తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఏడుకొండలపై కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండి బయట వరకు భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వ దర్శనానికి 14 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.