![Devotees Who Fell To Tirumala - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2018/05/9/tirumala.jpg.webp?itok=h5DPKuOe)
సాక్షి, తిరుమల : తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ అమాంతం పెరిగింది. శ్రీవారి దర్శనానికి 26 కంపార్టుమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు. సర్వదర్శనానికి 16 గంటలు, కాలిబాట దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు సమయం పడుతుంది. సర్వదర్శనం స్లాట్కి 4 గంటలు సమయం పడుతోంది. కాగా, గురువారం హనుమాన్ జయంతిని పురష్కరించుకుని తిరుమలలోని ఆంజనేయ స్వామి ఆలయాల్లో టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.