కరీంనగర్ : కరీంనగర్ జిల్లా వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం నుంచి ఇరుగుపొరుగు జిల్లాల నుంచి వచ్చిన భక్తులతో ఈ ఆధ్యాత్మిక క్షేత్రం కిటకిటలాడుతోంది. దీంతోపాటు స్థానికంగా ఉన్న బద్దిపోచమ్మ ఆలయం వద్ద కూడా భక్తజన సందోహం కనిపించింది.