కార్యాలయం పరిహారం ప్రకటించింది. యూపీ సర్కారు కూడా అంతే మొత్తం పరిహారం ఇస్తుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.కాల్వలో ఒకరిపై ఒకరు పడిపోయారుప్రత్యక్ష సాక్షుల కథనం హాత్రాస్: తొక్కిసలాట ఘటన వివరాలను కొందరు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ‘‘ సత్సంగ్ అయిపోగానే అందరూ ఒక్కసారిగా ప్రాంగణం నుంచి బయటికి బయల్దేరారు. ప్రాంగణం బయట రోడ్డు ఎత్తులో నిర్మించారు. దాని కింద మురికి కాల్వ ఉంది. దూసుకొచి్చన జనం అందులో పడ్డారు. ఒకరిపై మరొకరు పడుతూనే ఉన్నారు. కింద ఉన్న వాళ్లు కూరుకుపోయి కన్నుమూశారు’’ అని శకుంతల అనే ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ‘‘ సత్సంగ్ను రోడ్డు చివర నిలబడి ఉన్న వాళ్లను ప్రాంగణంలో కిక్కిరిసిన జనం తోసేశారు. దీంతో కొనకు ఉన్న వాళ్లు కాల్వలో పడిపోయారు.అలా అప్పటికప్పుడు ఒక పాతిక మంది ప్రాణాలుకోల్పోయారు’ అని మరో ప్రత్యక్ష సాక్షి ఆ భయానక ఘటనను గుర్తుచేసుకున్నారు. సత్సంగ్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు మహేశ్ చంద్ర సైతం కార్యక్రమం నిర్వహణ విధానాన్ని తప్పుబట్టారు. ‘‘ సరైన నిర్వహణ లేకే ఈ దారుణం జరిగింది. బురదలో పడ్డ వాళ్లను జనం పరుగెడుతూ తొక్కుకుంటూ వెళ్లారు. వాళ్లను ఎవరూ అదుపుచేయలేకపోయారు. దీంతో పడిపోయిన వాళ్లు ప్రాణాలు కోల్పోయారు’’ అని ఆయన అన్నారు. గతంలోనూ...⇒ 2005 జనవరి 25న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మంధరాదేవి ఆలయ వేడుకల్లో తొక్కిసలాట జరిగింది. 340 మందికిపైగా భక్తులు విగత జీవులయ్యారు. ⇒ 2008 సెపె్టంబర్ 30న రాజస్తాన్లోని జోద్పూర్ సిటీలో చాముండాదేవి ఆలయ ఉత్సవాలకు జనం భారీగా తరలివచ్చారు. తొక్కిసలాట జరగడంతో 250 మంది వఅగీురణించారు. 60 మందికిపైగా గాయపడ్డారు.⇒ 2008 ఆగస్టు 3న హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలో నైనాదేవి ఆలయంలో మత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. 162 మంది భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ⇒ 2013 అక్టోబర్ 13న మధ్యప్రదేశ్లోని రతన్గఢ్ ఆలయంలో నవరాత్రి వేడుకల సందర్భంగా తొక్కిసలాట జరిగింది. 115 మంది మృతిచెందారు. ⇒ 2011 జనవరి 14న కేరళలోని ఇడుక్కి జిల్లాలో శబరిమల ఆలయం సమీపంలో తొక్కిసలాటలో 104 మంది అయ్యప్ప భక్తులు కన్నుమూశారు. ⇒ 2010 మార్చి 4న ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో రామ్జానకి ఆలయంలో తొక్కిసలాటలో 63 మంది మృతిచెందారు. ⇒ 2003 అగస్టు 27న మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో కుంభమేళాలో తొక్కిసలాటలో 39 మంది మరణించారు. 140 మంది గాయపడ్డారు. -
అమర్నాథ్కు పోటెత్తుతున్న భక్తులు
జమ్ముకశ్మీర్లో ప్రతీయేటా జరిగే అమర్నాథ్యాత్రకు ఈసారి భక్తులు పోటెత్తారు. మహాశివుని నామస్మరణలతో జరుగుతున్న యాత్రలో రెండవ రోజున (ఆదివారం) సుమారు 14,717 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ రెండు రోజుల్లో మొత్తం 28 వేల మంది అమరనాథుని దర్శనం చేసుకున్నారు.అమర్నాథ్ యాత్ర చేసేందుకు తాజాగా పహల్గావ్, బాల్టల్ల నుంచి రెండవ బృందం బయలుదేరింది. మొత్తం 309 వాహనాలలో బాల్టన్ మార్గంలో 2,106 మంది పురుషులు, 11 మంది పిల్లలు, 115 మంది సాధువులు, 41 మంది సాధ్విలు యాత్రకు బయలుదేరారు. ఈ మార్గంలో స్థానికులు యాత్రికులకు స్వాగతం పలికారు. మరోవైపు జమ్ముకశ్మీర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో స్థానికులతో పాటు అమర్నాథ్ యాత్రకు వెళుతున్న భక్తులు పలు ఇబ్బందులు పడుతున్నారు.శ్రీనగర్లోని వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం జూలై మొదటివారం నుంచి వర్షాలు కురియనున్నాయి. 25వ సారి అమర్నాథ్ యాత్ర చేస్తున్న కృష్ణకుమార్ మీడియాతో మాట్లాడుతూ గతంలోకన్నా ప్రస్తుతం ఏర్భాట్లు బాగున్నాయని అన్నారు. తాను కోవిడ్ సమయంలోనూ హెలికాప్టర్లో అమర్నాథ్ యాత్ర చేసుకున్నానని తెలిపారు. -
Amarnath Yatra 2024: యాత్రా మార్గంలో చెత్తకు చెక్ పెట్టేలా ఏర్పాట్లు
అమర్నాథ్ ధామ్ యాత్ర అంత్యంత వైభవంగా జూన్ 29న ప్రారంభంకానుంది. ఈ నేపధ్యంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారయంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సాధారణంగా అమర్నాథ్ యాత్రా మార్గంలో ప్రతీయేటా మూడు నుంచి నాలుగు వందల టన్నుల చెత్త పేరుకుపోతుంటుంది. అయితే ఈసారి అందుకు భిన్నమైన వాతావరణం కనిపించనుంది.ఒకవైపు అమర్నాథ్ యాత్ర జరుగుతుండగానే మరోవైపు ఈ మార్గంలో చెత్తను పారవేసే ప్రక్రియ కొనసాగనుంది. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థలు, గ్రామీణాభివృద్ధి శాఖ సభ్యులు సేవలు అందించనున్నారు. యాత్రా మార్గంలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా భక్తులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే భక్తులకు చెత్తవేసుకునే కిట్ అందించనున్నారు.యాత్రా మార్గంలో వ్యర్థాలను తొలగించేందుకు యంత్రాలను ఏర్పాటు చేశారు. బేస్ క్యాంప్, లంగర్, గుహ వరకు వ్యర్థ పదార్థాలను ఎక్కడపడితే అక్కడ పడవేయకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యాటక శిబిరాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని కూడా నిలిపివేశారు.అమర్నాథ్ యాత్రా మార్గంలో 2850 మరుగుదొడ్లు, 516 స్నాన ఘాట్లు నిర్మించారు. పరిశుభ్రతను ప్రోత్సహించేందుకు బేస్ క్యాంప్లలోని వివిధ ప్రదేశాలలో పోర్టబుల్ బాత్రూమ్లను కూడా ఏర్పాటు చేశారు. కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) వికె బిర్డి తాజాగా అమర్నాథ్ యాత్ర ప్రారంభమయ్యే ప్రదేశమైన చందన్వాడిని సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసులు, సీఎపీఎఫ్ అధికారులతో భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించారు. -
అయోధ్యలో జ్యేష్ఠ పౌర్ణమి పుణ్య స్నానాలు
హిందూ క్యాలెండర్లో పౌర్ణమి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది ఏడాదికి 12 సార్లు వస్తుంది. ప్రతి పౌర్ణమికీ ఏదోఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు పవిత్ర నదులలో స్నానం చేస్తే ఎంతో మంచి జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు.ఈసారి జ్యేష్ఠ పౌర్ణమి తిథి జూన్ 21న ఉదయం 6:01కి మొదలై జూన్ 22 ఉదయం 5:07 వరకూ ఉంది. ఈ సందర్భంగా అయోధ్యకు చేరుకున్న లక్షలాదిమంది భక్తులు సరయూ నదిలో స్నానాలు చేస్తున్నారు. ఈరోజు సరయూ జయంతి నిర్వహిస్తున్నారు. సరయూ నది ఈ రోజునే భూమిపైకి వచ్చిందని చెబుతారు. భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు వీలుగా స్థానిక అధికారులు సరయూ ఘాట్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
కాశీ కారిడార్లో సరికొత్త రికార్డు.. 16 కోట్లు దాటిన భక్తులు
ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసి దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతోంది. గడచిన 30 నెలల్లో మహాశివుని భక్తులు కాశీ కారిడార్లో సరికొత్త రికార్డు సృష్టించారు. డిసెంబర్ 2021లో ఈ కారిడార్ ప్రారంభమైన తరువాత నాటి నుంచి ఇప్పటివరకు 16 కోట్ల 46 లక్షల మంది భక్తులు కాశీ విశ్వేశ్వరుణ్ణి సందర్శించుకున్నారు. ఇది మాత్రమే కాదు 2023తో పోలిస్తే 2024 ఆరు నెలల కాలంలో అధికంగా 48 శాతం మంది భక్తులు కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకున్నారు.రికార్డు స్థాయిలో శివభక్తులు కాశీకి తరలివస్తున్న కారణంగా ఇక్కడి పర్యాటక పరిశ్రమకు ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. ఇక్కడి హోటళ్లకు మంచి గిరాకీ వస్తుండగా, బనారసీ చీరలు, హస్తకళా వస్తువులు విరివిగా విక్రయమవుతున్నాయి. స్థానిక వ్యాపారులు కారిడార్ నిర్మాణం తరువాత మంచి లాభాలను అందుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిరకూ రెండు కోట్ల 86 లక్షల 57 వేల 473 మంది భక్తులు కాశీ విశ్వనాథ ధామానికి తరలివచ్చారు. రికార్డు స్థాయిలో భక్తుల రాకతో థామ్ ఆదాయం 33 శాతం మేరకు పెరిగింది. -
తిరుమలలో కొండంత రద్దీ
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
-
విజయవాడ : ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
పడవ బోల్తా.. ఆరుగురు గల్లంతు
బీహార్ రాజధాని పట్నాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గంగా నదిలో ప్రయాణీకులతో నిండిన పడవ బోల్తా పడింది. ఉమానాథ్ ఘాట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగినప్పుడు పడవలో 17 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.పడవ బోల్తా పడిన వెంటనే 11 మంది ఈదుకుంటూ బయటికి రాగా, ఆరుగురు గల్లంతయ్యారు. వీరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.గంగా దసరా సందర్భంగా ఒకే కుటుంబానికి చెందిన 17 మంది స్నానం చేయడానికి డయారా వైపు పడవలో వెళుతుండగా, గంగా నది మధ్యలో పడవ బోల్తా పడింది. సమాచారం అందుకున్న ఎస్డీఎం శుభం కుమార్ తన బృందంతో సహా సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. -
తిరుమలకు పోటెత్తిన భక్తులు
-
వైష్ణోదేవికి కట్టుదిట్టమైన భద్రత
జమ్మూ డివిజన్లో ఇటీవల నాలుగు ఉగ్రదాడులు జరిగినప్పటికీ వైష్ణో దేవిని సందర్శించే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. ఉగ్రదాడులను ఖండిస్తూ భక్తులు వైష్ణోదేవి యాత్రలో పాల్గొంటున్నారు. అమ్మవారి దర్శనం కోసం దేశవ్యాప్తంగా వేలాది మంది భక్తులు ప్రతిరోజూ బేస్ క్యాంప్ కాట్రాకు తరలివస్తున్నారు.మరోవైపు యాత్ర రిజిస్ట్రేషన్ కోసం భక్తులు కాట్రాలో చాలా సేపు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా వైష్ణో దేవి దర్శనం కోసం కిలోమీటరు పొడవున భక్తులు బారులు తీరుతున్నారు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయానికి 33,900 మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకుని వైష్ణో దేవి ఆలయం దిశగా ముందుకు కదిలారు.ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న ఉగ్రదాడుల నేపధ్యంలో వైష్ణో దేవి ఆలయంతో పాటు అక్కడికి సమీపంలో అన్నిప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. తాజాగా వైష్ణో దేవి ఆలయ భద్రతకు సంబంధించి పోలీసు డైరెక్టర్ జనరల్ ఆర్ఆర్ స్వైన్ పోలీసు, భద్రతా బలగాల అధికారులతో సమావేశం నిర్వహించారు.అనంతరం మాతా వైష్ణో దేవి భవన్ ప్రాంగణంలో అదనపు సంఖ్యలో పోలీసులు, భద్రతా దళాల సిబ్బందిని మోహరించారు. ప్రసుతం వైష్ణో దేవి పవిత్ర గుహల చుట్టూ భారీ సంఖ్యలో సీఆర్పీఎఫ్ సిబ్బందితో పాటు సాధారణ దుస్తులలో కమాండోలు పహారా కాస్తున్నారు. గురువారం 38 వేల మంది భక్తులు వైష్ణోదేవిని దర్శించుకున్నారు. -
కేదార్నాథ్కు పోటెత్తుతున్న భక్తులు
ఉత్తరాఖండ్లో కొలువైన కేదార్నాథ్ దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ తగిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. భక్తుల రద్దీని అనుసరించి గంటకు 1,800 మందికి పైగా భక్తులు కేదార్నాథ్ను దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే భక్తులు అర్ధరాత్రి 12 గంటల వరకు స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు.గత మే నెలలోని 31 రోజుల్లో 5,54,671 మంది భక్తులు కేదార్నాథ్ను దర్శించుకున్నారు. చార్ధామ్ యాత్రకు ప్రభుత్వం ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించిన నేపథ్యంలో జూన్ రెండవవారం నుంచి భక్తుల రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉంది. కేదార్నాథ్లో దర్శన వ్యవస్థను మరింత సులభతరం చేసేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. రోజుకు 36 వేల మంది భక్తులకు దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు.కేదారేశ్వరుని దర్శనం ఉదయం 4.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3.30 వరకు కొనసాగుతుంది. అనంతరం స్వామివారికి బాల భోగం సమర్పిస్తారు. దీని కారణంగా ఆలయాన్ని కొద్దిసేపు మూసివేస్తారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి మొదలై 7 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. -
భిన్న సంస్కృతుల ‘ప్రశాంతి’ నిలయం
సాక్షి, పుట్టపర్తి: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి భిన్న సంస్కృతులకు నిలయంగా మారింది. ఇతర రాష్ట్రాలు, పలు దేశాల నుంచి భగవాన్ శ్రీసత్యసాయి బాబా భక్తులు వస్తుండటంతో దశాబ్దాల కాలంగా ఇతర రాష్ట్రాల పండుగలు ప్రశాంతి నిలయంలో నిర్వహించడం ఆనవాయితీగా మారింది. కుల, మతాలకు అతీతంగా అన్ని పండుగలు చేస్తుంటారు. ఏటా గుజరాత్, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల అవతరణ దినోత్సవాలు, ఆయా రాష్ట్రాల ప్రధాన పండుగలు నిర్వహిస్తున్నారు. ప్రతి నెలా ఏదో ఒక రాష్ట్రం నుంచి భక్తులు పర్తియాత్రగా పుట్టపర్తి వస్తున్నారు.అక్కడి సంస్కృతీ సంప్రదాయాలను పుట్టపర్తిలో ప్రదర్శిస్తున్నారు. పుట్టపర్తి వంటకాలు, వస్త్రధారణకు విదేశీయులు సైతం ముగ్దులు కావడం విశేషం. ఇతర రాష్ట్రాల, దేశాల భక్తులు సైతం స్థానికులతో సులువుగా కలసిపోతున్నారు. ఫలితంగా దేశ, విదేశీ భాషలను స్థానికులు సులువుగా మాట్లాడగలుగుతున్నారు. చదువు రాని వారు సైతం ఆ భాషలను నేర్చుకుంటున్నారు.విదేశాల నుంచి వచ్చే భక్తులు అక్కడి సంప్రదాయం వదిలి.. తెలుగు డ్రెస్ కోడ్ను ఇష్టపడుతున్నారు. మహిళలు చీరకట్టులో, పురుషులు పంచెకట్టులో కనిపిస్తున్నారు. సుమారు 150 దేశాల నుంచి భక్తులు పుట్టపర్తికి వస్తుంటారు. వీరిలో చాలామంది భారతీయ జీవనశైలికి అలవాటు పడుతున్నారు. మన దేశ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.మనకు గర్వకారణంమేము తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాం. దశాబ్దాల కాలం నుంచి విదేశీయులను చూస్తున్నాం. మన సంప్రదాయాలను వారు ఆచరిస్తుండటం గర్వకారణంగా చెప్పుకోవచ్చు. పాశ్చాత్య దేశస్తులు మన దుస్తులను ఇష్టపడుతున్నారు. ఇక్కడి వంటకాలు అందరినీ ఆకర్షిస్తాయి. – బాల దండపాణి, పుట్టపర్తిసంప్రదాయాల కేంద్రం పలు దేశాల నుంచి భక్తి భావంతో పుట్టపర్తికి వస్తుంటారు. ఇక్కడి ప్రజల సహకారం బాగుంటుంది. మన సంస్కృతీ సంప్రదాయాలను విదేశీయులు పాటిస్తారు. దేశ, విదేశ భేదాలు లేకుండా పరస్పర సహకారంతో మెలుగుతుంటారు. ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన పుట్టపర్తి.. సంప్రదాయాలకూ కేంద్రంగా ఉందని చెప్పొచ్చు. – ఆర్జే రత్నాకర్రాజు, మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు -
యాదాద్రి ఆలయంలో భక్తులకు ఇబ్బందులు
-
బుద్ధ పూర్ణిమ వేళ.. భక్తుల గంగా స్నానాలు
ఈరోజు (గురువారం) బుద్ధ పూర్ణిమ. ఈ సందర్భంగా వారణాసి, ప్రయాగ్రాజ్, హరిద్వార్లలో భక్తులు గంగానదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. #WATCH | Uttarakhand: Devotees take holy dip in Haridwar on the occasion of Buddha Purnima. pic.twitter.com/iV42mC9UfV— ANI (@ANI) May 23, 2024భక్తులకు భద్రత కల్పించేందుకు వివిధ గంగా ఘాట్ల వద్ద పోలీసు బలగాలను మోహరించారు. యూపీలోని వారణాసిలోని అన్ని ఘాట్లు భక్తులతో నిండిపోయాయి.మనదేశంలో బుద్ధ పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున గంగా స్నానం చేస్తే మనిషికి మోక్షం లభిస్తుందని చెబుతారు.#WATCH | Prayagraj, UP: Devotees take holy dip and offer prayers at the confluence of River Ganga and River Yamuna on the occasion of Buddha Purnima. pic.twitter.com/pA7OGIg057— ANI (@ANI) May 23, 2024ఇంతేకాకుండా ఈ రోజున స్నానం చేయడం వల్ల మనిషి మనసు, శరీరం రెండూ పవిత్రంగా మారుతాయని నమ్ముతారు. ఈ రోజున గంగాస్నానం చేసి, పూర్వీకులకు తర్పణం పెడితే, వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని అంటారు. ఈ రోజు స్నానం చేసిన తర్వాత దానం చేస్తే పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు. గౌతమ బుద్ధుడిని విష్ణువుకు తొమ్మదవ అవతారంగా భావిస్తారు.#WATCH | Varanasi, UP: Devotees take holy dip in Ganga River on the occasion of Buddha Purnima. pic.twitter.com/FQ0lQ76Mwu— ANI (@ANI) May 23, 2024 -
తిరుపతి : తాతయ్యగుంట గంగమ్మ జాతర ప్రారంభం (ఫొటోలు)
-
దర్శనానికి వచ్చి ఉంగరం దొంగిలిస్తారా..?
సింహాచలం: ‘శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దర్శనానికి వచ్చి ఆయన ఉంగరాన్నే దొంగిలిస్తారా? మర్యాదగా దొంగిలించిన ఉంగరాన్ని ఇచ్చేయండి.. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం..’అని సింహాచలం కొండకి వచ్చిన పలువురు భక్తులను దేవస్థానం స్థానాచార్యులు ప్రశ్నించే సరికి వారంతా కంగుతిన్నారు. ‘మేం దొంగల్లా కనిపిస్తున్నామా.! స్వామి దర్శనానికి వస్తే ఉంగరాన్ని దొంగతనం చేశారంటారేంటి? పైగా తాళ్లతో బంధించి తీసుకొస్తారా..’అంటూ భక్తులు ఆవేశంతో స్థానాచార్యులపై గర్జించారు. ‘చూడండీ.. మీరు దొంగతనం చేసినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి. పోలీసులు తీసుకెళ్లకముందే దొంగిలించిన ఉంగరాన్ని మర్యాదగా ఇచ్చేయండి.’ అంటూ స్థానాచార్యులు మరింత గర్జించి అడగటంతో భక్తుల కళ్లంట నీళ్లు గిర్రున తిరిగాయి.తాము ఉంగరం తీయలేదని ఎంత చెబుతున్నా వినకుండా మీరే దొంగ అంటూ పదే పదే ప్రశ్నించడంతో వారంతా ఆగ్రహంతో చిందులు వేశారు. పైగా చేతికున్న ఉంగరాలను చూపెట్టమని.. దొంగిలించిన ఉంగరంలా ఇవి ఉన్నాయంటూ స్థానాచార్యులు అడగటంతో భక్తుల నోటి మాట రాలేదు. చివరికి ఇదంతా వినోదోత్సవంలోని ఘట్టమని తెలుసుకుని భక్తులంతా సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. తమకు మాత్రమే దక్కిన భాగ్యంగా భావించి ఆనందభరితులయ్యారు. ఇదీ సింహగిరిపై బుధవారం నవ్వుల సందడిగా జరిగిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి వినోదోత్సవం. స్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మృగయోత్సవంలో పోయిన ఉంగరం వెతికే ఘట్టాన్ని బుధవారం ఉదయం వినోదోత్సవంగా నిర్వహించారు.ఏడు పరదాల్లో దాగి ఉన్న స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని రాజగోపురం వద్ద పల్లకీలో అధిష్టింపజేశారు. స్వామి దూతగా పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు కర్ర, తాడు పట్టుకుని దర్శనానికి వచ్చిన పలువురు భక్తులను ఉంగరం దొంగిలించారంటూ తాళ్లతో బంధించి రాజగోపురం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ దొంగిలించిన ఉంగరాన్ని ఇవ్వాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.ఉత్సవం గురించి తెలియని వాళ్లు కన్నీటిపర్యవంతం చెందారు. ఉత్స వం గురించి తెలిసిన వాళ్లు నవ్వుతూ సమాధానం చెప్పారు. ఈ తరుణంలోనే స్వామిపై ఉన్న ఒక్కొక్క పరదాను తొలగించారు. చివరికి స్వామి చివరి పరదాలోనే ఉంగరం దొరికింది. ఎస్.కోట మండలం బొద్దాంకి చెందిన నూతన దంపతులు ఈశ్వరరావు, మాధవి, ఆరిలోవ ప్రాంతానికి చెందిన మౌళీ, గౌతమి, ఆంధ్రా యూనివర్సిటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యారి్థనులు హిమజ, ప్రత్యూష, లావణ్య, శ్వేత అశ్విని, టెక్కలికి చెందిన అక్కాతమ్ముళ్లు జీవిత, నవీన్కుమార్లను పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు తాళ్లతో బంధించి తీసుకురాగా వారిని స్థానాచార్యులు ప్రశ్నించారు. విజయనగరం జిల్లా దాసన్నపేటకి చెందిన రోజా అనే మహిళ తన కుమార్తె మిక్కి, అల్లుడు కిశోర్, మనవలతో కలిసి సింహగిరికి రాగా వారిని తాళ్లతో బంధించారు.వాళ్ల చేతికి ఉన్న ఉంగరం.. దొంగిలించిన ఉంగరంగానే ఉందని స్థానాచార్యులు, అర్చకులు అనుమా నం వ్యక్తం చేయడంతో వారంతా వాదనకు దిగారు. నా కూతురుకు, అల్లుడికి నిశి్చతార్థం రోజు పెట్టిన ఉంగరాలు ఇవని, దొంగిలించినవి కాదని స్థానాచార్యులతో రోజా వాదించారు. ఇదిలా ఉండగా దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఇరగవరపు రమణాచార్యులు, ఆలయ కొత్వాల్ నాయక్ లంక సూరిబాబు, ఆలయ ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లు, సూపరింటెండెంట్ వెంకటరమణ, ట్రస్ట్బోర్డు మాజీ సభ్యుడు గంట్ల శ్రీనుబాబు సైతం దొంగలుగా పట్టుపట్టారు. తొలుత స్థానాచార్యులను కూడా తాళ్లతోనే బంధించి తీసుకురావడం విశేషం. అదే సమయంలో సింహగిరి వచ్చిన భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు వినోదోత్సవంలో పాల్గొని.. స్వామిని దర్శించుకున్నారు. -
గరుడ ప్రసాదం కోసం చిలుకూరుకు.. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)
-
అయోధ్య అణువణువు రామమయం!
అయోధ్యలోని నూతన రామాలయంలో తొలి శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ శ్రీరామ నవమి అయోధ్యకు చారిత్రకమైనదికానుంది. నేడు శ్రీరాముడు సూర్య తిలకం ధరించనున్నాడు. #WATCH | Uttar Pradesh: Devotees throng Ram temple in Ayodhya, on the occasion of #RamNavami pic.twitter.com/H2n0sQi4AP — ANI (@ANI) April 17, 2024 శ్రీరామ నవమి సందర్భంగా రామ్లల్లా దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే రామభక్తులు సరయూలో స్నానాలు చేసి, ఆలయానికి తరలివస్తున్నారు. #WATCH | Uttar Pradesh: Devotees throng Hanuman Garhi temple in Ayodhya, on the occasion of #RamNavami pic.twitter.com/ErvcKxzjae — ANI (@ANI) April 17, 2024 శ్రీరాముని దర్శనానికి వచ్చిన భక్తులు ముందుగా హనుమాన్ గర్హిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు కనిపిస్తున్నారు. #WATCH | UP: On security arrangements in Ayodhya on #RamNavami, Praveen Kumar, IG, Ayodhya Range says, " Arrangements have been done since earlier, we have divided the areas into two sectors...at 3:30 am, 'Darshan' have started at Ram temple..." pic.twitter.com/oH617ByA9D — ANI (@ANI) April 17, 2024 అయోధ్యలో భద్రతా ఏర్పాట్ల గురించి అయోధ్య రేంజ్ ఐజీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అయోధ్యలోని రామాలయ పరిసరాలను రెండు సెక్టార్లుగా విభజించి, నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. #WATCH | Uttar Pradesh: Devotees take holy dip in Saryu River as they arrive at Ram temple in Ayodhya, on the occasion of #RamNavami pic.twitter.com/ET582pvoT6 — ANI (@ANI) April 16, 2024 తెల్లవారుజామున 3:30 గంటల నుంచి బాలరాముని దర్శనం ప్రారంభమైంది. రామాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన బంగారు రామాయణాన్ని భక్తులు తిలకిస్తున్నారు. ఈ ప్రత్యేక రామాయణాన్ని మధ్యప్రదేశ్ కేడర్కు చెందిన మాజీ ఐఏఎస్ సుబ్రమణ్యం లక్ష్మీనారాయణన్ దంపతులు ట్రస్ట్కు అందించారు. #WATCH | UP: Devotees arrive in large numbers, early in the morning at Ayodhya Ram temple, on the occasion of #RamNavami pic.twitter.com/H7TOalsMMM — ANI (@ANI) April 16, 2024 -
అయోధ్యలో శ్రీరామ నవమి సన్నాహాలు.. 24 గంటలూ దర్శనం!
అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 17న శ్రీరామ నవమి. ఆరోజు అయోధ్యలో జరిగే ఉత్సవాల కోసం దేశ ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఆ రోజు ఆలయంలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారనే విషయాన్ని ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాకు తెలిపారు. శ్రీరామ నవమినాడు ఆలయంలో జరిగే పూజాదికార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామని చంపత్ రాయ్ తెలిపారు. అలాగే నగరపాలక సంస్థ నగరంలో 100 చోట్ల ఎల్ఈడీ టీవీలను ఏర్పాటు చేయనుందని అన్నారు. ఉత్సవాల ప్రత్యక్ష ప్రసారాలకు సంబంధించి తమ సూచనను ప్రసార భారతి ఆమోదించిందన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులు ఎండబారిన పడకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని, అలాగే తాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తామని అన్నారు. శ్రీరామ నవమికి వచ్చే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుందని భావిస్తున్నామన్నారు. రామాలయంలో భక్తుల దర్శనం కోసం ఏడు లైన్లు ఏర్పాటు చేస్తున్నామని చంపత్ రాయ్ తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు లైన్లు మాత్రమే ఉన్నాయని, మరో మూడు లైన్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. భక్తులు తమ వెంట ఆలయంలోనికి మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని తెలిపారు. దర్శనం త్వరగా జరిగేలా పలు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. శ్రీరామ నవమి సందర్భంగా ఆలయాన్ని ఏప్రిల్ 16, 17, 18వ తేదీల్లో మూడు రోజుల పాటు 24 గంటలూ తెరిచివుంచేలా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామన్నారు. దేశప్రజలంతా ప్రసార భారతి ద్వారా, ఇంట్లో నుంచే రామ్లల్లాను దర్శించుకోవచ్చన్నారు. -
తిరుమలలో ప్రత్యక్షమైన గోల్డ్మ్యాన్!
సాక్షి, తిరుపతి: పది గ్రాములు కాదు.. వంద గ్రాములు కాదు.. ఏకంగా మూడు వేల గ్రాముల బంగారం ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు ఓ భక్తుడు. చేతికి భారీ బంగారు కడియాలు, బ్రేస్లెట్లు.. వేళ్లకు పెద్దపెద్ద ఉంగరాలు… ఇక మెడలో అయితే అంతకుమించిన గోల్డ్ చైన్స్.. మొత్తంగా మూడు కిలోలకు పైగా బంగారం అతని ఒంటిపై ధగధగ మెరిసిపోతోంది. ఈ గోల్డ్మ్యాన్ పేరు గడ్డిపాటి సాంబశివరావు, సొంతూరు గుంటూరు జిల్లా మంగళగిరి. తిరుమలలో ప్రత్యక్షమైన గోల్డ్మ్యాన్ను ఆశ్చర్యంగా చూశారు మిగతా భక్తులు. గోల్డ్మ్యాన్తో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. వామ్మో ఇంత బంగారమా అంటూ అవాక్కయ్యారు. నగల దుకాణమే తరలివచ్చిందా అన్నట్టుగా బంగారు ధరించి వచ్చిన గడ్డిపాటి సాంబశివరావు తిరుమలలో స్పెషల్ అట్రాక్షన్గా మారారు. -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుపతి: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారని ఆలయ అధికారులు వెల్లడించారు.టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టిటిడి పేర్కొంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 81,224 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,093 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. శ్రీవారి హుండీ ఆదాయం 4.35 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
భక్తులకు భద్రత..
-
దుబాయ్ శ్రీకృష్ణ మందిరంలో హోలీ వేడుకలు!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో గల శ్రీకృష్ణ దేవాలయంలో భక్తులు హోలీ వేడుకలను ఘనంగా చేసుకుంటున్నారు. యూఏఈలోని భారతీయులు సామరస్య పూర్వకంగా హోలీని జరుపుకుంటున్నారని ప్రముఖ వ్యాపారవేత్త చంద్రశేఖర్ భాటియా మీడియాకు తెలిపారు. భారత రాయబారి సంజయ్ సుధీర్ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రంజాన్ మాసంలో మత సామరస్యం ఉట్టిపడేలా వసంతోత్సవాలు చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. దుబాయ్లోని పలు దేవాలయాలలో హోలీ సందర్భంగా భజనలతో పాటు హోలికా దహనాన్ని నిర్వహించారు. దుబాయ్లోని భారతీయ కమ్యూనిటీకి చెందిన సభ్యులు పలువురికి స్వీట్లు పంచి, హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. #यूएई ♦दुबई के कृष्ण मंदिर में श्रद्धालुओं ने मनाई होली#Holi #Dubai #KrishnaTemple pic.twitter.com/8YojdmjkFL — Knews (@Knewsindia) March 25, 2024 -
అయోధ్యలో హోలీ వేడుకలు.. రంగుల్లో రామ్లల్లా!
రామ్లల్లా అయోధ్యలోని నూతన రామాలయంలో కొలువైన దరిమిలా తన మొదటి హోలీని జరుపుకుంటున్నాడు. రంగుల పండుగ సందర్భంగా బాలరాముని మనోహర విగ్రహం పూలతో అలంకృతమయ్యింది. బాలరాముని నుదిటిపై గులాల్ పూశారు. గులాబీ రంగు దుస్తులతో రామ్లల్లా విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. హోలీ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు రామ్లల్లాను దర్శించుకునేందుకు ఆలయంలో బారులతీరారు. రంగుల పండుగ హోలీ సందర్భంగా ఆలయ ట్రస్టు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ధార్మిక నగరి అయోధ్యలో ఎక్కడ చూసినా హోలీ సందడి కనిపిస్తోంది. అయోధ్యలో గత ఏకాదశి నుంచి హోలీ వేడుకలు ప్రారంభమయ్యాయి. రామనగరిలో కొలువైన దేవతలు, రుషులకు రంగులు పూశారు. రాముని పరమ భక్తుడైన హనుమంతునికి కూడా హోలీ రంగులను పూశారు. -
ఈసారి అమర్నాథ్ యాత్ర 45 రోజులే..
అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త. ప్రబుత్వం తాజాగా అమర్నాథ్ యాత్ర టైమ్ టేబుల్ను విడుదల చేసింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈసారి భక్తులు సహజసిద్ధ మంచు శివలింగాన్ని 45 రోజులు మాత్రమే దర్శనం చేసుకోగలుగుతారు. అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 15 నుండి ప్రారంభం కానుంది. ఈ యాత్రలో పాల్గొనేందుకు ప్రభుత్వం పలు షరతులు విధించింది. యాత్ర చేయబోయే ప్రతివారూ శారీరకంగా దృఢంగా ఉండటం తప్పనిసరి. వారు మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవడంతో పాటు పలు మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది. పలు భద్రాతా ఏర్పాట్లు చేసిన తరువాతనే ప్రభుత్వం అమర్నాథ్ యాత్ర టైమ్ టేబుల్ను విడుదల చేసింది 2024 అమర్నాథ్ యాత్ర ఆషాఢ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు ప్రారంభం కానుంది. అంటే జూన్ 29వ తేదీ అష్టమి తిథి మధ్యాహ్నం 02:19 గంటలకు ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర ఆగస్టు 19తో ముగియనుంది. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ యాత్రకు వెళుతుంటారు. -
యమునా హారతికి పోటెత్తిన జనం
యూపీలోని ప్రయాగ్రాజ్లో జరిగే గంగా హారతి మాదిరిగా ఢిల్లీలోని వాసుదేవ్ ఘాట్పై యుమునా హారతి ప్రారంభమయ్యింది. ఢిల్లీ ప్రజలకు యమునా నదిపై ఉన్న ఆరాధనా భావాన్ని ఇది మరింత పెంపొందించనుంది. మార్చి 20న సాయంత్రం వేళ వాసుదేవ్ ఘాట్పై తొలిసారిగా యమునా హారతి కార్యక్రమం జరిగింది. దీనిని తిలకించేందుకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. ప్రస్తుతానికి యమునా నది ఒడ్డున వారానికి రెండు రోజులు అంటే మంగళవారం, ఆదివారం సాయంత్రం వేళల్లో హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. తరువాత క్రమంగా మిగిలిన రోజుల్లోనూ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యమునా నది ఒడ్డున నిర్మించిన వాసుదేవ్ ఘాట్ ఇప్పుడు కాశీలోని ఘాట్లను తలపిస్తోంది. ప్రజలు కూడా ఈ ఘాట్ను వీక్షించేందుకు తరలివస్తున్నారు. యమునా నది ఒడ్డున సంప్రదాయబద్ధంగా నిర్వహించిన తొలి హారతి కారక్రమం విజయవంతంగా జరిగింది. మరోవైపు ఈ వాసుదేవ్ ఘాట్ను పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి యమునా హారతి వీక్షించేందుకు వచ్చే భక్తుల నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయడం లేదు. -
తిరుమల: భక్తగిరులపై భానుని భగభగలు (ఫొటోలు)
-
మహాశివరాత్రి : విశాఖ ఆర్కే బీచ్ లో జాగారం స్నానాలు (ఫొటోలు)
-
ఏఏ దేశాల్లో శివాలయాలు ఉన్నాయి?
పరమశివునికి మనదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ దేవాలయాలు ఉన్నాయి. శుక్రవారం శివరాత్రి వేడుకలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో విదేశాల్లోని శివాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పశుపతినాథ్ ఆలయం (నేపాల్) ఈ ఆలయం నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉంది ఇది శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ ఆలయాన్ని హిందువులతో పాటు బౌద్ధమతస్తులు కూడా సందర్శిస్తుంటారు. కైలాస మానసరోవరం (చైనా) కైలాస మానసరోవరం అనేది ఒక పవిత్రమైన సరస్సు. ఈ పర్వతం టిబెట్ చైనాలో ఉంది. ఇది శివుని నివాసం అని హిందువులు నమ్ముతారు. ప్రంబనన్ ఆలయం (ఇండోనేషియా) ప్రంబనన్ ఆలయం ఇండోనేషియాలోని జావా ప్రావిన్స్లో ఉంది. దీనిని ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయమని చెబుతుంటారు. ఇక్కడ ఎనిమిది దేవాలయాల సమూహం ఉంది. మున్నేశ్వరం (శ్రీలంక) ఈ ఆలయం శ్రీలంకలో ఉంది. దీనిని 'త్రికోణమాలి' అని కూడా పిలుస్తారు. మున్నేశ్వరం అత్యంత పురాతనమైన శివుని ఆలయం. రావణుని వధించిన తర్వాత రాముడు ఈ ఆలయంలో తన ఆరాధ్యదైవమైన శివుణ్ణి పూజించాడని చెబుతారు. గౌరీశంకర్ ఆలయం (నేపాల్) ఈ ఆలయం నేపాల్లో ఉంది. ఆలయంలో శివపార్వతులు కొలువయ్యారు. ఈ ఆలయం ఖాట్మండుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. కటాస్రాజ్ ఆలయం (పాకిస్థాన్) ఈ ఆలయం పాకిస్తాన్లో ఉంది . దీనిని 'సెవెన్ పూల్స్ టెంపుల్' అని కూడా పిలుస్తారు. అరుల్మిగు శ్రీరాజ కాళియమ్మన్ ఆలయం (మలేషియా) అరుల్మిగు శ్రీరాజ కాళియమ్మన్ ఆలయం మలేషియాలోని జోహోర్ బారులో ఉంది. ఇది మలేషియాలోని పురాతన హిందూ దేవాలయంగా గుర్తింపు పొందింది. శ్రీ శివ మందిర్ (ఇంగ్లండ్) శ్రీ శివాలయం ఇంగ్లండ్లో ఉంది. ఈ ఆలయం లండన్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. శివాలయం (నెదర్లాండ్స్) ఈ ఆలయం నెదర్లాండ్స్లో ఉంది. ఈ ఆలయం ఆమ్స్టర్డామ్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. శివాలయం (జర్మనీ) ఈ ఆలయం జర్మనీలో ఉంది. ఈ ఆలయం బెర్లిన్కు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. -
శివనామస్మరణతో మారుమోగుతున్న నల్లమల అభయారణ్యం
-
నెల రోజుల్లో బాలరాముణ్ణి ఎందరు దర్శించుకున్నారు?
అయోధ్యలో రామమందిరం ప్రారంభమై నెల రోజులు గడిచింది. జనవరి 22న బాలరాముడు గర్భగుడిలో కొలువయ్యాడు. అయోధ్యకు రామభక్తుల ప్రవాహం నిరంతరం కొనసాగుతోంది. ప్రతిరోజూ లక్షలాది మంది రామభక్తులు తమ ఆరాధ్య దైవాన్ని సందర్శించుకుంటున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు అంటే జనవరి 22 నుండి ఇప్పటి వరకు దాదాపు 60 లక్షల మంది రామభక్తులు రామ్లల్లాను దర్శించుకున్నారు. ఆలయం ప్రారంభమైన మొదటి 10 రోజుల్లో 25 లక్షల మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శించుకున్నారు. గడచిన నెల రోజుల్లో వివిధ పార్టీల నేతలే కాకుండా బాలీవుడ్ తారలు కూడా ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్తో కలిసి కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫిబ్రవరి 11న దాదాపు 300 మంది శాసనసభ సభ్యులతో కలిసి రామమందిరాన్ని సందర్శించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కూడా తన మంత్రివర్గంతో కలిసి బాలరాముణ్ణి దర్శించుకున్నారు. -
సర్వం సిద్ధం..
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం మహాజాతర కుంభమేళాకు సర్వం సిద్ధం చేశామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ఆదివారం ములుగు జిల్లా ఎస్ఎస్తాడ్వాయి మండలం మేడారంలో శ్రీ సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని పూజలు చేసిన అనంతరం మంత్రి మాట్లాడారు. ఈనెల 21 నుంచి 24 వరకు జరిగే మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, జంపన్నవాగుపై స్నాన ఘట్టాలు, క్యూ లైన్లు, తాగునీరు, రోడ్లు, బస్టాండ్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఈనెల 23న సీఎం రేవంత్రెడ్డి, గవర్నర్తో పాటు రాష్ట్రపతి మేడారానికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీజ, ఐటీడీఏ పీఓ అంకిత్, ఎస్పీ డాక్టర్ శబరీశ్, ఈఓ రాజేంద్రం పాల్గొన్నారు. ఈనెల 14న మండమెలిగె పండుగ మహాజాతర ప్రారంభానికి ఇంకా తొమ్మిది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే లక్షల సంఖ్యలో భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. ఆదివారం కూడా తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర నుంచి లక్షలాది మంది తరలివచ్చారు. 14న బుధవారం సమ్మక్క– సారలమ్మ పూజారులు మండమెలిగె పండుగ నిర్వహించనున్నారు. ఉత్సవ కమిటీ చైర్మన్గా లచ్చుపటేల్ సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఉత్సవ కమిటీని దేవాదాయ శాఖ నియమించింది. చైర్మన్గా అరెం లచ్చుపటేల్, కమిటీ సభ్యులుగా మిల్కూరి అయిలయ్య, కోడి గోపాల్, గంగెర్ల రాజారత్నం, కొంపెల్లి శ్రీనివాస్రెడ్డి, యాప అశోక్, పోరిక నారాయణ్సింగ్, ముంజల భిక్షపతి, సుంచ హైమావతి, చామర్తి కిషోర్, కొరం అబ్బయ్య, ఆలం శశిధర్, వద్దిరాజు రవిచంద్ర, అంకం క్రిష్ణస్వామి, ఎక్స్ అఫీషియో మెంబర్గా పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావును నియమించారు. చైర్మన్తో పాటు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం త్వరలో చేయనున్నట్లు తెలిసింది. -
శ్రీరామ నవమికి ముస్తాబవుతున్న అయోధ్య!
అయోధ్యలో రామ్లల్లా ప్రతిష్ఠితుడైనప్పటి నుంచి రామనగరికి భక్తులు పోటెత్తున్నారు. ప్రతిరోజూ ఒకటిన్నర నుంచి రెండు లక్షల మంది భక్తులు బాలరాముణ్ణి దర్శించుకుంటున్నారు. గడచిన 18 రోజుల్లో దాదాపు 40 లక్షల మంది భక్తులు రామ్లల్లాను దర్శించుకుని పూజలు చేశారు. భక్తుల రద్దీ నిరంతరం కొనసాగుతోంది. ఈనెలలో రాబోయే శ్రీరామ నవమి సందర్భంగా కోటి మంది భక్తులు అయోధ్యకు రావచ్చనే అంచనాలున్నాయి. ఈ నేపధ్యంలో ఆలయ అధికారులు ఇప్పటికే ఈ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించారు. తొమ్మిది రోజుల పాటు శ్రీరామ నవమి ఉత్సవాలు జరగనున్నాయి. చైత్ర మాసంలోని శుక్ల పక్షం తొమ్మిదవ రోజున శ్రీరాముని జన్మదినోత్సవం జరగనుంది. ఈసారి ఏప్రిల్ 17న శ్రీరామ నవమి జరగనుంది. చైత్ర నవరాత్రుల ప్రారంభంతో ఉత్సవాలు మొదలు కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రామజన్మభూమి గేట్ నంబర్ మూడు నుంచి కూడా భక్తులను అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మార్గంలోని 40 అడుగుల వెడల్పు రోడ్డు నిర్మాణం పూర్తయింది. గతంలో ఈ మార్గాన్ని వీఐపీల రాకపోకలకు ఉపయోగించేవారు. దీనితోపాటు ఆలయ సముదాయానికి ఉత్తర దిశలో కొత్త రహదారిని కూడా నిర్మిస్తున్నారు. రామజన్మభూమి మార్గాన్ని రైల్వే స్టేషన్కు అనుసంధానించడానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
TTD: బ్రేక్ దర్శనం భక్తులకు ఎస్ఎంఎస్ పే సిస్టమ్
నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడంలో టీటీడీదే ప్రథమ స్థానం. టీటీడీ వాడుతున్న టెక్నాలజీ మరే దేవస్థానం వాడుకోలేకపోతున్నాయి. అధునాతన టెక్నాలజీ వినియోగించి శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలను కల్పించాలన్న ధ్యేయంతో టీటీడీ ప్రతినిత్యం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానని అందిపుచ్చుకుంటుంది. అడ్వాన్స్ రిజర్వేషన్ నుంచి.. వివిధ రకాల సేవలతో పాటుగా డొనేషన్స్ సైతం ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది టీటీడీ. ఇక నిఘా నేత్రాలకి కావాల్సిన అత్యాధునిక అనలిటిక్స్ పరిజ్ఞానం జోడించి.. తోపులాటలు సకాలంలో గుర్తించేలా సీసీటీవీ టెక్నాలజీని వినియోగిస్తుంది. సామాన్య భక్తులకు గదుల కేటాయింపు.. ఎస్ఎస్డీ టైం స్లాట్ కేటాయింపు కూడా నూతన టెక్నాలజీ వినియోగించే ముందుకు సాగుతుంది. తిరుమలలో మనకు కావాల్సిన కార్యాలయాలు.. దర్శనం క్యూలైన్.. గదుల కేటాయింపు కౌంటర్.. ఈవో కార్యాలయం.. చైర్మన్ కార్యాలయం.. వసతి గదులకు వెళ్లాలంటే కొంత కాస్త తరమే. అడ్రెస్స్ కనుకొని వెళ్లే లోపే తిప్పలు తప్పవు. భక్తులు ఎదుర్కొంటున్న తిప్పలు తప్పించేందుకు టీటీడీ నూతన సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశ పెట్టింది. తిరుమలలోని కాటేజ్ బుకింగ్ కార్యాలయాల వద్ద ఈ టెక్నాలజీనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. మెరుగైన సేవలను అందించాలని టీటీడీ ప్రతి నిత్యం కృషి చేస్తూనే ఉంటుంది. భక్తులు అనేక సందర్భాలలో గదుల కేటాయింపు అనంతరం తమ గదులకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యే వారు. ఈ ఇబ్బందిని భక్తులు అతిక్రమించడానికి నయా ఆలోచనకు నాంది పలికింది. ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు ఎవరినీ అడగకుండా ఒక చోటి నుంచి మరో చోటికి సులువుగా చేరుకోవచ్చు. సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించి టీటీడీ ఈ నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. తిరుమలలో టీటీడీకి సంబంధించిన అతిథి గృహాలు, వసతి సముదాయాలు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు, లడ్డూ కౌంటర్లు, ఆసుపత్రి, పోలీస్ స్టేషన్లు, విజిలెన్స్ కార్యాలయాలు ఇలా భక్తులకు అవసరమైన సుమారు 40 విభాగాల సమాచారాన్ని టీటీడీ క్యూఆర్ కోడ్ లో నిక్షిప్తం చేశారు. భక్తులు బస్టాండ్లో దిగి సిఆర్వో, అదనపు ఈవో కార్యాలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇలా ఎక్కడికి వెళ్లాలనుకున్నా టీటీడీ వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచిన క్యూ ఆర్ కోడ్ను తమ మొబైల్లో స్కాన్ చేస్తే వారికి విభాగాల వారీగా పేర్లు కనిపిస్తాయి. మనం వెళ్లాల్సిన ప్రాంతం పేరు క్రింద క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే మ్యాప్ డిస్ప్లే అయ్యి నేరుగా అక్కడికి తీసుకుని వెళుతుంది. ఇది భక్తులకు ఎంతగానో ఉపయోగపడనుంది. గతంలో సేవా సదన్ నుంచి వివిధ ప్రాంతాల్లో సేవ చేయడానికి వెళ్ళే శ్రీవారి సేవకులు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడింది. ఈ విధానం శ్రీవారి సేవకుల ద్వారా అమలు చేసి సత్ ఫలితాలు సాధించారు. ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్లను ఎంబీసీ.. సీఆర్ఓ వద్ద ఏర్పాటు చేసింది. వారికి కేటాయించిన గదులకు ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్ బోర్డులను ఏర్పాటు చేయనుంది టీటీడీ. తిరుమల శ్రీవారి దర్శనం కోసం విచక్షణ కోటాలో కేటాయించే బ్రేక్ దర్శనం టికెట్లు పొందే భక్తుల సౌకర్యార్థం టీటీడీ నూతనంగా ఎస్ఎంఎస్ పే సిస్టమ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి నుండి ఈ విధానాన్ని అమలుచేస్తోంది. నూతన విధానంలో ఎస్ఎంఎస్ ద్వారా పే లింక్ను పంపుతారు. భక్తులు ఆ లింక్ పైన క్లిక్ చేసి యూపీఐ లేదా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా ఆన్లైన్లో సొమ్ము చెల్లించి ఎంబీసీ-34 కౌంటర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా బ్రేక్ దర్శన టికెట్లు ప్రింట్ తీసుకోవచ్చు. ఇప్పటికే ఆఫ్లైన్లో సీఆర్ఓలో లక్కీడిప్ ద్వారా ఆర్జిత సేవాటికెట్లు పొందుతున్న భక్తులకు ఈ విధానం అమలు చేస్తున్నారు. ఈ విధానంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండే అవసరం లేకుండా టీటీడీ కొత్తగా ప్రవేశపెట్టిన ఎస్ఎంఎస్ పే సిస్టమ్ చాలా బాగుంది అంటున్నారు. -
గుట్టపైనే అన్ని సేవలు..!
సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్టపైనే అన్ని సేవలు పునరుద్ధరించాలని భక్తజనులు కోరుతున్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా భక్తుల నుంచి వినిపిస్తోంది. గత ప్రభుత్వంలో జరిగిన ఆలయ విస్తరణ, అభివృద్ధితో భక్తులు కోరుకునే మహిమాన్విత పవిత్ర సేవలను కొండపైనుంచి కిందికి తరలించారు. దీంతో పుణ్యక్షేత్రంలో ప్రాశస్త్యం లోపిస్తుందని భక్తులు అంటున్నారు. దీనికి తోడు కొండపైన వసతుల లేమి భక్తులకు ఇబ్బందిగా మారింది. అన్నీ గుట్ట కిందనే...: కొండపైన ఆలయ విస్తరణ, అభివృద్ధికి ముందు యాదగిరిగుట్టలో భక్తులకు అన్ని వసతులు కొండపైనే ఉండేవి. వేలాది మంది భక్తులు ఎంతో దూరం నుంచి వచ్చి అన్ని రకాల సేవలను కొండపైనే పొందేవారు. రాత్రి నిద్ర గుట్టపైనే చేసేవారు. ప్రధానంగా కల్యాణకట్ట(తలనీలాలు సమరి్పంచడం), సత్యనారాయణస్వామి వ్రతాలు, విష్ణుపుష్కరిణి (స్నాన గుండం), రాత్రి నిద్ర చేయడం, అన్నప్రసాద వితరణ సేవలను కొండకిందకు మార్చారు. దీంతో కొండపైన సేవలందకపోవడంతో భక్తి భావం కొరవడిందంటున్నారు. డార్మెటరీ హాల్ నిర్మాణం: కొండపైన గతంలో బాలాలయం ఉన్నచోట డార్మెటరీ హాల్ నిర్మిస్తే రాత్రి నిద్ర చేయవచ్చని భక్తులు కోరుతున్నారు. కొండపైన నిర్మించిన రెండు భవనాల్లో అన్నదానం, సత్యనారాయణస్వామి వ్రతాలు కొనసాగించవచ్చు. కొండపైన మరో చోట కల్యాణ కట్ట ఏర్పాటు చేసి ఎంతో విశి ష్టత కలిగిన విష్ణు పుష్కరిణిలో భక్తుల స్నానాలు చేసేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. యాదాద్రి క్షేత్రంపై అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం భక్తుల మనోభావాలను గౌరవించాలని కోరుతున్నారు. భక్తుల వసతులకు ప్రాధాన్యం ప్రభుత్వం భక్తుల మనోభావాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది. కొండపైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితోపాటు అధికారులతో సమీక్ష నిర్వహించాం. రూ.20 కోట్లతో డార్మెటరీ భవనం నిర్మించాలని నిర్ణయించాం. కొండపైన వసతులు కల్పిస్తాం. ఆలయ ప్రాశస్త్యం కొనసాగిస్తాం. – బీర్ల అయిలయ్య, ఆలేరు ఎమ్మెల్యే తలనీలాల సమర్పణ కొండపైనే ఉండాలి యాదాద్రి పునరి్నర్మాణం తర్వాత మొదటిసారిగా దర్శించుకున్నాం. పాతగుడి ఉన్నప్పుడు ఒకసారి వచ్చాం, అప్పుడు తలనీలాలు గుడిపైనే తీసేవారు. ఇప్పుడు మాత్రం తలనీలాలను కొండ కింద తీస్తున్నారు. తలనీలాలు అర్పించి కొండపైకి దర్శనానికి రావడానికి ఇబ్బందికరంగా ఉంది. దేవుని కొండపైన తలనీలాలను ఏర్పాటు చేస్తేనే స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఇక్కడ భక్తులకు కావాల్సిన కనీస వసతులు కనబడడం లేదు. బాత్రూమ్లు కూడా సరిగ్గా లేవు. – మేతరి దశరథ, భక్తుడు, నిజామాబాద్ ప్రాంగణంలో నిద్రిస్తే ప్రశాంతత ఉండేది లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి ప్రతి సంవత్సరం వస్తాం. గతంలో దర్శనానికి వచ్చినప్పుడు నారసింహుడి సన్నిధిలో కొండపైన రాత్రి వేళల్లో నిద్రపోయే వాళ్లం. మాకు ఆధ్యాతి్మక భావన కలిగేది. ఇప్పుడు కొత్త గుడి కట్టాక అన్ని వసతులు మార్చేశారు. అసలు కొండపైన నిద్రపోవడానికి అనుమతి లేకుండా పోయింది. కిందనే నిద్రించి పైకి రావడానికి అవస్థలు పడుతున్నాం. అసలే నడవలేని స్థితిలో ఉన్న నాలాంటి వారు కింద బస చేసి, మళ్లీ పైకి రావాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. – ఎస్.బుచ్చమ్మ, భక్తురాలు, హైదరాబాద్ కొండపైనే పుష్కరిణి ఉండాలి గుట్టలో రాత్రి బస చేశాం. ఉదయం ఆలయానికి బస్సులో పోమ్మని చె ప్పారు. బస్సెక్కాక మమ్మల్ని ఆల య బస్టాప్ దగ్గర దింపి గుండంకిందనే ఉంటుందని, అక్కడే స్నానం చేయాలని సూచించారు. దీంతో గుండం వద్దకి వెళ్లి స్నా నాలు చేసి అనంతరం కొండపైకి వెళ్లి దర్శనాలు పూర్తిచేసుకున్నాం. పుష్కరిణి కింద ఉండటంతో చాలా అవస్థలు పడ్డాం. గతంలో మాదిరిగా కొండపైనే పుష్కరిణి ఉంటే అక్కడే స్నానం చేసి, దైవ దర్శనానికి వెళ్తే పుణ్యం దక్కుతుంది. – సత్యనారాయణ. భక్తుడు, శంషాబాద్ -
10 రోజుల్లో రూ. 12 కోట్లు.. బాలరాముని ఆదాయం!
అయోధ్యలోని రామాలయానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. రామభక్తులు బాలరామునికి విరాళాలు, కానుకలు విరివిగా అందజేస్తున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ మాధ్యమాలలో భక్తులు నూతన రామాలయానికి విరాళాలు అందజేస్తున్నారు. జనవరి 23 నుంచి సామాన్య భక్తులను రామాలయ సందర్శనకు అనుమతించినది మొదలు భక్తులు బారులు తీరుతున్నారు. గడచిన పది రోజుల్లో బాలరామునికి దాదాపు రూ.12 కోట్ల మేరకు విరాళాలు అందాయి. జనవరి 22న రామ్లల్లాకు పట్టాభిషేకం జరిగిన రోజున వేడుకకు హాజరైన ఎనిమిది వేల మంది అతిథులు భారీగా విరాళాలు సమర్పించారు. జనవరి 22న ఒక్కరోజునే రామ్లల్లా రూ.3.17 కోట్ల విరాళాన్ని అందుకున్నాడు. ముఖ్యమంత్రి యోగితో పాటు బీజేపీ ఎమ్మెల్యేలంతా ఫిబ్రవరి 11న రామ్లల్లాను దర్శించుకోనున్నారు. అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానాతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఆరోజున శ్రీరాముని దర్శించుకోనున్నారు. మరోవైపు రామాలయంలో ఏడాది పొడవునా జరిగే ఉత్సవాల జాబితాను సిద్ధం చేశారు. ఫిబ్రవరి 14న జరిగే వసంత పంచమి నూతన రామాలయంలో నిర్వహించే మొదటి ఉత్సవం కానుంది. ఆరోజు ఆలయంలో సరస్వతీ మాతను పూజించనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. రామాలయంలో ఏడాది పొడవునా 12 ప్రధాన పండుగలు, ఉత్సవాలు జరగనున్నాయి. -
జ్ఞానవాపి: 30 ఏళ్ల తర్వాత పూజలు
యూపీలోని వారణాసిలో గల జ్ఞానవాపి మసీదులోని సెల్లార్లో సుమారు 30 ఏళ్ల తర్వాత పూజలు ప్రారంభమయ్యాయి. వారణాసి కోర్టు తీర్పు వెలువరించిన మరుసటి రోజే పూజలు జరగడం గమనార్హం. వ్యాస్ కా తెహఖానా(వ్యాసుని నేలమాళిగ) సెల్లార్లో ఉదయం 3గం.కే విగ్రహాలకు తొలి పూజ ప్రారంభమైంది. వారం లోపు పూజలు ప్రారంభిస్తామని కాశీ విశ్వనాథుడి ట్రస్ట్ ప్రకటించినప్పటికీ.. సత్వరమే ఆ ఏర్పాట్లను పూర్తి చేసి పూజలు మొదలుపెట్టింది. కాశీ విశ్వనాథుడి ఆలయానికి ఆనుకుని ఉన్న ఈ మసీదులో వేకువ ఝామున 3 గంటలకే పూజలు ప్రారంభం అయ్యాయి. విశ్వనాథుడి ఆలయ పూజారి మంగళహారుతులు ఇచ్చారు. రాష్ట్రీయ హిందూ దళ్ సభ్యులు మసీద్ సమీపంలో మందిర్(ఆలయం) అనే బోర్డును అంటించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రతా ఏర్పాటు చేశారు. #WATCH | Varanasi: After the District Court granting permission for conducting 'Pooja' in the 'Vyas Ka Tehkhana' in Gyanvapi mosque, Chairman of Kashi Vishwanath Trust Nagendra Pandey says, "Court has ordered the opening and subsequent worship at the 'tehkhana' which was closed… pic.twitter.com/KhN0cMTjPC — ANI (@ANI) February 1, 2024 బాబ్రీ విధ్వంసం తర్వాత అప్పటి ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఇక్కడి ప్రాంతాన్ని సీజ్ చేయించారు. హిందువులు ఇక్కడ పూజలు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతీ ఒక్కరికీ ఇక్కడ పూజలు చేసే హక్కు ఉంది అని హిందు పక్షం తరఫున కోర్టులో వాదనలు వినిపించిన విష్ణు శంకర్ జైన్ చెబుతున్నారు. ఇక ఈ తీర్పు ప్రతి హిందువు హృదయంలో సంతోషాన్ని నింపిందని విశ్వహిందూ పరిషత్ పేర్కొంది. విశ్వహిందూ పరిషత్ (విహెచ్పి) అధ్యక్షుడు అలోక్ కుమార్ మాట్లాడుతూ కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కోర్టు ఈ ఉత్తర్వును స్వాగతించారు. దీనిపై ‘ఎక్స్’లో స్పందిస్తూ 'శివ భక్తులకు న్యాయం జరిగింది. విశ్వనాథుని ఆలయ సముదాయంలోగల వ్యాసుని నేలమాళిగలో పూజలు చేసుకునే హక్కును మంజూరు చేస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని’ అన్నారు. #WATCH | Gyanvapi case | After the court grants permission for puja in the 'Vyas Ka Tekhana', advocate Sohan Lal Arya says, "We are feeling very proud today. The court's decision yesterday was unprecedented...The arrangements have been made but it (Vyas Ka Tekhana) has not been… pic.twitter.com/21R8jzcxQe — ANI (@ANI) February 1, 2024 జ్ఞానవాపి మసీదులోని ‘వ్యాస్ కా తహఖానా’లో పూజలు చేయడానికి జిల్లా కోర్టు అనుమతి ఇవ్వడంపై కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ అధ్యక్షుడు నాగేంద్ర పాండే హర్షం వ్యక్తం చేశారు. ఇకపై ఏ పక్షానికి ఎలాంటి సమస్య ఉండదన్నారు. "Arrangements have been made but...": Advocate Sohan Lal Arya over Varanasi Court's order on Gyanvapi Mosque Read @ANI Story |https://t.co/uTQ5eTNesb#GyanvapiMosque #VaranasiCourt #GyanvapiMosque pic.twitter.com/uVIFbRSRNO — ANI Digital (@ani_digital) February 1, 2024 -
అయోధ్యలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
శ్రీరాముడు జగదానందకారకుడు. అయోధ్యలో నూతనంగా నిర్మించిన ఆలయంలో కొలువైన రామ్లల్లా దేదీప్యమానంగా వెలుగొందుతున్నాడు. ఆలయ గర్భగుడిలో రామ్లల్లా ప్రతిష్ఠాపన జరిగి వారం రోజులు దాటినా భక్తుల రద్దీ నిరంతరం కొనసాగుతూనే ఉంది. రామ్లల్లాను తనివితీరా దర్శించాలనే కోరిక అయోధ్యకు వచ్చే ప్రతీ ఒక్కరిలోనూ కనిపిస్తోంది. తీవ్రమైన చలి గజగజా వణికిస్తున్నా భక్తులు రామ్లల్లా దర్శనం కోసం బారులు తీరుతున్నారు. పిల్లలు, పెద్దలు, ముఖ్యంగా యువత శ్రీరాముని దర్శించుకునేందుకు అమితమైన ఆసక్తి కనబరుస్తోంది. అయోధ్యకు వచ్చే భక్తుల కోసం పలు సేవా సంస్థలు వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. రామ్పథ్ తదితర మార్గాల నుంచి వస్తున్న భక్తుల కోసం ఉచిత భోజనశాలలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ రామ్లల్లా సందర్శకుల కోసం నిర్మించిన టెంట్ సిటీని ప్రారంభించారు. దీనిలో 25 వేల మంది భక్తులు బస చేసేందుకు అవకాశం ఉంది. ఈ టెంట్ సిటీలోనూ ఉచిత భోజనశాలలు ఏర్పాటు చేశారు. -
‘జాగరణ’లో స్టేజ్ కూలి ఒకరు మృతి.. 17 మందికి గాయాలు!
దేశ రాజధాని ఢిల్లీలోని కల్కాజీ ఆలయంలో జరిగిన ‘జాగరణ’ కార్యక్రమంలో వేదిక కూలిపోవడంతో కలకలం చెలరేగింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు. నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో దాదాపు 1,600 మంది అక్కడ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఎలాంటి అనుమతి తీసుకోలేదని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనలో ఒకరు మహిళ మృతి చెందింది. గాయడిన 17 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదంతంలో ‘జాగరణ’ నిర్వాహకులపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 337/304A/188 కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన అర్ధరాత్రి 1:20 గంటలకు జరిగినట్లు సమాచారం. #WATCH | Delhi | 17 people injured and one died when a platform, made of wood and iron frame, at a Mata Jagran at Mahant Parisar, Kalkaji Mandir collapsed at midnight on 27-28 January. Case registered against the organisers. (Video: Viral visuals confirmed by Police) https://t.co/r6bE9dh3ds pic.twitter.com/xJgJ0wSdqB — ANI (@ANI) January 28, 2024 -
రామ్లల్లా దర్శన సమయాల్లో మార్పులు
అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముడు కొలువైన అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. లక్షలాది మంది భక్తులు బాలరాముని దర్శనం చేసుకునేందుకు అర్థరాత్రి నుండే గజగజ వణికిస్తున్న చలిలో సైతం క్యూలలలో వేచివుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కీలక నిర్ణయం తీసుకుంది. అధిక సంఖ్యలో భక్తులు రామ్లల్లాను చూసేందుకు, పూజలు చేసేందుకు అవకాశాన్ని కల్పించాలని ట్రస్ట్ దర్శన సమయాల్లో మార్పులు చేసింది. ఈ సమాచారాన్ని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) మీడియాకు అందించింది. ఇది కూడా చదవండి: అయోధ్య రామ భక్తులకు శుభవార్త విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి మాట్లాడుతూ రామ భక్తులకు ఇకపై దర్శనానికి మరో గంట సమయం అదనంగా లభిస్తుందన్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు రామ్లల్లా హారతి, దర్శనం కోసం విడుదల చేసిన షెడ్యూల్ వివరాలు.. మంగళ హారతి: ఉదయం 4.30 గంటలకు ఉత్థాన్ హారతి : ఉదయం 6.30 గంటలకు దర్శనం: ఉదయం 7 గంటల నుంచి భోగ్ హారతి: మధ్యాహ్నం 12 గంటలకు సాయంత్రం హారతి: 7.30 గంటలకు రాత్రి భోగ్ హారతి: 9 గంటలకు శయన హారతి: రాత్రి 10 గంటలకు -
అయోధ్య రామ భక్తులకు శుభవార్త
దేశంలోని రామభక్తుల కల నెరవేరింది. అయోధ్యలో రామాలయం నిర్మితమయ్యింది. లక్షలాది భక్తులు రాములోరిని చూసేందుకు తరలివస్తున్నారు. అయితే వారు అక్కడ సరైన వసతి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇకపై ఇటువంటి సమస్యలకు ఫుల్స్టాప్ పడనుంది. అయోధ్య ధామ్లో భక్తుల కోసం 158 కొత్త హోటళ్లను నిర్మించేందుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ హోటళ్లను వీలైనంత త్వరగా నిర్మించనున్నారని సమాచారం. ఈ ఏడాది ఎనిమిది వేల గదులు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతానికి పర్యాటకులకు 175 హోటళ్లు, అతిథి గృహాలు, డేరా సిటీలలో 30 వేల మంది భక్తులకు బస చేసేందుకు ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే రిజిస్టర్ అయిన 158 కొత్త హోటళ్ల నిర్మాణం పూర్తయ్యాక అయోధ్య ధామ్లోని హోటళ్లు, అతిథి గృహాల సంఖ్య 333కి పెరగనుంది. ఇది కూడా చదవండి: తొలిరోజు విరాళాలు రూ.3.17 కోట్లు! యూపీ పర్యాటక మంత్రిత్వ శాఖ అయోధ్యలో నిర్మిస్తున్న హోటళ్లను కాంస్య (ఒక నక్షత్రం), వెండి (రెండు నక్షత్రాలు), బంగారం (త్రీ స్టార్), డైమండ్ (నాలుగు నక్షత్రాలు), ప్లాటినం (ఫైవ్ స్టార్)గా వర్గీకరించే సదుపాయాన్ని కూడా కల్పించింది. కొత్త టూరిజం పాలసీ ప్రకారం నూతనంగా నిర్మితమవుతున్న ఈ హోటళ్లకు ఇంటి పన్ను, నీటి పన్ను, ఇతర పన్నుల్లో 50 శాతం వరకు రాయితీని ప్రభుత్వం అందిస్తోంది. జనరల్ కేటగిరీకి 25 శాతం, మహిళలు, షెడ్యూల్డ్ కులాలకు 30 శాతం సబ్సిడీ కల్పిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ హోటళ్ల నిర్మాణం పూర్తికానున్నదని యూపీ పర్యాటక శాఖ మంత్రి జైవీర్ తెలిపారు. -
తొలిరోజు విరాళాలు రూ.3.17 కోట్లు!.. మూడో రోజు సజావుగా దర్శనాలు!
అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమైన రెండవరోజున(బుధవారం) దాదాపు 2.5 లక్షల మంది భక్తులు దర్శనానికి తరలివచ్చారు. మంగళవారం(తొలిరోజు) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేపట్టిన ఆకస్మిక పర్యటన, సూచనల ప్రభావం బుధవారం కనిపించింది. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తాజాగా యాత్రికుల సౌకర్య కేంద్రాన్ని ప్రారంభించింది. ఇది భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. బాలక్ రాముని దర్శనాలు ప్రారంభమై నేటికి (గురువారం) మూడో రోజు. మొదటి రెండు రోజులు భక్తుల రద్దీతో అనేక ఇబ్బుందులు తలెత్తాయి. ఈ నేపద్యంలో ట్రస్ట్ పలు చర్యలు చేపట్టడంతో ప్రస్తుతం ఆలయంలో భక్తుల దర్శనాలు క్రమపద్ధతిలో సాగుతున్నాయి. రామభక్తుల దర్శనాలు నిరంతరం కొనసాగుతున్నాయి. బాలరాములోరికి భక్తులు కానుకలు, విరాళాలు విరివిగా సమర్పిస్తున్నారు. ఇది కూడా చదవండి: కొనసాగుతున్న భక్తుల వరద ప్రాణప్రతిష్ఠ జరిగినంతనే ఐదేళ్ల బాలరాముడు కోటీశ్వరునిగా మారిపోయాడు. తొలిరోజు శ్రీరాముని దర్శనానికి వచ్చిన భక్తులు రూ.3.17 కోట్ల విరాళాలను సమర్పించారని ట్రస్ట్ తెలిపింది. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ అనంతరం మంగళవారం ఆలయంలోకి సామాన్య భక్తుల ప్రవేశానికి అనుమతి కల్పించారు. రామాలయానికి వచ్చిన సందర్శకుల సంఖ్యకు సంబంధించి గతంలో ఉన్న రికార్డులన్నీ బద్దలయ్యాయి. లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో దర్శనం కోసం వారు నానా అవస్థలు పడ్డారు. రాములోరి దర్శనం కోసం వచ్చిన భక్తులు విరాళాలు సమర్పించారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధి డాక్టర్ అనిల్ మిశ్రా మాట్లాడుతూ మంగళవారం ఆలయానికి అత్యధిక విరాళాలు అందాయి. ఆన్లైన్లో విరాళాలు అందించడానికి రామభక్తులు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. విరాళాల కోసం ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి, పలువురు భక్తులు విరాళాలు అందించారన్నారు. కాగా అయోధ్యకు తరలివచ్చే భక్తులు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారిక వెబ్సైట్ ద్వారా విరాళాలు అందించవచ్చు. ఆలయంలోని హుండీలలో కూడా విరాళాలు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. -
Ayodhya: బాలక్ రామ్ కోసం.. రెండో రోజూ అవే దృశ్యాలు
అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ట అనంతరం రెండో రోజు.. నేడు (బుధవారం) బాలక్ రామ్ దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రాణప్రతిష్ఠ మరుసటి రోజు అంటే (నిన్న) మంగళవారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈరోజు ఆలయాన్ని ఉదయం ఏడు గంటలకు తెరవనుండగా, తెల్లవారుజామున మూడు గంటల నుంచే భక్తులు బారులు తీరారు. ప్రాణ ప్రతిష్ట జరిగిన మర్నాడు అంటే మంగళవారం ఐదు లక్షల మంది భక్తులు బాలరాముని దర్శనం చేసుకున్నారు. రాత్రి 9 గంటల వరకు భక్తులు శ్రీరాముని దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించారు. భద్రతా ఏర్పాట్లు సజావుగా సాగేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా మంగళవారం సాయంత్రం అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్యకు తరలివస్తున్న భక్తులు బాలరాముని దర్శనం కోసం ఓపిక పట్టాలని సీఎం కోరారు. #WATCH | Ayodhya, Uttar Pradesh: On the second day after the Pran Pratishtha, devotees gather in huge numbers at Rampath to have darshan of Shri Ram Lalla pic.twitter.com/JMI3AvYPca — ANI (@ANI) January 24, 2024 ఇకపై రామాలయంలో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నిరంతర దర్శనం ఉంటుందని జిల్లా యంత్రాంగం, శ్రీరామజన్మభూమి ట్రస్టు తెలిపింది. అయితే హారతి, భోగం కోసం సమయంలో దర్శనాన్ని కొద్దిసేపు నిలిపివేస్తున్నట్లు ట్రస్టు పేర్కొంది. ప్రాణ ప్రతిష్ట అనంతరం సామాన్య భక్తులకు దర్శనానికి అవకాశం కల్పించగా, తొలిరోజైన మంగళవారం నాడు ఐడు లక్షల మందికిపైగా భక్తులు తమ బాలరాముని దర్శించుకున్నారు. నేడు (బుధవారం) ఉదయం ఇప్పటికే 20 వేల మందికి పైగా భక్తులు దర్శనం కోసం క్యూలో ఉన్నారు. నేటి ఉదయం ప్రవేశ ద్వారం వెలుపల కిలోమీటరుకు పైగా భక్తుల క్యూలు కనిపించాయి. ఈ నేపధ్యంలో పోలీసులు, ఆలయ నిర్వాహకులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.