తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి ఆదివారం భక్తులు పోటెత్తారు.
యాదగిరిగుట్ట (నల్లగొండ) : తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి ఆదివారం భక్తులు పోటెత్తారు. శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఆలయ అధికారులు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని గుట్టపైకి వాహనాలను అనుమతించడం లేదు.