మోత్కూరు: పంట చేలను ఆశించే కీటకాల నివారణకు రసాయన మందుల పిచికారీ బదులు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురం గ్రామంలో కొందరు రైతులు ప్రయోగాత్మకంగా చేపట్టిన సోలార్ లైట్ట్రాప్ (దీపపు ఎర)ల విధానం సత్ఫలితాలిస్తోంది. వరి, పత్తి, కంది పంటలను ఆశించే కాండం తొలిచే పురుగు, ఆకు ముడత, లద్దె పురుగు, గులాబీరంగు పురుగు, మరూక మచ్చల పురుగు వల్ల నష్టపోతున్న రైతులు... వాటి నిర్మూలనకు సుమారు 50 ఎకరాల్లో ఈ పరికరాలను అమర్చారు.
సౌర వెలుగుల ఆకర్షణకు పరికరం వద్దకు చేరుకుంటున్న పురుగులు కాంతిని తట్టుకోలేక దాని కింద ఉండే సబ్బునీళ్ల టబ్లో పడి నశిస్తున్నాయి. మార్కెట్లో రూ. 2 వేలకు లభిస్తున్న ఒక్కో సోలార్ లైట్ ట్రాప్ పరికరం ద్వారా 2–3 ఎకరాల విస్తీర్ణంలో ఉండే అన్ని రకాల పురుగులను నియంత్రించడం సాధ్యమవుతోందని, ఫలితంగా చీడపీడల ఉధృతి తగ్గి దిగుబడి పెరుగుతుందని రైతులు చెబుతున్నారు.
చదవండి: మునుగోడులో దూసుకుపోతున్న బీజేపీ, టీఆర్ఎస్.. మరి కాంగ్రెస్?
Comments
Please login to add a commentAdd a comment