Devotees Crowded
-
#MahaKumbh2025 : మాఘ పూర్ణిమ స్నానాలు కుంభమేళాకు పోటెత్తిన జనం (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి : బెజవాడ దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
ఖైరతాబాద్లో కిక్కిరిసిన భక్తులు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జనం మంగళవారం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ గణపతి దర్శించుకునేందుకు శనివారం భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. భక్తుల తాకిడితో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.కాగా, ఖైరతాబాద్లో బగా గణేష్ దర్శనం భక్తులు బారులు తీరారు. వీకెండ్, నవ రాత్రి ఉత్సవాలు ముగిసే సమయం దగ్గర పడుతుండటంతో గణపతిని దర్శించుకునే వారి సంఖ్య పెరిగింది. శనివారం మధ్యాహ్నం నుంచి గంట గంటకు భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. భారీ సంఖ్యలో భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. దీంతో, దర్శనానికి వచ్చే భక్తులను కంట్రోల్ చేయడానికి పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు.. విగ్రహం వద్ద భక్తుల సంఖ్య పెరగడంతో కేటుగాళ్లు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే అనేకమంది సెల్ ఫోన్ పోగుట్టుకున్నారని తెలుస్తోంది. బంగారం, పర్సులు, తమ విలువైన వస్తువులు పోయాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో దొంగలు సంచరిస్తున్నారని భక్తులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను పోలీసులు హెచ్చరించారు. ఇక, రేపు ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక, ఖైరతాబాద్ రూట్లో వచ్చే మెట్రో సర్వీసులు కూడా ఫుల్ అయిపోయాయి. మెట్రోలో ప్రయాణీకుల రద్దీ పెరిగింది. ఇది కూడా చదవండి: హైడ్రాపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు -
Aug 02: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 18 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 4 గంటల సమయం పడుతోంది. నిన్న (గురువారం) 61,465 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 21,206 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.66 కోట్లుగా లెక్క తేలింది. -
కేదార్నాథ్కు పోటెత్తిన భక్తజనం
ఈ రోజు శ్రావణమాసం(ఉత్తరాదివారికి)లోని తొలి సోమవారం. నేడు మహాశివునికి ప్రీతిపాత్రమైన రోజుగా భావిస్తారు. అందుకే కేదార్నాథ్కు భక్తులు పోటెత్తుతున్నారు. ఈరోజు మహేశ్వరుణ్ణి దర్శించుకుని పూజలు చేయాలని భక్తులు అభిలషిస్తున్నారు.ఈరోజు ఉత్తరాఖండ్లోని కేదారేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు నిన్నరాత్రి నుంచే భక్తులు బారులు తీరారు. ధామ్ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ, భక్తులు మహాశివుని దర్శనం కోసం క్యూలో వేచివుంటున్నారు. ఉత్తరాదిన శ్రావణమాసం జూలై 22 నుండి ప్రారంభమై, ఆగస్టు 19 వరకూ ఉంటుంది. ఈసారి శ్రావణ మాసంలో ఐదు సోమవారాలు ఉన్నాయి. ఈ రోజుల్లో భక్తులు మహాశివుణ్ణి పూజిస్తుంటారు. -
Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ
తిరుమల: శ్రీవారిలో భక్తుల రద్దీ ఉంది. క్యూ కాంప్లెక్స్లో 4 కంపార్ట్మెంట్లు నిండాయి. నిన్న(సోమవారం) 77,673 మంది స్వామివారిని దర్శించుకున్నా రు. 30,607 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.10 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతుండగా.. టికెట్లు లేని భక్తులకు 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే..
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 7 పార్ట్మెంట్లు నిండాయి. నిన్న (బుధవారం) 64,080 మంది స్వామివారిని దర్శించుకోగా 25,773 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 2.66 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 2 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
అయోధ్యకు క్యూ కట్టిన భక్తులు.. ఇప్పటి వరకు దర్శనాలు, హుండీ..
అయోధ్య: యూపీలోని అయోధ్య మందిరానికి భక్తులు క్యూ కడుతున్నారు. బాలరాముడిని చూసేందుకు దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. ఇక, కేవలం 11 రోజుల్లోనే ఏకంగా 25 లక్షల మంది భక్తులు అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో రూ.11 కోట్ల మేర హుండీ ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కాగా, అయోధ్యలోని బాలక్ రాముడి దర్శన మార్గంలో నాలుగు హుండీలను ఏర్పాటు చేశారు. ఇక, గత 11 రోజుల్లో 25లక్షల మంది భక్తులు బాలరాముడిని దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.8 కోట్లు నగదు రూపంలో, రూ.3.5 కోట్లు చెక్కుల రూపంలో వచ్చాయి. ఇందులో ఆన్లైన్ విరాళాలు కూడా ఉన్నాయి. మొత్తం 14 మందితో కూడిన బృందం ఈ హుండీల్లోని విరాళాలను లెక్కించింది. ఇక, భక్తులు కానుకలు సమర్పించడం నుంచి వాటిని లెక్కింపు వరకూ అంతా సీసీటీవీ కెమెరాల నిఘా పర్యవేక్షణలోనే జరుగుతుందని ఆలయ ట్రస్టు ఆఫీస్ ఇన్ఛార్జి ప్రకాశ్ గుప్తా తెలిపారు. VIDEO | Devotees continue to throng Ayodhya's Ram Mandir for 'darshan' of Ram Lalla. (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz)#AyodhyaRamMandir pic.twitter.com/cweNluhV8U — Press Trust of India (@PTI_News) February 2, 2024 ఇదిలా ఉండగా.. భారీసంఖ్యలో వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అయోధ్యలోని బాలరాముడి మందిరంలో స్వామి దర్శన సమయాన్ని ఆలయ నిర్వాహకులు ఇటీవల పొడిగించారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులు ఆలయాన్ని సందర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు. అంతకుముందు ఆలయ దర్శన వేళలు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే ఉండేవి. #WATCH | Uttar Pradesh: Devotees gather at Rampath for the darshan of Ram Lalla at Shri Ram Janmabhoomi Temple in Ayodhya. pic.twitter.com/tpmVFU2jH0 — ANI (@ANI) February 2, 2024 -
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు కావడంతో తిరుమలకు భక్తులు క్యూ కట్టారు. ఇక, నిన్న తిరుమల శ్రీవారిని 54,105 మంది భక్తులు దర్శించుకున్నారు. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కాగా, రిపబ్లిక్ డే, నెలలో నాలుగో శనివారం, ఆదివారం వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ఉండటంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఇక, గురువారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. నిన్న ఒక్కరోజు 54,105 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 23,590 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. దీంతో, నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 3.44 కోట్లుగా ఉంది. ఇక, నేడు ఉచిత సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. మరోవైపు, టైమ్ స్లాట్ ఎస్ఎస్డీ దర్శనానికి 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. అటు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. #తిరుమల పౌర్ణమి సందర్భంగా శ్రీ మలయప్ప స్వామి గరుడ వాహనంపై భక్తులను అనుగ్రహించారు#Tirumala On the eve of Paurnami, Sri Malayappa Swamy blessed devotees from Garuda Vahanam pic.twitter.com/Nk6CboAhWA — kshetradarshan (@kshetradarshan) January 25, 2024 -
Ayodhya Ram Mandir: కొనసాగుతున్న భక్తుల వరద
అయోధ్య/లఖ్నవూ: అయోధ్యకు భక్తుల వరద కొనసాగుతూనే ఉంది. బుధవారం కూడా మధ్యాహ్న సమయానికే దాదాపు 3 లక్షల మంది బాలక్ రామ్ దర్శనం చేసుకున్నట్టు శ్రీరామ జన్మభూమి ట్రస్టు వర్గాలు తెలిపాయి. మంగళవారం తొలి రోజు 5 లక్షల మందికి పైగా దర్శనాలు చేసుకున్న విషయం తెలిసిందే. బుధవారం కూడా తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి మొదలైంది. వణికిస్తున్న చలిని కూడా లెక్కచేయకుండా క్యూ లైన్లలో భారీగా బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. వారికి తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను కలి్పస్తున్నారు. మరోవైపు, అయోధ్యకు దారితీసే హైవేలు, ప్రధాన రహదారులన్నీ వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. రానున్న రెండు మూడు రోజుల్లో భక్తుల ప్రవాహం మరింత పెరిగేలా ఉండటంతో ఉత్తరప్రదేశ్ సర్కారు రంగంలోకి దిగింది. భక్తుల సంఖ్యను నియంత్రించేందుకు పలు చర్యలు చేపడుతోంది. వాటిలో భాగంగా అయోధ్యకు యూపీ రోడ్డు రవాణా సంస్థ బస్సుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపేసింది. నగరానికి ప్రైవేటు బస్సుల రాకపోకలపైనా నిషేధం విధించారు. వీఐపీలు అయోధ్య సందర్శనను వీలైనంత కాలం వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. మంత్రులూ, ఫిబ్రవరిలో వెళ్లొద్దు: మోదీ భక్తులు పోటెత్తుతున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో అయోధ్య సందర్శన యోచన మానుకోవాల్సిందిగా కేంద్ర మంత్రులను ప్రధాని మోదీ కోరినట్టు సమాచారం. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ ఇందుకు వేదికైంది. ఇప్పటికిప్పుడు వారు అయోధ్యలో పర్యటిస్తే ప్రొటోకాల్స్ తదితరాలతో భారీగా వస్తున్న సాధారణ భక్తులకు ఇబ్బందికరంగా మారవచ్చని అభిప్రాయపడ్డారు. అయోధ్య రామ మందిర ప్రారంభం, రామ్ లల్లా ప్రాణప్రతిష్టపై భక్తుల ఫీడ్బ్యాక్ గురించి మంత్రులను అడిగి తెలుసుకున్నారు. గర్భాలయంలోకి వానరం హనుమ ఆశీర్వాదమే: ట్రస్టు అయోధ్య రామాలయంలో ఆసక్తికర సన్నవేశం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం ఆరు గంటల వేళ ఓ వానరం దక్షిణ ద్వారం గుండా గర్భాలయంలోకి ప్రవేశించింది. లోపల కలియదిరిగింది. రామల్ లల్లా ఉత్సవ విగ్రహం చెంతకు వెళ్లింది. విగ్రహాన్ని పడేస్తుందేమోనని లోనికొచ్చిన భద్రతా సిబ్బందిని చూస్తూ నింపాదిగా తూర్పు ద్వారం గుండా బయటికి వెళ్లింది. బారులు తీరిన భక్తుల కేసి చూస్తూ వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను క్షేత్ర ట్రస్టు ఎక్స్లో పోస్ట్ చేసింది. ఆ వానరం తీరు అచ్చం మనిíÙనే తలపించిందని భద్రతా సిబ్బంది గుర్తు చేసుకున్నారు. బహుశా హనుమంతుడే బాలక్ రామ్ దర్శనార్థం వచ్చినట్టుందని వారు అభిప్రాయపడ్డారు. అయోధ్యలో హెలికాప్టర్ దర్శనాలు సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య సందర్శనార్థం యూపీలో పలు నగరాల నుంచి హెలికాప్టర్ సరీ్వసులను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గోరఖ్పూర్, వారణాసి, లక్నో, మధుర, ఆగ్రా, ప్రయాగ్రాజ్ నుంచి ఈ సేవలుంటాయి. ఆయా నగరాల నుంచి వచ్చే హెలికాప్టర్ల ల్యాండింగ్ కోసం అయోధ్యలో సరయూ నదీ తీరంలో నూతన హెలీప్యాడ్ను సిద్ధం చేశారు. అయోధ్య, హనుమాన్ గఢి, సరయూ నదీ ప్రాంతాల విహంగ వీక్షణంకు అవకాశం కలి్పస్తున్నారు. ఈ ఏరియల్ టూర్కు ఒక్కొక్కరికి రూ.3,539 వసూలు చేస్తారు. ఏరియల్ టూర్ ఒకేసారి ఐదుగురు చూడొచ్చు. -
Makara jyothi: దర్శనమిచ్చిన మకర జ్యోతి.. పరవశించిన అయ్యప్ప భక్తులు
తిరువనంతపురం: కోట్లాది మంది భక్తులు ఏడాది పాటు ఎదురు చూసే క్షణం రానే వచ్చింది. మకర సంక్రాంతి పర్వదినమైన సోమవారం సాయంత్రం 6.47 గంటలకు కేరళలోని శబరిమల ఆలయానికి సమీపంలోని పొన్నాంబళమేడుపై మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. మొత్తం మూడుసార్లు జ్యోతి దర్శనమిచ్చింది. జ్యోతి దర్శనమిచ్చిన సందర్భంగా శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమోగాయి. జ్యోతి దర్శనానికి 50 వేల మంది భక్తులకు ట్రావెన్కోర్ బోర్డు అనుమతిచ్చినప్పటికీ సుమారు 4 లక్షల మంది ప్రత్యక్షంగా జ్యోతిని వీక్షించారు. భక్తులు జ్యోతిని దర్శించుకునేందుకు ట్రావెన్కోర్ ఆలయ బోర్డు ప్రత్యేక వ్యూ పాయింట్లు ఏర్పాటు చేసింది. పరోక్షంగా టీవీలు, యూ ట్యూబ్లో కొన్ని కోట్ల మంది జ్యోతి దర్శనం చేసుకున్నారు. జ్యోతి దర్శనం కోసం నియమ నిష్టలతో అయ్యాప్ప మాల ధరించిన స్వాములు భారీ సంఖ్యలో శబరిమలకు విచ్చేశారు. 41 రోజుల ఉపవాస దీక్ష చేసిన భక్తులు కందమల శిఖరంపై దర్శనమిచ్చిన మకర జ్యోతిని కనులారా వీక్షించి భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. Makara jyothi sighted.. worshiped by pilgrims at Sabarimala Temple in Kerala Swamiye Saranam Ayyappa...🙏 @TigerRajaSingh @bandisanjay_bjp @BJP4Telangana @narendramodi @myogiadityanath pic.twitter.com/r01oVSwcWg — Dinesh kumar 🇮🇳 (@Dineshdinnu86) January 15, 2024 హరిహర తనయుడు అయ్యప్పస్వామి కొలువైన క్షేత్రం కేరళ శబరిమల. ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున శబరిమల ఆలయంలో మకరజ్యోతి/మరళవిక్కు కార్యక్రమం నిర్వహిస్తుంటారు. మకర సంక్రాంతి నాడు దర్శనమిచ్చే జ్యోతి కావడంతో దీనిని శబరిమల మకరవిళక్కు లేదా శబరిమల మకర జ్యోతి అని పిలుస్తుంటారు. ఇదీచదవండి.. రాముడు కలలోకొచ్చాడు.. 22న అయోధ్యకు రాడట -
యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. క్యూలైన్లు ఫుల్
సాక్షి, యాదగిరిగుట్ట: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. అయితే, కార్తీకమాసం చివరి రోజు కావడం, అలాగే ఆదివారం కావడంతో భక్తులు పోటెత్తారు. దీంతో, స్వామి వారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. వివరాల ప్రకారం.. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో యాదాద్రి ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా లైన్లలో వేచివున్నారు. స్వామి వారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. కొండ కింద వ్రత మండపంలో భక్తులతో నిండిపోయింది. అధిక సంఖ్యలో భక్తులు వ్రతమాచరించారు. దీపారాధనలో భక్తులు భారీగా పాల్గొన్నారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. మరోవైపు.. వేకువ జామునే స్వయంభువులను కొలిచిన అర్చకులు.. ఆలయ ముఖ మండపంలో కవచమూర్తులకు అష్టోత్తర శతఘటాభిషేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి అమ్మవార్లను రథసేవలో తీరిదిద్ది మండపంలో ఊరేగించనున్నారు. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా భక్తులు వేకువ జామునే కొండ చుట్టూ గిరి ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. -
విజయనగరం: పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద భక్తుల రద్దీ (ఫొటోలు)
-
Vijayawada: దసరా శరన్నవరరాత్రులు ఇంద్రకీలాద్రిలో భక్తుల రద్దీ (ఫొటోలు)
-
తిరుమలలో భక్తుల రద్దీ అప్డేట్స్..
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కంపార్ట్మెంట్లు అన్నీ నిండి వెలుపల క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఇక, నిన్న శ్రీవారిని 66,233 మంది దర్శించుకున్నారు. నిన్న(శుక్రవారం) శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.71కోట్లుగా ఉంది. తిరుమలలో శుక్రవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. వర్షం కారణంగా ఘటాటోపం కింద స్వామివారు మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అక్టోబర్ 14న అంకురార్పణ, అక్టోబర్ 15–23 వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. #తిరుమల తిరుమలలో నేటి పౌర్ణమి గరుడ సేవ#Tirumala Today's Paurnami Garuda Seva at Tirumala pic.twitter.com/S1hLwjC6z2 — kshetradarshan (@kshetradarshan) September 29, 2023 ఇదిలా ఉండగా.. తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై విధించిన ఆంక్షలను టీటీడీ సడలించింది. టీటీడీ అటవీశాఖతో అధికారులతోపాటు రాష్ట్ర అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతంలో 6 చిరుతలను బంధించడంతో పాటు వారం రోజుల పాటు పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎలాంటి ముప్పు లేదని నిర్థారించారు. దీంతో శుక్రవారం నుంచి ఘాట్ రోడ్లలో రాత్రి 10 గంటల వరకు ద్విచక్ర వాహనాలను అనుమతించనున్నారు. అలిపిరి కాలినడక మార్గంలో చిరుతల సంచారం నేపథ్యంలో భక్తుల భద్రత దృష్ట్యా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ నిలిపివేసిన విషయం తెలిసిందే. -
మంత్రాలయంలో వెలవెలబోతున్న తుంగభద్ర
సాక్షి, కర్నూలు: మంత్రాలయంలో తుంగభద్ర నది వెలవెలబోతుంది. నీళ్లు లేక భక్తులు స్నానాలకు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీమఠం అధికారులు తూతూ మంత్రంగా షవర్లు ఏర్పాటు చేశారు. మురుగునీటితో నిండిన తుంగభద్ర.. దుర్వాసన వెదజల్లుతుంది. కాగా, శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు అంగరవైభవంగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తజనం విశ్వమోహనుడిని దర్శించుకుంటున్నారు. బుధవారం శ్రీమఠంలో పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆశీస్సులతో వేకువజాము నుంచే ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలుత రాఘవేంద్రుల మూల బృందావనికి నిర్మల్య విసర్జన, జల, పుష్ప, పంచామృతాభిషేకాలు చేశారు. స్వామి బృందావనాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే రాఘవేంద్రుల బృందావన ప్రతిమను బంగారు పల్లకీలో ఊరేగించారు. పూజామందిరంలో స్వామిజీ మూలరామ, వేదవ్యాసుల పూజోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. చదవండి: మాట ఇచ్చారు.. వెంటనే ఆదుకున్నారు -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తున్న భక్తులకు గమనిక. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం ఉదయానికి 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. వివరాల ప్రకారం.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనానికి 15 గంటల సమయంలో పడుతోంది. అలాగే, ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. ఇక, నిన్న(మంగళవారం) శ్రీవారిని 78,726 మంది భక్తులు శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో శ్రీవారి హుండీకి రూ.3.94 కోట్ల ఆదాయం వచ్చింది. 26,436 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక, ఈనెల 21న గరుడపంచమి సందర్భంగా గరుడ వాహసనసేవ కార్యక్రమం నిర్వహించనుంది టీటీడీ. రాత్రి ఏడు గంటలకు గరుడ వాహనంపై మలయప్పస్వామి దర్శనం ఇవ్వనున్నారు. కాగా, తిరుమల వెళ్లే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. ఆర్టీసీ ప్రయాణికుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం రూ.300 టికెట్ల కోటాను 1000కి పెంచారు. 300 కిలోమీటర్ల దూరానికి పైబడిన నగరాల నుంచి వచ్చే బస్సులకు 80 శాతం టికెట్లు కేటాయించగా, 300 కిలోమీటర్ల లోపు నగరాల నుంచి వచ్చే బస్సులకు 20 శాతం కేటాయించారు. శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను శాసన సభ్యులు ,టీటీడీ చైర్మన్ శ్రీభూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం రాత్రి పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేసి పనుల వేగం పెంచాలని ఆదేశించారు. మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్ శ్రీమతి హరిత శ్రీ కరుణాకర్ రెడ్డి వెంట ఉన్నారు pic.twitter.com/qxhml3olNk — MCT Mayor Dr Sireesha (@mayortpt) August 15, 2023 ప్రయాణంతోపాటు స్వామివారి దర్శనం టికెట్ను నెలరోజులు ముందుగానే బుక్ చేసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈనెల 15వ తేదీ నుంచి అక్టోబరు 7వ తేదీ వరకు ప్రయాణ టికెట్లతోపాటు దర్శన టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చని వివరించారు. తిరుమల వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నవారు అదనపు కోటా టికెట్లను www.apsrtconline.in వెబ్సైట్ ద్వారా పొందవచ్చని సూచించారు. ఇది కూడా చదవండి: సిగ్నల్ లేకపోయినా క్షణాల్లో సమాచారం -
భక్తులకు అలర్ట్.. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటల సమయంలో పడుతోంది. భక్తులు అన్ని కంపార్ట్మెంట్లలో నిండిపోయి ఏటీసీ కౌంటర్ వరకు క్యూలైన్ కొనసాగుతోంది. ఇక, నిన్న(శనివారం) ఒక్కరోజే తిరుమల వెంకటేశ్వర స్వామిని 82,999 మంది భక్తులు దర్శించుకున్నారు. శనివారం 38,875 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. కాగా, శనివారం స్వామి వారి హుండీ ఆదాయం 4.27 కోట్లుగా ఉంది. ఇది కూడా చదవండి: శాకంబరీదేవిగా కనకదుర్గమ్మ -
పూరీ రథయాత్ర ప్రారంభం.. భారీగా భక్తుల రాక
భువనేశ్వర్: దేశంలో ప్రఖ్యాత జగన్నాథుని రథయాత్ర ప్రారంభమైంది. ఇక, రథయాత్ర సందర్భంగా పూరీ నగరం భక్తులతో నిండిపోయింది. రథయాత్రలో పాల్గొనేందుకు ఒడిశాతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో శ్రీక్షేత్రం పరిసరాలతో పాటు అక్కడి వీధులన్నీ కిక్కిరిపోతున్నాయి. ‘జై జగన్నాథ’ నినాదాలతో పూరీ నగరం మార్మోగుతోంది. ఇదిలా ఉండగా, మంగళవారం ఉదయం జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల విగ్రహాలను రథాలపై ప్రతిష్ఠించి తరువాత మంగళహారతి చేపట్టారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పూరీ రాజు గజపతి దివ్యసింగ్దేవ్ రథాలపై చెరాపహర (బంగారు చీపురుతో ఊడ్చడం) చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు భక్తులు రథాలను లాగుతారు. సాయంత్రం రథాలు గుండిచా మందిరానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇక, పూరీ రథయాత్రకు పలువరు ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. #WATCH | A large number of devotees gather in Odisha's Puri for the #JagannathRathYatra_2023 pic.twitter.com/CzRrc3hZHI — ANI (@ANI) June 20, 2023 Puri Ratha Yatra,Odisha 🌅🌺🌺🌺🌺👏👏👏🐚🐚🐚🐚🐚🐚 pic.twitter.com/2K6tOzGmCp — SATYAJIT PRADHAN (@Satyaji56683529) June 20, 2023 ఇది కూడా చదవండి: వీడియో: కేదార్నాథ్ ఆలయ గర్భగుడిలో అపచారం.. మహిళ ఓవరాక్షన్.. శివలింగంపై కరెన్సీ నోట్లు.. -
కోనేటి రాయుడి దర్శనం కోసం భారీగా వస్తున్న భక్తులు
-
భగభగమండే మంటపై బాబా విన్యాసం.. వేడి ఎంతున్నా చల్లని దీవెనలు!
-
వైభవంగా ముఖలింగేశ్వరుని త్రిశూల చక్రతీర్థ స్నానం (ఫొటోలు)
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
-
ఇంద్రకీలాద్రి: భక్తుల కోలాహలం.. దుర్గమ్మకు ఆషాఢం సారె
-
శ్రీవారి దర్శనానికి 6 గంటలు
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా కనిపించింది. మంగళవారం అర్ధరాత్రి వరకు 77,154 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 30,182 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.4.62 కోట్లు వేశారు. ఎటువంటి టోకెన్లు లేకపోయినా శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తున్నారు. స్వామి వారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 12 కంపార్ట్మెంట్లు నిండి ఉన్నాయి. స్వామిని దర్శించుకున్న సినీ నటి రాశీ ఖన్నా తిరుమల శ్రీవారిని బుధవారం సినీ నటి రాశీ ఖన్నా దర్శించుకున్నారు. ఆమెకు ఆలయాధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనాలను, అధికారులు ప్రసాదాలను అందించారు. -
తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ
-
‘యాదాద్రి’లో భక్తుల రద్దీ..
సాక్షి, యాదగిరిగుట్ట (ఆలేరు) : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాల ఆలయంలో స్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఆదివారం విశేషంగా పూజలు జరిపారు. స్వామి అమ్మవార్లకు నిత్యారాధనలతో పాటు వేకువ జామున అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు సుప్రభాతం నిర్వహించిన అనంతరం అర్చకస్వాములు స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయ మహా మండపంలో 108 కలశాలలకు శాస్త్రోక్తంగా శతఘటాభిషేక పూజ చేసి, అందులోని వివిధ ఫల రసములు, పంచామృతాలు, ఫల జలములు, శుద్ధమైన జలంతో స్వామి అమ్మవార్లను అభిషేకించారు. ఈ శతఘటాభిషేకంలో ఆలయ ఈఓ గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, స్థానాచార్యులు, ప్రధాన అర్చకులు, వేదపండితులు, ఆలయ అధికారులు, ఆచార్యులు పాల్గొన్నారు. అదే విధంగా నిత్య పూజలు కూడా ఘనంగా నిర్వహించారు. కలశాన్ని ఊరేగిస్తున్న ఆచార్యులు, ఈఓ గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి శ్రీస్వామి వారి ఆదాయం రూ.6,56,449 భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకోవడంతో ఆలయానికి రూ.6,56,449 ఆదాయం చేకూరిందని అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.1,000, ప్రచార శాఖ ద్వారా రూ.4,150, ప్రసాద విక్రయం ద్వారా రూ.5,31,845, శాశ్వత పూజల ద్వారా రూ.35,848, చెక్పోస్టు ద్వారా రూ.2,170, మినీ బస్సు ద్వారా రూ.2,510, వాహన పూజల ద్వారా రూ.17,200, అన్నధాన విరాళం ద్వారా రూ.6,616, కొబ్బరికాయల ద్వారా రూ.54,570 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. పూజలు చేస్తున్న ఎర్రోళ్ల శ్రీనివాస్, నాయకులు స్వామివారిని దర్శించుకున్న ఎర్రోళ్ల శ్రీనివాస్ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆదివారం సందర్శించారు. బాల ఆలయంలో ప్రతిష్ఠామూర్తులను దర్శించుకున్న ఆయనకు ఆలయ అచార్యులు స్వామి అమ్మవార్ల ఆశీస్సులను అందజేశారు. అనంతరం ప్రధాన ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించారు. తదనంతరం యాదగిరిగుట్ట మున్సిపాలిటి కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్ను శాలువాతో సన్మానించారు. నృసింహుడి సన్నిధిలో భక్తుల రద్దీ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. ఆదివారంస్వామి వారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో బాల ఆలయం, ప్రసాదం కౌంటర్, ఆలయ పరిసరాలు, పుష్కరిణి వద్ద, ఘాట్ రోడ్లలోని పార్క్లు భక్తులతో కోలాహలంగా కనిపించాయి. స్వామి వారిని సుమారు 5,500 నుంచి 6వేల వరకు భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గర్భాలయ గోడకు శ్రీలక్ష్మీనరసింహస్వామి రూపాలు అద్భుత శిల్పాలు.. ఆధ్యాత్మిక రూపాలు యాదగిరిగుట్ట (ఆలేరు): యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఆలయమంతా ఆధ్యాత్మిక రూపాలను శిల్పులు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధాన ఆలయంలో నారసింహ రూపాలు, దశవతారాలు, సుదర్శన ఆళ్వార్, శంకు, చక్ర, నామాలు, వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన ఆధ్యాత్మిక రూపాలను శిల్పులు చెక్కి, వాటిని తుది మెరుగులు దిద్దారు. ప్రధాన ఆలయంలో భక్తులకు పునర్ దర్శనం ప్రారంభం కాగానే వారిని ఆధ్యాత్మిక చింతనలోకి తీసుకెళ్లే విధంగా ఈ రూపాలను తీర్చిదిద్దుతున్నారు. ఇటీవల యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ ఈ ఆధ్యాత్మిక రూపాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కృష్ణశిల రాతి గోడపై తీర్చిదిద్దిన సుదర్శన ఆళ్వార్ రూపం -
తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు
సాక్షి, తిరుమల : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తులె పోటెత్తుతున్నారు. కాగా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి కోసం టీటీడీ ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేసింది. వైకుంఠం కాంప్లెక్స్, నారాయణగిరి ఉద్యానవనం సహా నాలుగు మాడ వీదుల్లో 90 వేలకు పైగా భక్తులు వేచి ఉన్నారు. సోమవారం తెల్లవారుజాము 2గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని టీటీడీ తెలిపింది. ఈ సందర్భంగా వీవీఐపీల దర్శనానంతరం సామాన్య భక్తులకు అనుమతించనున్నారు. ధనుర్మాసకైంకర్యాల అనంతరం తెరుచుకోనున్న వైకుంఠ ద్వారాలు ఈ నెల 8వరకు అదే ద్వారా గుండా భక్తులను అనుమతించనున్నారు. కాగా స్వామి వారి సర్వదర్శనం మినహా అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. అలాగే సోమవారం స్వామివారిని స్వర్ణ రథంపై తిరువీధుల్లో తిప్పనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో టీటీడీ పాలక మండలి సమావేమయి వైకుంఠ ద్వారాలు ఎన్ని రోజులు తెరిచి ఉంచాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే ఉచిత లడ్డూ ప్రసాదంపై కూడా పాలకమండలి నిర్ణయం తీసుకోనుంది. -
రాజన్న సన్నిధిలో అపరిశుభ్రత
సాక్షి, వేములవాడ : కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్న వేములవాడ రాజన్న గుడి వద్ద అపరిశుభ్రం రాజ్యమేలుతోంది. ఏటా లక్షలాది భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్న ఈ క్షేత్రంలో పారిశుధ్యం పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ చూసినా చెత్తకుప్పలు, భక్తులు పడేసిన విస్తర్లు, చెత్త, ప్లాస్టిక్ కవర్లు కనిపిస్తున్నాయి. రద్దీ సమయంలో ఇంకా చెత్త పెరిగిపోయి పారిశుధ్యం లోపించి దుర్వాసన వెదజల్లుతోందని భక్తులు మొత్తుకుంటున్నారు. చెత్త కుప్పలు.. మలినాలు రాజన్న ఆలయ ఆవరణతోపాటు క్యూలైన్ల వెంట చెత్తకుప్పలు, మలినాలు దర్శనమిస్తున్నాయి. ఇక క్యూలైన్లలోని మరుగుదొడ్ల వద్ద ముక్కులు మూసుకునే దుస్థితి నెలకొంది. ప్రధానాలయం ముందు భాగంలో చెత్త కుప్పలు అలాగే పడి ఉంటున్నాయి. రాజగోపురం వద్ద ప్లాస్టిక్ కవర్లు, చెత్త దర్శనమిస్తోంది. ధర్మగుండం వద్ద పారిశుధ్యం లోపించి దుర్వాసన వెదజల్లుతోంది. కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా.. ఏటా పారిశుధ్యం నిర్వహణకు ఆలయం నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా భక్తులకు మాత్రం స్వచ్ఛమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంలో ఆలయ అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమవుతుందన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. -
తిరుమలకు పోటెత్తిన భక్తులు
సాక్షి, తిరుమల : తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ అమాంతం పెరిగింది. శ్రీవారి దర్శనానికి 26 కంపార్టుమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు. సర్వదర్శనానికి 16 గంటలు, కాలిబాట దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు సమయం పడుతుంది. సర్వదర్శనం స్లాట్కి 4 గంటలు సమయం పడుతోంది. కాగా, గురువారం హనుమాన్ జయంతిని పురష్కరించుకుని తిరుమలలోని ఆంజనేయ స్వామి ఆలయాల్లో టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. -
రంగనాథ స్వామి ఆలయంలో భక్తుల ఆగ్రహం
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ వైష్ణవాలయాల్లో భక్తులు స్వామివారిని వైకుంఠ ద్వారంగుండా దర్శించుకుంటున్నారు. ద్వారకా తిరుమల, అన్నవరం, నెల్లూరు, పెంచలకోన, కడప గడపల్లో స్వామివారు తెల్లవారుజామునుంచే ఉత్తర ద్వారంలో వేంచేసి భక్తులను అనుగ్రహిస్తున్నారు. నెల్లూరులోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయంలో ఏర్పాట్ల పై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దర్శనానికి గంటలకొద్దీ నిరీక్షించాల్సి వస్తోందని, వీఐపీ టిక్కెట్లు అధికంగా విక్రయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాపూరు మండలం పెంచలకోన ఆలయానికి భక్తులు తరలివచ్చారు. బోగోలు మండలం బిలకూట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. పశ్చిమగోదావరిజిల్లా ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామిని తెల్లవారుజాము నుంచే భక్తులు ఉత్తర ద్వారదర్శనం చేసుకుంటున్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారుల తీరి ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ రమాసహిత సత్యనారాయణస్వామి భక్తులకు ఉత్తర ద్వార ముఖంగా దర్శనం ఇస్తున్నారు. అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనారసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గుంటూరుజిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనారసింహస్వామి(పానకాల స్వామి) ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందడి నెలకొంది. తెల్లవారు జామున 3 గంటల నుంచే వైకుంఠ ఉత్తర ద్వారంలో స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. బంగారు శంఖు తీర్దం కోసం భక్తులు బారులు తీరారు. వైఎస్సార్జిల్లా ఒంటిమిట్టలోని రామాలయంలో ముక్కోటి ఏకాదశి ఘనంగా నిర్వహిస్తున్నారు. గరుడ వాహనంపై కోదండరాముడు ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. -
శ్రీవారి దర్శనానికి 23 గంటలు
తిరుమల: వరుస సెలవుల నేపథ్యంలో ఆదివారం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. చంటిబిడ్డల తల్లిదండ్రులు, ఆర్జిత సేవలు అనుమతించే సుపథం క్యూలో తోపులాట జరిగింది. సాధారణంగా ఉదయం 10 గంటల నుంచి ఈ మార్గంలో కల్యాణోత్సవం, ఇతర ఆర్జిత సేవల భక్తులను అనుమతిస్తారు. వీరితోపాటు ఏడాది లోపున్న చంటి బిడ్డలతో వారి తల్లిదండ్రులు కూడా కలసిపోయారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్లోకి వెళ్లేందుకు చొరబడ్డారు. దీంతో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వారి మధ్య తోపులాట జరిగింది. పెరిగిన రద్దీ వల్ల వృద్ధుల క్యూ భారీగా విస్తరించింది. సాయంత్రానికి సర్వదర్శనం కోసం మొత్తం 31 కంపార్ట్మెంట్లు నిండి వెలుపల సుమారు కిలోమీటరు వరకు వేచి ఉన్న భక్తులకు 23 గంటలు, కాలిబాట మార్గాల్లో వచ్చిన వారికి 12 గంటల తర్వాత దర్శనం లభించనుంది. రద్దీ పెరగటంతో రూ. 300 టికెట్ల దర్శన క్యూను ఉదయం 12 గంటలకే నిలిపివేశారు. అప్పటికే క్యూలో ఉన్న భక్తులకు 7 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభించింది. శనివారం భక్తులు హుం డీలో వేసిన కానుకలను ఆదివారం లెక్కిం చగా రూ. 3.20 కోట్లు లభించింది.