yadadri
-
యాదాద్రిలో స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి (ఫోటోలు)
-
యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు ఆర్డినెన్స్?
సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు (వైటీడీబీ) ఏర్పాటుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తేనుంది. గత నెల సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైటీడీబీ ఏర్పాటుపై చర్చించారు. ఈ నెల 12వ తేదీలోగా వైటీడీబీని ఏర్పాటు చేస్తూ ప్రభు త్వం ఆర్డినెన్స్ తేవాల్సి ఉండగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ (Election Code) అమలులోకి వచ్చింది. దీంతో కోడ్ ముగిసిన తర్వాత ఆర్డినెన్స్ను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆర్డినెన్స్ను ఆరు నెలల్లోపు ఆమోదించాల్సి ఉంటుంది కాబట్టి ఈ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంది.చైర్మన్, పాలకవర్గం నియామకం యాదగిరిగుట్ట (yadagirigutta) దేవస్థానం బోర్డుకు చైర్మన్తోపాటు పాలకవర్గం సభ్యులు 11 మందిని నామినేట్ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. వీరికి తోడు ఆరుగురు ఎక్స్అఫీషియో సభ్యులను నియమిస్తారు. ప్రస్తుతం ఉన్న వంశపారంపర్య ధర్మకర్త దేవస్థానం పాలకవర్గంలో సభ్యుడిగా ఉంటారు. కాగా, సీఎం చైర్మన్గా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ(వైటీడీఏ) మొత్తం నూతనంగా వచ్చే వైటీడీబీ పరిధిలోకి రానుంది. దేవస్థానం పరిపాలన వ్యవహారాలు, ఉద్యోగుల బదిలీలు, భక్తుల వసతులు, దేవస్థానం అభివృద్ధి పనులను వైటీడీబీ పర్యవేక్షణలోకి తేనున్నారు. స్వాగత తోరణానికి రంగులు యాదగిరిగుట్ట దేవస్థానం స్వాగత తోరణానికి రంగులు వేయాలని సీఎం రేవంత్రెడ్డి దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. కొండపైన భక్తులకు స్వాగతం పలికే తోరణాన్ని సిమెంట్తో నిర్మించారు. నవంబర్లో సీఎం యాదగిరిగుట్టకు వచ్చిన సమయంలో తోరణం నిర్మాణ శైలి వివరాలను తెలుసుకున్నారు. గత నెలలో జరిగిన సమీక్షా సమావేశంలో స్వాగత తోరణానికి ఆకర్షణీయమైన రంగులు వేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు పనులు ప్రారంభించారు.చదవండి: అయ్యో దేవుడా.. ఎందుకు ఇలా చేశావ్? యాగశాల ఏర్పాటుకు మార్కింగ్యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 23న నిర్వహించనున్న మహాకుంభ సంప్రోక్షణకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా యాగశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. సోమవారం ఆలయ ఉత్తర మాడ వీధిలో మార్కింగ్ చేశారు. 32 ఫీట్ల వెడల్పు, 32 ఫీట్ల పొడవుతో యాగశాలను నిర్మాణం చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
యాదాద్రి భువనగిరి జిల్లా: మహారాష్ట్రలోని షిరిడి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident)లో నలుగురు దుర్మరణం చెందారు. గురువారం మధ్యాహ్న ప్రాంతంలో ఈ విషాద ఘటన(Accident) చోటు చేసుకుంది. ప్రమాదంలో నలుగురు అక్కడకక్కడే మృతి చెందగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఆరు నెలల చిన్నారి ఉంది. ఈ ఘటనలో మృతిచెందిన వారంత యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప(Konda gadapa) వాస్తవ్యులుగా గుర్తించారు.వీరంతా రెండు రోజుల క్రితం షిరిడి పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. మృతలంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ రోడ్డు ప్రమాదంలో ప్రేమలత(59, వైద్విక్ నందన్(6 నెలలు), అక్షిత(20), ప్రసన్న లక్ష్మీ(45)లు మృతిచెందారు. -
యాదగిరిగుట్టలో బైక్పై వెళ్తున్న భక్తుడికి తగిలిన మాంజా దారం
-
ముక్కోటికి భద్రగిరి ముస్తాబు
భద్రాచలం: భూలోక వైకుంఠంగా భక్తులు భావించే భద్రగిరి.. ముక్కోటి ఏకాదశికి ముస్తాబవుతోంది. భద్రుడి తపస్సుతో వైకుంఠం నుంచి సరాసరి సాక్షాత్కరించి దర్శనమిచ్చిన శ్రీ మహావిష్ణువు అవతార రూపమే భద్రాచలం రామయ్యగా ప్రతీతి. నాలుగు చేతుల్లో ఆయుధాలు, సీతమ్మతోపాటు సోదరుడైన లక్ష్మణుడితో శ్రీరాముడు దర్శనమివ్వడం ఇక్కడి విశిష్టత. 10న ఉత్తర ద్వార దర్శనం.. వేడుకల్లో భాగంగా ఈ నెల 9వ తేదీ సాయంత్రం పవిత్ర గోదావరి నదిలో హంస వాహనంపై శ్రీ సీతారామచంద్రస్వామి జలవిహారం చేస్తారు. 10వ తేదీ తెల్లవారుజామున ఉత్తర ద్వారంలో దర్శనమిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. స్వామి వారు జలవిహారం చేసే హంస వాహనాన్ని ఇప్పటికే సిద్ధం చేయగా, విద్యుత్ దీపాల పనులు పూర్తి కావాల్సి ఉంది. హంస వాహనానికి గోదావరిలో ట్రయల్ రన్ సైతం పూర్తయ్యింది. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం, దీనికి అనుబంధంగా ఉన్న పర్ణశాల ఆలయాలకు రంగులు వేసి, విద్యుత్ దీపాలతో అలంకరించారు. ముక్కోటి వేడుకలు జరిగే ఉత్తర ద్వారానికి మరమ్మతులు నిర్వహించి పంచరంగులు వేశారు. గోదావరి తీరంతోపాటు పలుచోట్ల భక్తుల కోసం తాత్కాలిక మరుగుదొడ్లు, స్నానాల గదులను సిద్ధం చేస్తున్నారు. ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంచగా, భక్తులు కొనుగోలు చేస్తున్నారు. భద్రగిరికే ప్రత్యేకం.. భద్రాచలంలో ముక్కోటి పర్వదినం రోజున రామయ్యను దర్శించుకుంటే ముక్కోటి దేవతలను దర్శించుకున్నంత పుణ్యం దక్కుతుందని భక్తుల నమ్మకం. ఇదేరోజున వైకుంఠంలో స్వామివారిని ముక్కోటి దేవతలు దర్శించుకుంటారని, వైకుంఠం నుంచి సరాసరి భద్రిగిరిపై ప్రత్యక్షమైన స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగి.. వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని వేద పండితులు చెబుతున్నారు. ఉత్తర ద్వార దర్శనానికి ముందురోజు సాయంత్రం గోదావరిలో జరిగే స్వామివారి తెప్పోత్సవాన్ని వీక్షించాలన్నా భద్రాచలం రావాల్సిందే. మిరుమిట్లు గొలిపే విద్యుత్దీపాల వెలుగులు, భక్తుల శ్రీరామ నామస్మరణల నడుమ సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్య హంస వాహనంలో ‘లాహిరి లాహిరి..లాహిరిలో’అంటూ జలవిహారం చేసే అద్భుత దృశ్యాలు భద్రాచలంలో మాత్రమే ప్రత్యేకం. -
యాదాద్రి బ్రహ్మోత్సవాలకు వేళాయె..
సాక్షి, యాదాద్రి: వచ్చే ఏడాది మార్చిలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లు ప్రారంభించింది. మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో దేశ విదేశాలతో పాటు స్థానిక భక్తులను మమేకం చేయనున్నారు. బ్రహ్మోత్సవాలకు తలమానికంగా ఉండేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. స్వస్తివచనంతో ప్రారంభం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి వార్షిక బ్రహ్సోత్సవాలు మార్చి 1న స్వస్తి వచనంతో ప్రారంభమై.. డోలోత్సవంతో ముగుస్తాయి. ఈ సందర్భంగా సాహితీ, సాంస్కృతిక, ధార్మిక సభా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. 7న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎదుర్కోలు, 8న స్వామి అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం, 9న దివ్యవిమాన రథోత్సవం, 10న పూర్ణాహుతి, చక్రతీర్థం, దోపు ఉత్సవం, 11న శతఘటాభిõÙకం, డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. గ్రామోత్సవం పేరుతో రథోత్సవం యాదగిరిగుట్ట, పరిసర ప్రాంత భక్తుల కోసం గ్రామోత్సవం పేరుతో కొండ కింద ప్రత్యేక రథోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా కొండపైన జరిగే రథోత్సవం అనంతరం కొండ కింద భక్తుల కోసం ప్రత్యేక రథోత్సవం నిర్వహించడానికి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. సాంస్కృతిక కార్యక్రమాలు బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులను అలరించేలా సాంస్కృతిక, సాహితీ, సంగీత, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. ఈ విషయంలో దేవస్థానం ఈవో ఎ.భాస్కర్రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మూడు రోజుల పాటు మహాసహస్ర అవధాని పద్మశ్రీ గరికపాటి నర్సింహారావు ప్రవచనాలు వినిపించనున్నారు. మార్చి 6న సంగీత దర్శకుడు మాధవపెద్డి సురేశ్ సంగీత విభావరి ఏర్పాటు చేశారు. ఆయనతోపాటు తిరుపతి తిరుమల దేవస్థానంలో అన్నమాచార్య కీర్తనలు ఆలపించే ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్తో ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. అంజన్న చరిత్ర గాయని, కరీంనగర్కు చెందిన తేలు విజయతో ఒకరోజు, లిటిల్ మ్యూజీషియన్ నిర్వాహకుడు రామాచారితో ప్రత్యేక విభావరి కార్యక్రమాలు ఉంటాయి. వేగంగా స్వర్ణ కవచం పనులు ఆలయ విమాన గోపురం స్వర్ణకవచం పనులు వేగం పుంజుకున్నాయి. ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి చేయాలన్న సంకల్పంతో దేవస్థానం ఉంది. ఈ మేరకు 60 కిలోల బంగారాన్ని వినియోగిస్తున్నారు. భక్తులు ఇచ్చిన విరాళాలు, దేవస్థానం వద్ద ఉన్న బంగారం, వెండితో స్వర్ణతాపడం పనులు కొనసాగుతున్నాయి. 10,500 చదరపు అడుగుల మేరకు చేయాల్సిన స్వర్ణ తాపడం పనులు సగం వరకు పూర్తి కావొచ్చాయి.కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలుకనీవిని ఎరుగని రీతిలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రధానంగా లబ్ధప్రతిష్టులైన కళాకారులతో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక అలంకారంగా ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నాం. ఇప్పటికే గరికపాటి, మాధవపెద్ది సురేశ్ తదితర ప్రముఖుల సహాయాన్ని తీసుకున్నాం. మరికొందరు ప్రముఖులతో కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. – ఎ.భాస్కర్రావు, ఈవో యాదగిరిగుట్ట దేవస్థానం -
యాదాద్రిలో భారీ అగ్నిప్రమాదం
-
యాదగిరి క్షేత్రానికి పెరిగిన భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో జంట నగరాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో వస్తున్నారు.దీంతో శ్రీ స్వామివారి ధర్మ దర్శనానికి రెండున్నర గంటలు పడుతుండగా.. రూ. 150 టిక్కెటగ విఐపి దర్శనానికి 45 నిమిషాల మేర టైం పడుతున్నట్లు భక్తులు చెబుతున్నారు. భక్తులు అధికంగా శ్రీ స్వామివారి సుదర్శన నారసింహ హోమం, నిత్య కళ్యాణం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో పాల్గొంటున్నారు. కొండపైనే ఉన్న శ్రీ పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. -
ఐదుగురి ప్రాణాలు తీసిన.. నైట్ అవుట్ సరదా
-
చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు మృతి
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అధిక వేగంలో ఉన్న కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమం ఉన్నట్టు తెలుస్తోంది. కారు ప్రమాదానికి గురైన సమయంలో ఆరుగురు ఉన్నట్టు సమాచారం. మృతులను హైదరాబాద్కు చెందిన వంశీగౌడ్, దినేష్, బాలు, హర్షబాబు, వినయ్గా గుర్తించారు. ప్రమాదం నుంచి మణికంఠ ఒక్కడే బయట పడ్డారు. ఈ ఘటనపై చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. యువకులందరూ మద్యం సేవించినట్టు చెప్పారు. రాత్రంతా పార్టీ చేసుకుని.. కారు నడిపినట్టు తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడిన మణికంఠకు బ్రీత్ అనలైజర్ టెస్టు చేయగా మద్యం సేవించినట్టు వెల్లడైంది. 57 పాయింట్స్ చూపించినట్టు చెప్పుకొచ్చారు. -
యాదాద్రి పేరు మార్పు..రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
-
కృష్ణాతీరంలో జెన్కో టౌన్షిప్
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో కృష్ణానది వెంట కొత్త పట్టణం నిర్మాణం కానున్నది. దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం సమీపంలో రూ.928.52 కోట్ల అంచనాతో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు బిడ్లను స్వీకరిస్తారు. టెక్నికల్ బిడ్లను వచ్చే నెల 3న, ప్రైస్ బిడ్లను 7న తెరిచి టెండర్లను ఖరారు చేయనున్నారు. సంగమ క్షేత్రంలో కొత్త పట్టణం కృష్ణా నదిలో తుంగపాడు వాగు కలిసే చోట ఈ టౌన్షిప్ను నిర్మించాలని నిర్ణయించారు. డిజై న్లు, డ్రాయింగ్స్ ప్రకారం మొత్తం 3,52,771.02 చ.మీ.ల విస్తీర్ణంలో టౌన్íÙప్ నిర్మాణం జరుగుతుంది. 2,21,903.67 చ.మీ.ల విస్తీర్ణంలో నివా స గృహసముదాయాలతో లేఅవుట్ను తయా రు చేశారు. 75,185 చ.మీ.ల విస్తీర్ణంలో పార్కు లు, మొక్కల పెంపకం, పచ్చిక బయళ్లు, మరో 55,682.35 చ.మీ.ల విస్తీర్ణంలో రోడ్లు, ఇతర సదుపాయాలు ఏర్పాటుచేస్తారు.2025 మార్చి నాటికి 4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నది. వేల సంఖ్యలో ఇంజనీరింగ్ అధికారులు, ఉద్యోగులు, ఇతర కార్మి కులు ఇక్కడ రాత్రింబవళ్లు పనిచేయనున్నారు. వీరంతా తప్పనిసరిగా స్థానికంగా నివాసం ఉండాల్సి రావడంతో టౌన్షిప్ను జెన్కో నిర్మిస్తోంది. ఉన్నతాధికారుల కోసం ‘ఏ’–టైప్లో రెండు ఇండిపెండెంట్ క్వార్టర్లను, ‘బీ’–టైప్లో 6 ఇండిపెండెంట్ క్వార్టర్లను నిర్మిస్తున్నారు. అధికారులకు ‘డీ’, ‘ఈ’టైప్ క్వా ర్టర్లను, కార్మి కులకు ‘ఎఫ్’టైప్ క్వార్టర్లను కేటాయిస్తారు. ఈ భవనాలు 11 అంతస్తుల ఎత్తు ఉంటాయి. డీ, ఈ–టైప్ క్వార్టర్ల కోసం రెండు భవనాలు ఉంటాయి. వీటిల్లో 360 చొప్పున ఫ్లాట్లు ఉంటాయి. ఎఫ్–టైప్ క్వార్టర్లలో 1,350 ఫ్లాట్లు కలిపి మొత్తం 2,970 ఫ్లాట్లను నిర్మించనున్నారు. సకల సదుపాయాలు టౌన్షిప్లో ఉద్యోగులకు సకల సదుపాయాలు కల్పిస్తారు. అగ్నిమాపక కేంద్రం, ఆస్పత్రి, పాఠశాల భవనాలు, క్లబ్ హౌస్, కమర్షియల్ కాంప్లెక్స్, ఇండోర్ స్టేడియం, మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, సెక్యూరిటీ రూమ్స్, మెయింటెనెన్స్ ఆఫీస్, రోడ్లు, డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ పోర్టబుల్ వాటర్ ట్యాంక్స్, ఓవర్ హెడ్ స్టోరేజీ రిజర్వాయర్స్, సెప్టిక్ ట్యాంక్స్, పార్కింగ్ షెడ్స్, పచ్చదనం, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ, తుంగపాడు వాగుపై బ్రిడ్జీ, కాంపౌండ్ వాల్, టౌన్షిప్కు అప్రోచ్ రోడ్డును ఈ ప్రాజెక్టులో భాగంగా జెన్కో నిర్మిస్తోంది. టౌన్షిప్ నుంచి విడుదలయ్యే మురుగునీటిని శుద్ధి చేయడానికి రోజుకు 1,000 కిలో లీటర్ల శుద్ధి సామర్థ్యంతో సీవరేజీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)ను సైతం నిర్మిస్తోంది. కాంట్రాక్టర్కు పనులను అప్పగించిన తర్వాత 30 నెలల్లోగా ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంటుందని టెండర్ నోటిఫికేషన్లో జెన్కో తెలిపింది. -
యాదాద్రిలో కార్తీక మాసోత్సవాలు.. ప్రతిరోజూ సత్యనారాయణస్వామి వ్రతాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో వచ్చే నెల 2వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో భాస్కర్రావు తెలిపారు. మంగళవారం యాదాద్రి ఆలయ సన్నిధిలోని తన చాంబర్లో ఆయన మాట్లాడారు. కార్తీక మాసం సందర్భంగా యాదాద్రి క్షేత్రానికి భక్తులు అధికంగా రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. శ్రీస్వామిని దర్శించుకోవడంతో పాటు ఆలయంలో శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందని, ఈమేరకు కొండ కింద వ్రత మండపంలో డిసెంబర్ 1వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆరు బ్యాచ్లుగా వ్రతాల నిర్వహణ ఉంటుందన్నారు.వచ్చే నెల 15వ తేదీన ఉదయం 5.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 8 బ్యాచ్లుగా వ్రతాలు నిర్వహిస్తామని చెప్పారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలో నెల రోజులపాటు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 5 బ్యాచ్లు, కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు 6 బ్యాచ్లుగా వ్రతాలు జరుగుతాయన్నారు. అదేవిధంగా 15వ తేదీన ప్రధానాలయం, శివాలయంలో రాత్రి 6.30 గంటలకు ఆకాశ దీపారాధన ఉంటుందని తెలిపారు. చదవండి: పోటెత్తిన రద్దీ.. దీపావళికి సొంతూరి బాటలో జనంఈ నెల 31న దీపావళిని పురస్కరించుకుని ఆలయ నిత్య కైంకర్య వేళల్లో మార్పులు చేశామని చెప్పారు. వేకువజామున 3.30 గంటలకు సుప్రభాతం ప్రారంభమవుతుందన్నారు. 4.15 గంటల నుంచి 4.45 వరకు శ్రీస్వామి అమ్మవార్లకు మంగళహారతుల పూజ జరుగుతుందని, ఉదయం 8.15 గంటల నుంచి సర్వ దర్శనాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. -
గత ప్రభుత్వంలో స్కాములు తప్ప అభివృద్ధి లేదు
లింగోజిగూడ: గత ప్రభుత్వ పాలనలో స్కాము లు తప్ప అభివృద్ధి జరగలేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం మదర్ డెయిరీ ఎన్నికల్లో ఆరు డైరెక్టర్ పోస్టులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న నేపథ్యంలో శనివారం నూతన చైర్మన్ ఎన్నిక కార్యక్రమాన్ని హయత్నగర్ మదర్ డెయిరీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నూతన చైర్మన్గా ఎన్నికైన గుడిపాటి మధుసూదన్రెడ్డితో పాటు గెలుపొందిన డైరెక్టర్లకు ధ్రువపత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి హరీశ్రావు బినామీల పేరుతో మోసాలకు పాల్పడ్డారని, యాదగిరిగుట్ట, వేములవాడ దేవస్థానాలలో లడ్డూల తయారీకి హరీశ్రావు తన బినామీ కంపెనీల ద్వారా నెయ్యి సరఫరా చేశారని ఆరోపించారు. ఇక నుంచి దేవాలయాలకు అవసరమైన నెయ్యి, పాలను మదర్ డెయిరీ నుంచే కొనుగోలు చేయాలని మంత్రి కొండా సురేఖను కోరతానని ఆయన తెలిపారు. -
రెండు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
శంషాబాద్/ఆత్మకూర్: రంగారెడ్డి, గద్వాల జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. కుటుంబ సమేతంగా దైవదర్శనం చేసుకొని తిరుగు ప్రయాణమైన వారిని కారు రూపంలో మృత్యువు వెంటాడింది. హైదరాబాద్లోని చిన్నగోల్కొండ ఫ్లైఓవర్పై గురువారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో డ్రైవర్సహా ముగ్గురు దుర్మరణం చెందారు. స్థానికుల వివరాల మేరకు.. వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రానికి చెందిన తెలుగు రాజేష్ కుటుంబసభ్యులు ప్రతి ఏడాది శ్రావణమాసం రెండవ గురువారం యాదాద్రి దర్శనానికి వెళతారు. ఈ ఏడాది కూడా యాదాద్రి దర్శనానికి బుధవారం రాజేష్ కుటుంబసభ్యులతో పాటు కర్నూల్కు చెందిన అత్తమామలతో కలిపి మొత్తం 19 మంది రెండు వాహనాల్లో బయలుదేరారు. గురువారం ఉదయం 11 గంటలకు దైవదర్శనం చేసుకొని..మధ్యాహ్నం 3 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఓ కారు ముందుగా ఓ కారును ఢీకొట్టి..ఆపై పక్కనే ఉన్న తుఫాన్ వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో పల్టీ లు కొట్టింది. తుఫాన్ వాహనంలో మొత్తం 12 మంది ప్రయాణిస్తుండగా.. డ్రైవర్ తాజుద్దీన్ (40)తో పాటు రాజేష్ భార్య సోదరి వరలక్ష్మి (44), ఆమె మనవడు 2 నెలల బాబు అక్కడికక్కడే మృతిచెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. మరో బాలిక సాయిదీక్షిత (13) కోమాలోకి వెళ్లింది. చంద్రశేఖర్, మణెమ్మ, అర్చనలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం శంషాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరి మృతితో ఆత్మకూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కరీంనగర్ నుంచి వచ్చిన ఆ కారుతోనే.. ప్రమాదానికి కారణమైన కారులో ఆరుగురు ఉన్నారు. విదేశాలకు వెళుతున్న వారికి సెండాఫ్ ఇవ్వడానికి ఆరుగురు ఆ కారులో కరీంనగర్కు వచ్చి వస్తున్నారు. వారిలో ముగ్గురు మద్యం సేవించినట్టు పోలీసుల పరీక్షలో తేలింది. కారులో ఉన్న వారిలో నలుగురికి స్వల్పగాయాలు అయ్యాయి. వీరంతా ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారు. శంషాబాద్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ కారులో ఉన్న వారిని విచారిస్తున్నట్టు తెలిపారు. కళ్ల ముందే.. మా జీపును కారు ఒక్కసారిగా ఢీకొట్టడంతో బోల్తా పడింది. లోపల అందరం చిందరవందర అయ్యాం. కొందరు బయటపడ్డారు. నా కూతురు దీక్షిత తలకు పెద్దదెబ్బ తగిలింది. ఆరు నెలల క్రితమే నా భర్త చనిపోయాడు. ఇప్పుడు బిడ్డ పరిస్థితి ఏమవుతోందో. – నవనీత ఒక్కసారి భయమేసింది ప్రమాదంతో జీపులోపల అందరం ఒకరినొకరం గుద్దుకున్నాం. నాకు తలకు దెబ్బ తగిలింది. చిన్నోడు చనిపోయాడు. మా చెల్లికి దీక్షిత తలకు గాయమైంది. దీంతో నాకు ఒక్కసారిగా భయమేసింది. – సాయిహర్షిత -
సాక్షి టీవీ ఎఫెక్ట్.. ఉరుకొచ్చిన అధికారులు
-
ఆరున్నర లక్షల కరెంటు బిల్లు.. అవాక్కైన ఇంటి యజమాని!
సాక్షి, యాదాద్రి జిల్లా: ఇంట్లో రెండు బల్బులు, రెండు ఫ్యాన్లు ఉన్నప్పుడు, సాధారణంగా కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి. మహా అయితే.. రేయింబవలు వేసిన 400 నుంచి 500 మించి రాదు. మహా అయితే వెయ్యి రూపాయలు వస్తుందేమో. కాకపోతే ఓ ఇంటికి ఎంత బిల్ వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు. మండుటెండలో ఇంటి కరెంట్ బిల్లు చూసిన యజమానికి చెమటలు పట్టడమే కాకుండా.. ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయ్యింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలుగు చూసింది.జిల్లాలోని ఆత్మకూరు(ఎం) మండలం రహీంఖాన్పేట గ్రామానికి చెందిన డీ పరశురాములు ఇంటికి విద్యుత్తు బిల్లు రీడింగ్ తీసేందుకు సోమవారం ట్రాన్స్కో సిబ్బంది వచ్చారు. ప్రతి నెలా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు సబ్సిడీ వర్తించే సర్వీస్ నంబర్.. సోమవారం మీటర్ రీడింగ్ను స్కాన్ చేస్తుండగా ఒక్కసారిగా రూ.6,72,642 బిల్లు వచ్చింది.రీడింగ్ ఒక్కసారిగా 5,40,927 యూనిట్లు వాడినట్టు రావడంతో ఇంటి యాజమాని అవాక్కయ్యాడు. గృహజ్యోతి కింద సబ్సిడీ వస్తున్న విద్యుత్తు బిల్లు ఏకంగా రూ.6,72,642 రావడం ఏంటని ట్రాన్స్కో సిబ్బందిని ప్రశ్నించాడు. ఈ విషయమై ట్రాన్స్కో ఏఈ ప్రభాకర్రెడ్డిని వివరణ కోరగా.. రీడింగ్ తీస్తున్న సమయంలో హై ఓల్టేజ్ వచ్చినట్టయితే రీడింగ్ జంప్ అయ్యి పెద్ద మొత్తంలో బిల్లు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. అధిక బిల్లు వచ్చిన మీటర్ను టెస్టింగ్ కోసం పంపినట్టు ఆయన పేర్కొన్నారు. -
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో భారీ చోరీ
-
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు యువతి దుర్మరణం
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ యువతి మృతిచెందింది. ఈ ఘటన న్యూయార్క్ నగరంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మృతురాలిని యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట సమీపంలోని యాదగిరిపల్లెకు చెందిన గుంటిపల్లి సౌమ్యగా(25) గుర్తించారు.గుంటిపల్లి సౌమ్య ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. అక్కడ అట్లాంటిక్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతోంది. చదువుతోపాటు పార్ట్టైమ్ జాబ్ కూడా చేస్తోంది. ఈ క్రంమలో ఆదివారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అతివేగంగా వచ్చిన కారు ఆమెను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సౌమ్య మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో యాదగిరిపల్లి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
యాదాద్రి ఆలయంలో భక్తులకు ఇబ్బందులు
-
యాదాద్రికి పోటెత్తిన భక్త జనం (ఫోటోలు)
-
రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
యాదాద్రి భువనగిరి, సాక్షి: పది వేల మందిలో ఒకరికి అరుదుగా వచ్చే వ్యాధి అది. నెలలు కూడా నిండని తమ బిడ్డను బతికించుకునేందుకు ఆ తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కోట్లలో ఖరీదు చేసే ఇంజెక్షన్ కోసం సగానికి పైగా సాయం సమకూరగా.. మిగిలిన సాయం అందేలోపే పరిస్థితి విషమించింది. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతంగా ముగిసింది. ఆ తల్లిదండ్రులకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. వలిగొండ మండలం పులిగిల్లకు చెందిన ఆరు నెలల చిన్నారి భవిక్రెడ్డి అరుదైన జెనెటిక్ డిసీజ్ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ(SMA) బాధపడ్డాడు. ఆ పసికందు బతకాలంటే రూ.16 కోట్లు ఇంజెక్షన్ అవసరం. తండ్రి దిలీప్ ఎలక్ట్రిషీయిన్. దీంతో ఖరీదైన చికిత్స ఆ కుటుంబానికి కష్టం తెచ్చి పెట్టింది. అయితే నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి క్రౌడ్ ఫండింగ్ చేపట్టింది. దాని ద్వారా విదేశాల నుంచి రూ.10 కోట్లు సమకూరగా.. మరో ఆరు కోట్ల సాయం కోసం దాతల్ని ఆశ్రయించారు ఆ తల్లిదండ్రులు. సాక్షి సైతం నిన్న(మే 16 గురువారం) ఆ వార్తను ప్రచురించి.. దాతల కోసం పిలుపు ఇచ్చింది. అయితే.. ఇంతలోనే ఆ చిన్నారి ఆరోగ్యం విషమించింది. హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భవిక్ కన్నుమూశాడు. ఖరీదైన ఇంజెక్షన్ కోసం సగం కంటే ఎక్కువ సాయం సమకూరినా.. మిగిలిన సాయం కోసం సమకూరేలోపే ఆ చిన్నారికి నూరేళ్లు నిండిపోయాయి.ఎస్ఎంఏ అంటే స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ. ఈ జన్యులోపం అందరిలో కనిపించదు. తల్లిదండ్రులు క్యారియర్లుగా ఉండి.. పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. మనుషుల్లోని 23 జతల క్రోమోజోములు ఉంటాయి. వీటిల్లో క్రోమోజోమ్ -5లో సర్వైవల్ మోటార్ న్యూరాన్-1(ఎస్ఎంఎన్1) వంటి జన్యువు లోపం ఏర్పడుతుంది. కండరాల స్పందనకు ఈ జన్యువు చాలా కీలకం. ఇది శరీరంలో అవసరమైన ఎస్ఎంఎన్ ప్రొటీన్ తయారు చేయడానికి చాలా అవసరం. మోటార్ న్యూరాన్ కణాలకు ఇది చాలా కీలకం. వాస్తవానికి ఎస్ఎంఎన్-2 రూపంలో శరీరం దీనిని బ్యాకప్ జన్యువు ఉంచుకొన్నా అది ఉత్పత్తి చేసే ఎస్ఎంఎన్ ప్రొటీన్ సరిపోదు. కేవలం 10శాతం మాత్రమే తయారు చేస్తుంది. ఫలితంగా మోటార్ న్యూరాన్ కణాలు బలహీనమైపోతాయి. అమెరికాలో ఏటా ఈ లోపంతో సుమారు 400 మంది పిల్లలు జన్మిస్తారని అంచనా. ఎస్ఎంఏ 1, 2, 3, 4 రకాలు ఉన్నాయి. వీటిల్లో టైప్-1 ప్రమాదకరమైంది.లక్షణాలు..కండరాలు బలహీనంగా ఉండటం మెడపై ఎటువంటి పట్టు లేకపోవడంకూర్చోవడం, నిలబడటం, నడవటం చేయలేరుపాలుతాగడం వంటివి వాటికి కూడా ఇబ్బంది పడతారుఊపిరి తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఎదుర్కొంటారు.చికిత్స ఇలా..ఎస్ఎంఏ-1 చిన్నారులు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. ఒకప్పుడు వీరికి చికిత్స చేయడానికి అవకాశం ఉండేది కాదు. దీంతో వీరి ఆయుర్దాయం దాదాపు రెండేళ్లు మాత్రమే ఉండేది. కానీ, ఇప్పుడు నొవార్టిస్ కంపెనీ ప్రయోగాత్మకంగా ‘జోల్జెన్స్మా’ అనే జన్యు చికిత్స ఇంజెక్షన్ను తయారు చేసింది. ఇది పూర్తిగా తగ్గించకపోయినా.. టైప్ 1 నుంచి వచ్చే ఎన్నో సమస్యల నుంచి బిడ్డ కోలుకొనేట్లు చేస్తుంది. దీని ధర రూ.16 కోట్లు ఉంది. ఇక దీనిని దిగుమతి చేసుకొనేందుకు చెల్లించాల్సిన సుంకాలను కలుపుకొంటే మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఔషధాన్ని అమెరికా నుంచి తరలించడం మొదలైన రోజు నుంచి 14 రోజుల్లోపే వాడుకోవాలి. దీని షెల్ఫ్లైప్ 14 రోజులు మాత్రమే. -
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి గ్రీన్సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ‘తాజా పర్యావరణ అనుమతులు’ జారీ చేయాలని సిఫారసు చేస్తూ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల మదింపు కమిటీ నిర్ణయం తీసుకుంది. 50 శాతం విదేశీ బొగ్గు, మరో 50శాతం స్వదేశీ బొగ్గుతో కలిపి(బ్లెండ్ చేసి) విద్యుదుత్పత్తి జరిపే టెక్నాలజీ ఆధారంగా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మిస్తామని గతంలో జెన్కో ప్రతిపాదించింది.ఈ ప్రతిపాదనల ఆధారంగా 2017 జూలై 25న కేంద్రం ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేసింది. అయితే అనుమతులకు విరుద్ధంగా పూర్తిగా స్వదేశీ బొగ్గు ఆధారంగా విద్యుదుత్పత్తి జరిపే టెక్నాలజీతో యాదాద్రి ప్లాంట్ను జెన్కో నిర్మిస్తోందని కొందరు చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేశారు. టెక్నాలజీ మారడంతో నీటి వినియోగం, బూడిద ఉత్పత్తి పెరుగుతుందని ఆరోపించారు.మారిన టెక్నాలజీకి అనుగుణంగా మళ్లీ పర్యా వరణ అనుమతులు పొందాల్సిందేనని 2022 సెపె్టంబర్లో ఎన్జీటీ తీర్పు ఇవ్వగా, జెన్కోకు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో యాదాద్రి ప్లాంట్పై నీలినీడలు కమ్ముకున్నాయి. మళ్లీ పర్యావరణ అనుమతులు పొందేందుకు జెన్కో విశ్వ ప్రయత్నాలు చేసింది. ఈ నెల 8న సమావేశమైన కేంద్ర పర్యావరణశాఖ నిపుణుల మదింపు కమిటీ ఎట్టకేలకు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేయాలని సిఫారసు చేసింది. కృష్ణానదిని కలుషితం చేయమని హామీ కృష్ణానదిలో కలిసే తుంగపాడు వాగు యాదా ద్రి ప్లాంట్ మధ్య నుంచి వెళుతుందని, దీని ప్ర వాహానికి ఎలాంటి అడ్డంకులు ఉండరాదని, వాగులో కనీస ప్రవాహం ఉండేలా చర్యలు తీసు కోవాలని నిపుణుల కమిటీ జెన్కోకు సూచించింది. వాగు పరిరక్షణకు ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, వాగుకు ఇరువైపులా 100 మీటర్ల వరకు అటవీశాఖ ఆధ్వర్యంలో గ్రీన్బెల్ట్ అభివృద్ధి చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం బదులిచ్చింది.తుంగపాడు వాగులో కనీస ప్రవాహం ఉండేలా ఎగువన ఉన్న పెద్దచెరువుల నుంచి నీటిని విడుదల చేస్తామని గతంలో నీటిపారుదల శాఖ సైతం హామీ ఇచ్చింది. తుంగపాడు వాగు, కృష్ణానది కలుషితం కాకుండా యాదాద్రి విద్యుత్ ప్లాంట్ను జీరో లిక్విడ్ డిశ్చార్జి సిస్టమ్ ఆధారంగా డిజైన్ చేశామని, ఇందుకు యాష్ వాటర్ రికవరీ సిస్టమ్ ఏర్పాటు చేసినట్టు జెన్కో సైతం ఈ నెల 12న లేఖ ద్వారా హామీ ఇచ్చింది.పారిశ్రామిక వ్యర్థ జలాల శుద్ధికి ఆర్వో ఆధారిత ప్లాంట్తో పాటు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఇలా శుద్ధి చేసిన జలాలను బూడిద, చెట్ల పెంపకం, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అవసరాలకు వినియోగిస్తామని జెన్కో తెలిసింది. తుంగపాడు వాగులో ఎలాంటి వ్యర్థాలు వదలని స్పష్టం చేసింది. నిపుణుల కమిటీ షరతుల్లో కొన్ని.... ♦ విద్యుత్ కేంద్రం ప్రహరీ లోపలిభాగంలో స్థానిక అటవీ జాతుల మొక్కలను మూడు వరుసల్లో నాటే కార్యక్రమాన్ని జూన్ 2024లోగా పూర్తి చేయాలి. తుంగపాడు వాగుకు రెండువైపులా 100 మీటర్ల వరకు వచ్చే రెండేళ్లలోగా చెట్ట పెంపకం పూర్తి చేయాలి. విద్యుత్ ప్లాంట్ ప్రహరీ చుట్టూ 2 కి.మీల వరకు దట్టంగా చెట్లు పెంచాలి. స్థానికంగా ఉన్న పాఠశాలల చుట్టూ 10 కి.మీల వరకు చెట్లు పెంచాలి. ♦భూ నిర్వాసితులకు 2025 మార్చిలోగా పరిహార పంపిణీ పూర్తి చేయాలి. ప్రాజెక్టుతో నిర్వాసితులైన కుటుంబాలు, ప్రభావితమైన కుటుంబాల్లోని వ్యక్తులకు ఇచ్చిన హామీ మేర కు శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించాలి. ♦బూడిద కోసం భవిష్యత్లో అదనపు భూమి కేటాయింపు ఉండదు. సిమెంట్, ఇటుకల తయారీకి 100శాతం బూడిదను వినియోగించుకోవాలి. రవాణాలో బూడిద పరిసర ప్రాంతాల్లో పడి కలుషితం చేయకుండా క్లోజ్డ్ బల్కర్స్లోనే తరలించాలి. ♦పర్యావరణ నిర్వహణ పణ్రాళిక (ఈఎంపీ)లో హామీ ఇచ్చిన మేరకు గడువులోగా రూ.5681.44 కోట్ల మూలధనం, రూ.430 కోట్ల రికరింగ్ నిధులతో పర్యావరణ ప్రణాళిక అమలు చేయాలి. ♦ప్రాజెక్టుకు చుట్టూ 5 కి.మీల పరిధిలో నివసించే జనాభాకు కనీసం రెండేళ్లకోసారి ఎపిడెమియోలాజికల్(అంటురోగాలు) స్టడీ నిర్వహించాలి. స్టడీలో తేలిన అంశాల ఆధారంగా వారి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. యూనిట్ల నిర్మాణ గడువూ పొడిగింపుతెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) ఆధ్వర్యంలో 4000(5్ఠ800) మెగావాట్ల సామర్థ్యంతో నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం– వీరప్పగూడెం గ్రామాల్లో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని ఐదు యూనిట్ల నిర్మాణం విషయంలో గడువు పొడిగించినట్టు జెన్కో కేంద్ర పర్యావరణ శాఖకు తెలిపింది.. యూనిట్ గడువు యూనిట్– 1 15.10.2024 యూనిట్–2 15.10.2024 యూనిట్ –3 31.03.2025 యూనిట్–4 31.12.2024 యూనిట్–5 28.02.2025 -
నృసింహస్వామి పెళ్లికొడుకాయెనే..
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి శ్రీస్వామి వారి ఎదుర్కోలు మహోత్సవాన్ని ఆలయ ఆచార్యులు పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం వైభవంగా జరిపించారు. ఉదయం ప్రధానాలయ మాడ వీధుల్లో శ్రీస్వామి వారు జగన్మోని అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇక సాయంత్రం శ్రీస్వామి వారు అశ్వవాహనంపై పెండ్లి కొడుకుగా, ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిపై అమ్మవారిని సేవోత్సవంగా ఆలయ మాడవీధిలో ఊరేగించారు. అనంతరం ఆచార్యులు, అధికారులు స్వామి వారి పక్షాన, అమ్మవారి పక్షాన చేరి గుణగణాలను చర్చించుకున్నారు. శ్రీనృసింహస్వామికి లక్ష్మీ దేవితో వివాహం జరిపేందుకు ముహూర్తాన్ని ఆచార్యులు నిర్ణయించారు. గజవాహనంపై కల్యాణోత్సవానికి.. తిరుకల్యాణోత్సవంలో భాగంగా సోమవారం రాత్రి 8.45 గంటలకు గజవాహనంపై శ్రీస్వామి, ప్రత్యేక పల్లకిపై అమ్మవారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ 9.15 గంటలకు ఉత్తర దిశలోని రథశాల ముందు ఏర్పాటు చేసిన కల్యాణ మండపానికి చేరుకుంటారు. ఆ తరువాత శ్రీస్వామి, అమ్మవార్ల కల్యాణ వేడుకను ఆచార్యులు, వేద పండితులు పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం వేద మంత్రాలతో ప్రారంభిస్తారు. తుల లగ్న ముహూర్తంలో రాత్రి 9.37 గంటలకు శ్రీస్వామి వారు అమ్మవారికి మాంగళ్యధారణ చేయనున్నారు. ఇక ఉదయం శ్రీస్వామి వారు శ్రీరామ అలంకారంలో హనుమంత వాహన సేవపై ఊరేగనున్నారు. యాదాద్రీశుడి కల్యాణానికి టీటీడీ పట్టువ్రస్తాలు శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరు కల్యాణోత్సవాలకు టీటీడీ తరఫున ఆదివారం పట్టు వస్త్రాలను అందజేశారు. ఉదయం టీటీడీకి చెందిన ఉప కార్యనిర్వహణాధికారి లోకనాథం మేల్చాట్ పట్టు వ్రస్తాలను తీసుకొని, ఆలయ మాడ వీధిలో ఊరేగింపుగా వచ్చారు.జగన్మోహిని అలంకార సేవ ముందు పట్టు వస్త్రాలను ఆలయ ఈఓ భాస్కర్రావు, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ప్రధానార్చకులకు అందజేశారు. -
యాదాద్రి వివాదంపై స్పందించిన భట్టి విక్రమార్క.. ఏమన్నారంటే!
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి వివాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. యాదాద్రి ఆలయంలో తాను కావాలనే చిన్నపీట మీద కూర్చున్నానని తెలిపారు. దేవుడిపై భక్తి భావంతోనే అలా చేశానని పేర్కొన్నారు. ఒక్క ఫోటోతో సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన్నట్లు ట్రోల్ చేస్తున్నారని అన్నారు. తనను ఎవరూ అవమానించలేదని, దీన్ని అందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. బంజారాహిల్స్లో నిర్వహించిన సింగరేణి అతిథిగృహ శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాదాద్రి ఘటనపై వివరణ ఇచ్చారు. యాదాద్రిలో ఫోటో చూసి తనకు అవమానం జరిగిందని కొంత మంది భావించారని.. తనను ఎవరూ అవమానించలేదన్నారు. తాను ఎవరికీ తలవంచే వాడిని కాదని తెలిపారు. తాను డిప్యూటీ సీఎంగా రాష్ట్రాన్ని శాసిస్తున్నానని, ఆర్థిక, విద్యుత్, ప్రణాళిక వంటి మూడు శాఖలతో ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నానని తెలిపారు. ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునే వాడిని కాదన్నారు. ఆత్మగౌరవాన్ని చంపుకునే మనస్తత్వం తనది కాదని స్పష్టం చేశారు. అయితే యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సీఎం దంపతులు, ఉత్తమ్, కోమటిరెడ్డి బెంచ్పై కూర్చోగా డిప్యూటీ సీఎం భట్టి స్టూల్పై కూర్చున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు సహా ఇతర పార్టీల నేతలంగా భట్టిని అవమానించారని కాంగ్రెస్ పార్టీపై మండిపడిన విషయం తెలిసిందే. చదవండి: కాంగ్రెస్, బీఆర్ఎస్ అజెండా ఒక్కటే: కేంద్ర మంత్రి అమిత్ షా -
సీఎం గారూ.. నిధులివ్వండి
సాక్షి, యాదాద్రి: యాదాద్రి అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. యాదాద్రి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం ఆయన రానున్నారు. సీఎం అయిన తర్వాత తొలిసారిగా యాదగిరిగుట్టకు వస్తుండడంతో వరాల జల్లు కురిపిస్తారన్న ఆశతో భక్తులు ఉన్నారు. రూ.1,200 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన ఆల య పునర్నిర్మాణ పనులు పూర్తి కావడానికి ఇంకా రూ.150 కోట్ల వరకు అవసరం ఉన్నాయి. నిధుల లేమితో పనులు నిలిచిపోయాయి. వైటీడీఏ ద్వారా యాదాద్రి అభివృద్ధి పనులను అప్పటి ప్రభుత్వం చేపట్టింది. గత సంవత్సరం మార్చిలో ఆలయ ఉద్ఘాటన జరిగింది. రెండు సంవత్సరాలు కావ స్తున్నా భక్తులకు సరైన వసతులు లేవు. కొండపైన విశిష్టత కాపాడాలని.. భక్తులకు ఆధ్యాత్మిక విశిష్టత లేకుండా పోయింది. కొండపైన దీక్షాపరుల మండపం, డార్మిటరీహాల్, విష్ణుపుష్కరిణి, కల్యాణకట్ట ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. దీంతోపాటు ఆలయం లోపలికి వెళ్లి తిరిగి వచ్చే భక్తులు నిలువ నీడ, సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారులకు నష్టం.. అవసరం లేకున్నా ఎక్కువ ఎత్తులో బ్రిడ్జి నిర్మించి యాదగిరిగుట్ట పట్టణాన్ని రెండుగా విడగొట్టి రూపురేఖలు లేకుండా చేశారని విమర్శలున్నాయి. దీని వల్ల వ్యాపారులు వీధిన పడ్డారు. స్థానికులు నష్టపోయారు. వీరి కోసం దేవస్థానం నిర్మించి ఇచ్చే షాపింగ్ కాంప్లెక్స్ పనులు కొనసాగుతున్నాయి. ప్రారంభం కాని గెస్ట్ హౌస్లు.. టెంపుల్ సిటీలో దాతల సహాయంతో చేపట్టాల్సిన గెస్ట్హౌస్ల నిర్మాణాలు నేటికీ ప్రారంభం కాలేదు. రూ.250 కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేసిన లేఆవుట్ నిరుపయోగంగా ఉంది. స్థానికులకు ఉపాధి దూరం.. ఆలయ అభివృద్ధిలో భాగంగా భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి పునరావాసం, ఇళ్ల స్థలాలు ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. సైదాపురంలో కేటాయించిన స్థలాన్ని ఇంకా అభివృద్ధి చేయలేదు. ఇల్లు, భూములు కోల్పోయిన బాధితులకు సరైన నష్ట పరిహారం ఇవ్వడంలో, పునరావాసం కల్పించడంలోనూ జాప్యం జరుగుతోంది. సగంలో నిలిచిన పనులు కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం అవుతోంది. ప్రస్తుతం చేసిన పనులకు పాత బిల్లులు రూ.70 కోట్ల వరకు, కొనసాగుతున్న పనులను పూర్తి చేయడానికి రూ.70 కోట్ల మేరకు అవసరం అవుతాయి. ఇందులో రూ. 60 కోట్ల మేరకు పనులకు చెక్లు ఇవ్వగా ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయి. దేవస్థానం బస్టాండ్, షాపింగ్ కాంప్లెక్స్, ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు మధ్యలో నిలిచిపోయాయి.గిరి ప్రదర్శన మార్గం పనులు సగభాగంలోనే నిలిచిపోయాయి. ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈఓ రామకృష్ణారావు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు రూ.1.60లక్షల బడ్జెట్ కేటాయించినట్లు చెప్పారు. సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రులందరికీ ఆహ్వాన పత్రికలు అందజేశామని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో రోజూ 1500 మందికి అన్నదానం చేయనున్నట్లు వెల్లడించారు. రోజూ 15వేలకు పైగానే భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎదుర్కోలు, కల్యాణం, రథోత్సవం రోజుల్లో 30వేలకు పైగా భక్తులు వస్తారని అంచనా ఉందన్నారు. 70 మందికి పైగా ఆచార్యులు, పారాయణీకులు, రుత్వికులు రానున్నారని స్పష్టం చేశారు. ఎంతమంది భక్తులు వచ్చినా కొరత రాకుండా లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, బస్సుల ఏర్పాటు తదితర వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయంలో రోజూ నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఆగమశాస్త్రం ప్రకారం ఉత్సవాలు యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు పాంచరాత్ర ఆగమశాస్త్ర అనుసారంగా నిర్వహిస్తాం. శ్రీస్వామిని ఇష్టమైన అలంకార, వాహన సేవలు ఈ నెల 13వ తేదీన ప్రారంభం అవుతాయి. ప్రధాన ఘట్టాలైన ఎదుర్కోలు ఉత్సవం తూర్పు రాజగోపురం ముందు, కల్యాణం ఉత్తర మాఢ వీధిలో నిర్వహిస్తాం. రథోత్సవం రోజు శ్రీస్వామి వారు ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగుతారు. భక్తులు ఉత్సవాల్లో పాల్గొని మొక్కులు తీర్చుకోవాలి. – కాండూరి వెంకటాచార్యులు, ప్రధాన అర్చకులు ఇవి చదవండి: సికింద్రాబాద్–విశాఖ మధ్య వందేభారత్–2 -
11నుంచి యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధన, స్వస్తీవాచనంతో బ్రహ్మోత్సవాలకు ఆచార్యులు శ్రీకారం చుట్టనున్నారు. 21న బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ♦ 11వ తేదీ ఉదయం విశ్వక్సేన ఆరాధన, స్వస్తీ వాచనం, రక్షాబంధనం, సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోపణ ♦ 12న ఉదయం అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, సాయంత్రం భేరీపూజ, దేవతాహ్వానం, హవనం ♦ 13న అలంకార, వాహన సేవలు ప్రారంభం. ఉదయం మత్స్య అలంకారం, వేద పారాయణం, సాయంత్రం శేష వాహనం సేవ ♦ 14న ఉదయం వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి హంస వాహన సేవ ♦ 15న ఉదయం శ్రీకృష్ణ (మురళీ కృష్ణుడు) అలంకారం, రాత్రి పొన్న వాహన సేవ ♦ 16న ఉదయం గోవర్థనగిరిధారి అలంకారం, రాత్రి సింహ వాహన సేవ ♦ 17న ఉదయం జగన్మోహిన అలంకారం, రాత్రి స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం ♦ 18న శ్రీరామ అలంకారంలో హనుమంత వాహనంపై శ్రీస్వామివారి ఊరేగింపు.రాత్రి గజవాహన, శ్రీస్వామి, అమ్మవార్ల తిరు కల్యాణం నిర్వహిస్తారు. ♦ 19న ఉదయం శ్రీమహావిష్ణు అలంకార సేవ, గరుఢ వాహనంసేవలో శ్రీస్వామి వారి ఊరేగింపు, రాత్రి దివ్య విమాన రథోత్సవం. ♦ 20న ఉదయం మహా పూర్ణాహుతి, చక్రతీర్థ స్నానం, రాత్రి శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాలు ♦ 21న ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రద్దుకానున్న సేవలు బ్రహ్మోత్సవాల్లో భాగంగా 11నుంచి 21వ తేదీ వరకు శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, జోడు సేవలను రద్దు చేయనున్నారు. 17, 18, 19 తేదీల్లో అర్చనలు, భోగములు, 20, 21 తేదీల్లో అభిషేకాలు, అర్చనలు రద్దు చేయనున్నారు. 18వ తేదీన శ్రీస్వామి, అమ్మవారి తిరు కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు రూ.3వేల టికెట్ కొనుగోలు చేసి సంప్రదాయ దుస్తుల్లో పాల్గొనాలని ఆలయ అధికారులు తెలిపారు. -
యాదాద్రి కాదు ఇకపై యాదగిరి గుట్టనే: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి కాదు ఇకపై యాదగిరిగుట్టగా పిలువబుడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మారుస్తూ త్వరలోనే జీఓ విడుదల చేస్తామని కోమటిరెడ్డి వెల్లడించారు. ఆయన శనివారం మీడియాతో చిట్చాట్లో మాట్లాడాడు. ‘ఎమ్మెల్యే కేటీఆర్ ఇప్పటికీ తండ్రి కేసీఆర్ చాటు కొడుకే. నేను ఉద్యమాలు చేసి వచ్చాను. మేం జీరో బిల్ ఇచ్చినట్టు.. కేటీఆర్కి జీరో నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ లేని కేటీఆర్ గురించి మాట్లాడడం వృథా. ఫ్లోర్ లీడర్ ఇవ్వకపోతే హరీష్ కూడా బీజేపీలోకి పోతాడు. కాళేశ్వరం కట్టిన చీఫ్ డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డ ఎందుకు పోలేదు?. ... కాళేశ్వరం పనికిరాదని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ప్రజలే కేసీఆర్ను నామరూపాలు లేకుండా చేశారు. ఎంపీ అభ్యర్థులపై అంతర్గత సర్వే జరుగుతోంది. భువనగిరి నుండి పోటీ చేయమని రాహుల్ గాంధీని కోరాను. భువనగిరి, ఖమ్మం, నల్గొండలో.. దక్షిణాదిలో టాప్ మెజార్టీ వస్తుంది. మోదీ కంటే రాహుల్ గాంధీ ఎక్కువ మెజారిటీతో గెలుస్తారు’ అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. -
ఉత్సవాలకు ముస్తాబు అవుతున్న యాదాద్రి
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం వరుస ఉత్సవాలకు ముస్తాబవుతోంది. మహా శివరాత్రిని పురస్కరించుకొని వచ్చే నెల 5వ తేదీ నుంచి కొండపైనే అనుబంధ ఆలయమైన శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి (శివాలయం) ఉత్సవాలను నిర్వహించనున్నారు. 11వ తేదీ నుంచి యాదాద్రీశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. కొండపైన గల శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి దేవాలయంలో మార్చి 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మహా శివరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. పాంచాహ్నిక దీక్షతో నిర్వహించే ఈ ఉత్సవాలను ఐదు రోజుల పాటు కొనసాగనున్నాయి. 7వ తేదీన రాత్రి 7గంటలకు శ్రీపర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. 8వ తేదీ మహాశివరాత్రిని పురస్కరించుకొని అభిషేకములు, రాత్రి లింగోద్భోవ కాలములో మహాన్యాస పూర్వక శతరుద్రాభిషేకం జరిపిస్తారు. 10వ తేదీన మధ్యాహ్నం పూర్ణాహుతి, రాత్రి డోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. 11 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు పంచనారసింహుడిగా కొలువబడుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. స్వస్తీ వాచనంతో ఉత్సవాలకు ఆచార్యులు శ్రీకారం చుడతారు. 12వ తేదీన ధ్వజారోహణము, దేవతాహ్వానం, వేద పారాయణం, హవన జరిపిస్తారు. అదే రోజు అలంకార సేవలు, ధార్మిక సభా కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. ప్రధాన ఘట్టాలైన శ్రీస్వామి అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవం 17వ తేదీన, తిరు కల్యాణ మహోత్సవం 18వ తేదీన, రథోత్సవం 19న, చక్రతీర్థ స్నానం 20న నిర్వహిస్తారు. 21వ తేదీన శతఘటాభిషేకం ఉత్సవంతో వార్షిక బ్రహ్మోత్సవాలను ముగింపు చేస్తారు. 8న అఖండ జ్యోతి యాత్ర యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్ బర్కత్పురలోని యాదగిరి భవన్ నుంచి మహా శివరాత్రి రోజు 8వ తేదీన ఉదయం 9.30గంటలకు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి 30వ అఖండ జ్యోతి యాత్ర ప్రారంభం అవుతుంది. ప్రతి ఏడాది మాదిరిగానే యాత్ర నిర్వాహకులు అఖండ జ్యోతి యాత్రను దివ్య పుష్ప రథంపై ఊరేగింపుగా యాదాద్రికి తీసుకురానున్నారు. 8వ తేదీన బర్కత్పురలో ప్రారంభమయ్యే అఖండ జ్యోతి యాత్ర 11వ తేదీన యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాల తొలిరోజు యాదగిరిగుట్టకు చేరుకుంటుంది. -
యాదాద్రిలోని విజయ సంకల్ప యాత్రలో ఈటల రాజేందర్
-
యాదాద్రి పైకి ఆటోలు
యాదగిరిగుట్ట : రెండేళ్ల తర్వాత యాదాద్రి కొండపైకి ఆటోల రాకపోకలు షురూ అయ్యాయి. యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటన జరిగిన 2022 మార్చి 28వ తేదీ నుంచి కొండపైకి ఆటోలు నడపడం నిషేధించారు. దీంతో ఆటోడ్రైవర్లు నిరసనకు దిగారు. మొదటి ఘాట్ రోడ్డులోని యాదరుషి ఆలయం వద్ద వివిధ రూపాల్లో వారు దీక్షలు, ఆందోళనలు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో పోలీసుల సూచన మేరకు నవంబర్ 2023లో దీక్షలు విరమించారు. అధికారంలోకి వస్తే గుట్టపైకి ఆటోలు నడిచేలా చూస్తామని కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చా క రెండు, మూడుసార్లు ఆటో డ్రైవర్లు, దేవాలయ, పోలీసు అధికారులతో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చర్చలు జరిపారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖలతో మాట్లాడి ఆదివారం నుంచి కొండపైకి ఆటోలు నడిచే విధంగా చూశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా ఆటోడ్రైవర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి కొండపైకి ఆటోలను అనుమతించే కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ హనుమంతు కె.జెండగే, డీసీపీ రాజేష్ చంద్ర, ఈఓ రామకృష్ణారావు, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తిలతో కలిసి జెండా ఊపి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆటో డ్రైవర్లకు మంచి రోజులు వచ్చాయన్నారు. అనంతరం కలెక్టర్ జెండగే, డీసీసీ రాజేష్ చంద్రా, ఈఓ రామకృష్ణారావులను బీర్ల ఐలయ్య ఆటోలో గుట్టపైకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, కార్యదర్శి జనగాం ఉపేందర్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, ఏసీపీ శివరాంరెడ్డి, సీఐ రమే‹Ù, మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధ తదితరులు పాల్గొన్నారు. ఆటోలకు స్టిక్కర్లు.. యాదాద్రి కొండపైకి నడిచే ఆటోలకు ట్రాఫిక్ పోలీసులు, ఆటో కారి్మక యూనియన్ నేతలు సీరియల్ నంబర్, శ్రీస్వామి వారి చిత్రపటంతో కూడిన స్టిక్కర్లు అతింకించారు. ఆటో డ్రైవర్ల డ్రైవింగ్ లైస్సెన్స్, పొల్యూషన్ పత్రాలను పరిశీలించారు. తొలి రోజు అధికారులు చెప్పిన ప్రకారం 100 ఆటోలను కొండపైకి నడిపించారు. -
యాదాద్రిలో విద్యార్థినుల ఆత్మహత్య కేసులో ట్విస్ట్
-
విశ్వవిరాట్ వైభవం
సాక్షి, తిరుమల/భద్రాచలం/యాదగిరిగుట్ట: తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు పోటెత్తారు. వేకువ జాము నుంచే ఆలయాలకు భారీగా భక్తులు తరలివచ్చారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం కనులపండువగా జరుగుతోంది. ఉత్తరద్వారం నుంచి దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పుణ్యక్షేత్రం శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా భూలోక వైకుంఠంగా మారింది. శ్రీసీతాలక్ష్మణసమేతుడైన రామచంద్రస్వామి ఉత్తరద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనంతో భద్రగిరి పులకించింది. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, ధూపదీపాల మధ్య వైకుంఠ రాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగదభి రాముడు గరుడ వాహనంపై, సీతమ్మవారు గజవాహనంపై, లక్ష్మణస్వామి హనుమత్ వాహనంపై ఆసీనులై ఉత్తరద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. వైకుంఠనాథుడిగా దర్శనమిచ్చిన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంతో పాటు అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్ట (çపూర్వగిరి) శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువజామునే ప్రధానాలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ఆచార్యులు సుప్రభాతం, ఆరాధన, బాలభోగం, తిరుప్పావై చేపట్టి అలంకార సేవలు ఏర్పాట్లు చేశారు. ఉదయం శ్రీస్వామి వారు గరుడ వాహనంపై లక్ష్మీనృసింహస్వామి అలంకారంలో వేంచేసి ఆలయ ఉత్తర ద్వారం వద్ద వైకుంఠనాథుడిగా భక్తులకు కనువిందు చేశారు. సాయంత్రం శ్రీస్వామిని విష్ణుమూర్తిగా అలంకరణ చేసి మత్సా్వతారంలో మాడవీధిలో సేవను ఊరేగించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, అనిరు«ద్రెడ్డి, అదనపు జిల్లా జడ్జి మారుతీదేవి, సబ్ జడ్జి దశరథరామయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో.. తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వైకుంఠం నుంచి వచ్చిన వేంకటేశుడి దర్శనానికి ఉత్తర ద్వారం స్వా గతం పలికింది. అలాగే.. శ్రీవారి ఆలయంలో స్వర్ణ రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు స్వర్ణ రథంపై మాడవీధుల్లో ఊరేగారు. రథోత్సవాన్ని గ్యాలరీల్లోంచి భక్తులు దర్శించి తరించారు. -
వైకుంఠ ఏకాదశి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
తిరుపతి/హైదరాబాద్, సాక్షి: వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి నేడు. వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు.తిరుమలలో నేటి నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వారా దర్శనం ఉంటుంది. ఏపీలో వైష్ణవ ఆలయాలకు వేకువ ఝామునే భక్తులు క్యూ కట్టారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. గోవిందా నామస్మరణలతో ఆలయాలు మారుమోగుతున్నాయి. ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇక.. వీఐపీల తాకిడి వైకుంఠ ద్వార దర్శన నేపథ్యంలో.. తిరుమలకు వీఐపీల తాకిడి నెలకొంది. మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర బాబు, జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ ఎస్.ఎల్. భట్టి, జస్టిస్ శ్యామ్ సుందర్, జస్టిస్ తారాల రాజశేఖర్, కర్ణాటక గవర్నర్ ధావర్ చంద్ గెహ్లాట్లు విచ్చేశారు. అలాగే.. ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణ స్వామి, ఉష శ్రీచరణ్, మేరుగు నాగార్జున, చెల్లబోయిన, అంబటి రాంబాబు, కారుమూరి, గుడివాడ అమర్నాథ్, రోజా, ఎంపీలు ప్రభాకర్రెడ్డి, రఘురామ కృష్ణంరాజు, సీఎం రమేశ్, డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు తదితరులు ఉన్నారు. ఇవాళ ముక్కోటి దేవతలు భూలోకానికి వచ్చి శ్రీమహా విష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్యపరంపరలు చేకూరతాయని భక్తుల విశ్వాసం. తెలంగాణలో.. మరోవైపు తెలంగాణలోని వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 2.30 గంటలకు స్వామివారి మూల విరాట్లకు మహా క్షీరాభిషేకం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, భద్రాద్రి రామాలయం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులకు స్వామివారు ఉత్తర ద్వార దర్శనమిస్తున్నారు. -
యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి రాజీనామా
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవో గీతారెడ్డి గురువారం రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను వెంటనే ఆమోదించిన అధికారులు, ఆలయ నూతన ఈవోగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణారావును నియమించారు. 2014 డిసెంబర్ 2న గీతారెడ్డి యాదాద్రి ఆలయ ఈవోగా బాధ్యతలు తీసుకున్నారు. తొమ్మిదేళ్ల పాటు ఆమె ఈవోగా బాధ్యతల్లో ఉన్నారు. గీతారెడ్డి 2020 ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. యాదాద్రి ఆలయ అభివృద్ధి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక సంవత్సరం పాటు అంటే 2021 ఫిబ్రవరి 28వ తేదీ వరకు గీతారెడ్డి సర్వీసును పొడిగించింది. అనంతరం ప్రధాన ఆలయ ఉద్ఘాటన నేపథ్యంలో ఆమె పదవీ కాలాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ పొడిగించింది. మరో అధికారిని ఈవోగా నియమించే వరకు గీతారెడ్డినే ఆలయ ఈవోగా కొనసాగుతారని జీవో ఇచి్చంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పదవీ విరమణ పొందిన ప్రభుత్వ అధికారులంతా తమ రాజీనామాలు సమరి్పస్తుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో గీతారెడ్డి రాజీనామా చేశారు. రామకృష్ణారావు బాధ్యతల స్వీకరణ.. యాదాద్రి ఆలయ నూతన ఈవోగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్టా అలంకార మూర్తులను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామకృష్ణారావుకు ప్రధాన కార్యాలయంలో గీతారెడ్డి బాధ్యతలను అప్పగించారు. -
యాదాద్రిలో అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన టీటీఏ టీమ్
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ సేవాడేస్ కార్యక్రమాలు తెలంగాణలో విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లాలో పర్యటించిన టీటీఏ టీమ్ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం వలిగొండలో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. టిటిఎ ఫౌండర్ డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి స్వయంగా నిర్మించిన వెంకటేశ్వర ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా కాలేజీ విద్యార్థుల కోసం మల్లారెడ్డి కంప్యూటర్, ఫర్నిచర్ వంటివి అందించడంపై ప్రిన్సిపల్ లక్ష్మీకాంత్ ధన్యవాదాలు తెలిపారు . అనంతరం మల్లారెడ్డి స్వస్థలం సుంకిశాలకు చేరుకోని అక్కడ పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సుంకిశాల గ్రామంలో మల్లారెడ్డి స్కూల్, కాలేజ్, దేవాలయాలు నిర్మించి చాలా అభివృద్థి చేశారని గ్రామస్థులు కొనియాడారు. మల్లారెడ్డి చేస్తున్న పలు సేవాకార్యక్రమాలను వారు ప్రశంసించారు. -
చేనేత సాంస్కృతిక వారసత్వం గొప్పది
సాక్షి, యాదాద్రి: మన చేనేత సాంస్కృతిక వారసత్వం, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించి ముందుకు తీసుకుపోవడంలో చేనేత కళాకారుల సహకారం గొప్పదని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. చేనేత రంగంలో గురు, శిష్య సంప్రదాయం ప్రకారం వృత్తి నైపుణ్యాలు తరతరాలుగా అందించడం మంచి సాంప్రదాయమని ప్రశంసించారు. ఆధునిక సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త డిజైన్లు, ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో చేనేత పరిశ్రమకు ఫ్యాషన్ డిజైనర్లు సహకరించాలని కోరారు. ఇందులో శిక్షణ ఒక ముఖ్యమైన అంశమని ఆమె అన్నారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన రాష్ట్రపతి బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూధాన్పోచంపల్లిని సందర్శించారు. ఇక్కత్ వస్త్రాలు తయారు చేసే చేనేత కళాకారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత దేశ వారసత్వంలో ఒక భాగమైన చేనేత వృత్తి గురించి తెలుసుకోవడానికి పోచంపల్లి గ్రామానికి వచ్చి పట్టు చీరలు ఎలా తయారు చేస్తారో చూడడం సంతోషం కలిగిస్తోందని రాష్ట్రపతి చెప్పారు. ఇక్కడి నుంచి తాను ఇంత గొప్ప చేనేత ఇక్కత్ వృత్తి నైపుణ్య జ్ఞానాన్ని తీసుకువెళుతున్నానని అన్నారు. తమ ప్రాంతానికి చెందిన కొందరిని పోచంపల్లికి తీసుకువచ్చి చేనేత వృత్తిని పరిచయం చేయిస్తానని తెలిపారు. యూఎన్డబ్ల్యూటీవో (యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్) 2021లో పోచంపల్లి గ్రామాన్ని ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామాలలో ఒకటిగా ప్రకటించడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమానికి చేనేత రంగంలో విశిష్టత కలిగిన అవార్డు గ్రహీతలు వచ్చారంటూ.. చేనేత సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకుపోతున్న వారిని అభినందించారు. చేనేత రంగం ద్వారా ప్రతిరోజు 35 లక్షల మంది జీవనోపాధి కల్పించుకుంటున్నారని, తెలంగాణాలో నేసిన వ్రస్తాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయని చెప్పారు. పోచంపల్లితో పాటు రాష్ట్రంలోని వరంగల్, సిరిసిల్ల, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట, పుట్టపాక వస్త్రాలకు జీఐ ట్యాగ్ వచ్చిందని రాష్ట్రపతి తెలిపారు. ప్రభుత్వం దృష్టికి సమస్యలు ముగ్గురు చేనేత కళాకారులు కొన్ని ఇబ్బందులను తన దృష్టికి తీసుకువచ్చారని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని రాష్ట్రపతి హామీ ఇచ్చారు. అంతకుముందు ఆమె పోచంపల్లిలోని శ్రీరంజన్ సిల్క్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ కంట్రోల్ యూనిట్ను సందర్శించి పనితీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే తెలంగాణ చేనేత ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన పెవిలియన్ థీమ్ను సందర్శించారు. ముడిపట్టు నుంచి పట్టును తీయడం, వ్రస్తాలను తయారు చేయడం లాంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు చరఖాలతో నూలు వడకడాన్ని వీక్షించారు. ప్రత్యేక స్టాళ్లను, ఆచార్య వినోభాబావే ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రపతికి చీరల బహూకరణ చేనేత అవార్డు గ్రహీతలు బోగ సరస్వతి, లోక శ్యామ్కుమార్, కూరపాటి వెంకటేశం.. చేనేత రంగంలో తమ వృత్తి నైపుణ్యాలను, ఇబ్బందులను రాష్ట్రపతికి వివరించారు. ఈ సందర్భంగా పొట్ట బత్తిని సుగుణ రాష్ట్రపతికి చీరను బహూకరించారు. బోగ సరస్వతి డబుల్ ఇక్కత్ వ్రస్తాన్ని అందజేశారు. వేదికపై రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, సీతక్క.. రాష్ట్రపతికి చీరలను బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జౌళి శాఖ కార్యదర్శి రచనా సాహు, రాష్ట్ర జౌళి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమారెడ్డి, కలెక్టర్ హనుమంతు కె.జెండగే, రాచకొండ పోలీస్ కమిషనర్ సుదీర్బాబు తదితరులు పాల్గొన్నారు. స్పృహ తప్పి పడిపోయిన ఏసీపీ భూదాన్ పోచంపల్లి/భువనగిరి క్రైం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భూదాన్పోచంపల్లి పర్యటనలో స్వల్ప అపశ్రుతి చోటు చేసుకుంది. హెలీపాడ్ వద్ద విధుల్లో ఉన్న ఉప్పల్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు కళ్లు తిరిగి పడిపోయారు. ఆయన తన పక్కనే ఉన్న ఇంకో అధికారి మీద పడడంతో ఇద్దరూ కింద పడ్డారని భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. హెలీకాప్టర్ ల్యాండింగ్ సమయంలో ఈ ఘటన జరగడంతో వేరే విధంగా ప్రచారం జరిగిందని వివరణ ఇచ్చారు. హెలీకాప్టర్ ఫ్యాన్ గాలి ఉధృతికి కార్పెట్ పైకి లేవడంతో ఆయన గాయపడినట్టు తొలుత ప్రచారం జరిగింది. కాగా చేతికి గాయమైన ఏసీపీని వెంటనే హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా నూలు డిపో ఏర్పాటు చేయాలి పలు ఆటుపోట్లు ఎదుర్కొంటున్న చేనేత వృత్తికి అండగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి 15 శాతం నూలు సబ్సిడీని సకాలంలో పొందలేకపోతున్నాం. ఇందుకోసం భూదాన్ పోచంప ల్లిలో నూలు డిపో ఏర్పాటు చేయాలి. తద్వారా వే లాది మంది చేనేతలకు మేలు జరుగుతుంది. డబు ల్ ఇక్కత్, కాటన్, మస్రైస్ వస్త్రాల తయారీ కోసం వందలాది మగ్గాలు నడుస్తాయి. చేనేత కుటుంబాలకు మరింత ఉపా«ధి లభిస్తుంది. – బోగ సరస్వతి సాంకేతిక సంస్థను ఏర్పాటు చేయాలి పోచంపల్లి కళాకారులకు రంగులు అద్దకం, డిజైన్ల తయారీ, నూతన ప్రక్రియల కోసం శిక్షణ ఇప్పించాలి. చేనేత యువతకు శిక్షణ ఇప్పించడానికి చేనేత సాంకేతిక సంస్థను ఏర్పాటు చేయాలి. మమ్మల్ని చేనేత కార్మికులుగా కాకుండా చేనేత కళాకారులుగా పిలవాలి. మా వృత్తికి విరమణ లేదు. మాకు అండగా ఉండాలి. – లోక శ్యామ్కుమార్ డూప్లికేట్ను నియంత్రించాలి టై అండ్ డై చీరలు, వ్రస్తాలను డూప్లికేట్ చేస్తున్నారు. మా వృత్తిని దెబ్బతీసే విధంగా మిల్లుల నుంచి టై అండ్ డై వస్త్రాలను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీంతో మేము ఉపాధి కోల్పోతున్నాం. ఇక్కత్ బ్రాండ్ను కాపాడాలి. చేనేత వృత్తిని ఆదుకోవడానికి ఆర్థిక సహాయం అందించాలి. వస్త్రాల అమ్మకంపై డిస్కౌంట్ ఇవ్వాలి. పోచంపల్లి బ్రాండ్ ఇమేజ్ పెంచాలి. – కూరపాటి వెంకటేశం -
యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. క్యూలైన్లు ఫుల్ (ఫొటోలు)
-
అధికారంలోకొచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: అనిల్ కుమార్
-
28న యాదాద్రి ఆలయం మూసివేత
యాదగిరిగుట్ట: చంద్ర గ్రహణం సందర్భంగా ఈ నెల 28న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసివేయ నున్నారు. గ్రహణం కార ణంగా ఒక్క రోజు ముందు అంటే 27వ తేదీన రాత్రి 7 గంటలకు శరత్ పౌర్ణమి వేడుకలను బ్రహ్మోత్సవ కల్యాణ మండపంలో నిర్వహించనున్నారు. 28వ తేదీన సాయంత్రం 4 గంటలకే ఆలయాన్ని మూసివేస్తారు. ప్రధానాలయంతో పాటు అనుబంధ ఆలయాలైన శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం, పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను మూసివేయ నున్నారు. గ్రహణం పూర్తయిన తరువాత 29వ రోజున ఆలయాన్ని వేకువజామునే తెరిచి సంప్రోక్షణ నిర్వహిస్తారు. -
ఊడిపోయిన యాదాద్రి గోపుర కలశం.. ఆలస్యంగా వెలుగులోకి
సాక్షి, యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయ ఉద్ఘాటన సమయంలో దక్షిణ రాజగోపురంపై ప్రతిష్టించిన బంగారు కలశాల్లో ఒకటి ఊడిపోయి కింద పడిపోయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై స్థానిక భక్తులు, పలువురు అధికారులు తెలిపిన వివరాలివి. యాదాద్రి ఆలయ దక్షిణ రాజగోపురంపై బిగించిన బంగారు కలశాల్లో ఒకటి మంగళవారం సాయంత్రం సమయంలో కింద పడిపోయింది. దీంతో అప్రమత్తమైన ఆలయాధికారులు ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. దక్షిణ రాజగోపురంపై బుధవారం ఉదయం సంప్రోక్షణ పూజలు నిర్వహించిన అనంతరం శిల్పులు తిరిగి బిగించారు. దీనిపై ఆలయ డీఈవో దోర్భల భాస్కర్శర్మను ప్రస్తావించగా.. గోపురంపై కలశాలు బిగించేటప్పుడు కింద పడకుండా చెక్కలను ఏర్పాటు చేశారని తెలిపారు. అవి వదులైపోవడంతో పాటు కోతులు వాటిపైకి ఎక్కి ఆడటంతో ఊడిపోయాయని పేర్కొన్నారు. వెంటనే గోపురం వద్ద పూజలు జరిపించి, శిల్పులతో బిగించామని వెల్లడించారు. -
స్వామి దశావతారం గురించి యాదాద్రి ఆర్ట్ డైరెక్టర్..!
-
యాదాద్రి ఆలయ విగ్రహాల గురించి ఆనంద్ సాయి మాటలో..!
-
వచ్చే ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గంని జయించేది ఎవరు?
భువనగిరి నియోజకవర్గం భువనగిరి నియోజకవర్గంలో టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన పైళ్ల శేఖర్ రెడ్డి రెండోసారి గెలిచారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది కుంభా అనిల్కుమార్ రెడ్డిపై 24063 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. తెలంగాణ ఉద్యమ ప్రభావం బాగా ఉన్న ఈ ప్రాంతం నుంచి టిఆర్ఎస్ తేలికగా గెలించింది. కాగా ఇక్కడ యువ తెలంగాణ పార్టీ పక్షాన పోటీచేసిన జిట్టా బాలకృష్ణారెడ్డికి 13400 పైచిలుకు ఓట్లు వచ్చాయి. శేఖర్ రెడ్డికి 84898 ఓట్లు రాగా, అనిల్ కుమార్ రెడ్డికి 60556 ఓట్లు వచ్చాయి. శేఖర్ రెడ్డి సామాజికవర్గం పరంగా రెడ్డి వర్గం నేత. 1985 నుంచి భువనగిరిలో అప్రతిహతంగా విజయ దుంధుభి మోగిస్తున్న తెలుగుదేశం పార్టీ 2014లో తొలిపారి ఓడిపోయింది. మాజీ మంత్రి, దివంగత నేత ఎ.మాధవరెడ్డి, ఆయన భార్య ఉమ మూడు దశాబ్దాలుగా ఇక్కడ ప్రాతి నిద్యం వహించారు. 2014లో టిఆర్ఎస్ నేత పైళ్ల శేఖర్రెడ్డి భువనగిరిలో విజయం సాధించారు. విశేషం ఏమిటంటే ఆయన సమీప ప్రత్యర్ధిగా స్వతంత్ర అభ్యర్ధిగా రంగంలో ఉన్న జిట్టా బాలకృష్ణారెడ్డి కావడం. శేఖర్రెడ్డి 15416 ఆధిక్యతతో గెలిచారు. ఉమా మాధవరెడ్డికి 24569 ఓట్లు వచ్చాయి. ఆమె ఇక్కడ రెండో స్థానంలో కూడా లేరు. తెలంగాణ ఉద్యమ ప్రభావం బాగా ఉండడం కూడా కారణం కావచ్చు. మాధవరెడ్డి నాలుగుసార్లు విజయం సాధిస్తే ఆయన భార్య ఉమా మాధవరెడ్డి మూడుసార్లు గెలుపొందారు. 1999 ఎన్నికల తర్వాత నక్సల్ ఘాతుకానికి మాధవరెడ్డి బలైపోయారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలోను, 2004, 2009లలో ఉమా మాధవరెడ్డి గెలిచారు. మాధవరెడ్డి గతంలో ఎన్.టి.ఆర్, ఆ తర్వాత చంద్రబాబు క్యాబినెట్లలో పనిచేశారు. ఉమ కూడా చంద్రబాబు క్యాబినెట్లో పనిచేశారు. భార్యభర్తలిద్దరూ మంత్రులైన ఘనత వీరికి దక్కింది. భువనగిరి, ఆలేరులలో గతంలో గెలుపొందిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవిలు రెండుసార్లు గెలుపొంది శాసన సభ్యులుగా ఉండడం మరోరికార్డు. రామచంద్రారెడ్డి ఒకసారి మెదక్జిల్లా నుంచి, ఒకసారి ఇక్కడ నుంచి గెలవగా, కమలాదేవి ఆలేరు నుంచి మూడుసార్లు గెలిచారు. భువనగిరిలో పిడిఎఫ్ రెండుసార్లు, సిపిఐ ఒకసారి, కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఐదుసార్లు గెలుపొందగా, టిడిపి ఏడుసార్లు టిఆర్ఎస్ రెండుసార్లు గెలిచింది. కేంద్ర మాజీ మంత్రి ఎ. నరేంద్ర 2004లో ఇక్కడ టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి ఓడిపోయారు. కాగా జిట్టా బాలకృష్ణరెడ్డి 2009లో టిఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్ధిగా రంగంలో ఉండగా, 2014, 2018లలో స్వతంత్రుడిగా పోటీచేశారు. తెలంగాణ పోరాట యోధుడు, కమ్యూనిస్టు పార్టీ నేత రావి నారాయణరెడ్డి భువనగిరిలో రెండుసార్లు గెలిచారు. 1952లో ఈయన ఒకేసారి లోక్సభకు, అసెంబ్లీకి గెలుపొందారు. తర్వాత అసెంబ్లీకి రాజీనామా చేశారు. ఇక్కడ రెండుసార్లు గెలిచిన కొండా లక్ష్మణ్బాపూజీ మరో రెండుసార్లు చినకొండూరులో గెలిచారు. అంతకుముందు ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్లో కూడా ఒకసారి విజయం సాధించారు. ఈయన దామోదరం సంజీవయ్య, కాసు మంత్రివర్గాలలో పనిచేశారు. భువనగిరిలో పద్నాలుగుసార్లు రెడ్లు గెలుపొందితే, రెండుసార్లు పద్మశాలి, ఒకసారి ఎస్.సి వర్గం నేతలు గెలుపొందారు. భువనగిరి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
నాంపల్లి, యాదాద్రి రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి షురూ
సాక్షి, హైదరాబాద్, యాదాద్రి: నిజాంకాలం నాటి చారిత్రక నాంపల్లి రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం వర్చువల్గా శంకుస్థాపన చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద సుమారు రూ.309 కోట్ల నిధులతో చేపట్టిన నాంపల్లి రైల్వేస్టేషన్ రీడెవలప్మెంట్కు ప్రధాని లాంఛనంగా పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా నాంపల్లి రైల్వేస్టేషన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళి సై, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్, సికింద్రాబాద్ డివిజనల్ అధికారి భరతేశ్కుమార్ పాల్గొన్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ, అమృత్ భారత్ స్టేషన్ పథకం తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందన్నారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 12 కొత్త ప్రాజెక్టులకు రైల్వేశాఖ రూ. 8,494 కోట్లు మంజూరుచేసిందని చెప్పారు. త్వరలో రూ.350 కోట్లతో యాదాద్రికి ఎంఎంటీఎస్ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అలాగే మరో రూ.300 కోట్లతో కాచిగూడ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులకు కూడా ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. రూ.700 కోట్లతో చేపట్టిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మూడేళ్లలో అధునాతన సికింద్రాబాద్ స్టేషన్ వినియోగంలోకి వస్తుందన్నారు చర్లపల్లి స్టేషన్ అభివృద్ధి, విస్తరణ తుది దశకు చేరుకుందని, 2024లో సేవలు ప్రారంభమవుతాయని కిషన్రెడ్డి చెప్పారు. ఆర్టీసీ విలీనం చేయాల్సిందే కానీ... ఆరీ్టసీని ప్రభుత్వంలో విలీనం చేయడం పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ అందుకోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతి సరైంది కాదని కిషన్రెడ్డి వ్యాఖ్యానించా రు. ఆర్టీసీకి ఉన్న రూ.వేల కోట్ల విలువైన స్థలాలను కాజేసేందుకే ఆగమేఘాల మీద విలీనం చేస్తున్నట్లుగా తెలుస్తోందని ఆరోపించారు. రూ.25.24 కోట్లతో యాదాద్రి స్టేషన్ అభివృద్ధి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం రాయిగిరిలోని యాదాద్రి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం వర్చువల్గా శంకుస్థాపన చేశారు. రూ.25.24 కోట్ల వ్యయంతో ఈ స్టేషన్ అభివృద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని చిత్ర పటానికి భువనగిరి మాజీ ఎంపీ నర్సయ్యగౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి పాలాభిషేకం చేశారు. -
యాదాద్రిని సందర్శించిన బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్
నల్గొండ: బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఒవెన్ గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ను సందర్శించారు. కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి పరిపాలన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించి మొక్కను అందజేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు జిల్లాలో అమలవుతున్న తీరును హై కమిషనర్కు కలెక్టర్ పమేలా సతప్పతి వివరించారు. అనంతరం బ్రిటీష్ హైకమిషనర్ గారెత్ విన్ ఒవెన్ యాదగిరిగుట్టకు వెళ్లి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆచార్యులు ఆయనకు సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆచార్యులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. -
యాదాద్రికి ఎంఎంటీఎస్
సాక్షి, హైదరాబాద్, యాదాద్రి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి ఎంఎంటీఎస్ అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణ మొదలైంది. ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు ఉన్న 33 కిలోమీటర్ల మార్గంలో ఇప్పుడున్న రెండు లైన్లతో పాటు ఎంఎంటీఎస్ కోసం మరోలైన్ అదనంగా నిర్మించనున్నారు. వాస్తవానికి ఎంఎంటీఎస్ రెండోదశ కింద 2016లోనే ఈ ప్రాజెక్టు చేపట్టారు. కానీ రాష్ట్రప్రభుత్వం తన వాటాగా నిధులు కేటాయించకపోవడంతో తీవ్ర జాప్యం నెలకొంది. రూ.330 కోట్లతో అప్పట్లో అంచనాలు రూపొందించారు. పెరిగిన ధరల దృష్ట్యా ప్రాజెక్టు వ్యయం ఇప్పుడు రూ.430 కోట్లకు చేరింది. రైల్వేశాఖ వందశాతం నిధులతో ఈ ప్రాజెక్టు నిర్మించనుంది. రైల్ వికాస్నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) ఆధ్వర్యంలో త్వరలో పనులు ప్రారంభమవుతాయి. జీఎం సమీక్ష దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్, ఆర్వీఎన్ఎల్ చీఫ్ప్రాజెక్ట్ మేనేజర్ మున్నాకుమార్, సికింద్రాబాద్ డీఆర్ఎం ఏకే గుప్తాలతో కూడిన ఉన్నతాధికారుల బృందం గురువారం యాదాద్రి రైల్వేస్టేషన్ను సందర్శించింది. రైల్వేస్టేషన్లో ప్రయాణికుల సదుపాయాలు, స్టేషన్ అభివృద్ధి ప్రణాళికలు, కొత్తగా నిర్మించాల్సిన ఎంఎంటీఎస్–2 లైన్, తదితర పనులపైన జీఎం సమీక్షించారు. ప్రాజెక్ట్లో భాగంగా ఘట్కేసర్, బీబీనగర్, భువనగిరి, యాదాద్రి స్టేషన్లు, యార్డులలో అదనపు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతమున్న రైల్వేస్టేషన్లో నూతనంగా నిర్మించిన ప్లాట్ఫాం, స్టేషన్ ఇతర వసతుల కోసం స్థలాన్ని జీఎం పరిశీలించారు. ప్రస్తుతం గుట్టవైపు ఉన్న స్టేషన్కు ఎదురుగా నూతన రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టడానికి అనువుగా ఉన్నట్టు గుర్తించారు. యాదాద్రి క్షేత్ర ఆలయ నమూనాతో రైల్వేస్టేషన్ ముఖ ద్వారం నిర్మించనున్నారు. ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపేందుకు చర్యలు తీసుకోవాలని, రైల్వేస్టేషన్ను ఆధునీకరించాలని, రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి రాసిన వినతిపత్రాన్ని జీఎంకు భువనగిరి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ అందజేశారు. జీఎం ముందుగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్నారు. యాదాద్రి పునరాభివృద్ధి అమృత్భారత్ స్టేషన్ పథకం కింద యాదాద్రి రైల్వేస్టేషన్ను పునరాభివృద్ధి చేయనున్నట్టు జీఎం అరుణ్కుమార్ జైన్ తెలిపారు. ఎంఎంటీఎస్ –2 లైన్ కోసం స్టేషన్ తూర్పు వైపున విస్తరించాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఈ స్టేషన్ అభివృద్ధికి రైల్వేశాఖ నిధులు కేటాయించిన దృష్ట్యా అమృత్భారత్ పథకం కింద పడమర వైపున కూడా స్టేషన్ అభివృద్ధి చేస్తామని, టెండర్లు కూడా పిలుస్తామని చెప్పారు. ప్లాట్ ఫామ్ల పైకప్పు నిర్మాణం, ప్రధాన ముఖద్వార అభివృద్ధితో పాటు స్టేషన్ భవనాన్ని మెరుగుపరచనున్నట్టు తెలిపారు. ఎంఎంటీఎస్తోపాటు, స్టేషన్ అభివృద్ధి వల్ల యాదాద్రికి భక్తులు అతి తక్కువ చార్జీల్లోనే వెళ్లవచ్చన్నారు. -
ప్రమాదమా ? కుట్రా ?
-
బూడిదైన ఫలక్నుమా.. కేసు నమోదు
సాక్షి, యాదాద్రి: ఫలక్నుమా ఎక్స్ప్రెస్ దగ్ధం ఘటనలో కేసు నమోదు చేశారు. ఐదు బోగీలు పూర్తిగా దగ్ధమైనట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫలక్నుమా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఘటనపై.. రైల్వే యాక్ట్ సెక్షన్ 80/2023 కింద కేసు నమోదు చేశారు. హౌరా(కోల్కతా) నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ (Falaknuma express)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రెండు బోగీల్లోంచి దట్టమైన పొగలు వస్తున్నట్లు గమనించిన సిబ్బంది అప్రమత్తమై రైలును నిలిపివేశారు. ఆ రెండు బోగీల్లోని ప్రయాణికులను కిందికి దించేశారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి - బొమ్మాయిపల్లి మధ్య జరిగింది. మంటలు క్రమంగా 6 బోగీలకు వ్యాపించగా.. 5 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల్లో ఫలక్నుమా.. ఫొటోలు ప్రయాణికుల మండిపాటు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపించారు. ఒడిశా బాలాసోర్లో దాదాపు 300 మందిని పొట్టనబెట్టుకున్న ఘోర ప్రమాదం తర్వాత కూడా ఎలాంటి భద్రతా చర్యలు పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాగులు కాలిపోయాయని కొందరు.. మరికొందరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకొందరు నగదు, సామగ్రి కోల్పోయామని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఫలక్నుమా అంటే అర్థం తెలుసా? -
ఎప్పుడూ రద్దీనే.. ఫలక్నుమా ఎక్స్ప్రెస్కి ఆ పేరెలా వచ్చిందంటే..
అగ్ని ప్రమాదం ఘటన నేపథ్యంలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ Falaknuma Express ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఎవరికీ ఏం కాకపోవడంతో అధికారులూ ఊపిరి పీల్చుకున్నారు. జరిగింది ప్రమాదమా? లేదంటే కుట్ర ఏమైనా ఉందా? అనే కోణంలోనూ చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో రైలు నేపథ్యం గురించీ కొందరు గూగుల్ తల్లిని ఆరాలు తీస్తున్నారు. ఫలక్నుమా ఎక్స్ప్రెస్కు Falaknuma Express ఆ పేరు హైదరాబాద్ నగరంలోని ఫలక్నుమా ప్యాలెస్ పేరు మీద నుంచే వచ్చింది. ఫలక్నుమా అనేది పర్షియా పదం. దాని అర్థం గగన ప్రతిబింబం లేదా స్వర్గ ప్రతిబింబం అని. 🚆 ఫలక్నుమా ఎక్స్ప్రెస్ దక్షిణ మధ్య రైల్వే ఆధీనంలో నడిచే సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్. 🚆 1993 అక్టోబర్ 15వ తేదీన ఫలక్నుమా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తొలి సర్వీస్ పట్టాలెక్కింది. 🚆హౌరా జంక్షన్ నుంచి ఉదయం ప్రారంభమయ్యే ఫలక్నుమా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్.. మరుసటి రోజు ఉదయం సికింద్రాబాద్ జంక్షన్ స్టేషన్కు చేరుకుంటుంది. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ జంక్షన్ నుంచి ప్రారంభమై.. మరుసటిరోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో చేరుకుంటుంది. 🚆 నిత్యం నడిచే ఈ రైలు.. 1,544 కిలోమీటర్లు (959 మైళ్ల) ప్రయాణిస్తుంది. 🚆 సగటు వేగం.. గంటకు 60కిలోమీటర్లు. గరిష్ట వేగం 110 కిలోమీటర్లుగా ఉంటుంది. 12703 హౌరా టు సికింద్రాబాద్, అలాగే 12704 సికింద్రాబాద్-హౌరా రూట్లోనే ఇదే సగటు వేగంగా.. దాదాపు 26 గంటలకు తన ట్రిప్ ముగిస్తుంది. 🚆 నిత్యం కిక్కిరిసిపోయే ప్రయాణికులతో తీవ్రరద్దీ మధ్య ఈ రైలు పరుగులు పెడుతుంది. అందుకు ప్రధాన కారణం.. తక్కువ స్టేషన్లలో ఈ రైలు ఆగడం. 🚆 సికింద్రాబాద్-హౌరా మధ్యలో 24 స్టేషన్లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది. ఏసీ ఫస్ట్క్లాస్తో పాటు ఏసీ టూ టైర్, ఏసీ త్రీ టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ అన్రిజర్వ్డ్ కోచ్లు ఉంటాయి. క్యాటరింగ్ సౌకర్యమూ ఉంది. 🚆 రైలు సాధారణంగా 24 ప్రామాణిక ICF కోచ్లను కలిగి ఉంటుంది. 🚆 నల్లగొండ, గుంటూరు జంక్షన్, విజయవాడ జంక్షన్, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, విశాఖపట్నం, విజయనగరం జంక్షన్, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, ఖుర్దా రోడ్ జంక్షన్, భువనేశ్వర్, కటక్ జంక్షన్, భద్రక్, బాలాసోర్(తాజాగా ప్రమాదం జరిగింది ఈ పరిధిలోనే), ఖరగ్పూర్ జంక్షన్, హౌరా.. ఇలా ప్రధాన స్టేషన్లలో హాల్టింగ్ ఉంది. 🚆గతంలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్.. నారాయణాద్రి ఎక్స్ప్రెస్(సికింద్రాబాద్-తిరుపతి) రేక్స్(కోచ్లను) మార్చుకునేది. ప్రస్తుతం 17063/17064 అజంతా ఎక్స్ప్రెస్(సికింద్రాబాద్-మన్మాడ్(మహారాష్ట్ర) రైలుతో పంచుకుంటోంది. 🚆శతాబ్ధి, రాజధాని, దురంతో సూపర్ఫాస్ట్ రైళ్ల మాదిరి ఈ రైలును శుభ్రంగా మెయింటెన్ చేస్తుంది భారతీయ రైల్వేస్. అందుకే ప్రయాణికులు ఈ రూట్లో ఈ రైలుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. 🚆🔥 అయితే.. గత కొంతకాలంగా ఈ రైలు నిర్వహణపై విమర్శలు వినిపిస్తున్నాయి. తాజా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడి సికింద్రాబాద్ చేరుకున్న ప్రయాణికులు కొందరు.. ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో సిగరెట్లు, గుట్కాలు అమ్ముతున్నారంటూ ఆరోపించడం గమనార్హం. ఇదీ చదవండి: ఫలక్నుమా ప్రమాదం.. రాత్రిపూట జరిగి ఉంటేనా? -
రైల్లో మంటలు కారణం ఇదేనా...
-
ఫలక్నుమా రైలు ప్రమాదం.. విద్రోహ చర్యా?
సాక్షి, యాదాద్రి జిల్లా: యాదాద్రి జిల్లాలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్కు మంటలు అంటుకున్న విషయం తెలిసిందే. షాట్ సర్క్యూట్తో బోగీలకు మంటలు చెలరేగడంతో బొమ్మాయిపల్లి-పగిడిపల్లి మధ్య రైలును ఆపేశారు. అప్రమత్తమైన ప్రయాణికులు ట్రైన్ దిగి వెళ్లడంతో ఘోర ప్రమాదం తప్పింది. మంటల ధాటికి మూడు బోగీలు(S4,S5,S6) పూర్తిగా దగ్ధమయ్యాయి. శుక్రవారం ఉదయం 11.25 నిమిషాలకు ప్రమాదం జరగ్గా.. సమాచారం అందుకున్న రైల్వే, ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సహాయక చర్యలను జీఎం అరుణ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఫలక్నుమా రైలు ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. చార్జింగ్ పాయింట్ వద్ద ఓ ప్రయాణికుడు సిగరెట్ తాగుతున్నట్లు గమనించామని, మంటలు అలుముకున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే ప్రమాదం వెనుక విద్రోహ చర్య ఉండవచ్చని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైల్వేశాఖ అధికారులు విచారణ చేపట్టారు. సంబంధిత వార్త: Yadadri: ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో మంటలు.. నాలుగు బోగీలు దగ్ధం కాగా కొన్ని రోజుల క్రితం సౌత్ సెంట్రల్కు వచ్చిన బెదిరింపు లేఖ పలు అనుమానాలకు తావిస్తోంది. హైదరాబాద్, ఢిల్లీ రూట్లో బాలాసోర్ వంటి ప్రమాదం జరుగుతుందని ఓ అంగతకుడు లేఖలో హెచ్చరించారు. ఈ లేఖపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ లేఖకు దీనికి ఏమైనా లింక్ అందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రైలు ప్రమాదంపై అధికారులు హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశారు. 36912, 82819 టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. ఇక హైరా నుంచి హైదరాబాద్కు 1550 కిలోమీటర్ల దూరం ఉండగా.. గమ్యం మరో 40 కిలో మీటర్లు ఉందనగా ఈ ప్రమాదం జరిగింది. పగలు కావడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన రాత్రిపూట జరిగితే ఎన్ని ప్రాణాలు పోయేవోనని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగతా బోగీలతో సికింద్రాబాద్కు రైలు ప్రయాణమైంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో మంటలు
-
Yadadri: ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో మంటలు.. మూడు బోగీలు దగ్ధం
సాక్షి, యాదాద్రి: ఫలక్నుమా సూపర్ఫాస్ట్ రైలులో శుక్రవారం మంటలు చెలరేగాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మాయిపల్లి-పగిడిపల్లి మధ్య ఈ ఘటన జరిగింది. ఇప్పటివరకు కారణం ఏంటన్నది అధికారికంగా వెల్లడించలేదు. ప్రాథమికంగా షాట్ సర్క్యూట్ జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మంటలు పూర్తిగా పెరగకముందే బోగీల్లోని ప్రయాణికులను దించేయడంతో ప్రాణ నష్టం తప్పింది. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినప్పటికీ ప్రాణనష్టం జరగకపోవడం స్వల్ప ఉపశమనం. మంటల ధాటికి మూడు బోగీలు పూర్తిగా దగ్ధమైమయ్యాయి. రైలు హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద ఘటన కారణంగా ఈ రూటులో వెళ్లే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. తప్పిన పెనుముప్పు మంటలు చెలరేగడానికి కచ్చితంగా కారణం ఏంటన్నది తెలియకపోయినా.. కొందరు ప్రయాణీకులు మాత్రం రైలులో ఓ వ్యక్తి సిగరెట్ తాగుతున్నట్టు గమనించామని తెలిపారు. ఛార్జింగ్ పాయింట్ వద్ద ఓ ప్రయాణికుడు సిగరెట్ తాగుతూ కనిపించాడని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. తొలుత S4లో మంటలు వ్యాపించాయని చెప్పారు. ఉదయం 11 -11.30 గంటల మధ్య ప్రమాదం జరిగిందని, మంటలు రావడంతో ప్రయాణీకులు చైన్ లాగి రైలుని ఆపివేశారు. ప్రయాణికులు అప్రమత్తమై దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. చైన్ లాగకపోయి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని పేర్కొన్నారు. కాగా కాలిపోయిన బోగీల్లో ఎక్కువ మంది విశాఖ వాసులు ఉన్నారు. రిజర్వేషన్ లేకున్నా.. కొందరు స్లీపర్ బోగీల్లో ఎక్కినట్టు గుర్తించారు. మొత్తం మూడు బోగీలకు మంటలు వ్యాపించాయి. ఫలక్నుమా S4, S5, S6 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. పక్క బోగీలకు మంటలు వ్యాపించకుండా అధికారులు లింక్ తొలగించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: హైదరాబాద్లో ‘కేరళ స్టోరీ’ ఉదంతం.. కూతురు జాడ చెప్పాలంటూ.. -
రీజనల్ రింగ్ రోడ్డు బాధిత రైతులకు సంకెళ్లు
-
బోనం ఎత్తుకున్న కలెక్టర్ పమేలా సత్పతి
భువనగిరి : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం చెరువుల పండుగను ఊరూరా ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు బోనాలు, బతుకమ్మలతో చెరువుల వద్దకు ర్యాలీగా వెళ్లి ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి నైవేద్యం సమర్పించారు. ఆటాపాటలతో సందడి చేశారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. భువనగిరిలో పెద్ద చెరువు వద్ద నిర్వహించిన వేడుకలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి పాల్గొని మాట్లాడారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పూర్వ వైభవం సంతరించు కున్నాయన్నారు. బోనం ఎత్తుకున్న కలెక్టర్ భువనగిరి మండలంలోని రాయగిరి చెరువు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. బోనమెత్తుకొని మైసమ్మ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ కార్యక్రమాల్లో జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ కొల్పుల అమరేందర్, మున్సిపల్ చైర్మన్ అంజనేయులు, వైస్ చైర్మన్ కిష్టయ్య, పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, కౌన్సిలర్లు జిట్టా వేణుగోపాల్రెడ్డి, నర్సింగ్నాయక్, ఊదరి లక్ష్మీసతీష్ తదితరులు పాల్గొన్నారు. -
దొంగబాబా...
-
బ్రిడ్జి పై నుంచి ప్రవహిస్తున్న మూసీనది
-
తీరొక్క మొక్క.. పల్లె లెక్క
కనుచూపు మేర కనువిందుచేసే పచ్చిక..ఆహ్లాదాన్ని పంచే పూలతో పాటు ఇతర మొక్కలు.. నీటిలో ఈదులాడే చేపలు, బాతులు..చెట్టు కింద ధ్యానముద్రలో బుద్ధుడు..పక్కనే తెలంగాణ పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టేలా ఎడ్లబండి.. అక్కడే సాగుపనిలో నిమగ్నమైన రైతుదంపతులు.. భవనం గోడలపై అల్లిబిల్లిగా అల్లుకున్న లతలు.. పచ్చికపై ఆడుకుంటున్న చిన్నారులు.. కుందేళ్ల పరుగులు.. పక్షుల కిలకిలారావాలు..వేపచెట్టుకు కట్టిన ఊయల.. ఓపెన్ జిమ్.. ఇదీ అక్కడ అడుగుపెడితే కనిపించే అందమైన ‘పల్లె దృశ్యం’. ఇంతకీ ఇదెక్కడో చెప్పలేదు కదూ.. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ బంగ్లాలో.. పర్యావరణహితంగా.. యాదాద్రి భువనగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్తోపాటు కలెక్టర్, అదనపు కలెక్టర్ బంగ్లాలను గతేడాది ఫిబ్రవరి 12న ప్రారంభించారు. బంగ్లాలో చేరిన కలెక్టర్ పమేలా సత్పతి కేవలం 3 నెలల్లోనే తన అభిరుచికి అనుగుణంగా దాన్ని తీర్చిదిద్దుకున్నారు. కొత్త ఆవిష్కరణలకు, అందమైన ల్యాండ్స్కేపింగ్కు బంగ్లాను వేదికగా మార్చారు. పర్యావరణహితంగా, సేంద్రియ పద్ధతిలో గార్డెనింగ్, టెర్రస్, కిచెన్ గార్డెనింగ్ నిర్వహిస్తూ పలురకాల పూలమొక్కలు పెంచుతున్నారు. కలెక్టర్గా క్షణం తీరికలేకుండా గడిపే ఆమె కొద్ది సమయం చిక్కినా మొక్కల సంరక్షణలోనే గడుపుతారు. బంగ్లాను ఉద్యానవనంగా మార్చిన ఆమె.. రాష్ట్ర ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జరిగిన గార్డెన్ ఫెస్టివల్–2023లో సేంద్రియ పద్ధతిలో పర్యావరణహితంగా చేపట్టిన వ్యక్తిగత గార్డెనింగ్ విభాగంలో మొదటి బహుమతిని అందుకున్నారు. ఎటుచూసినా పచ్చదనం.. పూల అందాలే.. కలెక్టర్ బంగ్లా టెర్రస్ వందల రకాల మొక్కలతో చిన్నపాటి ఉద్యానవనాన్ని తలపిస్తోంది. ఇక బంగ్లా ఆవరణ 400 రకాల మొక్కలకు నెలవైంది. వాటి రక్షణకు విభిన్నమైన కుండీలు పెట్టారు. నీటి మొక్కల కోసం తొట్లను ఏర్పాటుచేశారు. కలెక్టర్ బంగ్లా కిటికీలు, ఇంట్లోకి వెళ్లే కారిడార్, వరండా.. ఇలా ఆవరణ మొత్తం అందమైన మొక్కలతో నింపేశారు. విధి నిర్వహణలో భాగంగా ఎక్కడకు వెళ్లినా కొత్త మొక్కలు సేకరించి.. వాటిని తన బంగ్లా ఆవరణలో నాటడం పమేలాకు అలవాటు. అలాగే, వేర్వేరు ప్రాంతాల్లో భిన్నమైన మొక్కలు పెంచుతున్న వారి దగ్గర నుంచీ కొన్నింటిని తెచ్చారు. వృథా సామగ్రి, రాళ్లు, ఇసుక, రకరకాల మట్టితో గార్డెనింగ్ నిర్వహిస్తున్నారు. మొక్కలంటే ప్రాణం.. మొక్కలంటే నాకు ప్రాణం. ఉద్యోగ నిర్వహణలో ఎక్కడికి బదిలీపై వెళ్లినా నా వెంట లగేజీతోపాటు మొక్కలను కచ్చితంగా తీసుకెళ్తా. మా అమ్మ వ్యవసాయ శాస్త్రవేత్త కావడంతో పదేళ్లప్పటి నుంచే నాకూ మొక్కలంటే ఇష్టం ఏర్పడింది. చిన్నప్పుడు మా అమ్మతో వెళ్తే అక్కడ కొందరు నాకు మొక్క లు బహుమతిగా ఇచ్చేవారు. అలా నాకు మొక్కల పెంపకంపై ఆసక్తి కలిగింది. నేను ప్రస్తుతం ఉంటున్న బంగ్లాలో 400 మొక్కల తొట్లు ఉన్నాయి. ఎంత బిజీగా ఉన్నా మొక్కల సంరక్షణకు రోజూ కొంత సమయం కేటాయిస్తాను. – పమేలా సత్పతి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ -
లండన్లో హైదరాబాద్ యువతి మృతి
సాక్షి, హైదరాబాద్: ఫస్ట్ టర్మ్ అయిపోయింది.. సెలవు తీసుకుని ఇంటికొస్తానని చెప్పిన ఆ యువతి శాశ్వతంగా సెలవు తీసుకుంది. హైదరాబాద్ యువతి సాయి తేజస్వి కొమ్మారెడ్డి (24) లండన్లో దుర్మరణం చెందింది. ఒక్కగానొక్క బిడ్డ మృతి చెందడం, మృతదేహం రావడానికి సమయం పడుతుండటంతో నగరంలోని ఆమె కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. యాదాద్రి జిల్లా మోటకొండూరుకు చెందిన కొమ్మారెడ్డి శశిధర్ రెడ్డి, జ్యోతి దంపతులు నగరంలోని ఐఎస్సదన్ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీలో ఉంటున్నారు. వీరి కుమార్తె తేజస్వి సైదాబాద్లో ఇంజనీరింగ్ (సీఎస్ఈ) పూర్తి చేశారు. లండన్లోని క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేయడానికి గతేడాది సెప్టెంబర్లో వెళ్లారు. ఈ నెల 11న తన స్నేహితులతో కలిసి అక్కడి బ్రైటన్ బీచ్లో విహారయాత్రకు వెళ్లి సముద్రంలో కొట్టుకుపోయారు. వెంట ఉన్న సహ విద్యార్థులు ఎమర్జెన్సీ రెస్పాన్స్కు సమాచారం ఇచ్చారు. అక్కడి బలగాలు గాలించి తేజస్వి మృతదేహాన్ని గుర్తించి ససెక్స్ కౌంటీ హాస్పిటల్కు తరలించారు. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని హైదరాబాద్కు తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయంపై కేటీఆర్కు ట్వీట్ చేసిన తేజస్వి బంధువులు మృతదేహం ఇక్కడకు తరలించడానికి సహకరించాలని కోరారు. బుధవారం మృతురాలి ఇంటికి వెళ్లిన కేంద్రమంత్రి కిషన్రెడ్డితో ఫోన్లో మాట్లాడించారు. మృతదేహం శుక్రవారం నాటికి నగరానికి చేరుకుంటుందని ఆమె కుటుంబీకులకు సమాచారం అందింది. ‘‘చనిపోవడానికి ముందు రోజు తేజస్వి తల్లిదండ్రులతో వీడియోకాల్లో మాట్లాడింది. ఫస్ట్ టర్మ్ పూర్తయిన విషయం చెప్పింది. వీలుంటే వారం లేదా పది రోజులు సెలవు తీసుకుని రమ్మని వాళ్లు చెప్పారు. ఆరేడు నెలల్లో గ్రాడ్యుయేషన్ కూడా ఉండటంతోసెర్మనీకి వెళ్లడానికి తల్లిదండ్రులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈలోపు ఇలా జరిగింది’’అని తేజస్వి బంధువులు తెలిపారు. చదవండి: ఎంసెట్లో ఇంటర్ మార్కుల వెయిటేజ్ ఎత్తివేత -
శ్రీస్వామి వారి ఆదాయం 14, వ్యయం 11
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంతోపాటు శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శ్రీశోభకృత్ నామ తెలుగు నూతన సంవత్సర వేడుకలను బుధవారం ఆచార్యులు ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వయంభూలు కొలువైన ప్రధానాలయంలో భక్ష్యా లు తయారు చేసి, షడ్రుచులతో సిద్ధం చేసిన పచ్చడికి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీస్వామి, అమ్మవార్లకు నివేదించారు. సాయంత్రం ముఖ మండపంలో శ్రీస్వామి వారిని అలంకరించి మాఢ వీధుల్లో సేవోత్సవం జరిపించారు. తూర్పు రాజగోపురం ముందు అధిష్టించి ఆచార్యులు పంచాగ పఠనం చేశారు. యాదాద్రి నృసింహస్వామిది తులా రాశి కాగా ఈ ఏడాది శ్రీస్వామి వారికి 14 ఆదాయం, 11 వ్యయం, శ్రీలక్ష్మీ అమ్మవారిది మేషరాశి కాగా ఆదాయం 5, వ్యయం 5, ఆండాళ్ అమ్మవారిది సింహ రాశి కాగా ఆదాయం 14 వ్యయం 2 ఉన్నట్లు ఆచార్యులు వివరించారు. శ్రీశోభకృత్లో భక్తులతో పాటు ప్రజలంతా ఆనందంగా ఉంటారని ఆచార్యులు వెల్లడించారు. ఈ ఏడాది వర్షాలు అధికంగా కురుస్తాయని, వడగళ్లు సైతం పడతాయని తెలిపారు. రైతాంగానికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం కలసి వచ్చే అంశం అని అన్నారు. వేసవిలో ఎండలు దంచి కొడతాయన్నారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని, ఎలాంటి వైరస్ ప్రజలకు సోకదని తెలిపారు. ఈ వేడుకల్లో ఈఓ గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, ముఖ్య అర్చకులు, పండితులు, పురోహితులు పాల్గొన్నారు. -
సైనిక లాంఛనాలతో లెఫ్టినెంట్ కల్నల్ అంత్యక్రియలు
సాక్షి, యాదాద్రి/మల్కాజిగిరి/సాక్షి, హైదరాబాద్: అరుణాచల్ప్రదేశ్లో మూడు రోజుల క్రితం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన లెఫ్టినెంట్ కల్నల్ ఉప్పల వినయ్భానురెడ్డి (వీవీబీరెడ్డి) అంత్యక్రియలు శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో సైనిక లాంఛనాలతో జరిగాయి. భానురెడ్డి తల్లిదండ్రులు, భార్య, కూతుళ్లు, బంధువులు, గ్రామస్తులు, ఆర్మీ అధికారులు, ప్రజాప్రతినిధులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వినయ్భానురెడ్డి తండ్రి నర్సింహారెడ్డి, కూతు రు హనిక.. చితికి నిప్పంటించారు. సైనికులు గాల్లోకి మూ డు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. ఆరీ్మకి చెందిన కల్నల్ మనీశ్ దేవగణ్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. వినయ్ భార్య స్పందనారెడ్డి భారత సైన్యంలో డాక్టర్గా పనిచేస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరిలోని వినయ్భానురెడ్డి ఇంటి నుంచి ఆయన పార్థివ దేహాన్ని శనివారం ఉదయం సైనిక వాహనంలో స్వగ్రామం బొమ్మలరామారానికి తీసుకువచ్చారు. ప్రముఖుల నివాళి: వినయ్భానురెడ్డి పార్థివదేహాన్ని బొమ్మలరామారంలోని ఆయన ఇంటికి తీసుకువచ్చి గంటపాటు ప్రజల సందర్శనార్థం ఉంచారు. అంతకు ముందు మల్కాజిగిరి నివాసంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై, ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే, సదరన్ కమాండ్ జనరల్ ఆఫీస్ కమాండింగ్ చీఫ్ లెఫ్టినెంట్ కల్నల్ ఎ.కె.సింగ్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆయనకు నివాళులర్పిం చారు. బొమ్మలరామారంలో మంత్రి జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, రాచకొండ సీపీ దేవేంద్రసింగ్ చౌహాన్, యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, డీసీపీ రాజేశ్చంద్ర తదితరులు వినయ్భానురెడ్డికి నివాళులర్పిం చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం అండగా నిలవాలి: ఎంపీ కోమటిరెడ్డి దేశం కోసం విధులు నిర్వహిస్తూ.. ప్రాణాలు విడిచిన లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ భానురెడ్డి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ. 50 లక్షల ఎగ్స్గ్రేషియా ఇవ్వాలని శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. -
యాదాద్రికి భక్తుల తాకిడి (ఫొటోలు)
-
మురళీ కృష్ణుడిగా శ్రీలక్ష్మీనరసింహస్వామి (ఫొటోలు)
-
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 90 సీట్లు: బండి సంజయ్
రానున్న శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 90 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి అధికారంలోకి వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు, టీడీపీ కలిసి గుంపుగా పోటీ చేయబోతున్నాయని, బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 10 లోక్సభ స్థానాల్లో గెలుపు ఖాయమన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ‘ప్రజాగోస బీజేపీ భరోసా’సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని చెప్పారు. మోటార్లకు మీటర్లు పెడతాం.. రుణాలివ్వాలని కేంద్రానికి లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వమేనని తాను సవాల్ విసిరితే ఇంతవరకు సమాధానం లేదని సంజయ్ విమర్శించారు. బీజేపీలో సీఎం అభ్యర్థి ఎవరనేది జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని చెప్పారు. కేసీఆర్ రాష్ట్రాన్ని దివాళా తీయించి రూ.5.30 లక్షల కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు. నయీం ఆస్తులను కేసీఆర్ కుటుంబం దోచుకుందని, నయీం డైరీ ఎటుపోయిందని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఇన్చార్జి కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్, రాష్ట్ర నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, గూడూరు నారాయణరెడ్డి పాల్గొన్నారు. 24 గంటల కరెంటుపై రాజీనామాకు సిద్ధమా? ‘రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్నామని ప్రగల్భాలు పలికే సీఎం కేసీఆర్ ఆ విషయానికి కట్టుబడి ఉంటారా? ఇస్తున్నట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తా. లేనిపక్షంలో సీఎం పదవికి రాజీనామా చేస్తారా? స్టేషన్ ఘన్పూర్ నుంచి సవాల్ చేస్తున్నా’అని బండి సంజయ్ పేర్కొన్నారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని శివాజీ చౌక్ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఘన్పూర్లో వంద పడకల ఆస్పత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఫైర్ స్టేషన్ తదితర హామీలన్నీ అమలుకు నోచుకోలేదని, ఇక్కడినుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా పనిచేసినా ఏమీ చేయలేదని విమర్శించారు. మిషన్ భగీరథ కోసం కేసీఆర్ కుటుంబ సభ్యులు పైపుల కంపెనీలు పెట్టుకున్నారని, కోట్ల రూపాయలు దోచుకున్నారని సంజయ్ ఆరోపించారు. -
వెండి మొక్కు జోడు సేవలు రద్దు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తులు నిర్వహించే వెండి మొక్కు జోడు సేవలను వచ్చే నెల 3వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈఓ గీతారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ వెండి మొక్కు జోడు సేవలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఇందుకు భక్తులు సహకరించాలని కోరారు. పురాతన శివలింగం చోరీ మిర్యాలగూడ: దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామ శివారులో సుమారు 1350 సంవత్సరాల క్రితం నాటి శివలింగం గురువారం రాత్రి అపహరణకు గురైంది. బొత్తలపాలెం గ్రామంలో గల బైరవాని చెరువు కట్టపై కాకతీయ రెడ్డిరాజు నిర్మించిన శివాలయం శిథిలం కాగా.. గ్రామస్తులు శివలింగానికి పూజలు నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి 11 గంటల వరకు కూడా శివలింగం ఉందని, ఉదయం సమయంలో శివలింగం కనిపించలేదని చెరువు కాపలాదారులు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో శివాలయం వైపు ఒక ఆటో వెళ్లినట్లు గ్రామస్తులు గుర్తించారు. కాగా.. సంఘటన స్థలాన్ని ఎస్ఐ రవికుమార్ సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జూదరుల అరెస్టు గరిడేపల్లి : గరిడేపల్లి మండలంలోని రాయినిగూడెం గ్రామంలో చెరువు కట్ట వద్ద పేకాట ఆడుతున్న నలుగురిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. వారి నుంచి నాలుగు బైక్లు, రెండు సెల్ఫోన్లు, రూ.1500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరితోపాటు పరారైన వ్యక్తులపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కొండల్రెడ్డి తెలిపారు. గేదెను ఢీకొన్న బైక్..ఒకరు మృతి పెద్దవూర: బైకుపై వెళ్తున్న వ్యక్తి గేదెను ఢీకొన్న ఘటనలో గాయాలపాలై చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. పెద్దవూర ఎస్ఐ పచ్చిపాల పరమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ రామంతపూర్కు చెందిన బొల్లెపల్లి శ్రీహరిరాజు (46)తన బైక్పై హాలియా నుంచి లింగంపల్లి గ్రామశివారులోగల తమ బత్తాయి తోటకు గురువారం రాత్రి 8.30గంటల సమయంలో వస్తున్నాడు. పెద్దవూర మండల పరిధిలోని లింగంపల్లి గ్రామం వద్ద అకస్మాత్తుగా రోడ్డుపైకి గేదె రావడంతో దానికి ఢీకొట్టాడు. బైక్ పైనుంచి కిందపడిన రాజు తలకు, చేతులకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడిని హైదరాబాద్కు తరలించగా చికిత్సపొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మృతుడి అన్న బొల్లెపల్లి శ్రీనివాసరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కుక్కల దాడిలో 15మందికి గాయాలు
సూర్యాపేట: పట్టణంలోని పలు వార్డుల్లో శునకాలు శుక్రవారం 15మందిపై దాడిచేసి గాయపరిచాయి. పట్టణంలోని రాజీవ్నగర్, కొత్తగూడెం బజార్, నెహ్రూనగర్లో 15మందిని శునకాలు గాయపరిచాయి. గాయపడ్డ వారిని సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి టీకాలు వేశారు. ఇటీవల సూర్యాపేట పట్టణంలో కుక్కల బెడద తీవ్రమైందని, వాటిని కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు. కాగా, వివిధ ప్రాంతాల నుంచి సూర్యాపేట ఆస్పత్రికి రోజుకు కనీసం 30 నుంచి 40 కుక్క కాటు కేసులు వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఆత్మకూర్లో6 గొర్రెలు మృతి ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : వీధి కుక్కల దాడిలో ఆరు గొర్రెలు మృతిచెందిన సంఘటన ఆత్మకూర్ మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ముత్యాల మల్లయ్య, నగిరె కృష్ణయ్యలు గొర్రెలను మేత కోసం గ్రామ శివారులోకి వేర్వేరుగా తోలుకుని వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో గుంపులుగా వచ్చిన కుక్కలు ఒక్కసారిగా మందపై దాడిచేసి దాదాపు ఆరు గొర్రెలను చంపివేశాయి. -
భూమి విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
చివ్వెంల(సూర్యాపేట) : ఇంటి స్థలం విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో చర్చి పక్కన ఉన్న 221 గజాల స్థల విషయంలో గ్రామానికి చెందిన మాద సుధాకు అదే గ్రామానికి చెందిన శీలం నాగయ్య, శీలం శ్రీను, శీలం వెంకటేశ్వర్లు, శీలం పవన్ల మధ్యన ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలో ఆ స్థలంలో బావి ఉండడంతో దానిని పూడ్చివేసి ఇంటి నిర్మాణం కోసం సుధా గ్రామ పంచాయతీ అనుమతులు తీసుకుంది. కాగా గ్రామానికి చెందిన శ్రీను, నాగయ్య, వెంకటేశ్వర్లు, పవన్లు అదే స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టారు. దీంతో శుక్రవారం స్థల విషయంలో సుధా, ఆమె సోదరుడు దార పుల్లయ్య, ఆయన కుమారుడు ప్రసన్న కుమార్, కూతుర్లు నవ్య, రాజేశ్వరీలకు నాగయ్య, శ్రీను, వెంకటేశ్వర్లు, పవన్లతో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణతో ఇరువర్గాల వారికి గాయాలయ్యాయి. వీరిని స్థానికులు చికిత్స నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై ఎస్ఐ విష్ణుమూర్తిని వివరణ కోరగా ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
రైతుల సమస్యలు గుర్తించాలి
సాక్షి,యాదాద్రి : రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేయాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థల సహాయ సంచాలకులు డాక్టర్ మల్లారెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏరువాక కేంద్రం జిల్లా సమన్వయ సమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి నివారణ చర్యలు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డీఏఓ నీలిమ, నల్లగొండ ఇన్చార్జ్ డీఏఓ వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య
భువనగిరి : అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన భువనగిరి మండల పరిధిలోని తుక్కాపురం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఈర్ల నాగరాజు(27) భువనగిరి పట్టణంలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. అప్పుల బాధతో మానసిక వేదనకు గురై శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బిల్డింగ్ కొక్కానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా తన మృతికి ఎవరు కారణం కాదని సూసైడ్ నోటు రాశాడు. మృతుడి సోదరి కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై రాఘవేందర్గౌడ్ తెలిపారు. -
తప్పిపోయిన బాలుడు తల్లిదండ్రులకు అప్పగింత
గరిడేపల్లి : తప్పిపోయిన బాలుడిని చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. గురువారం రాత్రి గరిడేపల్లి మండలంలోని కితవారిగూడెంలో గుర్తుతెలియని బాలుడిని గ్రామ ప్రజలు గుర్తించి చైల్డ్ డిపార్ట్మెంట్ వారికి అప్పగించారు. బాలుడిని బాలల సంరక్షణ కేంద్రంలో ఉంచి విచారించగా అతడి పేరు వనమా రాజీవ్గా, తల్లిదండ్రులు పద్మావతి, సురేష్ అని చెప్పాడు. ఈమేరకు బాలుడిని చెల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల మేరకు చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి సాయి త్రిలోక్ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఉన్న బాబు తల్లిదండ్రులకు శుక్రవారం అప్పగించారు. -
భువనగిరి పట్టణ అభివృద్ధే లక్ష్యం
భువనగిరి : భువనగిరి పట్టణాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని సమ్మద్ చౌరస్తా నుంచి జంఖానగూడెం చౌరస్తా వరకు చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లతో పాటు డ్రెయినేజీ పనులు చేపడతామని, మంచి నీటి సమస్యలు లేకుండా చూస్తామని తెలిపారు. ఇప్పటికే పట్టణంలో సీసీ రోడ్లు వేయడం జరిగిందని, ప్రస్తుతం సమ్మద్ చౌరస్తా నుంచి జంఖానగూడెం చౌరస్తా వరకు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ కిష్టయ్య, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, బీఆర్ఎస్ పట్టణ కమిటీ అధ్యక్షుడు ఏవీ కిరణ్కుమార్, కార్యదర్శి రచ్చ శ్రీనివాస్రెడ్డి, కౌన్సిలర్ హేమలత, నాయకులు జగన్, హరికిషన్గౌడ్ తదితరులు నాయకులు ఉన్నారు. -
తెలంగాణలో బహుజన రాజ్యస్థాపనే లక్ష్యం
కోదాడ: తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం స్థాపనే లక్ష్యంగా ముందుకు పోతున్నామని బీఎస్పీ ఉత్తరప్రదేశ్ ఎంపీ రాంజీగౌతమ్ అన్నారు. శుక్రవారం కోదాడలో జరిగిన ఆ పార్టీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, దేశంలో బీజేపీ రెండు ఒకటేనన్నారు. రాష్ట్రంలో బహుజనులు ఏకమై రాజ్యాధికార సాధనకు పోరాడాలన్నారు. రాష్ట్రంలో లక్షకు పైగా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయని వాటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు మందా ప్రభాకర్, బాలస్వామి, దయానందరావు, పిల్లుట్ల శ్రీనివాస్, బొడ్డు కిరణ్, మల్లేశ్యాదవ్, కాంపాటి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ సిబ్బందిపై దాడి.. పలువురికి గాయాలు
వలిగొండ : విద్యుత్ సిబ్బందిపై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన శుక్రవారం రాత్రి వలిగొండలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండకు చెందిన బల్లెపు కృష్ణస్వామి తన ఇంటి కరెంట్ బిల్లు బకాయి పడ్డాడు. దీంతో విద్యుత్ సిబ్బంది కరెంట్ సరఫరా నిలిపివేశారు. ఆగ్రహించిన కృష్ణస్వామి కళ్లెం నరేష్, వేముల నర్సింహ, గుర్తుతెలియని వ్యక్తితో కలిసి విద్యుత్ కార్యాలయానికి వెళ్లి నల్ల రాములుపై ఇనుప రాడ్డు తో దాడి చేశారు.అడ్డుకోబోయిన ముగ్గురు విద్యుత్ పైనా దాడికి దిగారు. కార్యాలయం తలుపులను ధ్వసం చేశారు. గాయపడ్డ వారిని రామన్నపేట ఆస్పత్రికి తరలించారు. ఏఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బాలల సంరక్షణ అందరి బాధ్యత
బీబీనగర్ : బాలల సంరక్షణ, వారి హక్కులను కాపాడడం ప్రతి ఒక్కరూ బాధ్యతంగా భావించాలని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. భువనగిరిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన స్నేహిత రెండవ విడత అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. బాలల హక్కులు కాపాడడం, వారి సంరక్షణ, బాధ్యతల పట్ల తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించేందుకు స్నేహిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. తొలి విడతలో ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో 26 బృందాలను ఏర్పాటు చేసి 271 పాఠశాలల్లో 6నుంచి 10వ తరగతుల విద్యార్థులు 43వేల మందికి, తల్లిదండ్రులకు అవగాహన కల్పించినట్లు చెప్పారు. రెండో విడుతలో 42 బృందాల ద్వారా 251 పాఠశాలల్లో 17,058మంది విద్యార్థులకు స్పర్శ, చెడు స్పర్శ, విద్య ప్రాముఖ్యం, ఇంటర్నెట్ దుర్వినియోగం, ఆరోగ్య అలవాట్లు, స్వీయ రక్షణ తదితర అంశాలపై అవగహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. డీసీపీ రాజేశ్చంద్ర మాట్లాడుతూ.. ఎమైనా సమస్యలు వస్తే 1098, 100 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, ఎంపీపీ సుధాకర్గౌడ్, జెడ్పీటీసీ ప్రణీతాపింగళ్రెడ్డి, తహసీల్దార్ అశోక్రెడ్డి, మండల ప్రత్యేకాధికారి అన్నపూర్ణ, ఏంపీడీఓ శ్రీవాణి, సర్పంచ్ భాగ్యలక్ష్మీశ్రీనివాస్, ఏంఈఓ నాగవర్దన్రెడ్డి, జిల్లా బాలల సంరక్షణ అధికారి సైదులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ నాగలక్ష్మి పాల్గొన్నారు. -
స్వయం ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ
భూదాన్పోచంపల్లి : స్వయం ఉపాధి కోర్సుల్లో నిరుద్యోగ యువతకు భూదాన్పోచంపల్లి మండలం జలాల్పురంలో గల స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ పీఎస్ఎస్ఆర్ లక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అకౌంట్స్ అసిస్టెంట్(ట్యాలీ), ఆటోమొబైల్ టు, త్రీ వీల ర్ సర్వీసింగ్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ట్యాలీ కోర్సుకు బీకాం, ఆటోమొబైల్ పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. అభ్యర్థులు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సున్న వారు అర్హులన్నారు. ఆసక్తి, అర్హత కల్గిన అభ్యర్థులు తమ విద్యార్హతల ఒర్జినల్, జిరాక్స్లు, పాస్ఫొటోలు, ఆధార్కార్డుతో మార్చి 1న సంస్థలో నిర్వహించే కౌన్సిలింగ్కు హాజరుకావాలని కోరారు. ఎంపికై న అభ్యర్థులకు హాస్టల్ వసతి కల్పించనున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తయిన అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వివరించారు. వివరాలకు 9133908000, 933908111, 9133908222 నంబర్లను సంప్రదించాలని అన్నారు. శాస్త్రోక్తంగా ఊంజలి సేవ యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజలి సేవ ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ మాఢ, తిరువీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అధిష్టింపజేసి అమ్మవారికి ఊంజలి సేవ చేశారు. అదే విధంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఇంటర్ ప్రాక్టికల్స్కు 28 మంది గైర్హాజరు భువనగిరి : జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం జరిగిన పరీక్షలకు 606 మంది విద్యార్థులకు 578 మంది హాజరయ్యారు. 28 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ రమణి తెలిపారు. నేడు ఆలేరుకు బండి సంజయ్ రాక ఆలేరురూరల్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ శనివారం ఆలేరుకు రానున్నారు. ఆలేరులో జరిగే ప్రజాగోస – బీజేపీ భరోసా కార్నర్ సమావేశంలో పాల్గొని మాట్లాడుతారని ఆ పార్టీ జిల్లా ఇన్చార్జ్ నందకుమార్యాదవ్ తెలిపారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర నాయకులు సూదగానికి హరిశంకర్గౌడ్, పడాల శ్రీనివాస్, వట్టిపల్లి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్తో కలిసి స్థల పరిశీలన చేశారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ చిరిగె శ్రీనివాస్, పట్టణ మండల అద్యక్షులు జహంగీర్, రాఘవేంద్ర, కౌన్సిలర్ సంగు భూపతి, సముద్రాల కల్పన, కృష్ణ, బందెల సుభాష్, రాజు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల పరిశీలన రామన్నపేట : పంచాయతీరాజ్ శాఖ జాయింట్ కమిషనర్ నర్సింహులు శుక్రవారం రామన్నపేట మండలంలోని వెల్లంకిలో పర్యటించారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య చర్యలను పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం, కూ రెళ్ల గ్రంథాలయం, అంగన్వాడీ కేంద్రం, రైతు వేదికలను తనిఖీ చేశారు. వెల్లంకి జాతీయ పురస్కారానికి పోటీపడుతున్న నేపథ్యంలో గ్రామంలో పర్యటించినట్లు డిప్యూటీ కమిషనర్ తెలిపారు. పురస్కారం కోసం తొమ్మిది అంశాలపై పంపిన నివేదికను పరిశీలించారు. పాలకవర్గానికి సూచనలు చేశారు. మార్చి రెండో వారంలో కేంద్ర బృందం పర్యటించనుందని, పంపిన నివేదికలు పక్కాగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీపీఓ సునంద, డీఎల్పీఓ సాధన, ఎంపీడీఓ గాదె జలేందర్రెడ్డి, సర్పంచ్ ఎడ్ల మహేందర్రెడ్డి, ఎంపీటీసీ ఎర్రోళ్ల లక్ష్మమ్మ, ఉపసర్పంచ్ రవ్వ అనసూయ పాల్గొన్నారు. రాజాపేట : మండలంలోని జాల గ్రామాన్ని జాయింట్ కమిషనర్ సందర్శించారు. పరిసరాలు, పంచాయతీ రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట డీపీఓ సునంద, డీఎల్పీఓ యాదగిరి, ఎంపీడీఓ జ్ఞానప్రకాష్, ఎంపీ దినకర్, కార్యదర్శి ఉమేష్, సర్పంచ్ మధుసూదన్రెడ్డి ఉన్నారు. -
1,00,980 మందికి కంటి పరీక్షలు
సాక్షి, యాదాద్రి : కంటి వెలుగు రెండో విడతలో ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1,00,980 మందికి పరీక్షలు నిర్వహించినట్లు కలెక్టర్ పమేలా సత్పతి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కంటి వెలుగు, హారితహారం, అయిల్పామ్ సాగు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 110 గ్రామ పంచాయతీలు, 40 వార్డుల్లో కంటి వెలుగు పరీక్షలు పూర్తయినట్లు చెప్పారు. 19,198 రీడింగ్ అద్దాలు, 1,421 ప్రిస్క్రిప్షన్ అద్దాలు పంపణీ చేసినట్లు వెల్లడించారు. 13,547 ప్రిస్క్రిప్షన్ అద్దాలు ఆర్డర్ పెట్టినట్లు చెప్పారు. 918 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగులోకి వచ్చిందని, మార్చి నెలాఖరు నాటికి వెయ్యి ఎకరాలకు చేరుతుందన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, శ్రీనివాస్రెడ్డి, డీఎంహెచ్ఓ మల్లికా ర్జున్రావు, జిల్లా అటవీ అధికారి పద్మజారాణి, ఉద్యానవన శాఖ అధికారి అన్నపూర్ణ, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అట్టడుగు వర్గాలు పాలకులవ్వాలి
రామన్నపేట : జనాభాలో 90 శాతం ఉన్న అట్టడు గు వర్గాలు పాలకులుగా మారినప్పుడే పేదలకు ఉచిత విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు లభిస్తాయని దళితశక్తి ప్రోగ్రాం రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ అన్నారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యాధికారమే లక్ష్యంగా విశారదన్ మహారాజ్ చేపట్టిన పాదయాత్ర శుక్రవారం రామన్నపేట మండలంలో కొనసాగింది. వెల్లంకి, సిరిపురం, బోగారం గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీలు పథకాలు తీసుకునే ముడిసరుకులుగా ఉండటం ఏమిటని ప్రశ్నించారు. అట్టడుగు వర్గాల ప్రజలకు డీఎస్పీ శాశ్వత పరిష్కారం చూపబోతుందన్నారు. యాత్ర 29 జిల్లాల్లో 7,892 కిలో మీటర్లు పూర్తయినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాదయాత్ర ఇంచార్జ్ లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు నరేందర్, మండల అధ్యక్షుడు నరసింహ, మల్లేష్, నరేందర్, గోవర్దన్, అశోక్ పాల్గొన్నారు. -
పోరాటాల ద్వారా సమస్యల పరిష్కారం
దురాజ్పల్లి (సూర్యాపేట): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయడం ద్వారానే ప్రభుత్వాల మెడలు వంచి సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని కొల్లగొడుతూ పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తుందన్నారు. దేశంలోని 10 శాతం మంది చేతుల్లో 100శాతం సంపద దాగి ఉందన్నారు. నరేంద్రమోదీ పాలనలో పేద, మధ్య తరగతి ప్రజలపై భారాలు మోపుతూ.. పెద్దలకు రాయితీలు కల్పించడం దుర్మార్గమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకుంటమన్నారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, బుర్రి శ్రీరాములు, రవి నాయక్, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కోట గోపి తదితరులు పాల్గొన్నారు. ఫ సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి -
యాదాద్రి : మత్స్య అవతారంలో దర్శనమిచ్చిన నరసింహస్వామి (ఫొటోలు)