
శ్రీశైల క్షేత్రం మల్లన్న నామస్మరణతో మారుమ్రోగుతోంది. ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని కర్ణాటక, మహారాష్ట్రలకు నుంచి వేలాదిగా తరలివస్తున్న భక్తులతో శ్రీగిరి క్షేత్రం జనసంద్రంగా మారింది

పాదయాత్ర భక్తులు పల్లకీల ముందు తప్పెట దరువులకు కుంకమ చల్లుకుంటూ, చిందులు వేస్తూ మల్లన్నను కీర్తిస్తున్నారు

కన్నడ భక్తుల నృత్యాలతో శ్రీగిరి క్షేత్రం మరింత ఉత్సవ శోభను సంతరించుకుంది

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ పూజావేళల్లో మార్పులు చేసి వేకువజాము నుంచే స్వామిఅమ్మవార్ల దర్శనానికి అనుమతిస్తున్నారు

వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి బారులు తీరారు

భక్తుల రద్దీతో ఆలయ ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనక్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి

మల్లన్న స్పర్శదర్శనం నేటితో ముగియడంతో వృద్ధులు, మహిళలు, చంటిపిల్లల తల్లులు సైతం పాదయాత్రగా మల్లన్న చెంతకు చేరుకుంటున్నారు

కొందరు కాళ్లకు కర్రలు కట్టుకుని, మరికొందరు పల్లకీ మోసుకుంటూ పాదయాత్రగా తరలివస్తున్నారు









