తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం అధికంగా ఉంది.
తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం అధికంగా ఉంది. శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చన భక్తులతో 28 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. శనివారం స్వామివారిని 89,260 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్క రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.52 కోట్లు అని వారు పేర్కొన్నారు.