
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి వెలుపల వరకు బారులు తీరారు. శ్రీవారి సర్వ దర్శనానికి 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. నిన్న(శనివారం) స్వామివారిని 81,555 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.