breaking news
Farmers
-
రైతుల పాలిట మృత్యుపాశాలైన కూటమి ప్రభుత్వ విధానాలు
-
'కరువైన ‘కూటమి’ చేయూత.. బలిపీఠంపై అన్నదాత
అన్నం పెట్టే రైతన్న టీడీపీ కూటమి పాలనలో బలిపీఠంపై ఉన్నాడు..! పంట వేద్దామంటే విత్తనాల కొరత..! సాగైన కాస్త పంటనైనా బతికించుకుందామంటే ఎరువులు, పురుగు మందులకు కటకట..! పండిన పంటను అమ్ముదాం అంటే మార్కెట్లో ధర లేక యాతన..! చివరకు అప్పులు తీర్చే దారిలేక పంట పొలాల్లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం, నిర్లక్ష్యం కారణంగా అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. రైతు ఆత్మహత్య వార్త లేని రోజు ఉండడం లేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందో అర్ధం చేసుకోవచ్చు.పొలంలోనే పురుగు మందు తాగి..ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన రాజారపు పెద్ద యలమందయ్య 7 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఏటా మిర్చి, పత్తి తదితర పంటలు సాగు చేస్తున్నాడు. ఏడాదిగా పెట్టుబడి సాయం అందకపోవడంతో రూ.3 వడ్డీకి అప్పు తెచ్చాడు. పంటల సాగు కోసం చేసిన అప్పులు రూ.25 లక్షలకు చేరాయి. ఇటీవలే అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంటికొచ్చి గొడవ చేశాడు. ‘‘ఈ ఏడాది గిట్టుబాటు ధర లేక నష్టపోయా. వచ్చే సీజన్లో ఇచ్చేస్తానంటూ’’ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఏడాదిగా ఇదే చెబుతున్నావనడంతో యలమందయ్య తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. జూలై 7న పొలంలోనే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తమకు దిక్కెవరంటూ ఆయన కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.సాక్షి, అమరావతి/నెట్వర్క్ : రాష్ట్రంలో రైతులు గతంలో ఎన్నడూ లేని సంక్షోభం ఎదుర్కొంటున్నారు. సాగు వేళ వర్షాభావ పరిస్థితులు... పంట చేతికొచ్చే సమయంలో తుపాన్లు, వరదలు.. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ముప్పేట దాడితో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. చంద్రబాబు పాలన–కరువు కవలలు అన్నట్టుగానే గతేడాది నుంచి వరుస వైపరీత్యాలకు తోడు ప్రతి సీజన్లో కరువు విలయతాండవం చేస్తోంది. అలాంటివారి పాలిట ప్రభుత్వ విధానాలు మత్యుపాశాలయ్యాయి. కూటమి పాలనలో...ఏడాదిలో 250 మందికిపైగా ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో త్రీమెన్ కమిటీ రైతులుగా నిర్థ్ధారించినది 104 మంది మాత్రమే. వీరిలో ఒక్కరికి కూడా రూ.7 లక్షల పరిహారం ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగిన రైతు ఆత్మహత్యలపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు...సుఖీభవ లేదు.. వడ్డీలకు అప్పులే దిక్కుఏడాదిగా పెట్టుబడి సాయం అందక రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తామని చంద్రబాబు బృందం ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీ ఇచ్చింది. కానీ, తొలి ఏడాది ఎగ్గొట్టింది. ఈ ఏడాది ఇంకా పైసా ఇవ్వలేదు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.10,717 కోట్లు కావాలి. 2024–25 బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించినా పైసా ఇవ్వలేదు. 2025–26లో పథకానికి రూ.6,300 కోట్లు కేటాయించినా ఒక్క విడత సాయం కూడా జమ చేయలేదు. దీంతో రూ.3–5 వడ్డీకి అప్పులు తెచ్చి మరీ సాగు చేస్తున్నారు.పరామర్శ లేదు.. సాయం ఊసు లేదు!పభుత్వ నిర్వాకం, అస్తవ్యస్థ విధానాలతో నిరుడు జూన్ 12 నుంచి 250 మందిపైగా ఆత్మహత్యకు పాల్పడ్డారని గణాంకాలు చెబుతున్నాయి. అత్యధికంగా ఉమ్మడి కర్నూలులో 68, అనంతపురంలో 46, వైఎస్సార్ జిల్లాలో 37, శ్రీకాకుళంలో 27 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వం మాత్రం 104 మంది రైతులు మాత్రమే ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతోంది. ఇంకో విచిత్రం ఏమంటే గత డిసెంబరు నాటికే 97 మంది బలవన్మరణానికి పాల్పడినట్లు త్రీమెన్ కమిటీ ధ్రువీకరించిందని ప్రకటించింది. కానీ, ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల్లో ఈ సంఖ్యను 60కి కుదించేసింది. పైగా ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్కరికీ పరిహారం ఇవ్వలేదు.ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఎక్స్గ్రేషియా విషయంలో ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేని దుస్థితి నెలకొంది. వాస్తవానికి రైతు కుటుంబాల్లో జరగరానిది జరిగితే వెంటనే స్థానిక ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్ వారి ఇంటికెళ్లి ధైర్యాన్నివ్వాలి. అదే రోజు వీఆర్వో వెళ్లి వివరాలు సేకరించాలి. మండల స్థాయి కమిటీ విచారణ చేపట్టి 24 గంటల్లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలి. డివిజన్ స్థాయి త్రీమెన్ కమిటీ సిఫార్సు మేరకు నిర్దేశిత గడువులోగా పరిహారం అందించేలా జిల్లా ఉన్నతాధికారులు వ్యవసాయ శాఖకు నివేదిక సమర్పించాలి. కానీ, సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక పొలంలోనే పురుగుమందు తాగి ఆత్మహత్యలకు పాల్పడినా, వ్యక్తిగత కారణాలు అంటూ జాబితా నుంచి తప్పించేస్తున్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు లేవనే సాకుతో నివేదికలు కూడా తయారు చేయడం లేదు.ధరలు దిగదిడుపు.. రైతన్న దిగాలు..టమాట నుంచి మామిడి వరకు, ధాన్యం నుంచి కందులు దాక, మిర్చి నుంచి పొగాకు వరకు ప్రతికూల పరిస్థితుల్లో సాగు చేసిన కొద్దిపాటిæ పంటకు కనీస మద్దతు ధర దక్కని దుస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో చేలను దున్నేస్తున్న ఘటనలు నిత్యం చూసూ్తనే ఉన్నాం. ధరల స్థిరీకరణ నిధి కింద బడ్జెట్లో కేవలం రూ.300 కోట్లు కేటాయించిన ప్రభుత్వం అందులో రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ధాన్యం 75 కేజీల బస్తాకు రూ.1,725 చెల్లించాల్సి ఉండగా, ఒక్క రైతుకు రూ.1,150–1,450కు మించి దక్కలేదు. ఫైన్ వెరైటీస్ ధాన్యాన్ని సైతం కనీస మద్దతు ధరకు కొనే నాథుడు లేకుండా పోయారు.2019–24 మధ్య క్వింటా రూ.21 వేల నుంచి రూ.27 వేలకు పైగా పలికిన మిరపకు ఈ ఏడాది రూ.6–10 వేలు మించి దక్కలేదు. గతంలో క్వింటా రూ.18 వేలున్న పొగాకును ఈసారి రూ.5 వేలకు కొనేవారు లేరు. ఇదివరకు కిలో రూ.23–29 పలికిన తోతాపురి మామిడిని రూ.2–4కు మించి కొనే పరిస్థితి లేదు. కోకోకు అంతర్జాతీయంగా మంచి ధర ఉన్నా సిండికేట్గా మారి కంపెనీలు చేతులెత్తేశాయి. కానీ, ప్రభుత్వం పట్టించుకోకుండా ఆ రైతుల నోట్లో మట్టికొట్టింది. ఇక టమాట మరీ ఘోరం. కిలో రూపాయికి కొనేవారు లేక పశువుల మేతగా వదిలేసిన ఘటనలున్నాయి. మిరప మద్దతు ధర పేరిట ప్రభుత్వ పెద్దలు ఆడిన నాటకాలు అన్నీ ఇన్నీ కావు. లేఖల పేరిట హంగామా చేసి చివరికి క్వింటా పంటను కూడా మద్దతు ధర రూ.11,781కు కొన్నది పోలేదు. 3–4 దశాబ్దాలు బిడ్డల్లా చూసుకున్న మామిడి తోటలను కొట్టేస్తున్నారు. మద్దతు ధర కోసం ఎన్నడూ లేనివిధంగా ధాన్యం, మిరప, పొగాకు, కోకో, మామిడి ఇలా ప్రతీ రైతు రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు చేయని రోజంటూ లేదు.ఆర్బీకేలు నిర్వీర్యం.. బీమా ఎగ్గొట్టి... అన్నదాత వెన్ను విరిగ్గొట్టిసీజన్కు ముందే విత్తనాలు, ఎరువులు అందిస్తూ.. పంట విక్రయం దాక అండగా నిలిచిన రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే)ను కూటమి పాలనలో నిర్వీర్యం చేశారు. దీంతో ఏడాదిగా సకాలంలో విత్తనాలు, ఎరువుల దొరక్క అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. నాన్ సబ్సిడీ విత్తనాల పంపిణీ నిలిపివేశారు. సబ్సిడీ విత్తనాల్లో సగం పైగా కోత పెట్టారు. అదునుకు విత్తనాలే కాదు.. ఎరువులూ దొరక్కుండా చేశారు. మార్కెట్లో కల్తీలు రాజ్యమేలుతుండగా.. బ్లాక్లో ఎమ్మార్పీకి మించి కొనాల్సిన దుస్థితి ఏర్పడింది.పంటలకు బీమా ధీమా లేకుండా... ఉచిత బీమాను అటకెక్కించారు. సున్నా వడ్డీ రాయితీ లేకుండా చేశారు. వైపరీత్యాల బారిన పడిన పంటలకు సకాలంలో పరిహారం ఇచ్చిన దాఖలాల్లేవు. న్యాయంగా దక్కాల్సిన పంటల బీమా పరిహారం అందకుండా చేయడంతో పెట్టుబడికి చిల్లిగవ్వ లేక సాగు భారమై అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. మేమున్నాం అని ధైర్యం చెప్పే ఆపన్న హస్తం లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రోడ్డున పడుతున్నారు.అందని పరిహారం.. పడిపోయిన దిగుబడులు2024–25 ఖరీఫ్, రబీలలో 1.51 కోట్ల ఎకరాలకు గాను సాగైంది 1.24 కోట్ల ఎకరాలే. దాదాపు 27 లక్షల ఎకరాలు బీడు పెట్టారు. వరుస వైపరీత్యాలతో 12 లక్షల ఎకరాల్లో, కరువుతో 9 లక్షల ఎకరాల్లోని పంటలు దెబ్బతిన్నాయి. ఖరీఫ్లో 100, రబీలో 80 మండలాలు కరువు కోరల్లో చిక్కుకోగా ప్రభుత్వం ఖరీఫ్లో 54, రబీలో 51 మండలాలను కరువు మండలాలుగా మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకొంది. 2024–25 సీజన్లో వైపరీత్యాలు, కరువు సాయంగా 7 లక్షల మందికి రూ.650 కోట్లకు పైగా పంట నష్ట పరిహారంను (ఇన్పుట్ సబ్సిడీ) సీజన్ ముగిసినా చెల్లించలేదు. గత ఖరీఫ్లో 174 లక్షల టన్నుల దిగుబడులు అంచనా వేయగా, 154 లక్షల టన్నులకు పరిమితమైంది. ఉద్యాన పంటలు కూడా భారీగా దెబ్బతిన్నాయి, పత్తి, మిరప, మామిడిలో కనీస దిగుబడులు రాని పరిస్థితి నెలకొంది.2014–19 మధ్య సైతం అరకొర సాయంఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు 2015 ఫిబ్రవరి 18వ తేదీ వరకు రూ.లక్షన్నర చొప్పున పరిహారం ఇవ్వగా, తర్వాత రూ.5 లక్షలకు పెంచారు. ఇందులో రూ.లక్షన్నరను బాధిత రైతుల అప్పుల ఖాతాకు జమ చేసేవారు. రూ.3.5 లక్షలను డిపాజిట్ చేసి వడ్డీని మాత్రమే వాడుకునేలా ఆంక్షలు విధించారు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం ఉండగా.. ఐదారు వేల మంది ఆత్మహత్యకు పాల్పడితే గుర్తించింది కేవలం 1,223 మందినే. పరిహారం ఇచ్చింది 450 మందికే. ఇక కౌలు రైతుల ఊసే లేదు.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతన్నకు అన్ని విధాలుగా అండాదండా 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చీ రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు... ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచింది. కారణాలు ఏమైనా సరే..ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను పార్టీలు, ప్రాంతాలు, కులమతాలకతీతంగా ఆదుకుంది. ఐదేళ్లలో 1,320 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా కుటుంబానికి రూ.7 లక్షల చొప్పున రూ.92.40 కోట్లు జమ చేసింది. 2014–19 మధ్య రైతు ఆత్మహత్య ఘటనలకు సంబంధించి రీ వెరిఫికేషన్లో 474 మంది అర్హత పొందగా, రూ.5 లక్షల నేరుగా వారి కుటుంబాల ఖాతాలకు వేశారు. ఐదేళ్లలో 1,794 మందికి రూ.116.10 కోట్ల ఎక్స్గ్రేషియా ఇచ్చారు. ఇందులో 495 మంది కౌలు రైతులున్నారు. 2014–19 మధ్య జరిగిన రైతు ఆత్మహత్యలపై పునర్ విచారణ జరపగా, అర్హత పొందిన 474 మందికి రూ.23.70 కోట్లు చెల్లించారు. వీరిలో 212 మంది కౌలు రైతులు. ఏడాదిలో రూ.13,212 కోట్లు ఎగ్గొట్టిన బాబుఅధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీని చంద్రబాబు అటకెక్కించేశారు. వైఎస్సార్ రైతు భరోసా కింద లబ్ధి పొందిన 53.58 లక్షల మందికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వాలంటే ఏటా రూ.10,717 కోట్లు అవసరం. ఇప్పటికీ దాని ఊసే ఎత్తడం లేదు. అన్నదాత సుఖీభవ విధివిధానాల రూపకల్పన జరగలేదు. 2023–24 సీజన్కు రూ.930 కోట్ల రైతుల వాటా ప్రీమియం సొమ్ములు చెల్లించకపోవడంతో ఆ సీజన్లో కరువు వల్ల పంటలు దెబ్బతిన్న 11 లక్షల మంది రైతులకు రూ.1,385 కోట్ల పరిహారం అందకుండా పోయింది. రబీ నుంచి స్వచ్ఛంద నమోదు పద్ధతి అమలు చేస్తుండడంతో ప్రీమియం భరించలేక రైతులు పంటల బీమాకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. గతంలో కరువుతో దెబ్బతిన్న 3.91 లక్షల మందికి రూ.328 కోట్ల కరువు సాయం బకాయిలు ఎగ్గొట్టారు. సున్నా వడ్డీ రాయితీ కింద ఖరీఫ్–2023 సీజన్కు సంబంధించి 6.31 లక్షల మందికి రూ.132 కోట్ల వరకు జమ చేయలేదు. పంట నష్ట పరిహారం కింద రూ.650 కోట్లు ఎగ్గొట్టారు. ఇలా ఏడాదిలో అన్నదాత సుఖీభవ, పంటల బీమా, పంట నష్టపరిహారం, కరువు సాయం, సున్నా వడ్డీ రాయితీలు కలిపి మొత్తమ్మీద రైతులకు చెల్లించాల్సిన రూ.13,212 కోట్లు ఎగ్గొట్టారు. -
కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్
-
తప్పుడు కేసులకు భయపడం మేమెప్పుడూ ప్రజాపక్షం
ప్రజలకు ఏ సమస్య వచ్చినా చంద్రబాబు ఎలాగూ చేయడని తెలిసే ఆయన్ను ఎవ్వరూ కలవడం లేదు. మళ్లీ వచ్చేది వైఎస్సార్సీపీనే అని మా తలుపులు తడుతున్నారు. మా దగ్గరకు వచ్చి ప్రజలు వాళ్లకు జరిగిన అన్యాయాలు, సమస్యల గురించి చెబుతుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. అందుకే ప్రతిపక్ష పార్టీని అణచి వేయాలని, తద్వారా ప్రజల గొంతు నొక్కేయడానికి కుట్రలు చేస్తున్నారు. ఇందులో భాగంగా విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిచంద్రబాబూ.. మాపై నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు. ప్రజల తరఫున మా పోరాటం ఆగేది లేదు. మీ ప్రభుత్వం మహా అయితే మూడేళ్లు ఉంటుంది. మళ్లీ అధికారంలోకి వచ్చేది మా ప్రభుత్వమే. నువ్వు పెట్టే తప్పుడు కేసులకు నీతోపాటు నీకు పావులుగా మారిన వారందరికీ వడ్డీతో సహా చెల్లిస్తాం.. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు దుష్ట సంప్రదాయానికి తెరతీస్తూ వేసిన విత్తనమే రేపు విష వృక్షమవుతుంది. రేపు మేం అధికారంలోకి వచ్చాక మీతోపాటు టీడీపీ నేతల పరిస్థితి ఏమిటి? ఈ రోజు దెబ్బతిన్న వారు రేపు ఊర్కోరు కదా.. నేను చెప్పినా సరే మావాళ్లు వినే పరిస్థితి ఉండదు. దెబ్బ తగిలిన వాళ్లకే ఆ బాధ తెలుస్తుంది. ఇప్పుడైనా మేలుకో.. తప్పు తెలుసుకో.. తప్పుడు సంప్రదాయాన్ని సరిదిద్దుకో.. లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. - వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒక ప్రతిపక్షం వైఎస్సార్సీపీ. టీడీపీ, జనసేన, బీజేపీ అధికారపక్షంగా ఉన్నాయి. ప్రజల అభిప్రాయాలను సమీకరించడం.. ప్రజలకు సంఘీభావంగా వారితో గొంతు కలపడం.. ప్రజలకు తోడుగా నిలబడి వారి పక్షాన పోరాటం చేయడం ప్రతిపక్షం ధర్మం. విశాల ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ప్రతిపక్షంగా మా ధర్మాన్ని మేం నిర్వర్తిస్తున్నాం’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా ఎన్నికల్లో ఇచ్చి న 143 హామీలను అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను అడ్డగోలుగా మోసం చేసి పరిపాలన సాగిస్తున్నారని ఎత్తి చూపారు. ‘చంద్రబాబుపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయింది.. ఏ సమస్య వచ్చి నా చంద్రబాబు పరిష్కరించండని, ఆయన్ను కలిసినా వృథాయేనని ప్రజలకు బాగా అర్థమైంది. గట్టిగా మూడేళ్లు కళ్లు మూసుకుంటే చంద్రబాబు ఓడిపోతాడు. వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని ప్రజలు మా తలుపులు తడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలు, అన్యాయాలు, సమస్యల గురించి ప్రజలు మాకు చెబుతుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ప్రతిపక్ష పార్టీని అణచి వేయాలని, తద్వారా ప్రజల గొంతు నొక్కాలని కుట్రలు చేస్తున్నారు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తప్పుడు ఫిర్యాదులు, వాంగ్మూలాలు, సాక్ష్యాలతో వైఎస్సార్సీపీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు’ అంటూ మండిపడ్డారు. చంద్రబాబు ఇప్పటికైనా తప్పు తెలుసుకుని పద్ధతి మార్చుకోకపోతే, రేపు తాము అధికారంలోకి వచ్చాక తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. ‘అయ్యా చంద్రబాబూ.. నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు. ప్రజల తరఫున మా పోరాటం ఆగేది లేదు. మీ ప్రభుత్వం కన్ను మూసుకుని కన్ను తెరిస్తే మహా అయితే మూడేళ్లు ఉంటుంది.నీవు పెట్టే కేసులకు, నీతో పాటు నీకు పావులుగా మారిన అధికారులకు.. ఇద్దరికీ వార్నింగ్ ఇస్తున్నా.. వడ్డీతో మీరంతా చెల్లించాల్సి ఉంటుంది. ఇది మాత్రం మర్చిపోవద్దు’ అని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన రాష్ట్రంలో పరిస్థితిపై మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు. సాక్ష్యాధారాలతో సహా చంద్రబాబు ప్రభుత్వ వ్యవహార శైలిని కడిగి పారేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ప్రజల సమస్యలను దారి మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ » చంద్రబాబు చేసే ప్రతిపని కూడా టాపిక్ డైవర్ట్ చేసే ఆలోచనతో చేస్తున్నారు. నా పర్యటనల తర్వాత చంద్రబాబు దగ్గరుండి తప్పుడు కేసులు పెట్టించడం పరిపాటిగా మారింది. » మిర్చి ధరలు దారుణంగా పడిపోయిన నేపథ్యంలో ఫిబ్రవరి 19న గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లాను. మా ప్రభుత్వ హయాంలో క్వింటా మిర్చి ధర రూ.21వేలు–రూ.27 వేలు పలికితే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అది రూ.8–11వేలకు పడిపోయింది. ఆ రైతులకు తోడుగా, సంఘీభావంగా మద్దతు ఇస్తూ మిర్చి యార్డుకు వెళ్లింది జగనే. అది తప్పా? అలా వెళ్లినందుకు జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న నాకు సెక్యూరిటీని విత్డ్రా చేశాడు. ఆయనకు మూడ్ వచ్చి నప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తాడు. చంద్రబాబు ఆదేశాలతో ఆ రోజు ఒక్క పోలీసు సహకరించకపోగా, మాపైనే కేసు పెట్టారు. » ఏప్రిల్ 8న శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో స్థానిక ఎమ్మెల్యే వర్గీయుల చేతిలో హత్యకు గురైన మా పార్టీ బీసీ నాయకుడు కురబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లాను. హెలిప్యాడ్ దగ్గర సరైన భ్రదత లేదు. జనం తాకిడితో హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింది. తిరిగి మాపైనే తప్పుడు ప్రచారం చేశారు. పైలట్ల పైనా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి విచారణ పేరుతో వేధించారు. రామగిరిలో నా పర్యాటన తర్వాత మా పార్టీ ఇన్చార్జి తోపుదుర్తి ప్రకాశ్పై కూడా కేసు పెట్టారు. ఇది ధర్మమేనా? » జూన్ 11న ప్రకాశం జిల్లా పొదిలిలో ధరలేక ఇబ్బంది పడుతున్న పొగాకు రైతులకు సంఘీభావంగా వెళ్లాను. 40–50 వేల మంది రైతులు సంఘీభావంగా వచ్చారు. అదే సమయంలో చంద్రబాబు ఓ 40 మందితో 200 మంది పోలీసుల సెక్యూరిటీ ఇచ్చి రాళ్లు వేయించి, టాపిక్ను డైవర్ట్ చేయడానికి ప్రయత్నించాడు. అక్కడికీ రైతులు చాలా సమ్యమనంతో వ్యవహరించారు. 50 వేల మంది.. చంద్రబాబు పంపిన 40 మందిపై పడి ఉంటే బతికేవాళ్లా? అయినా ఆ తర్వాత మూడు కేసులు పెట్టి, 15 మంది రైతులను అరెస్టు చేసి జైలుకు పంపించారు. మేము రైతులకు అండగా నిలబడితే చంద్రబాబుకు వచ్చి న నష్టమేంటి? ఇదీ చంద్రబాబు శాడిజం! » గత ఏడాది పోలీసుల వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న మా పార్టీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు జూన్ 18న పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామానికి వెళ్లాను. నా కార్యక్రమానికి ఎవ్వరినీ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. నా కార్యక్రమాలకు ఎవ్వరినీ రానివ్వకుండా అడ్డుకోవడం.. నాయకులు, కార్యకర్తలకు నోటీసులు ఇచ్చి బెదిరించడం.. ఇళ్లల్లోనే నిర్బంధించేలా చెక్పోస్టులు పెట్టడం.. లాఠీచార్జీలు చేయించడమే చంద్రబాబు పని. అక్కడ పోలీసులు నాకు భ్రదత కల్పించడానికి లేరు.. నా కార్యక్రమానికి ఎవ్వరినీ రాకుండా చూసుకోవడానికి నిలబడ్డారు. మాపై ఐదు కేసులు పెట్టారు. చంద్రబాబు కుట్రల నేపథ్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. పొలిటికల్ గవర్నెన్స్తో చంద్రబాబు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తీరుతో రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొంది. ప్రజాస్వామ్యం, చట్టం, రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారాయి. రాష్ట్రంలో ఒకే ఒక ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమే ఉంది. ప్రజలకు ఏ కష్టం వచ్చినా పలుకుతున్న పార్టీ కూడా వైఎస్సార్సీపీనే. రైతులకు, అక్కచెల్లెమ్మలకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు, చివరికి ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా కూడా వైఎస్సార్సీపీనే స్పందిస్తోంది. ప్రతిపక్షంగా మేము ఏడాదిగా అదే చేస్తున్నాం. -వైఎస్ జగన్ కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అయిన బీసీ మహిళ హారికకు ఆత్మగౌరవం లేదా అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నా. చేతిలో అధికారం ఉంది కదా అని చంద్రబాబు శాడిజం ప్రదర్శిస్తున్నారు. ఇంతటి హేయమైన దాడి చేసి, సిగ్గులేకుండా దుర్భాషలాడి ఒక బీసీ మహిళను పట్టుకుని మహానటి అని టీడీపీ వాళ్లు ఎగతాళి చేస్తున్నారు. మీరు తప్పు చేసి, కారు అద్దాలు పగలగొట్టి.. తిరిగి ఆమెను మహానటి అంటారా? (దాడి చేసిన వీడియో క్లిప్పింగ్ ప్రదర్శిస్తూ). ఎవరు మహా నటులు? దాన వీర శూర కర్ణ కంటే గొప్పగా యాక్టింగ్ చేస్తున్న చంద్రబాబు కాదా! చంద్రబాబు లైవ్ యాక్టింగ్ చూసి ఎన్టీఆర్ ఎక్కడికో వెళ్లిపోవాలి. ఈ ఘటనలో నాగార్జున యాదవ్ అనే మరో జెడ్పీటీసీ భర్తను దారుణంగా కొట్టారు. - వైఎస్ జగన్ విశాల ప్రజా ప్రయోజనాలే లక్ష్యం» చంద్రబాబు ఎగరగొట్టిన రైతు భరోసా సొమ్మును డిమాండ్ చేస్తూ, రైతులకు గిట్టుబాటు ధరరాని దుస్థితిని లేవనెత్తుతూ, ఉచిత పంటల బీమాను ఎత్తివేసిన పరిస్థితుల్లో ప్రశ్నిస్తూ, సమయానికి ఇచ్చి న ఇన్పుట్ సబ్సిడీని నీరుగార్చిన విధానాన్ని ఎండగడుతూ గత ఏడాది డిసెంబర్ 13న అన్నదాతకు అండగా వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్త ధర్నాకు పిలుపునిచ్చి రైతులకు తోడుగా నిలిచింది. » డిసెంబర్ 24న కరెంట్ చార్జీల బాదుడుపై ప్రభుత్వాన్ని నిలదీశాం. ఎన్నికలప్పుడు చార్జీలు తగ్గిస్తానన్న పెద్దమనిషి తగ్గించకపోగా, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏడాది తిరగక మునుపే రూ.15 వేల కోట్లు బాదడాన్ని నిరసిస్తూ పోరుబాట నిర్వహించాం. » పిల్లల చదువులతో చంద్రబాబు చెలగాటం ఆడుతూ వారికి ఇవ్వాల్సిన విద్యా, వసతి దీవెన బకాయిలు ఇవ్వకపోగా, చివరికి పిల్లల చదువులు ఆపేసి పనులకు వెళ్తున్న పరిస్థితుల మధ్య వారికి తోడుగా నిలబడుతూ మార్చి 12న యువత పోరు చేపట్టాం. నిరుద్యోగ భృతి సంగతి ఏమిటని.. గత ఏడాదికి సంబంధించి ఒక్కొక్కరికి ఇవ్వాల్సిన రూ.36 వేలు ఎగ్గొట్టిన తీరుపై యువతకు తోడుగా పోరాటం చేశాం. » జూన్ 4న చంద్రబాబు చేసిన మోసాలను నిలదీస్తూ ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వేలాది మంది బాధిత ప్రజలతో కలిసి చంద్రబాబు ఎగ్గొట్టిన సూపర్ సిక్స్, సెవన్ హామీలను ఎత్తి చూపించాం. ఏడాదిగా ప్రజలకు చంద్రబాబు ఇవ్వాల్సిన బాకీలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన బాండ్ల సంగతి ఏమిటని నిలదీస్తూ వెన్నుపోటు దినం చేశాం. » ఇప్పుడు బృహత్తర ప్రణాళిక తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ పేరిట బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ అన్న నినాదంతో చంద్రబాబు చేసిన మోసాలను ఎత్తి చూపిస్తున్నాం. ప్రజలను చైతన్య వంతులను చేస్తూ.. చంద్రబాబు ఇచ్చిన బాండ్ల గురించి ప్రజలకు తెలియజేస్తూ.. ఆ బాండ్లను టీడీపీ నాయకులకు చూపిస్తూ ఏడాదిలో ఇవ్వాల్సిన డబ్బులు ఎంత అని లెక్కించి చంద్రబాబును అడిగేట్టుగా జూన్ 25న కార్యక్రమం ప్రారంభించాం. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఘనంగా జరిగింది. ఇప్పుడు మండల స్థాయిలో జోరుగా సాగుతోంది. » జూలై 21 నుంచి గ్రామ స్థాయిలోకి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తాం. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే చంద్రబాబు గతంలో అన్న మాటలు.. గతంలో ఇచ్చిన బాండ్లు.. మేనిఫెస్టో .. చంద్రబాబు చేస్తున్న మోసం.. ఏడాదిగా ఎంత బాకీ ఉన్నాడు.. అన్ని వివరాలు ఒక్కచోటే తెలుస్తాయి. తద్వారా గ్రామ స్థాయిలో చంద్రబాబును నిలదీసేట్టుగా చైతన్య కార్యక్రమాలు చేపట్టాం. మేము చేసే ప్రతి పనిలో విశాల ప్రజా ప్రయోజనాలు కనిపిస్తాయి. ప్రజలకు సంబంధించి ప్రతి అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీయించడమే మా బాధ్యత. మాట వినకుంటే వేధింపులే » మా ప్రభుత్వ హయాంలో పోలీసులు అత్యుత్తమ పనితీరుతో తలెత్తుకుని సేవలందించారు. మా సంస్కరణలతో పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ నడిచింది. స్పందన కార్యక్రమం ద్వారా వైఎస్సార్సీపీ కార్యకర్తల సమస్యల కంటే పోలీసులు, కలెక్టర్లు టీడీపీ వారి సమస్యలనే ఎక్కువగా పరిష్కరించే వారు. వివక్ష చూపించకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా పోలీసింగ్ అనేది పరిష్కరించడంలో ముందుండేది. ఈ రోజు అలాంటి అధికారులు చంద్రబాబు మాట వినకుంటే.. వాళ్ల పరిస్థితి దారుణంగా మారుతోంది. » డీజీ స్థాయి అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులను సైతం వేధింపులకు గురి చేశారు. చంద్రబాబు మాట వినకుంటే తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారు. మరో డీజీ స్థాయి అధికారి సునీల్కుమార్, అడిషనల్ డీజీ సంజయ్లను దళిత ఆఫీసర్లు అని కూడా చూడలేదు. బీసీ ఆఫీసర్ ఐజీ కాంతిరాణా టాటాను, ఎస్సీ అధికారి, డీఐజీ విశాల్ గున్నీపై తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్ చేశారు. ఎందరో ఎస్పీ స్థాయి అధికారులపై తప్పుడు కేసులు పెట్టి విచారణల పేరుతో వేధిస్తున్నారు. » నలుగురు నాన్ కేడర్ ఎస్పీలు, ఒక కమాండెంట్ స్థాయి అధికారి, 22 మంది అడిషనల్ ఎస్పీలు, 55 మంది డీఎస్పీలకు పోస్టింగులు లేవు. మరో ఆరుగురు డీఎస్పీలు, ముగ్గురు అడిషనల్ కమాండెంట్లు, ఇద్దరు అసిస్టెంట్ కమాండెంట్లను హెడ్క్వార్టర్కు రిపోర్టు చేయిస్తున్నారు. ఎనిమిది మంది డీఎస్పీలను సస్పెండ్ చేశారు. 80–100 మంది ఇన్స్పెక్టర్లు, వందలాది మంది కానిస్టేబుళ్లు వీఆర్లో ఉన్నారు. చంద్రబాబు మాట విననివారి పరిస్థితి ఇది. రాష్ట్రంలో ఎంతటి దుర్మార్గపు పాలన నడుస్తుందో చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు. డీఐజీ ఓ మాఫియా డాన్ » చంద్రబాబు తన మోచేతి నీళ్లు తాగే అధికారులను పెట్టుకుని, వాళ్లను అవినీతిలో భాగస్వాములను చేసుకున్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఏమంటే.. డీఐజీ అనే వ్యక్తి ఓ మాఫియా డాన్. ఆ జోన్లో ఆయన కింద సీఐలు, ఓ డీఎస్పీ ఉంటారు. అదే ఆయన ఆర్మీ. సదరు నియోజకవర్గంలో ఇసుక, మద్యం, బెల్టుషాపుల అనుమతులు, పరిశ్రమల నుంచి మామూళ్ల వసూళ్లు, పేకాట క్లబ్బులు నడిపే విషయంలో డీఐజీ ఆధ్వర్యంలో సీఐలు డబ్బులు వసూలు చేయడమే పని. » ఇక్కడ పోలీసులు వసూలు చేసి రివర్స్లో ఎమ్మెల్యేలకు ఇవ్వడం విచిత్రం. సగం ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు. మిగిలిన సగ భాగం పైన ఉన్న పెద్దబాబు, చిన్నబాబుకు తీసుకెళ్తున్నారు. ఇలా వసూళ్ల దందాను డీఐజీలతో నడిపిస్తున్నారు. ఇవన్నీ చూసి భరించలేక కొంత మంది ఐపీఎస్ అధికారులు.. సిద్ధార్థ కౌశల్ యంగ్స్టర్ రాజీనామా చేసి వీఆర్ఎస్ తీసుకుని వెళ్లిపోతున్నారు. ఢిల్లీకి పోవడానికి చంద్రబాబు రిలీవ్ చేయడు.. ఇక్కడే ఉండి వేధింపులు ఎందుకని రాజీనామాలు చేస్తున్నారు. 45 ఏళ్ల ఇండస్ట్రీకి మౌలిక హక్కులు తెలియవా? » చంద్రబాబు 45 ఏళ్ల ఇండస్ట్రీలో రాజకీయ పార్టీకి మౌలికంగా ఉన్న హక్కులు ఏమిటో తెలీదా? ఈ పెద్ద మనిషి ఇన్నాళ్లు రాజకీయాలు ఎలా చేశాడు? మీటింగులు పెట్టుకోవడం, ప్రజల దగ్గరకు వెళ్లడం.. వాళ్లను చైతన్య వంతులు చేయడం.. ఇవన్నీ రాజకీయ పార్టీల హక్కులు కావా? ప్రభుత్వం ఏదైనా అన్యాయం చేసినా, నష్టం జరిగినా, ప్రభుత్వం మోసం చేసినా, ఆ ప్రభుత్వాన్నిప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీలకు లేదా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని చెప్పడానికి నిన్నటి గుడివాడ ఘటన కళ్లెదుట కనిపిస్తున్న సాక్ష్యం. » గుడివాడలో అక్కడి స్థానిక (గుడ్లవల్లేరు) జెడ్పీటీసీ సభ్యురాలు, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బీసీ మహిళ హారికపై టీడీపీ సైకోలు కర్రలతో, రాళ్లతో దాడి చేశారు. ఆమె చేసిన తప్పేంటి? ఎందుకు దాడి చేశారు? దుర్భాషలాడుతూ.. నోటికొచ్చి నట్టు ఎందుకు తిట్టారు? చంద్రబాబు చేసిన మోసాలను నిలదీస్తూ ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుంటే తప్పేముంది? కారులో వెళ్తుంటే దారి మధ్యలో అడ్డగించారు. సాయంత్రం 5 గంటలకు దాడి మొదలైంది. 6.30 గంటల వరకు హారికను, ఆమె భర్తను కారులో ఉంచి తిడుతూ.. కొడుతూ.. కారు అద్దాలను ధ్వంసం చేస్తూ దాడికి తెగబడ్డారు. ఇవన్నీ పోలీసుల సమక్షంలో జరుగుతున్నా, వారు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. » ఇంత దారుణంగా హారికను టీడీపీకి చెందిన శాడిస్టులు దాడి చేసినట్టు స్పష్టంగా వీడియోల్లో కనిపిస్తుంటే ఎంత మందిపై కేసులు పెట్టారు? ఎంత మందిని అరెస్టు చేశారు? పై నుంచి ఫోన్లు చేసి దాడికి పంపించారు. 8న పేర్ని నాని ఓ డైలాగ్ గురించి మాట్లాడితే.. 11న మూడు రోజుల తర్వాత గుడివాడ ప్రోగ్రాంకు వెళ్తుంటే పథకం పన్ని, దారికాచి దాడి చేశారు. కళ్లముందు కనిపిస్తున్న ఈ వీడియోను పక్కనపెట్టి హారిక భర్త రాముపై తప్పుడు కేసు పెట్టారు. ఆయన తన కారుతో గుద్దారని కేసు. హారిక, రాము ముందర సీటులో కాదు.. వెనుక సీటులో కూర్చున్నారు. హారిక జెడ్పీ చైర్పర్సన్.. అది ప్రభుత్వ కారు. డ్రైవర్ను ప్రభుత్వం ఇచ్చి ంది. ఒక బీసీ మహిళకు మీరు ఇస్తున్న గౌరవం ఇదేనా? మళ్లీ వీళ్లు బీసీల గురించి మాట్లాతారు? సిగ్గుండాలి. ఎక్కడైనా దూకిచావాలి వీళ్లంతా? » మరుసటి రోజు పేర్నినాని, కైలే అనిల్ కుమార్.. పెడనలో సభ పెట్టిన వారందరిపై మరో కేసు పెట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా క్యాడర్ మీటింగులు పెట్టుకోకూడదా? చంద్రబాబు చేసిన మోసాలను క్యాడర్ మీటింగ్లో ప్రస్తావిస్తూ బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ .. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో.. క్యూఆర్ కోడ్ రిలీజ్ చేయకూడదా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేమా? దాడుల నుంచి పోలీసులు రక్షించడం పక్కనపెడితే పోలీసుల సమక్షంలోనే చేస్తున్న దాడులు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఇది సరిపోదన్నట్టు దగ్గరుండి పోలీసులే బాధితులపై తప్పుడు కేసులు పెడుతున్నారు.ఆ సినిమాలే ఆపేయొచ్చు కదా? » సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దర్ని రిమాండ్కు పంపారు. నీకు అ డైలాగులు నచ్చకపోతే సెన్సార్ బోర్డుకు చెప్పి వాటిని తీసేయించొచ్చు కదా? నిజానికి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాల్లో డైలాగులు ఇంకా దారుణంగా ఉంటాయి. సినిమాల్లో డైలాగులు, మంచి పాటలు సహజంగానే పాపులర్ అవుతాయి. మంచి పాట పాడితే తప్పు అంటావ్.. మంచి డైలాగు పోస్టర్లు పెట్టినా, మాట్లాడినా తప్పంటావ్.. సినిమా వాళ్లు చేసే హావభావాలు చేస్తే తప్పంటావ్.. బయట ఎవరైనా సరే.. ఇలా అన్నా తప్పే.. అలా అన్నా తప్పే.. అంటే ఎలా? అలాంటప్పుడు సినిమాలను ఆపేయండి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేదా? ఆలోచన చేసుకోవాలి. » ఎవరో ఏదో సినిమా డైలాగులు కొట్టినంత మాత్రాన, పోస్టర్లు ప్రదర్శించిన మాత్రాన మీకొచ్చే నష్టమేమిటి? గుమ్మడి కాయ దొంగ అంటే భుజాలు తడుముకోవడం అన్నట్టుగా ఉంది వీళ్ల తీరు.. 131 మందికి నోటీసులు ఇచ్చారు. సినిమా డైలాగులు పోస్టర్లు పెట్టినందుకు ఇద్దర్ని రిమాండ్కు పంపించారు. చంద్రబాబు పేరు ఎవరు చెబితే వాళ్లను పిలిపించుకోవడం.. రోజంతా కూర్చోబెట్టుకోవడం.. వేధించడం చేస్తున్నారు. చార్జిషీట్లు చూస్తే ‘అండ్ అదర్స్’ అని ఖాళీగా పెట్టి.. వాళ్లు టార్గెట్ చేసిన వాళ్లను ఇన్స్టాల్మెంట్ బేస్లో చేరుస్తున్నారు. » స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ‘అండ్ అదర్స్’లో అందర్నీ చేర్చి ఎత్తి లోపలేయడం.. ఎందుకింత కుట్రలో అర్థం కావడం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనసులు గెలుచుకొనేలా పాలన చేయాలి. అదీ సత్తా. అంతే కానీ ఓ పక్క అన్యాయమైన పాలన చేస్తూ నిన్ను ఎవరైనా ప్రశ్నిస్తే వాడు ఇట్టా అన్నాడు.. అట్టా అన్నాడంటూ కేసులు పెట్టి వేధించడం ఎంతవరకు సమంజసం? పోలీసుల దారుణాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. కొడుకును కోల్పోయిన ఆ పెద్దాయనను పరామర్శించేందుకు నేను వెళ్లాను. ఆ చనిపోయిన వ్యక్తి మా పార్టీకి చెందిన సర్పంచ్. పోలీసుల వేధింపులు వల్ల ఆయన చనిపోతే బెట్టింగ్ వలన చనిపోయాడంటూ దొంగ కేసులు పెట్టడం దుర్మార్గం.రైతులు రౌడీషీటర్లా? » మరొక వైపు ధరల్లేక తీవ్ర కష్టాల్లో మామిడి రైతులుంటే.. వారికి సంఘీభావం తెలిపేందుకు నేను జూలై 9న చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వెళ్లాను. మా ప్రభుత్వ హయాంలో ఇదే తోతాపురి మామిడి ధర కిలో రూ.25–29 ఉంది. చంద్రబాబు సీఎం అయ్యాక రూ.2–3కు పడిపోయింది. మే 10–15 తేదీల్లో తెరవాల్సిన ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలను జూన్ 2వ, 3వ వారమైనా తెరవలేదు. ఫ్యాక్టరీలు నెల ఆలస్యంగా తెరవడం, ఒకేసారి పంట మార్కెట్కు రావడం, సప్లయి ఎక్కువ కావడంతో రేటు పడిపోయింది. ఇది మానవ తప్పిదం కాదా? » చంద్రబాబు తనకు సంబంధించిన బినామీలు.. గల్లా ఫుడ్స్, శ్రీని ఫుడ్స్ వంటి వాటికి మేలు చేసేందుకే ఇదంతా చేశారు. మీరు ప్రకటించిన ధర ప్రకారం ఎంత మంది రైతులకు కిలోకు రూ.12 వచ్చి ంది. ఇది కూడా రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాని ధర. పొరుగునున్న కర్ణాటకలో కేంద్ర మంత్రి కుమారస్వామి లేఖ రాస్తే కిలో రూ.16 చొప్పున కేంద్రం కొనుగోలు చేస్తోంది. నువ్వు మాత్రం ఇక్కడ కిలో రూ.12కు కొనిపిస్తానని చెబుతున్నావు. » 2.20 లక్షల ఎకరాల్లో 6.50 లక్షల టన్నుల పంట అమ్ముకునే దారి లేక 76 వేల రైతు కుటుంబాలు చంద్రబాబు పుణ్యమా అని అల్లాడిపోతున్నాయి. వారికి సంఘీభావం తెలిపేందుకు నేను అక్కడకు వెళ్తే.. తప్పా? నేను వెళ్లడం ఏమైనా నేరమా? బంగారుపాళ్యం పర్యటనలో రైతులు పాలుపంచుకోవడం తప్పా? ఈ పర్యటనలో వందల మందిని నిర్బంధించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 2 వేల మందికి ఎందుకు నోటీసులు ఇచ్చారని అడుగుతున్నా. » ముగ్గురు ఎస్పీలు, 9 మంది డీఎస్పీలు, 2 వేల మంది పోలీసులు, ప్రతి గ్రామానికి, ప్రతి సందుకు చెక్ పోస్టులు పెట్టారు. వీళ్లంతా నాకు సెక్యురిటీ కోసం కాదు.. నా కార్యక్రమానికి ఎవరూ రాకుండా అడ్డుకునేందుకు ఏర్పాటు చేశారు. బైకులకు పెట్రోల్ పోయకూడదని చివరికి పెట్రోల్ బంకులకు కూడా నోటీసులు ఇచ్చారు. అయినా సరే కడుపు మండిన రైతులు వేలాదిగా తరలి వచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం, దేశం దృష్టికి సమస్య వెళ్లాలని మామిడి కాయలను రోడ్లపై పారబోసి నాతో కలిసి వచ్చారు. ఈ పర్యటనపై ఐదు కేసులు పెట్టారు. 20 మందిని అరెస్ట్ చేశారు.ఈనాడు.. అదీ ఒక పేపరేనా? » రైతుల కోసం, రైతుల తరఫున, రైతులకు సంఘీభావం తెలిపేందుకు చేపట్టిన కార్యక్రమం అది. ఇదేదో నేరమన్నట్టుగా రైతులను, ప్రతిపక్షాన్ని పట్టుకొని రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులు, దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈనాడు.. అదీ ఒక పేపరేనా? ఈనాడు పేపరు చూస్తుంటే ‘టాయిలెట్ పేపర్కు ఎక్కువ.. టిష్యూ పేపర్కు తక్కువ’ అన్నట్టుగా ఉంది. ఏమిటా రాతలు? ఓ పక్క ధర లేక రైతులు రోడ్డు మీదకు వస్తుంటే రైతులందరూ బ్రహ్మాండంగా కేరింతలు కొడుతున్నారని రాస్తున్నారు. » మామిడి పండ్లను రోడ్లపై వేసినందుకు వాళ్లపై కేసులు పెట్టారు. తమకు అన్యాయం జరిగిందని రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రశ్నించకూడదు. రోడ్డెక్కి నిలదీయకూడదన్నట్టుగా ఉంది చంద్రబాబు పాలన తీరు. ఎన్నికల్లో ఇచ్చి న సూపర్ సిక్స్, సూపర్ సెవెన్తో సహా 143 హామీలన్నీ నెరవేర్చేశామని ప్రజలంతా భావించాలట! వారంతా ఆనందంగా కేరింతలు కొడుతున్నట్టుగా భావించాలన్నది చంద్రబాబు ఉద్దేశం. కాదు.. కుదరదు అని ఎవరైనా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు.. తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు.. అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడం. పాలకుడని చెప్పుకునేందుకు చంద్రబాబుకు, మీడియా అని చెప్పుకునేందుకు ఈ ఎల్లో మీడియాకు సిగ్గుండాలి. ఇది పైశాకత్వం కాదా?» రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయో చెప్పాలంటే.. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంటికి తాను వెళ్లలేని పరిస్థితి. కోర్టు ఆదేశాలు ఉన్నా ఆయన ఎప్పుడు అక్కడకు వెళ్లాలని ప్రయత్నం చేసినా పోలీసులు అడ్డుకుంటున్నారు. సీఐ ఏకంగా గన్ చూపిస్తున్నాడు. (వీడియో చూపిస్తూ).. అసలు బీహార్లో ఉన్నామా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా? అర్థం కావడం లేదు. ఏకంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై ఒక పథకం ప్రకారం పచ్చ సైకోలు, పచ్చ శాడిస్ట్లు పోలీసుల సమక్షంలోనే ఇంట్లోకి చొరబడి ధ్వంసం చేసిన ఘటన చేశాం. » ప్రసన్న నిజంగా ఇంట్లో ఉండి ఉంటే చంపేసి ఉండేవారు. (పోలీస్ సైరన్ మోగుతూ వాహనం ఇంటి బయటే ఉండగానే ఇంట్లోకి చొరబడుతున్న ఘటనకు సంబంధించిన వీడియోను ప్రదర్శిస్తూ). అదృష్టవశాత్తు ప్రసన్న ఇంట్లో లేడు. ఇంట్లో ఉండి ఉంటే మనిషే లేకుండా చేసే వారు. దాడి చేయించిన, ధ్వంసం చేయించిన ఎమ్మెల్యేపై కానీ, వాళ్ల మనుషులపై కానీ ఎలాంటి చర్యలు.. కేసులుండవు. ఎలాంటి అరెస్ట్లు చేయరు. తిరిగి ప్రసన్నపైనే పోలీసులు కేసులు పెట్టారు. ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా? ఈ రాష్ట్రంలో ఇక ఎవరికి రక్షణ ఉన్నట్టు? ఇది శాడిజం కాదా? పైశాచికత్వం కాదా? రాజకీయ కుట్రలతో రాష్ట్రంలో ఒక దుష్ట సంప్రదాయాన్ని తీసుకొచ్చి , దాన్ని కొనసాగిస్తున్నారు. అన్నింటికీ ఒకటే మోడస్ ఆపరండా » ఒక కేతిరెడ్డి, పెద్దిరెడ్డి, ప్రసన్నకుమార్లే కాదు.. కాకాణి గోవర్ధన్రెడ్డి, వల్లభనేని వంశీ, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పోసాని కృష్ణమురళితో సహా ఎంతో మందిపై తప్పుడు కేసులు పెట్టారు. వీరితో పాటు 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుతో సహా కృష్ణమోహన్, ధనుంజయరెడ్డి వంటి జీవితంలో మచ్చలేని రిటైర్డ్ అధికారులపై.. ఇలా ఎంతో మందిపై తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తున్నారు. అన్నింటికీ ఒకటే మోడస్ ఆపరండా. తమకు కావాల్సినట్టుగా వాంగ్మూలాలు తీసుకోవడం, వాటి ఆధారంగా ఇష్టమొచ్చి నట్టు అరెస్టులు చేయడం. » ఇదే మోడస్ ఆపరండాతో దేశంలో ఎవరినైనా, ఎక్కడైనా.. ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు అని చంద్రబాబు చూపిస్తున్నాడు. ప్రధాని మోదీ, అమిత్షాలను కూడా అరెస్ట్ చేయొచ్చు. ఎలాంటి మినహాయింపు లేదు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడైన నాతో పాటు మా పార్టీకి చెందిన గ్రామ, రాష్ట్ర స్థాయి నాయకులు, చివరికి సోషల్ మీడియా కార్యకర్తలపై కూడా ఇదే మోడస్ ఆపరండాతో తప్పుడు ఫిర్యాదులు, తప్పుడు వాంగ్మూలాలు.. తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెడుతున్నారు. » ఇదే సంప్రదాయాన్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కొనసాగిస్తే.. దెబ్బలు తిన్న వీళ్లు ప్రతిచర్య మొదలు పెడితే మీ పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించుకోమని అడుగుతున్నా. మీరు ప్రారంభించిన ఈ తప్పుడు సంప్రదాయం విష వృక్షంగా మారుతుంది. ఎల్లకాలం రోజులన్నీ ఒకేలా ఉండవు. అధికారం ఎవరి చేతుల్లోనూ శాశ్వతంగా ఉండదు. ఈరోజు పైన మీరు ఉన్నారు. నాలుగేళ్ల తర్వాత మేము పైకి వస్తాం. మీరు కిందకు వస్తారు. అప్పుడు పరిస్థితి ఏమిటి? తప్పు తెలుసుకో.. తప్పుడు సంప్రదాయాన్ని సరిదిద్దుకో.. లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. -
రైతులకు వైఎస్ జగన్ భరోసా
-
సెంటు భూమి కూడా ఇవ్వం
సాక్షి, అమరావతి: ‘పచ్చని పంటలు పండే ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడు భూములను కూటమి ప్రభుత్వం బలవంతంగా సేకరించాలనుకుంటోంది. సారవంతమైన భూములు ఇచ్చేస్తే మాగతి ఏం కావాలి? మా ప్రాణాలైనా ఇస్తాం కానీ, సెంటు భూమి కూడా ఇవ్వబోమని తేల్చి చెప్పాం. ప్రభుత్వం వినిపించుకోక పోగా, మాపై ఒత్తిడి తెస్తోంది. దీంతో కొద్ది రోజులుగా మేము ఆందోళన చేపట్టాం. అయినా ప్రభుత్వ పెద్దల వైఖరిలో మార్పు రాలేదు’ అని కరేడు ప్రాంత రైతులు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్తో తమ గోడు వెళ్లబోసుకున్నారు. కూటమి సర్కారుకు మీరే గట్టిగా బుద్ధి చెప్పాలంటూ మంగళవారం కరేడు ప్రాంత రైతులు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్కు వినతిపత్రమిచ్చారు. వారి కష్టాన్ని ఓపికగా విన్న వైఎస్ జగన్.. ప్రభుత్వం బలవంతంగా రైతుల వద్ద నుంచి భూములు తీసుకోవడం తగదన్నారు. ఆ ప్రయత్నాన్ని తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అన్నదాతకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని, రైతుల తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఇండోసోల్ సొంత ఖర్చుతో ప్రభుత్వం సేకరించిన భూములను వారికి ఇవ్వకుండా, మరోచోటుకు వెళ్లమనడం పరిశ్రమలను తరిమేసే కుట్రేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.వారి డబ్బుతో వారికి కేటాయించిన భూములవి‘గతంలో తమ ప్రభుత్వ హయాంలో రామాయపట్నం పోర్టుకు సంబంధించి ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా భూసేకరణ చేసి నిర్వాసితులకు న్యాయం చేశాం. పోర్టుకు ఆనుకుని ఇండోసోల్ కంపెనీ అనుబంధ పరిశ్రమ గుడ్లూరు మండలం చేవూరు, రావూరులో భూములు ఇచ్చేందుకు రైతులను ఒప్పించాం. ఇందుకోసం ఇండోసోల్ కంపెనీతోనే సుమారు రూ.500 కోట్లు రైతులకు పరిహారంగా ఇప్పించాం. ఆ భూముల్లో ఆ కంపెనీ ఏర్పాటవుతున్న దశలో కూటమి ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది. వారి డబ్బుతో వారికి కేటాయించిన భూములను వారికి ఇవ్వకుండా కరేడుకు వెళ్లిపొమ్మంది. కరేడులో సారవంతమైన, ఏటా రెండు పంటలు పండే భూములు ఇవ్వాలని రైతులపై ఒత్తిడి తెస్తోంది.రైతులకు ఆ భూములు ఇవ్వడం ఏమాత్రం ఇష్టం లేకపోయినా ఇవ్వాల్సిందేనని బలవంతం చేస్తోంది. ఇది ఎంత మాత్రం సరికాదు. ఇండోసోల్కు కేటాయించిన భూములను బీపీసీఎల్కు ఇచ్చి, ఇండోసోల్కు పొగ పెట్టి పొమ్మంటోంది. బీపీసీఎల్కు ఇవ్వాలనుకుంటే ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ భూములు సరిపడా ఉన్నాయి. అలా చేయకుండా రైతులకు ఏమాత్రం ఇష్టం లేని భూములు కేటాయిస్తున్నామని చెప్పి ప్రభుత్వం వివాదం రాజేసింది. ఇది ముమ్మాటికీ కుట్రే. సారవంతమైన భూములు కోల్పోతామని కరేడు రైతులు ఎంతగానో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వారికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంది’ అని బాధిత రైతులకు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. జగన్ హామీతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ను ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, వైఎస్సార్సీపీ కందుకూరు సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్లు కలిశారు. అనంతరం వారంతా కేంద్ర కార్యాలయం మీడియా పాయింట్లో మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.జగన్ పోరాడుదామన్నారు.. మేమంతా జగన్ను కలిసి సమస్యను వివరించాం. జగన్ మాకు అభయమిచ్చారు. భవిష్యత్లో తన అవసరం ఎప్పుడు ఉంటే అప్పుడు రైతుల తరఫున వచ్చి పోరాడతానని జగన్ భరోసా ఇచ్చారు. పచ్చని పంటలు పండే భూములను మేం వదులుకోం. ప్రభుత్వం మా నుంచి ఇంచు భూమి కూడా తీసుకోలేదు. – మిరియం శ్రీనివాసులు, రైతు, కరేడు గ్రామంసమస్యను జగన్కు చెప్పాం కరేడు రైతుల సమస్యలన్నీ వైఎస్ జగన్కు వివరించాం. మాకు ఇష్టం లేకుండా మా భూములను తీసుకుంటామనడం దుర్మార్గం. బాగా పంటలు పండే భూములను ఇవ్వాలని బలవంతం చేయడం తగదు. జగన్ సార్ మాకు అండగా ఉంటామన్నారు. మా రైతుల తరఫున జగన్కు ప్రత్యేక ధన్యవాదాలు. – శ్రీనివాసమూర్తి, రైతు, కరేడు గ్రామం విలువైన భూములన్నీ కబళించే ప్రయత్నం కరేడు రైతులు వైఎస్ జగన్ను కలిసి అన్నీ వివరించారు. ఇండోసోల్కు కేటాయించిన భూముల్లో బీపీసీఎల్ కంపెనీని తీసుకురావడాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. సింగరాయకొండ నుంచి కావలి వరకు జాతీయ రహదారి పక్కన 30 కిలోమీటర్ల పొడవునా సముద్ర తీరంలో భూములన్నీ ప్రభుత్వం కబళించే ప్రయత్నం చేస్తుంది. ఈ కుట్రను వైఎస్సార్సీపీ త్వరలో బయటపెడుతుంది. – తూమాటి మాధవరావు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీసారవంతమైన భూములు రైతులకే చెందాలి కరేడులో ఈ భూముల గురించి రైతులు పోరాడుతున్నారు. రైతులు వైఎస్ జగన్ను కలిసి వారి గోడు చెప్పుకున్నారు. మా ప్రభుత్వంలో ఇండోసోల్కి మేం కేటాయించిన భూములు ఇవ్వకుండా, వారిని కరేడుకు వెళ్లిపొమ్మన్నారు. దీనిని మేం వ్యతిరేకిస్తాం అని జగన్ చెప్పారు. సారవంతమైన భూములు రైతులకే చెందాలని, ఇలాంటి భూములు ఇవ్వకూడదన్నారు. సాగుకు నిరుపయోగం అయిన భూములు ఇస్తే ఎలాంటి అభ్యంతరం లేదని జగన్ చెప్పారు. – బుర్రా మధుసూదన్ యాదవ్, కందుకూరు వైఎస్సార్సీపీ ఇంచార్జ్ -
జగన్ వద్ద రైతుల ఆవేదన
-
చంద్రబాబు సర్కార్ మా భూములు లాక్కుంటుంది
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కరేడు గ్రామ రైతులు కలిశారు. చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా భూములను లాక్కోవాలని చూస్తోందంటూ ఫిర్యాదు చేశారు. పచ్చని పంట పొలాలను లాక్కుంటే తమ పరిస్థితి ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్.. మీ పోరాటానికి అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. అవసరమైతే గ్రామానికి కూడా వస్తానని జగన్ చెప్పారు.మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన యాదవ్ మాట్లాడుతూ.. కరేడులో భూసేకరణ వెనుక పెద్ద కుట్రలు ఉన్నాయన్నారు. ఆల్రెడీ ఇండోసోల్కు భూములు తీసుకుని మళ్ళీ భూసేకరణ ఎందుకు? అంటూ ఆయన ప్రశ్నించారు. ‘‘పచ్చని పంటపొలాలను లాగేసుకుంటామంటే ఒప్పుకోం. వైఎస్ జగన్ని కలిసి ప్రభుత్వ కుట్రలను వివరించాం. ఇండోసోల్ కి ఆల్రెడీ భూములు ఎలాట్ చేసి ఇప్పుడు మరోచోట ఇస్తామంటూ భూములు సేకరించటం కరెక్ట్ కాదని మధుసూదన యాదవ్ అన్నారు.కరేడు గ్రామ రైతు మిరియం శ్రీనివాసులు మాట్లాడుతూ.. మా రైతుల సమస్యలను వైఎస్ జగన్కి వివరించాం. మాకు అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు. జగన్ మా గ్రామానికి వస్తానన్నారు. మా ప్రాణామైనా ఇస్తాం.. కానీ ప్రభుత్వానికి మా భూములు ఇవ్వం. పరిశ్రమల పేరుతో భూములు లాక్కోవాలని చూస్తున్నారు. ఇండోసోల్ పేరుతో భూ వ్యాపారం చేస్తామంటే సహించం. సెంటు భూమి కూడా ఈ ప్రభుత్వానికి ఇచ్చేదిలేదుఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మాట్లాడుతూ.. ‘‘మా హయాంలో రామాయపట్నం పోర్టు తెచ్చినప్పుడు ఒక్క సమస్య కూడా రాలేదు. బాధితులకు నచ్చచెప్పి పునరావాసం కల్పించాం. ఇండోసోల్ పరిశ్రమ ఏర్పాటు కావాల్సిన భూములు కూడా ఇచ్చాం. కానీ చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేసింది. ఇండోసోల్ను బలవంతంగా మరో చోటకు తరలించాలని చూస్తోంది. కరేడులో అన్ని రకాల పంటలు పండుతాయి...సంవత్సరం పొడవునా పంటలు పండే గ్రామం అది. రెండున్నర వేల మత్స్యకార కుటుంబాలను ఖాళీ చేయించాలని చూస్తున్నారు. ఎస్టీలంతా గ్రామంలోని పొలాల్లో పనులు చేసుకుని బతుకుతారు. వారిని కూడా వెళ్లగొట్టాలని చూస్తున్నారు. కరేడులో 18 వేల మంది ఉన్నారు. వారందరినీ రోడ్డున పడేయాలని చూడటం కరెక్ట్ కాదు. సముద్రం ఒడ్డున 30కిమీ వరకు భూములు లాక్కునే కుట్రలు జరుగుతున్నాయి. అనేక గ్రామాలను కబళించడానికి ప్రయత్నం చేస్తున్నారు’’ అని మాధవరావు మండిపడ్డారు. -
ఈ లైనింగ్ దండుకునేందుకే!
ఈ ఫొటోలో కనిపిస్తున్నది శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి సమీపంలోని కమ్మవారిపల్లి వద్ద హంద్రీృనీవా రెండో దశ ప్రధాన కాలువ 340 కిలోమీటర్ల నుంచి 341 కిలోమీటర్ల మధ్య స్టీల్ ఫైబర్ రీయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ (ఎస్ఎఫ్ఆర్సీ) విధానంలో వేసిన లైనింగ్. చిన్న చిన్న ఇనుప తీగలు, సిమెంటు, సిలికా, ఇసుక, కంకర, నీటితో కలిపి ఎస్ఎఫ్ఆర్సీని తయారు చేస్తారు. కాలువకు రాతి పొర ఉన్న ప్రదేశంలో మాత్రమే.. కాలువ సైడ్ స్లోప్స్ (ఏటవాలు ప్రాంతం) క్రమానుగతంగా ఉండేలా సరిచేసుకుని (సెక్షనింగ్ చేసి), ఆ తర్వాత 38 మిల్లీమీటర్ల (ఎంఎం) మందంతో ఒకసారి, ఆ తర్వాత 38 ఎంఎం మందంతో మరోసారి అధిక ఒత్తిడితో ఎస్ఎఫ్ఆర్సీతో లైనింగ్ చేయాలి. కానీ, మట్టి పొరకే.. అదీ కాలువ సైడ్ స్లోప్స్ క్రమానుగతంగా ఉండేలా చేయకుండానే, వాలు ఎగుడు దిగుడుగా ఉన్నప్పటికీ 10 నుంచి 20 ఎంఎం మందంతో మాత్రమే ఎస్ఎఫ్ఆర్సీతో లైనింగ్ చేస్తున్నారు. ఇంత అడ్డదిడ్డంగా లైనింగ్ చేసిన దాఖలాలు ఎక్కడా లేవని.. లైనింగ్ పనుల్లో ఇదో వింత అని ఇంజినీరింగ్ అధికార వర్గాలు అభివర్ణిస్తున్నాయి. చిన్నపాటి వర్షం కురిసినా, కాలువకు కనిష్ఠ స్థాయిలో నీటిని విడుదల చేసినా.. ఈ లైనింగ్ ఎక్కడికక్కడ జారిపోవడం ఖాయమని.. భారీ ఎత్తున ప్రజా ధనం వృథా కావడం తథ్యమని తేల్చి చెబుతున్నారు. ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థ బీఎస్సార్ ఇన్ఫ్రా మేనిజింగ్ డైరెక్టర్ బలుసు శ్రీనివాసరావు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. దాంతో పనులు నిబంధనలకు విరుద్ధంగా, నాసిరకంగా చేస్తున్నా ప్రశ్నించడానికి వాటిని పర్యవేక్షిస్తున్న ఇంజినీరింగ్ అధికారులు సాహసించలేక పోతుండటం గమనార్హం. ఫలితంగా ప్రవాహ వేగం, ప్రవాహ సామర్థ్యం పెంచాలన్న లక్ష్యం నీరుగారిపోతోంది. హంద్రీృనీవా కాలువ లైనింగ్ పనుల్లో జరుగుతోన్న అక్రమాలకు ఇదో మచ్చుతునక. రెండో దశ ప్రధాన కాలువ, పుంగనూరు బ్రాంచ్ కాలువ, కుప్పం బ్రాంచ్ కాలువ లైనింగ్ పనులను కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా చేస్తూ అడ్డగోలుగా ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. టెండర్ నిబంధనల ప్రకారం రాతి పొర, డీప్ కట్ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే షార్ట్ క్రీటింగ్ విధానంలో లైనింగ్ చేయాలి. కానీ.. నిబంధనలను తుంగలో తొక్కి పని స్వభావం (స్కోప్ ఆఫ్ వర్క్) మార్చేసి.. పనులు వేగంగా పూర్తి చేయాలనే సాకు చూపి.. అడ్డగోలుగా ఎస్ఎఫ్ఆర్సీతో లైనింగ్ చేస్తున్నారు. షార్ట్ క్రీటింగ్ పద్ధతిలో లైనింగ్ చేస్తే చదరపు మీటర్కు రూ.1,407 చొప్పున బిల్లు చెల్లిస్తారు. అదే ఎస్ఎఫ్ఆర్సీతో లైనింగ్ చేస్తే రూ.1,854 చెల్లిస్తారు. కానీ.. హంద్రీృనీవా పనుల్లో మాత్రం రూ.2,400 చొప్పున బిల్లులు చెల్లిస్తుండటంపై ఇంజినీరింగ్ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, అమరావతి/పుట్టపర్తి: హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండో దశ ప్రధాన కాలువ, దానిలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్(పీబీసీ), కుప్పం బ్రాంచ్ కెనాల్ (కేబీసీ) లైనింగ్ పనుల్లో నాణ్యత ఎంత అంటే నేతి బీరలో నెయ్యంతే! టెండర్లో అధిక ధరకు అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్పగించిన ముఖ్యనేత.. ఆ కాంట్రాక్టు విలువలో పది శాతం రూ.196.89 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్సుగా చెల్లించి.. నీకింత నాకింత అంటూ పంచుకుతిన్నారు. ఆ తర్వాత ఆ పనులను కాంట్రాక్టర్లు నిబంధనలు తుంగలో తొక్కి నాసిరకం పనులు చేస్తున్నా,అధికారులు ప్రశ్నించలేకపోతున్నారు. కారణం..ఆ కాంట్రాక్టర్లకు సీఎం చంద్రబాబు అండదండలు ఉండటమేనని చెబుతున్నారు. భారీ వర్షం వచ్చినా, సామర్థ్యం మేరకు కాలువకు నీటిని విడుదల చేసినా నాసిరకంగా చేసిన లైనింగ్ కొట్టుకుపోవడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. కాలువకు సిమెంట్ లైనింగ్ను రైతులు వ్యతిరేకించినా, సీఎం పట్టించుకోలేదు. హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ 216.30 కి.మీ నుంచి 400–500 కి.మీ వరకు 5 ప్యాకేజీలుగా విభజించి, ఆర్నెళ్లలో పనులు పూర్తి చేయాలనే నిబంధనతో రూ.972.19 కోట్లతో (రూ.520.75 కోట్ల విలువైన 3 ప్యాకేజీల పనులు ‘ఈనాడు’ కిరణ్ సోదరుడి వియ్యంకుడికి చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్కు.. రూ.451.44 కోట్ల విలువైన 2 ప్యాకేజీల పనులు చంద్రబాబు సన్నిహితుడికి చెందిన బీఎస్సార్ ఇన్ఫ్రాకు) అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్పగించారు. పుంగనూరు బ్రాంచ్ కాలువలో 0–75వ కి.మీ వరకు పనులను 2 ప్యాకేజీల కింద విభజించి, ఆర్నెళ్లలో పనులు పూర్తి చేయాలనే నిబంధనతో కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబుకు చెందిన ఎస్సార్ కన్స్ట్రక్షన్స్కు రూ.319.6 కోట్లతో అప్పగించారు. పుంగనూరు బ్రాంచ్ కాలువలో 75 కి.మీ నుంచి 207.80 కి.మీ వరకు పనులను రూ.480.22 కోట్లతో ఆర్నెళ్లలో పూర్తి చేయాలనే నిబంధనతో సీఎం చంద్రబాబు సన్నిహితునికి చెందిన ఎన్సీసీ సంస్థకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు. కుప్పం బ్రాంచ్ కాలువ లైనింగ్ పనులను సీఎం చంద్రబాబు తనకు అత్యంత సన్నిహితుడైన బీజేపీ సీఎం రమేష్కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్కు రూ.196.91 కోట్లతో అప్పగించారు.రూ.602 కోట్లు వెచ్చించి ఉంటే డిస్ట్రిబ్యూటరీలు పూర్తి హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ, పుంగనూరు బ్రాంచ్ కాలువ, కుప్పం బ్రాంచ్ కాలువ లైనింగ్ పనులను రూ.1,968.92 కోట్లతో కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. ఇష్టారాజ్యంగా పనులు చేస్తుండటం వల్ల.. చిన్న పాటి వర్షం కురిసినా.. కాలువలో కనిష్ఠ స్థాయిలో ప్రవాహం ఉన్నా లైనింగ్ ఎక్కడికక్కడ జారిపోవడం ఖాయమని.. దాని కోసం వెచ్చించిన ధనమంతా వృథా అవుతుందని జల వనరుల శాఖలో సుదీర్ఘ కాలం సేవలు అందించి, పదవీ విరమణ చేసిన చీఫ్ ఇంజినీర్ ఒకరు చెప్పారు. లైనింగ్ చేస్తే భూగర్భ జల మట్టం అడుగంటిపోతుందని.. బోరు, బావులు ఎండిపోతే.. ఏళ్ల కొద్దీ సాగు చేస్తున్న పండ్ల తోటలు ఎండిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుండటాన్ని ఆయన ఎత్తిచూపారు. రైతుల ఆవేదనను అర్థం చేసుకుని, లైనింగ్ చేయకుండా పిల్ల కాలువలు తవ్వడానికి రూ.602 కోట్లు వెచ్చించి ఉంటే.. హంద్రీ–నీవా తొలి దశ, రెండో దశ కింద 6.02 లక్షల ఎకరాలకు నీళ్లందించే అవకాశం ఉండేదని మరో రిటైర్డు చీఫ్ ఇంజినీర్ చెప్పారు. ఆయకట్టుకు నీళ్లందించి ఉంటే రైతుల జీవన ప్రమాణాలు పెరిగేవని.. హంద్రీ–నీవా లక్ష్యం సాకారమయ్యేదన్నారు.నిబంధనలకు విరుద్ధంగా ఎస్ఎఫ్ఆర్సీ లైనింగ్ టెండర్ నిబంధనల ప్రకారం రాతి పొర ఉన్న చోట్ల మాత్రమే షార్ట్ క్రీటింగ్ విధానంలో లైనింగ్ చేయాలి. నిబంధనల్లో ఎక్కడా ఎస్ఎఫ్ఆర్సీ ప్రస్తావనే లేదు. టెండర్ పేర్కొన్న దానికి భిన్నంగా పని స్వభావం మారితే స్టేట్ లెవల్ టెక్నికల్ కమిటీ (ఎస్ఎల్టీసీ) ఆమోదం పొంది.. ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. కానీ.. టెండర్లో నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలనే సాకు చూపి, ఎస్ఎఫ్ఆర్సీ విధానాన్ని కాంట్రాక్టర్లు ప్రతిపాదిస్తే ఆ పనులను పర్యవేక్షిస్తున్న ఇంజినీరింగ్ అధికారులు నోరు మెదపలేక పోయారని జల వనరుల శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. రాతి పొర లేకున్నా.. మట్టి పొరకే.. కనీసం కాలువ సైడ్ వాలు (స్లోప్)ను క్రమానుగతంగా సరి చేయకుండానే ఇష్టారాజ్యాంగా అత్తెసరు మందంతో ఎస్ఎఫ్ఆర్సీ విధానంలో కాంట్రాక్టర్లు లైనింగ్ పనులు కానిచ్చేస్తున్నారు. ఎప్పటికప్పుడు బిల్లులు చేసుకుంటూ ముఖ్య నేతతో కలిసి దోచుకుతింటున్నారు.లైనింగ్ పనులు జరుగుతున్నది ఇలా..⇒ ఇన్క్లెయిన్డ్ రోలర్తో కాలువ ఇరు వైపులా అడుగు భాగాన్ని గట్టి పరచకుండా పొక్లెయిన్ బకెట్తో తూతూ మంత్రంగా పనులు కానిచ్చేస్తున్నారు. దాంతో మట్టి ఎక్కడికక్కడ జారిపోతోంది. ⇒ గతంలో కాలువ తవ్వినప్పుడు వచ్చిన మట్టిని, రాళ్లను గట్టుగా పోశారు. ఆ గట్లపై ఉన్న రాళ్ల నుంచే ఇప్పుడు కంకర తయారు చేస్తున్నారు. ఆ కంకర పిండి పిండిగా నాసిరకంగా ఉంది. సమీపంలో వాగులు, వంకల్లో నుంచి ఇసుకను తెస్తున్నారు. నాసిరకం కంకర, ఇసుక.. తక్కువ పరిమాణంలో సిమెంటుతో ఎం–25 మిక్సర్ (ఒక పాలు సిమెంటు, ఒక పాలు ఇసుక, రెండు పాళ్లు 20 ఎంఎం కంకర కలిపి తయారు చేసే మిశ్రమం), ఎం–20 (1 పాలు సిమెంటు, 1.5 పాళ్లు ఇసుక, 3 పాళ్లు 12 ఎం ఎం కంకర కలిపి తయారు చేసే మిశ్రమం) మిక్సర్ తయారు చేస్తున్నారు. ⇒ కాలువకు ఇరువైపులా మట్టి జారిపోతున్నా పేవర్ యంత్రాన్ని వినియోగించకుండా.. కార్మీకుల ద్వారా సిమెంట్ కాంక్రీట్తో లైనింగ్ చేస్తున్నారు. మట్టిజారిపోతున్నా సరే అలానే లైనింగ్ వేస్తున్నారు. దీని వల్ల లైనింగ్ ఎక్కువ కాలం నిలబడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎం–25, ఎం–20 కాంక్రీట్లో సిమెంటు తక్కువగా, ఇసుక ఎక్కువగా, నాసిరకం కంకర వినియోగించడం వల్ల లైనింగ్ చేసిన ప్రాంతాల్లో ఇసుక పైకి తేలి స్పష్టంగా కనిపిస్తోంది. ⇒ క్షేత్ర స్థాయిలో అధికారులు పనులను సక్రమంగా పర్యవేక్షించడం లేదు. కొంత మంది అధికారులు పనులు పర్యవేక్షిస్తున్నా, నాసిరకంగా ఇష్టారాజ్యంగా సబ్ కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇదేంటని ప్రశ్నిస్తే.. వాళ్లు పెద్ద కాంట్రాక్టర్లు.. వాళ్లను ప్రశ్నిస్తే మా ఉద్యోగాలు పోతాయని తన పేరును బహిర్గతం చేయొద్దంటూ ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో వాపోయారు. నాణ్యత, నియంత్రణ విభాగం అధికారులు ఆ పనుల వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
చేదెక్కిన చెరకు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చెరకు సాగు విస్తీర్ణం క్రమేపీ తగ్గుతోంది. ఫ్యాక్టరీల క్రషింగ్ సామర్థ్యానికి సరిపోను దిగుబడి కూడా ఉండటం లేదంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. చెరకు సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వపరంగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో రైతులు ఇతర పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా వరిసాగుకు సై అనడంతో చెరుకు సాగు విస్తీర్ణం పెరగడం లేదని ఫ్యాక్టరీల యాజమాన్యాలు, చెరకు విభాగం అధికారులు చెబుతున్నారు. చెరకు పరిశ్రమ ద్వారా ఒక్కో మెట్రిక్ టన్నుపై ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో రూ.250 వరకు సమకూరుతోంది. చెరకు ఏడాది పంట కావడంతో టన్నుకు రూ.1,000 చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. చెరకు ఫ్యాక్టరీలకు అవసరమైన ముడి సరుకుతోపాటు గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కల్పనలో కీలకంగా ఉన్న చెరకు పరిశ్రమను ప్రోత్సహించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో చెరకు రైతులకు బోనస్ ప్రకటించేందుకు విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెరకు విభాగం అధికారులు కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. మూడోవంతు విస్తీర్ణంలోనే సాగు ! రాష్ట్రంలో 12 చక్కెర కర్మాగారాలు ఉండగా, ఐదు కర్మాగారాలు మూత పడ్డాయి. ప్రస్తుతం ప్రైవేట్ రంగంలోని ఏడు చక్కెర కర్మాగారాలు మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటి క్రషింగ్ సామర్థ్యం రోజుకు 24,700 మెట్రిక్ టన్నులు. 130 రోజుల క్రషింగ్ సీజన్ను పరిగణనలోకి తీసుకొని లెక్క వేస్తే మొత్తంగా ఫ్యాక్టరీల క్రషింగ్ సామర్థ్యానికి అనుగుణంగా 32.11 లక్షల మెట్రిక్ టన్నుల చెరకు అవసరం. రాష్ట్రంలో 40వేలకు పైగా హెక్టార్లలో చెరుకు సాగు చేస్తేనే ఈ ఏడు ఫ్యాక్టరీల క్రషింగ్ సామర్థ్యానికి అనుగుణంగా దిగుబడి వస్తుందని యాజమాన్యాలు చెబుతున్నాయి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో 21వేల హెక్టార్లలో మాత్రమే రైతులు చెరకును సాగు చేస్తున్నారు. దీంతో ఫ్యాక్టరీలకు నష్టాలు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి మూతపడిన బోధన్, మెదక్, మెట్పల్లిలోని నిజాం డెక్కన్ షుగర్స్ యూనిట్లు తెరుచుకుంటే చెరకు పంట సాగు విస్తీర్ణం 61వేల హెక్టార్లకు చేరాలి. అంటే ప్రస్తుతం రాష్ట్రంలోని ఫ్యాక్టరీల క్రషింగ్ సామర్థ్యానికి అవసరమైన విస్తీర్ణంలో కేవలం మూడో వంతు విస్తీర్ణంలో మాత్రమే చెరకు సాగవుతోంది. తమిళనాడు తరహాలో బోనస్ ఇవ్వాలి తమిళనాడులో చెరకు రైతులకు టన్నుకు రూ.1,000 చొప్పున బోనస్ ఇస్తున్నారు. ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా చెరకు రైతులకు రూ.1,000 చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలి. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో రైతులు వరి సాగువైపే మొగ్గు చూపుతున్నారు. – రచ్చ నరసింహారావు, చెన్నారం, ఖమ్మం జిల్లాచెరకు రైతులను ఆదుకోవాలిచెరకు సాగులో ఖర్చులు పెరిగి గిట్టుబాటు కావడం లేదు. స్థానికంగా ఉన్న చక్కెర కర్మాగారం మూతపడటంతో తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు కనీస మద్దతు ధర కూడా ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. సన్న వడ్లకు ఇచ్చినట్టుగా చెరకు రైతులకు కూడా బోనస్ ఇవ్వాలి. చెరకు సాగులో యాంత్రీకరణ అనుకున్నంత వేగంగా జరగడం లేదు. – ఈదులపల్లి ఈరన్న, హద్నూర్, సంగారెడ్డి జిల్లా -
కాయలు పారబోశారని కేసులు.. రైతులపై అక్రమ కేసులు నమోదు చేసిన పోలీసులు
-
వర్షం లోటు..సాగు తడబాటు!
పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు.. ఈ ఏడాది వ్యవసాయానికి తగ్గట్టుగా వర్షాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నం. నాతో పాటు చాలామంది రైతులు అప్పులు చేసి విత్తనాలు కొనుగోలు చేసి పత్తి పంట వేశారు. కానీ వర్షాలు సరిగా లేకపోవడంతో విత్తనాలు మొలకెత్తే పరిస్థితి లేదు. నేను మూడున్నర ఎకరాల్లో రెండుసార్లు గింజలు పెడితే ఎకరన్నరలోనే ఓ తీరుగా మొలిచినయ్. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. – మురావత్ రాంసింగ్, లోక్యతండా, వేలేరు మండలం, హనుమకొండ జిల్లాసాక్షి ప్రతినిధి, వరంగల్: ఈ వానాకాలం సీజన్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో రైతాంగం సతమతమవుతోంది. ముఖ్యంగా జూలైలో పది రోజులు దాటినా ఇప్పటివరకు సరైన వర్షాలు లేకపోవడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. మేలో వర్షాలు కురవడంతో మురిసిపోయిన రైతాంగం.. గతేడాదిలా ఈసారి కూడా సాగు సాఫీగా సాగుతుందని భావించారు. కానీ వానాకాలం సీజన్ ముగింపు దశకు చేరుకున్నా ఇంకా లోటు వర్షపాతమే ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా 42.48 శాతం విస్తీర్ణంలోనే పంటల సాగు జరిగింది.ఈ సీజన్లో 1.32 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేయగా, ఇప్పటివరకు కేవలం 56,26,243 (42.48 శాతం) ఎకరాల్లోనే రైతులు వివిధ పంటలు వేశారు. అయితే సరైన వర్షాలు లేక విత్తనాలు మొలకెత్తకపోవడం, మొలకలు ఎండిపోతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పెట్టుబడి సైతం దక్కే పరిస్థితి లేదంటూ వాపోతున్నారు. లోటు వర్షపాతంతో కష్టకాలం గత సీజన్లో ఈ సమయానికి రాష్ట్ర సగటు వర్షపాతం 191.90 సె.మీ.లు ఉండాల్సి ఉండగా..అంతకు మించి 224.90 సె.మీ.లు నమోదు అయ్యిది. అయితే ఈ సీజన్లో మాత్రం అతి తక్కువగా కేవలం 165.5 సె.మీ.లే నమోదు కావడం గమనార్హం. గత సీజన్లో కరీంనగర్, ములుగు, ఖమ్మం, బి.కొత్తగూడెం, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 20 నుంచి 59 శాతం అధిక వర్షపాతం నమోదైంది. నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాలలలో 60 శాతానికి పైగా (లార్జ్ ఎక్సెస్) వర్షం పడగా, 21 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.అయితే ఈసారి మంచిర్యాల, పెద్దపల్లి, సంగారెడ్డి, జేఎస్ భూపాలపల్లి, జనగామ, మేడ్చల్ మల్కాజిగిరి, నల్లగొండ, సూర్యాపేట, యాదగిరి భువనగిరి, హైదరాబాద్ జిల్లాల్లో 20 నుంచి 59 శాతం లోటు వర్షాపాతం ఉంది. తక్కిన 23 జిల్లాల్లో 19 శాతం వరకు లోటు వర్షం ఉంది. ఈ నేపథ్యంలోనే సాగు నెమ్మదించిందని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. ఒక్క ఆదిలాబాద్లోనే 95% మించి సాగు ఈ వానాకాలంలో ఆదిలాబాద్ జిల్లాలో సాగు అంచనా 5,77,255 ఎకరాలు అయితే 5,51,573 (95.55 శాతం) ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. అంటే ఆదిలాబాద్లో దాదాపు అంచనాలకు తగినట్టుగా సాగు జరిగిందన్న మాట. ఆ తర్వాతి స్థానాల్లో కేబీ ఆసిఫాబాద్ (76.33 శాతం), సంగారెడ్డి (66.81 శాతం), నిజామాబాద్ (65.36 శాతం), బి.కొత్తగూడెం (61.85 శాతం) జిల్లాలు ఉన్నాయి. ఇక అతి తక్కువ విస్తీర్ణంలో సాగైన జిల్లాల్లో వనపర్తి 2,46,582 ఎకరాలకు గాను 17,879 (7.25 శాతం) ఎకరాల్లో సాగుతో మొదటి స్థానంలో ఉంది.ఇక సూర్యాపేటలో 5,81,915 ఎకరాలకు 44,195 (7.59 శాతం) ఎకరాలలో, మెదక్లో 3,37,641 ఎకరాలకు 32,789 (9.71 శాతం) ఎకరాలలో, ఎం.మల్కాజిగిరిలో 23,430 ఎకరాలకు గాను 2,583 (11.02 శాతం) ఎకరాల్లో, ములుగులో 1,26,973 ఎకరాలకు 19,877 (15.65 శాతం) ఎకరాల్లో పంటలు వేశారు. కాగా ప్రతికూల పరిస్థితుల్లోనూ రైతులు పత్తి పంటపైనే ఆసక్తి చూపారు. పత్తి సాగు అంచనా 48,93,016 ఎకరాలకు గాను 36,30,988 (74.21 శాతం) ఎకరాలలో సాగయ్యింది. వరిసాగు అంచనా 62,47,868 ఎకరాలకు గాను కేవలం 5,01,129 (8.02 శాతం) ఎకరాల్లోనే సాగయ్యింది. వర్షాలు లేకపోవడం వరిసాగుపై తీవ్రంగా ప్రభావం చూపించింది. ప్రత్యామ్నాయంగా తృణ ధాన్యాలు, ఆహారేతర పంటలు... వర్షాభావం, ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర రైతాంగం ఈసారి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపింది. ముఖ్యంగా ప్రధాన తృణ ధాన్యాలు (మిల్లెట్స్), ఆహారేతర పంటలపై దృష్టి పెట్టినట్లు సాగు విస్తీర్ణాన్ని బట్టి అవగతమవుతోంది. మేజర్ మిల్లెట్స్ (జొన్న, మొక్కజొన్న, రాగులు) 5,73,643 ఎకరాల్లో సాగవచ్చని అంచనా వేయగా అంచనాలకు తగినట్టుగా 5,61,240 (97.84 శాతం) ఎకరాల్లో ఈ పంటలు వేశారు. మొక్కజొన్న 5,21,206 ఎకరాలకు గాను 5,34,318 (102.52 శాతం) ఎకరాలలో సాగైంది. ఆహారేతర పంటలు 1,02,576 ఎకరాలు అంచనా వేయగా రెట్టింపునకు మించి 2,35,614 (229.70 శాతం) ఎకరాల్లో రైతులు దైంచా, పిల్లిపెసర, సన్ హెంప్, పారాగ్రాస్, మేత జోవార్లు సాగు చేశారు. నారు పోసిననప్పటి నుంచి వానలు లేవు.. మే నెలలో వానలు పడితే ఈసారి కాలం మంచిగనే అయితది అనుకున్నం. ఆ వానలు తప్ప మల్ల చినుకు పడలేదు. ఆలస్యంగనైన వరి ఏద్దమని ఆగినం. పది రోజుల కింద మబ్బులు చేసి తుంపురు తుంపురు వానలు పడ్డయి. కాలం మంచిగైతే నాట్లు వేసుకోవచ్చని నమ్మి నారు పోసినం. ఇగ వర్షాలు పడుతలేవు. చెరువులు, కుంటలల్ల కూడా నీళ్లు లేవు. ఎటూ తోస్తలేదు. – యెడబోయిన పద్మ, మహిళా రైతు, గ్రామం బేతోల్, మహబూబాబాద్ జిల్లా వానాకాలం 2025 సాగు ప్రణాళిక.. సాగైన విస్తీర్ణం (ఎకరాలలో) – ఈ వానాకాలం సాగు అంచనా ః 13244305 – ఇప్పటివరకైన సాగు విస్తీర్ణంః 5626243 – పత్తి సాగు అంచనాః 4893016 – సాగైన పత్తి విస్తీర్ణంః 3630988 – వరిసాగు అంచనాః 6247868 – సాగైన వరి విస్తీర్ణంః 501129 – మొక్కజొన్న సాగు అంచనాః 521206 – సాగైన మొక్కజొన్న విస్తీర్ణంః 534318 -
ఒక్క కూటమి ఎమ్మెల్యే అయినా రైతుల్ని పరామర్శించాడా?
రైతులను ఏమాత్రం పట్టించుకోని కూటమి ప్రభుత్వం.. వాళ్లను పరామర్శించడానికి వెళ్తున్న వైఎస్ జగన్ను మాత్రం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మండిపడ్డారు. బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.సాక్షి, గుంటూరు: రైతుల కష్టాలను పట్టించుకోని కూటమి ప్రభుత్వం.. వాళ్లను పరామర్శించడానికి వెళ్తున్న వైఎస్ జగన్ను మాత్రం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మండిపడ్డారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి సర్కార్ రైతులను పట్టించుకోవడం లేదు. మామిడి, పొగాకు, మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లేదు. రైతులు నిలదీస్తున్నా ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా?. దళారులు, మిల్లర్లు రైతులను దోచుకుంటుంటే మంత్రి ఏం చేస్తున్నారు?. మిర్చి రైతుల కోసం కేంద్రంతో ఒక్కసారైన మాట్లాడారా?. ఒక్క ఎమ్మెల్యే అయినా రైతుల్ని పరామర్శించారా?. జగన్ వెళ్తుటే మాత్రం అడ్డుకుంటున్నారు.. .. వైస్ జగన్ పరామర్శకు వెళ్తే అడ్డంకులు సృష్టిస్తారా?. పొగాకు రైతులతో మాట్లాడడానికి వెళ్తే రాళ్లతో దాడి చేయిస్తారా?. బంగారుపాళ్యం మార్కెట్కు 100 మీటర్ల దూరంలో హెలీప్యాడ్కు పర్మిషన్ ఇచ్చారా?. ఎల్లో మీడియాలో వైఎస్ జగన్పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు. కొంతమందికి కూలీ ఇచ్చి జగన్ను తిట్టిస్తున్నారు.... మామిడి కొనుగోలు విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి, అధికారులు తలో మాట చెబుతున్నారు. ఏది నిజం? అసలు మామిడి కొనుగోళ్లకు సంబంధించిన రూ. 260 కోట్లకు జీవో వచ్చిందా?. రైతులను చంద్రబాబు ప్రభుత్వం దగా చేసింది అని పేర్ని నాని కూటమి సర్కార్పై మండిపడ్డారు. -
బాబు కళ్లల్లో ఆనందం కోసం.. రైతులపై కుళ్లు రాతలా?
నాకు 2 ఎకరాల మామిడి తోట ఉంది. వచ్చిన దిగుబడికి, అయిన ఖర్చుకు, ఈ ప్రభుత్వ పాలనలో ఫ్యాక్టరీలు ఇచ్చే మద్దతు ధరకు ఎలాంటి పొంతన లేదు. పూర్తిగా నష్టపోయాం. గిట్టుబాటు ధరలేక కడుపు మండి మా గోడు వైఎస్ జగన్కు చెప్పుకుందామని వెళితే మమ్మల్ని దండుపాళ్యం బ్యాచ్గా, సైకోలుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు చిత్రీకరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతులంటే అంత అలుసా? అధికార పారీ్టపై అంత ప్రేమ ఉంటే చంద్రబాబుకు భజన చేసుకోవాలి. – ఉమాపతి, బట్టికండ్రిగ, వడమాలపేట మండలం, తిరుపతి జిల్లా ‘‘ఏడాదిగా పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. దిక్కుతోచక రోడ్డెక్కి అనేకమార్లు ఆందోళనలు చేశాం. ఏనాడూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు మా సమస్యలను సమాజం దృష్టికి తీసుకువెళ్లలేదు. బాధ్యత గల ప్రతిపక్ష నేతగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మా కష్టాలను తెలుసుకునేందుకు వచ్చారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా వైఎస్ జగన్ పర్యటనకు వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. వైఎస్ జగన్ పర్యటన విజయవంతమైంది. జగన్ రాకతోనే మా కష్టాలు సమాజానికి తెలిశాయి.అందువల్లే కూటమి పాలకులు జీర్జించుకోలేకపోతున్నారు. చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం పచ్చపత్రికలు బాధ్యతను మరిచి రైతులపై కుళ్లు రాతలు రాశాయి. కల్లాకపటం ఎరుగని రైతులను కరుడుగట్టిన నేరస్తులైన దండుపాళ్యం బ్యాచ్తో పోలుస్తారా? అసలు చంద్రబాబే తన అక్కసును ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వార్తల రూపంలో వెళ్లగక్కుతున్నారు. వెంటనే రైతులపై దుర్మార్గపు రాతలను వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెబుతాం..’’ అని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. - చిత్తూరు అర్బన్ ఆ పత్రికలకు పచ్చకామెర్లు కమ్మాయిరైతు పొలంలో కాలు పెడితేనే ఎంత ధనవంతుడికైనా తిండి నోట్లోకి వెళుతుంది. అలాంటి అన్నదాతలు ఆ పచ్చ పత్రికలకు దండుపాళ్యం బ్యాచ్లా కనిపిస్తున్నారా? ఆ పత్రికలకు పచ్చకామెర్లు కమ్మాయి. అందుకే ఇంత నీచమైన పదజాలం వాడుతున్నాయి. ఆరుగాలం కష్టపడి సాగుచేసిన పంట వల్ల నష్టాలు వస్తే, కోత కోసే కూలీకి కూడా గిట్టుబాటు లేక తోటలోనే పంటను వదిలేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో ఇలాంటి పిచ్చిరాతలు రాసే వారికి ఏం తెలుసు? – కృష్ణయ్య, చిన్నబ్బనాయుడు కండ్రిగ, పుత్తూరు మండలం, తిరుపతి జిల్లాఇంత నీచంగా వర్ణిస్తారా?పత్రికలు రైతుల పక్షాన నిలవాలి. లేకుంటే ఊరకుండాలి. ఇలా రైతులను ఆడిపోసుకోవడం మంచి సంప్రదాయం కాదు. రైతులను దండుపాళ్యం బ్యాచ్ అంటూ ఎల్లో మీడియా అభివర్ణించడం ముమ్మాటికీ సభ్యసమాజం తలదించుకునే చర్యే. రైతులపై ఆ పత్రికలకు అంత కక్ష ఎందుకో? నాకు 30 ఎకరాల పొలం ఉంది. మామిడి తోట సాగుచేశాను. తీరా పంటచేతికొచ్చి అమ్మకాలకు వెళితే ధర పడిపోయింది. తీవ్రంగా నష్టపోయాం. వైఎస్ జగన్కు మా బాధను తెలియజేసేందుకు వెళ్లాం. అంతమాత్రాన రైతుల్ని ఇంత నీచంగా వర్ణిస్తారా? – రామకృష్ణమ రాజు, నారపరాజు కండ్రిగ, విజయపురం మండలం, చిత్తూరు జిల్లాఆ వ్యాఖ్యలు వెనక్కు తీసుకోండి మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మా కష్టాలను గుర్తించి, పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ వచ్చారు. రైతు సమస్యలను ప్రతిపక్ష నేత దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేము వెళితే దండుపాళ్యం బ్యాచ్గా చిత్రీకరించడం బాధాకరం. ఆ వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకోండి. – రంగనాథ్, యువ రైతు, చౌడేపల్లి మండలం, చిత్తూరు జిల్లాకూటమి నేతలే అసలైన దండుపాళ్యం బ్యాచ్దేశానికి అన్నం పెట్టే రైతులను దండుపాళ్యం బాచ్తో పోల్చడం బాధాకరం. మామిడి రైతులను పరామర్శించడానికి వచ్చిన జగనన్నను కలిస్తే తప్పా? ఆయనపై అభిమానంతో స్వచ్ఛందంగా వెళ్తున్న రైతులను అడ్డుకునేందుకు కుట్రలు పన్నింది కూటమి ప్రభుత్వమే. వైఎస్ జగన్ రాకతోనే మామిడి రైతుల కష్టాలు సమాజానికి తెలిశాయి. అసలైన దండుపాళ్యం బాచ్ కూటమి నేతలే. – మనోహర్రెడ్డి, పెరుమాళ్లపల్లి, యాదమరి, చిత్తూరు జిల్లాఈనాడులో పిచ్చివ్యాఖ్యలు దారుణం ఈనాడు సహా ఎల్లో పత్రికల్లో పిచ్చి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మామిడి రైతులను ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ధరలు లేకుండా నట్టేట్లో ముంచటంతోపాటు వారిని దండుపాళ్యం బ్యాచ్ అనటం పద్ధతికాదు. మామిడి రైతులు పడుతున్న కష్టాలను చూసి చలించి వారికి భరోసా కల్పించడానికి వైఎస్ జగన్ వస్తే నిస్సిగ్గుగా తప్పుడు వార్తలు రాయటం దుర్మార్గం. చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను దారి పొడవునా పెట్టి స్వచ్ఛందంగా వస్తున్న రైతులపై విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేయించింది.. దీన్ని ఏమంటారు? చంద్రబాబు రైతులకు ఎప్పుడూ మేలు చేయరు. మేలు చేసే వారిని చూసి ఓర్వలేడు. చంద్రబాబు తన అక్కసును పచ్చ పత్రికల ద్వారా తీర్చుకుంటున్నారు. – లోకనాథరెడ్డి, ఐరాల, చిత్తూరు జిల్లారైతులకు క్షమాపణ చెప్పాలిమామిడి రైతులను పరామర్శించేందుకు వచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు వెళ్లిన రైతులను దండుపాళ్యం బ్యాచ్ అంటూ దుష్ప్రచారం చేసిన పచ్చ పత్రిక యాజమాన్యం వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలి. కూటమి ప్రభుత్వ అనుకూల దినపత్రిక రైతులపై విషం చిమ్మడం తగదు. – నారాయణప్ప, పుంగనూరు, చిత్తూరు జిల్లారైతులను నేరస్తులతో పోలుస్తారా?నాకు పది ఎకరాల మామిడి తోట ఉంది. దానిలో నాలుగు ట్రక్కులు మామిడి కాయలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు టోకెన్లు లేక తరలించలేకపోయాను. మేం పడుతున్న కష్టాలను మా నాయకుడు వైఎస్ జగన్కు చెప్పుకొనేందుకు ఎంతో ఆశతో వెళితే మాకు పోలీసులు నిరాశ మిగిల్చారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలను కరుడుగట్టిన నేరస్తులతో పోల్చడం దుర్మార్గం. అసలు రైతు లేకపోతే మీరు ఏం తింటారు? – యుగంధర్ నాయుడు, దిగువ కండ్రిగ, చిత్తూరు జిల్లా.ఎన్నడూ ఇలాంటి రాతలు చూడలేదునా సొంత తోటతోపాటు కొన్ని మామిడి తోటలు కౌలుకు తీసుకున్నా. సుమారు 50 ట్రక్కుల వరకు మామిడి ఉంది. ఇప్పటివరకు 30 ట్రక్కుల వరకే ఫ్యాక్టరీకి తరలించాను. ప్రస్తుతం ఉన్న కాయలను ఏం చేయాలో అర్థం కావట్లేదు. కనీసం మద్దతు ధర కూడా లేదు. మా బాధలను వైఎస్ జగన్కు చెప్పుకొనేందుకు వస్తే కూటమి ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుంది. కూటమి ప్రభుత్వం రైతుల బాధలు పట్టించుకోవడం లేదు. ఎన్నడూ మామిడి రైతులు ఇలాంటి కష్టాలు పడలేదు. ఎప్పుడూ పత్రికలు ఇలా రైతులను చులకన చేసి నీచంగా వార్తలు రాయడం చూడలేదు. – ధనుంజయరెడ్డి, కలికిరిండ్లు, చిత్తూరు జిల్లారైతులను అవమానించడం సిగ్గుచేటుఆంధ్ర అంటే అన్నపూర్ణ అని దేశవ్యాప్తంగా అంటారు. దీనికి కారణం అన్నదాతలు కష్టపడి పంటసాగు చేయడమే. అటువంటి రైతులను కూటమి నాయకులు, పచ్చ మీడియా కలిసి దండుపాళ్యం బ్యాచ్ అని అవమానపరచడం సిగ్గుచేటు. దండుపాళ్యం బ్యాచ్ అనేవారు ఒక్కరోజు పొలంలో పని చేస్తే అప్పుడు తెలుస్తుంది అన్నదాత కష్టం, ఆవేదన. – మునికృష్ణయ్య రైతు, మెట్టు, చిట్టమూరు మండలం, తిరుపతి జిల్లారైతుల ఉసురు తగులుతుందిఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఆక్రందనతో రోడ్డెక్కితే పచ్చ పత్రికల్లో రైతులను దండుపాళ్యం బ్యాచ్ అంటూ అవమానించడం అత్యంత దుర్మార్గం. రైతుల ఉసురు తగిలి ఈ ప్రభుత్వం, ఆ పత్రిక బంగాళాఖాతంలో కలవడం ఖాయం. – శంకర్రెడ్డి, గురవరాజుపల్లి, రేణిగుంట మండలం, తిరుపతి జిల్లాఓర్వలేకే ఈనాడు ఉన్మాదపు రాతలు... రాష్ట్రంలో రైతులు అన్ని విధాలా నిరాదరణకు గురై అల్లాడిపోతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి బంగారుపాళెం పర్యటన విజయవంతం కావటంతో ఓర్వలేని కూటమి పాలకులు ఈనాడు, తోకపత్రిక చేత రైతులను దండుపాళ్యం బ్యాచ్గా అభివర్ణిస్తూ ఉన్మాదపు రాతలు రాయించారు. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి, ఆ పత్రికకు రైతులు తగిన బుద్ధి చెబుతారు. – హేమలత, చెంగారెడ్డి పట్టెడ, రేణిగుంట మండలం, తిరుపతి జిల్లా -
అన్నదాత అరిగోస
పొలాల్లో వానాకాలం పంట పనుల్లో తలమునకలై ఉండాల్సిన రైతన్న ఆగమా గమవుతున్నాడు. బస్తా యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిన దుఃస్థితి మళ్లీ వచ్చింది. రైతు ఆధార్ కార్డు ఇస్తేగానీ యూరియా బస్తా ఇవ్వడం లేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో ఎరువులు, విత్తనాల కోసం రైతన్నలు ఎన్ని అగచాట్లు పడ్డారో మళ్లీ అవే పరిస్థితులు వచ్చాయి. ఇందిరమ్మ రాజ్యం తెస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను నడి బజార్లో నిలబెట్టింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా వరంగల్ వేదికగా ప్రకటించిన రైతు డిక్లరేషన్ ఎప్పటికి అమలవుతుందో తెలియని పరిస్థితి. ఒక్కో రైతుకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని నమ్మబలికి, సగం మంది రైతులకు మాత్రమే మాఫీ వర్తింపజేశారు. మిగిలిన రైతులందరూ బ్యాంకులు, సొసైటీల్లో ఉన్న అప్పులను తిరిగి చెల్లించేందుకు అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులు రుణాలు చెల్లించకపోతే సొసైటీ అధికారులు, బ్యాంకర్లు రైతన్నల ఇంటి తలుపులు, బిందెలు, ఇతర సామగ్రి జప్తు తీసుకు పోయిన దృశ్యాలు ఇందిరమ్మ రాజ్యంలో మళ్లీ అగుపిస్తున్నాయి.కొందరు రైతులు రుణాలు తిరిగి చెల్లించలేదని పేర్కొంటూ వారి ఆస్తులు జప్తు చేసేందుకు సైతం అధికారులు నోటీసులు ఇవ్వడం ఈ ప్రభుత్వంలోనే ఆవిష్కృతమయ్యింది.చేతులు దులుపుకొన్నారు!తెలంగాణలో పంటల బీమా పథకం అమలు కావడం లేదనీ, కాంగ్రెస్ను గెలిపిస్తే బీమాతో ఆపన్న హస్తం అందిస్తామనీ ఇచ్చిన హామీ అతీగతీ లేదు. పంటల బీమాకు రూ.1,400 కోట్ల బీమా ప్రీమియం కూడా చెల్లించలేదు. కనీసం బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ప్రకృతి విపత్తులతో రైతులు పంట నష్టపోతే వారికి పరిహారం వచ్చే అవకాశం లేకుండా ఈ ప్రభుత్వం చేసింది. కేసీఆర్ పాలనలో అకాల వర్షాలు, వడగండ్ల వానలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వ పరంగా పరిహారం చెల్లించేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధానాన్ని కూడా అటకెక్కిచ్చింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో కురిసిన అకాల వర్షాలు, వడగండ్లతో 55 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టుగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఒక్కో ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం ఇస్తామని ప్రకటించింది. కొందరు రైతులకు మాత్రమే పరిహారం ఇచ్చి చేతులు దులుపు కొన్నది. అత్యధిక మంది రైతులకు పరిహారం ఇవ్వకుండా ముఖం చాటేసింది.రైతుకు పెట్టుబడి సాయం అందజేసి వెన్నుదన్నుగా నిలిచేందుకు కేసీఆర్ ‘రైతుబంధు’ పథకం ప్రవేశపెట్టారు. ప్రతి రైతుకు రెండు సీజన్లకు కలిపి ఎకరానికి రూ.10 వేల చొప్పున నగదు బదిలీ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకంపై అనేక ఆరోపణలు చేశారు. అనర్హులకు సాయం అందు తోందని ప్రజలను తప్పుదోవ పట్టించారు. కాంగ్రెస్ను గెలిపిస్తే ఏడాదికి ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని నమ్మబలికారు. తీరా గద్దెనెక్కాక రెండు పంట సీజన్లు రైతుబంధును ఎగ్గొట్టారు. స్థానిక సంస్థల్లో రాజకీయ ప్రయోజనం కోసం ఈ ఒక్క సీజన్లో మాత్రమే రైతులకు భరోసా కింద నిధులు జమ చేశారు. ఒక చేత్తో ఇచ్చిఇంకో చేత్తో లాక్కున్నట్టుగా రైతు భరోసా డబ్బును పంట రుణాలు, ఇతర అప్పుల కింద జమ చేసుకొని ఆ సాయం కూడా అందకుండా అడ్డుకున్నారు. అన్ని పంటలకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి చివరికి సన్న వడ్లు పండించే రైతులకు మాత్రమే బోనస్నుపరిమితం చేశారు. బోనస్ కింద రైతులకు ప్రభుత్వం రూ. 1,200 కోట్లు బాకీ పడింది. వాటి కోసం అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ రైతులు తిరిగినా ఎప్పుడు నిధులు జమ చేస్తారో తెలియని పరిస్థితి.ఎరువుల కోసం తిప్పలుపంట సీజన్ ప్రారంభానికి ముందే ప్రభుత్వం సాగుకు సన్నద్ధ మవ్వాల్సి ఉంటుంది. రైతులు తమ పొలాలను దున్నుకొని పంటలు వేసేందుకు ఎలా సిద్ధంగా ఉంటారో... విత్తనాలు, ఎరువులు సకాలంలో పంపిణీ చేయడానికి ప్రభుత్వం అంతకన్నా ఎక్కువే శ్రద్ధ కనబరచాల్సి ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువులు, విత్తనాలే కాదు, పచ్చిరొట్ట విత్తనాల పంపిణీలో కూడా రైతులకు అగచాట్లు తప్పడం లేదు. ముందస్తు ప్రణాళిక లేకపోవడం, సాగు విస్తీర్ణానికి అనుగుణంగా కేంద్రంనుంచి ఎరువులను తెప్పించకపోవడంతో యూరియా, డీఏపీ, పొటాష్ కోసం ఇప్పుడు రైతులంతా రోడ్లపైకి రావాల్సిన దుఃస్థితి ఏర్పడింది. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం ఇంకెవరిపైనో నెపం వేసే ప్రయత్నం చేస్తోంది. ఎరువులు ముఖ్యంగా యూరియా కోసం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో రైతులు నిత్యం తిప్పలు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో రైతులు ఎరువుల కోసం నడిరోడ్డులో బైఠాయించారు. సిర్పూర్లో రైతులు, మహిళలు యూరియా కోసం గంటల తరబడి వేచిచూశారు. ముగ్గురు మంత్రులు ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగానూ ఎరువుల కోసం రైతులకు సమస్యలు ఎదురవుతున్నాయి.ఏది భరోసా?బీఆర్ఎస్ పాలనలో 24 గంటలు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ సరఫరా అయ్యేది. ప్రతి రైతుకు ప్రతి సీజన్లో క్రమం తప్పకుండా రైతుబంధు నేరుగా ఖాతాలో జమయ్యేది. రైతు దుర దృష్టవశాత్తు మరణిస్తే రైతు బీమా పథకం కింద ఆ కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందేది. భూమిశిస్తు రద్దు, నీటి తీరువా రద్దు, ప్రాజెక్టుల పంట కాల్వలపై ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్ల క్రమబద్ధీకరణ లాంటి రైతు అనుకూల నిర్ణయాలతో ప్రభుత్వం అన్నదాతకు భరోసానిచ్చింది. కానీ తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకొంటూనే కాంగ్రెస్ అన్నదాతలను వంచిస్తోంది. రైతులకు ఇచ్చిన ప్రతి హామీ మోసంగా మారుతుండటంతో వ్యవసాయం పట్ల, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపు లేదని మళ్లీ మళ్లీ నిరూపితమవుతోంది. ఇకనైనా నిర్లక్ష్యం వీడి రైతు సంక్షేమం తక్షణ కర్తవ్యంగా భావించిపంటల బీమా పథకం అమలుకు చర్యలు చేపట్టాలి. వెంటనే బీమా అమలుకు టెండర్లు పిలిచి ఇన్సూరె¯Œ ్స ఏజెన్సీని ఖరారు చేయాలి. యూరియా సహా ఇతర ఎరువులను పూర్తి స్థాయిలోందుబాటులోకి తేవాలి. ఎరువులను బ్లాక్ మార్కెట్ చేసి అమ్ము తున్న వారిపై ఉక్కుపాదం మోపాలి. రైతులకు బాకీ పడ్డ ‘రైతు భరోసా’ సాయం విడుదల చేయాలి.రాష్ట్రంలో అన్ని కోణాలలో రైతులను వంచించి, వ్యవసాయాన్ని అస్తవ్యస్తం చేసి... పండుగ చేశామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నరు. వారి మాటలకు, సంబరాలకు సంబంధం లేదని తెలుసుకోవాలంటే తమ మేనిఫెస్టోను ఒకసారి చదువుకోవాలి. ‘మాట ఇచ్చినవాడు మారిపోవచ్చు, కానీ మాట మరిచిపోవద్దు’ అని తెలంగాణరైతులు సామెతలాగా చెప్తుంటారు. రైతుల ఆర్థిక భద్రత కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిజం చేయకపోతే, రైతుల నుంచి తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్క సీజ¯Œ కు, అదీ ఎన్నికల్లో ప్రయోజనం కోసం రైతుభరోసా ఇచ్చి దానిని గొప్పగా చెప్పు కోవాలని చూస్తే... అదే రైతుల నుంచి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందన్న వాస్తవాన్ని గ్రహించాలి.-కల్వకుంట్ల కవిత, వ్యాసకర్త శాసన మండలి సభ్యురాలు,‘తెలంగాణ జాగృతి’ అధ్యక్షురాలు -
చంద్రబాబు, ఎల్లో మీడియాపై వైఎస్ జగన్ ఆగ్రహం
-
ఆంక్షల గట్టు దాటి.. తండోపతండాలు
ఎస్పీలు.. డీఎస్పీలు.. ఏఎస్పీలు.. 2 వేల మందికిపైగా పోలీసుల కవాతు..! అదేమీ ఉగ్రవాద కల్లోలిత ప్రాంతం కాదు..! తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ బందోబస్తు అంతకంటే కాదు..! ప్రతిపక్ష నేతకు కనీస భద్రత కల్పించని చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ జగన్ పర్యటనలో ఐదు వందల మందికి మించి పాల్గొనకూడదంటూ ఆంక్షలు విధించింది. తన అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకు అణచివేతలకు పాల్పడింది. బంగారుపాళ్యంలో వేల సంఖ్యలో ఖాకీలను మోహరించింది. రైతుల కోసం తలపెట్టిన కార్యక్రమానికి రైతులెవరూ రాకూడదంటూ.. రౌడీషీట్లు తెరుస్తామంటూ నిర్భందాలకు తెగబడింది! ఈ సర్కారు ఎన్ని చేసినా.. ఎన్ని కుట్రలకు తెగించినా.. ఎటుచూసినా విరగకాసిన మామిడిలా జనమే.. జనం!! సాక్షి ప్రతినిధి, తిరుపతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎన్ని పాట్లు పడినా, పోలీసులను అడ్డు పెట్టుకుని ఎన్ని కుట్రలు చేసినా.. తుదకు వైఎస్ జగన్పై ఉన్న జనాభిమానాన్ని అడ్డుకోలేకపోయింది. ఊరికొక చెక్ పోస్ట్.. బంగారుపాళ్యం చుట్టూ బారికేడ్లు.. వాటి వద్ద వందల మంది పోలీసుల మోహరింపు.. జగన్ పర్యటనకు రావొద్దని రైతులకు బెదిరింపులు.. రౌడీషీట్ తెరుస్తామని నాయకులకు నోటీసులు.. రోడ్డుపై ఆటో.. ట్రాక్టర్ కనిపిస్తే సీజ్ చేస్తామనే హెచ్చరికలు.. ఇలా అడుగడుగునా ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో ఆంక్షలు విధించారు. అయినా వైఎస్ జగన్ చిత్తూరు గడ్డపై కాలు మోపగానే జనసంద్రం ఒక్కసారిగా ఉప్పొంగింది. వేలాది మంది రైతులు బంగారుపాళ్యం వైపు పరుగులు తీశారు. బారికేడ్లు, ఇనుప కంచెలను, పోలీసుల లాఠీ దెబ్బలను దాటుకుని అభిమాన నేత చెంతకు చేరారు. తమ కష్టాలను వివరించారు. నేనున్నాను.. అంటూ వైఎస్ జగన్ ఇచ్చిన భరోసాతో గుండెల్లో భారం దిగిందని ఆనందం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం చేయని కుట్రలు లేవు. డీఐజీ, ముగ్గురు ఎస్పీల పర్యవేక్షణలో సుమారు 2000 మందికిపైగా పోలీసు సిబ్బందిని రంగంలోకి దింపింది. రెండు రోజులుగా పోలీసులు నిద్రాహారాలు మాని కూటమి ప్రభుత్వ పెద్దల ఆదేశాలను అమలు చేయడంలో నిమగ్నమయ్యారు. జన సంద్రమైన మార్కెట్ యార్డుప్రభుత్వ అధికార యంత్రాంగం జనాన్ని నిలువరించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేసినా.. జనం మాత్రం ఆగలేదు. ఎక్కడైతే వాహనాలను ఆపి వెనక్కు పంపేశారో.. అక్కడి నుంచి కొండలు, గుట్టలు, చెట్లు, పుట్టల మీదుగా వైఎస్ జగన్ పర్యటించే రహదారి సమీపంలోని మామిడి తోటల్లో వేచి ఉన్నారు. వైఎస్ జగన్ అక్కడికి రాగానే ఒక్కసారిగా రహదారిపైకి దూసుకురావటం కనిపించింది. కొత్తపల్లి హెలిప్యాడ్ నుంచి కొత్తపల్లి బ్రిడ్జి వరకు, తుమ్మేజిపల్లి, నలగాంపల్లి క్రాస్, దండువారిపల్లి, మాధవనగర్, ముంగరమడుగు ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా ప్రజలు రోడ్డుపైకి చేరుకుని వైఎస్ జగన్కు జైకొట్టారు. వారిని గమనించిన వైఎస్ జగన్ కాన్వాయ్ని ఆపి వారితో ఆప్యాయంగా మాట్లాడి ముందుకు కదిలారు. కొత్తపల్లి నుంచి బంగారుపాళ్యం మార్కెట్ యార్డు వరకు 5 కి.మీ దూరం ప్రయాణానికి 3 గంటల సమయం పట్టిందంటే ఎంతగా జనప్రవాహం పోటెత్తిందో ఇట్టే తెలుస్తోంది. ఏకంగా 25 చెక్పోస్టులువైఎస్ జగన్ పర్యటనకు వచ్చే వారిని నిలువరించేందుకు తిరుపతి– చిత్తూరు, పలమనేరు మార్గంలో బంగారుపాళ్యం చుట్టుపక్కల ఉన్న అన్ని మార్గాల్లో ఏకంగా 25 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. తిరుపతి నుంచి చిత్తూరు వైపు వెళ్లే వాహనాలను గాదంకి టోల్ప్లాజా వద్ద పోలీసులు చెక్ చేసి పంపటం ప్రారంభించారు. చిత్తూరు నుంచి పలమనేరు వైపు, పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్లే ప్రతి వాహనాన్ని పోలీసులు చెక్ చేయటం కనిపించింది. రైతులను నిర్దాక్షిణ్యంగా వెనక్కు పంపేశారు. వైఎస్సార్సీపీ నేతల వాహనాలను అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న వారెవరైనా బంగారుపాళ్యం టికెట్ తీసుకుని ఉంటే.. అటువంటి వారు అక్కడ దిగకుండా ముందుకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. నిజంగా బంగారుపాళ్యం వాసులైనా వారిని అక్కడ దిగనివ్వలేదు. అటు చిత్తూరు, ఇటు పలమనేరుకు పంపించేశారని పలువురు ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు స్థానికులు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నా కూడా వారిని కూడా ఆపి చెక్చేసి వెనక్కు పంపే పనిలో నిమగ్నమయ్యారు. వైఎస్ జగన్ బంగారుపాళ్యం మార్కెట్కు వచ్చే సమయానికి యార్డులో రైతులు, మామిడి కాయలు లేకుండా బలవంతంగా తరలించేశారు. పోలీసులే వాహనాలను ఏర్పాటు చేసి మామిడి కాయలను తరలించటం కనిపించింది. ఆ తర్వాత మార్కెట్ యార్డు మెయిన్ గేటుకు తాళం వేశారు. చుట్టు ప్రక్కల గ్రామాలకు వెళ్లి వచ్చే ఆటోలు, ట్రాక్టర్లను సైతం సీజ్ చేశారు. -
ఎందుకీ నిర్బంధం.. ఆంక్షలు?
సాక్షి టాస్క్ఫోర్స్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనలో బుధవారం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బంగారుపాళ్యం మండలం కొత్తపల్లి హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో బంగారుపాళ్యం మామిడి మార్కెట్కు వెళ్తున్న క్రమంలో వైఎస్ జగన్ను కలిసేందుకు వచ్చిన రైతులు, మహిళలు, వృద్ధులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. కొన్నిచోట్ల లాఠీచార్జ్ చేశారు.పోలీసుల దాడిలో వైఎస్సార్సీపీ యువజన విభాగం కార్యదర్శి శశిధర్ రెడ్డి తలకు తీవ్ర గాయమై, రక్తస్రావం అయింది. దీన్ని గమనించిన జగన్మోహన్రెడ్డి స్థానిక పోలీసులపై తీవ్రంగా మండిపడ్డారు. ఇంత దారుణంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని నిలదీశారు. శశిధర్ రెడ్డికి వెంటనే మంచి వైద్యం అందించాలని వైఎస్సార్సీపీ నేతలకు సూచించారు. బాధితుడిని పరామర్శించడాన్ని కూడా ఎస్పీ అడ్డుకున్నారు. రూట్మ్యాప్ మార్చే యత్నంవైఎస్ జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్కి ముందుగా అనుమతి తీసుకున్న రూట్ మ్యాప్ ప్రకారం వెళ్తున్నా.. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల ఎస్పీలు మణికంఠ, విద్యాసాగర్ నాయుడు కాన్వాయ్ ముందుకు వచ్చి రూట్ మ్యాప్ మార్చే ప్రయత్నం చేశారు. సబ్వేలో వెళ్లాల్సిన కాన్వాయ్ని నేషనల్ హైవేపైకి మళ్లించమన్నారు. ముందుగా అనుమతి తీసుకున్న రూట్ మ్యాప్లోనే కాన్వాయ్ వెళ్తుంటే ఎందుకు అడ్డు పడుతున్నారని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా నేషనల్ హైవేపై కాన్వాయ్ వెళితే అనేక మంది ప్రయాణికులు ఇబ్బంది పడతారని, అందుకే సబ్వేలో ముందుకు వెళతామన్నారు. అనంతరం సబ్ వే ద్వారానే బంగారుపాళ్యం చేరుకున్నారు. పోలీసుల ఓవర్ యాక్షన్ వల్ల చిత్తూరు, బెంగళూరు హైవే మీద చాలా సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీనియర్ నేతలను సైతం అడ్డుకున్న వైనంమాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను సైతం పోలీసులు లెక్క చేయలేదు. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా బంగారుపాళ్యం చేరుకునేందుకు వాహనాల్లో వస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సునీల్కుమార్, వెంకటేగౌడ్, వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి వాహనాలను అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే అని పోలీసులు చులకనగా వ్యవహరించారని ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ్, ఆయన అనుచరులను అడ్డుకుని వారిపై లాఠీచార్జ్ చేశారు. విజయానందరెడ్డి పట్ల చాలా దురుసుగా వ్యవహరించారు. ఒకానొక సమయంలో పోలీసులు తోసెయ్యడంతో విజయానందరెడ్డి కింద పడిపోయారు. ‘సాక్షి’ విలేకరులపైనా ఎస్ఐ సుబ్బరాజు దురుసుగా వ్యవహరించారు. సాక్షి వారిని కొట్టుకుంటూ పోతే మరోసారి రారంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. మార్కెట్ యార్డు వద్ద కొందరు జర్నలిస్టులు తెల్ల చొక్కాలు ధరించడాన్ని కూడా పోలీసులు తప్పుపట్టారు. అక్రిడిటేషన్ కార్డు చూపించినా వారి వ్యవహార శైలి మారలేదు. ‘మామిడి’ వేదన.. రైతు రోదన!చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలానికి చెందిన నలుగురు రైతులు మామిడి కొనుగోలు చేసే వారు లేక విసిగిపోయారు. ప్రభుత్వం నుంచి భరోసా లేకపోవడంతో ఆవేదన గురయ్యారు. ఈ క్రమంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి తమ గోడు వెళ్లబోసుకోవాలని వచ్చారు. అదే సమయంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో మామిడి పంటను తిమ్మోజీపల్లి వద్ద రోడ్డుపై పారబోసి ఆవేదన వ్యక్తం చేశారు. కంట తడి పెడుతూ జగనన్నా.. నీవే దిక్కు అంటూ వెళ్లిపోయారు. రైతులను అడ్డుకోడానికి ఇంత మంది పోలీసులా?జగన్ రాకకు ముందు ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులుసాక్షి టాస్క్ఫోర్స్ : వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనను అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయోగించిన పోలీస్ బలగాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. రాయలసీమ డీఐజీ, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల ఎస్పీలు, 9 మంది ఏఎస్పీలు, 17 మంది డీఎస్పీలు, సీఐలు, ఎస్లు సహా 2,000 మంది పోలీసులు జగన్ పర్యటనలో పాల్గొన్నారు. వీళ్లంతా జగన్కు జెడ్ ప్లస్ భద్రత కల్పించడానికి అనుకుంటే తప్పులో కాలేసినట్టే. కేవలం జగన్ అనే నాయకుడిని బంగారుపాళ్యం వెళ్లకుండా, మరీ ముఖ్యంగా ఆయన కోసం జనం ఎవరూ అటు వైపు కన్నెత్తి చూడకుండాం ఉండటం కోసమే పని చేశారు. ఎక్కడ చూసినా ఖాకీ యూనిఫాంలో గుంపులు గుంపులుగా కనిపించారు. యథేచ్ఛగా లాఠీలు సైతం ఝుళిపించారు. జగన్కు భద్రత కల్పించడంలో మాత్రం పోలీసుశాఖ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. వారంతా చిత్తూరు నుంచి పలమనేరు వరకు మోహరించి.. బస్సులు, స్కూటర్లు, బైక్లు, కార్లలో వచ్చే వాళ్లను నిలువరించడంపైనే దృష్టి సారించారు. తీరా వైఎస్ జగన్ బంగారుపాళ్యం మార్కెట్ యార్డు లోపలకు అడుగు పెట్టగానే ఒక్క పోలీసు కూడా కనిపించలేదు. కేవలం ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది తప్ప.. కానిస్టేబుల్ కూడా సమీపంలో లేరు. దీంతో వేలాది సంఖ్యలో తరలి వచి్చన జనం.. వైఎస్ జగన్ను చుట్టేశారు. జగన్ను వెనుక వైపు నుంచి లాగుతూ, ఆయన చేతులు లాగేస్తూ మీద మీదకు వెళ్లిపోయారు. ఓ దశలో వైఎస్ జగన్ కిందకు తూలి పోతుండగా వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. ఇంత మంది జనం మధ్య ఆయన మార్కెట్ లోపల రైతుల వద్దకు వెళ్లడానికి అరగంట పైనే సమయం పట్టింది. జెడ్ ప్లస్ భద్రత ఉన్న ఓ వీఐపీని ఇలా జన సమూహంలో వదిలేసి, పోలీసులు చోద్యం చూడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. జెడ్ ప్లస్ భద్రత అంటే ఇదేనా అని వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్రంగా తప్పుపట్టాయి. -
ఈ ప్రభుత్వం భయపడుతోంది: వైఎస్ జగన్
కేవలం 500 మంది మాత్రమే రావాలట! అంటే, కేవలం 500 మంది రైతులు మాత్రమే నష్టపోయారా? సమాధానం చెప్పండి. అసలు ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? ఎందుకు ఇన్ని ఆంక్షలు విధిస్తోంది? జగన్ వస్తే తప్పేమిటి? నేను రైతులతో మాట్లాడితే, వారి సమస్యలు లేవనెత్తితే తప్పేముంది? రైతులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టే ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చి వాళ్ల ఆవేదన చెబుతున్నారు.ఇవాళ ఇక్కడికి జగన్ వస్తున్నాడని తెలిసి 2 వేల మంది పోలీసులను మోహరించారు. ప్రతి గ్రామంలో ఏ రైతూ ఇక్కడికి రాకూడదని కట్టడి చేయాలని చూశారు. మీరు కనుక ఈ కార్యక్రమంలో పాల్గొంటే రౌడీషీట్లు తెరుస్తామని రైతులను బెదిరించారు. అయినా రైతులు స్వచ్ఛందంగా తరలి వస్తారు కాబట్టి, టూవీలర్స్పై ఎవరైనా వస్తే పెట్రోలు పోయొద్దంటూ బంక్ల యజమానులను ఆదేశించారు. మరీ ఇంత దుర్మార్గమా?మామిడిని ఫ్యాక్టరీలు కొనుక్కోక, రైతులకు కనీసం రెండున్నర, మూడు రూపాయలు కూడా దక్కని పరిస్థితుల్లో.. ఆ సరుకు వాహనాల్లోనే కుళ్లిపోతోంది. మామిడి రైతులు చివరకు లారీ కిరాయి కూడా ఇవ్వలేక అగచాట్లు పడుతున్నారు. అందుకే ఆ రైతులకు తోడుగా ఉండాలని కోరుతున్నాను. ప్రభుత్వం స్వయంగా వెంటనే మామిడి కొనుగోలు చేసి, రైతులను ఆదుకోకపోతే వారి పక్షాన వైఎస్సార్సీపీ గట్టిగా ఉద్యమిస్తుందని హెచ్చరిస్తున్నాను. -వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘రాష్ట్రంలో ఇవాళ రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని పరిస్థితి. వరి తీసుకుంటే దాదాపు రూ.300 నుంచి రూ.400 తక్కువకు అమ్ముకుంటున్నారు. మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీనీ, కోకో, పొగాకు, చివరికి మామిడి.. ఏ రైతు పరిస్థితి చూసుకున్నా దారుణం. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో తప్ప, వేరే రాష్ట్రంలో ఎక్కడైనా కిలో మామిడి రూ.2కే దొరుకుతుందా? కిలో మామిడికి కనీసం రెండున్నర రూపాయలు కూడా రావడం లేదని మామిడి రైతులు చెబుతున్నారు. ఇంత దుర్భర స్థితి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన మామిడి రైతులను పరామర్శించేందుకు బుధవారం ఆయన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డును సందర్శించారు. అక్కడ మామిడి రైతులను కలిసి, వారి కష్టాలు విన్నారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. ‘ఇవాళ నేను మామిడి రైతుల సమస్యలను ఆరా తీసేందుకు ఇక్కడికి వస్తుంటే కూటమి ప్రభుత్వం భయపడుతోంది. అందుకే ఎక్కడా లేని విధంగా ఆంక్షలు పెట్టింది. నా పర్యటనను అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. ఎక్కడికక్కడ రైతులను సైతం అడ్డుకుంది. రైతులకు మంచి జరగకూడదని కోరుకుంటోంది. ఎవరూ బయటకు తొంగి చూడకూడదని, రైతులు ఎన్ని అగచాట్లు పడుతున్నా కూడా, వాళ్ల జీవితాలు నాశనమైపోతున్నా కూడా ఎవరూ స్పందించ కూడదని ఉద్దేశంగా పెట్టుకుంది. అసలు జగన్ రైతుల్ని కలిస్తే తప్పేమిటి? రైతుల కోసం మాట్లాడితే తప్పేముంది? పోనీ రైతులు అగచాట్లు పడకుండా ఉండి ఉంటే, వారికి అసలు సమస్యే లేకపోతే ఇక్కడికి ఇంత మంది ఎలా వస్తారు? జగన్ వచ్చాడు కాబట్టి.. జగన్ వాళ్లకు తోడుగా నిలబడుతున్నాడు కాబట్టి.. వాళ్ల సమస్య ఇప్పుడైనా ప్రభుత్వం దృష్టికి కచ్చితంగా పోతుందని భావిస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని కుంభకర్ణుడి నిద్ర నుంచి లేపడం కోసమే ఇక్కడికి ఇన్ని వేల మంది వచ్చి తమ ఆక్రందన వినిపిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో కిలో మామిడికి కనీసం రూ.12 (టన్నుకు రూ.12 వేలు) వచ్చేలా చూడాలి. ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. లేదంటే వారి తరఫున వైఎస్సార్సీపీ పోరాడుతుంది’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..మీడియాతో మాట్లాడుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇన్నాళ్లూ గాడిదలు కాశారా?⇒ చంద్రబాబు ప్రభుత్వానికి సూటిగా నా ప్రశ్నలు.. ఏటా మామిడి కొనుగోళ్లు మే 10 నుంచి 15వ తేదీ మధ్యలో మొదలు పెడతారు. మరి ఈ ఏడాది ఎందుకు అలా మొదలు పెట్టలేదు?⇒ జూన్ 3వ వారం వరకు కొనుగోళ్లు ఎందుకు మొదలు కాలేదు?⇒ ఎప్పటిలాగే మే రెండో వారంలో మామిడి కొనుగోళ్లు జరిగేలా ఈ ప్రభుత్వం చొరవ చూపక పోవడం వల్ల జూన్ 3వ వారం నాటికి మామిడి పంట మార్కెట్ను ముంచెత్తడం నిజం కాదా?⇒ రైతులంతా మామిడి పల్ప్ కంపెనీల వద్ద బారులు తీరడం మీకు కనిపించ లేదా? ఎవరి వల్ల ఈ దుస్థితి ఏర్పడింది?⇒ పల్ప్ ఫ్యాక్టరీలకు ఒకేసారి పంట మొత్తం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దీంతో వాహనాల్లోనే మామిడి పంట కుళ్లిపోవడం మీకు కనిపించ లేదా? కేజీ మామిడి రూ. 2తో కొంటుండటం వాస్తవం కాదా? మీ పుణ్యాన ఈ పంటకు ఇక ధర రాదనే బాధతో చెట్లను కొట్టేసుకున్న రైతులను బెదిరిస్తారా?అశేష జనసందోహం నడుమ మార్కెట్ యార్డు లోపలికి వెళుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ⇒ చిత్తూరు జిల్లాలో 52 మామిడి పల్ప్ కంపెనీలు ఉన్నాయి. మే 10–15 తేదీల్లో తెరవాల్సిన ఆ ఫ్యాక్టరీలు జూన్ 3వ వారం వరకు తెరవకపోతే మీరు ఏం గాడిదలు కాశారు?⇒ ఎంత మంది రైతుల నుంచి ఈ ఫ్యాక్టరీలు కిలో మామిడి రూ.8 చొప్పున కొన్నాయి?⇒ మీరు గొప్పగా ప్రచారం చేస్తున్న అదనంగా రూ.4 ఎంత మంది రైతులకు ఇచ్చారు? ఈ రోజు రైతులకు ఏ ఒక్కరికీ కూడా గిట్టుబాటు రాని పరిస్థితి ఉందంటే అది మీ నిర్వాకం కాదా?⇒ పక్కన కర్ణాటకలో జనతాదళ్కు చెందిన కేంద్ర మంత్రి కుమారస్వామి అడిగితే, కిలో మామిడి రూ.16 చొప్పున కొనేందుకు కేంద్రం ముందుకొచ్చిందట. నిజానికి అది మంచి రేటు అని కాదు.. కనీస రేటు అని చెప్పి, అదే పని మీరెందుకు చేయలేకపోయారు? మీరు ఎందుకు కేంద్రాన్ని అడగలేకపోయారు? ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఏం గాడిదలు కాస్తోంది?⇒ చిత్తూరు జిల్లాలో 6.45 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. 2.20 లక్షల ఎకరాల్లో పంట పండుతుంది. 76 వేల మంది రైతులు వ్యవసాయం చేస్తూ మామిడి మీద బతుకుతారు. ఆ 76 వేల రైతుల కుటుంబాల్లో ఎంత మందికి, చంద్రబాబునాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కేజీ మామిడి ధర రూ.12 చొప్పున దక్కింది? ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో నిరుడు కిలో మామిడి రూ.29కి రైతులు అమ్ముకున్న పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు ప్రభుత్వంలో రైతులు కేవలం రూ.2 కే కిలో అమ్ముకుంటున్నారు. అలా ఆ రైతుల్ని నడిరోడ్డుపై నిలబెట్టడం భావ్యమా? ⇒ ఇక్కడికి జగన్ వస్తున్నాడని చెప్పి, మూడు రోజుల నుంచి కిలో మామిడికి రూ.6 ఇస్తామని మెసేజ్లు పెడుతున్నారు. అయ్యా చంద్రబాబూ.. రైతులకు వాస్తవంగా కనీసం కిలో మామిడికి రూ.2 కూడా రావడం లేదంటే.. మీరు నిద్రపోతున్నారా?రైతన్నలకు అండగా గత ప్రభుత్వంమా ప్రభుత్వ హయాంలో వ్యవసాయం రూపురేఖలు మారుస్తూ రైతులకు తోడుగా ఉండేవాళ్లం. రైతన్నలకు మే మాసం వచ్చే సరికి పెట్టుబడి సహాయం అందేది. అడుగడుగునా రైతన్నలకు ఆర్బీకేలు తోడుగా ఉండేవి. అవి వారిని చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమం జరిగేది. ఇదే జిల్లాలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కిలో మామిడి రూ.22 నుంచి రూ.29 వరకు రైతులు అమ్ముకున్నారు. నాడు రైతులకు కనీస మద్దతు ధర రానప్పుడు మా ప్రభుత్వ హయాంలో సీఎం యాప్ ఉండేది. ఆర్బీకేల పరిధిలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాకపోయినా వెంటనే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్గా ఉన్న ఆర్బీకే అసిస్టెంట్ నోటిఫై చేసే వారు. జాయింట్ కలెక్టర్లు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తూ, మార్క్ఫెడ్ పాత్ర పోషించే వారు. అలా అందరూ వెంటనే ఇన్వాల్వ్ అయ్యి.. ఆ ఆర్బీకే పరిధిలో ఈ–క్రాప్ ఆధారంగా పంటను కొనుగోలు చేసే వారు.ఇప్పుడవన్నీ కనుమరుగుఆ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఈ సంవత్సర కాలంలో రైతుల బతుకులు తలకిందులయ్యాయి. వారు తీవ్ర కష్ట నష్టాల్లో కూరుకుపోయారు. ఈ రోజు ఏం జరుగుతోంది? మొదటి ఏడాది దాటిపోయింది. రైతన్నలకు ఇవ్వాల్సిన రైతు భరోసా రూ.20 వేలు ఎగరగొట్టేశారు. ఈ ఏడాది జూన్ కూడా అయిపోయింది. జూలైలో ఉన్నాం. ఇంత వరకు రైతులకు పెట్టుబడి సహాయం అందలేదు. ఇంకా చంద్రబాబునాయుడు గారి పుణ్యాన రైతులకు సమయానికే రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రాకుండా పోయింది. ఆయన పుణ్యాన ఉచిత పంటల బీమా కూడా పూర్తిగా ఎగరగొట్టేసిన పరిస్థితి. ఆర్బీకేలన్నీ నిర్వీర్యమయ్యాయి. ఈ – క్రాప్ లేకుండా పోయింది. రైతులకు నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, యూరియా, ఎరువులు ఇవన్నీ కూడా ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలోనే సరఫరా చేసే పరిస్థితి ఇవాళ లేకుండా పోయింది. నియోజకవర్గానికి ఒక అగ్రి టెస్టింగ్ ల్యాబ్ కూడా ఇవాళ నిర్వీర్యమైపోయిన పరిస్థితి. వ్యవసాయానికి సంబంధించిన అన్ని విభాగాలు ఇవాళ నిర్వీర్యమైపోయిన పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది.భారీ జనసందోహానికి అభివాదం చేస్తున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టడి ప్రయత్నాలు అత్యంత దారుణంశశిధర్రెడ్డి అనే వ్యక్తి రైతు కుటుంబానికి చెందిన వారు కాదా? పోలీసుల దాడిలో ఆయన తలకు తీవ్ర గాయమైంది. ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకొచ్చింది అని అడుగుతున్నా.. రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. చిత్తూరు జిల్లాలో దాదాపు 80 శాతం మంది ఆ రంగం మీద బతుకుతున్నారు. మరి వీళ్లంతా రైతు బిడ్డలు కాదా? ఇక్కడికి రావొద్దని దాదాపు 1200 మంది రైతులను నిర్బంధించారు. ఇక్కడికి వచ్చిన రైతులపై విచ్చలవిడిగా లాఠీఛార్జ్ చేశారు. ఇది అత్యంత దారుణం. -
అంక్షల కంచెలు దాటుకుని వచ్చిన భారీగా తరలివచ్చిన అభిమానులు
-
ముగ్గురు మూర్ఖులు.. జనం సొమ్ముతో సోకులు
వైఎస్ జగన్ చిత్తూరు పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. అరచేయి అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరని, అలాంటిది ముగ్గురు మూర్ఖులు కలిసి జగన్ను ఆపగలిగారా? అని ప్రశ్నించారాయన. సాక్షి, కృష్ణా జిల్లా: కూటమి నేతలపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య(నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కష్టాలు చూసేవాళ్లుగానీ, వినేవాళ్లుగానీ లేకపోవడం రాష్ట్రానికి పట్టిన దరిద్రమని అన్నారాయన. బుధవారం మీడియాతో పేర్ని నాని మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో రైతాంగానికి వచ్చిన కష్టం దేశంలో ఎక్కడ చూడలేదు. 164 సీట్లతో గెలిచానని కూటమి నేతలు జబ్బలు చరుచుకుంటున్నారు. హెలీకాప్టర్లు , ప్రత్యేక విమానాల్లో తమ భార్య పిల్లల వద్దకు తిరుగుతున్నారు. కూటమి నేతలు జనం సొమ్ముతో సోకులు చేసుకుంటున్నారు. అయితే రైతుల కష్టాలు చూసేవాడు కానీ...వినేవాడు కానీ లేకపోవడం మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం. ధాన్యం రైతుకు గిట్టుబాటు దొరకని పరిస్థితి. పెసలు , మినుములు కొనేవాడు లేక ఇబ్బంది పడుతున్నారు. మామిడి రైతుల వద్దకు జగన్ మోహన్ రెడ్డి వెళ్తానని చెప్పే వరకూ ఒక్కడు కూడా పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు బ్రతికే ఉన్నారా?. కర్ణాటక కేంద్రమంత్రికి ఉన్న స్పృహ కూడా ఈ రాష్ట్రానికి లేదు. ఇప్పుడు.. 3.5 లక్షల టన్నులు కొన్నామని అబద్ధాలు చెబుతున్నారు. నాలుగు రూపాయలు సబ్సిడీ ఇచ్చామని చెబుతున్నారు.. ఎవరికిచ్చారు?. ఒక్క రైతుకైనా ఇచ్చినట్లు చూపించండి. ముగ్గురు మూర్ఖులు కలిసి వైఎస్ జగన్ను ఇవాళ ఆపగలిగారా?. జగన్ వెళ్తుంటే మార్కెట్ యార్డు మూసేశారు. రైతులను... పంటను కొనే వ్యాపారులను రావొద్దని ఆపేశారు. అరచేయి అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరు. నిజంగా మీకు చేతనైతే మామిడికి గిట్టుబాటు ధర వచ్చేలా చేయండి అని కూటమి నేతలకు పేర్ని నాని సవాల్ విసిరారు. -
జగనన్న కోసం బారికేడ్లు బద్దలు కొట్టుకొని వచ్చాం
-
అడుగడుగునా అడ్డంకులు.. నేడు వైఎస్ జగన్ పర్యటన
సాక్షి టాస్క్ఫోర్స్: ఏళ్ల తరబడి కంటికి రెప్పలా కాపాడుతున్న చెట్లను రైతన్నలే పెకిలిస్తున్న దుస్థితి ఎందుకు దాపురించింది? కోత ఖర్చులు కూడా దక్కక మామిడి కాయలు చెట్లపైనే కుళ్లిపోతున్నాయి.. రోడ్లపై పారబోస్తున్నా సర్కారులో చలనం ఉండదా? మిర్చి.. ధాన్యం.. పొగాకు.. మామిడి..! ఏడాదిగా ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదు. రైతులను ఓదార్చి భరోసా కల్పించేందుకు మాజీ సీఎం వస్తుంటే ఈ ప్రభుత్వానికి ఎందుకింత భయం? అని అన్నదాతలు మండిపడుతున్నారు. అడుగడుగునా పోలీసుల దిగ్బంధం.. జగన్ పర్యటనలో పాల్గొనకూడదని వందలాది మందికి నోటీసులు జారీ చేయడం.. రౌడీషీట్లు తెరుస్తామని బెదిరించడం.. జగన్ కోసం వచ్చే రైతులను ఆటోల్లో ఎక్కించుకుంటే కేసులు పెడతామని హెచ్చరించడం.. కటౌట్లు, ఫ్లెక్సీలను ధ్వంసం చేయడం లాంటి కుయుక్తులతో చంద్రబాబు సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు.కూటమి నేతల బెదిరింపులు...దారుణంగా ధరల పతనంతో కుదేలైన మామిడి రైతుల దుస్థితిని నేరుగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళెం మార్కెట్ను సందర్శించనున్న మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు టీడీపీ కూటమి సర్కారు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. ముఖ్యనేత ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగగా.. మరోవైపు కూటమి నేతలు రైతులు, వ్యాపారులపై బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ పర్యటనకు కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలి రానున్నట్లు పసిగట్టడంతో అడ్డుకునేందుకు పోలీసులు మంగళవారం ఉదయం వైఎస్సార్సీపీ శ్రేణులందరికీ నోటీసులు జారీ చేశారు. కొందరు పోలీసులు వైఎస్సార్సీపీ శ్రేణులకు ఫోన్ చేసి వైఎస్ జగన్ పర్యటనకు వెళ్లొద్దని హెచ్చరించినట్లు సమాచారం. వైఎస్ జగన్ బంగారుపాళెం వస్తున్నారని తెలిసినప్పటి నుంచి కూటమి సర్కారులో హడావుడి మొదలైంది. కిలో మామిడి రూ.8 చొప్పున కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఫ్యాక్టరీ యాజమాన్యాలు రూ.6 చొప్పున మాత్రమే చెల్లిస్తామని రైతులతో అంగీకార పత్రంపై సంతకాలు తీసుకుంటున్నాయి. ర్యాంపుల వద్ద కేవలం రూ.2కే కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ నేరుగా మార్కెట్ యార్డు వద్దకు వచ్చి రైతులతో మాట్లాడనుండటంతో చంద్రబాబు సర్కారులో వణుకు ప్రారంభమైంది. ఎన్ని ఆటంకాలు సృష్టించినా...మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలకు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వస్తుండటంతో టీడీపీ కూటమి సర్కారు అడుగడుగునా ఆంక్షలు విధిస్తోంది. వైఎస్ జగన్ ఇటీవల నెల్లూరులో పర్యటించాల్సి ఉన్నా.. హెలికాప్టర్కు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు బంగారుపాళెం పర్యటనను అడ్డుకునేందుకు కుట్రలకు తెర తీశారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా వైఎస్ జగన్ పర్యటనలో ఎటువంటి మార్పులు ఉండవని వైఎస్సార్సీపీ నేతలు తేల్చి చెప్పటంతో.. ఎట్టకేలకు అనుమతులు ఇస్తూనే హెలిప్యాడ్ వద్ద కేవలం 30 మంది, మార్కెట్ యార్డులో 500 మంది మాత్రమే ఉండాలంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. మంగళవారం ఉదయం నుంచి వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సుమారు 400 మందికి నోటీసులు జారీ చేశారు. వైఎస్ జగన్ పర్యటనకు తరలి వెళ్లటానికి వీల్లేదని ఆదేశించారు. బంగారుపాళెం వైపు వెళ్లే మార్గంలో వాహనాలను అడ్డుకుంటూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బంగారుపాళెం మామిడి కాయల మార్కెట్కు వైఎస్ జగన్ వస్తున్న నేపథ్యంలో పూతలపట్టు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న జయప్రకాష్ వ్యాపారులను పిలిపించుకుని సమావేశం అయినట్లు సమాచారం. బుధవారం కొనుగోళ్లు ఆపేయాలని, మార్కెట్కు రావద్దని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. వైఎస్ జగన్ను అడ్డుకుంటామని ప్రకటించిన పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నట్లు టీడీపీ శ్రేణులే చర్చించుకుంటున్నాయి.నేడు వైఎస్ జగన్ పర్యటన ఇలా... మామిడి రైతులకు భరోసా కల్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. బంగారుపాళ్యం మండలం కొత్తపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ఉదయం 11 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఉదయం 11.20 గంటలకు బంగారుపాళ్యం మామిడి మార్కెట్కు చేరుకుని మామిడి రైతులతో సమావేశమవుతారు. వారి కష్టాలను స్వయంగా తెలుసుకుంటారు.కటౌట్లు కూల్చివేతపై స్థానికుల నిరసనబంగారుపాళెం: మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు చిత్తూరు జిల్లా బంగారుపాళెంలోని జంబువారిపల్లె పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన బ్యానర్లు, కటౌట్లను మంగళవారం రాత్రి పోలీసులు కూల్చి వేయించారు. స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకుని నగదు చెల్లించి స్వాగత కటౌట్లు, బ్యానర్లు రహదారి పక్కన ఏర్పాటు చేశారు. అయితే వీటికి అనుమతులు లేవంటూ పోలీసులు జేసీబీని తీసుకొచ్చి సుమారు 30 బ్యానర్లు, కటౌట్లను కూల్చివేశారు. పంచాయతీ నుంచి అనుమతి తీసుకుని ఏర్పాటు చేసుకున్న వాటిని కూల్చడం ఏమిటని పూతలపట్టు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త డాక్టర్ సునీల్కుమార్ పోలీసులను ప్రశ్నించారు. తమకు కలెక్టర్ నుంచి ఆదేశాలు అందాయని ఓ సీఐ పేర్కొనడం గమనార్హం. పోలీసుల తీరుపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. -
మన రైతులకు కావాలి... రూ. 6.4 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: వాతావరణ మార్పులను తట్టుకుని రైతులు అభివృద్ధి చెందాలంటే భారత్లో రైతులకు ఏకంగా 75 బిలియన్ డాలర్ల (రూ.6.4 లక్షల కోట్ల)పెట్టుబడులు అవసరమని ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ (ఐఎఫ్ఏడీ)అధ్యక్షుడు అల్వారో లారియో అన్నారు. ప్రపంచవ్యాప్తంగానే గాక భారత్లోనూ గ్రామీణ సమాజాలకు సాయం అందించడం అతి పెద్ద సవాలని ఆయన తెలిపారు. వ్యవసాయాన్ని రైతులకు మరింత లాభదాయకంగా చేయడం, క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో ఉత్పాదకతను పెంచుకోవడం, ఆహార భద్రత నుంచి పోషకాహార భద్రతకు ఎదగడం వంటి అంశాలపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘‘భారత్లోని రైతుల్లో చిన్న, సన్నకారు రైతులు 86.2శాతం మంది ఉన్నారు. నీటికొరత, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తరచుగా కరువులు ఎదుర్కొంటున్నారు. కొన్ని వాతావరణ స్మార్ట్ పద్ధతులను అవలంబించడానికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి పెట్టుబడులు పెట్టాలి. పంటల వైవిధ్యం, మెరుగైన నీటి నిర్వహణ లేదా సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థలు, కమ్యూనిటీ విత్తన బ్యాంకులను సృష్టించడం, కరువును తట్టుకునే విత్తనాలను ఉపయోగించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఇవి దిగుబడిని పెంచుతాయి’’ అని లారియో తెలిపారు. ‘‘పేదరైతులకు పెట్టుబడులు, వారికి మార్కెట్ అనుసంధానం కీలకం’’ అన్నారు. -
మొలుగుమాడు.. భూముల రీసర్వే చూడు
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం–కృష్ణా జిల్లాల సరిహద్దు మండలమైన ఎర్రుపాలెం పరిధిలో ఉండే వ్యవసాయాధారిత గ్రామం మొలుగుమాడు. గతంలో ఇది ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉండేది. నిజాం కాలంలో తెలంగాణలో భాగమైంది. అయినా ఆ గ్రామానికి ఇప్పటివరకు నక్షా (గ్రామ పటం) లేదు. రెవెన్యూ రికార్డులు మాత్రం ఉన్నాయి. ఆ రికార్డుల మేరకు రైతులు ఎవరి భూమి వారు సాగు చేసుకుంటున్నారు. ఈ గ్రామంలోని రైతులందరికీ రైతు భరోసా కూడా వస్తోంది. కానీ గ్రామ పటం లేని కారణంగా అసలు గ్రామ సరిహద్దులేవో తేల్చలేని పరిస్థితి. వాగులు, వంకలు ఎక్కడెక్కడున్నాయో కాగితాల మీద చూపించలేని పరిస్థితి. ఇలాంటి గ్రామాలు తెలంగాణలో 413 ఉన్నాయని తేల్చిన ప్రభుత్వం.. పైలట్గా ఆ గ్రామంతో పాటు ఐదు గ్రామాల్లో భూముల రీసర్వే చేపట్టింది. మొలుగుమాడుకు సంబంధించిన 843 ఎకరాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసింది. రీ సర్వే అనంతరం మొలుగుమాడు గ్రామంలోని భూములపై స్పష్టత వచ్చింది. ఆ గ్రామ సరిహద్దులు తేలాయి. అసలు ఆ గ్రామంలో ఉన్న భూముల విస్తీర్ణం ఎంత? ఎంతమంది రైతులు సాగు చేసుకుంటున్నారు? ప్రభుత్వ భూమి ఎంత ఉంది? చెరువులు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి? వాగులు ఎంత మేరకు ఉన్నాయి? భూముల సాగుకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నాయి? రోడ్లు ఎక్కడ ఉన్నాయి? శ్మశానాల సంగతేంటి? ఎన్ని సర్వే నంబర్లలో భూమి ఉంది? ఆ సర్వే నంబర్లను ఎన్ని సబ్ డివిజన్లు చేశారు? అనే వివరాలన్నీ స్పష్టంగా తెలిసిపోయాయి.దీంతో గ్రామానికి నక్షా వస్తోంది. టిప్పన్లు (రెవెన్యూ రికార్డుల ప్రకారం భూమి స్కెచ్) వస్తున్నాయి. దీంతో ఇదంతా ఎలా సాధ్యమయ్యింది? అసలు రీసర్వే ఎలా జరిగింది? అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. గ్రామస్తులకు ముందుగానే అవగాహన రాష్ట్ర ప్రభుత్వం భూముల రీసర్వే కోసం మొలుగుమాడు గ్రామాన్ని పైలట్గా ఎంపిక చేసిన తర్వాత ఆ గ్రామస్తులకు ఈ ప్రక్రియపై ముందుగా అవగాహన కల్పించారు. హైదరాబాద్కు చెందిన ఐఐసీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఏజెన్సీ సర్వే నిర్వహించింది. ఎర్రుపాలెం తహశీల్దార్ ఎం.ఉషా శారదతో పాటు మధిర, ఎర్రుపాలెం సర్వేయర్లు, ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు రికార్డు అసిస్టెంట్లు, ఆరుగురు సర్వే ఏజెన్సీ సిబ్బంది రెండు బృందాలుగా విడిపోయి భూముల రీసర్వే నిర్వహించారు. మరో ఆరుగురు డ్రోన్ సిబ్బంది వీరికి సహకరించారు. ఈ ఏడాది మే 26వ తేదీన సర్వే ప్రారంభం కాగా జూన్ 21వ తేదీతో పూర్తయింది. రోజుకు 60–80 సర్వే నంబర్ల చొప్పున విభజించుకుని సర్వే చేశారు. ఉత్తర దిక్కు నుంచే మొదలు.. ఉత్తరం దిక్కు నుంచి సర్వే ప్రారంభించారు. అంతకుముందు గ్రామాల సరిహద్దులను గుర్తించే ప్రక్రియ చేపట్టారు. ఉత్తరం దిక్కునే పురాతన సరిహద్దు రాయిని గుర్తించి అక్కడి నుంచి రీసర్వే ప్రారంభించారు. గ్రామంలో ఒకటో సర్వే నంబర్ కూడా ఉత్తరం దిక్కు నుంచే ప్రారంభమవుతోంది. అయితే ఎక్కడ సర్వే చేసినా ఉత్తరం దిక్కునే ప్రారంభిస్తారని, గడియారం ముల్లు తరహాలో ఉత్తరం నుంచి తూర్పు, దక్షిణం, పడమర దిక్కుల్లో సర్వే చేస్తారని రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి. ఫలానా రోజు ఫలానా సర్వే నంబర్లలో రీ సర్వే ఉంటుందని ముందుగానే చాటింపు వేయడం వల్ల..సర్వే సమయంలో రైతులు తమ భూముల్లో సిద్ధంగా ఉండేవారు. వారి భూమి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో చూపించేవారు. ఈ క్రమంలో ఆ భూ కమతాన్ని గ్రౌండ్ ట్రూతింగ్ చేసిని సిబ్బంది.. డీజీపీఎస్ విధానంలో విస్తీర్ణాన్ని నిర్ధారించి సరిహద్దులు ఫిక్స్ చేశారు. దీన్ని రికార్డులో నమోదు చేశారు. వివరాలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు పంపారు. ఈ గ్రామంలో భూముల విషయంలో పెద్దగా వివాదాలు లేకపోవడంతో పోలీసుల అవసరం రాలేదు. 6 ఎకరాలు ఎక్కువ..! ఈ గ్రామంలో భూములకు సంబంధించిన వివాదాలు పెద్దగా రాలేదు కానీ, రీ సర్వే అనంతరం భూముల లెక్క మాత్రం తేడా వచ్చింది. గతంలో ఉన్న రికార్డుల ప్రకారం అక్కడ 845.32 ఎకరాల భూమి ఉంది. కానీ రీ సర్వే తర్వాత ఆ గ్రామంలో మొత్తం భూమి విస్తీర్ణం 852.10 ఎకరాలుగా తేలినట్లు తెలిసింది. అంటే 6 ఎకరాల 18 గుంటల భూమి ఎక్కువ ఉందన్నమాట. అయితే వ్యవసాయ భూముల విషయంలో ఎలాంటి తేడాలు రాలేదని, ప్రభుత్వ భూములు, చెరువులు, వాగులకు సంబంధించిన విస్తీర్ణం ఎక్కువ వచ్చి ఉండవచ్చని చెబుతున్నారు. వెలుగులోకి సమస్యలు ⇒ సర్వే నంబర్లకు సంబంధించిన సబ్ డివిజన్లు ఎక్కువగా ఉండడంతో కొన్నిచోట్ల రైతు ఎక్కడ కబ్జాలో ఉన్నాడో అర్థం కాలేదు. ముఖ్యంగా తెలుగులో ‘రు’, ‘ఎ’, ఇంగ్లీషులో ‘ఆర్’, ‘ఈ’ అని సబ్ డివిజన్లు ఉన్నచోట్ల ఈ సమస్య కనిపించింది. ⇒ వారసత్వంగా వచ్చే భూముల విషయంలో భాగస్వామ్య పంపకాలు పూర్తయిన తర్వాత కూడా పాత పట్టాదారు (తండ్రి లేదా తల్లి) పేరిట భూములకు పాసు పుస్తకాలు వచ్చాయి. ⇒ ఒక రైతు పేరిట 66 గజాల భూమి కూడా రికార్డయి పాసుపుస్తకం ఉంది. ఇది రైతుబంధు కోసం జరిగి ఉంటుందని రెవెన్యూ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ⇒ ఆన్లైన్ పహాణీలు కొన్నిచోట్ల సరిపోలలేదు. ఈ గ్రామంలోని 74వ సర్వే నంబర్లో భూమి రికార్డు ఒకరి పేరిట ఉంటే ఆ భూమి సాగు (కబ్జా)లో మరో ముగ్గురు రైతులున్నారు. సర్వేలో ఆ భూమి ముగ్గురు రైతులదేనని తేలింది. దీంతో ఇప్పుడు రికార్డుల్లో ఆ ముగ్గురి పేర్లు నమోదు చేసే అవకాశం లభించింది. ⇒ మరో రైతు భూమి 62, 63 సర్వే నంబర్లలో ఉంటే పహాణీలో 36 సర్వే నంబర్లో వచ్చింది. మరో రైతు భూమి 17వ సర్వే నంబర్లో ఉండాల్సి ఉండగా, ఆన్లైన్ రికార్డులో మాత్రం 49 సర్వే నంబర్ నమోదైంది. తేలని డొంక సమస్య ఈ గ్రామం,, సఖినవీడు గ్రామంతో కలిసే చోట రైతుల పొలాలకు వెళ్లేందుకు పూర్వం డొంక ఉండేదని గ్రామస్తులు చెపుతున్నారు. ఈ డొంకకు ఎదురుగా రోడ్డు అవతల 30 అడుగుల డొంక ఉంది. కానీ, రోడ్డు ఇవతలి వైపు లేకపోవడంతో రైతులు పొలాలకు వెళ్లేందుకు మార్గం లేకుండా పోయింది. దీంతో డొంక ఆవలి భూములను సాగు చేయలేని పరిస్థితి ఉంది. రీసర్వేలో భాగంగా ఈ డొంక సమస్యను తేల్చాలని, నక్షాలో చేర్చాలని గ్రామస్తులు కోరినా ఫలితం లేకుండా పోయింది. ఈ డొంక మార్గంలో సమాధులు ఉండడం, అందులోనే అసైన్డ్ భూమి ఉండడంతో డొంకను అధికారికంగా చూపెట్టలేమని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సమస్యను తేలి్చన తర్వాతే నక్షా తయారు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. సహకరించిన అందరికీ ధన్యవాదాలు రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత ఒక్కొక్కటిగా భూముల సమస్యలు పరిష్కరిస్తున్నాం. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోని మొలుగుమాడు గ్రామంలో నక్షా లేదని తెలిసి పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశాం. అందరి సహకారంతో ఇక్కడ రీసర్వే పూర్తయిందనే సమాచారం వచ్చింది. రైతులు, సిబ్బంది అందరికీ ధన్యవాదాలు. – పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఆ తృప్తి ఎప్పటికీ ఉంటుంది రీసర్వేకు మొలుగుమాడు గ్రామ రైతాంగం బాగా సహకరించింది. 843 ఎకరాల్లో భూములు సర్వే చేయడమంటే మాటలు కాదు. రెవెన్యూ సిబ్బందితో పాటు సర్వే ఏజెన్సీ కూడా బాగా పనిచేసింది. నా హయాంలో ఓ గ్రామానికి రెవెన్యూ పటం తయారు చేశానని, నక్షా ఇవ్వగలిగాననే తృప్తి ఎప్పటికీ మిగిలిపోతుంది. – మన్నె ఉషాశారద, ఎర్రుపాలెం మండల తహశీల్దార్ మంచి అవకాశం..వినియోగించుకున్నాం మా గ్రామానికి నక్షా లేని కారణంగా అసలు డొంకలెక్కడున్నాయో, రోడ్లు ఏవో అర్థమయ్యేది కాదు. గతంలో ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గతంలో చేసిన పాదయాత్ర సందర్భంగా వినతిపత్రం ఇచ్చాం. ఆయన మా గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టులో చేర్చారు. ఆ అవకాశాన్ని మేం వినియోగించుకున్నాం. – గంటా శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్, మొలుగుమాడు ప్రతి రైతు నుంచి సంతకాలు తీసుకున్నాం భూముల రీసర్వే కోసం నిబద్ధతతో పనిచేశాం. సర్వే పూర్తయిన తర్వాత ప్రతి రైతు నుంచి సంతకాలు తీసుకున్నాం. ఎవరి పేరు మీద భూమి ఉంటే వారు వస్తేనే సర్వే చేశాం. ఎవరైనా కుటుంబ సభ్యులు వస్తే చేయలేదు. – రాజశేఖర్, గ్రామ సర్వేయర్ సర్వే సారాంశం ఇదీ: పట్టా ఉండి భూముల్లో కబ్జా ఉన్న రైతుల సంఖ్య: 1023 ఆ భూమి విస్తీర్ణం: 668.0226 ఎకరాలు ఎలాంటి టైటిల్ లేకుండానే సాగు చేసుకుంటున్న రైతులు: 62 ఆ భూమి విస్తీర్ణం: 34.3964 ఎకరాలు టైటిల్ ఉండి వాస్తవంగా భూమి లేని రైతులు: 13 ఆ భూమి విస్తీర్ణం: 3.0139 ఎకరాలు ఆన్లైన్లో ఎంట్రీ కాని రైతుల సంఖ్య: 54 ఆ భూమి విస్తీర్ణం: 26.316 ఎకరాలు గ్రామ సరిహద్దులివీ.. ఉత్తరం: ఇనగాలి గ్రామం (ఈ వైపున 21 సర్వే నంబర్లు ఉన్నాయి) దక్షిణం: సఖినవీడు గ్రామం (ఈ దిక్కున 24 సర్వే నంబర్లు ఉన్నాయి) తూర్పు: ఏరు (కట్లేరు) పశ్చిమం: మాటూరు గ్రామం (ఇటు వైపు 10 సర్వే నంబర్లు ఉన్నాయి.) భూముల రకం, విస్తీర్ణం.. భూమి రకం విస్తీర్ణం (ఎకరాలు, గుంటల్లో) ప్రభుత్వ భూమి 78.3359 ఇనాం భూమి 16.2039 గ్రామ కంఠం 49.38 చెరువు 25.2960 పట్టా భూమి 683.06 -
చిత్తూరుకు YS జగన్
-
రాజధాని విస్తరణకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదంటున్న రైతులు
-
మా భూములిచ్చే ప్రసక్తే లేదు... ఏపీ రాజధాని భూ సమీకరణ సభల్లో ఎమ్మెల్యే, అ«ధికారులను తరిమికొట్టిన రైతులు
-
భూములివ్వం.. గోబ్యాక్.. గోబ్యాక్
తాడికొండ: ‘గోబ్యాక్ గోబ్యాక్.. మా భూములిచ్చేది లేదు.. గోబ్యాక్ గోబ్యాక్’.. అంటూ రాజధాని భూసమీకరణ గ్రామసభలలో రైతులు పార్టీలకు అతీతంగా శనివారం కూడా పెద్దఎత్తున నిరసన గళం వినిపించారు. సభ జరిగిన ప్రతీచోటా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్, అధికారులను ఉక్కిరిబిక్కిరి చేశారు. ప్రశ్నలతో హోరెత్తించారు. భూములిచ్చేందుకూ ఎవరూ సిద్ధంగా లేరని తెగేసి చెప్పారు. లక్షల ఎకరాలు తీసుకుని ఏం చేస్తారంటూ వారిపై విరుచుకుపడ్డారు.రాజధాని భూసమీకరణ సమాయత్త సభలలో భాగంగా గుంటూరు జిల్లా తాడికొండ మండలం గరికపాడులో గ్రామసభ నిర్వహించిన అనంతరం తాడికొండ విచ్చేసిన ఎమ్మెల్యే శ్రావణ్కుమార్, అధికారులు సభ మొదలు పెట్టేందుకు మైకు అందుకోగానే రైతులు వారిని అడుగడుగునా అడ్డుకుంటూ నినాదాలతో హోరెత్తించారు. భూసమీకరణ పేరుతో రైతుల పొట్టగొట్టేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం యత్నిస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘అసలు మా ప్రాణ సమానమైన భూములు ఎందుకివ్వాలి’.. అని పలువురు సూటిగా ప్రశ్నించారు. ఒక్కమాట కూడా మాట్లాడకుండా వెళ్తే మంచిదని, అంతకుమించి మాట్లాడితే ఒప్పుకునేదిలేదని రైతులు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. గతంలో 33 వేల ఎకరాలు ఇచ్చి న రైతులకు న్యాయం చేయలేదుగానీ.. ఇప్పుడు ప్రైవేటు కంపెనీలకు మా భూములు ధారాదత్తం చేసి మమ్మల్ని రోడ్డున పడేసేందుకు వచ్చారా.. భూములు ఇవ్వబోమని రైతులు తెగేసి చెప్పారు. పైగా.. పీఎం కిసాన్ కింద కేంద్రం ఇప్పటికే రూ.6వేలు ఇస్తోందని.. రైతుభరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.20వేలు ఇస్తానని హామీ ఇచ్చి ందని.. ఇలా మొత్తం రూ.26 వేలు వస్తుందని.. కానీ, మీరిచ్చే రూ.30 వేలు కౌలు ద్వారా మాకు అదనంగా దక్కేది కేవలం నాలుగు వేలేనా అని ముక్తకంఠంతో రైతులు నిలదీశారు. పైగా.. భూమిపై వచ్చే పంట సాగు ఆదాయం కూడా తాము కోల్పోతామని వారు కుండబద్దలు కొట్టారు. దీంతో.. చేసేదిలేక సభ వాయిదా వేస్తున్నట్లు ఎమ్మెల్యే, అధికారులు ప్రకటించి అక్కడ నుంచి జారుకున్నారు. పొన్నేకల్లు సభలోనూ ఎమ్మెల్యే శ్రావణ్కుమార్, ఆర్డీఓ శ్రీనివాసరావు తదితర అ«ధికారులను రైతులు తరిమికొట్టి సభ జరగకుండా అడ్డుకున్నారు. నిడుముక్కలలోనూ ఉక్కిరిబిక్కిరి.. అనంతరం.. నిడుముక్కల గ్రామంలో నిర్వహించిన సభలోనూ రైతులు వారిని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. గ్రామానికి చెందిన రైతు బండ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. మాకెలాంటి ఇబ్బందుల్లేకుండా చూస్తామని మీరు మాకు భరోసా ఇస్తారా’.. అని సభా ముఖంగా ప్రశ్నించడంతో ఎమ్మెల్యే, అధికారులు తెల్లముఖం వేశారు. రైతుల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసేందుకు యత్నిస్తాం తప్ప మాకేం సంబంధమని వారు మాట దాటవేశారు. దయచేసి మా భూములు వదిలేయండి.. ఈ సభలోనే ఓ మహిళ మాట్లాడుతూ.. ‘మీరు చెప్పినవన్నీ జరుగుతాయా? ఒకవేళ ఇవన్నీ జరగకపోతే మీరు మాపై దయుంచి మాకు కూడా చట్టాలు వర్తించేలా జీఓ తీసుకురండి.. అప్పుడు రైతులకు న్యాయం జరగకపోతే మీపై చర్యలు తీసుకుంటాం.. అంతేగానీ, అధికారం ఉందని మీరు భూములు తీసుకెళ్లిపోతే తర్వాత మేం టెంట్లు వేసుకుని ధర్నాలు, నిరసనలు చేయలేం.. దయచేసి మా భూములు వదిలేయండి’.. అని తీవ్ర స్వరంతో చెప్పారు. భూములివ్వడానికి ఎవరూ సుముఖంగా లేరు.. ఇక మండల టీడీపీ అధ్యక్షుడు తలశిల ప్రసన్న మాట్లాడుతూ.. గతంలో పూలింగ్ సమయంలో రూ.2 లక్షలు ఉన్న ముంపు పొలాలకు ఇచ్చి న ప్యాకేజీ.. ఇప్పుడు రూ.3 కోట్ల నుంచి రూ.7 కోట్లు పలుకుతున్న మా మెరక పొలాలు ఒకటేనా అని ప్రశ్నించారు. అప్పుటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరన్నారు. అప్పటి అదే ప్యాకేజీనే ఇప్పుడు మాకిస్తే ఎలా చెల్లుబాటు అవుతుందని ప్రశ్నించారు. మీరు హామీ ఉండి మా తరఫున పోరాటం చేస్తానంటే మీ హామీ మీద అయితే భూములిస్తామన్నారు. దీంతో ఎమ్మెల్యేకు ఏం చెప్పాలో అర్ధంకాలేదు. ఇంతలో మరో రైతు మైకు అందుకుని.. ‘అందరి తరఫున నేను మాట్లాడుతున్నా.. ఇప్పుడు మా భూములకు ధరలు ఉన్నాయి. భూములివ్వడానికి రైతులెవరూ సుముఖంగాలేరు. ముందు 44 వేల ఎకరాలు అన్నారు.. ఆ గ్రామాల్లో సభలు పూర్తయ్యాక మళ్లీ అదనపు గ్రామాల్లో సభలు నిర్వహిస్తున్నారు. అసలు ఎంత సమీకరణ చేస్తారు.. లక్షల ఎకరాలు తీసుకుని ఏం చేస్తారు’ అని ఆయన ఎమ్మెల్యే శ్రావణ్కుమార్, అధికారులను నిలదీశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రైతుల ఫైర్.. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘గతంలో 33 వేల ఎకరాలు తీసుకుంటే దానికి రైతుల ప్లాట్లు ఇతర అవసరాలకు 60 శాతం భూమి పోగా మిగిలిన భూమిలో అభివృద్ధి చేస్తున్నారు.. అది చాలదు కనుక పెద్ద సంస్థలకు ఇచ్చేందుకు ల్యాండ్ బ్యాంక్ కోసం సమీకరణ చేస్తున్నాం’ అని చెప్పడంతో రైతులు మండిపడ్డారు. దీంతో.. భూములిచ్చేందుకు రైతులు ససేమిరా అంటుండడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు బరితెగించి భూసమీకరణకు అనుకూలంగా తీర్మానాలు చేసినట్లు తమకు అనుకూలమైన వారితో సంతకాలు పెట్టించుకుంటూ నివేదికలు సిద్ధంచేస్తున్నారు. -
చెట్టునే నరకనా... మెడ కోసుకోనా?
ఆంధ్రప్రదేశ్లోని తోతాపురి మామిడి రైతుల హాహాకారాలు ఆ రాష్ట్ర సరిహద్దుల్ని దాటి ప్రతిధ్వనిస్తున్నాయి. కిలోకు పన్నెండు రూపాయలు కనీస ధరగా నిర్ణయించిన ప్రభుత్వం కార్యాచరణపై మాత్రం ముసుగేసింది. ఫలితంగా రెండు రూపాయలకు కూడా కొనే నాథుడు లేక రైతులు మామిడి కాయల్ని రోడ్లపై పారబోస్తున్న దృశ్యాలు దర్శనమిచ్చాయి. పారబోయడానికి మనసొప్పని రైతులు రవాణా ఖర్చులు వచ్చినా చాలని హైదరాబాద్ వంటి దూర ప్రాంత మార్కెట్లకు తరలించిన ఉదంతాలు కోకొల్లలు. తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోతున్న ఈ పరిస్థితుల్లో పసిబిడ్డల్లా పెంచుకున్న చెట్లను నరికేయాలో, చేతిలో వున్న కొడవలితో మెడనే నరుక్కోవాలో అర్థం కావడం లేదంటూ ఒక రైతు వాట్సప్లో పెట్టిన మెసేజ్ కంటతడి పెట్టించింది.ఇదొక్క మామిడి రైతుల ఆక్రందనే కాదు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రైతులందరి ఉమ్మడి ఆవేదన ఇదే. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు క్వింటాల్కు 24 వేలు పలికిన ధర ఇప్పుడు గరిష్ఠంగా ఏడు వేలు దాటకపోవడంతో మిర్చి రైతు కుదేలయ్యాడు. పత్తి ధర పదివేల నుంచి ఐదు వేలకు అంటే సగానికి సగం పడిపోయింది. అప్పుడు 18 వేల దాకా దక్కించుకున్న పొగాకు ఇప్పుడు గరిష్ఠంగా 6 వేలకు పడిపోయింది. పసుపు, కందులు, మినుములు, వేరుశనగ, మొక్కజొన్న, పెసలు, ఉల్లిపాయలు, టమాటా, మామిడిపళ్ళు, అరటి, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్ వగైరా వ్యవసాయ ఉత్పత్తుల ధరలన్నీ సగానికి పడిపోయాయి. ఆనాటి జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ధరలు పతనమవకుండా మార్కెట్లో జోక్యం చేసుకునే విధానాన్ని అవలంబించడం సత్ఫలితాలనిచ్చి మంచి ధరలు లభించాయి. రైతన్నకు దరహాసాన్నిచ్చాయి.చంద్రబాబు ప్రభుత్వం ఆ బాధ్యతను వదిలేసింది. మొత్తంగా వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు ఈ ప్రభుత్వం కాడి పారేసింది. జగన్మోహన్రెడ్డి ఇస్తున్న రైతు భరోసా కంటే అధికంగా ఇస్తానని హామీ ఇచ్చి వరసగా రెండో యేడు కూడా ఎగనామం పెట్టింది. వ్యవసాయ రంగం ఈ ప్రభుత్వ ప్రాధాన్యత క్రమంలో లేదు. తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడే కేంద్రం కట్టాల్సిన పోలవరాన్ని అడిగి తెచ్చుకొని తన కమీషన్ల ప్రాధాన్యాన్ని ఆ ప్రభుత్వం చాటి చెప్పుకున్నది. రెండోసారి అదే ప్రాధాన్యతను అమరావతి రూపంలో నిలబెట్టుకొన్నది. క్వాంటమ్ వ్యాలీ, డీప్ టెక్నాలజీ, ఏఐ వగైరాలన్నీ అమరావతి హైప్ కోసం కైపెక్కించడం తప్ప ఆచరణాత్మకమైన మాటలు కావనే అభిప్రాయం బలంగా వినిపిస్తున్నది. క్వాంటమ్ వ్యాలీకి అవసరమయ్యే ఎకో సిస్టమ్ అమరావతికి అందుబాటులోకి రావడమనేది ఒక సుదూర స్వప్నమే తప్ప ప్రభుత్వం చెబుతున్నట్టు ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించే స్థితి అసంభవమని నిపుణులు చెబుతున్నారు. మధ్యతరగతిని మభ్యపెట్టడానికి యువతకు జోల పాడటానికి ఇటువంటి పదజాలాన్ని వెదజల్లడం బాబు కాకస్కు వెన్నతో పెట్టిన విద్య. ఈ జోలపాటల మాటున అమరావతిలో జరుగుతున్న అసలు కార్యక్రమమేమిటో చాలామందికి అర్థమైంది. అమరావతి పేరుతో ఇప్పటికే తెచ్చిన అప్పులే కాదు, ఇంకా అవసరమైన అప్పులు తీర్చడానికి భూములు అమ్ముతామనీ, అదో సెల్ఫ్ ఫైనాన్స్ కేపిటలనీ చెబుతూ వచ్చారు. తొలుత సమీకరించిన భూముల్లో రైతుల వాటా తీసేయగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవసరాలకు పోనూ మిగిలిన భూముల అమ్మకంతో తెచ్చిన అప్పులు తీర్చడం సాధ్యం కాదనే మాట వినిపిస్తున్నది. ఈ తత్వం బోధపడినందువల్లనే ప్రపంచ బ్యాంకు వాళ్లు ఈ మధ్య ప్రభుత్వానికి తాఖీదులు పంపారట! మీరు అమ్మబోయే భూములెన్ని? ఎప్పటిలోగా అమ్ముతారు? వాటి ద్వారా ఎంత డబ్బు సమీకరిస్తారో చెప్పండని వారు అడుగుతున్నారని సమాచారం.ఇప్పుడు కొత్తగా 45 వేల ఎకరాల భూసేకరణ ప్రయత్నాలకు రైతులు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వంలో కలవరం మొదలైనట్టు కనిపిస్తున్నది. కాకస్ పరంగా ఎంత సంపాదించుకున్నా ప్రభుత్వపరంగా మాత్రం అమరావతి ప్రాజెక్టు ఒక నిరర్థక ఆస్తిగానే మిగిలిపోయే ప్రమాదముందనే హెచ్చరికలు వినబడుతున్నాయి. పోలవరం – బనకచర్ల ప్రాజెక్టు పేరుతో ఈ మధ్యకాలంలో బాబు ప్రభుత్వం చేస్తున్న హడావుడి కూడా కమీషన్ల స్టార్టప్ కథేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 80 వేల కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో గేమ్ ఛేంజర్ కాబోతున్నదని ఆయన చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నివేదికలో పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది పూర్తయితే ఏడు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకూ, ఇంకో 23 లక్షల ఎకరాల స్థిరీకరణకూ ఉపయోగపడుతుంది. జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించి చాలావరకు పూర్తయి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఇంకో 14 వేల కోట్లు సరిపోతుందనీ, ఈ పని చేస్తే కూడా అంత ఆయకట్టు అందుబాటులోకి వస్తుందనీ చెబుతున్నారు.అటువంటప్పుడు ఏది తొలి ప్రాధాన్యత కావాలి? 14 వేల కోట్లతో పెండింగ్ పనులు పూర్తి చేయడమా? 80 వేల కోట్లతో కొత్త ప్రాజెక్టును తలకెత్తుకోవడమా? గోదావరి వరద జలాలను ఉపయోగించుకోవాలన్న ఆలోచన ఆ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అవసరమే కావచ్చు. ఈ ఆలోచన కూడా వాస్తవానికి గత ప్రభుత్వంలో వచ్చినదే. కానీ సత్వరం పూర్తి కావలసిన ప్రాజెక్టులకు పైసా విదల్చకుండా చేపట్టిన ఈ నిర్హేతుకమైన ప్రాధాన్యతాక్రమం దేన్ని సూచిస్తుంది? భారీ ప్రాజెక్టుతో భారీ కమీషన్ల దురాశతోనే ఈ రకమైన ఎంపిక చేసుకున్నారంటే తప్పవుతుందా? రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర ఇప్పించలేకపోయిన ప్రభుత్వం, ఉన్న ఊరిలోనే కల్తీలేని విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి తెస్తున్న ఆర్బీకేలను మూసి పారేసిన ప్రభుత్వం రైతన్నల కన్నీరు తుడవడానికి భారీ ప్రాజెక్టులను సంకల్పించిందంటే నమ్మశక్యమేనా?ఆలూ లేదు, చూలూ లేదు అన్నట్టుగా బాబు ఈ ప్రాజెక్టును పూర్తిచేసే అవకాశమే లేనప్పటికీ దీనిపై తెలంగాణలోని అధికార ప్రతిపక్షాలు సిగపట్లకు దిగడం ఒక విశేషం. చంద్రబాబుతో సాన్నిహిత్యం కారణంగానే ఆయన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పలేదని బీఆర్ఎస్ ఆరోపించింది. దీనిపై గత కొన్ని వారాలుగా తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ పంచాయితీలో బీఆర్ఎస్ వాదానిదే పైచేయిగా ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దానికి ఇతరత్రా కారణాలు కూడా కొన్ని దోహదపడి ఉండవచ్చు. ప్రెస్మీట్లలో కాదు, అసెంబ్లీలో చర్చిద్దాం రండని తాజాగా కాంగ్రెస్ మంత్రులు సవాల్ విసురుతున్నారు. పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏ ప్రాజెక్టునూ పూర్తిచేసిన రికార్డు లేని చంద్రబాబు చిటికెల పందిరిని ఆంధ్ర ప్రజలెవరూ పట్టించుకోకపోయినా తెలంగాణలో అది మంట పుట్టించడం విశేషం.ఒకపక్క అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల రూపంలో భారతీయ రైతును బలిపీఠమెక్కించే సూచనలు పొడసూపుతున్నాయి. వాణిజ్య ఒప్పందం కోసం అమెరికా విధించిన మూడు మాసాల గడువు ఈ నెల తొమ్మిదో తేదీతో ముగిసిపోనున్నది. ఈలోగా భారత్తో కనీసం మినీ ఒప్పందమైనా జరగాలని ట్రంప్ పట్టుపడుతున్నారు. రెండు దేశాల ప్రతినిధుల మధ్య గత వారం రోజులుగా చర్చోపచర్చలు జరుగున్నాయి. జన్యుమార్పిడి సోయాచిక్కుడు, మొక్కజొన్నలను, యాపిల్స్ను, డెయిరీ ఉత్పత్తులను తక్కువ సుంకాలతో భారత మార్కెట్లోకి అనుమతించాలని అమెరికా డిమాండ్ చేస్తున్నది. వందల ఎకరాల భారీ కమతాల్లో పూర్తిగా యంత్రాల సాయంతో, దాదాపు యాభై శాతం సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం దన్నుతో చౌకగా వచ్చే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు తక్కువ సుంకాలతోనే మళ్లీ మార్కెట్లోకి ప్రవేశిస్తే భారతీయ రైతు తట్టుకోగలడా? పైగా భారతీయ వ్యవసాయ రంగంలోకి, ఫుడ్ చెయిన్లోకి జన్యుమార్పిడి ఉత్పత్తులను అనుమతించకపోవడం భారత్ విధానంగా ఉంటూ వస్తున్నది. ఫుడ్ చెయిన్ పరిధిలోకి రాదనే కారణంతో పత్తిలోకి ఇప్పటికే జన్యుమార్పిడి విత్తనాలు ప్రవేశించాయి. రేపోమాపో కుదరనున్న మినీ వాణిజ్యం ఒప్పందంతో ఏం జరగనున్నదని దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. అమెరికా విధించే గడువుకంటే తమకు దేశ ప్రయోజనాలే ముఖ్యమని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఇంటర్వ్యూలో వాణిజ్య–పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఘంటాపథంగా చెప్పారు. శనివారం నాటి పత్రికలో వచ్చిన ఈ ఇంటర్వ్యూలో ‘మన వ్యవసాయ రంగానికి నష్టం కలిగించే ఎటువంటి ఒప్పందాన్ని చేసుకోబోమ’ని ఆయన చెప్పారు. మొక్కజొన్న ఉత్పత్తిలో టాప్ ఫైవ్లో ఉన్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో ట్రంప్ ప్రతిపాదనలు అంగీకరించడం బీజేపీకి కూడా ఆత్మహత్యా సదృశమే.వాణిజ్య చర్చల్లో పాల్గొంటున్న అధికారుల భోగట్టాగా పేర్కొంటూ బ్లూమ్బర్గ్ లాంటి వార్తా సంస్థలు మరో కథనాన్ని చెబుతున్నాయి. కేవలం పశువుల దాణా కోసం, పౌల్ట్రీ దాణా కోసం ఉపయోగపడే విధంగా మొక్కజొన్న, సోయా చిక్కుళ్ల ఉప ఉత్పత్తులను అనుమతించే మినీ ఒప్పందం కుదిరే అవకాశముందని ఈ కథనాల సారాంశం. మినీ రవ్వ రూపంలో వచ్చినంత మాత్రాన అది జన్యుమార్పిడి పంట కాకుండా పోతుందా? పశువుల దాణా, కోళ్ల దాణాలోకి ప్రవేశిస్తే అది ఫుడ్ చెయిన్లో భాగం కాకుండా పోతుందా అనేవి చర్చనీయాంశాలు. రెండుమూడు రోజుల్లో జరిగే మినీ ఒప్పందం అనంతరం, మూడు నాలుగు నెలల్లో జరిగే పూర్తి స్థాయి ఒప్పందం అనంతరం మాత్రమే ఈ అంశంపై ఒక స్పష్టత వస్తుంది. ప్రస్తుతానికి దాణా రూపంలో ప్రవేశించినా, ఒంటె గుడారంలోకి కాళ్లు జాపితే ఏం జరుగుతుందో భవిష్యత్తులో అదే జరుగుతుంది. చంద్రబాబు వంటి వ్యవసాయ వ్యతిరేక విధానాలు అనుసరించే పాలకుల కారణంగా పాతికేళ్ల కిందటే మన రైతులు ఉరితాళ్లు పేనుకున్నారు. ఇప్పుడు కొడవళ్లు మెడపైకి చేర్చుకుంటున్నారు. భవిష్యత్తులో అమెరికా జన్యుమార్పిడి పంట ఉత్పత్తులు భారత మార్కెట్లోకి ప్రవేశిస్తే వ్యవసాయం దండగన్న బాబు జోస్యం నిజమవుతుంది. ఈ విషయంలో నిజంగానే ఆయన విజనరీగా నిలబడిపోతారు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
చంద్రబాబుకు ఊహించని షాకిచ్చిన అమరావతి రైతులు
సాక్షి,గుంటూరు: అమరావతి విస్తరణ కోసం మరో 45 వేల ఎకరాల భూ సమీకరణ చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి రైతులు షాకిచ్చారు. రాజధాని విస్తరణకు తమ భూముల్ని ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు.అమరావతి రాజధాని విస్తరణ కోసం కూటమి ప్రభుత్వం మరో భారీ కుట్రకు తెరతీసింది. రాజధానికి సమీపంలోని 11 గ్రామాల్లో వేలాది ఎకరాల భూ సమీకరణకు సిద్ధమైంది. ఇందుకోసం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గురువారం తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో తాడికొండ మండలం బేజాత్ పురంలో జరిగిన గ్రామ సభ రసాభాసగా మారింది. రైతుల నుంచి భూముల్ని సేకరించేందుకు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఇతర అధికారులు గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో రాజధాని విస్తరణకు తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని పలువురు రైతులు తేల్చి చెప్పారు. గత చంద్రబాబులో రాజధానికి భూములు ఇచ్చిన వారికి ఏం న్యాయం చేశారంటూ అధికారులను నిలదీశారు. తమ భూముల జోలికి రావొద్దని హెచ్చరించారు.అయితే, అమరావతి విస్తరణ కోసం భూమి ఇవ్వమని రైతులు అధికారులకు చెప్తుండగా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నాయకులకు రైతులకు మధ్య వాగ్వాదానికి దారి తీసింది.ల్యాండ్ పూలింగ్కురాజధాని అమరావతిలో మరోసారి భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్)కు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు ల్యాండ్ పూలింగ్ స్కీం 2025 విధి విధానాలను జారీ చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ల్యాండ్ పూలింగ్ స్కీం 2025 కింద రాజధానికి సమీపంలో ఉన్న 11 గ్రామాల్లో సుమారు 44,676.64 ఎకరాలను సమీకరిస్తుంది. ఇప్పటికే రాజధాని కోసం 2015లో తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్(భూ సమీకరణ) ద్వారా 29,442 మంది రైతుల నుంచి 34,823.12 ఎకరాలు సమీకరించిన విషయం తెలిసిందే.రాజధాని భూముల్ని అమ్మేందుకు కుట్రమరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో (217చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మాణం చేపట్టనున్నట్లు గతంలో పేర్కొంది. మౌలిక సదుపాయాల కల్పన, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వగా ప్రభుత్వానికి 8,250 ఎకరాల భూమి మిగులుందని.. దాన్ని విక్రయించగా వచ్చే ఆదాయంతోనే రాజధానిని నిర్మించుకోవచ్చని.. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అమరావతి అంటూ సీఎం చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి నారాయణ 2015 నుంచి పదే పదే చెబుతూ వచ్చారు.మండిపడుతున్న అమరావతి రైతులుఇప్పుడు స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే రాజధానిలో భూముల విలువ పెరుగుతుందని.. కానీ ఆ ప్రాజెక్టులు రావాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిపోర్టు, స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని వారు చెబుతున్నారు. వాటి కోసం పది వేల ఎకరాలు అవసరమని, అంత భూమి ప్రభుత్వానికి అందుబాటులోకి రావాలంటే 44,676.64 ఎకరాలు సమీకరించాలని అంటున్నారు. 2015లో భూములిచ్చిన తమకే ఇంతవరకూ అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వకుండా మళ్లీ భూ సమీకరణకు ప్రభుత్వం సిద్ధం కావడంపై రైతులు మండిపడుతున్నారు. -
కురుస్తున్న వర్షం... రైతన్న హర్షం
సాక్షి, హైదరాబాద్: రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయం ఊపందుకుంది. ఇప్పటికే పత్తి సాగులో రైతులు బిజీగా ఉండగా, వర్షాల రాకతో వరిసాగు పెరుగుతోంది. చాలా జిల్లాల్లో బావులు, బోర్లు కింద ఇప్పటికే నారుమళ్లు పోశారు. కొన్ని జిల్లాల్లో నాట్లు ప్రారంభం కాగా, మరికొన్ని ప్రాంతాల్లో నాట్లేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రాజెక్టులు, చెరువుల కింద ఉన్న పొలాల్లో రైతులు దుక్కులు దున్నుతూ సేద్యానికి సిద్ధమవుతున్నారు. నిజామాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటికే రైతులు నారుమళ్లు పోసి.. వరి నాట్లేసే కార్యక్రమాలు ప్రారంభించారు. మహబూబ్నగర్, వరంగల్, రంగారెడ్డి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో వరిసాగుకు పొలాలను సిద్ధం చేస్తున్నారు. వర్షాల నేపథ్యంలో వ్యవసాయ అధికారులు తగిన సూచనలు, సలహాలతో పంటల సాగును పర్యవేక్షిస్తున్నారు. నిజామాబాద్లో లక్షన్నర ఎకరాల్లో ఇప్పటికే సాగు నిజామాబాద్లో ఇప్పటికే లక్షన్నర ఎకరాల్లో రైతులు వరిని సాగు చేశారు. కామారెడ్డిలో 27 వేల ఎకరాల్లో వరి సాగు కాగా, జనగాంలో 15వేల ఎకరాల్లో సాగైంది. ఉమ్మడి కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఈ వారాంతానికి బోర్లు, బావులతోపాటు చెరువులు, కుంటల కింద కూడా నార్లు పోస్తారని వ్యవసాయ శాఖ అధికారి ఒకరు తెలిపారు. నిజాంసాగర్, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, మిడ్ మానేర్, దిగువ మానేరుతో పాటు దేవాదుల, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల కింద నీటి లభ్యతను బట్టి వరిసాగు చేస్తారని తెలిపారు. పత్తి, మొక్కజొన్నకు జీవం ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల మెట్టభూముల్లో సాగైన పత్తి, మొక్కజొన్న పంటలకు జీవం పోసినట్టయ్యింది. నెలరోజుల క్రితం నుంచే పత్తి సాగు మొదలు కాగా, జూన్ మొదటి వారం నుంచే వరుణుడు మొహం చాటేయడంతో రైతులు ఆందోళన చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో పత్తి మొలకెత్తలేదు. కొన్నిచోట్ల మొలకలు వచ్చినా, నీరు లేక ఎండిపోయాయి. కరీంనగర్, మెదక్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో కూడా వర్షాలు లేక పత్తి రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 43.47 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, అందులో పత్తి 31 లక్షల ఎకరాల్లో సాగయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే పత్తి అధికంగా సాగయ్యే ఆదిలాబాద్లో వాతావరణం కొంత అనుకూలంగా ఉండటంతో రైతులకు ఊరటనిచ్చింది. ఇదే జిల్లాలో సోయాబీన్, కంది కూడా ఎక్కువగానే సాగు చేశారు. ఈ వర్షాలతో ఆదిలాబాద్తో పాటు అన్ని జిల్లాల్లో పత్తి, మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కూరగాయల సాగుకు ఊతం రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల కూరగాయల సాగుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్నగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఈసారి కూరగాయల సాగు ఎక్కువగా ఉంటుందని ఉద్యానవనశాఖ అంచనా వేస్తుంది. -
వ్యాపారవేత్తగా సైంటిస్టు..! ఎకరానికి రూ. లక్ష వరకూ..
ఒక శాస్త్రవేత్త వ్యాపారవేత్తగా మారి దృఢ చిత్తంతో కృషి చేసి గ్రామీణ రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచటం ఎంత వరకూ సాధ్యమనే ప్రశ్నకు కామినీ సింగ్ అనుభవాలే చక్కని జవాబు. సేంద్రియ మునగ సాగు ప్రాధాన్యతను గుర్తింపజేయటం ద్వారా ఉత్తరప్రదేశ్లోని వెయ్యికి పైగా రైతులను కార్యోన్ముఖులను చేసిన ఆమె ఏకంగా రూ. 1.75 కోట్ల మేరకు వారికి ఆర్థిక ప్రయోజనం కలిగించగలిగారు. ఈ క్రమంలో కామినీ సింగ్ కేంద్రీయ ఉప ఉష్ణమండల ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (సిఐఎస్హెచ్), సిఎస్ఐఆర్– కేంద్రీయ ఔషధ, సుగంధ మొక్కల పరిశోధనా సంస్థ (సీమాప్) వంటి సంస్థల తోడ్పాటు తీసుకున్నారు. ఆమె ఉద్యాన పంటల సాగులో ఏళ్ల తరబడి అనుభవం ఉన్న శాస్త్రవేత్త. సేంద్రియ వ్యవసాయంలో కూడా ఆమెకు గాఢమైన ప్రవేశం ఉంది. తన పరిశోధనా ఫలితాలను చూపుతూ వ్యవసాయంపై మనకున్న సాధారణ అభిప్రాయాన్ని సైతం మార్చేయగల సత్తా గల కార్యశీలి ఆమె. పిహెచ్డి విద్యార్థిగా ఆమె గుర్తించిన విషయం ఏమిటంటే.. పరిశోధనా ఫలితాలు గ్రామీణ స్థాయిలోని సాధారణ రైతులకు అతి తక్కువగా/అరుదుగా చేరుతున్నాయని. అంతే. 17 ఏళ్లుగా పరిశోధన శాలల్లో పరిశోధనలకే పరిమితమైన ఆమె లాబ్లను వదిలి పొలాల్లోకి దారితీశారు. పరిశోధనకు వాస్తవికతకు మధ్య వారధిగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ విధంగా 2016–17లో కామినీ సింగ్ ఉత్తరప్రదేశ్ రైతులకు సేంద్రియ వ్యవసాయంలో శిక్షణ ఇవ్వటం ప్రారంభించారు. నేల రసాయనిక ఎరువులపై ఆధారపడకుండా సేంద్రియ వ్యవసాయంలో తిరిగి జీవాన్ని సంతరించుకోవటానికి 2–3 ఏళ్లు సమయం పడుతుంది అంటారామె. అయితే, సేంద్రియ సేద్యం అనగానే ఆకర్షితులైన రైతుల్లో కూడా చాలా మంది నిజాయితీగా సేంద్రియ పద్ధతులను పాటించకపోవటం, ఫలితాలు నాసిగా రావటం ఆమె గుర్తించారు. సేంద్రియ సేద్యం వైపు రైతులను నడిపించాలన్న ఆమె సంకల్పం మాత్రం సడలలేదు. అయితే, తక్కువ ఉత్పాదకాల ఖర్చుతో అధిక దిగుబడులు ఇచ్చే పంటను గనక చెబితే రైతులుమరింత ఉత్సాహంగా ముందుకు వచ్చి చెయ్యగలుగుతారని భావించి మునగ వైపు దృష్టి సారించారు. పోషకాల గని కావటం, అనాదిగా మనకు తెలిసిన పంట కావటం, ఎరువులేవీ పెద్దగా వేయక΄ోయినా మంచి దిగుబడులిచ్చే పంట కావటంతో సేంద్రియ సేద్యానికి ఇది అనువైన పంటగా గుర్తించానంటారామె. దీంతో, శాస్త్రవేత్తగా ఉండటం కన్నా రైతులకు కూడా ఉపయోగపడే వ్యాపారవేత్తగా మారటం మేలని ఆమె నిర్ణయాన్నికొచ్చారు.గట్లపైనే శ్రీకారం2017లో లక్నోలో ఏడెకరాల భూమిలో ఆమె స్వయంగా సేంద్రియ మునగ సాగు ప్రారంభించారు. ఫలితాలు అనుకున్నదాని కన్నా బాగా వచ్చాయి. తక్కువ నీరు ఇచ్చినా స్థానిక వాతావరణానికి మునగ మంచి దిగుబడి వచ్చింది. ఈ విజయంతో ఒక వినూత్న ఉపాయాన్ని ఆమె అమల్లోకి తెచ్చారు. రైతులు తమ పొలాల్లో ఏ పంటైనా పండించండి. అయితే, గట్లపై మాత్రం మునగ మొక్కలు వెయ్యాలని సూచించారు. దీంతో చాలా మంది రైతులు ముందుకొచ్చారు. ప్రధాన పంటకు ఇబ్బంది లేకుండా చేసిన ఈ పని వల్ల ఏడాదికి రూ. 30 వేల వరకు ఆదాయం రావటంతో రైతులు సంతోషించి, మునగ సాగు చేపట్టారు. ‘నా పొలం చుట్టూతా గట్లపై 400 మునగ మొక్కలు మొదట నాటా. ఆదాయం బాగుంది. అందుకని ఇప్పుడు పది ఎకరాల్లో మునగ పంటను సాగు చేస్తున్నా’ అన్నారు లక్నో ప్రాంతానికి చెందిన రైతు షాలిక్రమ్ యాదవ్. మొదట్లో నాకు చాలా భయాలుండేవి. అయితే, కామినీ సింగ్ ప్రోత్సాహంతో ముందుకు నడిచా. ఏ రైతుకైనా పండించిన పంటను అమ్ముకోవటమే పెద్ద సమస్య. తానే స్వయంగా మునగ ఆకులను కిలో రూ. 60కి కొంటుండటంతో నాకు మార్కెటింగ్ సమస్య లేకుండా ΄ోయింది. ఈ సీజన్లో వాతావరణం అనుకూలించలేదు. 5 క్వింటాళ్ల మునగాకు పండించా. అయినా నాకు నష్టం లేదు. సేంద్రియ మునగ సాగు ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది అన్నారాయన. ఆమె కృషి ఫలించటం ప్రారంభించింది. మునగాకును రైతుల నుంచి కొని అనేక ఉత్పత్తులుగా మార్చి విక్రయించటం ఆమె ప్రారంభించారు. నెమ్మదిగా సేంద్రియ మునగాకు సాగు చేసే రైతుల సంఖ్య పెరిగింది. చిన్న బృందం కాస్తా పెద్ద నెట్వర్క్గా మారింది. రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు వెయ్యి ఏభై మంది రైతులు చేరారు. వారంతా మునగ సాగు చేయటం మాత్రమే కాదు, స్థిరమైన ఆదాయాన్ని, ఆరోగ్యాన్నిచ్చే పంటను స్థిమితంగా సాగు చేయటం నేర్చుకున్నారు. డాక్టర్ మోరింగ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట రూ. 9 లక్షల పెట్టుబడితో ఆమె స్థాపించిన కంపెనీ మునగ ఆకులతో 22 రకాల ఉత్పత్తులను తయారు చేసి అమ్ముతోంది. సబ్బులు, గ్రీన్ టీ, బిస్కెట్లు, పొడితో గొట్టాలు, నూనెలు, ముఖ సౌందర్యం కోసం రాసుకునే పొడులు.. వంటివెన్నిటినో తయారు చేస్తున్నారు. ఎఫ్పివో తరఫున అనేక చోట్ల విక్రయాలు ప్రారంభించటంతో ఆదాయం పెరిగింది. రూ. 9 లక్షల రుణంతో ప్రారంభించిన కంపెనీ వార్షిక టర్నోవర్ ఇప్పుడు రూ. కోటి 75 లక్షలకు చేరింది. ఖర్చులు పోగా 30% నికరాదాయం వస్తోంది. డాక్జర్ కామిని శాస్త్రీయ దృష్టికి రైతులను చైతన్యవంతులను చేసి ఆర్థికంగా తోడ్పాటునందించాలన్న సంకల్పం తోడు కావటంతో విజయం చేకూరింది. మొలక శాతం, చీడపీడల నియంత్రణ, నాణ్యత, పంటకు రక్షణ వంటి అంశాలన్నిటినీ ఆమె సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నారు. తన క్షేత్రంలో ఆమె అనుసరించే సేంద్రియ పద్ధతులను చూసి రైతులు సులువుగా నేర్చుకొని అనుసరిస్తున్నారు. మంచి ఆదాయం ఉండటంతో, ఇతర పంటలు పండించే రైతులు సైతం సేంద్రియ మునగ సాగు వైపు ఆకర్షితులవుతున్నారు. కుమార్ సింగ్ అనే రైతు మలిహాబాద్΄ ప్రాంతంలో మామిడి సాగుకు ప్రసిద్ధి పొందారు. ఆయన కూడా 17 ఎకరాల్లో మునగాకు సాగు ప్రారంభించారు. మొదట్లో ఒక ఎకరం మునగ వేశా. శాస్త్రవేత్తే స్వయంగా సలహాలు ఇస్తూ ఉండటం, మంచి ఆదాయం వస్తుండడంతో 17 ఎకరాలకు విస్తరించా అన్నారు అనిల్ కుమార్ సింగ్. గతంలో వరి, గోధుమ సాగు చేస్తే నాకు రూ. 40 వేలు వచ్చేవి. ఇప్పుడు అదే బూమిలో మునగ ఆకు, కాయల సాగుతో రూ. 1.5 లక్షల ఆదాయం వస్తోంది. పెట్టిన పెట్టుబడి రూ. 30 వేలు తొలి ఏడాదే వచ్చేసింది. ఇది చూసి మిగతా రైతులు కూడా మునగ సాగులోకి వస్తున్నారు అని ఆయన వివరించారు. ‘సాధారణ పంటలు పండిస్తే ఎకరానికి రూ. పాతిక వేలు సంశయించే రైతులు మునగ సాగు చేసి, విలువ జోడించి అమ్మటం వల్ల రూ. లక్ష వరకు సంశయిస్తున్నారు. సుస్థిర వ్యవసాయ పద్ధతులతో కొత్త విధంగా పంటలు పండించటం నేర్చుకుంటే ఇంత ప్రయోజనం ఉంటుంది అంటున్నారు డాక్టర్ కామినీ సింగ్.ఆమె శాస్త్రవేత్తగా కెరియర్ను వదిలేసి వ్యాపారవేత్తగా మారాలనుకున్నప్పుడు కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అయితే, ఆమె కృషి ఫలించి, ఆమె స్థాపించిన కంపెనీ చక్కటి ఫలితాలనిస్తూ రైతులకు కూడా మంచి లాభాలు వస్తుండటం, మునగ సాగు 15 గ్రామాలకు విస్తరించటంతో ఆమె కుటుంబం ఇప్పుడు సంతోషిస్తున్నారు. కేవలం ఒక శాస్త్రవేత్తగా మాటలు చెప్పేలానే ఉండి΄ోకుండా, ధైర్యంగా ముందడుగు వేసి, రైతులకు మార్గదర్శకురాలిగా మారిన ఆమె కృషి నిజంగా ప్రశంసించదగినది.(చదవండి: బ్యాంకు ఉద్యోగం వదిలేసి, ఆధునిక సేద్యం : కోట్లలో ఆదాయం) -
ఇసుకాసురులపై పెల్లుబికిన రైతుల ఆగ్రహం
శింగనమల: అనంతపురం జిల్లా శింగనమల మండలం నిదనవాడ సమీపంలోని పెన్నా నది నుంచి టీడీపీ నాయకులు యథేచ్ఛగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ అనుమతులు పొందినది ఒక చోట అయితే, పెన్నానదిలో నచ్చిన చోట ఇసుక తరలిస్తున్నారు. దీనివల్ల భూగర్భజలాలు అడుగంటి బోరుబావులు ఎండిపోతాయన్న ఆందోళనతో మంగళవారం నిదనవాడ గ్రామ రైతులు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారు. దీంతో ఇసుకాసురులు రైతులపై దౌర్జన్యానికి దిగారు. గత నెలలోనే పెన్నా నది కింది భాగాన ఇసుక తరలిస్తుండగా రైతులు అడ్డుకున్నారు. దీంతో అక్కడి నుంచి మరో చోటకు మకాం మార్చారు. గ్రామ పైభాగాన ఎర్రమట్టితో నదిలోకి రోడ్డు వేసుకొని పెద్దవడుగూరు మండలం చిత్రచేడు వైపు తరలింపు మొదలు పెట్టారు. మంగళవారం విషయం తెలుసుకున్న నిదనవాడ రైతులు దాదాపు 200 మంది పెన్నా నదిలోకి వెళ్లి ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్నారు. ఇసుక తరలిస్తామని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ అక్రమార్కులు బెదిరించారు. దీంతో రైతులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే శ్రావణిశ్రీతో పాటు పోలీసులు, రెవెన్యూ అధికారులు, మీడియా దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు వచ్చేవరకు వాహనాలను బయటకు వెళ్లనిచ్చేది లేదంటూ అక్కడే వంటా వార్పునకు దిగారు. తహసీల్దార్ శేషారెడ్డి, సీఐ కౌలుట్లయ్య, ఎస్ఐ విజయ్కుమార్ అక్కడికి చేరుకుని.. ఇసుక తరలింపును నిలిపివేశారు. అనుమతి ఉన్న చోట నుంచే రవాణా చేసుకోవాలని, అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం రైతులతో తహసీల్దార్ మాట్లాడుతూ.. అధికారులు బదిలీల్లో ఉన్నారని, వారు వచ్చిన తరువాత హద్దులు చూపిస్తామని పేర్కొన్నారు. అధికార అండతోనే అక్రమార్కుల అరాచకం.. ‘ఇసుకాసురులు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. అధికారం అండతో యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారు. భూగర్భజలాలు తగ్గిపోయి తీవ్రంగా నష్టపోతామని, ఇసుక తరలించవద్దని వేడుకుంటున్నా కనికరం చూపడం లేదు. వాహనాలను అడ్డగించి, రెవెన్యూ అధికారులు, పోలీసులకు పట్టించినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లాం. అయినా అక్రమార్కులపై చర్యలు లేవు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో ఎలాంటి చర్యలూ తీసుకోవట్లేదు. అధికారులు కఠిన చర్యలు తీసుకుంటేనే ఇది పునరావృతం కాకుండా ఉంటుంది’ అని రైతులు అంటున్నారు. -
ఏపీలో ధాన్యం బకాయిలు వేయి కోట్లు. రెండు నెలలు దాటినా రైతులకు చెల్లింపు లేదు. పట్టించుకోని కూటమి ప్రభుత్వం
-
ధాన్యం రైతుకు దగా.. రొక్కం లేదు.. దుఃఖమే!
సాక్షి, అమరావతి: పొలం పనుల సీజన్ మొదలైంది..! కూలీలతో కలసి కోలాహలంగా పంట చేలో తిరగాల్సిన రైతన్న.. కాడి, మేడి వదిలేసి కుమిలిపోతున్నాడు! విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు లాంటి వాటికోసం పెట్టుబడి సాయం అందించి ఆదుకోవడం దేవుడెరుగు.. తన కష్టార్జితాన్ని సైతం ఈ ప్రభుత్వం పొట్టనబెట్టుకుందని రగిలిపోతున్నాడు! ధాన్యం రైతులకు 24 గంటల్లో చెల్లిస్తామన్న డబ్బులకు రెండు నెలలుగా దిక్కు లేకుండా పోయిందని.. దళారీల పాలు చేసి దగా చేసిందని ఆక్రోశిస్తున్నాడు! పెట్టుబడి ఖర్చులకు డబ్బులు లేక.. బ్యాంకు రుణాలు పుట్టక అన్నదాతలు తీవ్ర అగచాట్లు ఎదుర్కొంటున్నారు. దళారీలు, మిల్లర్లను అడ్డు పెట్టుకుని టీడీపీ కూటమి ప్రభుత్వం రైతులను అడ్డంగా దోచేస్తోంది! నెలలు తరబడి ధాన్యం సొమ్ములు చెల్లించకుండా నిర్దయగా వ్యవహరిస్తోంది. అన్నదాతలు కడుపు మండి రోడ్డెక్కితే కర్కశంగా వ్యవహరిస్తోంది. కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర దక్కకపోగా.. ఆ వచ్చిన ధరనైనా చెల్లించకుండా వేధిస్తోంది. ఇప్పటివరకు రబీలో రెండు లక్షల మంది రైతుల నుంచి 19.84 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించగా చిరుధాన్యాల బకాయిలతో కలిపి దాదాపు రూ.1,250 కోట్ల మేర చెల్లింపులు చేయాల్సి ఉంది. రెండు నెలలకుపైగా బకాయిలు పేరుకుపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రానికి ధాన్యాగారం లాంటి ఉభయ గోదావరి జిల్లాల్లో ధాన్యం రైతులకు చెల్లింపులు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. మరోవైపు పెట్టుబడి ఖర్చుల కోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో పాటు ఖరీఫ్ సాగుకు విత్తనాలు వేసుకునేందుకు డబ్బులు లేక దిక్కు తోచని పరిస్థితిలో కూరుకుపోయారు. రెండో ఏడాదీ అన్నదాతా సుఖీభవ ఇంతవరకు అందకపోవడంతో ‘సాగు కాడి’ని మోయలేకపోతున్నారు. ‘మద్దతు’.. ఓ మోసం!కేంద్ర ప్రభుత్వం 75 కిలోల బస్తా ధాన్యం సాధారణ రకానికి రూ.1,725, ఏ–గ్రేడ్కు రూ.1,740 చొప్పున గిట్టుబాటు ధర నిర్ణయించింది. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం తేమ శాతం, ధాన్యం బాగా లేదనే సాకుతో రైతులను నిలువు దోపిడీకి గురి చేసింది. దీంతో ఒక్కో రైతు బస్తాకు రూ.300 – రూ.450కి పైగా నష్టపోయారు. టన్నుకు ఏకంగా రూ.6 వేలకు పైగా నష్టం వాటిల్లింది. ఇక ప్రభుత్వం చేపట్టాల్సిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తిగా దళారులు, ప్రైవేటు వ్యక్తులు చేతుల్లోకి వెళ్లిపోయింది. దళారీ చెబితేనే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసిన దుస్థితి నెలకొంది. నేరుగా ధాన్యం సేకరించాలని అన్నదాతలు రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్తే.. ఆ ధాన్యం ఇక కళ్లాల వద్ద, రాశుల్లో ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఖరీఫ్, రబీ సీజన్లు రెండింటిలోనూ ఇదే తీరు! ధాన్యం బకాయిలు చెల్లించాలంటూ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం డి.ముప్పవరం సెంటర్లో ఇటీవల అధికారులకు దండం పెట్టి నిరసన తెలుపుతున్న రైతులు (ఫైల్) రెండు నెలలుగా పడిగాపులు..ధాన్యం విక్రయించిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లోకి మద్దతు ధర చెల్లిస్తున్నట్లు టీడీపీ కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంది. తాము ఘనంగా చెల్లింపులు చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రచారం చేసుకున్నారు. కానీ రెండు నెలలుగా వేలాది మంది ధాన్యం రైతులు ధాన్యం డబ్బుల కోసం పడిగాపులు కాస్తున్నా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో కడుపు మండిన అన్నదాతలు ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీస్తూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సన్నాలకు రేటే లేదు..నాణ్యమైన సన్న రకాలకు సైతం గిట్టుబాటు ధర కంటే తక్కువ పలకడం రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. గత ప్రభుత్వంలో 75 కిలోల బస్తా రూ.2 వేలకుపైగా పలుకగా ఈసారి రూ.1,400 లోపే ఆగిపోవడం గమనార్హం. తెలంగాణలో సన్న రకాలకు రూ.500 బోనస్ ఇవ్వడంతో రైతులు అధికంగా సాగు చేశారు. ఫలితంగా ఏపీకి వచ్చి కొనేవారు తగ్గిపోయారు. పైగా ఎక్కడికక్కడ దళారులు, మిల్లర్లు తమ పరిధిలోకి వేరే ప్రాంతాల వ్యాపారులను రానివ్వకుండా అడ్డుకుని స్థానిక రైతులను నిలువునా దోచేశారు. మరోవైపు కాకినాడలో ‘సీజ్ ద షిప్’ ఎపిసోడ్ హడావుడితో బియ్యం వ్యాపారులు రైతుల నుంచి ధాన్యం కొనేందుకు ఆసక్తి చూపలేదు. ఫలితంగా మార్కెట్లో పోటీ తగ్గిపోయి రైతులు నష్టపోతున్నారు. ‘కౌలు’కోలేని దెబ్బ..కౌలు రైతులను కూటమి సర్కార్ కోలుకోలేని దెబ్బతీసింది. కౌలు రైతు కార్డులు జారీ చేయకపోవడంతో ప్రభుత్వానికి ధాన్యం విక్రయించుకోలేక నానా తిప్పలు పడ్డారు. దళారులు, మిల్లర్లు సిండికేట్గా మారడంతో నష్టానికి పంట అమ్ముకున్నారు. ఆరబెట్టినా, తేమ శాతం నిబంధనల ప్రకారం ఉండేలా చర్యలు తీసుకున్నప్పటికీ అదనపు ఖర్చులు మినహా.. మంచి రేటు వస్తుందన్న నమ్మకం లేక పంటలను దళారీలకే అప్పగించేశారు.నాడు రైతన్న ఖాతాకు ‘జీఎల్టీ’ డబ్బులు..నేడు ట్రాన్స్పోర్ట్ టెండర్లకూ దిక్కులేదుధాన్యం కొనుగోళ్లను పారదర్శకంగా చేపట్టి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులకు రవాణా, హమాలీలు, గోనె సంచులు సమకూర్చింది. రైతులే ఈ సదుపాయాలను సమకూర్చుకుంటే గన్నీ, లేబర్, ట్రాన్స్పోర్టు (జీఎల్టీ) చార్జీలను వారి ఖాతాల్లో జమ చేసేది. ఇలా రైతులపై అదనపు భారం పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం రాకతో మొత్తం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మారిపోయింది. ప్రభుత్వ యంత్రాంగం దళారీల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు దళారీలు ఇస్తేనే గోనె సంచులు వస్తాయి..! హమాలీలు లోడ్ చేస్తారు.. లారీ కదులుతుంది! ఇక జీఎల్టీ మొత్తం వాళ్లే తీసుకుంటున్నారు. ఒకవేళ రైతే ఇవన్నీ భరిస్తే రూపాయి కూడా వారి ఖాతాల్లో జమకావట్లేదు. అసలు ఈ ప్రభుత్వం ధాన్యం సేకరణకు ఎక్కడా ట్రాన్స్పోర్ట్ టెండర్లు పిలిచిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. -
ధాన్యం డబ్బుల సంగతేంటి?
సాక్షి, అమరావతి: ధాన్యం డబ్బుల కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. ప్రభుత్వాన్ని నమ్ముకుని ధాన్యం విక్రయించిన తాము నిండా అప్పుల్లో మునిగిపోయామని ఆందోళన వ్యక్తం చేశారు. కడుపు మండి రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని దుయ్యబట్టారు. రూ.వెయ్యి కోట్ల ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలతో కలిసి అన్నదాతలు విజయవాడలోని పౌరసరఫరాల సంస్థ భవనం ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో సాగుకు డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటి అనేక ఖర్చులను సమన్వయం చేసుకోలేకపోతున్నామని వాపోయారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించలేకపోయామని, దీనివల్ల బ్యాంకుల నుంచి కొత్త రుణాలు పొందడానికి అవకాశం లేకుండాపోయిందని మండిపడ్డారు. కౌలు చెల్లించకపోవడంతో భూ యజమానులు భూములను వెనక్కి తీసేసుకుంటున్నారని వాపోయారు. గత ఖరీఫ్లో అతివృష్టి, బుడమేరు వరదలతో రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారని.. రబీ ధాన్యం బకాయిలను చెల్లించకపోవడంతో ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయామని రైతులంతా తమ గోడు వెళ్లబోసుకున్నారు.24 గంటల్లో ఇస్తామని.. రెండు నెలలైనా ఎందుకివ్వలేదుఏపీ కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ.. రబీలో కొనుగోలు చేసిన ధాన్యానికి రూ.వెయ్యి కోట్లు బకాయిలు పెట్టడం దారుణమన్నారు. 24 గంటల్లోనే డబ్బులు వేస్తామని చెప్పిన ప్రభుత్వం రెండు నెలలైనా చెల్లింపులు చేయకపోవడం దారుణమన్నారు. ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించి రైతులను నిలువునా మోసం చేశారని దుయ్యబట్టారు. ఏపీ రైతు సంఘం ఉపాధ్యక్షుడు మల్లిడి యలమందరావు మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కోలుకోలేని దెబ్బ తగులుతుంటే రైతులు ఎలా వ్యవసాయం చేస్తారని నిలదీశారు.రైతు ప్రభుత్వమని చాటింపు వేసుకోవడం మినహా చేతల్లో మాత్రం కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ జిల్లా కౌలు రైతు సంఘం నాయకుడు బుడ్డి రమేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా మోసం చేస్తోందన్నారు. ఈవెంట్లు, యోగాలకు ఖర్చు చేసేందుకు రూ.లక్షల కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వం ధాన్యం అమ్మిన రైతులకు మాత్రం అన్యాయం చేస్తోందన్నారు. తక్షణమై రైతులకు బకాయిపడిన సొమ్ములను చెల్లించాలని కోరుతూ పౌరసరఫరాల కమిషనర్ సౌరబ్ గౌర్, పౌరసరఫరాల సంస్థ ఎండీ మనజీరు జిలానీకి వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏపీ కౌలు రైతుల సంఘం ఉపాధ్యక్షుడు పెయ్యల వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా శాఖ నాయకుడు నిమ్మగడ్డ వాసు, రైతు నేతలు గరిమెళ్ల కుటుంబరావు, పి.నాగరాజు, పెయ్యల భోగేశ్వరరావు, పి.మురళి పాల్గొన్నారు.నిండా అప్పుల్లో మునిగిపోయాం!ప్రభుత్వం చెప్పే మాటలకు.. చేసే దానికి పొంతన ఉండట్లేదు. ధాన్యం డబ్బులు చెల్లించకపోవడంతో కౌలు రైతులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కౌలుకు భూమిచ్చిన రైతులు మమ్మల్ని నమ్మట్లేదు. దాళ్వాలో 4 ఎకరాల్లో వరి సాగు చేశాను. అమ్మిన పంటకు రూ.3.50 లక్షలు రావాలి. కౌలు కట్టలేదని పొలం తీసేసుకున్నారు. పిల్లలకు స్కూలు ఫీజులు కూడా కట్టలేని దుస్థితి. మే 2, 3 తేదీల్లో పంట అమ్మితే ఇంత వరకు దిక్కులేదు. బుడమేరు వరదల్లో సార్వా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దాళ్వాలో ఇప్పటికీ డబ్బులు ఇవ్వకపోవడంతో నిండా అప్పుల్లో ముగినిపోయాం. – కొండ శివాజి, కౌలు రైతు, కౌలూరు, జి.కొండూరు మండలం -
ఈ పాపం సర్కారుదే
తిరుపతి రూరల్: మామిడి రైతులకు ఇదివరకెన్నడూ లేనంత పెద్ద కష్టం వచ్చింది. ఆదుకోవాల్సిన ప్రభుత్వమే సమస్య సృష్టించి రైతులను అధఃపాతాళానికి తొక్కుతోంది. అయిన వారికి మేలు చేసేందుకు రైతులను ముప్పు తిప్పలు పెడుతూ నష్టాలపాలు చేస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాల రైతులు వర్షాభావ పరిస్థితుల కారణంగా మామిడి సాగుపై ఆసక్తి పెంచుకున్నారు. మామిడిలో అత్యధిక డిమాండ్ కలిగిన తోతాపురి వైపు మొగ్గు చూపించారు. ఈ ఏడాది కూడా పంట దిగుబడి బాగానే వచ్చింది. అయితే కనీస గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. కూటమి పార్టీల నేతలకు చెందిన పల్ప్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్నందున, వారికి మేలు చేయడం కోసం ధర ఎంతగా పతనమవుతున్నా పట్టించుకోలేదు. దీంతో రైతులు నడిరోడ్డుపై మామిడి కాయలను పారబోసి ఆందోళనలు చేపట్టారు. అయినా సరే ప్రభుత్వ పెద్దల్లో చలనం లేదు.పల్ప్ తయారీ ఫ్యాక్టరీలు తెరుచుకోలేదు. ఫ్యాక్టరీల ముందు కిలోమీటర్ల కొద్దీ మామిడి లోడుతో వాహనాలు బారులు తీరుతున్నాయి. ఇంకా వేలాది టన్నుల మామిడి తోటల్లోనే దర్శనమిస్తోంది. మామిడి పంట సాగు చరిత్రలో ఎన్నడూ ఇలాంటి దుర్భర పరిస్థితులు చూడలేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోక పోవడంతో నష్టాలను భరించలేక, వారికి వారే శిక్ష విధించుకుంటున్నారు.పసి బిడ్డల్లా పెంచుకున్న పచ్చని చెట్లపై గొడ్డలి వేటు వేస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని రామచంద్రాపురం మండలం అనుప్పల్లి, గోకులాపురం, వేపకుప్పం, గంగిరెడ్డిపల్లి, గడ్డకిందపల్లి గ్రామాల్లోని మామిడి రైతులు ఏళ్ల తరబడి సాగు చేసుకున్న మామిడి చెట్లను మొదళ్లకు నరికేసి కలప వ్యాపారులకు అమ్మేస్తున్నారు. 40 ఏళ్లకు పైబడ్డ భారీ చెట్లను యంత్రాలతో తొలగించేస్తున్నారు. ఇప్పటి వరకు వంద ఎకరాలకు పైగా మామిడి చెట్లను తొలగించేసినట్టు సమాచారం. అప్పుడు చెరకు.. ఇప్పుడు మామిడి ⇒ పాతికేళ్ల క్రితం చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన కొద్ది రోజులకే నల్ల బెల్లంపై నిషేధం విధించారు. దీంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కనిపించే చెరకు తోటలు క్రమంగా కనుమరుగవుతూ వచ్చాయి. నల్లబెల్లం తయారు చేసిన రైతులపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడంతో అత్యధిక శాతం మంది రైతులు చెరకు సాగును వదిలేసుకున్నారు. ⇒ ఆ తర్వాత వేరుశనగ, వరి పంటల సాగుకు అవసరమైన నీరు లేక, వర్షాలు పడక ఆ పంటలను దూరం చేసుకున్నారు. వర్షాభావ పరిస్థితులను తట్టుకుని, తక్కువ ఖర్చుతో మంచి దిగుబడి ఇచ్చే మామిడిని చిన్న, సన్నకారు రైతులు అందరూ సాగు చేసుకున్నారు. ⇒ ఇప్పుడు మళ్లీ కూటమి పార్టీలతో కలిసి గద్దెనెక్కిన చంద్రబాబు.. తన వాళ్లకు లబ్ధి చేకూర్చే ఉదే్దశంతో మామిడికి గిట్టుబాటు ధర లేకుండా చేశారు. దీంతో రైతులు రోడ్డున పడ్డారు. ఈ ఏడాదే కాదు.. మరో నాలుగేళ్లు చంద్రబాబు పాలనలో మామిడి రైతులకు నష్టాలు, కష్టాలు తప్పవని భావించే రైతులు ఏళ్లతరబడి పెంచుకున్న తోటలను నిర్ధాక్షిణంగా తొలగించేస్తున్నారు. కన్నీటి గాధలు.. బెదిరింపులు⇒ భవిష్యత్తులో కూడా తమకు న్యాయం జరగదన్న ఆలోచనతో రైతులు మామిడి తోటలను తొలగించేస్తున్న విషయం మీడియాలో రావడంతో కూటమి ప్రభుత్వం ఉలిక్కి పడింది. తన చేతకాని తనం బయట పడుతుందనే భయంతో అధికారులను రంగంలోకి దింపింది. ఇందులో భాగంగా ఉద్యానవన, రెవెన్యూ అధికారుల ద్వారా ఆయా రైతులను బెదిరింపులకు చేస్తున్నారు. ⇒ ‘ఏ అధికారంతో మామిడి తోటను తొలగిస్తున్నావు.. పరి్మషన్ ఉందా.. అనుమతి లేకుండా చెట్లు కొట్టేస్తే.. అది మీ తోట అయినా సరే కేసు పెడతాం’ అంటూ రామచంద్రాపురం మండలం గంగిరెడ్డిపల్లికి చెందిన మామిడి రైతు మహేందర్రెడ్డిని అధికారులు తీవ్రంగా హెచ్చరించారు. ప్రభుత్వం పట్టించుకోనందునే ఈ దుస్థితి వచ్చిందని, ధర లేక ఏడుస్తుంటే ఓదార్చి న్యాయం చేయడానికి ముందుకు రాని మీరు.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వచ్చారని సదరు రైతు తిరగబడే సరికి అధికారులు అక్కడి నుంచి జారుకున్నట్లు తెలిసింది. ⇒ చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం సరకల్లు గ్రామంలో రమేశ్ అనే రైతు తన ఆరు ఎకరాల తోటలో మామిడి కాయలు కోయకుండానే వదిలేశారు. కనీసం కాయలు తెంపిన కూలి కూడా రాని పరిస్థితి ఉండటంతో మామిడి తోటను తొలగించేస్తున్నాడు. తన తండ్రి రెక్కల కష్టంపై 40 ఏళ్లుగా నీరందించి కన్నబిడ్డల్లా సాకిన చెట్లను ఇలా తొలగించడం బాధగా ఉన్నా, ఇకపై మామిడికి గిట్టుబాటు ధర రాదని ఈ నిర్ణయం తీసుకున్నాడు. ‘పెట్టిన పెట్టుబడి ఎలాగూ రాదు. కనీసం కాయలు కోసినందుకు అయ్యే ఖర్చు కూడా వచ్చే పరిస్థితి లేదు. పంట పక్వానికి వచ్చి కుళ్లిపోతున్న అడిగేవారు లేరు. లారీల్లో తీసుకెళ్తే బాడుగ ఖర్చు కూడా రావడం లేదు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. అందుకే తోటను తొలగించేస్తున్నా’ అంటూ రైతు రమేశ్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఇకపై గిట్టుబాటు ధర వస్తుందన్న ఆశ లేదు మామిడి దిగుబడి బాగానే వచ్చింది. అయితే గిట్టుబాటు ధర మాత్రం రాలేదు. దళారులు సిండికేట్గా మారి రైతులను మోసం చేస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తూ వారికి సహకరించడం దుర్మార్గం. పంటను తీసుకుని వ్యాపారి వద్దకు తీసుకువెళితే.. ఇక్కడ ఖాళీ లేదు.. ఇంకో చోటుకు వెళ్లు.. అంటూ చీదరించుకోవడం చూసి తట్టుకోలేకపోయాను. ఇకపై మామిడికి గిట్టుబాటు ధర వస్తుందన్న ఆశలేదు. అందుకే చెట్లు నరికేసు్తన్నా. – గిరీష్ రెడ్డి, పీవీ పురం, రామచంద్రాపురం మండలంనష్టాలు భరించలేకనే.. మామిడి పంట సాగులో పెడుతున్న ఖర్చులకు సరిపడా ఆదాయం రావడం లేదు. సాగులో నష్టాలు భరించలేక పోతున్నా. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పినా ఒక్క రూపాయి మేరకు అయినా సాయం చేయలేదు. వ్యాపారులు పంటను చూడడానికి కూడా ఇష్టపడటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా నష్టపోవడం కంటే మామిడిని వదిలించుకోవడమే మేలు. అందుకే తోటను నరికేస్తున్నా. – మహేందర్రెడ్డి, గంగిరెడ్డిపల్లి, రామచంద్రాపురం మండలంకరోనాలో కూడా రూ.12వేలు ఇచ్చారు మామిడి పంటకు ఇప్పడు ఇస్తున్న ధర చూస్తే కడుపు కాలుతోంది. కరోనా సమయంలో కూడా టన్నుకు రూ.12 వేలు ఇచ్చారు. ఇప్పుడు సీజన్ అయిపోతున్నా సరే పంటను అడిగేవారు లేరు. పండించిన పంటను అమ్ముకోవడానికి నరకం చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మీదట మామిడి పంటలో లాభాలు చూస్తామన్న ఆశ లేదు. అందుకే ఆ చెట్లన్నీ నరికి వేసి వేరే పంట సాగు చేయాలనుకుంటున్నా. – దొరస్వామిరెడ్డి, గోకులాపురం, రామచంద్రాపురం మండలంఇంత దరిద్రం ఎప్పుడూ లేదు మామిడి పంటకు ఇంత దరిద్రమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. రూ.2కు చాక్లెట్ కూడా రావడం లేదు. అలాంటిది ఎంతో కష్టపడి సాగుచేసిన మామిడి కేజీ రూ.2కు ఇవ్వాలంటే ఆ రైతు చచ్చిపోక ఏం చేయగలడు? చావడం చేతగాకనే ఇలా చెట్లను చంపేస్తున్నాం. దీనంతటికీ కారణం ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడమే. గిట్టుబాటు ధర కల్పించి ఉంటే చెట్లను ఎందుకు నరుకుతాం? – చెంగారెడ్డి, రేఖల చేను, రామచంద్రాపురం మండలం చిత్తూరు–పుత్తూరు రహదారిపై రైతుల ఆందోళనగంగాధర నెల్లూరు: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలోని జైన్ మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద ఆదివారం మామిడి రైతులు చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిపై బైఠాయించారు. మామిడి పంటను ఫ్యాక్టరీల వద్దకు తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. జైన్ కర్మాగారం యూనిట్ వన్ వద్ద 350 వాహనాలు, యూనిట్ టు వద్ద 450కి పైగా వాహనాలు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరాయి. దీంతో సకాలంలో అన్లోడ్ గాక ట్రాక్టర్లలో తీసుకొచ్చిన పంట సగానికి సగం కుళ్లిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లూ వాకిలి, కుటుంబాన్ని వదిలి రోజుల తరబడి రేయింబవళ్లూ తిండి, నిద్ర లేక అవస్థలు పడుతూ రోడ్లపై పడిగాపులు కాస్తున్నా ఫ్యాక్టరీ యాజమాన్యం హీనంగా చూస్తోందని ఆరోపించారు.వారం పది రోజులుగా ఫ్యాక్టరీ ఎదుట పడిగాపులు కాస్తున్నా తమను పట్టించుకోకపోగా, అధికారులతో కుమ్మక్కైన దళారులు మాత్రం లక్షలు గడిస్తున్నారని ఆరోపించారు. వరుస క్రమంలో టోకెన్లు ఇవ్వకుండా, మిస్ చేసి బ్లాక్లో అమ్ముకుంటున్నారని అధికారులపై మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దల మద్దతు ఉన్న వారి సరుకునే కొంటున్నారని ఆరోపించారు. ఓ ఉన్నతాధికారి ఫోన్ చేస్తే 20–30 ట్రాక్టర్లు దర్జాగా మెయిన్ గేటు ద్వారా లోపలికి వెళుతున్నాయని ధ్వజమెత్తారు. ఫ్యాక్టరీల వద్ద ఒక ట్రాక్టర్ అన్లోడ్ కావడానికి దాదాపు వారం, పది రోజులు పడుతోందని, ఆ సమయానికి అధిక శాతం పంట కుళ్లిపోవడంతో ఆ సరుకు వద్దంటూ ఫ్యాక్టరీ వారు తిప్పి పంపుతున్నారని రైతులు వాపోయారు. -
సౌర విద్యుత్పై కొరవడిన ఆసక్తి
హనుమకొండ: సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుపై రైతుల్లో ఆసక్తి తగ్గింది. ఇందుకు.. వచ్చిన దరఖాస్తులు, చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లే నిదర్శనం. వేలల్లో దరఖాస్తులు రాగా, వందలో మాత్రమే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు జరగడాన్ని బట్టీ.. సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుపై రైతుల్లో ఉత్సాహం సన్నగిల్లిందని అర్థమవుతోంది.భారీ పెట్టుబడి.. గిట్టుబాటు కాని ధర.. 12 ఏళ్ల వరకు రైతుకు ప్రయోజనం లేకపోవడం.. ఈఎంఐలు చెల్లించడం ఇబ్బంది కావచ్చన్న ఆలోచన.. రుణాలపై స్పష్టత లేకపోవడం, రైతు వాటాగా రూ.లక్షల్లో చెల్లించాల్సి ఉండడం.. ప్రతీనెల ఆదాయం నిలకడగా వస్తుందనే నమ్మకం లేకపోవడం వెరసి.. సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుపై రైతుల్లో తీవ్ర విముఖత వ్యక్తమవుతోంది. దరఖాస్తులు చేసినప్పటి ఉత్సాహం.. ఈఎండీ చెల్లింపులో కనిపించలేదు. ఈఎండీ చెల్లించడంలో కనిపించిన శ్రద్ధ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకోవడంలో లేదు. లక్ష్యం ఘనం.. స్పందన గగనం..కేంద్ర ప్రభుత్వం సౌర విద్యుదుత్పత్తిని పెంచేందుకు ప్లాంట్ ఏర్పాటుపై రైతులను ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి కిసాన్ ఉర్జా సురక్షా ఎవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం కుసుం) పథకాన్ని తీసుకొచి్చంది. ప్రధానంగా రైతులను సౌర విద్యుదుత్పత్తి వైపు ప్రోత్సహించడం దీని ఉద్దేశం. రాష్ట్రాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. రైతులతోపాటు మహిళా స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాలు, సహకార సంఘాలు, పంచాయతీలు, నీటి వినియోగదారుల సంఘాలు సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా.. సౌర విద్యుదుత్పత్తి చేసేలా ఈ పథకాన్ని రూపొందించారు. ప్రభుత్వ, దేవాలయ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. వీరు ఉత్పత్తి చేసిన విద్యుత్ను స్థానిక డిస్కంలు ముందుగా నిర్ణయించిన టారిఫ్ ధరలకు కొనుగోలు చేస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో వేయి మెగావాట్లు మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగతా 3 వేల మెగావాట్ల ఉత్పత్తి కోసం.. రైతులతో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నదే పథకం లక్ష్యం. ఇక్కడివరకు బాగానే ఉన్నప్పటికీ.. ఈ మేరకు రైతులనుంచి స్పందన కనిపించకపోవడంతో లక్ష్యం నీరుగారేలా ఉంది.మందకొడిగా పథకం ప్రక్రియ.. పథకం రూపకల్పన, ఆదాయం వచ్చే మార్గాలపై ఉన్న సందేహాలతో పీఎం కుసుం పథకం ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ వరకు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.టీజీ ఎన్పీడీసీఎల్లో..టీజీ ఎన్పీడీసీఎల్లో 2,098 మంది రైతులు 2,788.900 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 520 మంది రైతులు 683.800 మెగావాట్లకు రూ.లక్ష చొప్పున ఈఎండీ చెల్లించారు. 439 మందికి 561.7 మెగావాట్లకు లెటర్ ఆఫ్ ఆక్సెపె్టన్సీ జారీ చేశారు. కాగా ఇప్పటివరకు 133 మంది రైతులు 161 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు మాత్రమే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. దరఖాస్తులు వేలల్లో వస్తే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ వందలో మాత్రమే చేసుకున్నారు.మొదటినుంచీ రైతుల అనాసక్తి.. మొదటినుంచి సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుపై రైతులు ఆసక్తి కనబరచడం లేదు. దరఖాస్తుల స్వీకరణకు మూడుసార్లు గడువు పొడిగించారు. ఈఎండీలు చెల్లించడానికి రెండుసార్లు గడువు విధించారు. అయినా దరఖాస్తులు వచి్చన మేరకు.. ఈఎండీలు చెల్లించడానికి రైతులు ముందుకు రాలేదు. ఈఎండీలు చెల్లించిన మేరకు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకునేందుకు రైతులు ముఖం చాటేస్తున్నారు. ఒక మెగావాట్ సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్కు రూ.3 కోట్లు ఖర్చవుతుంది. ఇందులో రైతులు తమ వాటాగా 25 శాతం భరిస్తే, బ్యాంకుల ద్వారా 75 శాతం రుణ సదుపాయాన్ని కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. రుణ విషయంలో బ్యాంకర్లకు స్పష్టంగా చెప్పడం లేదని రైతులు తెలిపారు. సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునేంత భారీ పెట్టుబడి రైతులుగా తాము వెచ్చించలేమని చెబుతున్నారు. 25 శాతం కింద రూ.3 కోట్ల వ్యయంలో రైతు వాటాగా రూ.75 లక్షలు భరించలేమని, దీనికి తోడు తమ స్థలం నుంచి సబ్స్టేషన్ వరకు అయ్యే ఖర్చులు భరించలేమని, ప్రభుత్వం యూనిట్కు చెల్లిస్తామని చెప్పిన రూ.3.13లు ఎటూ సరిపోవన్నారు. విద్యుదుత్పత్తి కూడా అన్ని కాలాల్లో ఒకే రకంగా ఉండకపోవచ్చని, దీంతో వచ్చిన ఆదాయంలో నిలకడ లోపిస్తుందని, దీంతో నెలవారీ వాయిదాలు చెల్లించడంలో ఇబ్బందులు ఎదురుకావచ్చని భావిస్తున్నారు. పన్నెండేళ్ల వరకు రుణ వాయిదాలు చెల్లించాల్సి రావడంతో.. అప్పటి వరకు రైతుకు ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని వాపోతున్నారు. పన్నెండేళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయోనని, అదే విధంగా 25 ఏళ్ల వరకు యూనిట్కు రూ.3.13 మాత్రమే చెల్లించడం ఏ మాత్రం గిట్టుబాటు కాదంటున్నారు. రాయితీ లేకపోవడంతో తమపై దారుణమైన భారం పడుతుందని రైతులు చెబుతున్నారు. దీంతో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు రావడం లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. టీజీ ఎస్పీడీసీఎల్లో.. టీజీ ఎస్పీడీసీఎల్లో 2265 మంది రైతులు 3,369.500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్కు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 682 మంది రైతులు 1035.5 మెగావాట్ల విద్యుదుత్పత్తికి రూ.లక్ష చొప్పున ఈఎండీ చెల్లించారు. ఇందులో 560 మంది రైతులకు 850.8 లెటర్ ఆఫ్ ఆక్సెప్టన్సీ జారీ చేశారు. కాగా ఇప్పటివరకు 163 మంది రైతులు 225 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు డిస్కంతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. -
మొగులు.. దిగులు..
సాక్షి, హైదరాబాద్/వరంగల్: రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతన్నలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. జూన్ ముగిసిపోతున్నా.. సరైన వర్షాలు లేక లక్షలాది ఎకరాలు సాగుకు నోచుకోలేదు. మరోవైపు నైరుతి రుతుపవనాలు ముందస్తుగా రాష్ట్రంలోకి ప్రవేశించడంతో కురిసిన తొలకరి జల్లులకు మురిసి విత్తనాలు వేసిన రైతులు.. కొన్నిరోజులుగా వరుణుడు ముఖం చాటేయడంతో దిక్కులు చూస్తున్నారు. ఆకాశంలో మబ్బులు కన్పించగానే ఆశగా చూస్తున్నారు గానీ ఫలితం ఉండటం లేదు. వర్షాలు పడకపోవడం..ఈ సీజన్లో సాగయ్యే పత్తి, మొక్కజొన్న, కందులు, సోయాబీన్ వంటి పంటలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వర్షాలపై ఆధారపడి చాలా జిల్లాల్లో వేసిన ఆయా పంటల విత్తనాలు అనేక ప్రాంతాల్లో మొలకెత్తలేదు. ముఖ్యంగా పత్తి, మక్క మొలకలు రాలేదు. కొన్నిచోట్ల మొలిచినా నీరు లేక ఎండిపోతున్నాయి. దీంతో రైతులు పెట్టిన పెట్టుబడి వృధా అవుతుండగా..అనేకచోట్ల రైతులు మళ్లీ మళ్లీ పెట్టుబడులు పెడుతూ రెండోసారి, మూడోసారి విత్తనాలు నాటుతున్నారు. దుక్కులు దున్ని, భూమి చదును చేసి, విత్తనాలు వేసిన ఒక్కో పత్తి రైతు ఎకరానికి రూ.10 వేల దాకా నష్టపోయే పరిస్థితి ఉందని అంటున్నారు. 8 జిల్లాల రైతులపై తీవ్ర ప్రభావం రాష్ట్రంలోని 26 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితి ఉంది. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, జనగాం, సూర్యాపేట జిల్లాల్లో వర్షభావ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 190 మండలాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొనగా, 90 మండలాల్లో వర్షపు చుక్క పడలేదు. ఈ జిల్లాల్లో 60 నుంచి 72 మిల్లీ మీటర్ల వరకు లోటు వర్షపాతం ఉండగా, ముందస్తు వానలతో పలు మండలాల్లో పత్తి, మక్కలు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటివరకు విత్తనాలు వేయని వారు వర్షాలు పడిన తర్వాత వేద్దామని చూస్తుండగా, ఆలస్యంగా వేసిన విత్తనాలతో పంట దిగుబడి రాదేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పత్తి, మక్క పంటల పరిస్థితి దారుణం రాష్ట్రంలో 70 నుంచి 100 శాతం వర్షాభావ పరిస్థితుల కారణంగా.. వర్షాధార పంటలుగా వేసిన పత్తి, మక్క ఇతర మెట్ట పంటల పరిస్థితి దారుణంగా మారింది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలో కేవలం 0.3 ఎంఎం వర్షం కురిసింది.. అంటే ఒక్క తుంపర కూడా లేదని నివేదికలు చెప్తున్నాయి. ఇదే పరిస్థితి చింతలపాలెం, నేరేడుచర్ల, పెన్పహాడ్, చివ్వెంలలో ఉంది. ఖమ్మంలో కామేపల్లి, యాదాద్రి భవనగిరి జిల్లాలో యాదగిరిగుట్ట, అడ్డగూడూరు, భువనగిరి, నల్లగొండ జిల్లా శాలిగౌరారం, కనగల్, పెద్దవూర, కరీంనగర్లో చిగురుమామిడి, కరీంనగర్ రూరల్, వేములవాడ, సంగారెడ్డిలో పుల్కల్, జిన్నారం, మెదక్లో మనోహరాబాద్, నార్సింగ్, సిద్దిపేట జిల్లాలో చిన్నకోడూరు, మిరుదొడ్డి, హుస్నాబాద్, జనగామ జిల్లాలో కొడకండ్ల, జఫర్ఘడ్, వరంగల్లో నర్సంపేట, దుగ్గొండి, నల్లబెల్లిలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. హనుమకొండ జిల్లాలో కమలాపూర్, ఐననోలు, మహబూబాబాద్ జిల్లాలో గార్ల, గూడూరు, కేసముద్రం, చిన్నగూడూరు, పెద్దవంగర, పెద్దపల్లి జిల్లాలో ఎలిగేడు, కమాన్పూర్, సుల్తానాబాద్, జగిత్యాలలో బీఆర్పూర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘనపూర్, గోరి కొత్తపల్లి, మహదేవ్పూర్, టేకుమట్ల, మంచిర్యాల రూరల్, భద్రాద్రిలో పినపాక, ఇల్లెందు, గుండాల మండలాల్లో సుమారు 70 నుంచి 100 శాతం వరకు లోటు వర్షపాతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది కన్నా తక్కువ పత్తి సాగు రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్లో 1.32 కోట్ల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గత ఏడాది ఈ సమయానికి 38 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, అది ఈసారి కేవలం 29.89 లక్షలకే పరిమితమైంది. వేసిన పంటల్లో అధికంగా పత్తి 22.84 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇందులో అత్యధికంగా సుమారు 9 లక్షల ఎకరాలు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోనే సాగు చేశారు. ఆ తర్వాత సంగారెడ్డిలో 2.75 లక్షల ఎకరాల్లో, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట, నల్లగొండ జిల్లాల్లో సగటున 1.10 లక్షల ఎకరాల్లో సాగైంది. వర్షాలు లేకపోవడంతో చాలా జిల్లాల్లో ఇంకా విత్తనాలు వేయలేదు. అత్యధిక వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సూర్యాపేటలో గత సంవత్సరం ఇప్పటివరకు 46 వేల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఈసారి కేవలం 7 వేల ఎకరాల్లో సాగు చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. మహబూబాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో పత్తి సాగు గత ఏడాదితో పోల్చుకుంటే సగం కూడా కాలేదు. మిగతా పంటల పరిస్థితీ ఇదే.. పత్తితో పాటు మొక్కజొన్న, జొన్నలు, కందులు, సోయాబీన్ విత్తనాలు వేసిన రైతులు కూడా వానలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆరుతడి పంటలైన ఇవి మొలకెత్తడానికి, మొలకెత్తిన విత్తనాలు మొక్కలుగా పెరగడానికి వర్షం తప్పనిసరి. అయితే విత్తనాలు నాటిన తరువాత వర్షాలు లేకపోవడంతో చాలాచోట్ల మొక్కలు ఎండిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం – 2025 సాగు ప్రణాళిక (ఎకరాలలో...) – సాగు అంచనా :1,32,44,305 – గతేడాది ఈ సమయానికి సాగు: 38,06,097 – ఈ సీజన్లో ఇప్పటివరకు సాగు: 29,89,562 – పత్తి సాగు అంచనా: 4893016 – గత ఏడాది ఇదే సమయంలో: 2858337 – ఇప్పటివరకు సాగైన పత్తి విస్తీర్ణం: 22,84,474 – మొక్కజొన్న సాగు అంచనా : 5,21,206 – గత ఏడాది ఇదే సమయంలో: 1,25,235 – ఇప్పటివరకు సాగైన మొక్కజొన్న విస్తీర్ణం : 1,17,309 లక్ష నష్టం..ఇంకో లక్ష అప్పు చేయాల్సిందే ఇతను జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం గ్రామానికి చెందిన కౌలు రైతు బాల్నె చిన్న కొమురయ్య. రోహిణి కార్తెలో కురిసిన తొలకరి వర్షం నేపథ్యంలో ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.30 వేలకు ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి విత్తనాలు నాటాడు. భూమి దున్నేందుకు, విత్తనాలకు మరో లక్ష రూపాయల పెట్టుబడి పెట్టాడు. అయితే ఆ తర్వాత వర్షాలు కురవలేదు. దీంతో 20 శాతం విత్తనాలు కూడా మొలకెత్తలేదు. మొలకెత్తినవి కూడా వర్షం లేకపోవడంతో పాటు అధిక ఉష్ణోగ్రతతో ఎండిపోతున్నాయి. దీంతో వర్షాలు పడి కాలం కలిసొస్తే మళ్లీ భూమి దున్ని విత్తనాలు పెట్టాల్సిందేనని, మళ్లీ లక్ష రూపాయల అప్పు వెతుక్కోవాల్సిందేనంటూ కొమురయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మొక్కజొన్న మొలకెత్తలే.. ఈ ఫొటోలోని మహిళా రైతు పేరు పావని. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కలకత్త తండాకు చెందిన ఈమె ఎకరం పొలంలో పత్తి, మరో ఎకరంలో మొక్కజొన్న విత్తనాలు పెట్టింది. విత్తనాలు వేసి 25 రోజులు దాటినా చినకు పడకపోవడంతో రెండు పంటలు మొలకెత్తలేదు. ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ.20 వేల పెట్టుబడి పెట్టింది. బుధవారం కొద్దిగా కురిసిన వానతో అక్కడక్కడ కొన్ని పత్తి విత్తనాలు మొలకెత్తాయి. అయితే ఇప్పటివరకు ఎండిన నేపథ్యంలో 70 శాతానికి పైగా సాల్లలోనీ పత్తి మొక్కలు పీకేసి మళ్లీ గింజలు పెడదామని ఆలోచిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికి రెండుసార్లు నాటినా.. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన బానోతు వీరన్న తనకు ఉన్న రెండెకరాల భూమిలో 20 రోజుల క్రితం పత్తి విత్తనాలు విత్తాడు. దున్నినందుకు, విత్తనాలకు, కూలీలకు సుమారు రూ.20 వేలు ఖర్చయింది. ఆ తర్వాత తేలికపాటి జల్లులు తప్ప వర్షాలు పడలేదు. దీంతో విత్తనాలు మొలకెత్తలేదు. దీంతో నాలుగు రోజులు క్రితం మళ్లీ దుక్కి దున్ని మరోసారి విత్తనాలను కొనుగోలు చేసి కూలీలతో నాటించాడు. గత మూడు రోజులుగా తేలికపాటి చినుకులే పడడం వల్ల అవి కూడా మొలకెత్తే పరిస్థితి కని్పంచడం లేదని వీరన్న వాపోతున్నాడు. వానాకాలం మొదటి దశలోనే అప్పుల పాలవుతున్నానని చెప్పాడు. గింజలు పెట్టింది గత్త మల్ల చుక్క పడలేదు నెలకింది పడ్డ వానలకు ఐదు ఎకరాల్లో పత్తి పెట్టినం. పత్తి గింజలు పెట్టింది గత్త మల్ల చుక్క పడలేదు. దీంతో మొలకలు రాలేదు. మళ్లీ విత్తనాలు వేసేందుకు దున్నుతున్నాం. రూ.35 వేలు అదనంగా పెట్టుబడి అవుతోంది. – సిలువేరు లచ్చయ్య, రైతు, జూలపల్లి, పెద్దపల్లి జిల్లా కురవాల్సిన సమయంలో పడట్లేదు మే నెలలో వర్షాలు కురవడంతో నాకున్న 3 ఎకరాలు దుక్కి దున్ని పత్తి విత్తనాలు వేసిన. సుమారు రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టిన. విత్తనాలు వేసి దాదాపు 25 రోజులు గడిచినా వర్షాలు పడకపోవడంతో గింజలు మొలకెత్తలేదు. ఎండలు కొట్టాల్సిన సమయంలో వర్షాలు పడ్డాయి. కురవాల్సిన సమయంలో పడట్లేదు. జూన్లో ఇప్పటివరకు వర్షాలే కురవలేదు. విత్తిన పత్తి విత్తనాలను చీమలు తినేసి ఉంటాయి. అదే జరిగితే మళ్లీ పెట్టుబడి పెట్టి పత్తి గింజలు కొని విత్తాలి. –బాదావత్ చంటినాయక్, పూసలతండా,గార్ల మండలం, మహబూబాబాద్ జిల్లా -
సాగు అంతంతే
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సాగు ఇంకా పుంజుకోలేదు. వాస్తవానికి మే నెలలోనే ముందస్తు నైరుతి రుతుపవనాల రాకతో మురిసిపోయిన రైతులు.. అప్పుడు కురిసిన వర్షాలకు పత్తి, మక్కలు, జొన్నలు సాగు చేశారు. ఆపై వరుణుడి జాడ లేకపోవడంతో కొన్నిచోట్ల విత్తనాలు మొలకెత్తక, మరికొన్ని చోట్ల ఎండిపోయాయి. రెండురోజులుగా కురుస్తున్న తేలకపాటి వర్షాలతో రైతులు మళ్లీ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. బావులు, బోర్ల కింద చాలా చోట్ల నార్లు పోసి, దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా చూస్తే కేవలం 33 వేల ఎకరాల్లో వరి సాగైంది. కాలువలు, చెరువులు, ప్రాజెక్టుల నుంచి సాగునీటి లభ్యత, నీటి విడుదలపై స్పష్టత రాకపోవడం, వర్షాలు కూడా సరిగ్గా లేకపోవడంతో మెజారిటీ చోట్ల దుక్కులు దున్నడం లేదు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. పత్తి, జొన్న, మక్కలు, ఇతర తృణధాన్యాల సాగుతోపాటు కంది, పెసర, సోయాబీన్ వంటి పంటల సాగు విషయంలో వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలతోనే ముందుకు సాగాలని పిలుపునిచ్చింది. ఈ వానాకాలంలో కోటి 35 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఇప్పటి వరకు కేవలం 20 లక్షల ఎకరాల్లో లోపే వివిధ పంటలు సాగయ్యాయి. గత ఏడాది ఈ సమయంతో పోలిస్తే...ఆరు లక్షల విస్తీర్ణం తక్కువగా ఉంది. – గత సంవత్సరం ఇప్పటి వరకు 21 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా, అదిప్పుడు 16 లక్షల ఎకరాలకే పరిమితమైంది. రాష్ట్రంలో ఈసారి 50 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తారని అంచనా వేశారు. వర్షాలు లేకపోవడం వల్లనే పత్తి సాగు విస్తీర్ణం పెరగలేదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. – పత్తి తర్వాత అత్యధికంగా ఉమ్మడి ఆదిలాబాద్జిల్లాతో పాటు నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లో సోయాబీన్ 1.25 లక్షల ఎకరాల్లో సాగైంది. – మక్కలు సుమారు 50 వేల ఎకరాల్లో సాగు చేయగా, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో ఉంది. విత్తనాలు, ఎరువులపై ఆందోళన పత్తి విత్తనాలకు సంబంధించి వివిధ శాఖలు చేసిన ఆపరేషన్ కొంత విజయవంతమైంది. జిల్లా స్థాయిలో పోలీస్, వ్యవసాయ శాఖ, సీడ్ సర్టిఫికేషన్ అధికారులు కలిసి నిర్వహించిన జాయింట్ ఆపరేషన్లో చాలా చోట్ల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. నిషేధిత బీటీ–3 విత్తనాలను కూడా సీజ్ చేశారు. అయినా ఇంకా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాతో పాటు పెద్దపల్లి, మహబూబ్నగర్, నాగర్కర్నూలు, నిజామాబాద్ తదితర చోట్ల నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై వ్యవసాయ శాఖ పోలీస్ యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. – ఎరువులకు సంబంధించి రైతుల్లో ఆందోళన మొదలైంది. పత్తితోపాటు వరికి యూరియా, డీఏపీ అవసరం కాగా, యూరియా కేటాయింపులకు తగినట్టుగా కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేయలేదు. జూన్ నెలాఖరు వరకు 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా, 3 లక్షల మెట్రిక్ టన్నులే వచ్చింది. రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీలో యూరియా ఉత్పత్తి ఇటీవలే తిరిగి ప్రారంభం కావడంతో సమస్య ఉండదని మార్క్ఫెడ్ జీఎం విష్ణు ‘సాక్షి’కి తెలిపారు. కాగా కేంద్ర ప్రభుత్వం యూరియా 9.8 లక్షల మెట్రిక్ టన్నులతోపాటు డీఏపీ కూడా ఒకటిన్నర లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఈ సీజన్కు కేటాయించింది. సాగు విస్తీర్ణం పెరగనున్న నేపథ్యంలో యూరియా, డీఏపీ కేటాయింపుల కన్నా ఎక్కువ అవసరం అవుతుందని అధికారులు చెబుతున్నారు. దొడ్డు యూరియా సరఫరా చేయడం లేదని, సన్న యూరియాతో ఇబ్బందులు ఉన్నట్టు రైతులు వాపోతున్నారు. కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెంచారు కేంద్ర ప్రభుత్వం కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెంచింది. పంటల సాగు మొదలు పెట్టాలనుకుంటున్న రైతులకు యూరియా కొరత సమస్యగా మారింది. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుబాటులో ఉంచితే బాగుంటుంది. – కాలసాని నరసింహారెడ్డి, జమాండ్లపల్లి దొడ్డు యూరియా సరఫరా చేయాలి సహకార సంఘాల్లో మొత్తం దుమ్ముతో కూడిన సన్నపు యూరియానే సరఫరా చేస్తున్నారు. పొలాల్లో చల్లడానికి ఇది ఏమాత్రం అణువుగా ఉండదు. చల్లడానికి కూడా ఎక్కువ సమయం తీసుకుంటుంది. రైతులకు అనువుగా ఉండే దొడ్డు యూరియాను సరిపడా సకాలంలో సరఫరా చేస్తే బాగుంటుంది. –నోముల తిరుపతిరెడ్డి, నల్లవెల్లి -
సర్వే నంబర్లు గాయబ్!
సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు...రెండు కాదు.. రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు సంబంధించిన లక్షకు పైగా సర్వే నంబర్లు గల్లంతయ్యాయి. పాత రికార్డుల్లో ఉన్నా కొత్త రికార్డుల్లోకి ఇవి ఎక్కలేదు. ధరణికి ముందున్న మాన్యువల్ రికార్డుల్లో నమోదైన ఈ సర్వే నంబర్లన్నీ ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆన్లైన్లో నమోదు కాలేదు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న తమ భూముల సర్వే నంబర్లు కనిపించకపోవడంతో ఆయా సర్వే నంబర్లలో భూమి ఉన్న రైతాంగం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తులు చేసుకున్నా ఫలితం లేకపోవడం, సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన భూభారతి సదస్సుల్లో ఈ రైతులందరూ మరోమారు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలోని 561 మండలాల్లో ఉన్న 10,239 రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన ఈ సదస్సుల్లో మొత్తం 8,00,999 దరఖాస్తులు రాగా, అందులో తమ భూముల సర్వే నంబర్లు మిస్సయ్యాయంటూ ఏకంగా 1,26,028 దరఖాస్తులు రావడం గమనార్హం. మొత్తం దరఖాస్తుల్లో 15 శాతం సర్వే నంబర్ల మిస్సింగ్ దరఖాస్తులే కావడం గమనార్హం. రెవెన్యూ రికార్డులకు సంబంధించి కీలకమైన, భూమి గుర్తింపు సంఖ్య అయిన సర్వే నంబరే లేకుండా పోవడంపై రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మొత్తం 8 లక్షలకు పైమాటే రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం పేరిట ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చి నాలుగేళ్లు దాటిపోయింది. ఆ పోర్టల్ను రద్దు చేసి భూభారతి అమల్లోకి తెచ్చి కూడా రెండు నెలలయింది. కానీ రాష్ట్ర రైతాంగం చేతిలో ఉన్న వ్యవసాయ భూములకు సంబంధించి ఇంకా లెక్కలేనన్ని సమస్యలు మిగిలి ఉన్నాయని భూభారతి సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రామస్థాయిలో జరిగిన ఈ సదస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షలకు పైగా వినతులు రావడం గమనార్హం. ఇందులో ఎక్కువగా సాదా బైనామాల రిజిస్ట్రేషన్ల దరఖాస్తులు వచ్చాయి. మొత్తం దరఖాస్తుల్లో 30 శాతం దరఖాస్తులు ఇవే కావడం గమనార్హం. కాగా సాదా బైనామాల క్రమబద్ధీకరణకు అవసరమైన నిబంధనలను భూభారతి చట్టంలో పెట్టినా..ఈ అంశం కోర్టులో పెండింగ్ ఉండడంతో అవి రెగ్యులరైజ్ చేసేందుకు వీలు కాలేదు. కోర్టులో కేసు ముగిసిన తర్వాత ఆగస్టు నెలలో వీటన్నింటినీ పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఆ తర్వాత సర్వే నంబర్ల మిస్సింగ్, అసైన్డ్ భూములకు సంబంధించిన రికార్డుల సమస్యలు, ఆ భూములను తమకు క్రమబద్ధీకరించాలంటూ వచ్చిన దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి. అసైన్డ్ భూముల రెవెన్యూ రికార్డులకు సంబంధించి 90 వేలకు పైగా దరఖాస్తులు రాగా, ఆ భూములను తమకు రిజిస్ట్రేషన్ చేయాలంటూ మరో 50 వేల దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత వారసత్వం (విరాసత్) ద్వారా వచ్చిన భూమిని భాగస్వామ్య పంపకం చేయాలంటూ ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. అయితే భూభారతి పోర్టల్ ద్వారా ఈ భాగస్వామ్య పంపకాలకు అవకాశం కల్పించలేదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఇక మ్యుటేషన్ పెండింగ్/కోర్టు కేసులు, డిజిటల్ సంతకం పెండింగ్, విస్తీర్ణంలో తేడాలు.. ఇలా రెవెన్యూ రికార్డులకు సంబంధించి 13 రకాలు, ఇతర సమస్యలకు సంబంధించిన 17 రకాల దరఖాస్తులు ఇటీవల జరిగిన భూభారతి సదస్సుల్లో రావడం గమనార్హం. మొత్తం దరఖాస్తుల్లో 3.2 లక్షలు ఇప్పటికే ఆన్లైన్లో నమోదు కాగా మిగిలిన దరఖాస్తులను కూడా నమోదు చేసే పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. ఖమ్మంలో ఎక్కువ..మేడ్చల్లో తక్కువ జిల్లాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా ఖమ్మం జిల్లా రైతాంగం ఎక్కువగా భూమి సమస్యలు ఎదుర్కొంటున్నట్టు భూభారతి సదస్సుల్లో వచ్చిన గణాంకాలు చెబుతున్నాయి. ఈ జిల్లాలో అత్యధికంగా 67,378 దరఖాస్తులు రాగా, ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 61,145 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 1.28 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం వచ్చిన 8 లక్షల దరఖాస్తుల్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే 15 శాతం కంటే ఎక్కువ దరఖాస్తులు రావడం గమనార్హం. ఆ తర్వాత వరంగల్ (54,933), భూపాలపల్లి (48,651), సూర్యాపేట (44,501), సిద్దిపేట (42,639), నల్లగొండ (42,161) జిల్లాల్లో ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. ఇక అత్యల్పంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 2,857 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. 10 వేల కంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన జిల్లాల్లో ఆసిఫాబాద్ (3,712), మహబూబ్నగర్ (9,610), నారాయణపేట (4,052), రాజన్న సిరిసిల్ల (6,965), వనపర్తి (7,615) ఉన్నాయి. ఆగస్టు 15 నాటికి సమస్యల నుంచి విముక్తి భూభారతి సదస్సులను చాలా పకడ్బందీగా నిర్వహించాం. అధికారులే గ్రామాలకు వెళ్లి, ప్రజలకు ఒకరోజు ముందే దరఖాస్తులు ఇచ్చి, అన్ని వివరాలను తీసుకున్నారు. రూపాయి ఖర్చు లేకుండా రైతులు తమ భూ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసుకునే అవకాశాన్ని కల్పించడం సంతోషంగా ఉంది. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిన పాపాలకు, ధరణి తెచ్చిన కష్టాలకు భూభారతి సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల సంఖ్య నిదర్శనం. ధరణిని బంగాళాఖాతంలో కలిపేశాం. ఇప్పుడు రైతుల సమస్యల పరిష్కారమే మా ముందున్న తక్షణ కర్తవ్యం. ఆగస్టు 15 నాటికి తెలంగాణ రైతాంగాన్ని భూ సమస్యల నుంచి విముక్తులను చేస్తాం. – రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (నోట్: ఇతరముల కేటగిరీలో ఎక్కువగా సాదా బైనామాలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయని, 2 లక్షలకు పైగా అవేనని రెవెన్యూ వర్గాలంటున్నాయి. అసైన్డ్ భూములను రిజిస్టర్ చేయాలంటూ 50 వేలకు పైగా, శివాయి జమేదార్ భూముల సమస్యలపై 12 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని సమాచారం. వీటితో పాటు పోడు భూములు, సరిహద్దు వివాదాలు, ఇండ్ల స్థలాలకు పాస్బుక్కులు, కోర్టు కేసులు, అప్పీళ్లు, భూదాన్ భూములు.. ఇలా 17 రకాల సమస్యలపై భూభారతి సదస్సుల్లో రైతులు దరఖాస్తులు సమర్పించారు.) -
దళారుల పంట పండుతోంది!
దళారీ వ్యవస్థ.. ఉద్యాన పంటల మార్కెట్ను శాసిస్తోంది. వారు చెప్పిందే ధర. మార్కెట్ను తమ కనుసన్నల్లోనే నడుపుతున్నారు. గతంలో దళారీ అంటే రైతుకు, వ్యాపారులకు మధ్య వారధిలా వ్యవహరిస్తూ ఇరువురిని ఒప్పించి పదో పరకో సంపాదించుకునేవారు. అయితే ప్రస్తుతం సీను మారిపోయింది. బొప్పాయి, అరటి, మిరప, పసుపు, తమలపాకులు.. ఇలా ఉద్యాన పంట ఏదైనా వారు చెప్పినట్లు రైతులు, వ్యాపారులు వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు కమీషన్ మీద ఆధారపడిన వీరు చివరకు వ్యాపారుల మాటున రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు. ఆళ్లగడ్డ: అన్నదాతల అవసరాన్ని, అమాయకత్వాన్ని దళారులు ఆదాయ మార్గంగా మార్చుకుని దర్జాగా దోపిడీ చేస్తున్నారు. పంట పండించడం వరకే రైతు హక్కు. మిగతాదంతా దళారుల దయపైనే ఆధారపడి ఉంటోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నంద్యాల జిల్లాలో ఉద్యాన పంటల సాగు గణనీయంగా పెరుగుతోంది. జిల్లా మొత్తం ఎటు చూసినా అరటి, బొప్పాయి, మామిడి, నిమ్మ, దానిమ్మ, కర్బూజ, మామిడి, జామ, సపోట, దానిమ్మ, కలింగర (పుచ్చ).. వంటి పండ్ల తోటలతో పాటు పసుపు, మిరప వంటి ఉద్యాన పంటలు సైతం విపరీతంగా సాగవుతున్నాయి. ఎక్కువగా ఆళ్లగడ్డ, డోన్, నంద్యాల తదితర ప్రాంతాల్లో విస్తారంగా సాగు చేస్తున్నారు.ప్రస్తుతం జిల్లాలో బొప్పాయి 20 వేల ఎకరాలు, అరటి 40 వేల ఎకరాలు, నిమ్మ 5 వేల ఎకరాల్లో ఉంది. అయితే ఇందులో ఆళ్లగడ్డ ప్రాంతంలోనే అత్యధికంగా అరటి పంట 20,224 ఎకరాలు, బొప్పాయి 10,428 ఎకరాలు, నిమ్మ 3,500 ఎకరాల్లో సాగులో ఉంది. ఈ పంటల సాగుకు పెట్టుబడి ఏటేటా రెట్టింపు అవుతోంది. ఉద్యాన పంట ఏదైనా దిగుబడులు విక్రయించే సరికి రైతులకు చివరకు మిగిలేది నష్టం.. దుఃఖమే. దళారులు అన్నదాతల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తున్నారు. మార్కెట్లో ధర లేదంటూ కథలు చెబుతూ మద్దతు ధర దక్కకుండా చేస్తున్నారు.ప్రభుత్వం జిల్లాలో ఎక్కడా మార్కెటింగ్ సౌకర్యం కల్పించకపోవడంతో దిగుబడులు బాగున్నా ధర ఆశించిన మేర లభించకపోవడంతో రైతులు లబోదిబో మంటున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో బొప్పాయి టన్ను రూ. 20 వేలు ఉండగా ప్రస్తుతం రూ. 4 నుంచి రూ. 5 వేలకు ధర పడిపోయింది. అరటి టన్ను రూ .26 వేల ధర పలకగా దళారులంతా సిండికేట్గా మారి ప్రస్తుతం రూ. 4 వేలకు కొనుగోలు చేస్తున్నారు. గద్దల్లా వాలిపోతారు.. అరటి, బొప్పాయి పంటలు సాగు చేయాలంటే ఎక రాకు కనీసం రూ. లక్ష నుంచి రూ. 1.50 లక్షల వర కు పెట్టుబడి అవుతుంది. అతివృష్టి, అనావృష్టి, చీడపీడలు, తెగుళ్లు, ప్రకృతి వైపరిత్యాల నుంచి పంటను బతికించుకున్నా దిగుబడి విక్రయ సమయాని కి దళారులు గద్దల్లా వచ్చి వాలిపోతారు. వ్యాపారు లు అస్సలు గ్రామాల్లో కనిపించక పోయేసరికి దళరులు నిర్ణయించిన మేరకు పంటను విక్రయించాల్సి వస్తోంది.తమకు ఉపాధి కల్పిస్తూ తమ కుటుంబానికి కడుపునిండా అన్నం పెడుతున్నారన్న జాలి కూడా లేకుండా పుడమి పుత్రులను నిట్ట నిలువునా ముంచేస్తున్నారు. ఆరుగాలం కష్టించి పనిచేసి పంట పండించిన వారికి దళారుల (కమీషను దారులు) కారణంగా పెట్టుబడులు కూడా దక్కని దయనీయ పరిస్థితి నెలకొంటుంది. రూ. కోట్లు దళారుల పాలు జిల్లాలో వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయి. అయితే ఏ పంటకు సంబంధించిన దిగుబడిని విక్రయించుకునేందుకు ఉమ్మడి జిల్లాలో ఎక్కడా మార్కెటింగ్ సౌకర్యం లేదు. అరటి, బొప్పాయిలే 60 వేల ఎకరాల వరకు సాగులో ఉంది. ఎకరాకు 40 టన్నుల దిగుబడి వచ్చిన 24 లక్షల టన్నుల వరకు దిగుబడి వస్తుంది. టన్నుకు రూ. 2 వేల వరకు కమీషన్ అనుకున్నా ఏకంగా రూ. 48 కోట్ల వరకు దళారులు చెమటచుక్క బయటకు రాకుండా దోచుకుంటున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ మోసంపై దృష్టి సారించి స్థానికంగా మార్కెట్ సౌకర్యం కల్పించాలని రైతులు కోరుతున్నారు.వ్యాపారులను రానివ్వకుండా.. గత పదేళ్ల క్రితం వరకు బొప్పాయి, అరటి సీజన్ ప్రారంభమవడానికి ఓ నెల ముందు నుంచే ఈ ప్రాంతం వ్యాపారులతో కళకళలాడేది. ముంబాయి, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, కలకత్తా తదితర ప్రాంతాలకు చెందిన వారితో పాటు నేపాల్, చైనా వంటి ఇతర దేశాలకు చెందిన పెద్ద పెద్ద వ్యాపారులు సైతం చాగలమర్రి, ఆళ్లగడ్డ, ఆలమూరు, నంద్యాల ప్రాంతాల్లో నెలల తరబడి మకాం వేసి దళారుల మధ్య వరి్థత్వంతో దిగుబడి కొనుగోలు చేసేవారు. అయితే ఇప్పుడు దళారులే వ్యాపారుల అవతారమెత్తి అసలు వ్యాపారులను రైతుల వద్దకు వెళ్లనీయకుడా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దళారులంతా సిండికేట్గా మారి ధరను నిర్ణయించి రైతులను మోసం చేస్తున్నారు. కష్టం రైతులది.. సంపాదన దళారులది 5 ఎకరాలు బొప్పాయి సాగు చేయాలంటే సుమారు రూ. 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. పెట్టుబడి వస్తే చాలనీ అనుకుంటాం. కాని దళారులు నెల, రెండు నెలల్లో ఐదెకరాల సరుకుతో కనీసం రూ.3 లక్షలు సంపాదిస్తాడు. వారు అడిగిన ధరకు ఇవ్వాల్సిందే. లేకుంటే తోటలోనే మాగిపోతాయి. అధికారులు చర్యలు తీసుకుని దళారుల దందాను అరికట్టాలి. – రాంగుర్రెడ్డి, రైతు -
రైతుల చేతులకు సంకెళ్లు!
అలంపూర్: ఇథనాల్ కంపెనీ ఏర్పాటనును వ్యతిరేకించే క్రమంలో చోటు చేసుకున్న గొడవతో రిమాండ్లో ఉన్న రైతులకు పోలీసులు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకురావడం వివాదాస్పదమైంది. వివరాల్లోకి వెళితే.. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో గాయత్రి రెన్యూవబుల్ ఆన్లైన్ ఇండస్ట్రీస్ కంపెనీ ఇథనాల్ కంపెనీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే దీనిని పెద్ద ధన్వాడతో పాటు ఆ చట్టూ ఉన్న 12 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 4వ తేదీన కంపెనీ నిర్మాణ పనులు ఆరంభించడానికి యాజమాన్యం సామగ్రి సిద్ధం చేసుకుంది. దీన్ని ప్రజలు అడ్డుకునే క్రమంలో తీవ్ర ఉద్రికత్త చోటు చేసుకుంది. దీంతో 41 మంది రైతులపై రాజోలి పోలీస్స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. అందులో 12 మంది రైతులను ఈ నెల 5వ తేదీన గద్వాల కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు. వీరికి సంబంధించి బుధవారం వాయిదా ఉండటంతో అలంపూర్ కోర్టులో హాజరుపర్చారు. అయితే వీరి చేతులకు సంకెళ్లు వేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అన్నం పెట్టే రైతన్నల చేతికి కరుడుగట్టిన నేరస్తుల తరహాలో సంకెళ్లు వేయడం ఏమిటంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. ఆ తర్వాత మీడియాలో కథనాలుగా రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమయ్యింది. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు రైతులకు మద్దతుగా నిలిచాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం. 17నే బెయిల్ మంజూరు ఎట్టకేలకు విడుదలమహబూబ్నగర్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న రైతులకు వాస్తవానికి మంగళవారమే బెయిల్ మంజూరైంది. గద్వాల కోర్టు 12 మంది రైతులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రైతులు ఒకవైపు కోర్టు వాయిదాకు హాజరు కాగా.. మరోవైపు వారి బెయిల్కు సంబంధించిన జామీన్ల ప్రక్రియ కొనసాగింది. చివరకు బుధవారం రాత్రి రైతులు బెయిల్పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం మాట్లాడుతూ పచ్చని పొలాల్లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుతో రైతుల జీవితాల్లో కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెట్టిందని ఆరోపించారు.ముగ్గురు పోలీస్ అధికారుల సస్పెన్షన్ ఈ ఉదంతంపై జిల్లా ఎస్పీ శ్రీనివాస్రావును ‘సాక్షి’ సంప్రదించగా..ఇందుకు కారణమైన ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు. రైతులను జైలు నుంచి కోర్టుకు తీసుకొచ్చే క్రమంలో పోలీస్ ఉన్నతాధికారుల సూచనలు పాటించకుండా విధుల పట్ల అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంఘటనలో ఒక ఆర్ఎస్ఐ, ఇద్దరు ఏఆర్ ఎస్ఐలను సస్పెండ్ చేశామని చెప్పారు. -
చిలకలూరిపేటలో ఇద్దరు రైతుల ఆత్మహత్య
సాక్షి పల్నాడు జిల్లా: చిలకలూరిపేట నియోజకవర్గంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల బాధతో బలవన్మరణం చెందారు. నాదెండ్లకు చెందిన ఆదినారాయణ, తూబాడుకు చెందిన చిరుబోయిన గోపాలరావు పొలంలోనే పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
చిత్తూరు : రోడ్డెక్కిన మామిడి రైతులు..పట్టించుకోని కూటమి సర్కార్ (ఫొటోలు)
-
తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్, రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్, 9 రోజుల్లో 9వేల కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమ
-
రోడ్డెక్కిన పొగాకు రైతులు
యర్రగొండపాలెం: పొగాకు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని హనుమాన్ జంక్షన్కుంట వద్ద ఉన్న జీపీఐ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేశారు. పురుగు మందు బాటిళ్లు చేతపట్టుకొని జాతీయ రహదారిపై బైఠాయించారు. పుల్లలచెరువు మండలంలోని చెన్నంపల్లి గ్రామానికి చెందిన పొగాకు రైతులు కుంట వద్దకు చేరుకుని.. పొగాకు కొనుగోలు చేసే జీపీఐ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.తమ కంపెనీతో ఒప్పందం చేసుకున్న రైతుల పొగాకును మాత్రమే కొనుగోలు చేస్తామని, ఇతర కంపెనీలతో ఒప్పందం చేసుకున్న రైతుల నుంచి కొనేది లేదని జీపీఐ కంపెనీ సిబ్బంది రైతులకు తెలిపారు. పండించిన పంటలో కొంత భాగమే డెక్కన్ కంపెనీ కొనుగోలు చేసి మొహం చాటేసిందని రైతులు ఆరోపించారు. అప్పులు చేసి అధిక పెట్టుబడులు పెట్టి పొగాకు పండించామని, పంట చేతికి వచ్చిన తరువాత కొనుగోలు కేంద్రాన్ని నిలిపివేస్తే చేసిన అప్పులు ఏ విధంగా తీర్చుకోవాలని వారు ప్రశి్నంచారు.పొగాకు కొనుగోలు చేయకపోతే ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని పురుగుల మందు బాటిళ్లతో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు.దీంతో కొంతసేపు రాకపోకలు స్తంభించాయి. డెక్కన్ కంపెనీతో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి తమ వద్ద ఉన్న పొగాకు బేళ్లను వెంటనే కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. -
తొమ్మిది రోజుల్లో 9వేల కోట్లు ఇస్తాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసా పథకం కింద వానాకాలం సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం విడుదలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని 70.11 లక్షల మంది రైతులకు చెందిన 1.49 లక్షల ఎకరాల సాగు యోగ్యమైన వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.6 వేల చొప్పున నిధులు విడుదల చేస్తూ కంప్యూటర్ బటన్ నొక్కారు. కేవలం 9 రోజుల్లో రైతులందరికీ మొత్తం రూ.9 వేల కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. తొలిరోజు సోమవారం 2 ఎకరాల లోపు 41,25,289 మంది రైతులకు రూ.2,349.83 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. 39.16 లక్షల ఎకరాలకు గాను ఈ డబ్బులు జమయ్యాయి. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో రాష్ట్రంలోని 1,034 వేదికల్లో కొత్తగా ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో వర్చువల్గా సంభాషించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ రైతు భరోసా గురించిన ప్రకటన చేశారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. పదేళ్లలో వ్యవసాయాన్ని నీరుగార్చారు.. గడిచిన పదేళ్ల కాలంలో వ్యవసాయాన్ని నీరుగార్చారు. వరి వేస్తే ఉరే అని, వడ్లు కొనలేం అని పెద్దాయన చెప్పాడు. మేం పేద ప్రజలకు రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం ఇవ్వాలని సంకల్పించి దొడ్డు ధాన్యంకు బదులు సన్న ధాన్యం పండించమని రైతులను కోరాం. సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించాం. ఈ మేరకు రైతులు సన్న వడ్లు పండిస్తే, సన్న బియ్యం పేదల కడుపు నింపుతున్నాయి. రాష్ట్ర రైతులు ఈ ఏడాది దేశంలోనే అత్యధికంగా 2.80 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించారు. రూ.1,29,000 కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టారు సర్పంచులు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని అంటున్నారు. మేం అధికారంలోకి వచ్చే నాటికే సర్పంచుల పదవీ కాలం ముగిసింది. కాంట్రాక్టర్లకు మరో రూ.60 వేల కోట్లు బకాయిలు పెట్టారు. మొత్తంగా రూ.1,29,000 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి, ఫీజు రీయింబర్స్మెంటు డబ్బులు వాడుకున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్స్ రూ.12 వేల కోట్లు బకాయి పెట్టి పోయారు. పదేళ్లలో రూ.8 లక్షల 20 వేల కోట్ల అప్పు మా నెత్తిపై మోపి నడుం వంగిపోయే పరిస్థితి తెచ్చారు. రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసంలోకి నెట్టి పోయినా, ఒక్కొక్క మెట్టు పేర్చుకుంటూ సరి చేసుకుంటూ వస్తున్నాం. ఎన్ని కష్టాలు ఉన్నా రైతులకు పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించుకున్నాం. మంత్రులందరితో చర్చించి రైతులందరికీ 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు వారి ఖాతాల్లో వేయాలని నిర్ణయించాం. రైతు ఆశీర్వాదంతోనే ఏదైనా సాధ్యం వార్డు సభ్యుడి నుంచి సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, చివరకు ముఖ్యమంత్రి అయినా రైతు ఆశీర్వాదం ఉంటేనే అది సాధ్యపడుతుంది. కుర్చీ బలంగా ఉంటుంది. అందుకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం. రైతును రాజును చేయడం, వ్యవసాయాన్ని పండుగ చేయడం లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నాం. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో రెండు విడతలుగా రుణమాఫీ కింద రైతులకు ఇచ్చింది రూ.17 వేల కోట్ల లోపే. ఊళ్లళ్ల పెళ్లిళ్లలో ఎక్కువ కటా్నల కోసం పిలగాని తండ్రులు కార్లు, మేడలు చూపించినట్లు..పెద్దాయన రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు. ఆనాటి గాయాలు మానలేదు. అయినా రైతుల కోసం రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్, రైతుబీమా, బోనస్ కింద 18 నెలల్లోనే రూ.1,01,720 కోట్లు ఖర్చు చేశాం. ఇంత తక్కువ సమయంలో అంత పెద్ద మొత్తంలో రైతుల కోసం ఖర్చు చేసిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. దీనిపై గ్రామ సభలు పెట్టి చర్చిద్దాం. ధాన్యం కొనుగోలు చేసి రైతులకు 24 గంటల్లో డబ్బులు జమ చేశాం. ధరణి స్థానంలో భూభారతి తీసుకొచ్చాం. రైతులకు మేలు చేసేందుకే ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది. చావుల పునాదుల మీద రాజకీయం చేస్తున్నారు రాష్ట్రంలో రైతుల కోసం, ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని తక్కువ చేసే ప్రయత్నం జరుగుతోంది. చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తుంటే..మొన్ననే వచ్చాడు పిలగాడు కుదురుకోనిద్దాం అని లేకుండా రాజకీయం చేస్తున్నారు. విద్యార్థులు, రైతులు చనిపోతే సంతోíÙస్తున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆనందం పొందుతున్నారు. చావుల పునాదుల మీద రాజకీయం చేస్తున్నారు. నేను ఎవరినీ కలవకుండా ఫాం హౌస్లో లేను. అయినా రాజకీయం చేస్తూ విమర్శలు చేస్తున్నారు. విద్యార్థులు జొన్న రొట్టెలు తినాలి చిన్నప్పుడు మా ప్రాంతంలో కందులు, బుడమ కాయలు (దోసకాయలు) పండేవి. దోసకాయ కందిపప్పు కూరను జొన్నరొట్టెతో తింటే ఎంతో కమ్మగా ఉండేది. మటన్, చికెన్ కూడా పనికిరాదు. విద్యార్థులు జొన్నరొట్టెలు తినండి. మీ బట్టలు మీరే ఉతుక్కోండి. ఏ సిక్స్ ప్యాక్ ఎక్సర్సైజ్లు పనికిరావు. వరి ఒక్కటే కాదు. కూరగాయలు, కందులు, పెసర్లు వంటి మిల్లెట్లు పండించాలి. రైతులకు సబ్సిడీతో పనిముట్లు ఇస్తాం. అధునాతన పంటలు కాదు.. తాతలు, తండ్రులు పండించిన పంటలను మళ్లీ పండించాలి. కూరగాయలు పండిస్తే హైదరాబాద్లో అమ్ముకోవచ్చు. ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించేందుకు అనుభవజ్ఞులైన రైతులతో రైతు వేదికల వద్ద పాఠాలు చెప్పించండి. భూమి రైతుకు ఆత్మగౌరవం.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎవరు ఎన్ని ధర్నాలు చేసినా, బట్టలు చించుకున్నా పదేళ్లు మన ప్రభుత్వమే ఉంటుంది. -
రైతాంగం కష్టాలు కొనసాగాల్సిందేనా!
కేంద్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్లో వరితో సహా 14 పంటలకు అర కొరగా పెంచిన కనీస మద్దతు ధరల ప్రకటన రైతులను ఉస్సూరుమనిపిస్తోంది. కేంద్రం ప్రకటించిన ధరలను పరిశీలిస్తే, క్వింటాలు వరికి రూ. 69, జొన్నలకు రూ. 328, సజ్జలకు రూ. 150, మొక్కజొన్నకు రూ. 150, కంది పప్పుకు రూ. 450, పెసర్లకు రూ. 86, మిను ములకు రూ. 400, వేరుశనగకు రూ. 480, పొద్దుతిరుగుడుకు రూ.441, సోయాబీన్కు రూ. 436, పత్తికి రూ. 589, కుసుమలకు రూ. 579, రాగులకు రూ. 596లు మేర మాత్రమే పెంచారు. ఆశ్చర్యం ఏమంటే ఈసారి పెంపుదల 2024 –25లో పెంచిన దానికంటే తక్కువ ఉండటం.అన్నదాతకు అన్యాయం జరగడం కొత్త కానప్పటికీ... దాదాపు 3 ఏళ్ల క్రితం మన కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఉరితాళ్ల వంటి 3 వ్యవ సాయ చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలలపాటు ఢిల్లీ కేంద్రంగా రైతులు సాగించిన పోరాటం నేపథ్యంలో పంటల కనీస మద్దతు ధరల చట్టబద్ధతపై అవకాశాల పరిశీలన కోసం కమిటీ వేస్తామనీ, కమిటీ సూచనల ప్రకారమే నిర్ణ యాలు తీసుకొంటామనీ ఇచ్చిన రాతపూర్వక హామీకి ఇప్పటివరకు అతీగతీ లేదు. సంస్కరణలు అనివార్యం కనీస మద్దతు ధరలను నిర్ణయించే ప్రక్రియను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అమలులో ఉన్న పంటల ఉత్పత్తి వ్యయాన్ని రాష్ట్రాల వారీగా లెక్కించి, దానిని జాతీయ సగటుగా లెక్కించడం సరియైనది కాదు. సాగు ఖర్చులో రాష్ట్రాల మధ్య వ్యత్యాసం ఎంతో ఉంది. సగటు లెక్కన ధరలు నిర్ణ యించడం వల్ల ఎక్కువ ఖర్చు ఉన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతున్నది. దేశంలో ప్రధాన పంటల సాగు వ్యయాన్ని లెక్కించేందుకు ఎప్పుడో ఏర్పాటైన వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ – సీఏసీపీ) వరుసగా మూడేళ్ల పంట సాగు వ్యయాన్ని లెక్కించి, దాని ఆధారంగా కనీస మద్దతు ధరల్ని లెక్కించి... ఆ వివరాలను కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీకి నివేదిస్తుంది. ‘సీఏసీపీ’కి స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ... ఆ సంస్థ నివేదించే ధరల్ని కేంద్రం యథాతథంగా ఆమోదించడం లేదు. వాటికి సవరణలు చేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం తమ వద్దనే ఉంచుకుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాలు, మరోవైపు సీఏసీపీ పంటల ఉత్పత్తి వ్యయాన్ని లెక్కించడానికి భారీ కసరత్తు జరిపి అందిస్తున్న నివేదికల్ని బుట్టదాఖలు చేస్తున్నప్పుడు... అసలు ఆ సుదీర్ఘ కసరత్తు వల్ల ఒనగూడుతున్న ప్రయోజనం ఏమిటి? వాటికయ్యే ఖర్చు, సమయం వృథా అవడం తప్ప?!2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హామీ ఇచ్చి ఆరేళ్లు దాటింది. అందుకు అనుగుణంగానే వ్యవసాయ రంగంపై ‘నీతి ఆయోగ్’ ఓ కార్యాచరణ ప్రణాళికా పత్రాన్ని రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి అందించింది. కానీ, అది కూడా రైతాంగానికి చేసిన మేలేమీ లేదు. 2006లో డా‘‘ ఎం.ఎస్. స్వామినాథన్ కమిషన్ అందించిన సిఫార్సుల మేరకు ఉత్పత్తి వ్యయానికి 50 శాతం జోడించి కనీస మద్దతు ధరల్ని ప్రకటిస్తామని కేంద్ర ప్రభుత్వం ఒకవైపు నమ్మబలికి, మరో వైపు స్వామినాథన్ చెప్పిన íసీ2+ 50 శాతం ఫార్ములాను అనుసరించి ఎంఎస్పీ ఇస్తే నిత్యావసరాల ధరలు పెరిగి వినియోగదారుడి నడ్డి విరుగుతుందంటూ సుప్రీం కోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసి చేతులు దులుపుకొంది. అంతేకాదు... స్వామినాథన్ చెప్పిన సీ2+ 50 శాతం ఫార్ములాకు కొత్త భాష్యం చెప్పే దుస్సాహసం చేసింది కూడా! ఉదాహరణకు ఈ ఏడాది క్వింటాలు వరి ఉత్పత్తికి జాతీయ సగటు ఉత్పత్తి వ్యయం రూ. 3,135 అని రైతు సంఘాలు శాస్త్రీయంగా అంచనా వేశాయి. అయితే, తాజాగా కేంద్రం వరికి ప్రకటించిన ఎంఎస్పీ రూ. 2,369. అదేవిధంగా పత్తికి రూ. 16 వేల ధర ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం సీఏసీపీకి నివేదిస్తే... కేంద్రం పత్తికి ప్రకటించిన ధర రూ. 7,710కు పరిమితం అయింది. ఈ లెక్కలు అన్ని ప్రధాన పంటలకూ వర్తిస్తాయి.వ్యవసాయ రంగాన్ని మెరుగుపర్చే అవకాశాలు గతంలో కంటే ఇపుడు ఎక్కువగానే ఉన్నాయి. రైతాంగానికి సాగు ఖర్చును గణ నీయంగా తగ్గించి ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచే అవకాశాలు అనేకం అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సాగుకయ్యే వ్యయాన్ని; చీడ పీడలు, వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాల్ని గణనీయంగా తగ్గించవచ్చు. చాలా దేశాలు వ్యవసాయరంగంలో బయో టెక్నాలజీని సమర్థంగా వినియోగించి మంచి ఫలితాలు రాబడుతున్నాయి. వాతావరణ మార్పుల్ని ముందుగానే అంచనా వేసే సాంకేతిక పరి జ్ఞానాన్ని రైతులకు అందిస్తున్నారు. నీటికొరత, వర్షపు నీటి ముంపు, తెగుళ్లు వంటి వాటిని సమర్థంగా తట్టుకోగల వంగడాలను సృష్టిస్తున్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం, యాంత్రీ కరణ గణనీయంగా పెరిగింది. కృత్రిమ మేధ (ఏఐ), రోబోటిక్స్ను ఉపయోగించి ఏ నేల ఏ పంటలకు అనుకూలమో తెలుసుకొని అందుకు అనుగుణమైన పంటలు పండిస్తున్నారు.ఇక, ప్రధానంగా గిట్టుబాటు ధరలకు సంబంధించి... దళారీల ప్రమేయం లేకుండా మార్కెట్ యార్డులను సమర్థంగా నిర్వహిస్తు న్నారు. పంటల ఉత్పత్తి ధర కంటే మార్కెట్ యార్డులో ధర ఎక్కు వగా ఉన్నప్పుడే... దానిని అమ్మాలనే నిబంధన కచ్చితంగా అమలు చేస్తున్నారు. అలా జరగడం కోసం పంటకు గిట్టుబాటు ధరను కనీస రిజర్వు ధరగా చట్టపరంగా పరిగణిస్తున్నారు. అయితే, ఈ రిజర్వు ధర అన్నది ఒకేలా ఉండదు. దిగుబడిని బట్టి రిజర్వు ధర ఆధారపడి ఉంటుంది. చైనా, థాయ్లాండ్, జపాన్ వంటి దేశాలలో సహకార పద్ధతిలో రైతులు తమ ఉత్పత్తులను అమ్ముతున్నారు. దాని వల్ల మంచి ధరల కోసం వారు గట్టిగా బేరమాడగలుగుతున్నారు. ఆస్ట్రే లియా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో రైతుల తరఫున బేరసారాలు సాగించడానికి ప్రత్యేక డైరక్టర్ను అన్ని మార్కెట్ యార్డుల్లో నియ మిస్తున్నాయి. ఇటువంటి సదుపాయాలు, వెసులుబాట్ల కారణంగా రైతాంగానికి ఇంతకు ముందు లేని రక్షణ కలుగుతోంది. ఈ విధానా లన్నీ మన దేశంలో కూడా అమలు చేసినట్లయితే... రైతులకు మేలు జరుగుతుంది.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు, మాజీ కేంద్రమంత్రి -
తెలంగాణ రైతులకు గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రేపటి నుంచి రైతుల అకౌంట్లలో రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమ చేయనుంది. ఈ మేరకు మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఎకరాలతో సంబంధం లేకుండా రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లలో జమకానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం (జూన్16) 1,034 రైతు వేదికల్లో ‘రైతునేస్తం’కార్యక్రమం ప్రారంభమైంది. ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సీఎం రేవంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేదికపై తెలంగాణ రైతు భరోసా విధి విధానాల్ని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది -
తోతాపురి తిప్పలు!
కాణిపాకం: తోతాపురి మామిడి రైతులకు ముచ్చెమటలు పడుతున్నాయి. కాయల విక్రయానికి అవసరమైన టోకెన్ల కోసం పడరానిపాట్లు పడాల్సి వస్తోంది. కొన్ని ఫ్యాక్టరీలు కాయలు కొనలేమని చేతులెత్తేశాయి. మరికొన్ని ఫ్యాక్టరీలు అధికారుల ఒత్తిడిమీద కొనుగోలు చేస్తున్నాయి. ఈ తరుణంలో మామిడి వ్యాపారులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. కిలో రూ.4 అని పాట పాడుతున్నారు. ఫ్యాక్టరీలు రూ.5 నుంచి రూ.6 వరకు కొనుగోలు చేస్తున్నాయి. అయితే నగదు చెల్లింపులు ఆరు నెలల తర్వాతేనని తేల్చిచెబుతున్నాయి. దిగుబడి అధికమే కారణమా? చిత్తూరు జిల్లాలో మామిడి సాగు 56 వేల హెక్టార్లలో విస్తరించింది. ఇందులో తోతాపురి 39,895 హెక్టార్ల వరకు ఉండగా.. ఈ సారి 49,9274 టన్నుల వరకు దిగుబడి రావచ్చని అధికారులు అంచనా వేశారు. దిగుబడి ఆశాజనకంగానే వచ్చింది. దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో రైతులు సంబరపడిపోయారు. తీరా ధరలు పతనమవడంతో డీలాపడ్డారు. టేబుల్ రకాల ధరలు కూడా ఈ సారి ఆశాజనకంగా లేవు. తోతాపురి రూ.4 జిల్లాలోని ఫ్యాక్టరీ నిర్వాహకులు, వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ధరలు తగ్గించేస్తున్నారు. తోతాపురి కేజీ రూ.4కే కొనుగోలు చేస్తున్నారు. దీనిపై వరుసగా ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నా పట్టించుకోవడం లేదు. గుడిపాల మండలంలోని ఓ ఫ్యాక్టరీ తొలుత కేజీ రూ.5కే కొనుగోలు చేసింది. అధికారులు ఆ ఫ్యాక్టరీపై ఒత్తిడి తేవడంతో రూ.6కు ఫిక్స్ చేసింది. మిగిలిన ఫ్యాక్టరీలన్నీ అదేబాట పట్టాయి. దీనికితోడు తమిళనాడులోని క్రిష్ణగిరి నుంచి తోతాపురి కాయలను జిల్లాలోని ఫ్యాక్టరీలు అధికంగా దిగుమతి చేసుకుంటున్నాయి. అక్కడ కేజీ రూ.4కే కొనుగోలు చేసి రూ.5కు ఫ్యాక్టరీకి అన్లోడ్ చేస్తున్నాయి. ఆరు నెలల తర్వాతే బిల్లులు తమిళనాడు నుంచి దిగుమతవుతున్న కాయలకు మాత్రం ఫ్యాక్టరీలు అప్పటికప్పుడు నగదు చెల్లిస్తుండగా.. తెలిసిన వ్యాపారులకు వారం, నెల రోజుల వ్యవధిలో పేమెంట్ చేస్తామని చెబుతున్నాయి. జిల్లాలోని రైతులకు మాత్రం కాయలు తరలించిన ఆరు నెలల తర్వాతే బిల్లులు ఇస్తామని తేల్చిచెబుతున్నాయి. కూటమి వెన్నుపోటు మామిడికి గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం పది రోజుల క్రితమే ప్రకటించింది. ఆ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు గిట్టుబాటు ధర కల్పించిందని సంబరపడిపోయారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఫ్యాక్టరీలు కచ్చితంగా కొనాల్సిందేనని ఊదరగొట్టారు. కొనలేదంటే చర్యలతో పాటు సీజ్ చేస్తామని హెచ్చరికలు జారీచేశారు. అది కూడా కేజీ రూ.8కే కొనాలని, ప్రోత్సాహక నిధిగా కేజీకి రూ.4 చొప్పున ప్రభుత్వం ఇస్తుందని సంబరాలు చేసుకున్నారు. తీరా చూస్తే వారంలోనే గిట్టుబాటు ధర ఫల్టీ కొట్టింది. ప్రస్తుతం రూ.5, రూ.6కే కొనుగోలు చేస్తున్నారు. సిఫార్సులకే టోకన్లు తోతాపురి విక్రయానికి మామిడి రైతులు నానాఅగచాట్లు పడుతున్నారు. టోకన్ల కోసం ఫ్యాక్టరీల వద్ద పడిగావులు కాస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు టోకన్ కోసం నిరీక్షిస్తున్నారు. టోకన్లు జారీచేసే సమయానికి నీకా..నాకా అంటూ పోటీపడుతున్నారు. కొన్ని టోకన్లు మాత్రమే రైతులకు ఇచ్చినట్టే ఇచ్చి..మిగిలిన టోకన్లు అన్నీ కూడా సిఫార్సుల మేరకు వెళ్లిపోతున్నాయి.కూటమి నేతలు చెప్పిన వాళ్లకే టోకన్లను ఇచ్చుకుంటున్నారు. పూతలపట్టు, చిత్తూరు, గుడిపాల, తవణంపల్లి ప్రాంతాల్లో ఈ రకమైన సమస్యలు అధికంగా ఉన్నట్లు మామిడి రైతులు ఆరోపిస్తున్నారు. జీడీనెల్లూరు మండలంలోని ఓ ఫ్యాక్టరీ వద్ద శుక్రవారం టోకన్ల కోసం రైతులు గంటల కొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. అరుపులు, కేకలతో దద్దరిలింది. తోపులాటలు చోటు చేసుకున్నాయి. పోలీసులు సైతం వారిని అదుపు చేయలేకపోయారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెంనాయుడు చొరవ తీసుకుని తోతాపురి కేజీ రూ.8కే కొనుగోలు చేయించేయాల చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. దారుణం ఇంత దారుణం ఎప్పుడూ లేదు. మామిడి పంట బాగా వచ్చిందని అనుకుంటే ధరలు లేవు. ఫ్యాక్టరీ కాడికి వస్తే కొనేవాళ్లు లేరు. టోకన్లు ఉంటేనే కొనుక్కుంటున్నారు. ఈబాధాలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. – ఏజూస్, ఆవలకొండ, జీడీనెల్లూరు ఆరు నెలల తర్వాత బిల్లులా? కాయలు అమ్ముకోవడానికి టోకన్ల కోసం వచ్చాం. టోకన్లు తీసుకోవ డానికి నానా పాట్లు పడుతున్నాం. టోకన్లు ఇవ్వడానికి ముందే ఆరు నె లల తర్వాతే డబ్బులు ఇస్తామంటున్నారు. తోతాపురి రూ.8 అన్నారు. ఇప్పుడు రూ.6 అంటున్నారు. – బాబునాయుడు, రంగాపురం, జీడీనెల్లూరు -
రైతులను, ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం మీ దిగజారుడుతనం కాదా?: YS జగన్
-
రైతులను రౌడీలుగా చూపిస్తూ.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్
సాక్షి, గుంటూరు: ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనలో నిరసనల పేరిట ఉద్రిక్తతలకు కారణమైనవాళ్లను వదిలేసి.. అమాయక ప్రజలపై, రైతులపైనా కేసులు పెట్టడాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్రంగా ఖండించారు. రైతుల సమస్యను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు సర్కార్ చేయిస్తున్న మరో దుర్మార్గమని ఎక్స్లో మండిపడ్డారాయన. చంద్రబాబు గారూ.. పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే, వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి ప్రకాశం జిల్లా పొదిలి నేను వెళ్తే, ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా?. రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40 వేలమంది రైతులు, ప్రజలు తరలివస్తే, మేం వెళ్తున్న మార్గంలో మీరు 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి, వారిని ఉసిగొల్పి, రాళ్లు విసిరి గలాటా చేయించారు. కాని ప్రజలు, రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని అత్యంత సంయమనంతో వ్యవహరించారు. హింసను సృష్టించడానికి మీరు పంపిన ఆ 40 మంది చేసిన దుశ్చర్యలపైన.. అక్కడున్న 40 వేల మంది ప్రజలు, రైతులు ప్రతిస్పందించి ఉంటే ఏం జరిగి ఉండేది?. రైతుల సమస్యలపై గొంతెత్తితే దాన్ని డైవర్ట్ చేయడానికి మీరు ఇలా చేయించడం దుర్మార్గం కాదా?.. .. పైగా ఉల్టా రాళ్లు మీవాళ్లు విసిరితే, మీరు ఉసిగొల్పిన మీ కార్యకర్తలు గొడవలు చేసే ప్రయత్నం చేస్తే, అన్యాయంగా రైతులపై, ప్రజలపై కేసులు పెడతారా?. ఆ కార్యక్రమానికి వచ్చిన రైతులను, ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం మీ దిగజారుడుతనం కాదా చంద్రబాబు గారూ?. రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్టుగా…, రైతుల సమస్యలను పట్టించుకోకుండా, తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టడం మీకు మాత్రమే చెల్లుతుంది’’ అని వైఎస్ జగన్ తన పోస్టులో పేర్కొన్నారు..@ncbn గారూ పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే, వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి ప్రకాశం జిల్లా పొదిలి నేను వెళ్తే, ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా? రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40 వేలమంది…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 14, 2025 -
‘పీఎం కుసుమ్’లో దళారీలు!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం కుసుమ్) కింద ఒకటి, రెండు మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశం పొందిన రాష్ట్ర రైతులపై దళారీలు గద్దల్లా వాలుతున్నారు. ఈ పథకం లాభదాయకం కాదని.. సాంకేతిక పరిజ్ఞానం లేనందున గిట్టుబాటుకాక నష్టపోతారని ప్రచారంచేస్తూ ఒత్తిడి తెస్తున్నారు. ఎకరాకు లీజు కింద రూ. 33 వేలు చెల్లిస్తామని.. ఏటా దాన్ని 10 శాతం పెంచుతామని ప్రలోభాలకు గురిచేస్తూ అనుమతులను తమకు ఇచ్చేయాలని దళారులతోపాటు సౌర ఫలకాల తయారీ సంస్థలు నేరుగా రైతులకే ఫోన్లు చేస్తున్నాయి. అర్హత ఉన్న వారికి ఉద్యోగం కూడా కల్పిస్తామని నమ్మబలుకుతున్నాయి. 3 వేల మెగావాట్లు కాస్తా.. వాయు కాలుష్యానికి కారణమయ్యే డీజిల్ పంపుసెట్ల స్థానంలో సౌరశక్తితో నడిచే పంపుసెట్లను రైతులు ఉపయోగించేలా ప్రోత్సహించడంతోపాటు వారు అదనపు ఆదాయం పొందేందుకు 2 మెగావాట్ల వరకు సౌరవిద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసే ఉద్దేశంతో కేంద్రం పీఎం కుసుమ్ పథకాన్ని తీసుకొచ్చింది. సోలార్ పంపుసెట్లపై 30 శాతం నుంచి 50 శాతం వరకు రాయితీ కూడా అందిస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రంలో మొత్తం 3,000 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకోసం మెగావాట్కు దాదాపు రూ. లక్ష వరకు ఈఎండీ (ఎర్నెస్ట్ మనీ డిపాజిట్) చెల్లించాలని పేర్కొంది. 25 ఏళ్లపాటు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ను యూనిట్కు రూ. 3.13 చొప్పున కొనేలా ఒప్పందం (పీపీఏ) చేసుకుంటాయని వెల్లడించింది. ఇందుకోసం బ్యాంకులు రుణాలు కూడా మంజూరు చేస్తాయని వివరించింది. అయితే సొంత భూమి లేదా లీజుకు తీసుకున్న భూమి ఉంటేనే ఈ పథకం కింద రైతులు అర్హులని పేర్కొంది. దీంతో దాదాపు 6,000 మెగావాట్ల వరకు సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి దరఖాస్తులు వచ్చాయి. అయితే తాము నిర్దేశించిన గడువులోగా రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించలేదంటూ కేంద్రం 3,000 మెగావాట్ల పథకాన్ని కాస్తా 1,000 మెగావాట్లకు కుదించింది. రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో చివరకు ఈ పథకాన్ని 1,450 మెగావాట్లకు పెంచింది. రైతులు, రైతు బృందాలు, స్వయం సహాయక బృందాలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు, ప్రైవేటు వ్యక్తులు 6,000 మెగావాట్ల కోసం దరఖాస్తు చేసినా ఈఎండీ చెల్లించింది మాత్రం 1,600 మెగావాట్లకే కావడంతో ఈ ఏడాది 1,450 మెగావాట్లకు మాత్రమే అనుమతులిచ్చే అవకాశం ఉంది. 65 శాతం రైతుల నుంచే.. ప్రభుత్వానికి అందిన దరఖాస్తుల్లో సుమారు 65 శాతం రైతుల నుంచే వచ్చాయని విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఎక్కువ మంది రైతులు ఒకటి, ఒకటిన్నర మెగావాట్ కోసం దరఖాస్తు చేసుకోగా కొందరు రెండు మెగావాట్లకు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ప్రభుత్వం నుంచి లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పొందిన రైతుల వద్దకు దళారులు ప్రత్యక్షమవుతున్నారు. ఆయా రైతులు ఆది, సోమవారాల్లో దక్షిణ డిస్కంతో పీపీఏలు కుదుర్చుకోవడానికి రాగా అక్కడ కూడా వారిని ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారు. కొందరు ఉద్యోగులు కూడా దళారులకు వత్తాసు పలుకుతున్నట్లు సమాచారం. కాగా, విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పడానికి ఎక్కువగా మహబూబ్నగర్, నల్లగొండ జిల్లా నుంచి అధికంగా దరఖాస్తులు వచ్చినట్లు టీజీ రెడ్కో అధికారులు వివరించారు. ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు 70 నుంచి 80మంది రైతులతో పీపీఏలు కుదుర్చుకుంది. ఎస్పీడీసీఎల్ జూలై 7 వరకు పీపీఏ ప్రక్రియ కొనసాగుతుందని ఓ అధికారి వివరించారు. మెగావాట్కు ఏడాదికి 16 లక్షల యూనిట్ల విద్యుత్.. సోలార్ విద్యుత్ ప్లాంట్లో ఒక మెగావాట్కు ఏడాదికి 16 లక్షల యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతుందని అంచనా. సోలార్ ప్యానెల్స్ మేలు రకమైనవి అయితే ఇంకాస్త విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అధికార వర్గాల సమాచారం. పీపీఏలు చేసుకున్న తర్వాతే బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి మొగ్గుచూపుతున్నాయి. అయితే ఒక మెగావాట్కు మూడు కోట్ల వరకు వ్యయం అవుతుండగా బ్యాంకులు మాత్రం మెగావాట్కు రూ. 2 కోట్ల వరకు మాత్రమే రుణాలు ఇవ్వడానికి అంగీకరిస్తున్నాయని.. మిగిలిన నిధులకూ పూచీకత్తు ఇవ్వాలంటున్నారని ఔత్సాహిక రైతులు రఘురామ్, అర్జున్ వివరించారు. 25 ఏళ్ల వరకు పీపీఏలు ఉన్న నేపథ్యంలో మొదట్లో భారీగా ఆదాయం రాకపోయినా పదేళ్ల తరువాత నిర్వహణ వ్యయం పోనూ ఏటా రూ. 15–20 లక్షల వరకు ఆదాయం లభించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
బాబు కర్కశం.. రైతు ద్రోహి
-
చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఆంధ్రప్రదేశ్ రైతన్నలకు శాపంగా మారింది... పొగాకు రైతులను తక్షణమే ఆదుకోవాలి... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్
-
మోదీ ఇచ్చారు.. చంద్రబాబు ఎగ్గొట్టారు: వైఎస్ జగన్
సాక్షి, ప్రకాశం: రాష్ట్రంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నా పట్టించుకునే స్థితిలో కూటమి ప్రభుత్వం లేదని, చంద్రబాబు సీఎం కావడం రైతుల పాలిట శాపమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పొదిలి పొగాకు బోర్డును సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇవాళ రైతులు నానా అవస్థలు పడుతున్నారు. రైతులను పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం జిల్లాలో(పరుచూరు, కొండెపి) ఇటీవలే ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. మద్దతు ధర కంటే తక్కవకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. మా హయాంలో రైతు రాజ్యం నడిచింది. కానీ, కూటమి ప్రభుత్వంలో రైతు నష్టపోతున్నాడు. మా హయాంలో ఖరీఫ్ సీజన్లోనే పెట్టుబడి సాయం అందించాం. చంద్రబాబు వచ్చాక రైతు భరోసా సాయం లేదు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా మరో రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు అన్నారు. గతేడాది రైతు భరోసా రూ.20 ఎగ్గొట్టారు. మోదీ ఇచ్చారు.. చంద్రబాబు ఎగ్గొట్టారు మా హయాం.. రైతులకు స్వర్ణయుగంమా ప్రభుత్వంలో రైతుకు కనీస మద్దతు ధర ఇచ్చాం. ప్రతీ రైతుకు అదనంగా రూ.10 వేలు ఇచ్చేవాళ్లం. పారదర్శకంగా ఉచిత బీమా అందించాం. మా హయాంలో రైతుకు వెన్నెముకగా ఆర్బీకే(రైతు భరోసా కేంద్రాలు)లు నిలిచాయి. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. మార్కెట్లో పోటీ పెరిగి రైతుకు గిట్టుబాటు ధర వచ్చేది. కేంద్రం ప్రకటించిన పంటలకే కాకుండా.. రాష్ట్రం నుంచి అనేక పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చాం. ఏ పంటకైనా గిట్టుబాటు ధర లేకుంటే ఆర్బీకే ద్వారా ఇచ్చేవాళ్లం. ఐదెకరాల మిర్చి రైతులకు రూ.4లక్షల పరిహారం ఇచ్చిన ఘనత మాది. మా హయాంలో రైతులకు సువర్ణ యుగం. ఏ రకంగానూ రైతును నష్టపోనివ్వలేదు.కూటమి పాలనలో అధ్వానంకూటమి వచ్చాక ఉచిత బీమా ఎత్తేశారు. దళారీలు లేకుండా ఇప్పుడు పంట కొనే పరిస్థితి లేదు. ఈ క్రాప్ వ్యవస్థను నీరుగార్చారు. కూటమి వచ్చాక ఇన్పుట్ సబ్సీడీని గాలికొదిలేశారు. కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలతో నష్టపోతున్నారు. 2023-24లో కేజీ పొగాకు రూ.366కి అమ్ముడుపోయేది. ఇప్పుడు రూ.240 కూడా అమ్ముడుపోవడం లేదు. క్వింటా పొగాకు రూ.24 వేలు తగ్గకుండా రైతు అమ్ముకున్నాడు. 220 మిలియన్ టన్నులు ప్రొక్యూర్ చేయాల్సి ఉంటే.. కేవలం 40 మిలియన్ టన్నులే ప్రొక్యూర్ చేశారు. హైగ్రేడ్ పొగాకుకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర దక్కడం లేదు. పొగాకు బ్లాక్ బర్లీ రైతు ఎకరాకు రూ.80వేలు నష్టపోతున్నాడు. చంద్రబాబు సీఎం కావడం రైతులకు శాపం. మా హయాంలో మార్క్ఫెడ్ను రంగంలోకి దించాం. మార్క్ఫెడ్ రావడంతో మార్కెట్లో పోటీ పెరిగింది. మీరెందుకు ఆ పని చేయలేదు?. అసలు ప్రభుత్వం ఎందుకు మార్క్ఫెడ్ వేలంలో పాల్గొనలేదు. బాబు, దళారుల మధ్య సంబంధాలతో రైతులు నష్టపోతున్నారు. చంద్రబాబుకు జగన్ హెచ్చరికవ్యవసాయం దండగ అనే రీతిలో చంద్రబాబు పాలన కొనసాగుతోంది. పొగాకు వేసుకోమని చెప్పి రైతులను నట్టేట ముంచుతున్నారు. రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం జగన్ హెచ్చరికలు జారీ చేశారు. -
వైఎస్ జగన్ ను కలిసిన ఏలూరు కోకో రైతులు
-
‘జగన్ సర్.. ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు’
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం వచ్చాక తమను పట్టించుకోవడం లేదని, తాము పండించిన పంటలకు గిట్టుబాట ధర ఉండడం లేదని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కోకో, పామాయిల్, పొగాకు రైతులు వాపోతున్నారు. మంగళవారం వైఎస్సార్సీపీ(YSRCP) కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిని కలిసి తమ సమస్యలను వివరాలతో సహా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మేం పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా ప్రయోజనం లేకుండా పోయింది అని రైతులు వైఎస్ జగన్(YS Jagan) వద్ద వాపోయారు. అయితే ఎవరూ అధైర్యపడొద్దని, రైతులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన వాళ్లకు భరోసా ఇచ్చారు. అనంతరం రైతులు మీడియాతో మాట్లాడారు. నాకు నాలుగెకరాలు పామాయిల్ ఉంది, సీజన్ ప్రారంభం అయింది, గతంలో సీజన్ లేనప్పుడు పామాయిల్ టన్ను రూ. 21,400 ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం టన్ను రూ. 18,600 కు వచ్చింది, మాకు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయాయి, రైతులకు ఏం మిగలడం లేదు, ఇంకా రేటు తగ్గితే మేం పూర్తిగా నష్టపోతాం, దయచేసి ప్రభుత్వం కనీసం టన్నుకు రూ. 20,000 మద్దతు ధర అయినా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మేం మా సమస్యను వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చాం. ఆయన తప్పక మాకు అండగా ఉంటామన్నారు.::అన్నవరపు గణేష్, రైతు, రావికంపాడు, చింతలపూడి నియోజకవర్గం, ఏలూరు జిల్లామేం కోకో రైతులం. జగన్ను కలిసి మా సమస్యను వివరించాం, కోకోను ప్రైవేట్ కంపెనీలు గతంలో కేజీ రూ. 1,000 కి కొనుగోలు చేశాయి, కానీ ఇప్పుడు మాత్రం కేజీ రూ. 750 సీజన్ ప్రారంభంలో ఇచ్చి ఇప్పుడు రూ. 400 ఇస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం కేజీ రూ. 850 అమ్ముతుంటే ఇక్కడ మాత్రం సిండికేట్ అయి రూ. 300-400 మధ్య కొనుగోలు చేస్తున్నారు. పైగా టీడీపీ రైతుల(TDP Farmers) దగ్గరే కొంటున్నారు. మేం వైఎస్సార్సీపీ సానుభూతిపరులమని మా దగ్గర కొనడం లేదు. ఇవన్నీ జగన్ గారికి చెప్పాం. పైగా నిరుడు రేట్ పలికిందని ఈ ఏడు కౌలు రేట్లు కూడా పెంచడంతో మేం తీవ్రంగా నష్టపోతున్నాం. మా రైతులంతా ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, ఇలాగైతే మా రైతులు ఏమవ్వాలి, మా సమస్యలు విని వైఎస్సార్సీపీ రైతులకు అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసానిచ్చారు.::తాతా రవి, రైతు, బాదరాల గ్రామం, ఏలూరు జిల్లా -
కర్షకుల ‘సేవకు’ కత్తెర
సాక్షి, అమరావతి: కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది మొదలు, వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రజారంజక విధానాలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజారంజక పాలనపై ఆయన ముద్రను చెరిపేయడమే ఈ నిర్ణయాల వెనుక ఉన్న ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ జాబితాలో ఇప్పటికే సచివాలయాలు చేరగా, తాజాగా రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) వంతయ్యింది. క్రమబద్దీకరణ పేరిట కూటమి ప్రభుత్వం వీటిని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. హేతుబద్దీకరణ పేరుతో రెండు లేదా మూడు సచివాలయాలను కలిపి ఒక క్లస్టర్గా విలీనం చేశారు. తాజాగా వ్యవసాయ, సంబంధిత శాఖల హేతుబద్ధీకరణ సాకుతో రైతు సేవా కేంద్రాలను (ఆర్ఎస్కే), వీటిలో పనిచేస్తున్న సిబ్బందిని సగానికి పైగా కుదించేస్తున్నారు. దీంతో ఆర్ఎస్కేలు రైతు సేవలకు దూరం అయ్యే పరిస్థితి నెలకొంది. ‘ప్రజల ఇంటికే పాలనను తీసుకొస్తాం’ అని ఒక వైపు చెబుతున్న ప్రభుత్వం మరో వైపు ‘హేతుబద్దీకరణ’ పేరుతో ప్రజలకు, రైతులకు పలు సేవలను దూరం చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పేరు మార్పు నుంచి నిర్వీర్యం వరకూ.. ప్రజల ముంగిట పౌరసేవలు అందించాలన్న సంకల్పంతో జగన్ హయాంలోని ప్రభుత్వం ప్రతి రెండు వేల జనాభాకు ఒక సచివాలయం చొప్పున 10,965 సచివాలయాలను ఏర్పాటు చేసింది. వీటికి అనుబంధంగా రైతు సేవలకు 10,778 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు– ఇప్పటి ఆర్ఎస్కేలు) ఏర్పాటయ్యాయి. గ్రామ స్థాయిలో రైతులకు సేవలు, సంక్షేమ ఫలాలు అందించాలన్నది దీని ప్రధాన లక్ష్యం. ఆర్బీకేల సేవల విషయంలో ఉద్యోగ నియామకాల ప్రతిపాదన సంఖ్య 21,796కాగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశలవారీగా పట్టభద్రులైన 15,667 వ్యవసాయ (6,162), ఉద్యాన (2,303), పట్టు (377), మత్స్య (720), వెటర్నరీ (6,105) సహాయకులను నియమించింది. మిగిలిన వారిని నియమించేందుకూ అప్పట్లో కసరత్తు ప్రారంభించింది. సచివాలయాల పరిధిలోనే వీరి నియామకాలు జరిగినప్పటికీ, ఆర్బీకేలు కేంద్రంగా సేవలందించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు పేరు మార్పుసహా రైతు సేవా కేంద్రాల నిర్వీర్యమే లక్ష్యంగా పని చేస్తోంది. సచివాలయాల తరహాలోనే ఆర్ఎస్కే క్లస్టర్స్ కూటమి ప్రభుత్వ నిర్ణయంతో 10,965 సచివాలయాలు 5,678 క్లస్టర్స్గా (విలీనం) మారాయి. ఇదే తరహాలోనే 10,778 ఆర్ఎస్కేలను సగానికి సగం కుదించి క్లస్టర్స్గా మార్చడానికి కూటమి ప్రభుత్వం తాజాగా సన్నాహాలు చేస్తోంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన చేపడుతున్న ఈ ప్రక్రియలో సిబ్బందిని కూడా అదే పరిధిలో సర్దుబాటు చేస్తున్నారు. గతంలో స్థానికంగా సాగు విస్తీర్ణాన్ని బట్టి వీఏఏ (గ్రామ వ్యవసాయ సహాయకులు), వీహెచ్ఏ (గ్రామ ఉద్యాన సహాయకులు) వీఎస్ఏలు (గ్రామ పట్టు సహాయకులు) ఉండేవారు. కొన్ని చోట్ల వ్యవసాయ, ఉద్యాన సహాయకులు, మరికొన్ని చోట్ల గ్రామ పట్టు సçహాయకులు ఉండేవారు. తీర మండలాల్లోని ఆర్బీకేల్లో మత్స్య సహాయకులే ఇన్చార్జిలుగా ఉండేవారు. స్థానికంగా ఉండే పాడి సంపద ఆధారంగా దాదాపు మెజార్టీ ఆర్బీకేల్లో గ్రామ పశుసంవర్ధక సహాయకులు ఉండేవారు. ప్రభుత్వ తాజా ప్రతిపాదనల ప్రకారం, ఇక నుంచి సచివాలయ క్లస్టర్ ప్రాతిపదికన ఆర్ఎస్కే క్లస్టర్లో ఒకరు మాత్రమే ఉంటారు. వీఏఏ, వీహెచ్ఏ, వీఎస్ఏలలో ఎవరో ఒకరిని మాత్రమే ఉంచేలా సర్దుబాటు చేస్తున్నారు. మిగిలిన వారిని సచివాలయాల్లో ఇతర సేవలకు సర్దుబాటు చేస్తారు. రెండు వేల ఎకరాలకు ఒకరు.. కాగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రతి 2 వేల ఎకరాల విస్తీర్ణం ప్రాతిపదికన ఆర్ఎస్కేలను క్లస్టర్స్ పరిధిలోకి తీసుకొస్తోంది. స్థానికంగా వ్యవసాయ/ ఉద్యాన/పట్టు పంటల సాగు విస్తీర్ణం ఏవి ఎక్కువగా ఉంటే వాటి ఆధారంగా సహాయకులను నియమిస్తారు. అంటే ప్రతీ 2 వేల ఎకరాలకు ఒక ఆర్ఎస్కే ప్రతినిధి మాత్రమే ఉంటారన్నమాట. తక్కువ విస్తీర్ణం ఉన్న ఆర్ఎస్కేలను విలీనం చేస్తారు. విలీనం అనంతరం క్లస్టర్ కేంద్రంగానే కార్యకలాపాలు కొనసాగించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. మిగిలినవి ‘పేరుకు మాత్రం కేంద్రాలు’గా మిగలనున్నాయి. విస్తీర్ణం ఎక్కువగా ఉన్న క్లస్టర్స్కు అవసరం మేరకు ఏఈవో, ఎంపీఈవోలను అదనంగా కేటాయిస్తారు. వ్యవసాయ, ఉద్యాన, పట్టు విస్తరణ అధికారులుగా పదోన్నతులు కల్పించిన ఆర్ఎస్కే అసిస్టెంట్స్ను కూడా ఈ సర్దుబాటు పరిధిలోకి తీసుకురావడం గమనార్హం. రేషనలైజేషన్ ప్రక్రియ ఓ కొలిక్కి తీసుకువచ్చి ఆ మేరకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. దీనికి సంబం«ధించి త్వరలో ఉత్తర్వులు రానున్నాయి. -
‘కట్టలు’ తెగిన కష్టం
ఊరు కళతప్పింది.. ఊరు పక్కనే నిండుగా చెరువు ఉండేది. అది తెగడంతో చుక్కనీరు లేదు. రెండు పంటలు అయినా, ఇంకా మరమ్మతులు చేయలేదు. పంటలు లేక రైతులు, చేతి పనివారు ఊరు విడిచి వలస వెళుతున్నారు. ఇళ్లకు తాళాలు వేసి ఉండటంతో సందడే లేదు. చెరువు తెగడంతో ఊరు కళ తప్పింది. – కడారి ఐలయ్య, రావిరాల, మహబూబాబాద్ జిల్లాసాక్షిప్రతినిధి, ఖమ్మం: వర్షాకాలం వచ్చేసింది. నైరుతి మేఘ ఘర్జన రాష్ట్రమంతా ప్రతిధ్వనిస్తోంది. తెలంగాణలో వర్షాలు దంచికొడితే, వాగులు, వంకల్లోని నీటి నంతా ఒడిసిపట్టేది చెరువులు, కుంటలే. కానీ, చాలా చోట్ల ఈ చిన్ననీటి వనరులు ఇప్పుడు నీటిని నింపుకోలేని పరిస్థితిలో ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్, అక్టోబర్లో కురిసిన వర్షాలు, వరదల కారణంగా వేల సంఖ్యలో చెరువులు దెబ్బతిన్నాయి. గండ్లు పడటంతోపాటు తూములు కొట్టుకుపోయాయి. కొన్నిచోట్ల చెరువుల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేసినా పనుల్లో పురోగతి లేదు. మరికొన్ని చెరువులు దీనస్థితిలో ఉన్నాయి. దీంతో ఈ చెరువులకు మరమ్మతులు ఎప్పుడు పూర్తిచేస్తారోనని ఆయకట్టు రైతులు ప్రభుత్వ అధికారులవైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. సీజన్ మొదలైనా.. ఆదివారం మృగశిర కార్తె ప్రారంభమవుతోంది. దీంతో రైతులు వ్యవసాయ పనులు ముమ్మరం చేస్తారు. కానీ, కట్టలు తెగిన, తూములు దెబ్బతిన్న చెరువుల మరమ్మతులకు నిధులు మంజూరైనా పనులు ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికే కట్టలు తెగిన అనేక చెరువుల్లోకి వస్తున్న నీటిని లాక్లు ఎత్తి కిందకు వదులుతున్నారు. చెరువుల ఆయకట్టు పరిధిలో సాగు ప్రారంభమై.. వర్షాలు కురిసిన సమయంలో లాక్లు ఎత్తితే రైతులు తీవ్రంగా నష్టపోతారు. లాకులు ఎత్తకపోయినా నీరు బయటకు వచ్చే ప్రమాదం ఉంది. దీంతో చెరువుల కింద వేలాది ఎకరాల భూమి బీడుగా మారే ప్రమాదం కనిపిస్తోంది. వివిధ జిల్లాల్లోని చెరువుల పరిస్థితి ఇదీ.. ⇒ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 146 చెరువులకు కట్టలు తెగడంతోపాటు తూములు దెబ్బతిన్నాయి. ఖమ్మం జిల్లాలో 11 చెరువులకు రూ.9.55 లక్షలతో తాత్కాలిక మరమ్మతులు పూర్తి చేశారు. రూ.48.61 కోట్లతో 45 చెరువులకు మరమ్మతులు చేశారు. 42 చోట్ల పనులు జరుగుతున్నాయి. 17 చోట్ల పనులకు ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ⇒ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 28 చెరువులకు గండ్లు పడగా.. 25 చెరువులకు గండ్లు పూడ్చారు. అశ్వారావుపేట మండలంలో 16 వేల ఎకరాల ఆయకట్టు ఉన్న పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గండి పడగా రూ.3 కోట్లతో తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. కోతకు గురైన కట్టను మాత్రం వదిలేశారు. ఈ పెద్దవాగు తెలంగాణ, ఏపీ మధ్య ఉండటంతో వివాదం నెలకొంది. రీ డిజైన్ కోసం రూ.19 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. అయితే ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలను ఇంకా ఆమోదించలేదు. దీంతో రీడిజైన్కు మోక్షం లభించలేదు. ⇒ ఖమ్మం జిల్లా చింతకాని మండలం తిమ్మినేనిపాలెంలోని గచ్చుబంధం చెరువు కట్ట గత సెప్టెంబర్ వరదలకు తెగింది. దీంతో మూడు గ్రామాల్లోని 228 ఎకరాల ఆయకట్టుకు కొంత నష్టం వాటిల్లింది. మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.9 లక్షలు విడుదల చేయగా, ఇరిగేషన్ అధికారులు నేటికీ పనులు చేపట్టలేదు. చెరువులో నీటిని నిల్వ ఉంచే పరిస్థితి లేకపోవడంతో లాకులు ఎత్తి బయటకు పంపుతున్నారు. చెరువు కట్టకు మరమ్మతులు చేయకపోతే ఆయకట్టు పరిధిలోని తమ భూములను బీళ్లుగా వదిలేయాల్సిందేనని రైతులు వాపోతున్నారు. ⇒ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో ఎంపిక చేసిన 25 చెరువుల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదన పంపారు. ఇప్పటివరకు నయా పైసా నిధులు మంజూరు కాలేదు. మోర్తాడు మండల కేంద్రంలోని ముసలమ్మ చెరువు, కమ్మర్పల్లిలోని పల్లె చెరువు తూముల మరమ్మతు అత్యవసరంగా చేపట్టాల్సి ఉంది. అందుకోసం రూ.50 లక్షల వరకు అవసరమని అంచనా. ⇒ యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని కుర్రారం ఊర చెరువు మత్తడి వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయింది. ఇప్పటివరకు తాత్కాలిక మరమ్మతులే చేపట్టారు. 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు నిండితే ఆయకట్టు ప్రాంతంలోని 10 గ్రామాల్లో 5 వేల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. ⇒ మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామం చెరువు 152 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువు కింద 650 ఎకరాలు నేరుగా, మరో 500 ఎకరాలు బోర్లు, బావుల ద్వారా సాగవుతుంది. గత ఏడాది వచ్చిన వరదలకు చెరువు తెగిపోయింది. ఇప్పుడు సాగు చేద్దామంటే నీళ్లు లేవు. దీంతో రైతులు, కూలీలతోపాటు చేతి వృత్తుల వారు వందకుపైగా కుటుంబాలు వలస వెళ్లాయి. నీళ్లు వస్తే కానీ ఊరికి రాలేమని చెబుతున్నారు. ఈ చెరువు మరమ్మతుల కోసం రూ.1.43 కోట్లు అవసరమని అంచనా వేయగా, ఇప్పుడు రూ.53 లక్షల మాత్రమే మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. తగ్గనున్న భూగర్భ జలాలు.. చెరువుల్లో నీరు పుష్కలంగా ఉంటే భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. ప్రస్తుతం చెరువులు దెబ్బతినడంతో వాటిలో నీరు నిల్వలేదు. దీంతో భూగర్భ జలాలు కూడా పడిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. చెరువులకు సకాలంలో మరమ్మతులు పూర్తి చేయకపోవడంతో తమ భూములు సాగుచేసుకోలేకపోతున్నామని చెబుతున్నారు. చెరువుల్లో నీరు లేకపోవటంతో మత్స్యకారులు కూడా ఉపాధి కోల్పోయారు. కుటుంబాలకు కుటుంబాలే వలస వెళ్లారుమా ఊళ్లో 121 ముదిరాజు, 40 గంగపుత్రుల కుటుంబాలు చెరువునే నమ్ముకొని జీవిస్తున్నాయి. పోయిన వానాకాలం చెరువు తెగడంతో పనులు లేక, ఇక్కడ ఉండి పస్తులు పడలేక హైదరాబాద్ వెళ్లి అడ్డా పనులు చేస్తున్నారు. చెరువు గండ్లు తొందరగా పూడిస్తేనే మా కష్టాలు పోతాయి. – డేగల యాకయ్య, మత్స్యకారుడు, రాజుల కొత్తపల్లి, మహబూబాబాద్ జిల్లా -
ఈ నిధితో ధరల స్థిరీకరణ ఎలా సాధ్యమవుతుంది?
ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సీజన్ మొదలైంది. సేద్యానికి కావా ల్సిన సాగు నీరు, నాణ్యమైన విత్తనాల లేమి, పంట రుణాలు – గిట్టుబాటు ధరలు అందక పోవడం, ప్రకృతి సృష్టించే పంట నష్టాలు వంటి సమస్యలు మళ్లీ రైతాంగం కోసం సిద్ధంగా కాచుకొని ఉన్నాయి.తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చి, జూన్ నాటికి ఏడాది అవుతోంది. ఈ కాలమంతా కూటమి ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలనే అమలు జరిపింది. రైతాంగానికి ప్రధానంగా కావాల్సింది సాగు నీరు. ప్రస్తుతం ఏ ఆయ కట్టూ చివరి భూమి వరకూ నీరందించే పరిస్థితి లేక రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. రూ. 100 నుంచి రూ. 200 కోట్ల ఖర్చుతో పూర్తి అయ్యే పథకాలు ఉన్నాయి. వెలిగొండ, హంద్రీ – నీవా, వంశధార, నాగావళి; గుంటూరు ఛానల్ పొడిగింపు, ఇంకా చిన్న, మధ్య తరహా నీటి పథకాలు ఇటువంటివే. వీటిని పూర్తి చేయలేదు. హంద్రీ–నీవా, గాలేరు–నగరి వంటి ప్రాజెక్టుల ప్రధాన కాల్వల్లో నీరు ప్రవహిస్తున్నా, పిల్ల కాలువల నిర్మాణం లేక రైతుల పొలాలకు నీరు చేరటం లేదు. అతి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే వీటిని 2014 నుంచి 2019 వరకు పరిపాలించిన చంద్రబాబు చేపట్టలేదు. కారణం పంట కాల్వలు తవ్వరాదు అన్న ప్రపంచ బ్యాంకు షరతు. ఆ భూముల్లో ఆరు తడి పంటలు, ఉద్యానవన పంటలు పండిస్తూ, నీటిని విదేశీ కంపెనీలకు మళ్ళించాలన్నదే ప్రపంచ బ్యాంకు ఉద్దేశం. దీనికి అనుగుణంగానే ఆ నాటి టీడీపీ ప్రభుత్వం 2015 ఫిబ్రవరిలో జీఓ 22 తెచ్చింది. వెయ్యి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ఉన్నా వీటిని ప్రభుత్వాలు పట్టించుకోక పోవటం వల్ల మూతపడుతున్నాయి. వరదల వల్ల దెబ్బతిన్న సాగునీరు ప్రాజెక్టుల మరమ్మత్తూ సరిగా పూర్తికాలేదు. పోలవరం ప్రాజెక్టు ప్రారంభించి ఇరవై ఏళ్లు గడిచినా ఇంకా పూర్తి కాలేదు. ప్రాజెక్టు కింద వేలాది ఎకరాలు కోల్పోయిన ఆదివాసులకు, గిరిజనేతరులకు ఈ నాటికీ నష్ట పరిహారం అందలేదు. రైతులుగా బతికిన వారు కూలీలుగా వలసలు పోతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి లొంగిపోయిన టీడీపీ నాయకత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించటానికి అంగీకరించింది. ఫలితంగా అదనపు సాగు నీరు సాధ్యం కాదు.చిన్న, సన్నకారు రైతులు పంట పెట్టుబడి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. సంస్థాగత రుణాలు 40% మించి అందటం లేదు. పావలా వడ్డీకే పంట రుణాల పథకం అత్యధిక రైతులకు అందటం లేదు. గత వైసీపీ ప్రభుత్వం పంట ఖర్చుల కోసం ముందస్తు పెట్టుబడి పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాన్ని కలుపుకొని ప్రతి సంవత్సరం 13,500 రూపాయలను మూడు విడతలుగా రైతులకు ఇవ్వటం జరిగింది. 2024 ఎన్నికల్లో కూటమి పార్టీలు ప్రతి సంవత్సరం 20 వేలు ఇస్తామని ప్రకటించాయి. అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినా రైతు భరోసా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి రైతుకు ఇవ్వలేదు. పంటల బీమా పథకానికి ఇన్సూ్యరెన్స్ కంపెనీలకు చెల్లించాల్సిన వాటాను కూటమి ప్రభుత్వం చెల్లించక పోవటం వలన రైతాంగం పంట నష్ట పరిహారం పొందలేని పరిస్థితి ఏర్పడింది.కౌలు రైతులు కౌలు భారాలను భరిస్తూ పంటలు పండించినా న్యాయమైన మద్దతు ధరలు లభించక నష్టపోతున్నారు. వారికి ‘అన్నదాతా సుఖీభవ’, పంట నష్ట పరిహారాలు, పంటల బీమా పరిహారం, సంస్థా గత రుణాలు అందటం లేదు. తాము అధికారంలోకి వస్తే పంట ముందస్తు పెట్టుబడి కౌలు రైతులకు కూడా అందిస్తామని కూటమి పార్టీలు ప్రకటించాయి. నేడు చంద్రబాబు ప్రభుత్వం ‘అన్నదాతా సుఖీభవ’ పథకం కౌలు రైతులకు వర్తించదని ప్రకటించి, కౌలు రైతులను వంచించింది. తాము అధికారంలోకి వస్తే పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేస్తామని, అందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని కూటమి పార్టీలు చెప్పాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ధరల స్థిరీకరణ నిధికి 300 కోట్లు మాత్రమే కూటమి ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధితో ధరల స్థిరీకరణ ఎలా సాధ్యమవుతుంది? రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పినా ఆచరణలో అమలు జరగలేదు.చదవండి: ప్రజలే సమాధానం చెబుతారు చంద్రబాబు సంపదలు సృష్టించటం అబద్ధం. రాష్ట్ర సంపదలను, భూములను మాత్రం దేశ, విదేశీ బడా సంస్థలకు కట్టబెట్టడం వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వా లేవీ రైతాంగ సమస్యలు పరిష్కరించే విధానాలు అమలు జరపలేదు. కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించదు. ఈ వాస్తవాన్ని రైతాంగం గ్రహించి తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలి.- బొల్లిముంత సాంబశివరావు రైతు కూలీ సంఘం (ఆం.ప్ర) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు -
వేషం మార్చి.. మోసం గుట్టు విప్పి..
సాక్షి, ఆదిలాబాద్: బ్యాంకుల్లో పంటరుణాలు ఇప్పించేందుకు కమీషన్ వసూలు చేస్తున్న దళారుల దందాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు తెలివిగా బట్టబయలు చేశారు. కమీషన్ దందాపై ఫిర్యాదులు రావటంతో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు పలు బ్యాంకుల వద్దకు పోలీస్ ఉన్నతాధికారులే రైతుల వేషంలో వెళ్లి ఆరా తీశారు. రుణాల కోసం వచ్చిన రైతులతో మాట కలిపి దళారుల దోపిడీ గురించి వివరాలు సేకరించారు. రుణాన్ని బట్టి కమీషన్: వ్యవసాయ సీజన్లో ఏటా రైతులకు బ్యాంకులు పంట రుణం ఇస్తుంటాయి. తర్వాతి పంట సీజన్లో పాత అప్పునకు సంబంధించి వడ్డీతో సహా చెల్లిస్తే కొత్త రుణాన్ని కొంత పెంచి ఇస్తాయి. ఇక్కడే దళారులు రంగప్రవేశం చేశారు. రైతులు తీసుకున్న రుణాలను వారే వడ్డీతో సహా బ్యాంకులో చెల్లించి, తిరిగి రైతులకు అధిక రుణం వచ్చేలా చేస్తున్నారు. ఆ వచ్చే రుణం నుంచి తాము కట్టిన రుణం మొత్తంతోపాటు అదనంగా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు కమీషన్ తీసుకుంటున్నారు.ఈ అంశంపై ఫిర్యాదులు రావటంతో పోలీసులు బుధవారం రైతుల వేషంలో బ్యాంకుల వద్దకు వెళ్లి సమాచారం సేకరించారు. గుడిహత్నూర్, ఉట్నూర్, నార్నూర్, బేల, భీంపూర్, మావల, ఇంద్రవెల్లి మండలాల్లో ఇలాంటి దళారులు 34 మందిపై ఆయా పోలీసుస్టేషన్లలో బీఎన్ఎస్ సెక్షన్ 318 కింద చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
భగ్గుమన్న పొగాకు రైతు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) : నల్లబర్లీ పొగాకును వారంలోగా జీపీఐ నుంచి కొనకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మయ్య హెచ్చరించారు. గుంటూరు విద్యానగర్లోని జీపీఐ పొగాకు రాష్ట్ర కార్యాలయం వద్ద గురువారం నల్లబర్లీ, తెల్లబర్లీ పొగాకు రైతులతో కలిసి రైతు సంఘం నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ పొగాకు కొనకుండా రైతులను మోసం చేస్తున్న ప్రైవేట్ సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బర్లీ పొగాకు వేయాలని ప్రోత్సహించిన జీపీఐ సంస్థతోపాటు ఇతర పొగాకు కంపెనీలు ఇప్పుడు ముఖం చాటేశాయని ధ్వజమెత్తారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ జీపీఐ సంస్థ రైతుల నుంచి పది లక్షల టన్నుల తెల్లబర్లీ పొగాకు కొంటామని, బాండ్లు ఇచ్చి ఇప్పటి వరకు సగం కూడా కొనలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కె.వి.ప్రసాద్, కొల్లా రాజమోహన్, చుండూరు రంగారావు, కంచుమాటి అజయ్కుమార్, రాధాకృష్ణ, వేల్పూరు నరసింహారావు, పచ్చల శివాజీ, ఉల్లిగడ్డ నాగేశ్వరరావు, రామారావు, జగన్నాథరావు, హనుమరెడ్డి, వేణుగోపాలరావు, నళినికాంత్ పాల్గొన్నారు.ధర ఇంత అధ్వానమా?» ఒంగోలు, కనిగిరిలో పొగాకు వేలాన్ని అడ్డుకున్న రైతులు » పనిగట్టుకుని ధర తగ్గించారంటూ నిరసన » ఆందోళనను అడ్డుకున్న టీడీపీ మద్దతుదారులు » వ్యాపారులకు వత్తాసు పలికిన పొగాకు బోర్డు అధికారులు ఒంగోలు సబర్బన్/కనిగిరి రూరల్ : ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో గురువారం రైతులు పొగాకు వేలాన్ని అడ్డుకున్నారు. త్రోవగుంటలోని పొగాకు వేలం కేంద్రం–2లో వ్యాపారుల తీరును నిరసిస్తూ బేళ్లను అమ్మేందుకు రైతులు నిరాకరించారు. ఎఫ్–3 రకం పొగాకును రూ.18,500కు కూడా కొనుగోలు చేయక పోవటంతో ఆందోళనకు దిగారు. దీంతో వేలం కేంద్రానికి వచి్చన ఉలిచి, దశరాజుపల్లె గ్రామాలకు చెందిన టీడీపీ మద్దతుదారులైన కొందరు వేలం జరగాల్సిందేనని వాగ్వాదానికి దిగారు. వేలం కేంద్రంలో కొంతసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది.గిట్టుబాటు ధర కోసం మిగతా రైతులు పోరాటం చేస్తుంటే.. టీడీపీకి చెందిన కొందరు రైతుల పేరుతో దాన్ని అడ్డుకోవటాన్ని ఒంగోలు మండలంలోని రైతులు తీవ్రంగా ఖండించారు. గిట్టుబాటు ధర వస్తే రైతులంతా బాగు పడతారని, అందుకోసం పోరాటం చేయాల్సిందిపోయి.. ఇలా అడ్డుకోవడం తగదని మండిపడ్డారు. వేలం కేంద్రం అధికారిణి తులసి టీడీపీ వర్గీయులకు మద్దతుగా మాట్లాడటంతో రైతులు ఆమె తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఏకంగా 186 బేళ్లను రిజెక్ట్ చేయడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వేలం ఇదే విధంగా కొనసాగితే వేలం కేంద్రాలకు పొగాకు బేళ్లు తీసుకు రావటం మానుకుంటామని చెప్పారు. ఇదే అన్యాయం ఇంకా కొనసాగితే పొగాకు బేళ్లను తగలేస్తామన్నారు. కనిగిరిలోనూ ఆగిన వేలం ప్రకాశం జిల్లాలోని కనిగిరి పొగాకు వేలం కేంద్రంలో కూడా గురువారం వేలం ఆగిపోయింది. బయ్యర్లు, కంపెనీల ప్రతినిధులు ఎక్కువ శాతం బేళ్లను తిరస్కరించడంతో ఆందోళన చెందిన రైతులు కొద్దిసేపు పొగాకు వేలాన్ని ఆపేశారు. దీంతో వేలం నిర్వహణ అధికారి కోటేశ్వరరావు జోక్యం చేసుకుని రైతులు, కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. వారం రోజులుగా పొగాకు బేళ్ల తిరస్కరణలు తీవ్ర స్థాయిలో కొనసాగుతుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పొగాకు రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. కనిగిరి కేంద్రంలో గురువారం 164 బేళ్లను తిరస్కరించారు. -
ఉల్లి ధర పతనం.. రైతన్న స్థితి దైన్యం
సాక్షి,బళ్లారి: ఏడాది నుంచి ఉల్లి ధరలు రోజురోజుకు తగ్గిపోతుండటంతో ఉల్లి పంటను సాగు చేసిన రైతులు కన్నీరు కారుస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పని చేసి పంట చేతికందిన తర్వాత, దళారుల చేతుల్లో ధర నిర్ణయం కావడంతో రైతులు ఎవరికి తమ గోడు చెప్పుకోవాలో అర్థం కాక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఉల్లి గడ్డల ధరలు కిలోకు రూ.15 నుంచి రూ.20 వరకు పలుకుతుండగా, రైతుకు కనీసం కిలోకు రూ.10లు కూడా దక్కకపోతే ఆ రైతుకు పెట్టుబడి కాదు కదా కనీసం కూలి కూడా దక్కని పరిస్థితి ఏర్పడుతోంది. పంట చేతికందిన తర్వాత మార్కెట్కు తీసుకెళ్లిన ఉల్లిని సాగు చేసిన రైతుకు మార్కెట్లో ఉన్నఫళంగా క్వింటాల్ ధర రూ.250లు పలకడంతో ఒక కిలో కేవలం రూ.2.50 మాత్రమే పలుకుతుండటంతో రైతు ఏం చేయాలో పాలు పోక, మార్కెట్ మాయజాలం చూసి భరించలేక సదరు రైతు వినూత్నంగా నిరసన తెలియజేస్తూ ప్రభుత్వాలను దుమ్మెత్తిపోస్తూ, దళారుల మోసాన్ని ఎండగడుతూ తాను కష్టపడి పండించిన పంటను నడిరోడ్డుపై పారబోశారు.రోడ్డుపై పారబోసి రైతన్న పొర్లుదండాలువందకు పైగా ఉల్లిగడ్డల సంచులను రోడ్డుపై పారబోసి వాటిపైన దొర్లుతూ తమ ఆవేదన వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. ఈ ఘటన మంగళవారం విజయపుర నగరంలో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. విజయపుర జిల్లా కొల్హార తాలూకా రోణిహాళ గ్రామానికి చెందిన నందప్ప గుడ్డద మల్లికార్జున గూలగుండ అనే రైతు తాను పండించిన ఉల్లిగడ్డలను విజయపురకు తీసుకురాగా అమాంతంగా క్వింటాల్కు రూ.250లు ధర మాత్రమే పలకడంతో రైతు కన్నీరు పెట్టుకున్నారు. తాను పండించిన పంటను పారవేస్తాను లేదా దానం చేస్తాను కాని క్వింటాల్కు రూ.250లు అమ్మబోనని చెబుతూ వాటిని అందరూ చూస్తుండగా, మార్కెట్ పక్కనే ఉన్న జాతీయ రహదారిపై పారవేసి వినూత్న తరహాలో నిరసన వ్యక్తం చేయడం అందరిని కలిచివేసింది. ఏడాది నుంచి ఉల్లిగడ్డల ధరలు రోజురోజుకు తగ్గిపోతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టి పంట చేతికందిన తర్వాత ధరలు పడిపోతే తాము ఎవరికి చెప్పుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు.గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలిఉల్లిగడ్డల ధర కిలో రూ.70 దాటితే వెంటనే ప్రభుత్వం ఏపీఎంసీల్లో తక్కువ ధరలకు ఉల్లిగడ్డలు విక్రయిస్తుందని, అదే ఉల్లిగడ్డల ధరలు పడిపోతే ప్రభుత్వం రైతుల నుంచి ఎందుకు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయకూడదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇది ఒక్క విజయపుర జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉల్లిగడ్డలు సాగు చేసిన రైతులందరూ ఽఉల్లిధరలు పడిపోవడంతో పెట్టుబడి కూడా దక్కక అప్పుల పాలవుతూ కన్నీరు పెడుతున్నారు. బహిరంగ మార్కెట్లో వినియోగదారులు కొంటున్న ధరలకు, రైతులకు మార్కెట్లో పలుకుతున్న ధరలకు కూడా చాలా వ్యత్యాసం ఉండటంతో రైతులకు మరింత నష్టాలు వస్తున్నాయి. ఉల్లిగడ్డల ధరలు పడిపోయినప్పుడు వినియోగదారుల గురించి ఆలోచించడం సరైందేనని, అయితే అదే సందర్భంలో ఉల్లిగడ్డల ధరలు పడిపోయినప్పుడు కూడా వాటిని పండించిన ఉల్లి రైతుల దయనీయ పరిస్థితులను కూడా పాలకులు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఉల్లిగడ్డలు సాగు చేసిన రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. -
ఆలూ ద బెస్ట్
ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో వందలాది కోట్ల గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజానీకానికి దైనందిన ప్రధానాహారంలో వరి, గోధుమ తర్వాత మూడో స్థానం బంగాళదుంపలదే. 66% ప్రపంచ ప్రజలు దైనందిన ఆహారంలో బంగాళదుంపలు తింటున్నారు. 2023లో 38.3 కోట్ల టన్నులు బంగాళదుంపలు పండాయి. ప్రపంచ జనాభాకు ఆహార భద్రత కల్పిస్తున్న బంగాళదుంప ప్రాధాన్యాన్ని చాటిచెప్పటానికి 2008లో అంతర్జాతీయ బంగాళదుంపల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి నిర్వహించింది. 2024 నుంచి మే 30న అంతర్జాతీయ బంగాళదుంప దినోత్సవాన్ని సైతం నిర్వహిస్తోంది. ‘చరిత్రను నిర్మించటం, భవిష్యత్తును పోషించటం’ ఇదీ ఈ ఏడాది నినాదం.పెరులోని ఆండీస్ ప్రాంతంలో విరాజిల్లిన పురాతన ‘ఇంకా నాగరికత’కు పూచిన పుష్పంగా బంగాళదుంపలను చెబుతారు. పెరు నుంచి 16వ శతాబ్దంలో యూరప్ దేశాలకు ఈ పంట చేరింది. ఎటువంటి వాతావరణానికి ఇట్టే అలవాటైపోవటం వంటి సుగుణాల వల్ల 5 శతాబ్దాల్లోనే ప్రపంచం అంతా వ్యాపించింది. ⇒ వేల రకాల బంగాళదుంపల్లో దేని రంగు, సైజు, రుచి, పోషక విలువలు దానికే ప్రత్యేకంగా ఉంటాయి. అందువల్ల ఇదొక ముఖ్యమైన ఆహార పదార్థంగా మాత్రమే కాదు వంటింటి సృజనాత్మక సంస్కృతికి మూలాధారం అని కూడా అర్థమవుతుందని ఐరాసకు చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఓ) చెబుతోంది.⇒ ఆహారపు అలవాట్లు మారిపోతున్న నేపథ్యంలో తాజా బంగాళదుంపలను వండుకు తినే వారి సంఖ్య తగ్గుతున్నట్లు అంచనా. అదేసమయంలో, అతిగా ప్రాసెస్ చేసిన పొటాటో చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటివి తినటం మాత్రం ఎక్కువైందట. ఫలితంగా అనేక రకాల పోషకాహార లోపాలు తలెత్తుతున్నాయి. ఈ ట్రెండ్ మన దేశంలోనే కాదు ప్రపంచదేశాలన్నిటిలోనూ ఇంతేనని ఎఫ్ఎఓ తాజా నివేదిక చెబుతోంది. ⇒ బంగాళదుంపల్లో సమృద్ధిగా పోషకాలు ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలతో పాటు బంగాళదుంపలో 80% నీరు, 15.7% పిండిపదార్ధాలు, 1.8% మాంసకృత్తులు, 1.7% పీచుపదార్థం, 0.1% కొవ్వు ఉంటాయి. ⇒ విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది స్కర్వీ జబ్బును నివారించడంలో సహాయపడుతుంది.⇒ పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎలక్ట్రోలైట్. మన గుండె, కండరాలు, నాడీ వ్యవస్థల సరైన పనితీరుకు దోహదం చేస్తుంది. ⇒ బంగాళాదుంప పైపొరలో పీచు పదార్థం ఉంటుంది. మానవ జీర్ణవ్యవస్థలో ఆహారం జీర్ణం కావడానికి ఇది అవసరం. ⇒ దేహ రక్షణకు సహజ మూలకాలైన యాంటీఆక్సిడెంట్లు దోహదం చేస్తాయి. బంగాళదుంపల్లో ఇవి పుష్కలంగా ఉన్నాయి. గుండె ఆరోగ్యానికి దన్నుగా నిలవటం ద్వారా ఆరోగ్యదాయకమైన కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించటంలో యాంటీఆక్సిడెంట్లు తోడ్పడతాయి. ⇒ బంగాళదుంపలోని పోషక విలువ దాని రకం, వాతావరణం, నేల, సాగు పద్ధతులు, నిల్వ పరిస్థితులు, ప్రాసెసింగ్, తయారీ, వంట పద్ధతిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ⇒ బంగాళదుంపలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం కాగలిగినవైప్పటికీ ఇవి అందరికీ సరిపడవు. ఎందుకని అంటే..? ఎంత తింటాం? ఎలా ప్రాసెస్ చేస్తాం? ఎలా వండుతాం? విలువ ఆధారిత ఆహారోత్పత్తుల్ని ఎలా తయారు చేస్తాం? వంటి అంశాలతో పాటు ఏ ఇతర ఆహార పదార్థాలతో కలిపినప్పుడు ఎంత సమతుల్యతను పాటిస్తాం అన్నదానిపై ఆధారపడి బంగాళదుంప బాగోగులు ఆధారపడి ఉంటాయని ఎఫ్ఎఓ తెలిపింది. ఏ రకం బంగాళదుంపల్లో ఏయే పోషక విలువలు ఎంతెంత?(ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఓ) సమాచారం ప్రకారం.. 100 గ్రామాలు పచ్చి బంగాళదుంపలో గత పోషక విలువలు)బంగాళదుంపలు.. అంకెలు.. వాస్తవాలు..⇒ ప్రపంచవ్యాప్తంగా వందలాది కోట్ల గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజానీకానికి దైనందిన ప్రధానాహారంలో వరి, గోధుమ తర్వాత మూడో స్థానం బంగాళదుంపలదే. ⇒ ఇవి 5 వేల రకాలు ఉన్నాయి. బంగాళదుంపల జీవవైవిధ్యం ప్రపంచ ఆహార భద్రతకు ఒక పట్టుకొమ్మగా నిలిచింది. చిన్న, సన్నకారు రైతులకు ఇదొక ముఖ్యమైన ఆహార పంటగా మారిపోయింది. ⇒ బంగాళదుంపలకు పుట్టిల్లు పెరులోని ఆండీస్ పర్వత ప్రాంతాలు. పెరులోని కస్కో దగ్గర పోటాటో పార్క్ ఉంది. దీని విస్తర్ణం 12 వేల హెక్టార్లు. వైవిధ్యంతో కూడిన పురాతన బంగాళదుంప వంగడాల జన్యువనరులను, సంప్రదాయ విజ్ఞానాన్ని ఆదివాసులు అనాదిగా పరిరక్షిస్తున్నది ఈ ప్రాంతంలోనే. ⇒ ఆండీస్ ప్రాంతంలో విరాజిల్లిన పురాతన ‘ఇంకా నాగరికత’కు పూచిన పుష్పంగా బంగాళదుంపలను చెబుతారు. ⇒ పెరు నుంచి 16వ శతాబ్దంలో యూరప్ దేశాలకు, అక్కడి నుంచి ప్రపంచానికి వ్యాపించింది బంగాళదుంప పంట. కేవలం 5 శతాబ్దాల్లో వేగంగా విస్తరించింది. ⇒ ఐర్లాండులో 1840వ దశకంలో బంగాళదుంప పంట చీడపీడలతో తుడిచిపెట్టుకుపోవటంతో క్షామం సంబవించింది. అక్కడ ఈ పంట వంగడాల్లో వైవిధ్యతను నిలుపుకోకపోవటమే ఇందుకు కారణం. ⇒ బంగాళదుంపలు మనకు గోధుమ రంగులో ఉండేవే తెలుసు. కానీ, ఎన్నెన్నో రంగుల్లో ఉంటాయి. విభిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో, విభిన్న సాగు పద్ధతుల్లో, భూతాపాన్ని తట్టుకుంటూ మనగలుగుతున్న అతి ముఖ్యమైన ఆహార పంట ఇది. మారుతున్న పరిస్థితులకు తగినవిధంగా మార్పుచెందే క్రమంలో ప్రతి బంగాళదుంప వంగడానికి ప్రత్యేకమైన గుణాలు ప్రకృతిసిద్ధంగా చేకూరాయి. ⇒ 2000–2020 మధ్యకాలంలో బంగాళదుంపల సాగు విస్తీర్ణం 17% తగ్గినప్పటికీ ఉత్పత్తి 11 శాతం పెరిగింది. తక్కువ చోటులో ఎక్కువ దిగుబడి సాధించటంలో మెరుగైన వంగడాలు, సాగు పద్ధతుల్లో వచ్చిన మార్పులు దోహదం చేస్తున్నాయి.⇒ ప్రపంచవ్యాప్తంగా బంగాళదుంప వంగడాల సంరక్షణ, విత్తటం, కోత, విక్రయం తదితర ప్రక్రియల్లో గ్రామీణ మహిళలు కీలకపాత్రపోషిస్తున్నారు. ఈ పొలాల్లో మహిళల శ్రమే అధికం.బంగాళదుంపలతో ఆహారేతర ప్రయోజనాలు⇒ బంగాళదుంపలను ఆహారంగానే కాకుండా.. ఔషధతయారీ, వస్త్రోత్పత్తి, ప్లైవుడ్, పేపర్ పరిశ్రమల్లోనూ రకరకాల ప్రయోజనాల కోసం వాడుతున్నారు.⇒ బంగాళదుంప పై పొరను ఫ్యూయల్–గ్రేడ్ ఇథనాల్ ఉత్పత్తిలో వాడుతున్నారు.⇒ 100% ప్రకృతిలో కలిసిపోయే ప్లాస్టిక్ల తయారీలోనూ బంగాళదుంపలు ఉపయోగపడతాయి.⇒ గోజాతి పశువులు, పందులు వంటి పశువులకు దాణాగా బంగాళ దుంపలను పెడుతున్నారు.⇒ 8,000 ఏళ్ల క్రితం బంగాళదుంపలను తొలిసారి పెరులో సాగు చేయటం మొదలుపెట్టారు.⇒ 5.000 రకాలకు పైగా బంగాళదుంపల వంగడాలు ఉన్నాయి⇒159 దేశాల్లో బంగాళదుంపలను పండిస్తున్నారుఅతి ముఖ్యమైన పంటబంగాళదుంపల సాగు: ∙వేర్వేరు వ్యవసాయ వాతావరణ ప్రాంతాల్లో, నేలల్లో సాగు అవుతుంది. ⇒ సముద్రతలం నుంచి 4,700 మీటర్ల ఎత్తు వరకు భూముల్లో సాగవుతుంది.⇒ చిన్న, సన్నకారు రైతులకు ఆధారపడదగిన ఆదాయాన్ని అందిస్తుంది బంగాళదుంప పంట.⇒ సుసంపన్నమైన జన్యువైవిధ్యం వల్ల బంగాళదుంప వంగడాలు చీడపీడలను దీటుగా తట్టుకోగలుగుతుంది.⇒ బంగాళదుంపలను కోట్లాది మంది ప్రజలు దైనందిన ప్రధాన ఆహారంగా తింటున్నారు.ప్రపంచవ్యాప్తంగా 2022లో 37.5 కోట్ల టన్నుల బంగాళదుంపలను రైతులు పండించారు.⇒ చైనా 95.5 (టన్నులు)⇒ భారత్ 56.2⇒ ఉక్రెయిన్ 20.9⇒ రష్యా సమాఖ్య 18.9⇒ అమెరికా 17.8⇒ జర్మనీ 10.7⇒ బంగ్లాదేశ్ 10.1⇒ ఫ్రాన్స్ 8.0⇒ పాకిస్తాన్ 7.9⇒ నెదర్లాండ్స్ 6.9 ఆలూపై అపోహలు వద్దుఎవరైనా తీసుకునే ఆహారం వారి వయసు, రోజువారీగా వారి శారీరక శ్రమపై ఆధారపడి ఉండాలి. ఏదైనా మితంగా తీసుకోవాలి. బంగాళదుంప వాతం అంటూ ఉంటారు. కానీ, నిజానికి ఇది అపోహే. బంగాళదుంపలో ఎక్కువగా పిండిపదార్థాలు ఉన్నాయి. దీనితో పాటు కలిపి తీసుకునే ఇతర ఆహార పదార్థాలు మాంసకృత్తులు కలిగినవై ఉండాలి. ఉత్తరాదిలో ఏ కూర చూసినా ఆలు లేకుండా ఉండదు. అయితే, ఆలుతో పాటు కాబోలి శనగలు కూడా కలిపి వండుతారు. మన ఆహారంలో సాధారణంగా మాంసకృత్తులు లోపిస్తున్న విషయం తెలిసిందే కదా.పెద్దవాళ్లు రోజూ ఆలు తిని కూర్చుంటే పిండిపదార్థాలు ఎక్కువై నొప్పుల సమస్య వస్తుంది. పెద్దవాళ్లకు జీర్ణశక్తి తగ్గటం కూడా ఈ సమస్యకు ఒక కారణం. అదే పిల్లలైతే శారీరక కదలికలు ఎక్కువ కాబట్టి వారికి ఆ సమస్య రాదు. ఎవరైనా, తగుమాత్రంగా, సమతులాహారంలో భాగంగా తీసుకున్నప్పుడు ఏ సమస్యా ఉండదు. లేదంటే ఊబకాయానికి దారితీస్తుంది. నూనెలో డీప్ ఫ్రై చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ తినటం చిన్నా పెద్దా ఎవరికీ ఆరోగ్యకరం కాదు. – ఆచార్య విజయ ఖాదర్, విశ్రాంత డీన్, ఫ్యాకల్టీ ఆఫ్ హోం సైన్స్, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం -
మా బాధలు మీకేం తెలుసు?.. మంత్రి కందుల దుర్గేష్ను నిలదీసిన రైతులు
సాక్షి,తూర్పుగోదావరి జిల్లా: మంత్రి కందుల దుర్గేష్కు నిరసన సెగ తగిలింది. ఉండ్రాజవరం మండలం సత్యవాడ గ్రామంలో మంత్రి కందుల దుర్గేష్పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలరోజులైనా ధాన్యం డబ్బులు జమ కావట్లేదనీ ప్రశ్నించారు. గిట్టుబాటు ధర కూడా దక్కడం లేదని.. ధాన్యానికి ఈ దుస్థితి ఎప్పుడూ లేదని ఉండ్రాజవరం రైతులు నిలదీశారు.ధాన్యం సొమ్ము ఎప్పుడు జమ చేస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపించిన అన్నదాతలు.. మిల్లర్లు 1,600మాత్రమే చెల్లిస్తామని చెబుతున్నారని మద్దతు ధర రూ.1,720 ప్రభుత్వమే ఇప్పించాలని డిమాండ్ చేశారు.ఉడ్రాజవరం, పెరవలి మండలాల రైతులకు ధాన్యం సొమ్ము రూ. 22 కోట్లు రావాల్సి ఉందని, దీనిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. రైతుల వద్ద ఉన్న ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేస్తామని సీఎం చంద్రబాబు నుంచి మంత్రుల వరకూ చెప్పారని, కానీ అది ఆచరణలో అమలు కావడం లేదని మండిపడ్డారు. -
కూటమి ప్రభుత్వంలో అన్నదాతల ఆర్తనాదాలు
-
వరికి బదులు ఆయిల్పామ్ను ప్రోత్సహించండి
సూర్యాపేట: రాష్ట్రంలో రైతులు వరికి బదులు ఆయిల్పామ్ సాగు చేసేలా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రోత్సహించాలని, దీనివల్ల రైతులు తాలు, తరుగు పేరుతో ఎలాంటి ఇబ్బందులు పడరని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయం, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతిపై శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్లో మంత్రులు ఉత్తమ్కుమారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలతో కలసి నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లాస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ తోటలు పెంచేందుకు అవకాశం ఉందన్నారు. అందులో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో అత్యధికంగా ఆయిల్పామ్ సాగుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఇక్కడ ఆయిపామ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని చెప్పారు. కృష్ణాజలాలను పూర్తిగా వాడుకునేందుకు ఎస్ఎల్బీసీ టన్నెల్ను పూర్తి చేస్తామని తెలిపారు. వివిధ పథకాల అమలులో ప్రజాప్రతినిధుల సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని, సంక్షేమానికి సంబంధించి శాసనసభ్యుల మాటే చివరి మాటగా పాటించాలని అధికారులకు సూచించారు. బ్యాంకర్లు సిబిల్ స్కోర్లు అడగొద్దు: మంత్రి ఉత్తమ్ రాజీవ్ యువ వికాసం పథకం లబి్ధదారులను బ్యాంకర్లు సిబిల్ స్కోర్ అడగవద్దని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు. ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు ఆయకట్టు ప్లాన్ సంసిద్ధం చేసి ముందే ప్రకటిస్తామని, ఎస్సారెస్పీలో ఒండ్రు మట్టి తొలగింపు ప్రక్రియ మొదలైందని, రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల్లోనూ ఇదేవిధంగా చేపట్టి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా, ధాన్యం సేకరణలో ముందున్నామని, గత సంవత్సరంతో పోలిస్తే 20 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా కొన్నామని ఉత్తమ్ తెలిపారు. ప్రజలు సంబురంగా ఉన్నారు: మంత్రి కోమటిరెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ సన్నబియ్యం పథకంతో ప్రజలు సంబురంగా ఉన్నారన్నారు. రాజీవ్ యువ వికాసం పథకంతో నిరుద్యోగులకు స్వయం ఉపాధి దొరుకుతుందని తెలిపారు. ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి, నల్లగొండ కలెక్టర్లు తేజస్ నంద్లాల్ పవార్, హనుమంతరావు, ఇలా తిపాఠి, సూర్యాపేట ఎస్పీ నరసింహ, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, జయవీర్రెడ్డి, మందుల సామేల్, ఎమ్మెల్సీలు శంకర్నాయక్, నెల్లికంటి సత్యం పాల్గొన్నారు. -
వరి నుంచి ఇతర పంటలకు మారతారా?
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం వరి రైతుకు షాక్ ఇస్తూ.. ఇతర పంటలు సాగు చేసే రైతులకు బాసటగా నిలిచింది. వరి ధాన్యానికి మినహా ఇతర అన్ని ప్రధాన పంటలకు ఎమ్మెస్పీ భారీగా పెంచింది. దీంతో రైతులు ఆయా ఇతర పంటలకు మారే అవకాశం ఉందని వ్యవసాయ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారీగా పెరిగిన మద్దతు ధర నేపథ్యంలో ఈసారి పత్తి సాగు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.పెరిగిన నీటి వనరులతో కరీంనగర్, నిజామాబాద్, మెదక్ , నల్లగొండ జిల్లాల్లో గతంలో పత్తి సాగు చేసిన రైతులు కూడా వరికి మారిపోగా, ఎంఎస్పీ పెంపుతో మరింత అధికంగా పత్తి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని వ్యవసాయ శాఖలోని ఓ కీలక అధికారి ‘సాక్షి’కి చెప్పారు. అలాగే మద్దతు ధర బాగా పెరిగిన ఇతర పంటల సాగు కూడా పెరిగే చాన్స్ ఉందని అన్నారు. వరికి రూ.69తోనే సరి 2025–26 మార్కెటింగ్ సీజన్లో వానాకాలం (ఖరీఫ్) సీజన్కు సంబంధించి పలు కీలక పంటల ఎమ్మెస్పీ పెంచుతూ బుధవారం కేంద్ర కేబినెట్నిర్ణయం తీసుకుంది. వరి మద్దతు ధరను కేవలం రూ.69 పెంచిన కేంద్రం, పత్తి ఎమ్మెస్పీని ఏకంగా రూ.589 పెంచింది. తాజా పెంపుతో క్వింటాల్ ఏ–గ్రేడ్ వరి ధాన్యం మద్దతు ధర రూ.2,320 నుంచి రూ.2,389కి పెరిగింది. దేశంలోనే వరిసాగులో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుత యాసంగి సీజన్లో ఇప్పటివరకు 64 ఎల్ఎంటీల ధాన్యాన్ని రైతులు విక్రయించారు. ఎకరం పొలంలో 25 క్వింటాళ్ల వరి ధాన్యం దిగుబడి వస్తుందనుకుంటే.. పెరిగిన మద్ధతు ధరతో ఎకరం భూమిలో పంట వేసిన రైతుకు రూ.1,725 అదనంగా సమకూరనుంది. ఇక ఇప్పటివరకు క్వింటాల్కు రూ.7,521గా ఉన్న పొడుగు (లాంగ్ స్టేపిల్–పొడుగు పింజ) పత్తి ఎమ్మెస్పీ రూ.589 పెంపుతో రూ.8,110కి చేరింది. మీడియం స్టేపిల్ ధర రూ.7,121 నుంచి రూ.7,710కి చేరింది. రాష్ట్రంలో గత వానాకాలం సీజన్లో 43 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా, సుమారు 28 ఎల్ఎంటీల దిగుబడి వచి్చంది. ఈసారి 50 లక్షల ఎకరాల్లో సాగుకు ప్రణాళిక సిద్ధం చేయగా..తాజాగా పెరిగిన ఎమ్మెస్పీతో ఈసారి పత్తి సాగు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. తృణ ధాన్యాలు, నూనె గింజెలకు కూడా.. పత్తితో పాటు నూనె గింజెలు, పప్పులు, తృణ ధాన్యాలకు మద్దతు ధరను కూడా కేంద్రం భారీగా పెంచింది. ముఖ్యంగా నైజర్ సీడ్ (వెర్రి నువ్వులు) క్వింటాల్కు రూ.820, రాగి రూ.596, నువ్వులు రూ.579, వేరుశనగ రూ.480 చొప్పున పెంచింది. ఆదిలాబాద్ జిల్లాలో అధికంగా సాగయ్యే సోయాబీన్కు రూ.436 పెంచింది. అలాగే మొక్కజొన్న రూ.328, పొద్దుతిరుగుడు రూ.441, పప్పు ధాన్యాలలో కందిపప్పు రూ.450, పెసరపప్పు రూ.86, మినపపప్పు రూ.400 పెంచింది. వరి సాగు తగ్గింపే లక్ష్యమా? పప్పు ధాన్యాలు, నూనె గింజలు, పోషక తృణధాన్యాలను కాకుండా ఇతర పంటల సాగును బాగా ప్రోత్సహిస్తున్నామని, ఆ పంటలకు అధిక ఎమ్మెస్పీని అందిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది. వరి సాగును తగ్గించి ఇతర పంటలను పెంచాలని కేంద్రం భావిస్తున్నట్టు దీన్నిబట్టి అర్థమవుతోంది. కేంద్రం నిర్ణయంతో రాష్ట్రంలో మొక్కజొన్న, కంది, మినుము, రాగులు, జొన్న, వేరుశనగ, సోయాబీన్, నువ్వుల పంటలతో పాటు తృణధాన్యాల పంటలకు ఈసారి డిమాండ్ రావచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. -
నకిలీ సీడ్.. అమ్మకాలు స్పీడ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నకిలీ పత్తి విత్తనాల దందా యథేచ్ఛగా సాగుతోంది. మాయమాటలతో రైతులను కొందరు వ్యాపారులు నిండా ముంచుతున్నారు. నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం టాస్్కఫోర్స్ ఏర్పాటుచేసి, అక్కడక్కడా అరెస్టులు చేస్తున్నప్పటికీ.. మోసాలు ఆగడం లేదు. ఓ వైపు నిషేధిత బీజీ–3 (బోల్గార్డ్–3) విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తూ.. దిగుబడి ఇవ్వటంలేదని తిరస్కరించిన విత్తనాలను లూజ్గా రైతులకు అంటగడుతున్నారు. నిషేధిత బీజీ–3 విత్తన కంపెనీలతోపాటు కొందరు దళారులు జిల్లాల్లో ఏజెంట్లను నియమించుకొని నకిలీ విత్తనాల దందా సాగిస్తున్నారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ముందుగానే ప్రవేశిస్తున్న నేపథ్యంలో రైతులు పత్తి సాగుకు సిద్ధమవుతున్నారు. ఇదే అదనుగా దళారులు నిషేధిత బీజీ–3, లూజ్ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నారు. ఆదిలాబాద్, పాలమూరు జిల్లాలే తొలి టార్గెట్.. రాష్ట్రంలో వానకాలం సీజన్లో అత్యధికంగా పత్తి సాగు చేసేది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో. ఇక్కడ వానకాలం సీజన్లో 11 లక్షల ఎకరాల వరకు పత్తి సాగవుతుంది. 5 లక్షల ఎకరాలు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో పత్తి సాగయ్యే ఉమ్మడి జిల్లాల్లో మహబూబ్నగర్, నల్లగొండ, మెదక్, వరంగల్ ఉన్నాయి. సీజన్ ప్రారంభానికి ముందే దళారులు ఈ జిల్లాలపై దృష్టి పెట్టారు. ఇప్పటివరకు ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోనే సుమారు 5 టన్నుల నకిలీ విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. నాలుగు రోజుల క్రితం కాగజ్నగర్లో రూ.60 లక్షల విలువైన 20 క్వింటాళ్ల బీజీ–3 విత్తనాలను పోలీసులు సీజ్ చేశారు. కొద్ది రోజుల క్రితం కర్ణాటక నుంచి మంచిర్యాల వెళ్తున్న రూ.98.75 లక్షల విలువైన 3,750 కిలోల (3.7 టన్నులు) విత్తనాలను పట్టుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్కర్నూలు, గద్వాలలో కూడా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న దళారులు పోలీసులకు చిక్కారు. నిషేధం మాటున దర్జాగా విక్రయాలు దేశంలో బీజీ–1, బీజీ–2 హైబ్రిడ్ విత్తనాలను మాత్రమే రైతులు సాగుచేయాలనే ఆంక్షలు ఉన్నాయి. భూసారం తీవ్రంగా దెబ్బ తినడంతోపాటు, వాతావరణ కాలుష్యానికి కారణమవుతుందన్న శాస్త్రవేత్తల సూచనల మేరకు దేశంలో బీజీ–3 రకాలను నిషేధించారు. అయితే వీటిని అక్రమంగా ఉత్పత్తి చేస్తున్న కొన్ని సంస్థలు.. ఏజెంట్ల ద్వారా నేరుగా రైతులకు సరఫరా చేస్తున్నాయి. బీజీ–2 సాగుచేస్తే విత్తనం నాటిన 60 రోజుల తర్వాత దోమ పోటు ఉంటుందని, బీజీ–3 అయితే పంట దిగుబడి పూర్తయ్యేంతవరకు దోమపోటు, తెగుళ్ల తాకిడి ఉండదని, దిగుబడి సైతం బీజీ–2 కంటే 30 శాతం ఎక్కువగా వస్తుందని రైతులను నమ్మిస్తున్నారు. దీంతో రైతులు వీటివైపు ఆకర్శితులవుతున్నారు. అనేక చోట్ల రైతులు బీజీ–2తో కలిపి బీజీ–3 విత్తనాలను సాగుచేస్తున్నారు. జీబీ–3 సాగును అధికారులు నియంత్రించలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. బీజీ–2 హైబ్రిడ్ విత్తన పాకెట్ ధర రూ.901 బీజీ–2 పత్తి విత్తన ప్యాకెట్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. గత సంవత్సరం 475 గ్రాముల ప్యాకెట్ ధర రూ.864 ఉండగా, తాజాగా రూ. 37 పెంచి రూ. 901గా నిర్ణయించింది. ఏ కంపెనీకి చెందిన హైబ్రిడ్ విత్తన ప్యాకెట్ అయినా రూ.901లకే రైతుకు విక్రయించాలి. ఈ నేపథ్యంలో లాభాల కోసం డీలర్లు దళారుల ద్వారా అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాల పేరుతో నిషేధిత బీజీ–3 లూజ్ విత్తనాలను కిలోకు రూ.2 వేల నుంచి రూ.3 వేలకు విక్రయిస్తున్నారు. అదే సమయంలో తగిన దిగుబడి సామర్థ్యం లేవని పక్కన బెట్టిన విత్తనాలను తీసుకొచ్చి బీజీ–3 విత్తనాలతో కలిపి విక్రయిస్తున్నట్లు పోలీసుల దాడుల్లో తేలింది. నాణ్యమైన బీజీ–2 విత్తనాలే నాటాలి: వ్యవసాయ శాఖ రాష్ట్రంలో ఈసారి 50 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందుకోసం 45 వేల క్వింటాళ్ల బీజీ–2 హైబ్రిడ్ విత్తనాలు అవసరం. అయితే, ఈ సీజన్లో రాష్ట్రంలోని అన్ని పత్తి విత్తన కంపెనీల వద్ద కలిపి 1,34,268 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ తెలిపింది. -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
-
ఇసుక దోపిడీ సహించం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో జిల్లా కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలి. మరింత ప్రో యాక్టివ్గా (చురుగ్గా) ఉండాలి. ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక దోపిడీ జరగకుండా చూడాలి. లబ్ధిదారులకు టోకెన్ జారీ చేసి ఉచితంగా సరఫరా చేయాలి. ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చేసిన మంచి పనిని చెప్పుకోకపోవడం వల్లే చిన్న సంఘటనలు కూడా విస్తృత ప్రచారంలోకి వస్తున్నాయి. అనారోగ్యంతో రైతు చనిపోతే ధాన్యం కొనుగోలులో జాప్యం వల్లనే అని దుష్ప్రచారం జరుగుతోంది. కలెక్టర్లు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వివరాలను వెల్లడించాలి. వైఫల్యాలు ఉంటే సరిదిద్దుకోవాలి. కొన్ని రాజకీయ ప్రేరేపిత సంఘటనలూ జరుగుతున్నాయి. తప్పుడు ప్రచారం చేస్తే వివరణ ఇవ్వండి. చిన్న చిన్న సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరించండి..’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. మంగళవారం సీఎంవో నుంచి ధాన్యం కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, వ్యవసాయ శాఖ తదితర అంశాలపై.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీఎస్ కె.రామకృష్ణారావులతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. పరిహారం ప్రతిపాదనలు పంపండి ‘పౌరసరఫరాల శాఖ గతసారి కంటే దాదాపు 22 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్ఎంటీ) అధికంగా ధాన్యాన్ని, అదీ తక్కువ సమయంలోనే కొనుగోలు చేయడం అభినందనీయం. 10.50 లక్షల మంది రైతుల దగ్గర్నుంచి 64 ఎల్ఎంటీలకు పైగా ధాన్యం కొనుగోలు చేశాం. గతంలో ఎన్నడూ లేని విధంగా కొనుగోలు చేయడమే కాకుండా రైతులకు 48 గంటల్లో చెల్లింపులు పూర్తి చేశాం. ఇప్పటివరకు రూ.12,184 కోట్లు చెల్లించాం. 90 శాతానికి పైగా రైతులు ధాన్యాన్ని విక్రయించి సంతోషంగా ఉన్నప్పటికీ, రాష్ట్రానికి రుతుపవనాలు ముందే రావడంతో కల్లాల వద్ద ధాన్యం తడిసిపోయి కొంతమంది రైతులు ఇబ్బందుల్లో ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేల పరిహారం అందించేందుకు ప్రతిపాదనలు పంపాలి. రైస్ మిల్లులను నిరంతరం పర్యవేక్షించాలి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం మెరుగ్గా పనిచేస్తున్నప్పటికీ అసత్య ప్రచారాలు బలంగా జరుగుతున్నాయి. వీటిని తిప్పికోట్టాలి. జిల్లాల్లో వచ్చే ప్రభుత్వ వ్యతిరేక వార్తలకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఉంది. గత 3 సంవత్సరాల ధాన్యం కొనుగోలు వివరాలను కలెక్టర్లు వెల్లడించాలి. రైస్ మిల్లులను నిరంతరం పర్యవేక్షించాలి. రైతులకు అన్యాయం చేయాలని మిల్లర్లు చూస్తే వెంటనే చర్యలు తీసుకోవాలి..’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. జూన్ 1 నాటికి నివేదిక ఇవ్వాలి ‘వర్షాలు ముందే వచ్చినందున వ్యవసాయ శాఖ ప్రణాళికలలో మార్పులు చేసుకోవాలి. రైతులకు అవసరమైన విత్తనాలు, యూరియా అందుబాటులో ఉంచాలి. విత్తనాల, ఎరువులు అక్రమ నిల్వలు ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలి. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి. జిల్లా కలెక్టర్లు, ఇన్చార్జి మంత్రులు ఈ నెల 29, 30 తేదీలలో క్షేత్రస్థాయిలో వానాకాలం సాగు ఏర్పాట్లు పర్యవేక్షించాలి. నకిలీ విత్తనాలు, ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతిపై నివేదిక తయారు చేసి జూన్ 1 నాటికి సమర్పిచాలి. జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలు జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలి..’ అని రేవంత్ ఆదేశించారు పేదలకు చుట్టంలా భూ భారతి చట్టం ‘గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి వ్యవస్థ ప్రజలను భూతంలా పీడిస్తే, భూ భారతి చట్టం పేదలకు చుట్టంలా పని చేస్తుంది. భూ భారతి చట్టం కోసం తొలుత 4 మండలాలనే పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసుకున్నాం. తర్వాత ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలట్గా ఎంపిక చేసుకుని రెవెన్యూ సదస్సులు నిర్వహించాం. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన భూ సమస్యల దరఖాస్తులను పరిష్కరించాలి. పైలట్ మండలాల్లో వచ్చిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మిగిలిన ప్రాంతాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి. జూన్ 3 నుంచి జూన్ 20 వరకు భూ భారతి సదస్సులు అన్ని మండలాల్లో నిర్వహించాలి. ఈ సదస్సుల్లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడంతో పాటు భూ భారతి చట్టంపై అవగాహన కల్పించాలి..’ అని ముఖ్యమంత్రి సూచించారు. ధరల నియంత్రణ కమిటీలు నియమించండి ‘ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుతో ప్రభుత్వ పనితీరు ఏంటో తెలుస్తుంది. కలెక్టర్లు ఈ కీలకమైన పథకం అమలు పర్యవేక్షించాలి. మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలను నియమించాలి. మేస్త్రీ చార్జీలు, నిర్మాణ పరికరాల ధరలపై నియంత్రణ ఉండాలి. అడ్డుగోలు ధరలతో పేదలను మోసం చేయకుండా జాగ్రత్త వహించాలి. మహిళా సంఘాలు, రాజీవ్ యువ వికాసం ద్వారా ఇటుక, సెంట్రింగ్ యూనిట్ల తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. తక్కువ ధరతో నాణ్యమైన ఇళ్లు నిర్మించేందుకు సాంకేతికంగా అనేక కొత్త పద్ధతులు వచ్చాయి. వీటిని లబ్ధిదారులకు తెలియజేయాలి. మండల కేంద్రాల్లో నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులు పరిశీలించేలా కార్యక్రమాలు రూపొందించాలి..’ అని రేవంత్ చెప్పారు. సీజనల్ వ్యాధులతో జాగ్రత్త ‘ఈసారి 15 రోజుల ముందే రుతుపవనాలు వచ్చాయి. ముందుగా వచ్చే వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు, జ్వరాలు ప్రబలే ప్రమాదముంది. వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా ఏజెన్సీ ఏరియాలు, అటవీ ప్రాంతాలున్న జిల్లాల కలెక్టర్లు ప్రజారోగ్యంపై దృష్టి సారించాలి. పొరుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు కూడా నమోదవుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ సీజన్కు అనుగుణంగా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి..’ అని సీఎం ఆదేశించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని చెప్పారు. ముందస్తు సాగు జరిగేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. -
పొగాకు రైతుపై ఎందుకీ పగ!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పొగాకు రైతులను చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. గత నాలుగేళ్లు లాభాల బాటలో ఉన్న రైతులను ఒక్కసారిగా నష్టాల ఊబిలోకి నెట్టివేస్తోంది. పొగాకు సాగు కోసం ఎకరాకు రూ.1.50 లక్షల వరకు ఖర్చు చేసిన రైతులు లాభాల సంగతి దేవుడెరుగు... కనీసం పెట్టుబడి అయినా వస్తే చాలనుకునే దుస్థితికి దిగజార్చింది.టుబాకో కంపెనీలు, వ్యాపారులు, దళారులు అంతా కలిసి రైతులను నిండా ముంచేస్తున్నా కూటమి ప్రభుత్వం ఏమీ పట్టనట్లే వ్యవహరిస్తోంది. సీజన్ ప్రారంభమై 75 రోజులైనా ఇప్పటికీ 20 శాతం పొగాకును కూడా రైతుల నుంచి కొనుగోలు చేయలేదు. అయినా కంపెనీలకు వత్తాసు పలుకుతున్న ప్రభుత్వం.. రైతుల వేదనను మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడిలో సగం కూడా రావడం లేదు..⇒ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా గతేడాది పొగాకుకు మంచి ధర పలికింది. కిలో రూ.366 వరకు అమ్ముడుపోయింది. దాంతో ఈ ఏడాది రైతులు అత్యధికంగా పొగాకు వైపు మొగ్గు చూపారు. కంపెనీలు ప్రోత్సాహించాయి.⇒ ప్రకాశం రీజియన్ (ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లా)లోని 11 వేలం కేంద్రాల పరిధిలో 30వేల మందికిపైగా రైతులు పొగాకు సాగు చేశారు. ఈ ఏడాది 68,500 హెక్టార్లలో సాగుకు అనుమతివ్వడంతోపాటు కంపెనీల ప్రోత్సాహంతో పరిమితికి మించి 88వేల హెక్టార్లలో సాగు చేశారు. ⇒ మార్చి 10న పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. తొలిరోజు కిలో రూ.280 పలకడంతో పొగాకు రైతులు గట్టెక్కుతామని భావించారు. ⇒ కొద్దిరోజులకే రైతుల అంచనాలు తలకిందులయ్యాయి. విదేశాల నుంచి ఆర్డర్లు రావడంలేదని, నాణ్యతలేదని కంపెనీలు సాకులు చెప్పడం ప్రారంభించాయి. రైతులను మానసికంగా దెబ్బతీసి తక్కువ ధరలకు అమ్ముకునేలా వ్యూహం పన్నాయి. కూటమి ప్రభుత్వమూ పట్టించుకోలేదు. దాంతో ఇప్పుడు నాణ్యమైన పొగాకు ధర కిలో రూ.200 కన్నా తక్కువకు పడిపోయింది.కిలో రూ.280 దాటితేనే రైతులు గట్టెక్కుతారు⇒ రైతులు ఎకరాకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షలవరకు ఖర్చు చేశారు.⇒ ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల పంట దిగుబడి వచి్చంది. ఈ లెక్కన క్వింటాకు సగటున రూ.13వేల వరకు రైతులకు ఖర్చయింది.⇒ గ్రేడ్–1 పొగాకు క్వింటాకు రూ.12వేలు, గ్రేడ్–2 రకం క్వింటాకు రూ.6వేలు చొప్పున కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.⇒ ఈ రేటుకు పంటను అమ్ముకుంటే ఒక్కో రైతు కనీసం రూ.30వేల నుంచి రూ.60 వేల వరకు నష్టపోయే అవకాశం ఉంది.⇒ కంపెనీలు కూడబలుక్కుని ఏ రేటు అయితే మొదటి నుంచి చెబుతున్నాయో... వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా అదే రేటుకు పొగాకు కొనుగోలు చేస్తామని చిలక పలుకులు పలుకుతున్నారని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ⇒ వేలం పాటలు మొదలై 75 రోజులు గడిచాయి. కేవలం 20శాతం పొగాకు మాత్రమే కొనుగోలు చేశారు. మిగిలిన పంటను ‘నో బిడ్’ అంటూ వెనక్కి పంపిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఆదుకున్న జగన్ ప్రభుత్వం రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.116 కోట్లను పొగాకు కొనుగోళ్లకు కేటాయించింది. పొగాకును కొనేందుకు మార్క్ఫెడ్ను రంగంలోకి దించింది. దాంతో మార్కెట్లో పోటీ వాతావరణం నెలకొంది. ఐదేళ్లూ మంచి ధరలు వచ్చాయి. రైతులు లాభపడ్డారు. గతేడాది రికార్డు స్థాయిలో కిలో అత్యధికంగా రూ.366కు అమ్ముడుపోయింది.జగన్ పర్యటన ప్రకటనతో పాలకుల బెంబేలు పొగాకు రైతుల కష్టాలు తెలుసుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 28న ప్రకాశం జిల్లా పొదిలి వస్తున్నారన్న ప్రకటన ప్రభుత్వ పెద్దలను బెంబేలెత్తించింది. నిన్నమొన్నటి వరకు పొగాకు రైతుల కష్టాలను పట్టించుకోని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆఘమేఘాల మీద బాపట్ల జిల్లా మార్టూరులో పర్యటించారు.వారికి రైతు సంఘాల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. ‘పొగాకు రైతులను కలిసి మాట్లాడేందుకు జగన్ వస్తున్నారు... వెంటనే పొగాకు ధరలు పెంచండి. లేకపోతే మా ప్రభుత్వం పరువు పోతుంది..’ అంటూ మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పొగాకు బోర్డు అధికారులతో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిని బట్టి వైఎస్ జగన్ పర్యటన గురించి అధికార పార్టీ నేతలు ఎంత భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. -
సాగుకు దన్నుగా ప్రభుత్వ బ్యాంకులు
సాక్షి, హైదరాబాద్: రైతులకు రుణాల మంజూరులో ప్రభుత్వ రంగ బ్యాంకులు ముందుంటూ ఆదుకుంటుంటే ప్రైవేటు బ్యాంకులు వెనుకంజలో ఉంటున్నాయి. ప్రైవేటు బ్యాంకులు అసలు రుణ మంజూరులో కాదు..రుణ మంజూరు లక్ష్యాలను నిర్దేశించుకోవడంలోనే ఉదాసీనంగా ఉంటున్నాయనే ఫిర్యాదులున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ కలిపి రూ.84,610 కోట్ల మేర రుణాలు ఇస్తే, ప్రైవేటు బ్యాంకులు కేవలం రూ.21,616 కోట్లు మాత్రమే ఇవ్వడం గమనార్హం. రుణాల మంజూరుకు సంబంధించి 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ నిర్దేశిత లక్ష్యాలను 98.41 శాతం నెరవేర్చగా, 21 ప్రైవేటు రంగ బ్యాంకులు మొత్తంగా 84 శాతం అందుకున్నాయి. అయితే ఒకటీ రెండు బ్యాంకులు తమ నిర్దేశిత లక్ష్యాలకు చేరువగా రుణాలు మంజూరు చేయడంతో ఇది సాధ్యమైంది. కాగా కొన్ని ప్రైవేటు బ్యాంకులు రైతులకు రూపాయి కూడా రుణంగా ఇవ్వలేదు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) తాజా నివేదిక ఈ విషయం స్పష్టం చేస్తోంది. లీడ్లో లీడ్ బ్యాంక్ రాష్ట్రంలోని 76 బ్యాంకులు వ్యవసాయ, అనుబంధ రంగాలు, మౌలిక సదుపాయాలకు రుణాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో 2024–25లో రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి రూ.1,52,052 కోట్ల రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకోగా, రూ.1,37,346 కోట్లు మాత్రమే ఇచ్చారు. ప్రభుత్వ రంగంలో లీడ్ బ్యాంక్గా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవసాయం, అనుబంధ, మౌలిక సదుపాయాల రంగాల్లో కలిపి అత్యధికంగా రూ.41,630 కోట్లు మంజూరు చేసింది. అయితే కేవలం వ్యవసాయం కోసం పంట రుణాల కింద కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ)ల ద్వారా 15.25 లక్షల మందికి రూ.11,146.35 కోట్లు ఇవ్వడం గమనార్హం. మరే బ్యాంకు దాని దరిదాపుల్లోకి రాలేదు. ఇండియన్ బ్యాంక్ రూ.7,973 కోట్లతో రెండో స్థానంలో ఉండగా, కెనరా బ్యాంకు రూ.5,072 కోట్లతో మూడో స్థానంలో ఉంది. యూనియన్ బ్యాంక్ రూ.2,452 కోట్ల రుణాలను మంజూరు చేయగా, ఆ తర్వాతి స్థానాల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ.1,925.90 కోట్లు), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (రూ.1,116 కోట్లు) ఉన్నాయి. పంజాబ్ సింధు బ్యాంకు కేవలం 28 మందికి రూ.95 లక్షలు మంజూరు చేసింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా తక్కువ మొత్తంలోనే రుణాలు ఇచ్చాయి. ప్రైవేటు బ్యాంకులు అంతంతే.. ప్రభుత్వ రంగంలోని బ్యాంకులతో పాటు వివిధ రంగాల్లోని బ్యాంకులు కూడా రైతులకు రుణాలు జారీ చేస్తున్నప్పటికీ అందులో పంట రుణాలకు ఇచ్చింది అంతంత మాత్రమే. 21 ప్రైవేటు రంగ బ్యాంకుల్లో కొన్ని జీరో రుణాలకే పరిమితం కాగా, కేవలం ఐదు బ్యాంకులే లక్ష్యాలకు కొంత చేరువగా వచ్చాయి. మిగతా బ్యాంకులన్నీ కలిపితే ఓ మోస్తరుగా మాత్రమే రుణాలను మంజూరు చేసినట్లు తేలింది. ప్రైవేటు రంగంలో రుణ మంజూరులో మొదటి స్థానంలో హెచ్డీఎఫ్సీ ముందుండగా, తర్వాత స్థానాల్లో ఐసీఐసీఐ, యాక్సిస్ నిలిచాయి. ప్రైవేటు బ్యాంకుల రుణ లక్ష్యం రూ.25,731 కోట్లు కాగా, రూ.21,616 కోట్లు మాత్రమే ఇచ్చాయి. అయితే ఇందులో పంట రుణాల కింద ఇచి్చన మొత్తం 30 శాతం కంటే తక్కువేనని ఎస్ఎల్బీసీ నివేదిక వెల్లడించింది. ఇక సిటీ యూనియన్ బ్యాంకు, కరూర్ వైశ్య బ్యాంకు, సౌత్ ఇండియన్ బ్యాంకు, తమిళనాడు మర్కంటైల్ బ్యాంకు లాంటి కొన్ని బ్యాంకులు రైతులకు రూపాయి కూడా ఇవ్వలేదు. గ్రామీణ బ్యాంకుల ద్వారా రూ.18,676 కోట్లు రాష్ట్రంలో 2024–25లో రెండు గ్రామీణ బ్యాంకులు మనుగడలో ఉన్నాయి. తెలంగాణ గ్రామీణ బ్యాంకు (టీజీబీ), ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ (ఏపీజీవీబీ)లు విడివిడిగా రైతులకు రుణాలు ఇచ్చాయి. అయితే ఈ రెండు బ్యాంకులు గత డిసెంబర్లోనే విలీనం అయ్యాయి. ఇప్పుడు కేవలం తెలంగాణ గ్రామీణ బ్యాంకుగానే కొనసాగుతున్నాయి. ఈ రెండు బ్యాంకులు కలిపి రూ. 26,500 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా, రూ.18,676 కోట్లు మాత్రమే ఇచ్చాయి. ఇందులో తెలంగాణ గ్రామీణ బ్యాంకు రూ. 11,014.91 కోట్లు, ఏపీజీవీబీ రూ.7,661.37 కోట్లు (70.47 శాతం)ఇచ్చాయి. అయితే విలీనం తర్వాత టీజీబీ ద్వారానే ఆర్థిక లావాదేవీలు నడిపిస్తున్నాయి. ఎస్బీఐ తరువాత రైతులకు చేరువైన ఏకైక బ్యాంకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు కాగా, ఇది ఎస్బీఐకే అనుబంధంగా కొనసాగుతుండడం గమనార్హం. సహకార బ్యాంకుల రుణాలు రూ.10,297 కోట్లు రాష్ట్రంలోని సహకార బ్యాంకులు గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.13,540 కోట్లు రుణంగా ఇవ్వాలని నిర్ణయించుకుని, రూ.10,297 కోట్లు ఇచ్చాయి. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టీఎస్కాబ్) పరిధిలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు (డీసీసీబీలు).. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) ద్వారా నేరుగా రైతులకు వ్యవసాయ, అనుబంధ రంగాలకు రుణాలు అందిస్తాయి. 2024–25లో రూ.13,540 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని రూ.10,297 కోట్లు మంజూరు చేశాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఏకంగా రూ.1,434 కోట్లు ఇచ్చాయి. అయితే ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కేవలం రూ.12 కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం గమనార్హం. అలాగే విదేశీ బ్యాంకులు రూ.289 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకొని రూ.712 కోట్లు మంజూరు చేశాయి. -
రైతులపై సోలార్ పిడుగు
-
ఆంధ్రప్రదేశ్లో సోలార్ విద్యుత్తు ప్లాంట్ పేరుతో రైతుల భూములు స్వాహా.... బ్యాంకులో తనఖా పెట్టి రుణాలు తీసుకోవడానికి ప్రైవేట్ కంపెనీ ఎత్తుగడలు
-
మీ భూములు.. మా వ్యాపారం
సాక్షి ప్రతినిధి కర్నూలు: ‘‘మీ భూములు బ్యాంకుల్లో తనఖా పెట్టి మేం లోన్లు తీసుకుంటాం. మీ పొలాలతో మేం వ్యాపారం చేసుకుంటాం..!’’ అంటూ నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం అవుకు మండలంలో సోలార్ విద్యుత్తు ప్లాంటు ఏర్పాటు పేరుతో రైతులను బెదిరించి సారవంతమైన భూములను గుంజుకుంటున్నారు. లీజు ముసుగులో 30 ఏళ్ల పాటు పంట భూములను తీసుకుని శాశ్వతంగా సొంతం చేసుకునే కుట్రలకు తెర తీశారు. లీజు చెల్లింపులకు సంబంధించి మధ్యలో ఏ సమస్య తలెత్తినా ప్రభుత్వ పూచీకత్తు ఉండదని.. రైతులే స్వయంగా ఢిల్లీకి వెళ్లి పరిష్కరించుకోవాల్సి ఉంటుందని ఒప్పదంలో నిబంధన విధించారు. మంత్రి బీసీ జనార్దనరెడ్డి కనుసన్నల్లో నయానా భయాన సాగుతున్న ఈ భూముల సేకరణతో అన్నదాతలు హడలెత్తిపోతున్నారు. తాతల కాలం నుంచి తమకు బువ్వ పెడుతున్న భూములను అప్పగించి కూలీలుగా మారలేమని ఆక్రోశిస్తున్నారు. గడువు ముగిసినా.. కంపెనీ కనికరిస్తేనే!అవుకు మండలంలో ‘హీరో’ సోలార్ కంపెనీ 1,252 ఎకరాల భూమిని సేకరిస్తుండగా లీజు రిజిస్ట్రేషన్లు శరవేగంగా జరుగుతున్నాయి. 29 ఏళ్ల 11 నెలల పాటు లీజు అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. గడువు ముగిసిన తర్వాత లీజు పొడిగించాలని కంపెనీ భావిస్తే రైతులు కచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. వ్యవసాయం చేసుకుంటా.. పిల్లల పెళ్లి, ఇంటి ఖర్చుల కోసం పొలం విక్రయిస్తామంటే కుదరదు. ఇదే పొలాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి కంపెనీ రుణాలు తీసుకుంటుంది. ఇక లీజు చెల్లించకపోవడం, రెండేళ్లకోసారి పెంచకపోవడం లాంటి ఎలాంటి సమస్యలు తలెత్తినా ఆర్బిట్రేషన్ కోసం రైతులు ఢిల్లీకి వెళ్లాల్సిందే. నంద్యాల, విజయవాడకు వెళ్తామంటే కుదరదు. అంటే భవిష్యత్తులో సమస్యలు ఉత్పన్నమైతే రైతులు పరిష్కరించుకోలేని విధంగా చేసే కుట్ర ఇది!!శాశ్వతంగా దూరం చేసే కుట్ర..నంద్యాల జిల్లా అవుకు మండలంలో హీరో సోలార్ ప్యూచర్ ఎనర్జీస్ కంపెనీ 300 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం అవుకు, సింగనపల్లె పరిధిలో 1,252 ఎకరాలను ‘క్లీన్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్’ పేరుతో లీజుకు తీసుకుంటున్నారు. అగ్రిమెంట్ నిబంధనలు పరిశీలిస్తే రైతులు తమ అవసరాల కోసం పొలం విక్రయించకుండానే శాశ్వతంగా భూములను దూరం చేసే కుట్ర జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.⇒ ఇవీ నిబంధనలు..⇒ రైతులు తమ భూమిని 29 ఏళ్ల 11 నెలలు లీజుకు ఇస్తున్నట్లు ఏటీఎల్ (అగ్రిమెంట్ లీజు) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేయాలి. ⇒ లీజు గడువు ముగిసిన తర్వాత కంపెనీ లీజు పొడిగించుకోవాలని భావిస్తే రైతులకు ఇష్టం లేకపోయినా కచ్చితంగా ఒప్పుకుని తీరాల్సిందే.⇒ లీజుకింద ఏడాదికి రూ.40 వేలు ఇస్తారు. రెండేళ్లకోసారి ఐదు శాతం పెరుగుతుంది.⇒ భవిష్యత్తులో ఏదైనా సమస్యలు వస్తే ఆర్బిట్రేషన్ కోసం రైతులు ఢిల్లీకి వెళ్లాల్సిందే.⇒ భూమిని కంపెనీ థర్డ్ పార్టీకి (మరొకరికి) లీజుకు ఇవ్వవచ్చు.రైతన్నల పొలాలకు దారేది?రాయలసీమలో సోలార్ విద్యుదుత్పత్తి కోసం కంపెనీలు ఇప్పటి వరకూ బీడు భూములను కొనుగోలు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు లీజు పేరుతో వ్యవసాయ భూములను హస్తగతం చేసుకుంటున్నారు. సోలార్ కంపెనీ ఏర్పాటుతో మొత్తం భూములను చదును చేస్తారు. దీంతో సాగునీటి కాలువలు, పొలాల హద్దులు చెరిగిపోతాయి. కంపెనీ చుట్టుపక్కల పొలాలకు సాగునీటి వనరులు ఉండవు. దారులు కూడా మూసుకుపోతాయి. ఎవరైనా రైతు తన పొలం ఇచ్చేందుకు నిరాకరించి వ్యవసాయం చేసుకోవాలని ప్రయత్నిస్తే ఆ పొలానికి దారి లేకుండా చేస్తున్నారు. ‘చుట్టూ సోలార్ కోసం అందరూ పొలాలిస్తుంటే మీరొక్కరే ఎలా వ్యవసాయం చేస్తారు? దారి, నీళ్లు లేకుండా పొలంలోకి ఎలా వెళతారు..?’ అని కంపెనీ ప్రతినిధులు, మంత్రి బీసీ జనార్దనరెడ్డి అనుచరులు బెదిరిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. మంత్రికి, కంపెనీకి వ్యతిరేకంగా నోరు విప్పేందుకు జంకుతున్నారు. భూములు లేకుంటే స్థానిక గొర్రెల కాపరులు మేత కోసం అల్లాడాల్సిందే. లెవలింగ్ పేరుతో పొలం గట్లను చదును చూస్తే రైతులకు దారి ఉండదు.కంపెనీ చేతుల్లోకి..వ్యవసాయ భూములను పరిశ్రమల కోసం లీజుకు ఇస్తే వ్యవసాయేతర భూమి కిందకు మారుతుంది. అప్పుడు రైతులు ఆస్తి పన్ను, ఆదాయపు పన్ను చెల్లించాలి. ఈ విషయాలను రైతులకు వివరించకుండా కంపెనీ దాగుడు మూతలు ఆడుతోంది. రైతుల నుంచి లీజుకు తీసుకున్న భూములనే బ్యాంకులో తనఖా పెట్టి రుణాలు తీసుకోవాలని హీరో కంపెనీ భావిస్తోంది. ఒకవేళ నష్టాలొచ్చి దివాళా తీస్తే ఆ రుణాలను ఎవరు చెల్లించాలి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆర్బిట్రేషన్ కోసం రైతులు ఢిల్లీకి వెళ్లగలరా? ఇక లీజు తర్వాత ఆ భూములు సాగు యోగ్యత కోల్పోతాయి. అందులోని సోలార్ మెటీరియల్ ఎవరు తొలగించాలి? ఎక్కడ పడేయాలి? ఆ ఖర్చు సంగతేమిటి? అనే వివరాలేవీ ఎంవోయూలో లేవు. రైతులకు దీనిపై అవగాహన కల్పించడం లేదు. లీజు ముగిసిందని రైతులు తమ పిల్లల పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం పొలం విక్రయించుకోవాలంటే కుదరదు. కంపెనీ లీజు పొడిగించాలనుకుంటే రైతు ఒప్పుకుని తీరాల్సిందే! అంటే రైతుకు 30 ఏళ్ల తర్వాత కూడా తన భూమిపై హక్కు ఉండదని స్పష్టమవుతోంది.సాగు భూముల్లో సోలార్..!సోలార్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్న ప్రాంతానికి సమీపంలో అవుకు రిజర్వాయర్ ఉంది. ఎస్ఆర్బీసీ 13వ బ్లాక్ నుంచి పొలాలకు నీరు అందుతుంది. ఇక్కడ మిరప, మొక్కజొన్న, జొన్న, వరి, ఉద్యాన పంటలు సాగు చేస్తారు. మంత్రి బీసీ జనార్దన్రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే పొలాలకు రిజర్వాయర్ నుంచి పూర్తిగా సాగునీటి వసతి కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లీజు అగ్రిమెంట్లో లొసుగులపై రైతుల తరఫున కంపెనీని ప్రశ్నించాలని సూచిస్తున్నారు. అలా కాకుండా కంపెనీకి వత్తాసు పలుకుతూ రైతులకు మంత్రి అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో అవుకు, శింగనపల్లె రైతులను మంత్రి అనుచరుడు ఉగ్రనరసింహారెడ్డి బుజ్జగిస్తుండగా శింగనపల్లెలో భూములు ఉన్న చెన్నంపల్లె రైతులతో బిజ్జం పార్థసారథిరెడ్డి సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 600 ఎకరాలకు సంబంధించి రైతులతో సంప్రదింపులు పూర్తయ్యాయి. 80 ఎకరాలకు లీజు అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. భూములను బలవంతంగా లాక్కుంటున్నారని రైతులు వాపోతున్నారు.భూములు మావి.. లోన్లు మీకా?: కోట శంకర్రెడ్డి, రైతు శింగనపల్లె లీజుకు తీసుకున్న మా భూములు బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్ తీసుకుని ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారట. 30 ఏళ్ల లీజు అంటే సగం జీవితం అయిపోతుంది. మా పిల్లలకు భూములు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. మా పొలాలు లీజుకు ఇవ్వాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. భూములిచ్చి కూలికి వెళ్లాలా?సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తామని హీరో కంపెనీ మా ఊరిలో భూములు లీజుకు తీసుకుంటోంది. నాకు 2.20 ఎకరాలు ఉంది. పొలం అడిగితే ఇవ్వబోమని చెప్పా. తాతల కాలం నుంచి వ్యవసాయం చేస్తూ రైతుగా బతుకుతున్నాం. భూములిచ్చి కూలి పనికి వెళ్లాలా? సోలార్ ప్లాంటుతో భూములు చదును చేస్తే మా పొలాలకు నీళ్లు ఎలా? దారి ఎలా? రైతులను బాధ పెట్టొద్దు.– లోకిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రైతు, శింగనపల్లె -
కార్పొరేట్ల కోసమే ఈ నిర్మూలనా?
‘ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని వంద లాది గ్రామాలలో వేలాది రైతుల నుండి వ్యవసాయ శాస్త్రవేత్త డా‘‘ రిఛారియా 22,000 లకు పైగా వరి వంగడాలను, 1,800లకు పైగా ఆకుకూరలను సేకరించి వాటి జర్మ్ ప్లాస్క్ను రాయ్పూర్లోని ‘ఇందిరా గాంధీ జాతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం’లో 1950, 1960లలో భద్రపరిచారు. ఇందులో తక్కువ నీటితో పండేవి, తక్కువ గడ్డినిచ్చేవి, ఎక్కువ గడ్డినిచ్చేవి, సువాసనలు వెదజల్లేవి, పొడవైన– పొట్టి రకాలు, ఏ కాలంలోనైనా పండే అనేక వంగడాలు ఉన్నాయి. అయితే మన దేశ దళారీ పాలకుల కుమ్మక్కుతో ఈ వరి వంగడాల జర్మ్ ప్లాస్క్ను అమెరికా తదితర దేశాల బహుళజాతి కంపెనీలు దొంగిలించుకు పోయాయి. మనీలాలోని ‘ఇంటర్నేషనల్ రైస్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్’ (ఐఆర్ఆర్ఎ)లలో అభివృద్ధి చేశామని చెప్తూ ఇలా దొంగిలించుకు పోయిన వంగడాలను వివిధ పేర్లతో (ఐఆర్–36, ఐఆర్–72 తదితర) బహుళజాతి కంపెనీలు భారత్ లాంటి అనేక దేశాల్లో అమ్ముకుని భారీగా లాభాలు గడిస్తున్నాయి. విత్తనాల కోసం భారతదేశ రైతులు ప్రతి సంవత్సరం బహుళజాతి కంపెనీలపై ఆధారపడేలా చేస్తు న్నారు...’ ఈ మాటలు విదేశీ జర్నలిస్టు అల్ఫ్ బ్రెనన్ కు 2022లో ఇచ్చిన ఒక సుదీర్ఘ ఇంటర్వ్యూలో మావోయిస్టు కేంద్ర ప్రధాన కార్యదర్శి బసవరాజువి. ఈ దేశ ప్రజల పరంపరాగత జ్ఞానం పట్ల, దేశీయత పట్ల, వనరుల పట్ల ఆయన వైఖరిని సూచించే మాటలు ఇవి.దేశభక్తి అనే ఒక్క మాటతో ఈ రోజు అందరినీ శిలువ ఎక్కించి పరీక్షిస్తున్నారు. కానీ నిజంగానే దేశం పట్ల ప్రేమ ఉంటే ఎలా ఆలోచించాలో బసవరాజు చేసిన ఈ సూక్ష్మ పరిశీలన తెలియజేస్తోంది. జాతీయత పేరుతో మావోయిస్టు నిర్మూలనను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న తరుణంలో ఏది దేశభక్తి, ఏది ప్రజల మీది ప్రేమ అనే చర్చ జరగలవసి ఉన్నది.మావోయిస్టుల ఆలోచనలు విదేశీయమని కొందరు చెబుతుంటారు. మావోయిస్టుల వల్ల ఈ దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, అభివృద్ధికి వాళ్లు ఆటంకంగా ఉన్నారని అంటున్నారు. కానీ కొద్దిగా ఈ దేశ రాజకీయార్థిక వ్యవహారాలను పరిశీలిస్తే ఎవరు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నదీ అర్థమవుతుంది. గతంలో కంటే తీవ్రంగా అభివృద్ధి అనే మాట ఇప్పుడు చలామణీలోకి వచ్చింది. కానీ ఇది ఎవరి అభివృద్ధి అనేది అతి ముఖ్యమైన ప్రశ్న.ఏడాదిన్నరగా మావోయిస్టు నిర్మూలన పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న ‘ఆపరేషన్ కగార్’ కేవలం సైనిక చర్య కాదు. అభివృద్ధి నమూనా కేంద్రంగా సాగుతున్న రాజకీయార్థిక యుద్ధం. సరిహద్దుల కోసం పక్క దేశ ప్రజలపై యుద్ధం చేసే భారత ప్రభుత్వం అభివృద్ధి నమూనా విషయంలో జరుగుతున్న సంఘర్షణను అంతర్యుద్ధంగా మార్చేసింది. తన దేశ ప్రజల మీదే దండయాత్ర చేస్తోంది. యుద్ధాల్లో ఆయుధాలు, విమానాలు, డ్రోన్ లు చేసే వికృత ధ్వనుల వెనుక రాజకీయార్థిక విధ్వంసాలు ఉంటాయి.కగార్ పేరుతో అదే జరుగుతోంది. అందుకే మావోయిస్టు ప్రభా విత మధ్య భారత రాష్ట్రాల్లో హత్యాకాండ ఆపాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఆదివాసుల జీవించే హక్కు, రాజ్యాంగం ఇచ్చిన రక్షణ చట్టాల చర్చగానే ఇది ముగిసి పోవడం లేదు. ఈ రక్తపాతం వెనుక ఉన్న పాలకుల అభివృద్ధి నమూనా ఉంది. ఈ ఏడాదిలోనే వందలాది మంది ఆదివాసుల హత్య వెనుక ఉన్న అభివృద్ధి–విధ్వంసాల సంఘర్షణకు మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాళ కేశవరావు హత్య ఒక పరాకాష్ఠ.ఒకప్పుడు మావోయిస్టులు, వాళ్ల అభిమానులు మాత్రమే పాలకుల అభివృద్ధి నమూనాను మౌలికంగా విమర్శించేవాళ్లు. ప్రజలే కేంద్రంగా అభివృద్ధి నమూనా ఎట్లా ఉండాలో చెప్పేవాళ్లు. ఈ దేశ ప్రజల అవసరాలే కేంద్రంగా అభివృద్ధి నమూనా ఉండాలని విశ్లేషించేవాళ్లు. ఈ దేశ వనరులు ఇక్కడి ప్రజల కోసమే వినియోగించాలనే వాళ్లు. చిన్న చిన్ని సవరణలు ఎన్ని చేసినా అది ప్రజలకు పనికి రాదని, చాలా మందికంటే భిన్నమైన వైఖరిని ప్రకటించేవాళ్లు. విప్లవం ద్వారా మౌలిక మార్పు వస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని అనేవాళ్లు.ఇదే విమర్శ ఇప్పుడు దేశంలోనే ఒక ప్రధాన విమర్శగా ఎదిగింది. ఈ దేశం పిడికెడు మంది కార్పొరేట్లది కాదని, అసంఖ్యాక ప్రజలదనే అవగాహన అనేక రకాలుగా ప్రచారంలోకి వచ్చింది. కార్పొరేటీకరణ ఉద్ధృతంగానే సాగుతూ ఉండవచ్చు. కానీ దాని మీద విమర్శ పదునెక్కుతోంది. అనేక రూపాల్లో ప్రజా పోరాటాలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దేశభక్తి, జాతీయత అనే భావనలను ఆ పక్క పాలకులు ప్రచారంలో పెట్టే కొద్దీ... ఈ పక్క నుంచి రోజువారీ జీవిత సంక్షోభంలోంచి ప్రజా ప్రయోజనాల చర్చ వేగవంతం అవుతున్నది.మావోయిస్టు ఉద్యమం ఈ విషయాలను చర్చించడంతో సరి పెట్టుకోలేదు. వాళ్లకు బలం ఉన్న ప్రాంతాల్లో మిలిటెంట్ ఉద్యమాలను నిర్మిస్తోంది. మిగతా ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా జరుగుతున్న వేర్వేరు ప్రజా పోరాటాలకు మద్దతు ఇస్తున్నది. వాటిలో తనకు వీలైన పద్ధతిలో పాలుపంచుకుంటోంది. ఈ దేశంలో మౌలిక స్థాయిలో జరగాల్సిన అభివృద్ధి నమూనా చర్చను ప్రజా ఆచరణలోకి మళ్లిస్తున్నది. ఇది ముఖ్యంగా కేంద్ర పాలకులకు ఆగ్రహం తెప్పించింది. పైకి మావో యిస్టు ఉద్యమం గురించి అప్పుడప్పుడు శాంతి భద్రతల సమస్యగా చెప్పినా... ఇది తాను ఎంచుకొన్న అభివృద్ధి నమూనాకు ఆటంకం అని గ్రహించింది. అడవుల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో ఉండే అశేష పీడిత ప్రజానీకానికీ, కార్మికులకూ, నానాటికీ పెరుగుతున్న మధ్య తరగతికీ ప్రస్తుత ప్రభుత్వం నడుపుతున్న అభివృద్ధి నమూనా ప్రమాదకరమనే చైతన్యం పెరగడంలో మావోయిస్టుల పాత్ర ఉన్నది.కాబట్టి మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించకపోతే తాను ఎంచుకున్న కార్పొరేట్ అభివృద్ధి నమూనాను అమలు చేయడం సాధ్యం కాదని ప్రభుత్వానికి స్పష్టమైంది. కొన్ని తేడాలతో గత ప్రభుత్వాలది కూడా ఇదే వరుస. వాళ్లు చూసిన దారిని మరింత నిర్దాక్షిణ్యంగా, అమానవీయంగా నేటి ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఈ మేరకు వివిధ ప్రజా పోరాటాలు ఉద్ధృతమయ్యాయి. వ్యవస్థ మౌలిక మార్పులో కీలకమైన ఉత్పత్తి సంబంధాల చర్చను, కొత్త దోపిడీ రూపాల సమస్యను మావోయిస్టు ఉద్యమం కేంద్ర స్థానంలోకి తీసుకొని వచ్చింది. కార్పొరేట్ పెట్టుబడి, దాని వనరుల దాహం, శ్రమశక్తిని కొల్లగొడుతున్న పద్ధతుల మీద విమర్శను ప్రజల కామన్ సెన్స్లో భాగం చేసింది. కాబట్టి కార్పొరేట్ ఇండియాను సాధించడానికి మావోయిస్టు రహిత భారత్ ఒక షరతుగా మారిపోయింది.వ్యక్తిగా నంబాళ కేశవరావు భౌతిక కాయం అరమోడ్పు కన్నులతో ఈ నేలలో కలిసిపోవచ్చు. కానీ ఆయన చూపు, మేధ,హృదయం, చైతన్యం మాత్రం పాలకుల అభివృద్ధి నమూనాను గురి చూస్తూనే ఉంటాయి. పాణి వ్యాసకర్త ‘విరసం’ కార్యవర్గ సభ్యుడు -
ఈసారీ యూరియా కొరత తప్పదా?
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. రాష్ట్రంలో కూడా ఆ ప్రభావం కనిపిస్తోంది. వచ్చే నెల మొదటి వారం నుంచే వానాకాలం సాగుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అన్ని ఏర్పా ట్లు చేస్తోంది. వరితోపాటు పత్తి, ఇతర ఉద్యానవన పంట ల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు మరోసారి యూరియా కోసం పడిగాపులు పడే పరి స్థితి వస్తుందేమోననే ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో వానాకాలం పంటలకు ఎరువు బస్తాల కోసం సహకార సంఘం దుకాణాల ముందు రైతులు నిలబడిన దృశ్యాలు పునరావృతం అవుతాయోమే అన్న సందేహం తలెత్తుతోంది. ఈ సీజన్లో వాడకం అధికం రాష్ట్రంలో ఈ వానాకాలంలో 134 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో 5 ప్రధాన పంటలైన వరి, పత్తి, మొక్కజొన్న, కందులు, సోయాబీన్ సాగు విస్తీర్ణమే 131. 80 లక్షల ఎకరాలు. వీటిలో వరి, పత్తి, మొక్కజొన్నకు యూరియా వాడకం ఎక్కువగానే ఉంటుంది. ఈసారి 12 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) యూరియా అవసరమ ని అధికారులు చెపుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కేవలం 9.8 ఎల్ఎంటీ యూరియానే రాష్ట్రానికి కేటాయించింది. గత యాసంగిలో కేటాయించిన 9.8 ఎల్ఎంటీల యూరియానే ఈ సీజన్కూ కేటాయించడం గమనార్హం. యాసంగిలో పత్తి, సోయాబీన్ వంటి పంటలు లేకపోయి నా 9.8 ఎల్ఎంటీ యూరియా సరి పోని పరిస్థితి. కానీ వానాకాలంలోనూ అంతేస్థాయిలో యూరియా కేటాయించడంతో రైతులు ఎరువుల కోసం రోడ్డె క్కే పరిస్థితి తప్పకపోవచ్చునని వ్యవ సాయ రంగ నిపుణులు చెపుతున్నారు. ఇప్పటి వరకు 1.72 ఎల్ఎంటీలే... ఈ వానాకాలంలో కేంద్రం ఏప్రిల్ నుంచి దశల వారీగా యూరియాను రాష్ట్రానికి పంపించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఏప్రిల్లో 1.70 ఎల్ఎంటీలు, మేలో 1.60 ఎల్ఎంటీల చొప్పున 3.30 ఎల్ఎంటీలు రావలసి ఉంది. అయితే కేంద్రం ఏప్రిల్లో 1.20 ఎల్ఎంటీలు, మేలో 0.52 ఎల్ఎంటీలు మాత్రమే ఇచ్చింది. అంటే ఇప్పటివరకు ఇచ్చిన కోటా కేవలం 1.72 ఎల్ఎంటీలే. గత ఏడాది వానాకాలం ప్రారంభానికి ముందే 4 ఎల్ఎంటీల యూరియాను నిల్వ చేసినప్పటికీ, ఇబ్బందులు తప్పలేదు. కానీ ఈసారి కేవ లం 1.72 ఎల్ఎంటీలే కేంద్రం పంపడంతో రాష్ట్ర ప్రభు త్వం ఆందోళన చెందుతోంది. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు ఇటీవల ఢిల్లీకి వెళ్లి ఎరువుల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో అధికారులను కలిసి తక్షణం లక్ష మెట్రిక్ టన్నుల యూరియాను విడుదల చేయాలని కోరారు. ఎరువుల వాడకం తగ్గించండి..: డిమాండ్కు అనుగుణంగా యూరియా సరఫరా చేయాలని ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం కోరుతుండగా, రాష్ట్రాలు ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. అదే సమయంలో సేంద్రీయ ఎరువుల వాడకాన్ని పెంచుకోవాలని కోరుతుంది. వానాకాలం వరి, మొక్కజొన్న వంటి పంటలకు యూరియా కీలకమని, తొలిదశలో సరిపడా యూరియా లేకపోతే మొద టి దశ నుంచే పంట దిగుబడిపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే ప్రణాళిక అవసరమని అంటున్నారు. -
రాజధాని రైతులకు ఇక్కట్లు నిజమే
సాక్షి, న్యూఢిల్లీ: ‘రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు కొంత ఇబ్బంది పడటం నిజమే. అయినా వారి త్యాగం ఊరికే పోదు. 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చిన చరిత్ర అమరావతిది. ఎన్ని ఎకరాల్లో అయినా రాజధానిని కడతాం. ఎన్ని ఎకరాల్లో నిర్మిస్తే నీకు (మాజీ సీఎం వైఎస్ జగన్ను ఉద్దేశించి) వచ్చిన నష్టం ఏమిటి?’ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. అనంతరం జన్పథ్–1లోని అధికారిక నివాసంలో ఎంపిక చేసుకున్న మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం విషయంలో వైఎస్ జగన్ అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం రావాలని, అలా రాకపోతే ఎలా.. అంటూ మీడియాను ఎదురు ప్రశ్నించారు. రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ చట్ట సవరణ చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్షాను కోరినట్లు చెప్పారు. ఏపీలో 72 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని, రూ.28,346 కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఇవ్వాలని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరినట్లు తెలిపారు. సూర్యఘర్ అమలుకు మద్దతు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. రక్షణ పరికరాల తయారీ, ఏరోస్పేస్ ఆవిష్కరణల్లో రాష్ట్రం దేశానికి ప్రధాన కేంద్రంగా ఎదగడానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరినట్లు తెలిపారు. జగ్గయ్యపేట–డోలకొండ క్లస్టర్లో 6 వేల ఎకరాలు అందుబాటులో ఉందని, ఇక్కడ క్లస్టర్ను మిస్సైల్ అండ్ అమ్యూనేషన్ ప్రొటెక్షన్ కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరామన్నారు. విశాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. పోలవరం–బనకచర్ల ప్రతిపాదన రూ.80 వేల కోట్లు ఖర్చయ్యే పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రానికి అందించినట్లు చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి వివరించానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును 2027లోపు పూర్తి చేస్తామని చెప్పారు. షార్, లేపాక్షి వద్ద స్పేస్ సిటీల అభివృద్ధి విషయంపై కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ను కలసి మాట్లాడానని తెలిపారు. ‘ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ ఎకోసిస్టమ్’ పురోగతిలో ఆంధ్రప్రదేశ్ పోషించగల పాత్రను వివరిస్తూ కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు నివేదిక సమర్పించానని చెప్పారు. కాగా, నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ల పేర్లను ఈడీ ప్రస్తావించిన విషయంపై చంద్రబాబును మీడియా ప్రశ్నించగా.. ‘అవునా? ఎప్పుడు? ఏమో మరి.. నాకు దాని గురించి తెలియదు’ అంటూ దాటవేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ విషయంపై కూడా తాను మాట్లాడనని స్పష్టం చేశారు. కాగా, సీఎం చంద్రబాబు శనివారం నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కానున్నారు. -
ట్రంప్.. మళ్లీ అదే తీరు!
వాషింగ్టన్: కొన్ని వారాల క్రితం శ్వేతసౌధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మీడియా సాక్షిగా తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని ఏమాత్రం మార్చుకోలేదు. సాదరంగా ఆహా్వనించి నిందారోపణల బురద కుమ్మరించడం అగ్రరాజ్యానికి ఏమాత్రం తగదని ఆనాడే ప్రపంచమీడియా తీవ్రంగా మందలించినా ట్రంప్ తన తెంపరితనాన్ని ఏమాత్రం తగ్గించుకోలేదని బుధవారం మరోసారి రుజువైంది. వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటారనే ఆశతో వైట్హౌస్కు విచ్చేసిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫొసాకు ట్రంప్ ఆరోపణలతో స్వాగతం పలికారు. దక్షిణాఫ్రికాలో వేలాది మంది శ్వేతజాతి రైతులను వధించారని ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో హతాశుడైన రమఫొసా వెంటనే తేరుకుని ట్రంప్కు దీటుగా బదులిచ్చారు. అసలేం జరిగిందంటే? శ్వేతసౌధంలో మీడియా సమక్షంలో సంయుక్తంగా మాట్లాడేందుకు రమఫొసా సిద్ధంకాగా ట్రంప్ మీడియాతో మాట్లాడటం వదిలేసి అక్కడే ఉన్న పెద్ద టెలివిజన్లో ఒక వీడియో చూపిస్తాం చూడండని అక్కడి వారందరినీ ఆదేశించారు. ‘‘శ్వేతజాతీయులను చంపేయండి. శ్వేతజాతి రైతులను కాల్చిచంపండి’’ అంటూ దక్షిణాఫ్రికాలో చిన్నపాటి కమ్యూనిస్ట్పార్టీ అయిన ఎకనమిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ నేత జూలియస్ మలేమా పాడుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. వీడియో ప్లే అవడం పూర్తయ్యాక ట్రంప్ రమఫొసాను ఉద్దేశించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ‘‘ దక్షిణాఫ్రికాలో నల్లజాతీయులు జాత్యహంకారానికి గురయ్యారనేది ఒట్టిమాట. వాస్తవానికి వేలాది మంది శ్వేతజాతి రైతులను ఊచకోత కోశారు. ఆ దేశంలో ఎన్నో ప్రాంతాలు శ్వేతజాతీయుల సమాధి దిబ్బలుగా మారాయి. శ్వేతజాతీయులు పీడనకు, వేదనకు గురయ్యారు. మీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో చాలా మంది శ్వేతజాతీయులు బతుకుజీవుడా అంటూ అమెరికాకు శరణార్థులుగా వలసవచ్చారు. వాళ్లకు మేం ఆశ్రయం కల్పించాం’’ అంటూ ట్రంప్ చెప్పుకుంటూ పోయారు. శ్వేతజాతీయుల అవస్థలు ఇవి అంటూ విదేశీ వార్తాసంస్థల్లో ప్రచురితమైన కథనాల జిరాక్స్ కాపీలను మీడియా ప్రతినిధులకు చూపించి రమఫొసాకు అందజేశారు. వీటికి సంజాయిషీ చెప్పాలని డిమాండ్చేశారు. ‘‘ అన్ని హత్యలే. దక్షిణాఫ్రికాలో ఎక్కడ చూసినా మరణాలే’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ వైఖరితో ఒక్కసారిగా విసిగిపోయిన రమఫొసా పట్టరాని ఆగ్రహంతో ఉన్నాసరే సంయమనం పాటించారు. హుందాగా వ్యవహరిస్తూ సూటిగా మాట్లాడారు. ‘‘ అసలేంటీ వీడియో?. నేనెప్పుడూ ఈ వీడియో చూడలేదు. ఎక్కడిదీ వీడియో?. ఈ వీడియో ఎంత వరకు వాస్తవం?’’ అంటూ ట్రంప్పై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘ దశాబ్దాలుగా జాత్యహంకారానికి, పీడనకు కోట్లాదిమంది నల్లజాతీయులు బాధితులయ్యారు. లెక్కలేనంత మంది బలయ్యారు. మా దేశంలో శ్వేతజాతీయుల ఊచకోత అనేది పూర్తిగా అబద్ధం. నిజానికి ఆఫ్రికనర్స్గా పిలిచే మైనారిటీ శ్వేతజాతీయులే చాన్నాళ్లు మా దేశాన్ని చెండుకు తిన్నారు. ఆఫ్రికన్ల దీనగా«థను వినే ఓపిక మీకు ఉంటే మా బాధ సరిగ్గా అర్థమవుతుంది.’’ అని రమఫొస సూటిగా సమాధానం ఇచ్చారు. ట్రంప్ చూపిన వీడియోలో ఒక రోడ్డు పక్కన చోట పెద్ద సంఖ్యలో సమాధులు ఉన్నాయి. అయితే ఇవి నిజమైన సమాధులు కావని, 2020లో ఖ్వజూలు–నటాల్ ప్రావిన్సులో ఒక రైతు జంట పొలంలో హత్యకు నిరసనగా ఏర్పాటుచేసిన నకిలీ సమాధులు అని కొందరు వాదించారు. ఉంటే ఇచ్చేవాడినే శ్వేతజాతి, నల్లజాతీయుల్లో ఎవరు పీడనకు గురయ్యారని ఓవైపు ట్రంప్, రమఫొసా వాదించుకుంటుంటే ఒక విలేకరి మధ్యలో కల్గజేసుకుని వందల కోట్ల రూపాయల విలువైన విమానాన్ని బహుమతిగా స్వీకరించడం ఎంత వరకు నైతికతగా అనిపించుకుంటుంది? అని ట్రంప్ను సూటి ప్రశ్న వేశారు. దీంతో చిర్రెత్తికొచ్చిన ట్రంప్.. ‘‘ నువ్వో చెత్త రిపోర్టర్వు. ఇంత కీలకమైన విషయంపై చర్చిస్తుంటే మధ్యలో నీ విమానం గోల ఏంటి?. నువ్వు అసలు ప్రశ్నలు అడగొద్దు’’ అని అతనిపై ట్రంప్ అరిచాడు. ఆగ్రహంతో ఊగిపోతున్న ట్రంప్ను కూల్ చేసేందుకు రమఫొసా మధ్యలో కలుగజేసుకున్నారు. ‘‘ ఖతార్ మాత్రమే కాదు. కావాలంటే మేం కూడా మీకు విమానాన్ని బహుమానంగా ఇస్తాం’’ అని అన్నారు. దీనికి ట్రంప్ వెటకారంగా బదులిచ్చారు. ‘‘ అగ్రరాజ్యమైన అమెరికాకే ఎయిర్ఫోర్స్వన్గా కొత్త విమానాన్ని ఇచ్చే దమ్ముంటే మీరూ ఇవ్వొచ్చు. నేను తీసుకునేందుకు రెడీ’’ అని అన్నారు. వెంటనే రమఫొసా ‘‘ అగ్రరాజ్యంగా ఉండి కూడా మీరు ఇంకొకరి నుంచి తీసుకునే స్థితిలో ఉన్నా.. ఇచ్చే స్థితిలో మేం లేము. మా వద్ద అసలు విమానమే లేదు’’ అని అనేసరికి అక్కడ ఉన్న వాళ్లంతా ఘొల్లున నవ్వేశారు. -
నోటికాడి బువ్వ.. నీటిపాలు
సాక్షి, హైదరాబాద్/ నల్లగొండ/ మంచిర్యాల అగ్రికల్చర్/ మహబూబ్నగర్ మున్సిపాలిటీ/ నిజామాబాద్ అర్బన్: రాష్ట్రంలో అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో వివిధ జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం బుధవారం కురిసిన వర్షానికి చాలా వరకు తడిచిపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే తడిచిపోవటంతో రైతులు ఆవేదనకు గురయ్యారు. తూకం వేసిన ధాన్యం బస్తాలు సైతం తడిచిపోవడంతో మిల్లర్లు వాటిని తీసుకుంటారో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో వర్షాలకు ధాన్యం తడిచిపోతోంది. ఇంకా కొనుగోలు చేయాల్సిన ధాన్యం 10 ఎల్ఎంటీ రాష్ట్రంలో ఇప్పటివరకు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చినట్లు పౌరసరఫరాల సంస్థ అధికారికంగా చెబుతోంది. అందులో 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేయగా, మిల్లులకు తరలించింది 54.33 ఎల్ఎంటీ మాత్రమే. అంటే ఇంకా సుమారు 6 ఎల్ఎంటీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉంది. ములుగు, మహబూబాబాద్, ఉమ్మడి ఖమ్మం, మహబూబ్నగర్లలో అక్కడక్కడ కోతలు ఆలస్యమైన నేపథ్యంలో మరో 5 ఎల్ఎంటీకి పైగా ధాన్యం రైతుల కల్లాల్లోనో, పొలాల్లోనో ఉంది. మొత్తంగా మరో 10 ఎల్ఎంటీ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉంది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, 17 శాతానికి తేమ తగ్గేవరకు ఆరబెట్టిన తరువాతే కొనుగోలు చేస్తామని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెప్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా, తేమ 20 శాతం ఉన్నా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సీఐకి లేఖ రాసినట్లు సమాచారం. నీటిపాలైన ధాన్యం ⇒ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కొత్తపేట, కట్టంగూర్, ఐటిపాముల, శాలిగౌరారం, గుడివాడ, తుంగతుర్తి, మద్దిరాల, నాగారం, నూతనకల్ మండలాల్లో, భూదాన్ పోచంపల్లి, గూడూరు ప్యాక్స్ కేంద్రాల్లో ధాన్యం నీట మునిగింది. పెద్దఅడిశర్లపల్లి మండలంలోని పెద్దగట్టులో పిడుగుపాటకు రెండు ఆవులు మృతిచెందాయి. జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొట్టుకుపోయింది. అర్వపల్లి కేంద్రంలో ధాన్యం బస్తాలు తడిచిపోయాయి. సూర్యాపేట పట్టణంలోని సీతారాంపురంలో పిడుగుపడి 10 గొర్రెలు, చివ్వెంల మండలం గంటోనిగూడెంలో 14 గొర్రెలు, కోదాడ మండలం నల్లబండగూడెంలో 38 మేకలు మృతిచెందాయి. ⇒ జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాగారం, ఆజంనగర్, రాంపూర్, కమలాపూర్, గొల్ల బుద్ధారం, పాంబాపూర్, భీమ్ ఘనపూర్ గ్రామాల్లో ధాన్యం తడిచింది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇంధనపల్లి గ్రామంలో ధాన్యం నీటిపాలైంది. ⇒ మహబూబ్నగర్లో బుధవారం ఉదయం 7 గంటల నుంచి 9.30 గంటలకు వరకు, రాత్రి 7.30 గంటల నుంచి 9.30 గంటలకు వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. పలు కాలనీల్లో ఓపెన్ నాలాలు, డ్రెయినేజీలు పొంగిపొర్లటంతో. పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలను కలెక్టర్ విజయేందిర, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి పరిశీలించారు. మహబూబ్నగర్ రూరల్ మండలంతో పాటు జడ్చర్ల, భూత్పూర్, దేవరకద్ర, అడ్డాకుల, మూసాపేట, నవాబుపేటలో ఓ మోస్తారు వర్షం కురిసింది. దేవరకద్ర, మిడ్జిల్, వెల్దండ ప్రాంతాల్లో వర్షాలకు ధాన్యం తడిచిపోయింది. ⇒ మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో కలిపి లక్ష మెట్రిక్ టన్నుల మేర నష్టం జరిగినట్లు సమాచారం. ⇒ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో బచ్చోడు కొనుగోలు కేంద్రంలో నిల్వధాన్యం తడిచిపోయింది. కరేపల్లి, రఘునాథపాలెం మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ⇒ వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని మార్కెట్ యార్డులో భారీగా ధాన్యం తడిచిపోయింది. ⇒ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దహెగాం మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిచింది. పెంచికల్పేట్, కౌటాల మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు కొట్టుకుపోయాయి. ⇒ నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద, లోకేశ్వరం, కుంటాల, భైంసా రూరల్, ఖానాపూర్, మామడ తదితర మండలాల్లో అకాల వర్షం రైతులను ఆగం చేసింది. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిచి ముద్దయింది. ⇒ భారీ వర్షాలకు ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం, ఎస్ఎస్ తాడ్వాయి మధ్య రోడ్డుపై చెట్టు అడ్డుగా పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యంతోపాటు ధాన్యం బస్తాలు తడిచిపోయాయి. వరంగల్ జిల్లా నర్సంపేట, ఇల్లంద వ్యవసాయ మార్కెట్లలో ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది. ⇒ నిజామాబాద్ జిల్లాలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మోపాల్ మండలం చిన్నాపూర్లో ట్రాన్స్ఫార్మర్ నేలకూలింది. ముదక్పల్లి, నర్సింగ్పల్లిలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మాక్లూర్ మండలంలో ఐదెకరాల బీర తోట ధ్వంసమైంది. పెర్కిట్, ఆర్మూర్, ఆలూర్ మండలంలో ఆరబోసిన వరిధాన్యం, సజ్జ పంట తడిశాయి. -
పొగాకు రైతుకు కంపెనీల కాటు
ఆత్మకూరు: అంతర్జాతీయంగా పేరొందిన కంపెనీలు నేరుగా రైతుల వద్దకు వచ్చాయి. పొగాకు సాగు చేయండి క్వింటా రూ.15,500 చొప్పున కొనుగోలు చేస్తామని చెప్పాయి. ఆ మేరకు రైతులతో ఒప్పందం కూడా చేసుకున్నాయి. కంపెనీల మాటలు నమ్మి వేలాది ఎకరాల్లో రైతులు పొగాకు సాగు చేశారు. తీరా పంట చేతికొచ్చాక కంపెనీలు ప్లేటు ఫిరాయించాయి. అధికంగా పొగాకు సాగు చేశారంటూ కొనుగోలు చేయకుండా మోసం చేశాయి. దీంతో కంపెనీల మాటలు నమ్మి నిండా మునిగిపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం పొగాకు కొనుగోలు చేయకపోతే తమ ఇళ్లు, పొలాలు, ఆస్తులన్నీ అమ్మినా అప్పులు తీరవని నంద్యాల జిల్లాకు చెందిన పొగాకు రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 20 రోజులుగా కొనుగోళ్లు నిలిపివేత గతేడాది పొగాకు సాగు తక్కువగా ఉండటంతో రైతులను ప్రోత్సహించేందుకు ఐటీసీ, చుక్కబర్రి కంపెనీలు ముందుకొచ్చాయి. క్వింటా రూ.15,500 చొప్పున కొనుగోలు చేస్తామని గతేడాది ఆగస్టు, సెపె్టంబర్ నెలల్లో రైతులతో ఒప్పందం చేసుకున్నాయి. దీంతో జిల్లాలో 17,215 ఎకరాల్లో పొగాకును సాగుచేశారు. ఆత్మకూరు, పాములపాడు, కొత్తపల్లి, నంద్యాల, పాణ్యం, ఓర్వకల్లు, నందికొట్కూరు, బేతంచెర్ల, నంద్యాల ప్రాంతాల్లోని రైతులు అత్యధికంగా పొగాకును సాగుచేశారు. కంపెనీల అగ్రిమెంట్ ఉండటంతో కొందరు రైతులు కౌలుకు తీసుకుని 50 ఎకరాలు కూడా సాగు చేశారు. ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వచి్చంది. రైతుల ఇళ్లు, కల్లాల వద్ద కుప్పలు కుప్పలుగా పొగాకు కనిపిస్తోంది. జిల్లా మొత్తం మీద 2,06,580 క్వింటాళ్ల పొగాకు దిగుబడి వచి్చంది. అయితే, తాము అగ్రిమెంట్ ఇచ్చిన దానికంటే రైతులు ఎక్కువగా పొగాకు సాగు చేశారని, దిగుబడి కూడా పెరిగిందని కంపెనీలు కొనుగోళ్లు నిలిపివేశాయి. సీజన్ ప్రారంభంలో కేవలం 20 నుంచి 40 శాతం పొగాకు మాత్రమే కొనుగోలు చేశాయి. దాదాపు 20 రోజులుగా కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేశాయి. ప్రస్తుతం నంద్యాల జిల్లాలో రైతుల వద్ద రూ.150 కోట్లకు పైగా విలువైన పొగాకు నిల్వలు ఉన్నాయి.మా ఇంటి వద్ద 100 క్వింటాళ్ల పొగాకు ఉంది మా ఇంటి వద్ద 100 క్వింటాళ్ల పొగాకు ఉంది. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పొగాకును సాగు చేశా. కంపెనీలు పొగాకు సాగు చేయాలని చెప్పాయి. అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం. కానీ నేటికీ పొగాకును కొనుగోలు చేయలేదు. ఏమి చేయాలో తెలియడం లేదు. పొగాకును వర్షంలో తడవకుండా కాపాడుకోలేకపోతున్నాం. ప్రభుత్వం పొగాకు రైతులను ఆదుకోవాలి. – రామచంద్రుడు, రైతు, కొత్త రామాపురం నంద్యాల జిల్లాపొలం, ఇల్లు అమ్మినా అప్పులు తీరవు ఎనిమిది ఎకరాల్లో పొగాకు సాగుచేశాం. 80 క్వింటాళ్లకు పైగా పొగాకు నిల్వ ఉంది. కంపెనీలు ఎప్పుడు కొనుగోలు చేస్తాయో చెప్పడం లేదు. ఇప్పటికే లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాం. ఆ అప్పులు ఎలా తీర్చాలో కూడా తెలియడం లేదు. కంపెనీలు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం పొగాకు కొనుగోలు చేయపోతే మా పొలం, ఇల్లు అమ్ముకున్నా అప్పులు తీరే పరిస్థితి కనిపించడం లేదు. – శంకర్, రైతు, ఆత్మకూరు, నంద్యాల జిల్లాకంపెనీలపై ప్రభుత్వం ఒత్తిడి తేవాలి ప్రభుత్వ పెద్దలు తరచూ కంపెనీలు పొగాకు కొనుగోలు చేస్తాయని ప్రకటిస్తున్నారు. కానీ మా జిల్లాలో మాత్రం కంపెనీలు 20 రోజులుగా రైతుల నుంచి కిలో పొగాకు కొనలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం సీరియస్గా స్పందించాలి. కంపెనీలపై ఒత్తిడి తెచ్చి అగ్రిమెంట్ ప్రకారం పొగాకు కొనుగోలు చేసేలా చూడాలి. – రవీంద్ర, రైతు, కొత్త రామాపురం, నంద్యాల జిల్లా -
సన్నాలకు బోనస్ ఎప్పుడు?
ఈ రైతు పేరు సుంకరి నరేష్. నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం దత్తాపూర్ గ్రామం. 5 ఎకరాలకు పైగా పొలంలో సన్న వడ్లు సాగు చేశాడు. 140 క్వింటాళ్ల వరకు (350 బస్తాలు) దిగుబడి వచ్చింది. ధాన్యాన్ని కుద్వాన్పూర్ సొసైటీకి విక్రయించి నెల రోజులు దాటింది. పంట డబ్బులైతే వచ్చాయి. కానీ బోనస్ డబ్బులు మాత్రం ఇంతవరకు బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. ప్రభుత్వం బోనస్ ఇస్తే తనకు రూ.70 వేల వరకు వస్తాయని, తదుపరి పంట పెట్టుబడికి పనికొస్తాయని చెబుతున్నాడు. సాక్షి, హైదరాబాద్: ఈ యాసంగి సీజన్లో సన్న ధాన్యం సాగు చేసిన రైతులు సర్కారు నుంచి రావలసిన బోనస్ కోసం ఎదురుచూస్తున్నారు. మార్చి నెలాఖరు నుంచే యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాగా, ఇప్పటివరకు 55.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. అయితే గతంలో ఏ యాసంగి సీజన్లోనూ లేనివిధంగా 18.47 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీల) సన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో రైతులు విక్రయించారు. పౌరసరఫరాల సంస్థ చరిత్రలోనే ఇది రికార్డు కాగా, ఈనెలాఖరు వరకు కొనుగోళ్లు సాగే అవకాశం ఉండటంతో 25 లక్షల నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల వరకు సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల సంస్థ అంచనా వేస్తోంది. అయితే రైతులకు బోనస్ చెల్లింపులో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ఇప్పటివరకు కొనుగోలు చేసిన 55.97 ఎల్ఎంటీ ధాన్యం విలువ రూ.12,974.10 కోట్లు కాగా, పౌరసరఫరాల సంస్థ రైతుల ఖాతాల్లో రూ.9,632.66 కోట్లు జమ చేసింది. అయితే ఆర్థిక శాఖ ద్వారా నేరుగా ప్రభుత్వమే విడుదల చేసే బోనస్ విషయంలో మాత్రం ఇప్పటివరకు ఉలుకూ పలుకూ లేకపోవడం గమనార్హం. బోనస్ ప్రకటనతో సన్న ధాన్యం సాగు తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర ప్రాంతంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా యాసంగిలో సన్న ధాన్యాన్ని రైతులు ఎక్కువగా పండించరు. అయితే ప్రభుత్వం క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తుండటంతో రైతులు ఈసారి పెద్దయెత్తున సన్నాలు సాగు చేశారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, అందులో ఏకంగా 7.15 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలే కావడం గమనార్హం. అలాగే నల్లగొండ, నారాయణపేట, జగిత్యాల, నిర్మల్, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున సన్న ధాన్యాన్ని పండించారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం బోనస్ ఇవ్వకపోవడంతో రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ సీజన్లో రూపాయి ఇవ్వలే! యాసంగి సీజన్లో ఇప్పటివరకు 18.47 ఎల్ఎంటీల సన్న ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. క్వింటాల్కు రూ.500 బోనస్ చొప్పున 2,87,262 మంది రైతులకు రూ.923.40 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ఆర్థిక శాఖ ఇప్పటి వరకు బోనస్ కింద రైతులకు రూపాయి కూడా విడుదల చేయలేదు. కొనుగోళ్లు మొదలై 45 రోజులు దాటినప్పటికీ, బోనస్ చెల్లించకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కౌలు రైతులు సకాలంలో బోనస్ రాక, ఎప్పుడు వస్తుందో తెలియక ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ఖజానాలో నిధులు లేకపోవడం వల్లనే రైతులకు బోనస్ చెల్లించడంలో ఆలస్యం అవుతోందని ఓ అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. మరో 15 రోజుల్లో వానాకాలం సీజన్ మొదలు కాబోతుండగా, ఇప్పటివరకు బోనస్ మొత్తం బ్యాంకు ఖాతాలో జమ కాకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయమై పౌరసరఫరాల శాఖకు చెందిన ఓ అధికారిని ప్రశ్నించగా, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. గత వానాకాలంలో రూ.1,200 కోట్లు చెల్లింపు గత వానకాలం సీజన్ నుంచే ప్రభుత్వం బోనస్ను అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో గత వానాకాలం సీజన్లో 24 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా సన్న రకం ధాన్యం పండించిన సుమారు 4.50 లక్షల మంది రైతులకు రూ.1,200 కోట్లకు పైగా ప్రభుత్వం నేరుగా చెల్లించింది. ఆ సీజన్లో ధాన్యం కొనుగోళ్లతో పాటుగానే విడతల వారీగా బోనస్ను జమచేస్తూ వచ్చింది. యాసంగి ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యే నాటికి పూర్తిస్థాయిలో బోనస్ను చెల్లించింది. 180 క్వింటాళ్ల సన్న ధాన్యం అమ్మా నేను 8 ఎకరాలల్లో సన్న రకం వరి సాగు చేశా. 180 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రంలో అమ్మా. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు బోనస్ ఇవ్వలేదు. అలాగే రెండుసార్లు కాంటా పెడితే మొదటిసారి అమ్మిన ధాన్యానికి మాత్రమే డబ్బులు వచ్చాయి. రెండోసారి కాంటా పెట్టిన ధాన్యానికి ఇంకా రాలేదు. – గడ్డం పాలెం లింగారెడ్డి, రెంజర్ల, ముప్కాల్ మండలం, నిజామాబాద్ జిల్లా బోనస్ ఊసే లేదు.. వడ్లు కాంటా పెట్టి 45 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ప్రభుత్వం ఇస్తానన్న బోనస్ చెల్లించలేదు. బోనస్ ఇస్తానని ప్రభుత్వం ప్రకటించడం వల్లే వ్యాపారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లో అమ్మడం జరిగింది. ఇంటిల్లిపాదీ 15 రోజులు కష్టపడి వడ్లను ఆరబెట్టి కేంద్రాల్లో విక్రయిస్తే ఇప్పటివరకు బోనస్ ఊసే లేదు. – గుజ్జ రామకృష్ణ , తగిలేపల్లి, వర్ని మండలం, నిజామాబాద్ జిల్లా -
బొప్పాయి.. లాభమేనోయి..
దేవరపల్లి: పొగాకు, జీడిమామిడి పంటలకు మార్కెట్లో గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో ప్రత్యామ్నాయంగా పండ్ల తోటల సాగుపై రైతులు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా బొప్పాయి సాగుతో లాభాలు సాధిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని 326 హెక్టార్లలో రైతులు బొప్పాయి సాగు చేస్తున్నారు. ముఖ్యంగా కడియం, అనపర్తి, దేవరపల్లి, నల్లజర్ల, గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు మండలాల్లో దీని సాగు అధికంగా ఉంది. తెగుళ్లను తట్టుకునే రకాల మొక్కలను మహారాష్ట్ర నుంచి తీసుకుని వచ్చి, తోటలు వేసి అధిక దిగుబడులు సాధిస్తున్నారు.బొప్పాయిలో అనేక రకాల వంగడాలున్నప్పటికీ ఎక్కువ మంది పింక్, కో–786, తైవాన్ రెడ్ లీడ్, స్వీట్ బరీ రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. మొక్క వేసిన 9 నెలల్లో కాపు వస్తోంది. రెండు నుంచి నాలుగేళ్ల పాటు ఎకరాకు 30 నుంచి 40 టన్నుల చొప్పున దిగుబడి వస్తోంది. దిగుబడి బాగుంటే నాలుగేళ్ల వరకూ తోటలు ఉంటాయి. కొంత మంది రెండేళ్లకే తోటలను తొలగిస్తున్నారు. మొదటి రెండేళ్లు దిగుబడి, పండు నాణ్యత, సైజు బాగుంటాయి. ఒక్కో పండు 2 నుంచి 4 కిలోల బరువు ఉంటుంది. ఎకరాకు రూ.1.50 లక్షల ఆదాయం వస్తోందని, పెట్టుబడి రూ.60 వేల నుంచి రూ.70 వేలు అవుతోందని చెబుతున్నారు. ఆరోగ్య ప్రయోజనాలు » బొప్పాయి పండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. » ఇది జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. » చర్మం, కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. » బరువు తగ్గడానికి, గుండె సంబంధిత సమస్యల నివారణకు తోడ్పడుతుంది. » బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్–సి దంతాల చిగుళ్ల ఆరోగ్యానికి, రక్తవృద్ధికి, రోగ నిరోధక శక్తి పెంపుదలకు తోడ్పడుతుంది. » విటమిన్–బి నోటిపూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది. » కెరోటిన్, ఎ, బి, సి, ఇ విటమిన్లు, ఖనిజాలు, ప్లేవొనాయిడ్లు, ఫోలేట్లు, పాంథోనిక్ ఆమ్లాల వంటి పోషకాలు బొప్పాయి పండులో పుష్కలంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. » ఇన్ని విధాల ఆరోగ్యం కలిగించేది కావడంతో బొప్పాయి పండును ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. దిగుబడి బాగుంది నేను నాలుగెకరాల్లో బొప్పాయి పంట వేశాను. రెండు కోతలు జరిగాయి. ఎకరాకు 20 టన్నుల దిగుబడి వచ్చింది. టన్ను కాయలకు రూ.10 వేలు లభించాయి. ప్రస్తుతం టన్ను కాయలు రూ.5 వేలు పలుకుతున్నాయి. రావులపాలెం, అమలాపురం ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి కాయలు కొనుగోలు చేసి, కోల్కతా, భువనేశ్వర్ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.ధర బాగుంటే మంచి ఆదాయం వస్తుంది. జూలైలో తోట వేయగా, ఫిబ్రవరిలో కాపునకు వచ్చింది. మహారాష్ట్ర నుంచి మొక్క రూ.23 చొప్పున కొనుగోలు చేసి తెచ్చాను. ఎకరాకు 700 మొక్కలు పడతాయి. కాయ సైజు, నాణ్యత బాగున్నాయి. – కూచిపూడి రాజు, రైతు, పట్లంట్ల, దేవరపల్లి మండలం కొవ్వూరు డివిజన్లో అధికం బొప్పాయి సాగు కొవ్వూరు డివిజన్లో ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. రాజమహేంద్రవరం డివిజన్లోని కడియం, అనపర్తి ప్రాంతాల్లో అక్కడక్కడ తోటలు వేశారు. వాతావరణం అనుకూలించి, తెగుళ్లు లేకుండా ఉంటే రైతులకు ఇది లాభదాయకమైన పంట. రైతులు ఇప్పుడిప్పుడే బొప్పాయి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. – బి.సుజాత కుమారి, జిల్లా ఉద్యాన అధికారి, రాజమహేంద్రవరం కోల్కతా, ఒడిశాకు ఎగుమతి వేసవి అనంతరం ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో రైతులు బొప్పాయి తోటలు వేస్తారు. నల్ల నేలలు, ఇసుక, రాతి నేలలు దీని సాగుకు అనుకూలంగా ఉంటాయి. రాతి నేలలు, కొండ ప్రాంతాల్లో ఈ పంట పండదు. ఏటా మార్చి నుంచి జూన్ వరకూ దిగుబడి వస్తుంది. ఈ ప్రాంతంలో పండించిన బొప్పాయి కాయలు, పండ్లను ఒడిశా, భువనేశ్వర్, కోల్కతా వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఒడిశాలోని పలు ప్రాంతాల్లో బొప్పాయి కాయలు కూరగా వండుకొని తింటూంటారు. దీంతో, ఆ ప్రాంతాలకు పచ్చి కాయలు కూడా ఎగుమతి చేస్తున్నారు. వేసవిలో పండ్లకు ఎక్కువ గిరాకీ ఉంటుంది. స్థానికంగా ఉన్న పండ్ల వ్యాపారులు తోటల్లోకి వచ్చి పండు కాయలు కొనుగోలు చేస్తారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో కిలో రూ.10 పలికింది. ప్రస్తుతం రూ.5 పలుకుతోంది. -
మీ పాలనలో రైతులకు మేలు జరిగిందయ్యా!
సాక్షి, అమరావతి: ‘మీ పాలనలో రైతులందరికీ మేలు జరిగిందయ్యా. మీ హయాంలో రైతుల కష్టాలు తెలుసుకుని అన్నదాతకు అండగా నిలిచి.. మద్దతు ధర కల్పించి ధాన్యం కొనుగోలు చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు ఎలాంటి సాయం అందకపోగా ఆరుగాలం కష్టించి పండించిన పంటను కొనుగోలు చేయడం లేదు. రైతులు రోడ్డెక్కి నిరసనలు, ఆందోళనలు చేయాల్సి వస్తోంది. అయినా పట్టించుకోవడం లేదయ్యా’ అని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పొడగట్లపల్లికి చెందిన రైతు మెర్ల సత్యనారాయణ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఎదుట వాపోయారు.మంగళవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రైతు మెర్ల సత్యనారాయణ మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిసి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూత లేకపోయినా తమ ప్రాంత రైతులు ఎకరాకు 55–60 బస్తాల ధాన్యం పండించారని ఆ రైతు వివరించారు. ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులంతా నిరసనలు, ఆందోళనలు చేసినా ప్రభుత్వంలో చలనం లేదని వాపోయారు.ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు కళ్లాల్లోనే ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. దీనికి వైఎస్ జగన్ బదులిస్తూ.. అన్నదాతకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతుల తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ హామీతో రైతు సత్యనారాయణ సంతోషంతో తాను పండించిన వరి కంకులను ఆయనకు బహూకరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ను మాజీ మంత్రి కురసాల కన్నబాబు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, రామచంద్రాపురం వైఎస్సార్సీపీ ఇన్చార్జి పిల్లి సూర్యప్రకాష్ కలిశారు. -
దొడ్డుగా సాగు..
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఈ యాసంగిలోనూ రైతులు వరి సాగు విషయంలో దొడ్డు రకాల వైపే ఎక్కువగా మొగ్గు చూపారు. సన్న రకాలకు ప్రభుత్వం క్వింటాల్కు రూ.500ల బోనస్ ప్రకటించినప్పటికీ..ఎప్పటిలా దొడ్డు రకాల కంటే తక్కువే సాగయ్యాయి. ఈ యాసంగిలో తెలంగాణ వ్యాప్తంగా 63,54,286 ఎకరాల్లో వివిధ పంటలు వేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేయగా పంట విస్తీర్ణం ఏకంగా 79,99,834 (126 శాతం) ఎకరాలకు పెరిగింది. వరి 47,27,000 ఎకరాల్లో సాగవుతుందని అనుకుంటే.. ఏకంగా 59.86 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అయితే ఇందులో 65 శాతానికి పైగా దొడ్డురకాలే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే గతంతో పోల్చుకుంటే సన్నాల సాగు పెరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి. కొనుగోలు కేంద్రాలకూ ఎక్కువగా దొడ్డురకాలే.. వరి సాగు విస్తీర్ణం పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం యాసంగిలో 71,03,283 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలును లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ 8,412 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించినా.. చివరకు 8,353 కేంద్రాలను తెరిచింది. వీటి ద్వారా ఈ నెల 20వ తేదీ నాటికి 55.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. ఇందులో 37.50 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు రకాలు కాగా, సన్న రకం కేవలం 18.47 లక్షల మెట్రిక్ టన్నులే కావడం గమనార్హం.సన్నాలకు ఎన్ని సమస్యలో.. సన్న రకం వడ్ల సాగుకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది. నీటి వసతి ఎక్కువగా ఉండాలి. చీడపీడల బెడద అధికం. పంట కాలం సైతం నెల రోజులు ఎక్కువగా ఉంటుంది. అకాల వర్షాలతో నష్టపోయే అవకాశం ఉంటుంది. పైగా యాసంగిలో వాతావరణం దృష్ట్యా దిగుబడి తక్కువగా వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న సన్న రకాల విత్తనాలను చూస్తే.. తెలంగాణ సోనా ఎకరాకు 20 నుంచి 23 క్వింటాళ్లు, బీపీటీ 20 క్వింటాళ్ల వరకు, జై శ్రీరాం 18 క్వింటాళ్ల వరకు మాత్రమే దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అదే దొడ్డు రకం వరి అయితే 5 నుంచి 8 క్వింటాళ్ల వరకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే దొడ్డు సాగువైపు మొగ్గు చూపామని వివరిస్తున్నారు.యాసంగి సాగు, కొనుగోళ్ల లెక్కలివీ..71,03,283 మెట్రిక్ టన్నులు యాసంగి 2024–25 ధాన్యం కొనుగోలు లక్ష్యం..55.97 లక్షల మె.టన్నులు ఇప్పటి వరకు కొనుగోలు చేసినవి (20.05.2025) 37.50 లక్షల మె.టన్నులు ఇందులో దొడ్డు రకం ధాన్యం18.47 లక్షల మె.టన్నులు సన్న రకం ధాన్యం 8,412ప్రతిపాదించిన కొనుగోలు కేంద్రాలు8,353ప్రారంభించిన కొనుగోలు కేంద్రాలురూ.12,974.10 కోట్లు కొనుగోలు చేసిన ధాన్యం విలువరూ.9,632.66 కోట్లు ఎంపీఎంఎస్ ద్వారా చేసిన చెల్లింపులుఎక్కువ దిగుబడి కోసమే దొడ్డు రకం.. సన్న రకం అయితే పంట కాలం ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతోనే దొడ్డు రకం వేసిన. పైగా దొడ్డు రకంతో ఎక్కువ దిగుబడి వస్తుంది. అందుకే తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ దిగుబడి వచ్చే దొడ్డు రకం (1010) సాగు చేశా. సన్నాలకు బోనస్ ఉన్నా.. దిగుబడి తగ్గితే లాభం ఉండదని అనుకున్నం. – కొండమీది భిక్షపతి, కమలాపూర్, హనుమకొండ జిల్లా సాగు నిబంధనలు ఏమీ లేవు.. వరి విషయంలో రైతులు పలాన రకాలే సాగు చేయాలనే నిబంధనలు ఏమీ లేవు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరుగా రైతులు తమకు నచి్చన వెరైటీలను వేసుకున్నారు. వ్యవసాయశాఖ తరఫున పంటల సాగుకు ఎప్పటికప్పుడు తగు సూచనలు చేశాం. తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో దొడ్డురకాలే నయమన్న ధోరణితో చాలామంది అటువైపు మొగ్గు చూపినట్లు ఉంది. – కేతిరి దామోదర్రెడ్డి, ఏడీఏ, వరంగల్ జిల్లా -
పవన్ పై పిఠాపురం రైతులు ఫైర్
-
సమస్య చెప్పు కోవడానికి వచ్చిన రైతు పట్ల మైలవరం MLA వసంత కృష్ణప్రసాద్ ఆగ్రహం
-
సమీకరణకు భూములిచ్చే ప్రసక్తి లేదు
తాడికొండ: భూసమీకరణకు భూములిచ్చే ప్రసక్తే లేదని రాజధాని గ్రామాల్లోని రైతులు ముక్తకంఠంతో చెప్పారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురం, వడ్డమాను, పెదపరిమి గ్రామాల్లో మంగళ, బుధవారాల్లో జరిగిన గ్రామ సభల్లో రైతులతో పాటు టీడీపీ నాయకులు సైతం భూముల సమీకరణకు అంగీకరించబోమని తేల్చిచెప్పారు. గతంలో భూములిచ్చిన వారి పరిస్థితి చూస్తే తమకు భయమేస్తోందని, పూలింగ్ కోసమని తీసుకుని పదేళ్లుగా రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఎందుకు ఇవ్వలేకపోయారని నిలదీశారు. హరిశ్చంద్రపురానికి చెందిన ఓ సీనియర్ టీడీపీ నాయకుడు ఈ విధానాన్ని తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని కుండబద్దలు కొట్టారు. ‘ఇంతకుముందు నమ్మి భూములిచ్చిన రైతులకు రూ.63 వేల కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు కదా. చేసి చూపించండి అప్పుడు చూద్దాం. తలాతోక లేకుండా సమీకరణ పేరుతో మా భూములను తీసుకునే ప్రయత్నం చేస్తే మాత్రం సహించేది లేదు’ అని తేల్చిచెప్పారు. మరికొందరు రైతులు మాట్లాడుతూ రైల్వే లైన్, అంతర్గత రోడ్లకు అయితే కొంత సానుకూలంగా ఉంటాం కానీ.. పూలింగ్కు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదన్నారు. అసలు అమరావతి ఇక్కడే ఉంటుందని నమ్మకం ఏమిటని, కేంద్రం రాజధానిపై స్పష్టమైన గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిం చారు. ప్రభుత్వాలు మారితే తమ పరిస్థితి ఏంటని ప్రశి్నంచారు. ఎమ్మెల్యేకు షాకిచ్చిన రైతులువడ్డమాను గ్రామ సభలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతం కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చెందుతుందని రైతులకు చెబుతుండగా.. రైతులు ఆయనకు షాకిచ్చారు. ‘మీరు 10 సంవత్సరాల క్రితం గెలిచారు. మళ్లీ ఇప్పుడు గెలిచారు. వడ్డమానులో పుష్కరాలకు ఒకసారి రోడ్డు వేస్తారు. మనిషి దిగిపోయేంతగా గుంతలు పడి వెళ్లేందుకు కూడా ఇప్పుడు మార్గం లేదు. 2029 వరకు అవకాశం ఉంది. తొలివిడతలో రైతులు ఇచ్చి న భూములను అభివృద్ధి చేసి చూపించండి. ఇప్పటికే ఏడాది పూర్తయింది. చివరి ఏడాది తీసేస్తే మూడేళ్లు మాత్రమే సమయం ఉంది. కాబట్టి ఈలోగా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం ఇతర ప్రభుత్వ భవనాలు కట్టండి. రైతుల భూముల అభివృద్ధి చేయండి. ఇప్పుడైతే భూసమీకరణకు మేం వ్యతిరేకం. మొదట భూములిచ్చిన రైతులకు సంతృప్తి కలిగించి.. మా వద్దకు వస్తే అప్పుడు ఆలోచిస్తాం’అని రైతులు తెగేసి చెప్పారు. గ్రామ సభల్లో ఆర్డీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ కె.సుజాత, ఎంపీడీవో కానూరి శిల్ప పాల్గొన్నారు. -
‘ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులు ఎలా బతకాలి? ’
తాడేపల్లి : రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాలికొదిలేశారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. కౌలుదారు రైతులనైతే చంద్రబాబు అస్సలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈరోజు(బుధవారం) తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన కారుమూరి.. జగన్ హయాంలో కౌలు రైతులకు పెద్ద పీట వేస్తే, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వారిని పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.‘జగన్ హయాంలో కౌలు రైతులకు పెద్ద పీట వేశారు. పంట నష్టం వచ్చినా అందుకున్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించారు. చంద్రబాబు వచ్చాక కౌలుదారీ కార్డులు తొలగించారు. ఖరీఫ్ సీజన్ కి మరో 15 రోజులే సమయం ఉంది. ఈలోపు కౌలుదారులకు కూడా న్యాయం చేయాలి. 80% మంది ఉన్న కౌలు రైతుల మేలు గురించి పట్టించుకోకపోవడం దారుణం. జగన హయాంలో తడిసిన ధాన్యం కూడా చివరి గింజ వరకు కొనుగోలు చేశారు. కౌలు రైతుకు కూడా కార్డులు ఇస్తే ఎక్కడ ప్రభుత్వ మేలు చేయాల్సి వస్తుందోనని చంద్రబాబు ఇవ్వటం లేదు. 32 లక్షల మంది కౌలు రైతులు చంద్రబాబు వలన ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులు ఎలా బతకాలి?, వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నారో అర్ధం కావటం లేదు. వ్యవసాయం దండగ అనే ఆలోచనలోనే ఇంకా చంద్రబాబు ఉన్నారు. అమరావతి మీద చూపే ప్రేమ రైతుల మీద కూడా చూపించండి. పొగాకుకు ధరల్లేక రైతులు కన్నీళ్ళు పెడుతుంటే చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదు?, పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. జగన్ హయాంలో రూ.18 వేలు ఉన్న ధర ఇప్పుడు రూ.10వేలు కూడా లేదురైతులను వదిలేసి అమరావతి, భ్రమరావతి అంటూ చంద్రబాబు తిరుగుతున్నారు. పొగాకు రైతులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంది. వారి తరపున పోరాటం చేస్తాం. పవన్ కళ్యాణ్ పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్రంతో మాట్లాడాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్.. అందరూ స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నారు. ప్రభుత్వ సొమ్మును ఇష్టానుసారం వాడుకుంటున్నారు’ అని మండిపడ్డారు. -
రైతు కుటుంబంపై పోలీసుల దాష్టీకం
-
ధాన్యం కొనాలంటూ రైతుల ఆందోళన
తాళ్లపూడి (కొవ్వూరు): ‘ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనడంలేదు. మిల్లర్ల వద్దకు తీసుకువెళితే టార్గెట్ పూర్తయిందని చెప్పి తీసుకోవడం లేదు. మరి మేం పండించిన ధాన్యాన్ని ఏం చేయాలి..’ అంటూ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ రైతులు ప్రశి్నస్తున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయడాన్ని నిరసిస్తూ కొవ్వూరు సమీపంలోని గామన్ బ్రిడ్జి వద్ద జాతీయ రహదారిపై ధాన్యం లోడు ట్రాక్టర్లను నిలిపి ఆందోళన చేశారు. కొవ్వూరు, తాళ్లపూడి మండలాల రైతులు మండుటెండలో రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని, తమ వద్ద ఉన్న రబీ ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ వద్ద ధాన్యం కొనలేని స్థితిలో ప్రభుత్వం ఉందా.. అని మండిపడ్డారు. నియోజకవర్గంలో ఇంకా 5వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉందని చెప్పారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. దిక్కుతోచని పరిస్థితుల్లో ఆందోళనకు దిగామని తెలిపారు. పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సు«దీర్, జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ టి.రాధిక వచ్చి 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రైతుల ఆందోళనతో హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. -
మా బతుకులతో ‘ఆడుకోవద్దు’
భూమితో మాది విడదీయరాని అనుబంధం.. వ్యవసాయం తప్పితే మాకు వేరే వృత్తి తెలియదు.. తక్కువో ఎక్కువో ఉన్నదాంట్లోనే పంటలు పండించుకుంటున్నాం, గుట్టుగా బతుకుతున్నాం.. కన్నతల్లి లాంటి భూమిని మానుంచి లాక్కుని మా జీవితాలతో ఆటలాడొద్దు.. గతంలో భూ సమీకరణకు తీసుకున్న భూములకే ఇప్పటికీ దిక్కూమొక్కు లేదు.. ఇప్పుడు మా నుంచి తీసుకున్న భూమికి ఎప్పుడు న్యాయం చేస్తారు? కళ్లముందు ఉన్న భూమిని పోగొట్టుకుని.. ఎక్కడో ఇచ్చే భూమి మాకెందుకు? – స్పోర్ట్స్ సిటీ భూసమీకరణ గ్రామసభల్లో రైతులుసాక్షి ప్రతినిధి, విజయవాడ: రైతులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నా, మా భూములు ఎందుకివ్వాలని నిలదీస్తున్నా, తమ జీవితాలతో ఆడుకోవద్దని వేడుకుంటున్నా, స్పోర్ట్స్ సిటీ పేరుతో భూ సమీకరణ ద్వారా భారీఎత్తున భూములను తీసుకునేందుకే ప్రభుత్వం సిద్ధమవుతోంది. అన్నదాతలు ససేమిరా అంటున్నా.. మాయమాటలతో మభ్యపెట్టి ముందుకు అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగానే అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. వీటిలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినా సరే సర్కారు తన ధోరణిని మార్చుకోవడం లేదు.ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు, త్రిలోచనాపురం, కాచవరం, కేతనకొండ, జమీమాచవరంలో స్పోర్ట్స్ సిటీకి అవసరమైన భూములను ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో తీసుకునేందుకు రెవెన్యూ అధికారులు గ్రామ సభలు ఏర్పాటు చేశారు. వాస్తవానికి స్పోర్ట్స్ సిటీకి తొలుత కృష్ణా నది లంక గ్రామాలు, లంక భూములను ప్రభుత్వ పెద్దలు ఎంచుకున్నారు. నెల రోజుల క్రితం కృష్ణా పరీవాహక ప్రాంతమైన చినలంక, పెదలంక, ఇబ్రహీంపట్నం, జూపూడిలో లంక భూములను మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, పలువురు ఎమ్మెల్యేలు పరిశీలించారు. కానీ, ఈ భూములకు కృష్ణా వరద తాకిడి ఉంటుందనే కారణంతో తాజాగా మూలపాడు పరిధిలోని మెరక ప్రాంత భూములపై కన్నేశారు.అయితే, స్పోర్ట్స్ సిటీ, ఐకానిక్ బ్రిడ్జి పేరుతో విలువైన, జీవనాధారమైన భూములను తీసుకునేందుకు ప్రభుత్వం పన్నిన పన్నాగాన్ని రైతులు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. స్పోర్ట్స్ సిటీ పేరుతో వ్యాపారం చేసేందుకే తమ భూములను తీసుకుంటున్నారనే అభిప్రాయం రైతుల్లో నెలకొంది. దీంతో పంట పొలాలను ఇవ్వబోమని విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య ఎదుట తెగేసి చెప్పారు. వారు ఒప్పుకోకున్నా ఏదోరకంగా భూములు స్వా«దీనం చేసుకునే ఎత్తుగడల్లో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. ఒప్పుకోకున్నా ఒప్పుకొన్నట్లు.. రైతుల అభిప్రాయ సేకరణకు రెవెన్యూ అధికారులు గురు, శుక్రవారాల్లో గ్రామ సభలు నిర్వహించారు. మూలపాడు సభలో కొందరు భూములు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు కూటమి నేతలు ప్రకటించారు. కానీ, వెంటనే 90 శాతం మంది రైతులు ల్యాండ్ పూలింగ్లో భూములు ఇవ్వబోమని తహసీల్దార్ వెంకటేశ్వర్లుకు తెగేసి చెప్పారు. అమరావతి రాజధానినే ఇప్పటివరకు అభివృద్ధి చేయలేదని ఇక తమ ప్రాంతాన్ని ఎప్పుడు అభివృద్ధి చేస్తారని సూటిగా ప్రశి్నంచారు. వ్యవసాయమే జీవనాధారంగా బతికే తాము పొలాలను ఎలా ఇస్తామని నిలదీశారు. భూమి మా చేతిలో ఉంటేనే బంగారంజమీమాచవరంలో సభకు హాజరైన రైతులు అందరూ ల్యాండ్ పూలింగ్లో భూములిచ్చేది లేదని తేల్చి చెప్పారు. కాచవరం, కేతనకొండ గ్రామ సభల్లో ఆర్డీవో కావూరి చైతన్య పాల్గొన్నారు. కాచవరంలో ఒకరిద్దరు భూస్వాములు మినహా మిగిలిన రైతులు ప్రభుత్వానికి పొలాలు ఇవ్వబోమని ప్రకటించారు. కేతనకొండలో రైతులు నిరసనగా చప్పట్లు కొడుతూ మరీ పొలాలు ఇచ్చేది లేదని వెల్లడించారు. ‘భూమి మా ఆధీనంలో ఉంటే పిల్లల చదువులు, వివాహాలు, కుటుంబ అవసరాలకు వాడుకుంటాం. ప్లాటు ఇవ్వడానికి మరో మూడు నాలుగేళ్లు పడుతుంది. అప్పటివరకు మా అవసరాలు ఎలా తీరతాయి’ అంటూ ఆర్డీవో చైతన్యను రైతులు సూటిగా ప్రశి్నంచారు.2,874 ఎకరాల సేకరణకు ఎత్తుగడ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం మండలం ఐదు గ్రామాల పరిధిలోని భూములను ల్యాండ్ పూలింగ్లో సేకరించేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామ సభల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి గ్రామాల్లో ఉన్న భూముల వివరాలను వెల్లడించారు. మూలపాడులో 313 ఎకరాలు, కాచవరంలో 590 ఎకరాలు, త్రిలోచనాపురంలో 1,390 ఎకరాలు, జమీమాచవరంలో 301 ఎకరాలు, కేతనకొండలో 280 ఎకరాలు చొప్పున మొత్తం 2,874 ఎకరాలను ల్యాండ్ పూలింగ్లో తీసుకోనున్నారు. వీటిలో ఎక్కువగా పట్టా భూములు ఉండగా, ఎన్ఎస్పీ కాలువ, ప్రభుత్వ అసైన్మెంట్, లంక భూములు కొన్ని ఉన్నాయి. చిన్న, సన్నకారు రైతుల పొట్టకొడతారా? చిన్న, సన్నకారు రైతుల భూములను ల్యాండ్ పూలింగ్లో తీసుకోవడం దుర్మార్గమైన చర్య. వారి పొట్టకొడతారా? పూలింగ్పై ప్రతి గ్రామంలో రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. రెవెన్యూ అధికారుల వద్ద వారి ఆవేదనను వెల్లడించారు. భూములే జీవనాధారం అని కూడా తేల్చిచెప్పారు. మెజార్టీ రైతుల అభిప్రాయం మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. –గరికపాటి శ్రీదేవి, జెడ్పీ వైస్ చైర్మన్, మూలపాడు 3 పంటలు పండే భూములు.. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఇబ్రహీంపట్నంలో ఎకరా రూ.కోటి నుంచి రూ.2 కోట్ల ధర పలుకుతోంది. మా భూముల్లో ఏడాదికి మూడు పంటలు పండుతాయి. వీటిని ప్రభుత్వానికి ఇచ్చేది లేదు. – ఎస్డీ జానీ, పీఏసీఎస్ మాజీ చైర్మన్, కేతనకొండ ఉన్నది 80 సెంట్లు.. అదీ తీసుకుంటారా? 80 సెంట్ల భూమిలో వ్యవసాయం చేస్తున్నా. కొంత భాగం పొలంలో గ్రాసం పెంచి పాడి పరిశ్రమను నిర్వహిస్తున్నా. కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నాకు వ్యవసాయం తప్ప మరో పని తెలియదు. ఇప్పుడు ఉన్న పొలం తీసుకుని ప్లాటు ఇస్తామంటే ఎలా? – ఆళ్ల శ్రీనివాసరావు, రైతు, త్రిలోచనాపురం -
కొనేవారేరీ..!
పెండలం ధర ప్రస్తుతం పూర్తిగా పతనమై, కిలో రూ.4 పలుకుతోంది. దుంపను తవ్వడానికి కిలోకు రూ.3 వరకూ ఖర్చవుతోందని, ప్రస్తుత పరిస్థితిలో దుంప తవ్వితే కూలి ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఎకరాకు రూ.2 లక్షల వరకూ నష్టం వస్తోందని చెబుతున్నారు. ధర బాగుంటే ఎకరాకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల ఆదాయం వస్తుందని అంటున్నారు.దేవరపల్లి: భూమి నుంచి తవ్వి తీసే సమయం దాటిపోతున్నా.. కొనే నాథుడు లేక పెండలం దుంపలు చేలల్లోనే ఎండిపోతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. గత రెండేళ్లూ మార్కెట్లో పెండలం దుంపలకు మంచి గిరాకీ ఉండేది. గణనీయంగా దిగుబడులు వచ్చేవి. మార్కెట్లో గిట్టుబాటు ధర పలికేది. దీంతో రైతులకు నాలుగు డబ్బులు మిగిలేవి. దీంతో చిన్న, సన్నకారు రైతులు ఉన్న కొద్దిపాటి భూములతో పాటు కౌలుకు తీసుకుని ఈ ఏడాది పెండలం సాగు చేశారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం పల్లంట్ల, కురుకూరుతో పాటు కొవ్వూరు, తాళ్లపూడి మండలాల్లో సుమారు 1,200 ఎకరాల్లో పెండలం సాగు జరుగుతోంది. పల్లంట్ల, కురుకూరు, లక్ష్మీపురం గ్రామాల్లోని రైతులు సుమారు 30 ఏళ్లుగా పెండలం సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. ఈ రెండు గ్రామాల్లోనూ సుమారు 600 ఎకరాల నల్లరేగడి భూముల్లో వాణిజ్య పంటగా పెండలం సాగు జరుగుతోంది. పల్లంట్ల దుంపకు డిమాండ్ పల్లంట్ల, కురుకూరు గ్రామాల్లో పండే పెండలం దుంపకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఇక్కడి దుంప మంచి సైజుతో పాటు నాణ్యత ఉంటుంది. 2 నుంచి 5 కిలోల దుంప తయారవుతుంది. కోనసీమ జిల్లా రావులపాలెం ప్రాంతానికి చెందిన వ్యాపారులు ఇక్కడకు వచ్చి పెండలం దుంప కొనుగోలు చేసి, ఒడిశాకు ఎగుమతి చేస్తారు. ఒడిశాలో పెండలాన్ని వివాహాలకు ఎక్కువగా వినియోగిస్తారని, ప్రతి ఇంటికీ 10 నుంచి 20 కిలోల దుంపలు సారెగా పంచి పెడతారని రైతులు చెప్పారు. ఈ ప్రాంతంలో పండిన ప్రతి కిలో దుంప అక్కడికే వెళ్తుందని తెలిపారు. అయితే, ఈ ఏడాది ఒడిశాలో రైతులు పెండలం సాగు చేయడంతో పాటు అక్కడ వినియోగం తగ్గడం వల్ల డిమాండ్ తగ్గినట్లు సమాచారం. చేలల్లోనే ఎండిపోతూ.. తీగ జాతి పంట అయిన పెండలం దుంప భూమిలోనే తయారవుతుంది. ఏటా జూన్, జూలై నెలల్లో పెండలం సాగు ఆరంభిస్తూండగా.. జనవరి నుంచి మే నెలాఖరు వరకూ దిగుబడి వస్తుంది. ఒక్కో దుంప 2 నుంచి 5 కిలోల వరకూ బరువుంటుంది. వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు 10 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుంది. ఈ ఏడాది దిగుబడులు బాగున్నాయని, ధర 10 టన్నులకు రూ.40 వేలకు పడిపోయిందని, అయినప్పటికీ అడుగుతున్న నాథుడే లేడని రైతులు వాపోతున్నారు. దీంతో, దుంప చేలల్లోనే ఎండిపోతోందని ఆవేదన చెందుతున్నారు. ఇటీవలి వర్షాలకు దుంప చివర కుళ్లిపోతోందని, అక్కడక్కడ మొలకలు వస్తున్నాయని, దీనివలన ధర మరింత పతనమవుతుందని చెబుతున్నారు. కుళ్లిన దుంపలను శుభ్రం చేయడానికి దుంపకు రూ.2 ఖర్చవుతుంది. మరో రెండు నెలల్లో కొత్త పంట వేసే సమయం వస్తోంది. ఈ తరుణంలో భూమిలో ఉన్న పంటను చూసి రైతులు దిగులు చెందుతున్నారు. కౌలు రైతులకు కోలుకోలేని దెబ్బ పెండలం ధరల పతనంతో కౌలు రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఒక్కో రైతు 5 నుంచి 10 ఎకరాలు కౌలుకు తీసుకుని పెండలం దుంప సాగు చేశారు. ఎకరా కౌలు రూ.50 వేలు కాగా, పెట్టుబడి మరో రూ.లక్ష వరకూ అయ్యింది. ప్రస్తుత పరిస్థితిలో కౌలు డబ్బులు కూడా రాని పరిస్థితి ఉందని రైతులు గగ్గోలు పెడుతున్నారు.భూమిలోనే ఉండిపోతోంది నేను 10 ఎకరాలు కౌలుకు తీసుకుని పెండలం సాగు చేశాను. కౌలు రూ.5 లక్షలు, పెట్టుబడి రూ.10 లక్షలు అయ్యింది. సాధారణంగా తయారైన దుంపను ఫిబ్రవరి నుంచి మే నెలలోగా భూమి నుంచి తవ్వి, మార్కెట్కు పంపాల్సి ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకూ కిలో దుంప కూడా తీయలేదు. తయారైన దుంప భూమిలోనే ఉండిపోతోంది. ఇటీవలి వర్షాలకు దుంప కుళ్లిపోయి, మొలకలు వస్తున్నాయి. పరిస్థితి అర్ధం కావడం లేదు. గత రెండేళ్లూ పెండలం ధర లాభదాయకంగా ఉంది. 2023 పంట కాలంలో 10 టన్నుల దుంప రూ.5 లక్షలు పలికింది. గత ఏడాది రూ.45 వేలు పలికినప్పటికీ కొద్దిపాటి లాభంతో ఒడ్డున పడ్డాం. – నూతలపాటి వెంకట రమణ, రైతు, పల్లంట్ల నిండా మునిగిపోయాందుంప ధర దారుణంగా పతనమైంది. గత ఏడాది 10 టన్నుల ధర రూ.45 వేలు ఉండగా, ఈ ఏడాది రూ.40 వేలు పలుకుతోంది. అయినప్పటికీ అమ్ముదామంటే కొనే వారే కనిపించడం లేదు. వ్యాపారులు రావడం లేదు. ఎక్కడి దుంపలు అక్కడే భూమిలో ఉండిపోయాయి. రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. నేను 4 ఎకరాల్లో పెండలం సాగు చేశాను. ఇప్పటి వరకూ కేజీ దుంప కూడా బోణీ కాలేదు. పెండలం రైతు నిండా మునిగిపోయాడు. – కూచిపూడి గంగాధర్, రైతు, పల్లంట్ల -
‘రైతులకు గోనె సంచులు కూడా ఇవ్వలేని దుస్థితి’
తణుకు(ప గో జిల్లా): కూటమి ప్రభుత్వం రైతుల నడ్డివిరిచేస్తోందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. తణుకు పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి కారుమూరి మాట్లాడుతూ... ‘ధాన్యం రైతులకు గొనె సంచులు కూడా ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. పది లక్షల మెట్రిక్ తన్నులు ధాన్యం జిల్లాలో పండిస్తే ఆరు లక్షలు మాత్రమే కొంటామని చేతులెత్తేశారు.రైతులనుండి ఆఖరు గింజవరకు ప్రభుత్వం కొనాల్సిందే. లేదంటే వైస్సార్సీపీ రైతులు పక్షాన పోరాటానికి దిగుతుంది. మంత్రి నాదెండ్ల ఎన్ని ప్రగల్బాలో పలికారు అంత చేస్తాం.. ఇంత చేస్తాం అన్నారు. ఇప్పుడు చుస్తే పండించిన ధాన్యాన్ని కూడా కొనలేని పరిస్థితి. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు కొనుగోలు శక్తి తగ్గిపోయింది. కూటమి ప్రభుత్వంలో వ్యాపారాలన్నీ కళాహీనంగా ఉన్నాయ్. జగన్ గారి హయాంలో నెంబర్ వన్ స్థానంలో జీడీపీ అట్టడుగు స్థాయికి పడిపోయింది. విద్యుత్ కొనుగోళ్లలో చంద్రబాబు వేల కోట్లు దోచుకొంటున్నారు. కుట్టు మిషన్ల లో 157 కోట్లు స్కామ్ కి తెరలేపారు బాబు. చంద్రబాబుది అంతా దాచుకో దోచుకో సిద్ధాంతం’ అని కారుమూరి విమర్శించారు. -
లోకలే బెట'రొయ్య'
సాక్షి, భీమవరం: సిండికేట్ దోపిడీతో కుదేలవుతున్న ఆక్వా రంగాన్ని కాపాడుకునే దిశగా రొయ్యల రైతులు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా లోకల్ మార్కెట్ను పెంచుకునే పనిలో పడ్డారు. ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ‘రెడీ టు కుక్’ పేరిట రైతులే రొయ్యల అమ్మకాలు చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని భీమవరం, వీరవాసరం, నరసాపురంలో అమ్మకాలు మొదలుకాగా ఇతర జిల్లాలకూ విస్తరించే పనిలో నిమగ్నమయ్యారు. ‘పశ్చిమ’లోనే 3 లక్షల టన్నుల ఉత్పత్తి రాష్ట్రంలో 5.75 లక్షల ఎకరాల్లో ఆక్వా (రొయ్యలు, చేపల) చెరువులు ఉండగా.. అత్యధికంగా ఉమ్మడి పశి్చమ గోదావరి జిల్లాలోనే 2.63 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. ఇందులో 60 శాతం విస్తీర్ణంలో ఏటా సుమారు 3 లక్షల టన్నుల రొయ్యలను ఉత్పత్తి చేస్తున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, ఎక్స్పోర్టర్స్ ఏకమై రొయ్య ధరలను ఇష్టానుసారం తగ్గించడం, మేత ధరలను పెంచడంపై ఆక్వా రైతులు మండిపడుతున్నారు. వారి దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు జై భారత్ క్షీరారామ ఆక్వారైతు సంఘం పాలకొల్లు, ఆచంట, నరసాపురం నియోజకవర్గాల్లో జూలై నుంచి సెప్టెంబర్ వరకు సాగు సమ్మెకు పిలుపునిచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే పలువురు రైతులు సాగు సమ్మెకు శ్రీకారం చుట్టి చెరువులను ఎండగట్టేశారు. స్థానిక వినియోగం పెంచేందుకు.. రొయ్యలు ఎక్కువగా తినే దేశాల్లో ఏడాదికి తలసరి 10 నుంచి 12 కిలోల సగటు వినియోగంతో చైనా ముందుంటే.. 8–10 కిలోలతో అమెరికా రెండో స్థానంలో, 8 కిలోల సగటు వినియోగంతో యూరోపియన్ దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచ దేశాలకు రొయ్యలు ఎగుమతి చేస్తున్న మన రాష్ట్రంలో మాత్రం రొయ్యల సగటు వినియోగం కేవలం 1.5 కిలోలు మాత్రమే. స్థానిక వినియోగం పెరిగేలా డొమెస్టిక్ సేల్స్ చేపట్టడం ద్వారా సిండికేట్ దోపిడీకి కళ్లెం వేయాలన్న యోచనలో రొయ్య రైతులు ఉన్నారు. అందరికీ అందుబాటులో ఉండేలా వివిధ కౌంట్లలోని రొయ్యలను ప్రాసెసింగ్ చేసి 150 గ్రాముల నుంచి 300, 500 గ్రాములు, కిలో వరకు వివిధ పరిమాణాల్లో ప్యాకింగ్ చేసి అమ్మకాలు చేస్తున్నారు. భీమవరానికి చెందిన ఆక్వా రైతు గాదిరాజు వెంకట సుబ్బరాజు రైతు బజార్లో రొయ్యల రిటైల్ అమ్మకాలను ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా రొయ్య రైతుల ఆధ్వర్యంలో ప్రాన్స్ పర్చేజింగ్ డొమెస్టిక్ యూనిట్ పేరిట వీరవాసరంలో ఔట్లెట్ ఏర్పాటుచేశారు. రొయ్యల్లో ఉండే పోషకాలు, ఆరోగ్యానికి అవి చేసే మేలుపై కరపత్రాలు, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా ఇతర జిల్లాలకూ ఔట్లెట్లను విస్తరించే ఆలోచన చేస్తున్నట్టు ఆక్వా రైతులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో డోర్ డెలివరీ నరసాపురానికి చెందిన ఆక్వా రైతు కర్రి రామకృష్ణ “టేస్టీ ప్రాన్స్’ పేరిట 4 నెలలుగా ప్రాసెసింగ్ చేసిన రొయ్య పప్పును ఆర్డరుపై ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వినియోగదారులకు డోర్ డెలివరీ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తూ సగటున రోజుకు 200 కిలోల రొయ్య పప్పు విక్రయిస్తున్నారు. పాలకొల్లులో కొందరు రైతులు ఏకమై సుమారు రూ.30 లక్షలతో డొమెస్టిక్ సేల్స్ కోసం ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. దీనిని త్వరలో ప్రారంభించనున్నట్టు తెలిపారు. లాభాపేక్షతో కాకుండా రొయ్యల స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా కార్యాచరణ చేస్తున్నట్టు ఆక్వా రైతులు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలోనే.. ఎక్స్పోర్ట్ క్వాలిటీ రొయ్యలను స్థానిక వినియోగదారులకు డోర్ డెలివరీకి గతంలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కార్యాచరణ చేసింది. దీనికి ఏపీ రొయ్య రైతుల ఫెడరేషన్ అప్పట్లో ముందుకు వచ్చింది. ఎక్స్పోర్టు తరహాలో ప్రాసెస్ చేసిన రొయ్య పప్పు కిలోకు కౌంట్ను బట్టి రూ.600 నుంచి రూ.850 వరకు ధర నిర్ణయించారు. తొలుత ప్రయోగాత్మకంగా భీమవరం పరిసర ప్రాంతాల్లో అమలుచేసి తర్వాత రాష్ట్రవ్యాప్తం చేయాలని భావించారు. అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేయగా.. ఎన్నికల హడావుడి మొదలవడంతో కార్యరూపం దాల్చలేదు. సీ ఫుడ్ డొమెస్టిక్ వినియోగం పెంచేందుకు అప్పట్లోనే ఫిష్ ఆంధ్రా పేరిట సబ్సిడీపై రూ.లక్ష నుంచి రూ.3 లక్షల విలువైన 250కు పైగా ఔట్లెట్లు ఏర్పాటు చేశారు. ఫోర్, టూ వీలర్స్ను అందించారు.తెలుగు రాష్ట్రాల నుంచి ఆర్డర్స్ నాలుగు ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నాను. కొద్ది నెలల క్రితం సొంతంగా రొయ్యలు ప్రాసెసింగ్ చేసి డోర్ డెలివరీ చేయడం ప్రారంభించాం. తక్కువ ధరకే క్వాలిటీ రొయ్యపప్పు ఇవ్వడంతో లోకల్ సేల్స్తో పాటు ఏపీ, తెలంగాణ నుంచి ఆర్డర్లు బాగా వస్తున్నాయి. – కర్రి రామకృష్ణ, ఆక్వా రైతు, నరసాపురంలాభాలు ఆర్జించాలని కాదు లాభాపేక్షతో కాకుండా అందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన రొయ్యలు అందించడమే మా ఉద్దేశం. స్థానిక వినియోగం పెరిగితే సిండికేట్ ఆగడాలకు కళ్లెం పడుతుంది. పాలకొల్లులో కొందరు రైతులు కలిసి యూనిట్ ఏర్పాటు చేస్తున్నాం. పనులు దాదాపు పూర్తికావచ్చాయి. – బోణం చినబాబు, ఆక్వా రైతు, పాలకొల్లు -
రైతుల కోసం కూటమిపై YS జగన్ పోరాటం
-
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా నిలవాలి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులకు అండగా నిలవాలని.. వారిని పరామర్శించి ధైర్యం చెప్పాలని వైఎస్సార్సీపీ నాయకులను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అందుబాటులో ఉన్న రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ ముఖ్య నాయకులతో ఆయన ఫోన్లో మాట్లాడారు. అకాల వర్షాలు, ఈదురుగాలుల వల్ల రాష్ట్రంలో పలుచోట్ల ధాన్యం తడిసిపోవడంతో పాటు ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. వర్షాలు కురుస్తాయన్న సమాచారం ముందస్తుగానే ఉన్నప్పటికీ.. కల్లాల్లో, పొలాల్లో రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని.. అధికార యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉందని వైఎస్ జగన్ మండిపడ్డారు.ఖరీఫ్లో ప్రతికూల వాతావరణం, కనీస మద్దతు ధరలు లభించక తీవ్ర ఇబ్బందులు పడిన వరి రైతులు.. ఈ రబీ సీజన్లో కూడా కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు సహా పలు చోట్ల ప్రభుత్వం ధాన్యాన్ని సరిగ్గా సేకరించకపోవడంతో రైతులు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఇప్పుడు అకాల వర్షాల వల్ల మరింతగా నష్టపోతున్నారని వైఎస్ జగన్ అన్నారు. దీంతో పాటు అకాల వర్షాల వల్ల పలు ఉద్యానవన పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేసి.. రైతులకు బాసటగా నిలవాలని, వారిని ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆదేశించారు. -
రైతులపై కూటమి నిర్లక్ష్యం YS జగన్ ఆగ్రహం
-
రైతులకు బాసటగా YSRCP... నేతలతో వైఎస్ జగన్ టెలికాన్ఫరెన్స్
-
రైతులకు బాసటగా వైఎస్సార్సీపీ: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ఏపీలో అధికార యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉందని, రైతులు నష్టపోకుండా ప్రభుత్వం సరైన చర్యలేవీ చేపట్టలేదని వైఎస్సార్సీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. ఏపీలో అకాల వర్షాలపై పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ముఖ్యనాయకులతో సోమవారం వైఎస్ జగన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘కష్టకాలంలో ఉన్న రైతులకు అండగా నిలవాలి. అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించండి.. వారికి ధైర్యం చెప్పండి. రాష్ట్రంలో పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది. అనేక ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఖరీఫ్లో ప్రతికూల వాతావరణం, కనీస మద్దతు ధరలు లభించక ధాన్యఙ రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ రబీ సీజన్లో కూడా కష్టాలు పడటం ఆవేదన కలిగిస్తోంది. వర్షాలు కురుస్తాయన్న సమాచారం ముందస్తుగానే ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కళ్లాల్లో, పొలాల్లో రైతులవద్దనున్న ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో తీవ్ర నిర్లక్ష్యం కనబరిచింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు సహా పలు చోట్ల ప్రభుత్వం ధాన్యాన్ని సరిగ్గా సేకరించడంలేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అకాల వర్షాలవల్ల మరింతగా నష్టపోతున్నారు. యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉంది. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలి. రైతులకు బాసటగా నిలవాలి. రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి అని కేడర్కు వైఎస్ జగన్ సూచించారు. -
అకాల వర్షాలు.. అన్నదాతకు గుండెకోత
-
‘యాక్సిస్’తో అడ్డగోలు ఒప్పందం.. ప్రజలకు పాతికేళ్ల 'షాక్'
సాక్షి, అమరావతి: వ్యవసాయ విద్యుత్తు అవసరాలకు దాదాపు 30 ఏళ్ల పాటు ఢోకా లేకుండా రైతులకు పగటి పూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందించేలా కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’తో ఏడువేల మెగావాట్ల విద్యుత్తు ఒప్పందాన్ని కారుచౌకగా యూనిట్ రూ.2.49కే అందించేలా కుదుర్చుకోవడం ద్వారా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.లక్ష కోట్లకుపైగా ఆదా చేశారు. దీన్ని అభినందించాల్సింది పోయి.. కుంభకోణంగా వర్ణించిన కూటమి సర్కారు ఇప్పుడు యూనిట్ ఏకంగా రూ.4.60 చొప్పున కొనుగోలుకు సిద్ధమైంది. తద్వారా దేశ విద్యుత్తు రంగ చరిత్రలోనే కనీవిని ఎరుగని స్కామ్కు తెర తీసింది! ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలిని సెక్షన్ 108 పేరుతో బెదిరించి మరీ ఈ ఒప్పందానికి ఆమోద ముద్ర వేయించుకోవడం, ఇలా బరి తెగించి భారీ ధరకు కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం ఎన్నడూ చూడలేదని విద్యుత్తు రంగ నిపుణులు, అధికారులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్తు ఒప్పందాల్లో దీన్ని అతిపెద్ద స్కామ్గా అభివర్ణిస్తున్నారు. గత ప్రభుత్వం అత్యంత చౌకగా, ఐఎస్టీఎస్ చార్జీలు లేకుండా కేంద్ర సంస్థ సెకీ నుంచి సోలార్ కొనుగోలు ఒప్పందాన్ని చేసుకుంటే బురద జల్లి దేశమంతా రాద్దాంతం చేసిన కూటమి సర్కారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సెకీతో చేసుకున్న ఒప్పందం సహేతుకమేనని ఇప్పటికే విద్యుత్తు నియంత్రణ మండలి నిర్థారించిందని, తద్వారా పెద్ద ఎత్తున ప్రజాధనం ఆదా అయిందని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్తు ఒప్పందాల్లో నిజానిజాలను ఒకసారి పరిశీలిద్దాం.. ఏడాదిగా హామీల అమలు ఊసు లేకుండా.. టీడీపీ కూటమి సర్కారు ఏడాది పాలన పూర్తి కావస్తోంది. ఈ తరుణంలో కనీసం ఇప్పుడైనా ఓ అమ్మ ఒడి, అన్నదాతా సుఖీభవ గురించో.. సూపర్ సిక్స్ హామీల అమలుపై సీఎం చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేస్తారని రాష్ట్ర ప్రజలంతా ఆశగా ఎదురు చూస్తుంటే మరో పిడుగు పడింది! ఇప్పటికే రూ.15 వేల కోట్లకుపైగా బిల్లుల బాదుడుతో చుక్కలు చూపిస్తుండగా ఈసారి అడ్డగోలు విద్యుత్తు ఒప్పందాలతో బాదేశారు! 25 ఏళ్ల పాటు ప్రజలను పీల్చి పిప్పి చేసే ఖరీదైన విద్యుత్తు ఒప్పందానికి పచ్చ జెండా ఊపారు. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా గతంలో ఏపీఈఆర్సీ తిరస్కరించిన ఈ అడ్డగోలు ఒప్పందాన్ని మెడపై కత్తి పెట్టి ఆమోదించుకోవడం ద్వారా సర్కారు లాలూచీ వ్యవహారాలు మరోసారి నిరూపితమయ్యాయని, ఇదో పెద్ద కుంభకోణమని విద్యుత్తు రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు సోలార్, రాత్రి పూట అంతా పవన విద్యుత్తు అందుబాటులో ఉంటుందని.. ఎప్పుడో కొద్ది రోజులు డిమాండ్ ఉంటుందంటూ ఆ పేరుతో యూనిట్ రూ.4.60 చొప్పున పాతికేళ్ల పాటు చెల్లించేందుకు సిద్ధం కావటాన్ని తప్పుబడుతున్నారు. పీక్ అవర్స్లో డిమాండ్ 3 – 4 గంటలు మాత్రమే ఉంటుందని.. అలాంటప్పుడు అన్ని గంటలకూ ఒకే ధర చెల్లించడం ఏమిటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఆలస్యం ఉచిత ఇసుక పేరుతో పచ్చముఠాల దోపిడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వర్షాకాల అవసరాల కోసం గత ప్రభుత్వం నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకను టీడీపీ నేతలు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఇక నూతన మద్యం విధానం పేరుతో టీడీపీ నేతలు సిండికేట్గా మారి పోలీసుల అండతో దౌర్జన్యంగా షాపులు దక్కించుకున్నారు. ఊరూరా బెల్టు షాపులు ఏర్పాటు చేసుకుని విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వ పెద్దల అండతో గనుల యజమానులను బెదిరిస్తూ కప్పం వసూలు చేస్తున్నారు. ఇక రాజధాని అమరావతి పనుల్లో టెండర్లలో ముఖ్యనేతలు అంచనాలను ఎడాపెడా పెంచేశారు. ఐకానిక్ టవర్లు పేరుతో అవినీతికి గేట్లు తెరిచారు. అంచనాలు పెంచేసి కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సుల ముసుగులో పనుల విలువలో పది శాతం చెల్లించి తిరిగి 8 శాతం కమీషన్ల రూపంలో వసూలు చేసుకుంటున్నారు. విశాఖలో లూలూకు భూ పందేరంతోపాటు రూ.3,000 కోట్ల అత్యంత ఖరీదైన భూమిని ఊరూ పేరు లేని అనామక సంస్థ ఉర్సాకు ఎకరం 99 పైసలకే కేటాయిస్తూ క్యాబినెట్లో ఆమోద ముద్ర వేయించారు. గత 11 నెలలుగా ఇలా విచ్చలవిడి అవినీతి వ్యవహారాలతో చంద్రబాబు సర్కారు ఆల్టైమ్ రికార్డు సృష్టించిందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘మేం వస్తే విద్యుత్తు చార్జీలను పెంచం.. ఇంకా తగ్గిస్తాం..! గత ప్రభుత్వం విద్యుత్తు రంగాన్ని నాశనం చేసింది. ఐదేళ్లలో రూ.1.29 లక్షల కోట్లకుపైగా నష్టం జరిగింది..’’ అంటూ ఎన్నికల ముందు, ఆ తరువాత శ్వేతపత్రంలో విమర్శలు చేసిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. పాతికేళ్ల పిడుగు.. యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) దాఖలు చేసిన పిటిషన్ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) శనివారం ఆమోదించింది. యాక్సిస్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (పవన–సౌర హైబ్రీడ్) 400 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను స్థాపించి వాటి నుంచి ఏపీఎస్పీడీసీఎల్ పాతికేళ్ల పాటు యూనిట్ కు రూ.4.60 చొప్పున చెల్లించి కొనుగోలు చేసేందుకు అంగీకారం తెలిపింది. 25 ఏళ్ల పాటు ఈ ధర తగ్గించటానికి వీల్లేకుండా ఒప్పందంలో ‘సీలింగ్’ షరతు విధించడం గమనార్హం. అంటే భవిష్యత్తులో పవన, సౌర విద్యుత్తు రేట్లు తగ్గినా ఒప్పందంలో చెప్పిన ధర తగ్గించకుండా మెలిక పెట్టారు. ఒకపక్క మార్కెట్లో సగానికిపైగా తక్కువ ధరకు దొరుకున్నప్పటికీ రెట్టింపు ధర ఇచ్చి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడంపై అంతా విస్తుపోతున్నారు. ఎక్కువ ధరకు ఎందుకు కొనాలి? డిస్కమ్ల పిటిషన్పై కర్నూలులో ఇటీవల జరిగిన బహిరంగ విచారణలో నేరుగా, ఆన్లైన్ ద్వారా వివిధ వర్గాల ప్రజలు, పలు పార్టీలకు చెందిన నాయకులు పాల్గొని యాక్సిస్తో ఒప్పందాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అధిక ధరకు విద్యుత్ను కొనుగోలు చేయడం వల్ల అంతిమంగా ఆ భారం ప్రజలపైనే ట్రూఅప్ చార్జీల రూపంలో వేస్తున్నారని.. ఇప్పటికే రూ.15,485 కోట్లు భారం మోపి వసూలు చేస్తున్నారని ఈ విచారణలో వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా మార్కెట్లో ఇప్పుడు పునరుత్పాదక విద్యుత్ తక్కువ ధరకే లభిస్తున్నందున యాక్సిస్ నుంచి అంత రేటు పెట్టి విద్యుత్ కొనాల్సిన అవసరం లేదంటూ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ వారి వాదనలను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. తాననుకున్నదే చేసింది. యాక్సిస్ నుంచి విద్యుత్ కొనుగోలుకు అనుమతిస్తూ ఏపీఈఆర్సీ జారీ చేసిన ఆదేశాలు మంచి చేస్తే అభినందించాల్సింది పోయి..గాడి తప్పిన విద్యుత్ రంగాన్ని అభివృద్ధి పథం పట్టించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టింది. వ్యవసాయానికి ఉచితంగా, వివిధ వర్గాలకు రాయితీతో విద్యుత్ అందించింది. డిస్కంలకు 2019–24 మధ్య ఏకంగా రూ.47,800.92 కోట్లను అందించింది. 2014–19 వరకు టీడీపీ సర్కారు రూ.13,255.76 కోట్లు మాత్రమే చెల్లించడం గమనార్హం. రైతులకు ఉచిత విద్యుత్ బకాయిలు రూ.8,845 కోట్లు ఇవ్వకుండా ఎగవేసింది. వాటిని కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించింది. 2019–2023 మధ్య గత ప్రభుత్వం రెండు లక్షలకు పైగా అగ్రికల్చరల్ డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేసింది. ఇప్పుడేమంటావు కరపత్రమా ? కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’తో గత వైఎస్ జగన్ ప్రభుత్వం అతి తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే ఈనాడు అడ్డగోలుగా రాసిన అసత్య కథనాలు గతంలో చంద్రబాబు పాలనలో 3.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయగా వైఎస్ జగన్ ప్రభుత్వం సుమారు 5 లక్షల వ్యవసాయ పంపుసెట్లు మంజూరు చేసింది. రాష్ట్రంలో 6,663 ఫీడర్లను 9 గంటలు వ్యవసాయానికి పగటి పూట విద్యుత్ సరఫరా చేసేలా రూ.1,700 కోట్లతో వాటి సామరŠాధ్యన్ని వైఎస్ జగన్ పెంచారు. విద్యుత్ రంగానికి ఆయన ఇంత మంచి చేస్తే.. సెకీ విద్యుత్ ఒప్పందంలో లంచాలు తీసుకున్నారని, ధర ఎక్కువని, ఐఎస్టీఎస్ చార్జీలు కట్టాల్సి వస్తుందంటూ కూటమి నేతలు, కరపత్రికలు తప్పుడు ఆరోపణలు చేశాయి. అదే కూటమి సర్కారు ఇప్పుడు యాక్సిస్తో అధిక ధరకు ఒప్పందం చేసుకుని అసలు సిసలైన అవినీతికి గేట్లు తెరిచింది. నేడు సెక్షన్ 108తో మండలిని బెదిరించి.. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా గతంలో ఏపీఈఆర్సీ తిరస్కరించిన ఈ అడ్డగోలు ఒప్పందాన్ని మెడపై కత్తి పెట్టి కూటమి ప్రభుత్వం ఆమోదించేలా చేసింది. విద్యుత్ చట్టం 2003 సెక్షన్ 108 ప్రకారం యాక్సిస్తో పీపీఏలను అంగీకరించాలంటూ గతేడాది సెప్టెంబర్ 24న ప్రభుత్వం లేఖ రాసిందని ఏపీఈఆర్సీ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. అంటే దీన్ని తిరస్కరించడానికి వీల్లేదని, ఒకవేళ ఏపీఈఆర్సీ తిరస్కరిస్తే ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం ఒప్పందంపై ముందుకు వెళుతుందని పరోక్షంగా బెదిరించినట్లు తేటతెల్లమవుతోంది. 400 మెగావాట్ల విద్యుత్తు కోసం ఈ చట్టాన్ని ప్రయోగిస్తామంటూ బెదిరించాల్సిన అవసరం చంద్రబాబు సర్కారుకు ఎందుకు వచ్చింది? ఈ ఒప్పందం వెనుక కేవలం కుంభకోణం మినహా రాష్ట్ర ప్రజల ప్రయోజనం ఎక్కడుందని విద్యుత్తు రంగ నిపుణులు నిలదీస్తున్నారు. సెక్షన్ 108 ప్రకారం.. యాక్సిస్ పీపీఏలను ఆమోదించాలంటూ ప్రభుత్వం చెప్పిందని ఏపీఈఆర్సీ ఆదేశాల్లో పేర్కొన్న భాగం నాడు స్వయంగా ప్రతిపాదించిన ‘సెకీ’ రైతులకు పగటి పూట 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ పథకాన్ని దీర్ఘకాలికంగా అమలు చేసేందుకు సెకీ నుంచి 17 వేల మిలియన్ యూనిట్ల (7 వేల మెగావాట్లు) సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం గత ప్రభుత్వంలో జరిగింది. అది కూడా అత్యంత చౌక ధరతో.. యూనిట్ కేవలం రూ.2.49కే అందించేలా ఒప్పందం కుదుర్చుకుంది. 2022–23లో యూనిట్ రూ.5.13గా ఉన్న సగటు విద్యుత్ సేకరణ ఖర్చుతో పోల్చితే ఇది రూ.2.64 తక్కువ. అదీగాక ఏపీకి సౌర విద్యుత్ను అతి తక్కువ ధరకే సరఫరా చేస్తామన్న ప్రతిపాదన స్వయంగా సెకీ నుంచే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా యూనిట్ ధర రూ.2.80కి పెరిగినప్పటికీ మనకు మాత్రం ఒప్పందం మేరకు యూనిట్ రూ.2.49కే ఇచ్చేందుకు నాడు సెకీ అంగీకరించింది. అంతేకాకుండా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ (ఐఎస్టీఎస్) చార్జీల నుంచి పూర్తి మినహాయింపు కల్పించారు. ఇదే విషయం కేంద్ర విద్యుత్ శాఖ, సెకీ లేఖ, ఒప్పందంలోనూ స్పష్టంగా ఉంది. ఇంత మంచి ఒప్పందాన్ని చేసుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ను అభినందించాల్సిందిపోయి చంద్రబాబు, టీడీపీ అనుబంధ కరపత్రికలు బురద చల్లేందుకు యత్నించారు. అయితే సెకీతో ఒప్పందం సక్రమమేనని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) తేల్చి చెప్పడంతో ఈ కుట్రలన్నీ పటాపంచలయ్యాయి. ఇప్పుడు పవన, సౌర హైబ్రీడ్ విద్యుత్ మార్కెట్లో యూనిట్ రూ.2.90కి అంతకన్నా తక్కువకే దొరుకుతోంది. అలాంటప్పుడు ఓ ప్రైవేట్ డెవలపర్ నుంచి యూనిట్ రూ.4.60 చెల్లించి కొనాల్సిన అవసరం ఏమిటో, దాని వెనుక అసలు కారణాలేమిటో చెప్పే ధైర్యం చంద్రబాబు సర్కారుకు, ఈ కుంభకోణాలపై నిలదీసే ధైర్యం ఎల్లో మీడియాకు ఉందా? -
అన్నదాతకు గుండెకోత
సాక్షి, అమరావతి/నెట్వర్క్: వరి రైతుల పాలిట చంద్రబాబు ప్రభుత్వం పెనువిపత్తుగా పరిణమించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం కురిసిన కుండపోత వర్షాలకు ధాన్యం రాశులు, కోత కోసిన వరి పనలు నీటమునిగాయి. ఇతర పంటలకు సైతం తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. కాకినాడ జిల్లాలో 7 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిపోయినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పనల మీద వరి, నీట మునిగిన ధాన్యపు రాశుల్ని చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు.ఉప్పలగుప్తం, అయినవిల్లి, ఐ.పోలవరం మండలాల్లో ధాన్యం రాశులు, ధాన్యం బస్తాలు వర్షాలకు తడిసిపోయాయి. ఈ మండలాల్లో సుమారు 600 ఎకరాల్లో పంట పనల మీద ఉంది. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని భద్రపరుచుకోవడానికి నానా అవస్థలు పడ్డారు. చేలలోనే ధాన్యం రాశులు ఉండటంతో.. వాటిపై బరకాలు కప్పినప్పటికీ కింది భాగంలో ధాన్యం తడిసిపోయిందని రైతులు వాపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వం 6 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు మాత్రమే అనుమతి ఇవ్వగా.. ఇప్పటివరకు కేవలం సుమారు 4.40 లక్షల మెట్రిక్ ధాన్యం మాత్రమే అధికారులు కొనుగోలు చేశారు. మరో దాదాపు 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల వద్దే ఉంది. సంచులు లేకపోవడం, ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయడంతో కల్లాల్లోనే ధాన్యం మిగిలిపోయింది.ప్రభుత్వ నిర్లక్ష్యమే కొంప ముంచిందిధాన్యం సేకరణలో ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులను నిలువునా ముంచేసింది. గడిచిన వారం రోజులు రాష్ట్రవ్యాప్తంగా అనిశ్చితి వాతావరణం నెలకొంది. వాతావరణ శాఖ వర్ష సూచనపై తీవ్ర హెచ్చరికలు చేసింది. కానీ, ప్రభుత్వం మాత్రం మొద్దునిద్ర వీడలేదు. ఫలితంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షానికి కల్లాల్లోని ధాన్యం తడిసిముద్దయింది. కళ్లెదుటే కష్టార్జితం నీటిలో నానిపోతుంటే రైతులు నిస్సహాయ స్థితిలో కన్నీరు మున్నీరుగా విలపించారు. ధాన్యం రాసులపై కనీసం కప్పడానికి పట్టాలు కూడా లేని దయనీయస్థితిలో ధాన్యం నింపడానికి సంచులు లేని దుస్థితిలో ఉరుకులు పరుగులు తీశారు. నేలవాలిన రైతు ఆశలుప్రస్తుత వాతావరణ మార్పులతో తడిసిన ధాన్యం రంగు మారడం, మొలకలొచ్చే ప్రమాదంతో పాటు ముక్క విరుగుడు సమస్య తలెత్తే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం ధాన్యం సేకరణ ప్రారంభించినప్పటి నుంచి రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రైతుసేవా కేంద్రాల్లోకి వెళ్లిన రైతులకు నిరాశ తప్ప ధాన్యం కొంటామనే మాట వినిపించట్లేదు. దళారులు, మిల్లర్లు పచ్చజెండా ఊపితేనే రైతు ధాన్యం లోడుకు మోక్షం లభిస్తుంది. ఇలా చేస్తే మద్దతు ధరలో 75 కిలో బస్తాకు రూ.300–రూ.450 దళారీకి, మధ్యవర్తికి ముట్టజెప్పాల్సి వస్తోంది. ఇదంతా ప్రభుత్వం దళారుల దందాకు గేట్లు బార్లా తెరవడంతోనే రైతులు మద్దతు ధర కోల్పోవాల్సిన దుస్థితి దాపురించింది.ఇంత అరాచక వ్యవస్థను తట్టుకోలేని రైతులు రోడ్లపై నిరసనలకు దిగుతున్నారు. ఉంగుటూరులోని బొమ్మిడి సొసైటీ వద్ద ఆదివారం సాయంత్రం ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసి ఆదుకోవాలంటూ ధర్నాకు దిగారు. ఏలూరు మండలం మల్కాపురం రైతు సేవా కేంద్రం వద్ద పెద్దఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం ధాన్యం సేకరణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రైతులు మద్దతు ధరను కోల్పోవడంతో పాటు ఆర్థికంగా భారాన్ని మోయాల్సి వస్తోంది. రోజుల తరబడి కల్లాల్లో ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు పట్టాలు, గోనె సంచులు, వాహనాలు, కూలీల ఖర్చులు అదనపు భారంగా మారుతోంది.ధాన్యం సేకరణలో ప్రభుత్వం కపట నాటకాలు ప్రదర్శిస్తోంది. రైతుల నుంచి నేరుగా పంటను కొనుగోలు చేస్తున్నట్టు కలరింగ్ ఇవ్వడం తప్ప క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితులు కనిపించట్లేదు. కనీసం ప్రభుత్వం తరఫున ధాన్యం తరలించేందుకు వాహనాలు కూడా సమకూర్చలేని దుస్థితి. ఇక్కడా మిల్లరుపైనే ఆధారపడాల్సి వస్తోంది. రబీలో ధాన్యం దిగుబడులు 48 లక్షల టన్నులకుపైగా వస్తాయని వ్యవసాయ శాఖ అంచనా. కానీ, ప్రభుత్వం కొనుగోలు లక్ష్యం 13 లక్షల టన్నులే. ఈ క్రమంలోనే 60–70 శాతం మేర కోతలు పూర్తయినా.. చాలాచోట్ల రైతు సేవా కేంద్రాల్లో టార్గెట్లు అయిపోయాయని కొనుగోళ్లు నిలిపివేశారు. ఉద్యాన పంటలకు దెబ్బఏలూరు జిల్లా నూజివీడు, చింతలపూడి తదితర నియోజకవర్గాల్లో మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. పలు ప్రాంతాల్లో అరటి పంట దెబ్బతింది. కృష్ణా జిల్లా పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లో 4 వేల ఎకరాల్లో మొక్కజొన్న వర్షానికి తడిసింది. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మొక్కజొన్న గింజ, కండెలు తడిసిపోవటంతో నాణ్యత దెబ్బతింటుందని, మార్కెట్లో ధర పడిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గన్నవరం నియోజకవర్గం పరిసరాల్లో సుమారు 10 వేల ఎకరాల్లో మామిడి తోటల్లో కోతకు వచ్చిన మామిడి కాయ నేలరాలి రైతులకు నష్టం వాటిల్లింది. పెనమలూరు మండలం గోసాలలో అరటి తోటలు నేలవాలాయి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కాచవరంలో అరటి, జూపూడిలంకలో కూరగాయ పంటలకు నష్టం వాటిల్లింది.మైలవరం, రెడ్డిగూడెం మండలాల్లో మొక్కజొన్న, ధాన్యం తడిసిపోయాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలో అరటి రైతులకు నష్టం వాటిల్లింది. అరటి చెట్లు పడిపోయాయి. కల్లాల్లో పసుపు తడిసిపోయింది. మొక్కజొన్న కంకులు తడిసి పోయాయి. బాపట్ల జిల్లాలో భారీ వర్షం, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. కొల్లూరు మండలంలో కురిసిన వర్షానికి కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న పంట తడిసిపోయింది. రాయల సీమతో పాటు ఉత్తరాంధ్రలోని ఉద్యాన పంటలకు తీవ్ర దెబ్బతగిలింది. బొప్పాయి, దానిమ్మ, కూరగాయలు, మామిడి, అరటి, నిమ్మ, ఆయిల్పామ్ రైతులకు నష్టం వాటిల్లింది.సుమారు 1,700 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమిక సమాచారం. కర్నూలులో బొప్పాయి, దానిమ్మ, శ్రీసత్యసాయి జిల్లాలో కూరగాయలు, అరటి, మస్క్మిలన్, మామిడి, నంద్యాలలో అరటి, బొప్పాయి, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం మన్యంలో అరటి, వైఎస్సార్ జిల్లాలో అరటి, మామిడి, కూరగాయలు, ప్రకాశంలో అరటి, బొప్పాయి, దానిమ్మ, అనంతపురంలో అరటి, మామిడి, బొప్పాయితో పాటు కూరగాయ పంటలు, పల్నాడులో బొప్పాయి, కూరగాయలు, చిత్తూరులో అరటి, మామిడి, బొప్పాయి, కొబ్బరి, ఏలూరులో నిమ్మ, ఆయిల్ పామ్ పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ పంటలకు ప్రాథమిక నష్టం జరిగినట్టు అధికారికంగా రిపోర్ట్ కాలేదని వ్యవసాయ అధికారులు చెప్పడం గమనార్హం. -
‘అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి’
కాకినాడ: ఆకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కాకినాడ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. తొండంగి మండలం కోదాడలో దాడిశెట్టి రాజా పర్యటించి.. రైతుల పొలాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ‘తడిచిన ధాన్యాన్ని తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయ్యాలి. రైతులను ఆదుకోకపోతే ఈ ప్రభుత్వం చీకటీ ప్రభుత్వమే?, తడిన ధాన్యాన్ని మద్దత్తు ధర తో వైఎస్ జగన్ ప్రభుత్వం కొనుగొలు చేసింది. రూ.1,800 - 2,000 మద్దత్తు ధర చెల్లించి ఆఖరి గింజ వరకు సేకరించారు.ఏ సీజన్ లో పంట నష్టపోతే..అదే సీజన్ లో రైతులకు వైఎస్ జగన్ నష్టపరిహారం చెల్లించారు. కూటమీ ప్రభుత్వం రైతులను గాలికొదిలేసింది. ఇవాళ రూ.1,250 లు చెల్లించి దళారులు రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. కూటమి పాలన ఓ చీకటి. దేవాలయంకు వెళ్ళాలన్నా భక్తులు భయపడుతున్నారు. సింహచలం దుర్ఘటన తమకు సంబంధం లేదన్నట్లుగా ప్రభుత్వం తప్పించుకుందికనీసం భాధిత కుటుంబాలను పరామర్శించే బాధ్యత సీఎం చంద్రబాబుకు ఉంది’ అని దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. -
కరువు ఎరుగని 'కృషీవలురు'!
కొడిమ్యాల మండలం పూడూరు వాగుపై 7 చెక్ డ్యాంలు ఉన్నాయి. వాగుకు ఇరువైపులా మోటార్లు పెట్టుకుని రైతులు ఈ నీటితో పంటలు సాగు చేసేవారు. ఇటీవల వాగు పూర్తిగా ఎండిపోవటంతో ఆరెపల్లి, అప్పారావుపేట, పూడూరు గ్రామ రైతులు చందాలు వేసుకొని దాదాపు రూ. లక్ష జమచేసి 40 పైపులు కొనుగోలు చేసి, కొండాపూర్ మైసమ్మ చెరువు మత్తడి నుంచి సాగు నీటిని తరలించారు. దీంతో కొడిమ్యాల పెద్దవాగుతోపాటు పూడూరు వాగుపై ఉన్న ఏడు చెక్ డ్యాంలు నిండి పొంగిపోర్లుతున్నాయి. ఈ నీటితో ఆ చుట్టుపక్కల 500 ఎకరాల వరి పంట ఎండిపోకుండా రైతులు కాపాడుకున్నారు.సాక్షి ప్రతినిధి, కరీంనగర్: వేసవికాలం వచ్చిందంటే చాలాచోట్ల ఎండిన పంటలు.. పశువుల మేతకు వదిలేసిన పొలాల చిత్రాలే కన్పిస్తాయి. ఎండిపోయిన వాగులు.. ఒట్టిపోయిన బావులు సర్వసాధారణం.. కానీ, కొన్నిచోట్ల ప్రభుత్వం వాగులు, వంకలపై నిర్మించిన చిన్నచిన్న చెక్డ్యాంలు అన్నదాతల తలరాతలను మార్చేశాయి. మండు వేసవిలోనూ నిండైన జలకళతో పచ్చని పంటలకు ప్రాణం పోస్తున్నాయి. మరికొన్నిచోట్ల అన్నదాతలు సరికొత్త ఆలోచనలతో సొంతంగానే నీటిని ఒడిసిపట్టి మండు వేసవిలో బంగారు పంటలు పండిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కన్నీటి జీవితాలను ప‘న్నీటి’గా మార్చుకున్న పలువురు రైతుల విజయగాథలివీ... ఐదేళ్లుగా కరువు ఎరగని వీణవంక పల్లె కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలోని వాగుపై నిర్మించిన చెక్డ్యాం.. ఆ ప్రాంతంలో కరువును దూరం చేసింది. ఒకప్పుడు తాగు, సాగు నీటికి అల్లాడిన అక్కడి ప్రజలు.. చెక్డ్యాం వల్ల గత ఐదేళ్లుగా నిశ్చింతగా బతుకుతున్నారు. మండల కేంద్రానికి అర కిలోమీటర్ దూరంలోనే ఉన్న వాగులో వృథాగా పోతున్న నీటిని నిల్వ చేసేందుకు 2018లో రూ.1.54 కోట్లతో 15 ఎకరాల విస్తీర్ణంతో చెక్డ్యాంను నిర్మించారు. ఈ చెక్డ్యాం వీణవంకతోపాటు, బ్రాహ్మణపల్లి, రెడ్డిపల్లి, రామక్రిష్ణాపూర్ గ్రామాల ప్రజలకు తాగు, సాగు నీరు అందిస్తోంది. సుమారు 220 ఎకరాల భూమి దీని కింద సాగవుతోంది. సొంత భూమిలో చెరువు తవ్వించి.. నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ విలీన గ్రామం శ్రీనివాస్నగర్కు చెందిన పుట్ట బాబు తన పంట పొలంలో 2 ఎకరాల విస్తీరణంలో 15 ఏళ్ల క్రితమే చెరువును తవ్వించి నీటి సంరక్షణ చేపట్టారు. వర్షం నీటితో పాటు ఆరు బోరు బావులతో చెరువును నింపుతున్నాడు. ఈ చెరువు ద్వారా 12 ఎకరాల్లో వర్షాకాలం, యాసంగీ సీజన్లలో వరి పంట సాగుచేస్తున్నాడు. చెరువు గట్టు చుట్టూ కొబ్బరి, మామిడి, సీతాఫలంచెట్లు పెంచి అదనపు ఆదాయం పొందుతున్నాడు. వట్టిపోని వట్టివాగు.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని కాట్రపల్లి, వెంకటగిరి, అర్పణపల్లి, ఉప్పరపల్లి, పెనుగొండ గ్రామాల మీదుగా వెళ్లే వట్టివాగు ఇప్పుడు మండు వేసవిలోనూ నిండుకుండలా కనిపిస్తోంది. ఇటీవల యాసంగి పంటల కోసం కొంత ఆలస్యంగా ఎస్సారెస్పీ జలాలను వట్టి వాగులోకి మళ్లించటంతో వెంకటగిరి, అర్పణపల్లి, ఉప్పరపల్లి గ్రామాల పరిధిలో వాగుపై నిర్మించిన చెక్ డ్యాంలు జలకళను సంతరించుకున్నాయి. దీంతో చుట్టుపక్కల వ్యవసాయ బావులు, బోర్లలో భూగర్భ జలాలు పెరిగాయి. 9 చెక్డ్యాంలతో నీటి సమస్య దూరం మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని ఊక చెట్టు వాగులో గతంలో నీరు ఉండక భూగర్భ జలాలు అడగంటేవి. గత ప్రభుత్వం ఈ వాగుపై 9 చెక్డ్యాంలు నిర్మించటంతో నీటి నిల్వ పెరిగి, చుట్టుపక్కల భూగర్భ జలాల పైపైకి వచ్చాయి. దీంతో సాగు, తాగు నీటి సమస్య దూరమైంది. సమీపంలోని బండ్రపల్లి, పల్లమరి, లాల్ కోట, నెల్లికొండి, పెద్ద వడ్డేమాన్, చిన్న వడ్డేమాన్, ఏదిలాపురం, చిన్న చింతకుంట, మద్దూరు, అల్లిపురం, కురుమూర్తి, అమ్మాపురం, గూడూరు, అప్పంపల్లి, ముచ్చింతల తదితర గ్రామాలలో 7,000 ఎకరాలలో రైతులు రెండు పంటలు పండిస్తున్నారు. వర్షపు నీటిని గుంతల్లో నిల్వ.. నల్లగొండ జిల్లా చండూరులో వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు రైతు పాల్వాయి సత్యనారాయణరెడ్డి తన భూమిలోనే కందకాలు తవ్వించాడు. ఆరేళ్ల క్రితం తనకున్న దాదాపు 100 ఎకరాలలో పలు చోట్ల కందకాలు తవ్వించాడు. గొల్లగూడకు వెళ్లే దారిలో గల 50 ఎకరాలలో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో వర్షపు నీటి గుంతలను తవ్వారు. ప్రస్తుతం ఎండలు మండుతున్నా ఈ గుంతల్లో నీరు పుష్కలంగా ఉండటం గమనార్హం. ఈ నీటివల్ల భూగర్భ జలాలు పెరిగి పంటకు నీటి కరువు తీరింది. వాననీటిని ఒడిసి పట్టి.. మెదక్ జిల్లా రత్నాపూర్ గ్రామానికి చెందిన నింబాద్రిరావు అనే రైతు వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు సరికొత్త ఆలోచన చేశారు. తన ఏడు ఎకరాల భూమి చుట్టూ స్ట్రెంచ్ కొట్టించి, వర్షాకాలంలో పడిన వర్షం నీరు భూమిలోకి ఇంకేలా ఏర్పాట్లు చేశాడు. దీనికి రాళ్లు, సిమెంట్ లైనింగ్ చేసి నీటిని నిలువ చేస్తున్నాడు. ఈ నీటి ద్వారా ఎండా కాలంలోనూ పంటలకు నీరందేలా ఏర్పాటు చేసుకున్నాడు. డ్రిప్ ద్వారా మామిడి పంటకు నీళ్లు పారిస్తున్నాడు. ఒకప్పుడు బీడుగా ఉన్న భూమిని ఇప్పుడు బంగారు పంటలు పండే సారవంతమైన భూమిగా తీర్చి దిద్దుకుని ఆదర్శంగా నిలుస్తున్నాడు. జహీరాబాద్ ప్రాంతంలో జలకళ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో గతంలో చేపట్టిన వాటర్షెడ్ పనులు ఇప్పుడు రైతులకు జల సిరులు పారిస్తున్నాయి. ప్రముఖ ఇంజనీర్ హన్మంత్రావు ఇక్కడ చతుర్విద జల ప్రక్రియను ఆవిష్కరించారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని గొట్టిగారిపల్లి గ్రామంలో 2001లో వాటర్షెడ్ పథకానికి శ్రీకారం చుట్టారు. ఫలితంగా నేడు 30 వేల ఎకరాలకు నీటి కొరత తీరింది. ఏడాది పొడువునా మూడు పంటలు పండుతున్నాయి. -
కోకో రైతులు ఆందోళన!
-
పొగాకు రైతుల ఆందోళన!
-
మిర్చి రైతుల ఆందోళన!
-
ధాన్యం రైతుల ఆందోళన
-
రైతుల ఆందోళనపై వైఎస్ జగన్ ట్వీట్
-
అధికారంలో లేకున్నా అరటి రైతులను ఆదుకున్న వైఎస్సార్సీపీ
-
రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు సర్కార్ విఫలం: వైఎస్ అవినాష్రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అకాల వర్షాలకు, వడగళ్ల వానకు నష్టపోయిన అరటి రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన పులివెందులలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నష్టపోయిన రైతులను మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. ఆనాడు వైఎస్సార్సీపీ తరపున సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు నష్టపోయిన ప్రతి హెక్టారుకు రూ.20 వేల సాయం అందిస్తాం. ప్రభుత్వం మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ఒక్క రూపాయి సాయం అందించలేదు. వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి’’ అని అవినాష్రెడ్డి డిమాండ్ చేశారు.‘‘ఇటీవల అకాల వర్షాల వల్ల లింగాల మండలంలో చోటు చేసుకున్న ఉద్యాన పంటల నష్టానికి.. రైతులకు పరిహారం ఇచ్చేందుకు వైఎస్ జగన్ సముఖత వ్యక్తం చేశారు. 630 మంది రైతులకు హెక్టారుకు రూ. 20 వేల చొప్పున పార్టీ తరఫున పరిహారం ఇచ్చేందుకు ఆయన ఆమోదం తెలిపారు. ఈ పరిహారానికి సంబంధించిన త్వరలోనే ఆయా గ్రామాల వైఎస్సార్సీపీ నాయకుల ఆధ్వర్యంలో రైతులందరికీ డీడీలు అందిస్తాం. 630 మందికి రూ. 1.30 కోట్ల పరిహారాన్ని డీడీల రూపంలో అందజేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరుచుకోవాలి. తన బాధ్యతను గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.’’ అని అవినాష్రెడ్డి హితవు పలికారు.‘‘రూ.26 కోట్లతో అరటి రైతుల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్ను ఏర్పాటు చేసింది.. కానీ దాని వినియోగంలోకి తీసుకురావడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం విఫలమైంది. పులివెందుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధితో ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ కోల్డ్ స్టోరేజ్ని వినియోగంలోకి తీసుకొచ్చి ఉంటే ధరల స్థిరీకరణకు అవకాశం ఉండేది. ధరల స్థిరీకరణ జరిగితే రైతుకు ప్రయోజనం కలిగేది. గత నెలలో అరటి ధర ఓ మోస్తారుగా ఉండేది. ఇప్పుడు అరటి ధర పడిపోయి రైతుకు గిట్టుబాటు కావడం లేదు..మెడికల్ కాలేజ్ నిర్మించి 50 సీట్లు మంజూరు అయ్యేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తే.. వచ్చిన సీట్లను వద్దని రాసి పంపించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానిది. 6 సార్లు పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా, కడప నుంచి నాలుగుసార్లు ఎంపీగా, రెండుసార్లు సీఎం గా గెలిచి పులివెందులను అభివృద్ధి చేస్తే.. ఇప్పుడు మెడికల్ కాలేజీకి ఆయన పేరును తీసివేసి కూటమి ప్రభుత్వం రాక్షస ఆనందం పొందుతుంది. మెడికల్ కాలేజీ మెయిన్ గేట్కు ఉన్న వైఎస్సార్ పేరు తొలగిస్తారేమో కానీ.. ఈ ప్రాంత ప్రజల్లో ఆయనకున్న స్థానాన్ని అయితే చెరిపి వేయలేరు. చెయ్యని పనులు చేసినట్లు చెప్పుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఏ పని ఎవరు చేశారో ప్రజలందరికీ తెలుసు’’ అని వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. గండి క్షేత్రంలో 26 కోట్లతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తే.. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదవుతున్న చిన్న చిన్న పనులు చేయలేక అసంపూర్తిగా వదిలేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలో గంజాయి రవాణా విస్తృతంగా పెరిగిపోయింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్యపానాన్ని కట్టడి చేస్తే.. ఈ ప్రభుత్వం వచ్చాక విచ్చలవిడిగా వీధికి ఒక మద్యం షాపును తెరిచింది’’ అని అవినాష్రెడ్డి ధ్వజమెత్తారు. -
రాజధానిలో మరిన్ని భూములు సమీకరణ
సాక్షి, అమరావతి: రాజధానిలో మరిన్ని భూములు సమీకరించాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, క్రికెట్ స్టేడియం నిర్మాణాలకు మరికొంత భూమి అవసరం అని.. దీనికి అనుగుణంగా తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ‘‘హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి భూ సేకరణ జరిగినప్పుడు 5 వేల ఎకరాలు ఎందుకని కొందరు ప్రశ్నించారు. కానీ, నాడు ముందుచూపుతో సేకరించినందునే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణంతో పాటు పెద్ద హోటళ్లు, మాల్స్ వచ్చి ఎకనమిక్ యాక్టివిటీ పెరిగింది. చుట్టుపక్కల భూములకు విలువ పెరిగి రైతులకు మేలు చేకూరింది’’ అని అన్నారు. అమరావతి రైతులతో సీఎం చంద్రబాబు సోమవారం తన నివాసంలో సమావేశమయ్యారు.రాజధాని అవసరాలకు అదనంగా భూ సేకరణ సహా పలు అంశాలను చర్చించారు. స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతుల అభీష్టానికి వ్యతిరేకంగా, వారికి నష్టం జరిగేలా ఏ కార్యక్రమం, నిర్ణయం ఉండదని సీఎం తెలిపారు. అదనపు భూసేకరణ కారణంగా ఈ ప్రాంతంలో ధరలు పడిపోతాయనే అపోహలకు గురికావద్దన్నారు. తనకు, రైతులకు మధ్య దూరం ఉండదని చెప్పారు. ‘కృష్ణా నదిపై మరో మూడు నాలుగు వారధులు కూడా వస్తాయి. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు వస్తాయి. ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. రాజధాని విస్తరించి పెద్దఎత్తున సంస్థలు, పెట్టుబడులు వస్తాయి.మీ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏమీ జరగదు’’ అని సీఎం పేర్కొన్నారు. రాజధాని ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని రైతులు కోరగా... శాతవాహన కాలం నుంచి అమరావతి ఉద్యమం వరకు జరిగిన పరిణామాలన్నీ క్రోడీకరిస్తూ మ్యూజియం ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. రాజధాని పరిధిలోని గ్రామ కంఠాల్లో ప్రస్తుతం నివాసం ఉంటూ పట్టాలేని వారికి పట్టాలివ్వాలని అభ్యరి్థంచగా, దీన్ని కూడా త్వరలోనే చేపడతామని సీఎం హామీ ఇచ్చారు. ⇒ అమరావతి పనుల పున:ప్రారంభ కార్యక్రమానికి రావాలంటూ రాజధాని రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వనించారు. మే 2వ తేదీ రాష్ట్ర చరిత్రలో కీలక మలుపు అని.. రాజధాని నిర్మాణం రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్య అడుగు అవుతుందని సీఎం చెప్పారు. రైతుల త్యాగం కారణంగానే నేడు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేసుకుంటున్నామని, రైతుల మంచి మనసును ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం తిరిగి కేటాయించే ప్లాట్లకు బ్యాంకుల ద్వారా రుణం పొందేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాజధానిలో జరిగే ప్రతి కార్యక్రమం, పనుల్లో భాగస్వామ్యం కావాలని రాజధాని గ్రామాల రైతులను చంద్రబాబు ఆహ్వనించారు. సమావేశంలో మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.బయటపడిన బాబు భూ దాహం రాజధాని అవసరాలకు మరో 44,676 ఎకరాలు సమీకరించనున్నట్లు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం లీక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు భూ దాహం రాజధాని రైతులతో నిర్వహించిన సమావేశంలోనే బయటపడింది. ప్రభుత్వ భూమితో కలిపి ఇప్పటికే రాజధాని అవసరాలకు సీఆర్డీఏ చేతిలో 53,749 ఎకరాలున్న విషయం తెలిసిందే. ఇందులో రైతుల నుంచి సమీకరించిన భూమి 34,566 ఎకరాలు ఉంది. ఇంత భూమి ఉన్నప్పటికీ అంతర్జాతీయ విమానాశ్రయం, స్టేడియాల పేరుతో మరో 44 వేల ఎకరాలకు పైగా భూములను రైతుల నుంచి తీసుకోవాలని ముందుగా నిర్ణయించుకున్న తరువాతనే చంద్రబాబు ప్రభుత్వం మీడియాకు లీకు ఇచ్చింది.ఈ విషయం సోమవారం రైతులతో సీఎం నిర్వహించిన సమావేశంలోనే బట్టబయలైంది. తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల పరిధి లో మరిన్ని గ్రామాలలో భూములు సమీకరించాలని చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసేసుకుని.. ఇప్పుడు భూముల విలువ పెరగాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం, క్రికెట్ స్టేడియం నిర్మాణం పేరు చెబుతోంది. అవి చేపట్టడానికి అవసరమైన భూములను రైతుల నుంచి తీసుకుంటామని రైతుల సమావేశంలో సీఎం చెప్పడం గమనార్హం. -
కదంతొక్కిన కోకో రైతులు
కొరిటెపాడు(గుంటూరు): కూటమి ప్రభుత్వ తీరుపై కడుపు మండిన కోకో రైతులు సోమవారం కదం తొక్కారు. వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చిన హామీ ప్రకారం ధరల ఒప్పంద ప్రకటన చేయకపోవడంపై ఆగ్రహించిన రైతులు గుంటూరులోని ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ మాట్లాడుతూ.. కోకో గింజలు కొనే కంపెనీలు రోజురోజుకూ ధరలు తగ్గిస్తుండడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ఈ నెల 3న జరిగిన సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. ఈనెల 7న కోకో గింజల ధరల ఒప్పంద ప్రకటన వస్తుందని ఎదురు చూశామన్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి ఒప్పంద ప్రకటన చేయలేదని మండిపడ్డారు. మోండలీజ్ కంపెనీ ప్రతినిధులు కిలో కోకో గింజలను రూ.550కు కొనుగోలు చేస్తామని మంత్రి సమక్షంలో చెప్పి.. అమలు చేయలేదన్నారు. పైగా మరో రూ.50 ధర తగ్గించారని మండిపాడ్డారు. అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజల ధర రూ.750కు పైగా ఉందని.. రాష్ట్ర రైతులకు కూడా ఆ మేరకు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. వారం, పది రోజుల్లో మళ్లీ కంపెనీలతో సమావేశం నిర్వహించి.. ధరలు తగ్గకుండా చర్యలు తీసుకుంటామని రైతులకు ఉద్యాన శాఖ రాష్ట్ర అసిస్టెంట్ డైరెక్టర్ హరినాథ్రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం నాయకులు వై.కేశవరావు, కె.శ్రీనివాస్, ఎస్.గోపాలకృష్ణ, పానుగంటి అచ్యుతరామయ్య పాల్గొన్నారు. -
రైతుకు ‘సేవలు’ దూరం!
సాక్షి, అమరావతి: విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలిచేందుకు ఏర్పాటు చేసిన రైతు సేవా కేంద్రాల (పూర్వపు ఆర్బీకేలు) స్ఫూర్తిని దెబ్బతీసేలా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. క్రమబద్ధీకరణ పేరిట రైతు సేవా కేంద్రాలతో (ఆర్ఎస్కే) పాటు సిబ్బందిని కూడా కుదించేస్తున్న ప్రభుత్వం, వాటి నిర్వహణను సైతం పూర్తిగా గాలికొదిలేసింది. పీ4, కుల గణన, పింఛన్ల పంపిణీ వంటి తమకు సంబంధం లేని అడ్డమైన సర్వేల కారణంగా తీవ్రమైన పని ఒత్తిడితో సిబ్బంది పనిచేయాల్సి వస్తోంది. పక్కదారి పడుతున్న నిధులు..గడచిన 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఆర్ఎస్కేల నిర్వహణకు రూ.35.05 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.19 కోట్లు విడుదల చేశారు. దీనిలో రూ.10.52 కోట్లు అద్దెలకే పోవడం గమనార్హం. సిబ్బందికి చివరికి కష్టమే మిగులుతోంది. మంజూరు చేసిన నిధులు గతంలో నేరుగా ప్రతి ఆర్ఎస్కే అకౌంట్లో పడేవి. ఇప్పుడు సబ్ డివిజన్ అధికారుల ఖాతాకు జమ చేస్తున్నారు. ఈ నిధులు వారు పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యుత్, ఇంటర్నెట్ బిల్లులతో పాటు తమకు రావాల్సిన బకాయిల కోసం అడిగితే ‘వస్తాయిలే..ఇస్తాం లే..’ అంటూ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. గట్టిగా ఒత్తిడి తీసుకొస్తే అడ్డమైన పనులు అప్పగిస్తూ పని ఒత్తిడి పెంచుతూ వేధింపులకు గురిచేస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. మరొక వైపు పాడిపంటలు మ్యాగజైన్ కోసం కూడా లక్ష్యాలను నిర్ధేశిస్తుండడంతో వాటి చందాల కోసం కూడా తమ జేబులకే చిల్లుపడుతోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నాడు పారదర్శకంసచివాలయాలకు అనుబంధంగా గ్రామ స్థాయిలో 10,778 రైతు సేవా కేంద్రాల్లో 15,667 మంది సిబ్బంది సేవలు అందిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అద్దెలతో పాటు ఇంటర్నెట్, విద్యుత్ బిల్లులకు క్రమం తప్పకుండా నిధులు విడుదల చేసేవారు. గతేడాది ఏప్రిల్ నాటికి అద్దెల రూపంలో రూ.33 కోట్లు, స్టేషనరీ కోసం రూ.3 కోట్లు, విద్యుత్ బిల్లుల కోసం రూ.12 కోట్లు చెల్లించారు. అంతేకాదు విద్యుత్ బిల్లులకు అవసరమైన బడ్జెట్ను విద్యుత్ శాఖకు కేటాయించేలా ఉత్తర్వులిచ్చారు. హై స్పీడ్ ఇంటర్నెట్ నెట్వర్క్ సదుపాయాన్ని సమకూర్చేందుకు రూ.23 కోట్లు ఖర్చు చేసారు. మరొక వైపు మట్టినమూనాలు, ఈ పంట నమోదు, ధాన్యం కొనుగోలు, ఎరువుల అమ్మకాలు, పంట కోత ప్రయోగాలు ఇలా ప్రతీ పనికి నిర్ధేశించిన ప్రోత్సాహకాలను ఎప్పటికప్పుడు నేరుగా వారి ఖాతాలకే జమ చేసేవారు.నేడు లోపభూయిష్టం..రైతు భరోసా కేంద్రాలు– ఆర్బీకేల పేరును రైతు సేవా కేంద్రాలుగా (ఆర్ఎస్కే) మార్చేందుకు చూపిన ఉత్సాహం వాటి నిర్వహణపై కూటమి ప్రభుత్వం చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే..» ప్రతిరోజూ ఆర్ఎస్కేలను శుభ్రం చేసేందుకు, నీటి వసతి కల్పించేందుకు స్టేషనరీకి, ఇంటర్నెట్ చార్జీలు, మైనర్ రిపేర్లు తదితర ఖర్చుల కోసం ప్రతీ నెలా రూ.2,000 చెల్లించేవారు. »ఇవి కాకుండా వ్యక్తిగతంగా సిబ్బందికి ఒక్కో మట్టి నమూనాకు రూ.50, టన్ను యూరియాకు రూ.50, డీఏపీ, ఇతర ఎరువులకు రూ. 100 చొప్పున చెల్లించేవారు. » దీనితోపాటు ఒక్కొక్క పంట కోత ప్రయోగానికి రూ.150 చొప్పున ఇచ్చేవారు. » ఆర్ఎస్కే పరిధిలో ప్రతీ సీజన్లో నాలుగు పంటకోత ప్రయోగాలు జరుగుతుంటాయి. పొలంబడుల నిర్వహణకు రూ.20,514 ఖర్చు అయ్యేది. ధాన్యం కొనుగోలు నిర్వహణ ఖర్చు నిమిత్తం ఒక్కొక్క క్లస్టర్కు సుమారు రూ.5 వేలకు పైగా చెల్లించేవారు. » కానీ గడిచిన సీజన్కు సంబంధించి ఏ ఉద్యోగికి పైసా కూడా జమ కాలేదు. కేంద్ర నిధులతో చేపట్టే సామూహిక ఎలుకల నివారణకు ఉపయోగించే గ్లౌవ్స్, కత్తెర, ప్యాకింగ్ మెటీరియల్కే కాదు చివరికి బ్యానర్ తయారీకి కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదంటున్నారు.»కేవలం ఆర్ఎస్కేల నిర్వహణ కోసం ప్రతీ నెలా సగటున రూ.2,500 నుంచి రూ.3వేల వరకు తమ జీతాల నుంచి ఖర్చు చేయాల్సి వస్తోందని సిబ్బంది వాపోతున్నారు. » ఇక ఆర్ఎస్కేల్లో ఎక్కడా ఇంటర్నెట్ సేవలు లేనే లేవు. ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్లు అలంకార ప్రాయంగా మారిపోయాయి. » కరెంట్ బిల్లుల చెల్లింపులు పూర్తిగా మరిచి పోయారు. 25–30 శాతం ఆర్ఎస్కేలు అంధకారంలో ఉన్నాయని సమాచారం. విద్యుత్ బకాయిల బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. -
దళారులే రైతులుగా దోపిడీ
సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తిని స్వయంగా రైతే విక్రయించాలి. ఒకవేళ కౌలు రైతులు పంట పండిస్తే తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) చేయించి ఏఈవోల వద్ద మిస్సింగ్ డేటా కింద ధ్రువపత్రం తీసుకోవాలి. తర్వాత జిన్నింగ్ మిల్ వద్ద ఫొటో దిగి.. పండించిన పత్తిని మార్కెటింగ్ శాఖ ద్వారా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కి విక్రయించాలి. వరంగల్ రీజియన్లోని ఓ జిన్నింగ్ మిల్లు వద్ద రైతుల పేరుతో దిగిన ఫొటోల్లో వార పత్రికల మీద కవర్ పేజీల్లో ఉన్న సినిమా తారల ఫొటోలు, పత్రికల్లో వివిధ సందర్భాల్లో వచ్చిన ఫొటోలు కనిపించడంతో విజిలెన్స్ అధికారులు విస్తుపోయారు.సాక్షి, హైదరాబాద్: పత్తి రైతుల ముసుగులో దళారులు, అధికారులు కుమ్మక్కయ్యారు. వానాకాలం సీజన్కు సంబంధించిన పత్తి రైతు ల పేరిట సాగించిన దందా.. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సాగిస్తున్న విచారణలో వెలుగు చూస్తున్నట్టు సమాచారం. వానాకాలం సీజన్లో రూ.15,557 కోట్ల విలువైన 21లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని సీసీఐ కొనుగోలు చేస్తే అందులో 40 శాతం కొనుగోళ్లలో అవకతకవలు జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించింది. తద్వారా రైతులకు దక్కాల్సిన రూ.వేల కోట్లు పక్కదారి పట్టినట్లు వెల్లడైంది. ఈ విచారణ నివేదికను ప్రభుత్వానికి చేరితే..మార్కెటింగ్ శాఖతోపాటు సీసీఐ ఉద్యోగులు, సిబ్బందే కాకుండా తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) ధ్రువపత్రాలు ఇచ్చిన వ్యవసాయ శాఖ ఎక్స్టెన్షన్ అధికారులపై కూడా చర్యలు తప్పవని తెలుస్తోంది. 28.46 లక్షల మంది రైతులు పంట పండిస్తే... విక్రయించింది 8.58 లక్షల మందే.. రాష్ట్రంలో వానకాలం సీజన్లో 28,46,668 మంది రైతులు 44.73 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. 28.11 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని భావిస్తే , కేవలం 25.45 ఎల్ఎంటీ వచ్చింది. ఇందులో 21 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని మార్కెటింగ్ శాఖ తెరిచిన 302 కొనుగోలు కేంద్రాల ద్వారా సీసీఐ సేకరించింది. ఇక్కడే దళారులు, అధికారులు కుమ్మక్కైన విషయం వెలుగు చూసింది. పత్తి విక్రయాల కోసం కనీసం 20 లక్షల మంది రైతులైనా రావాలి. కానీ కేవలం 8,85,894 మంది రైతులు మాత్రమే 21 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని విక్రయించినట్టు మార్కెటింగ్ శాఖ లెక్కల్లో చూపిస్తోంది. ఈ దందా ఉత్తర తెలంగాణలో అధికంగా సాగగా, మహబూబ్నగర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కొంత తక్కువగా ఉంది. రైతు తెచ్చిన పత్తిని తిరస్కరించి... దళారుల ద్వారా తిరిగి కొనుగోలు రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రానికి పత్తి తేగానే, తేమ 8 నుంచి 12 శాతం లోపు లేదని కొనుగోలుకు తిరస్కరిస్తారు. పత్తిని ఆరబెట్టి తీసుకొస్తేనే మద్ధతు ధర క్వింటాల్కు రూ. 7,521చొప్పున కొనుగోలు చేస్తారని మార్కెటింగ్ కార్యదర్శులు చెబుతారు. దీంతో అక్కడే ఉన్న దళారులు రంగ ప్రవేశం చేసి, రైతుల నుంచి క్వింటాల్కు రూ. 6,000 నుంచి రూ. 6,500 చొప్పున కొనుగోలు చేస్తారు. అదే పత్తిని అదే కొనుగోలు కేంద్రంలో దళారులు సాయంత్రం విక్రయిస్తారు. అందుకు అవసరమైన తాత్కాలిక రిజిస్ట్రేషన్ల ధ్రువపత్రాలను రైతుల పేరిట ఏఈవోల నుంచి తీసుకోవడం నుంచి జిన్నింగ్ మిల్లులో ఫొటోలు దిగడం వరకు అన్ని ప్రక్రియలు పూర్తవుతాయి. క్వింటాల్కు కనీసంగా రూ. 1,000–1,500 వరకు దోచుకొనే దళారులు, అధికారులతో కలిసి ఆదాయాన్ని పంచుకుంటారు. క్రాప్ మిస్సింగ్ డేటాతో విక్రయాలు పోల్చడంతో దొరికిన దొంగలు నాలుగేళ్లుగా ఏఈవోలు ప్రతి సీజన్లో క్రాప్ బుకింగ్ డేటా తయారు చేసి ప్రభుత్వానికి పంపుతున్నారు. ఇందులో భాగంగా గత డిసెంబర్ నుంచి జనవరి వరకు సాగిన సీసీఐ పత్తి అమ్మకాలపై ప్రభుత్వం దృష్టి సారించడంతో దళారుల ప్రమేయం స్పష్టంగా కనిపించింది. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఏడుగురు మార్కెటింగ్ మేనేజర్లను సస్పెండ్ చేశారు. పూర్తి విచారణపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి ఆదేశాలు ఇచ్చారు. -
పట్టించుకోరా?.. మంత్రి నాదెండ్లను నిలదీసిన రైతులు
సాక్షి, కృష్ణా జిల్లా: మంత్రి నాదెండ్ల మనోహర్ను రైతులు నిలదీశారు. గురువారం.. పునాదిపాడులో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్.. రైస్ మిల్లును, కల్లాల్లో ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని మంత్రిని రైతులు నిలదీశారు. కోత కోసి రెండు రోజులైనా ఎవరూ పట్టించుకోవడం లేదన్న రైతులు.. గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు.డ్యామేజ్ అయిన (చిల్లులుపడిన) గన్నీ బ్యాగులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దున్నపోతు ఈనిందా దొడ్లో కట్టేశామా అనేలా అధికారుల తీరు ఉందంటూ రైతులు మండిపడ్డారు. దళారులు, అధికారులు, మిల్లర్లతో కుమ్మక్కైపోయారని రైతులు ఆరోపించారు. బాలాజీ మిల్లు చెబితేనే ధాన్యం కొంటున్నారంటూ రైతులు ఆరోపించారు. రైతుల ప్రశ్నలకు మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానం చెప్పలేకపోయారు. -
పిఠాపురంలో రైతుల వినూత్న నిరసన..
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురంలో రైతులు వినూత్న నిరసన చేపట్టారు. కల్లాల్లో ధాన్యం రాశుల వద్ద ధర్నా నిర్వహించారు. రబీ పచ్చి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులుగా అకాల వర్షాలతో ధాన్యం ఆరబెట్టుకునే పరిస్థితి లేదని రైతులు అంటున్నారు. మిల్లర్లు సిండికేట్గా మారి 76 కేజీల బస్తాను రూ.1200లకు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బస్తా మీద రూ.200-300ల వరకు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది పచ్చి ధాన్యం బస్తా రూ.1,400-1,500ల వరకు అమ్ముకున్నామని అన్నదాతలు గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేత్రస్థాయిలోకి వచ్చి రైతులతో సమీక్ష చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
తెలుగు రాష్ట్రాల వాతావరణంపై ... IMD షాకింగ్ ప్రకటన
-
వనామీ.. ధర పెరగదేమి!
సాక్షి, అమలాపురం: అమెరికా సుంకాల కొరడాను తాత్కాలికంగా వెనక్కి తీసుకున్నా.. నిలిచిపోయిన ఎగుమతులు మొదలైనా.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని వనామీ రొయ్యల రైతుల వెతలు వీడలేదు. సుంకాల పేరుతో రాత్రికి రాత్రి ప్రతి కౌంట్కు రూ.40 నుంచి రూ.60 వరకు రొయ్యల ధరలు తగ్గించిన ఎగుమతిదారులు.. ఇప్పుడు కేవలం రూ.10 నుంచి రూ.20 వరకు మాత్రమే పెంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే 23 వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోందని అంచనా. ప్రస్తుతం సుమారు 13 వేల ఎకరాల్లో మే 15 లోపు ఇంచుమించు తొలి పంట దిగుబడి రైతులకు అందుతుంది. అమెరికా సుంకాల సంక్షోభం వీడడంతో పాత ధరలు వస్తాయని వనామీ రైతులు ఆశలు పెట్టుకున్నారు. యూరప్ మార్కెట్ నుంచి అధికంగా ఆర్డర్లు రావడంతో ఫిబ్రవరి మొదటి వారంలో వనామీకి రికార్డు స్థాయి ధరలు దక్కాయి. 30 కౌంట్ (కేజీకి 30 రొయ్యలు) ధర కేజీ రూ.470 వరకు, 40 కౌంట్ ధర రూ.415కు పెరిగింది. స్థానికంగా రొయ్యల పట్టుబడి మొదలైనప్పటి నుంచి వ్యాపారులు నెమ్మదిగా ధరలు తగ్గిస్తూ వచ్చారు. అమెరికా సుంకాలు ప్రకటించే సమయానికి 30 కౌంట్ ధర రూ.460 వరకు తగ్గించారు. సుంకాల ప్రకటన తరువాత ఒకేసారి కేజీకి రూ.60 తగ్గించి రూ.400 చేశారు. 40 కౌంట్ ధర రూ.415 నుంచి రూ.390కి తగ్గించగా, సుంకాల ప్రకటన తరువాత రూ.310కి కుదించారు. ఇలా ప్రతి కౌంట్కు ధరను భారీగా తగ్గించేశారు. 50 కౌంట్ ధర రూ.350 నుంచి రూ.320కి, 60 కౌంట్ ధర రూ.320 నుంచి రూ.280కి, 70 కౌంట్ ధర రూ.290 నుంచి రూ.250కి, 80 కౌంట్ ధర రూ.260 నుంచి రూ.230కి, 90 కౌంట్ ధర రూ.240 నుంచి రూ.210కి తగ్గించేశారు. ఫిబ్రవరి మొదటి వారంలో కేజీ రూ.250 ఉన్న 100 కౌంట్ సుంకాల విధించిన తరువాత రూ.190కి తగ్గించారు.టారిఫ్ వాయిదా పడినా..అమెరికా సుంకాల విధింపును మూడు నెలల పాటు వాయిదా వేసింది. దీంతో వనామీ రొయ్యల ఎగుమతులు మొదలయ్యాయి. పరిస్థితులు సానుకూలంగా మారడంతో పాత ధరలు వస్తాయని రైతులు ఆశించారు. కానీ.. పెంపు మాత్రం స్వల్పంగా ఉంది. 30 కౌంట్కు ఏకంగా రూ.60 వరకు ధర తగ్గించిన ఎగుమతిదారులు.. ఇప్పుడు కేవలం రూ.25 మాత్రమే పెంచారు. 40 కౌంట్కు రూ.60 వరకు తగ్గించి ఇప్పుడు రూ.30 వరకు పెంచారు. 50 కౌంట్కు రూ.50 తగ్గించి ఇప్పుడు కేవలం రూ.20, 60 కౌంట్కు రూ.40 తగ్గించి ఇప్పుడు రూ.20 చొప్పున పెంచి చేతులు దులుపుకున్నారు. -
పట్టాలు కప్పి.. పంట కాపాడి
హాలియా: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం అకాల వర్షానికి తడిసిపోవడాన్ని గమనించిన స్పెషల్ పోలీస్ బృందం వాటిపై పట్టాలు కప్పి పంటను కాపాడింది. హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అలీనగర్ వద్ద జరిగిన ఈ సంఘటన వివరాలివి. అలీనగర్ ప్రాంతంలో జాతీయ రహదారి ఫ్లై ఓవర్పై కొందరు రైతులు ధాన్యం ఆరబోశారు. మంగళవారం సాయంత్రం గాలిదుమారంతో కూడిన వర్షం కురిసింది. అదే సమయంలో నల్లగొండ స్పెషల్ పోలీసులు నిడమనూరు మండలం బొక్కముంతలపాడు వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా.. తడుస్తున్న ధాన్యాన్ని చూసి చలించారు. తమ వాహనాన్ని ఆపి ధాన్యం తడవకుండా పట్టాలు కప్పి పంటను కాపాడారు. పంటను కాపాడిన స్పెషల్ పోలీసులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. -
రైతులకు భారత వాతావరణ కేంద్రం శుభవార్త
సాక్షి, విశాఖపట్నం: అన్నదాతకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ముందుగానే నైరుతి రూతుపవనాలు రానున్నాయని.. దేశమంతా విస్తారంగా వానలు కురిసే అవకాశముందని వెల్లడించింది. కొన్ని రీజన్లలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఈ ఏడాది 105 శాతం వర్ష శాతానికి ఛాన్స్ ఉందని ఐఎండీ పేర్కొంది.జూన్ నుంచి సెప్టెంబరు వరకు దేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని.. దీర్ఘకాలిక సగటు 87 సెంటీ మీటర్లుగా ఉండగా.. ఈసారి 105 శాతం అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ వెల్లడించింది. ఈ సారి ఎల్నినో లాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం లేదని భావిస్తున్నట్లు తెలిపింది.కాగా, రానున్న మూడు గంటల్లో ఏపీలోని ఉత్తరాంధ్ర, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉరుములతో కూడిన వర్షం కురిసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. -
బర్లీ పొగాకు ధర పతనం
సాక్షి, అమరావతి : నాటు పొగాకుగా పిలిచే బర్లీ పొగాకు ధరలు అనూహ్యంగా పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెట్టుబడి కాదు కదా.. కనీసం కౌలు కూడా వచ్చే పరిస్థితి లేక దిగాలు పడుతున్నారు. గతేడాది ఇదే సమయంలో క్వింటాల్ రూ.15 వేల నుంచి రూ.18 వేలు పలకగా, ఈ ఏడాది తేమ శాతం వంకతో క్వింటాల్ రూ.2,500 నుంచి రూ.3 వేలకు మించికొనే పరిస్థితి కూడా కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లోని నల్ల నేలల్లో బ్లాక్ బర్లీ, ఎర్ర నేలల్లో వైట్ బర్లీ సాగు చేస్తారు. గత ఏడాది రికార్డు స్థాయిలో ధర పలకడంతో ఈసారి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. చేతులెత్తేసిన కంపెనీలు ఐటీసీ, జీపీఐ, డక్కన్, ఆలయన్స్ వంటి పొగాకు కంపెనీలు అభయమివ్వడంతో రైతులు బర్లీ పొగాకు సాగు చేశారు. గత ఏడాది ఈ రకం పొగాకు 1.95 లక్షల ఎకరాల్లో సాగవగా.. ఈ ఏడాది దాదాపు 3.50 లక్షల ఎకరాల్లో సాగైంది. అత్యధికంగా ప్రకాశం జిల్లాలోనే 1.10 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఎకరాకు రూ.1.50 లక్షలకు పైగా రైతులు ఖర్చు చేశారు. కౌలు కోసమే ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు చెల్లించారు. అయితే, తెగుళ్ల ప్రభావంతో ఎకరాకు 11–12 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. చివరకు విత్తనాలు ఇచ్చి సాగు చేయమని చెప్పిన పొగాకు కంపెనీలు పంట చేతికొచ్చే సమయాయిని పత్తా లేకుండా పోయాయి. దీంతో క్వింటాల్ రూ.2,500 నుంచి రూ.3 వేల చొప్పున దళారులకు తెగనమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.అప్పట్లో అండగా నిలిచిన గత ప్రభుత్వం గతంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి తేమ శాతంతో సంబంధం లేకుండా దాదాపు 30వేల మంది రైతుల నుంచి రూ.139.19 కోట్ల విలువైన 12,933 టన్నుల పొగాకు సేకరించింది. ఇప్పుడా పరిస్థితి మచ్చుకైనా లేదని, ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని రైతులు వాపోతున్నారు. -
అకాల వర్షం.. ఆగమాగం
సాక్షి, నెట్వర్క్: క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో పలు జిల్లాల్లో అకాలవర్షం కురిసింది. గురువారం గాలి దుమారంతో ప్రారంభమై.. ఓ మోస్తరు వర్షం కురిసింది. వడగండ్లతో రైతులకు కడగండ్లు మిగిలాయి. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. మూడుచోట్ల పిడుగులు పడి ముగ్గురు చనిపోయారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసింది. వడగండ్ల వానకు మామిడి కాయలు నేలరాలాయి. వరి చేలు నేలకొరిగాయి. ఆత్మకూర్(ఎం)లో కరెంట్ తీగలు తెగిపడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాలి దుమారానికి పలుచోట్ల ఇళ్ల పైకప్పు రేకులు లేచిపోయాయి. గుండాలలో బండపై రైతులు ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా: ఎడపల్లి మండలం బాపూనగర్లో వడగండ్లు పడ్డాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. బలమైన గాలులకు ధాన్యం కుప్పలపై కప్పిన టార్పాలిన్లు ఎగిరిపోయాయి. రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. ఈదురు గాలులతో వరితోపాటు మొక్కజొన్న, జొన్న పంటలు నేలవాలాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా: పలు మండలాల్లో ఈదురుగాలులు, వర్షానికి ధాన్యం పొలాల్లోనే రాలిపోయింది. మొక్కజొన్న నేలవాలింది. గంభీరావుపేట మండలం గజసింగవరంలో కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసి ముద్దయ్యింది. వేములవాడ మండలం నాగాయపల్లి శివారులో గాలివానకు పడిపోయిన చెట్లను బ్లూ కోల్ట్స్ తొలగించారు. జనగామ జిల్లా: జనగామ వ్యవసాయ మార్కెట్లో 600 బస్తాల వరకు ధాన్యం తడిసిపోగా, రఘునాథపల్లి, స్టేషన్ఘన్పూర్ మండలాల్లో కోతకు సిద్ధంగా ఉన్న పంట దెబ్బతింది. గాలి దుమారంతో 11 కేవీ విద్యుత్ లైన్లపై చెట్లు విరిగి పడిపోవడంతో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సిద్దిపేట జిల్లా : సిద్దిపేట జిల్లా నంగునూరు, చిన్నకోడూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈదురు గాలుల ధాటికి కొన్ని గ్రామాల్లో చెట్లు నేలకూలగా, పొలాల్లోనే గింజలు రాలడంతో వరి మొక్కకు పిలకలే మిగిలాయి. మొక్కజొన్న, మిర్చి, టమాట, కూరగాయ పంటలు నేలకొరిగాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా : దేవరకద్ర మార్కెట్లో వేలం వేసిన ధాన్యం కుప్పలు తడిపోయాయి. రైతులు కవర్లు కప్పినా.. అప్పటికే చాలా ధాన్యం తడిసి ముద్దయ్యిది. కొల్లాపూర్లో ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలాయి. నిర్మల్ జిల్లా: పలు మండలాల్లో ఈదురు గాలులతోపాటు రాళ్ల వర్షం కురిసింది. దీంతో కోతకు వచ్చిన పంటలు నేలవాలాయి. ఇప్పటికే కోసి కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసింది. మొక్కజొన్న తడిసి ముద్దయ్యింది.కల్లాల్లో అరబెట్టిన మక్కలు కొంత మేరకు తడిసిపోయాయి. రైతు ఆత్మహత్యాయత్నం ములుగు జిల్లా మొట్లగూడెం గ్రామానికి చెందిన యాలం నర్సింహారావు తనకున్న ఐదెకరాలతోపాటు మరో 15 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి, మొక్కజొన్న, మిర్చి పంటలు సాగు చేశాడు. మరో మూడు రోజుల్లో వరి పంట కోయాల్సి ఉండగా.. ఈనెల 7న సాయంత్రం వడగళ్ల వాన పడింది. దీంతో వరి చేనులో గింజకూడా లేకుండా రాలిపోవడంతో తీవ్ర నష్టం జరిగింది. అప్పులు తీర్చే మార్గం లేక నర్సింహారావు బుధవారం రాత్రి తన ఇంటికి సమీపాన ఉన్న పొలం వద్దకు పురుగుల మందుతాగాడు. ఉదయాన్నే స్థానికులు గుర్తించి ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉండండి : సీఎం రేవంత్రెడ్డి ఆకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్తోపాటు పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయని, రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు వివిధ జిల్లాల్లో కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ సూచనలను పరిగణనలోకి తీసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం అప్రమత్తం చేశారు. ముగ్గురి ప్రాణం తీసిన పిడుగులు వేర్వేరు జిల్లాలో పిడుగులు పడి ముగ్గురు మృత్యువాత పడ్డారు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నేలపోగుల గ్రామానికి చెందిన రైతు మందాడి రవీందర్రెడ్డి(55) రోజు మాదిరిగానే గురువారం గేదెలను మేపడానికి వెళ్లాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుమారుడు సంకీర్తరెడ్డి వ్యవసాయబావి వద్దకు వెళ్లి చూడగా విగతజీవుడై పడి ఉన్నాడు. సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో పిడుగు పడిందని, దీంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు గుర్తించారు. – సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గంగారాం గ్రామానికి చెందిన సంపత్కుమార్ అలియాస్ సతీశ్(19), జశ్వంత్, కార్తీక్లు సదాశివపేట మండల పరిధిలోని గొల్లగూడెంలోన ఓ కాలేజీలో ఐటీఐ చదువుతున్నారు. క్లాస్లు ముగిశాక ఒకేపై ముగ్గురూ స్వగ్రామానికి బయలు దేరారు. వర్షం ఎక్కువ కావడంతో సిద్దాపూర్–గొల్లగూడెం శివారులోని మైసమ్మ కట్ట వద్ద బైక్ను నిలిపి సంపత్కుమార్, జశ్వంత్ చింత చెట్టు కింద నిల్చున్నారు. కార్తీక్ మరో చెట్టు కింద నిలబడ్డాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా పిడుగుపడి సంపత్కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, జశ్వంత్కు తీవ్రగాయాలు అయ్యాయి. – నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం ఆమలూరు గ్రామానికి చెందిన గొర్రెల కాపరి మేకల రాములు(55) గ్రామ సమీపంలో తన గొర్రెలను మేపుతుండగా.. అకస్మాత్తుగా గాలి దుమారంతో వర్షం కురిసింది. రాములు పక్కనే పిడుగుపడడంతోఅక్కడికక్కడే మృతిచెందగా ఆయన కుమారుడు నరసింహకు తీవ్ర గాయాలయ్యాయి. ఆలేరు మండలం మంతపురిలో పిడుగుపాటుకు గేదె మృతి చెందింది. -
మరో కొత్త పథకం.. రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ శాఖలో మరో కొత్త పథకం పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ‘గ్రామ గ్రామానికి జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నాణ్యమైన విత్తనం’ పథకాన్ని జూన్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులందరికి నాణ్యమైన విత్తనాలను అందించడమే లక్ష్యమని మంత్రి అన్నారు.సుమారు 40, 000 మంది రైతులకు, 2500 నుంచి 3000 క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి ముగ్గురు నుంచి ఐదుగురు ఆసక్తి కలిగిన అభ్యుదయ రైతులకు జూన్ మొదటి వారంలో ఈ పథక కింద పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.గత నెలలో కురిసిన వడగళ్ల వానకు నష్టపోయిన రైతులకు పంట నష్టం అందించనున్నట్టు మంత్రి ప్రకటించారు. మార్చిలో కురిసిన వడగళ్ల వర్షాలకు 8,408 ఎకరాల్లో జరిగిన పంట నష్టం జరిగినట్టు గుర్తించామని మంత్రి పేర్కొన్నారు. నష్ట పరిహారం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కాగా, ఈ నెలలో కురిసిన వడగళ్ల వానకు, ఈదురు గాలులకు పంట నష్టంపై ప్రాథమిక రిపోర్ట్ ప్రభుత్వానికి అందిందని.. పరిశీలించి వారికి కూడా నష్ట పరిహారం అందించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. -
రసాయనాలు కుమ్మరిస్తున్నారు!
కర్నూలు(అగ్రికల్చర్): రసాయన ఎరువుల ఎక్కువ వినియోగంతో ఎన్నో అనర్థాలు ఉన్నాయనే విషయాన్ని చాలా మంది రైతులు గుర్తించలేకపోతున్నారు. వివిధ పంటల్లో ఉత్పాదకతను పెంచుకునేందుకు విచ్చలవిడిగా వాడుతున్నారు. దీంతో భూమి స్వభావం దెబ్బతింటోంది. చాలా చోట్ల పొలాలు చౌడుబారుతున్నాయి. పర్యావరణం కూడా కలుషితం అవుతోంది. పంట ఉత్పత్తుల్లో కెమికల్స్ అవశేషాలు ఉండటంతో మార్కెట్లో గిట్టుబాటు ధరలు లభించని పరిస్థితి ఏర్పడింది. కర్నూలు జిల్లాలో 2023–24లో 2,04,318 టన్నుల రసాయన ఎరువులు వాడగా.. 2024–25లో 2,34,144 టన్నులు వినియోగించారు. మొత్తం 29,826 టన్నుల వినియోగం పెరిగింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. రైతులకు అవగాహన కల్పించడం.. ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహాలు పెంచడం... తదితర విషయాలపై దృష్టిసారించడం లేదు. ఎకరాకు 185 కిలోల రసాయన ఎరువులురాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో 96 వేల ఎకరాల్లో మిర్చి సాగైంది. పత్తి కూడా జిల్లాలో అత్యధికంగా సాగు అవుతోంది. 2024 ఖరీఫ్లో 10,55,517 ఎకరాలు, రబీలో 2,14,692 ఎకరాలు ప్రకారం మొత్తంగా 12,70,209 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. నీటిపారుదల కింద సాగు చేసే పంటలకు విపరీతంగా రసాయన ఎరువులు వినియోగిస్తున్నారు. సగటున ఎకరాకు 160 కిలోల వరకు రసాయన ఎరువులు వాడవచ్చు. అయితే 2024–25లో ఎకరాకు సగటున 185 కిలోల రసాయన ఎరువులు వినియోగించారు. 2024–25లో భూసార పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహించి.. వాటి ఫలితాలను రైతులకు అందచేసినప్పటికీ రసాయన ఎరువుల వినియోగం పెరిగిపోయింది. ఖర్చు తడిసి మోపెడురసాయన ఎరువుల వినియోగం భారీగా పెరుగుతుండటంతో వ్యవసాయంలో పెట్టుబడి వ్యయం పెరుగుతోంది. వివిధ కంపెనీలు రసాయన ఎరువుల ధరలు ఇష్టానుసారంగా పెంచుతున్నాయి. 10–26–26, 12–32–16 రసాయన ఎరువుల 50కిలోల బస్తా ధర రూ.1,720 ఉందంటే ధరలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో తెలుస్తోంది. దీంతో రైతులకు ఖర్చు తడిసిమోపెడు అవుతోంది. మిర్చి, వరి సాగులో అడ్డుగోలుగా రసాయన ఎరువులను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పండించిన పంటల్లో కూడా కెమికల్స్ అవశేషాలు ఉంటున్నట్లుగా శాస్త్రీయంగా నిర్ధారణ అవుతోంది.‘ప్రకృతి’సాయం కరువే!రసాయన ఎరువుల వినియోగం లేకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తే ప్రజారోగ్యానికి పెద్దపీట వేసినట్లే. అయితే జిల్లాలో ప్రకృతి వ్యవసాయంలో పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది. కాగితాల్లో వేలాది ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం కనిపిస్తోంది. 2024–25లో 50 వేల ఎకరాలకుపైగా ప్రకృతి వ్యవసాయం చేసినట్లు లెక్కలు ఉన్నప్పటికీ వాస్తవం నామమాత్రమే. స్వచ్ఛందంగా ప్రకృతి వ్యవసాయం చేసేవారు జిల్లాలో 70 నుంచి 80 మంది వరకు ఉన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహించకపోవడం, విరివిరిగా సాయం అందించడం.. తదితర కారణాలతో చాలా మంది రైతులు ముందుకు రావడం లేదు. గ్యాప్..తూచ్రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ (గ్యాప్) కింద ప్రతి మండలంలో పొంలబడి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు చేసిన సిఫార్సుల మేరకే కెమికల్స్ వాడాలి. ప్రతి మండలంలోని 50 నుంచి 100 ఎకరాల వరకు ‘గ్యాప్’కింద ఆహార పంటలు సాగు చేశారు. ప్రతి వారం పొలంబడి కార్యక్రమం నిర్వహిస్తూ వచ్చినప్పటికీ రసాయన ఎరువులు వాడకం తగ్గలేదు. పలు పంటల శ్యాంపుల్స్లో కెమికల్స్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.చర్యలు తీసుకుంటున్నాం2024–25 సంవత్సరంలో సాగు విస్తీర్ణం పెరిగినందున రసాయన ఎరువుల వినియోగం పెరిగింది. 2023–24 సంవత్సరంతో పోలిస్తే దాదాపు 30 వేల టన్నులు అదనంగా వినియోగించారు. కెమికల్స్ వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ కింద రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు పొలంబడి నిర్వహిస్తున్నాం. – పీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయఅధికారి, కర్నూలువినియోగంలో దేశంలో రెండో స్థానంరసాయన ఎరువుల వినియోగంలో నంద్యాల జిల్లా రికార్డుల్లోకి ఎక్కింది. 2024–25 వ్యవసాయ సంవత్సరంలో రాష్ట్రంలోనే ఎరువుల వినియోగంలో మొదటి స్థానంలో నిలిచింది. మరో విశేషమేమిటంటే దేశంలోనే ఎరువుల వినియోగంలో నంద్యాల జిల్లా రెండవ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ, రసాయన ఎరువుల మంత్రిత్వ శాఖ మంత్రి జేపీ నడ్డా పార్లమెంటు వేదికగా ఇటీవల ప్రకటించారు. ఈ జిల్లాలో ప్రధానంగా వరి సాగు చేస్తారు. కాగా యూరియా 3 బస్తాల వేయాల్సి ఉండగా... 10 బస్తాల వరకు వినియోగించారు. రికార్డు స్థాయిలో నంద్యాల జిల్లాలో 3.75 లక్షల టన్నులు వినియోగించిట్లు సమాచారం. ఎరువులు ఈ స్థాయిలో వినియోగించారంటే ఆహార పంటల్లో కెమికల్స్ అవశేషాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు. ఇవీ నష్టాలు..» మిర్చి, పత్తి, వరి, మొక్కజొన్న, వివిధ కూరగాయల పంటలకు రసాయన ఎరువుల వాడకం ఎక్కువగా ఉంటోంది. దీంతో ఈ పంట ఉత్పత్తుల్లో కెమికల్స్ అవశేషాలు ఉంటున్నట్లు తెలుస్తోంది. » కెమికల్స్తో పండించిన ఆహార ఉత్పత్తులు తీసుకుంటే ప్రజలు పలు రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. » గతంలో పశువుల ఎరువులు వాడేవారు. అలాగే పొలాల్లో నాలుగైదు రోజుల పాటు గొర్రెల మందను ఉంచేవారు. కెమికల్స్ లేని ఆహారం తీసుకోవడంతో అప్పటి వారు ఇప్పటికీ ఆరోగ్యంగా ఉంటున్నారు.» ప్రస్తుతం పలు రసాయన ఎరువులతో, మందులతో పండించిన ఆహారం తీసుకుంటుండటంతో జబ్బులు పెరిగిపోతున్నాయి. -
మూగజీవాలకూ రక్షణ ఇద్దాం!
(సాక్షి స్పెషల్ డెస్క్) : చిన్న, సన్నకారు రైతులు పశుపోషణ ద్వారా సమకూరే ఆదా యంపైనే ఎక్కువగా ఆధారపడతారు. అయితే, ఈ ఏడాది మార్చి నుంచే సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమో దవుతున్నాయి. దీంతో పాడి ఆవులు, గేదెలు, గొర్రె లు, మేకలు, కోళ్ల సంరక్షణ రైతులకు కత్తి మీద సాము లా మారింది. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా మామునూరులోని పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ అనుబంధ ఐసీఏఆర్ కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత డాక్టర్ ఎన్. రాజన్న, శాస్త్రవేత (ఎల్పీఎం) డాక్టర్ సాయి కిరణ్, ‘ఐసీఏఆర్–అటారి’ (జోన్–10) డైరెక్టర్ డాక్ట ర్ షేక్.ఎన్.మీరా రైతులకు సూచనలు ఇస్తున్నారు. ఈ వేసవి మనుషులతోపాటు పశువులకూ గడ్డు కాలమే. తెలంగాణలో సుమారు 3.26 కోట్ల పశు వులు ఉన్నాయి. ఇందులో 42.3 లక్షల ఆవులు 42.26 లక్షల గేదెలు, 1.90 కోట్ల గొర్రెలు, 49.35 లక్షల మేకలు 1.78 లక్షల పందులతోపాటు 7.99 కోట్ల కోళ్లు ఉన్నాయి. రైతులు తగు జాగ్రత్తలు తీసు కుంటే వేసవిలో పాలు, మాంసం ఉత్పత్తి తగ్గకుండా కాపాడుకోవొచ్చు. విదేశీ జాతి, సంకర జాతి ఆవులు 24–27 డిగ్రీల సెల్సియస్ (డి.సె.), దేశీ ఆవులు 33 డి.సె.లు, గేదెలు 36 డి.సె.లు, కుందేళ్లు 30 డి.సె.ల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోలేవు. ఎండ దెబ్బ లక్షణాలు..నాడి వేగంగా, బలహీనంగా కొట్టుకుంటుంది. హృదయ స్పందన రేటు, శ్వాసక్రియ రేటు, పేడ ఉష్ణోగ్రత పెరగడం, అసాధారణంగా సొంగ కారటం, మైకం/అపస్మారక స్థితికి చేరటం, చర్మం చల్లగా, నిస్తేజంగా మారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అధిక తాపం వల్ల సంకర జాతి ఆవుల్లో 15–20%, గేదెల్లో 10–15% పాల దిగుబడితోపాటు వెన్న శాతం పడిపో తుంది. ఉష్ణ తాపానికి గురైన పశువుకు చూలు నిలవదు. ఉదయం 6 –11 గంటలలోపు.. సాయంత్రం 4–6 గంటల మధ్యలోనే మేతకు వదలాలి. పచ్చిమేతతోపాటు దాణాను పగలు, ఎండు గడ్డిని రాత్రి పూట వేయాలి. రోజుకు 100 గ్రా. చొప్పున పొటాషి యం అధికంగా ఉండే ఖనిజ లవణాల మిశ్రమం ఇవ్వాలి. షెడ్ల ఎత్తు కనీసం 9 అడుగులు పశువుల షెడ్లను తూర్పు–పడమర దిశలో 9 అడుగుల ఎత్తున నిర్మించాలి. పాకల చుట్టూ అవిశె, మునగ, సుబాబుల్ చెట్లు పెంచాలి. షెడ్ల పైకప్పులకు తెల్లని రంగువేసి, ఆపైన గడ్డి, తాటి/ కొబ్బరి /పామాయిల్ ఆకుల్ని కప్పాలి. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు గంటకొకసారి చల్లని నీటితో పశువుల ఒళ్లు తడపాలి. పాకల చుట్టూ గోనె సంచులు/ 20% షేడ్ నెట్ కట్టి, తడుపుతూ ఉండాలి. అధికంగా పాలిచ్చే ఆవులు, ముర్రా గేదెల కోసం ఫ్యాన్ బిగించాలి. గోనె సంచులను నడుముపైన కప్పి, 2–3 సార్లు తడపాలి. షెడ్లపైన స్ప్రింక్లర్లు బిగించాలి. వేసవిలో పశువులకు దాదాపుగా రెట్టింపు తాగునీరు అవసరం. ఈ జాగ్రత్తలు తీసుకోండి..పశువుల ఆరోగ్యం, ఆహారం, నీటిసరఫరా, శరీర పరిస్థితులను ప్రతిరోజు పర్యవేక్షించాలి. ఎండదెబ్బ తగిలిన పశువును చల్లని ప్రదేశానికి తరలించి, చల్లటి నీటితో స్నానం చేయించాలి లేదా తడి దుప్పట్లలో చుట్టి, ఫ్యాన్ గాలి అందేలా చూసుకోవాలి. గొర్రెలు, మేకలకు సరైన నట్టల మందులు ఎంచుకోవాలి. వేసవి వ్యాధుల నుంచి రక్షణకు వ్యాక్సిన్లు వేయించాలి. చల్లటి నీటితో స్నానాలు చేయించాలి. చల్లని తాగునీటిని అందించాలి. కోళ్ల పెంపకంలో వేసవి జాగ్రత్తలు..» కోడి శరీరం చలిని తట్టుకునే విధంగా పూర్తిగా ఈకలతో నిండి ఉంటుంది. వాటి శరీరంలో చమట గ్రంధులు లేవు. సాధారణ శరీర ఉష్ణోగ్రత 107 డిగ్రీల ఫారెన్ హీట్ కంటే బయటి ఉష్ణోగ్రత పెరిగితే తట్టుకోలేవు. » వేడి ఒత్తిడికి గురైన కోడి పిల్లలు నీరస్తాయి. విరేచనాలవుతాయి. నిలబడ లేవు. వణుకుతుంటాయి. ఈ లక్షణాలుంటే మందులు వేయించాలి. కోళ్లు మెడలు వాల్చి, సన్నగా మూలుగుతూ, కళ్ల నుంచి నీరు కార్చుతున్న కోళ్లను వెంటనే ఇతర కోళ్ల నుంచి వేరుచేసి సరైన చికిత్స అందించాలి. » షెడ్డు ఎత్తు 10 అడుగులుండాలి. దాణా తెల్లవారుజాము, రాత్రి వేళల్లో ఇవ్వాలి. దాణాలో అవసరమైన మోతాదులో విటమిన్లు, ఖనిజ లవణాలు ఉండాలి. మాంసకృత్తులు కొంతమేర తగ్గించాలి. సి–విటమిన్ ఎక్కువగా ఇవ్వాలి. » ఒక టన్ను దాణాలో 100 గ్రాముల విటమిన్–సి, 50 గ్రాముల విటమిన్–ఇ ఇస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మితియోనైన్ అనే అమైనోఆమ్లం దాణాలో కలిపి ఇవ్వాలి. అమ్మోనియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్ 0.25 శాతం ఇస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. » వేసవిలో దాణా, నీటిని 1:2 నిష్పత్తిలో ఇవ్వాలి. ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు 1:4 నిష్పత్తిలో ఉండాలి. నీటిలో ఎలక్ట్రోలైట్లు, విటమిన్లు వంటివి కలిపితే అవి ఒత్తిడికి గురికాకుండా ఉంటాయి. వీలైనంత వరకు చల్లని నీటినే ఇవ్వాలి. షెడ్డుపైన గడ్డి కప్పి, స్ప్రింక్లర్లు అమర్చి.. షెడ్డు లోపల ఫాగర్స్తో ఎండవేళల్లో అర గంటకొకసారి నీళ్లు చల్లాలి. -
మిల్లర్లు చెప్పిందే రేటు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మిల్లర్లు సిండికేట్గా మారి ధాన్యం ధర తగ్గించేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అత్యధికంగా మిల్లులున్న మిర్యాలగూడ, హుజూర్నగర్ ప్రాంతాల్లో వారు చెప్పిందే రేటుగా సన్నధాన్యం కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని 150కి పైగా మిల్లుల్లో పది రోజుల కిందటే కొనుగోళ్లు ప్రారంభమైనా, ప్రభుత్వ కేంద్రాల్లో మాత్రం సన్న ధాన్యం కొనుగోళ్లు ఇంకా ప్రారంభించలేదు. జిల్లాలో సన్న ధాన్యం కోసం 75 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా, మూడు రోజుల క్రితం ఐదు కేంద్రాలను మాత్రమే ప్రారంభించింది. వాటిల్లోనూ ఇంకా కొనడం లేదు. దీంతో రైతులు మిల్లుల్లోనే తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. పది రోజుల కిందట మిల్లర్లు సన్న ధాన్యం క్వింటాల్కు రూ.2,600 వరకు ధర చెల్లించినా, ఇప్పుడు ధాన్యం ఏపీ నుంచి అధికంగా వస్తుండటంతో ఇక్కడ ఒక్కసారిగా ధర తగ్గించేశారు. క్వింటాల్కు రూ.2,200లోపే చెల్లిస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఒక్కసారిగా పోటెత్తడంతో ధర తగ్గింపు ప్రస్తుత వాతావరణ మార్పుల కారణంగా వర్షం పడితే ధాన్యం తడిచిపోతుందనే భయంతో రెండు రోజులుగా రైతులు ధాన్యం ట్రాక్టర్లతో మిల్లులకు పోటెత్తారు. అదే అదనుగా వివిధ రకాల కొర్రీలు పెడుతూ ధర తగ్గించేశారు. మద్దతు ధర గ్రేడ్–ఏ రకానికి (సన్న ధాన్యం) రూ.2,320గా ప్రభుత్వం నిర్ణయించింది. ఐకేపీ కేంద్రాల్లో విక్రయిస్తే క్వింటాల్కు రూ.2,320 మద్దతు ధరతోపాటు రూ.500 చొప్పున బోనస్ వస్తుంది. ఈ లెక్కన రైతుకు క్వింటాల్కు రూ.2,820 ధర లభిస్తుంది. అయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించాలంటే రోజుల తరబడి ధాన్యాన్ని కల్లాల్లో ఆరబెట్టాల్సి వస్తుంది. ధాన్యంలో తేమ 17 శాతం వరకు ఉంటేనే ప్రభుత్వం కొనుగోలు చేయడంతోపాటు బోనస్ చెల్లిస్తుంది. ఈ క్రమంలో వర్షం పడి ధాన్యం తడిచిపోతే ఇక అంతే సంగతులు. పైగా జిల్లాలో ప్రభుత్వ పరంగా సాధారణ రకం ధాన్యం కొనుగోళ్లలోనే వేగం పుంజుకోలేదు. ఇక సన్నధాన్యం కొనుగోళ్లే ప్రారంభం కాలేదు. ఈ బాధలన్నీ పడలేక రైతులు మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. పచ్చ గింజ, పేరు పేరుతో ధర తగ్గింపు నాగార్జునసాగర్ ఆయకట్టుతోపాటు ఉమ్మడి జిల్లాలో బోరుబావుల కింద సాగు చేసిన రైతులు మిర్యాలగూడ మిల్లుల్లో అమ్ముకునేందుకు నిత్యం వందల ట్రాక్టర్లలో ధాన్యం తీసుకొస్తున్నారు. పది రోజుల కిందట ధాన్యం తక్కువగా రావడంతో కావేరి, చింట్లు, చిట్టిపొట్టి, హెచ్ఎంటీ వంటి రకాల ధాన్యం క్వింటాల్ ధర రూ.2,600వరకు చెల్లించారు. ఇప్పుడు ధాన్యం రాక పెరగడంతో మిల్లర్లు సిండికేట్ అయ్యారు. ఏ రోజుకు ఆరోజు వారే ధర నిర్ణయించి కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో ఏ మిల్లుకు వెళ్లినా తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది. ధాన్యం పచ్చిగా ఉందని, తాలు ఉందని, ఎక్కువ డ్రై అయ్యిందంటూ కొర్రీలు పెడుతూ రూ.2,200లకు మించి చెల్లించడం లేదు. ఏపీ నుంచి జోరుగా వస్తున్న ధాన్యం కోదాడ, మిర్యాలగూడ, హుజూర్నగర్, హాలియా ప్రాంతాల్లోని మిల్లులకు ఏపీలోని నంద్యాల, కర్నూలు, గుంటూరు జిల్లాల నుంచి సన్న ధాన్యం లారీలు పెద్ద ఎత్తున వస్తున్నట్టు తెలిసింది. అందువల్లే మిల్లర్లు ధర తగ్గించేసి కొనుగోళ్లు చేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం జిల్లాకు రాకుండా చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్టు ఉన్నతాధికారులు ప్రకటించి వదిలేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ఏపీ నుంచి ధాన్యం రావడంతో ధాన్యం ధర తగ్గించారని, ఫలితంగా నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇంత తక్కువ ధర ఎప్పుడూ లేదువరికి గిట్టుబాటు ధర రావడం లేదు. పదేళ్లలో ఇంత తక్కువ ధర ఎప్పుడూ లేదు. 12 ఎకరాల్లో చింట్లు సాగుచేశా. క్వింటాల్కు రూ.2,140లే చెల్లించారు. అకాల వర్షాల భయంతో మిల్లులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. – కలారి లింగయ్య, అన్నారం ఐదారు మిల్లులు తిరిగా..ఏ మిల్లు వద్దకు వెళ్లినా కొర్రీలే. మేం పండించిన చింట్లు బాగానే ఉన్నా ఇబ్బందులు పెడుతున్నారు. తక్కువ ధరకు ఇవ్వాలనే ఉద్దేశంతో కొనమని చెబుతున్నారు. ఈ విషయంలో అధికారులకు ఫోన్ చేసినా ఎత్తడం లేదు. – లావూరి లింగా, వాచ్యాతండా ఏదో కారణంతో తగ్గిస్తున్నారు నాకున్న నాలుగు ఎకరాల్లో చింట్లు పండించా.పచ్చిగా ఉంటే పచ్చిగా ఉన్నాయని, డ్రైగా ఉంటే ఎక్కువ డ్రై అయ్యాయని చెప్పి ధర తగ్గిస్తున్నారు. గత్యంతరం లేక క్వింటాకు రూ.2,200కే అమ్ముకున్నా. – కోడిరెక్క ప్రవీణ్, శెట్టిపాలెం -
సన్నాలు.. సిరులు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఈ యాసంగిలోనూ సాగు చేసే సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామన్న ప్రభు త్వ ప్రకటన నేపథ్యంలో ఈసారి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 56.69 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా, అందులో దాదాపు 40 ల క్షల ఎకరాల్లో సన్నాలే ఉన్నాయి. నీటివనరులు అందుబాటులో ఉండటం, తెగుళ్లు లేకపోవడంతో దిగుబడి ఎక్కువగా వస్తుందన్న ఆశలో రైతులు ఉన్నారు. వానాకాలంలో 66.77 లక్షల ఎకరాల్లో... 2024–25 వానాకాలం సీజన్లో 66.77 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అందులో 40.44 లక్షల ఎకరాల్లో సన్నాలు సాగయ్యాయి. ప్రభుత్వం అప్పుడే సన్నరకం ధాన్యం క్వింటాల్కు రూ.500 బోనస్ను ప్రకటించింది. అయితే కొన్నిచోట్ల అధిక వర్షాలు, మరికొన్ని చోట్ల వర్షాభావ పరిస్థితులు, దోమకాటు, అగ్గి, ఎర్ర తెగుళ్ల కారణంగా దిగుబడి అనుకున్న స్థాయిలో రాలేదు. సన్నధాన్యం సాగుతో మద్దతు ధరతోపాటు క్వింటాల్కు రూ.500 బోనస్ వస్తుందనుకున్న రైతులకు కొంత నిరాశ మిగిల్చించంది. ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో సాగు యాసంగి సీజన్ అంటే.. సహజంగా ఆరుతడి పంటలను సాగు చేస్తారు. గత కొన్నేళ్ల పంటల సాగును పరిశీలిస్తే యాసంగిలో సన్నధాన్యం సాగు 15 శాతంలోపే ఉండేది. అయితే రూ.500 బోనస్, వాతావరణం అనుకూలించడం, నీటివసతి కూడా ఉండటంతో ఈ యాసంగిలో వరిసాగు విస్తీర్ణం 56.69 లక్షల ఎకరాలు కాగా, అందులో 60 శాతం వరకు (40 లక్షల ఎకరాలే) విస్తీర్ణంలో సన్నాలు సాగయ్యాయి. యాసంగిలో సన్న రకాలు సాగు చేయడం ఇదే రికార్డు. గత ఏడాది యాసంగిలో మొత్తం 51.92 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఈ యాసంగిలో 54.83 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, గతేడాది కంటే అధికంగా 1.86 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈసారి రైతులకు కలిసొచ్చింది ఈ యాసంగిలో వరిసాగు చేసిన రైతులకు కలిసొచ్చింది. ఎక్కువగా అకాల వర్షాలు, గాలిదుమ్ము లేకపోవడంతో పంట నష్టం వాటిల్లలేదు. ప్రతి ఏటా ఇబ్బందికరంగా మారుతున్న తెగుళ్లు ఈసారి ఎక్కువగా పంటలకు సోకలేదు. దీంతో మందులు పిచి కారీ చేయడం, పంట దెబ్బతినడం వంటి ఆందోళన ఈసారి లేదు. ఈ క్రమంలో వానాకాలం సీజన్తో పోలిస్తే ఈసారి అనుకూలంగా ఉన్నట్టు రైతులు పేర్కొంటున్నారు. దిగుబడి ఆశించిన మేరకు రావడం, సన్నాలకు బోనస్ ఇవ్వనుండటంతోపాటు మద్దతు ధర లభించడంతో రైతులకు కలిసి రానుంది. వానాకాలం ఎకరాకు సగటున 20 క్వింటాళ్ల నుంచి 23 క్వింటాళ్ల వరకు దిగుబడి రాగా..ఈసారి సగటున 26 క్వింటాళ్ల నుంచి 28 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందన్న ఆనందం రైతుల్లో వ్యక్తమవుతోంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సింగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన లింగం యలమంద 2024–25 వానాకాలం సీజన్లో 10 ఎకరాల్లో వరి సాగు చేశాడు. వివిధ రకాల తెగుళ్లు, వర్షాలు, వరదల కారణంగా 200 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన బోనస్తో కొంత ప్రయోజనం చేకూరింది. ఈ యాసంగిలో 10 ఎకరాల విస్తీర్ణంలో మళ్లీ సన్నాలు సాగు చేశాడు. ఈసారి 260 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని చెబుతున్నాడు. ధాన్యాన్ని విక్రయించేందుకు నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహిస్తున్న డీసీఎంఎస్ కేంద్రానికి వచ్చాడు. బోనస్ భరోసా, పెరిగిన దిగుబడితో ఆనందంగా ఉన్నాడు. ఈసారి ఖర్చులు తక్కువే ఈ యాసంగిలో నాకున్న ఎకరం విస్తీర్ణంలో సన్నరకం సాగు చేయగా.. 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. వానాకాలంలో 24 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. వర్షాలు, వరదలతోపాటు తెగుళ్లు ఇబ్బంది పెట్టడం వల్ల దిగుబడి తగ్గడంతోపాటు ఖర్చులు కూడా అధికమయ్యాయి. అయితే ఈ యాసంగిలో వాతావరణం పూర్తి అనుకూలంగా ఉండటం, తెగుళ్లు లేకపోవడంతో 6 క్వింటాళ్లు అధికంగా దిగుబడి వచ్చింది. ఖర్చులు కూడా అంతగా లేవు. –అర్వపల్లి నరేష్, కూసుమంచి -
పార్లమెంట్ సాక్షిగా బయటపడ్డ బాబు మోసాలు
-
చాక్లెట్ పంట.. ధరలేక తంటా
సాక్షి, అమరావతి: చాక్లెట్ పంట అన్నదాతకు చేదును పంచుతోంది. కంపెనీలు సిండికేట్గా మారి కోకో గింజల ధరల్ని అమాతం తగ్గించేయడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. కష్టకాలంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం కంపెనీలకు కొమ్ముకాస్తూ తమని పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. రాష్ట్రంలో 1.12 లక్షల ఎకరాల్లో కోకో తోటలు ఉండగా.. ఎకరాకు 3–4 క్వింటాళ్ల చొప్పున ఏటా 12 వేల టన్నుల గింజల దిగుబడి వస్తోంది. ఇందులో 80 శాతం గింజల్ని క్యాడ్బరీ, మిగిలింది నెస్లే, క్యాంప్కో, లోటస్ (Lotus) తదితర కంపెనీలు సేకరిస్తున్నాయి. కోకో పంటకు నవంబర్ నుంచి జూన్ వరకు సీజన్. జూలై నుంచి అక్టోబర్ వరకు అన్ సీజన్. దిగుబడిలో రెండొంతులు సీజన్లోనూ, ఒక వంతు అన్ సీజన్లోనూ చేతికొస్తుంది. గతంలో సీజన్, అన్ సీజన్ అనే తేడా లేకుండా గింజలన్నింటినీ ఒకే రీతిలో అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా కంపెనీలు కొనుగోలు చేసేవి. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. గతేడాది కిలో గింజల ధర రూ.1,050 గతేడాది ఇదే సమయంలో కిలో కోకో గింజలకు రూ.1,050 ధర లభించింది. ఈ ఏడాది కంపెనీలు సిండికేట్గా మారి అనూహ్యంగా ధరలు తగ్గించేయడంతో రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో కిలో గింజల ధర రూ.770కి పైగా పలుకుతుండగా, కంపెనీలు మాత్రం నాణ్యమైన (ప్రీమియం) గింజలకు సైతం రూ.400–450 మధ్య చెల్లిస్తున్నాయి. అన్సీజన్ గింజల్ని కొనేందుకు కంపెనీలు ఆసక్తి చూపడం లేదు. ఇదే అదునుగా ప్రైవేటు వ్యాపారులు కిలో రూ.200–250 మధ్య కొనుగోలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రస్తుతం కోతకు వచ్చిన సీజన్ పంటకు సైతం కంపెనీలు గిట్టుబాటు ధర చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. కోతకు సిద్ధంగా ఉన్న పంట కాకుండా రైతుల వద్ద దాదాపు 1,500 టన్నులకు పైగా కోకో గింజల నిల్వలున్నాయి. దిగుమతుల వల్లే.. ఈ ఏడాది చాక్లెట్ కంపెనీలు విదేశాల నుంచి కోకో గింజలు, పొడి, బటర్ దిగుమతి చేసుకోవడంతో ఇక్కడి రైతులు పండించిన పంటకు డిమాండ్ లేకుండాపోయింది. కోకో రైతుల్లో అత్యధికులు కౌలుదారులే. ఎకరాకు రూ.1.10 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు కౌలు చెల్లిస్తుంటారు. తెగుళ్లు, చీడపీడలు, యాజమాన్య పనుల కోసం ఏటా రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడి పెడుతుంటారు. ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక సతమతమవుతున్న రైతులు కంపెనీల మాయాజాలం వల్ల తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. సీజన్, అన్సీజన్తో సంబంధం లేకుండా అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా కోకో గింజల్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా.. ప్రభుత్వం జోక్యం చేసుకుని కంపెనీల మాయాజాలాన్ని అడ్డుకోవాలని ఏపీ కోకో రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ధరల స్థిరీకరణ నిధి పథకాన్ని కోకో రైతులకూ వర్తింప చేయాలని కోరారు. కోకో రైతులను ఆదుకోకపోతే ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ప్రభుత్వం స్పందించడం లేదుఎకరాకు రూ.1.40 లక్షల చొప్పున చెల్లించేలా 60 ఎకరాలను కౌలుకు తీసుకుని కోకో సాగు చేస్తున్నా. ఎకరాకు రూ.40 వేల వరకు పెట్టుబడులు అవుతున్నాయి. అన్సీజన్కు సంబంధించి 7 టన్నుల గింజలు ఉండగా.. కిలో రూ.330 చొప్పున 2.50 టన్నులు అమ్మాను. మిగిలిన 4.50 టన్నులు అమ్ముదామంటే కొనేవారు లేదు. సీజన్కు సంబంధించి 7 టన్నుల గింజల్ని కిలో రూ.550 చొప్పున కొన్నారు. ఇంకా 4 టన్నులు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు కిలో రూ.450కు మించి కొనలేమని చెబుతున్నారు. మరో రెండు టన్నుల వరకు పంట రావాల్సి ఉంది. ఈ ఏడాది పెట్టుబడులు కూడా వచ్చేలా కనిపించడం లేదు. లీజుకు చెల్లించాల్సిన మొత్తం నష్టపోయినట్టే. పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఏమాత్రం స్పందించలేదు.రూ.45 లక్షలకు పైగా నష్టపోతున్నా ఈ రైతు పేరు అవర్ని అనిల్కుమార్. ఏలూరు జిల్లా పెదవేగి మండలం రాయన్నపాలేనికి చెందిన ఈయన 150 ఎకరాలను కౌలుకు తీసుకుని.. ఎకరాకు రూ.1.40 లక్షల చొప్పున కౌలు చెల్లిస్తూ కోకో సాగు చేస్తున్నారు. ఎకరాకు రూ.40 వేల చొప్పున పెట్టుబడి అవుతోంది. ఎకరాకు 3.50 క్వింటాళ్ల చొప్పున కోకో గింజల దిగుబడి వచ్చింది. అన్ సీజన్(వర్షాకాలం)లో తీసిన పంటను కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. బతిమాలుకుంటే కిలోకు రూ.200–250 మించి ధర ఇచ్చేది లేదంటున్నారు. చదవండి: భోజనం లేదు.. పుస్తకాల్లేవు!గతేడాది ఇదే సమయంలో సీజన్, అన్ సీజన్తో సంబంధం లేకుండా కిలో గింజలకు రూ.1,050 చొప్పున ధర దక్కింది. ఈ ఏడాది అమాంతం ధర తగ్గిపోవడంతో ఎకరాకు రూ.30 వేల చొప్పున మొత్తంగా తాను రూ.45 లక్షల మేర నష్టపోతున్నట్టు రైతు అనిల్కుమార్ ఘొల్లుమంటున్నారు. కోకో గింజల్ని కొనుగోలు చేసే కంపెనీలు సిండికేట్గా మారి ధరల్ని దారుణంగా తగ్గించేయడంతో కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన చెందుతున్నారు. -
నిర్వాసితునికి జనసేన ఎమ్మెల్యే బెదిరింపులు
మునగపాక: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ సహనం కోల్పోయారు. సందర్భాన్ని బట్టి ఓర్పు, సహనంతో నియోజకవర్గ ప్రజలను సముదాయించాల్సిన ఆయన విరుచుకుపడ్డారు. భూసేకరణలో టీడీఆర్ బాండ్లు వద్దు.. నగదు చెల్లించాలని ఓ బాధితుడు కోరడమే ఆయన ఆగ్రహానికి కారణం. జిల్లాలోని మునగపాక జనసేన కార్యాలయం ఆవరణలో గురువారం పూడిమడక రోడ్డు విస్తరణ బాధితులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు నిర్వాసితులు టీడీఆర్ బాండ్లు ఇవ్వకుండా పరిహారం కింద నగదు అకౌంట్లో జమచేయాలని కోరారు. తిమ్మరాజుపేటకు చెందిన తనకాల జగ్గారావు మాట్లాడుతూ.. తాను టీడీఆర్ బాండ్ల కోసం అనకాపల్లిలో వాకబు చేశానని.. ఈ బాండ్లు అమ్ముకోవడం కష్టతరమని చెప్పారని.. ఇలా అయితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు. పరిహారాన్ని నేరుగా నగదు రూపంలో అందించాలని కోరారు. ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ జోక్యం చేసుకుని.. టీడీఆర్ బాండ్లను ఎక్కడైనా అమ్ముకోవచ్చని, అనకాపల్లిలో తప్ప ఇతర ప్రాంతాల్లో అమ్ముకోలేమని అనడం సరికాదంటూ బెదిరింపు ధోరణలో చెప్పారు.దీంతో.. ఇద్దరి మధ్య మాటామాటా పెరుగుతుండడంతో ఎమ్మెల్యే సహనం నశించి.. ‘ఉండు.. నువ్వుండు.. ఆగమంటున్నానా.. కౌంటర్ ఇవ్వడం కాదు. నేను తలచుకుంటే నీపై కేసు పెట్టలేనా?’ అని మండిపడ్డారు. నిర్వాసితుల్లో అనుమానాలు రేకెత్తించేలా ప్రవర్తించడం సరికాదంటూ హెచ్చరించారు. విస్తరణలో భూములు, ఇళ్లు కోల్పోయే బాధితులకు మెరుగైన పరిహారం అందజేస్తామన్నారు. వీఎంఆర్డీఏ ఎక్కడైనా భూములను సేకరించేటప్పుడు టీడీఆర్ బాండ్లు ఇస్తుందని.. ఇక్కడ కూడా ఇస్తారేమోనని విజయ్ అన్నారు. తాను ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి బాధితులకు నగదు రూపంలో పరిహారం అందించేలా చూస్తానని హామీ ఇచ్చారు. -
కన్నీటి దిగుబడి
రాయచోటి/రైల్వేకోడూరు అర్బన్: అన్నమయ్య జిల్లాలో దోస, కర్బూజ పంటలు పండించే రైతులకు ఫలితాలు.. ఈ ఏడాది కూడా ఆశాజనకంగా లేవు. నట్టేట ముంచి అప్పులపాలు చేస్తున్నాయి. ఫిబ్రవరి నెల ఆఖరులో, మార్చి మొదటి వారంలో దోస 22 రూపాయలు, కర్బూజ 18 రూపాయలు ధరలు పలకడంతో కొందరు రైతులు లాభపడ్డారు. దీంతో రైతులు కొండంత ఆశ పెట్టుకొన్నారు. కానీ అందరి దిగుబడి చేతికి వచ్చే సరికి.. దళారులు మోసాలతో ధరలను పాతాళానికి పడేశారు. జిల్లాలో భారీగా దోస, కర్బూజ పంటలు సాగు చేశారు. ముఖ్యంగా రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి ప్రాంతాలలో వందలాది మంది రైతులు వేశారు. తెగుళ్లు, దళారీల మోసాలు, గిట్టుబాటు ధరలు లేక భారీగా నష్టపోతున్నారు. ఓబులవారిపల్లిలో కోహినూర్ దోస వేసి ఎగుమతులు లేక రూ.లక్షల్లో నష్టపోయారు. ఎరువులు, పురుగు మందుల పిచికారీ కోసం.. దోస, కర్బూజ పంటల సాగు ప్రారంభ దశ నుంచే రైతులకు మందుల పిచికారీ, ఎరువులు పెనుభారంగా మారింది. విత్తన దశ నుంచి క్రిమి సంహారక మందులకు వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. దీనికి తోడు పూతకు పిందెలు వచ్చే సమయం నుంచి తెగుళ్ల నివారణకు మందుల పిచికారీ అధికంగా ఉంటుంది. వాతావరణ మార్పుల వల్ల పూత రావడానికి, పిందె నిలవడానికి, తెగుళ్లకు రెండు రోజులకు ఒక సారి అయినా మందులు పిచికారీ చేయాలి. కేవలం మందులకే రైతులు దుకాణాల్లో రూ.లక్షలు అప్పులు చేశారు.తూకాల్లో కోత రైతులు పంటకు ధరలు పడి పోయి కన్నీరు కారుస్తుంటే.. పలువురు దళారీలు ఇదే అదునుగా మరింతగా రేటు తగ్గిస్తున్నారు. ఇక్కడి దిగుబడిని ఇతర రాష్ట్రాలకు కూడా తరలిస్తుంటారు. ఇదే అదునుగా రైతులకు, వ్యాపారులకు మధ్య దళారులు చేరి అక్కడ ఒకరేటు, రైతులకు ఒకరేటు, లోడ్ తూకాలలో కోత, కమీషన్లు ఇలా రకరాలుగా మోసం చేస్తున్నారు. కరుణించని పాలకులు మార్కెట్ ధరలు లేక అప్పుల ఊబిలో కూరుకుపోయిన దోస రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. గిట్టుబాటు ధరలు రావడం లేదని రైతు సంఘాల నేతలు గళమెత్తి అరుస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. కనీసం జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సైతం.. కష్టాల కడలిలో ఉన్న కర్షకులను పరామర్శ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ ప్రాంతం ఎమ్మెల్యేలు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రైతులు కోరుతున్నారు. రైతులను ఆదుకోవాలి సంబేపల్లి మండలం రెడ్డివారిపల్లె పంచాయతీ సీఎం కొత్తపల్లిలో రైతు రామచంద్ర 4 ఎకరాలలో రూ.6 లక్షలు ఖర్చు చేసి సాగు చేశారు. దళారులు అడిగినంతకు కాయలు ఇవ్వలేదని వాటిని కొనుగోలు చేయలేదు. కాయలు తోటలోనే కుళ్లిపోవాల్సిన పరిస్థితి. పండించిన పంటను మార్కెట్కి తరలించలేక రైతు తోటలోనే కూలిపోయాడు. ఇలా వేల మంది రైతులు దోస, కర్బూజ తోటలను సాగు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కావున ప్రభుత్వం వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. – బాలకృష్ణారెడ్డి, రైతు సంఘం రీజనల్ కోఆర్డినేటర్, అన్నమయ్య జిల్లా ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పు రావాలి జిల్లాలో సాగవుతున్న పంటలో సగం ఒక పైగా రైతులు పండ్ల తోటలు వేస్తున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని మంచి ఆదాయాన్ని గడించవచ్చని దోస పంట సాగు చేశారు. రైతులు పండించిన పంటకు మంచి గిట్టుబాటు ధరలు రావాలంటే ప్రజలు ఆహారపు అలవాట్లను మార్చుకుంటే మంచిది. ప్రతి ఒక్కరూ ప్రతి రోజు మంచి ఆరోగ్యం కోసం ఆహారంలో 200 గ్రాములు పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. జిల్లాలో పండించిన రైతుకు బాగుంటుంది. – రవిచంద్రబాబు, జిల్లా ఉద్యానవన అధికారి, అన్నమయ్య జిల్లా అనుకూలించని రేటుకష్టపడి పండించిన కర్బూజాకు మార్కెట్ ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కొంత మంది రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా దోస, పుచ్చకాయ పంటను సాగు చేశారు. మార్కెట్లో కేజీ దాదాపు రూ.15 నుంచి రూ.20 పలుకుతోంది. దళారులు కేజీ రూ.5 లేదా రూ.8 మాత్రమే చెల్లిస్తున్నారు.కానీ ఎకరాకు పెట్టుబడి 50 వేల నుంచి లక్ష రూపాయలకు పైగా అవుతుందని రైతులు పేర్కొంటున్నారు. దీంతో పంటపై పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పొలంలోనే కాయలను వదిలి వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని వాపోతున్నారు. దళారీల సిండికేటుతో ఇక్కట్లు నా పేరు ఎద్దుల ప్రసాద్. మాది రైల్వేకోడూరు. పది ఎకరాలలో కర్బూజా పంటను సాగు చేశా. దళారుల సిండికేట్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలోని వ్యాపారులు కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా కలిసి వాట్సాప్ గ్రూపులలో దోస, కర్బూజా ధరలను పంచుకుంటున్నారు. ఒక వ్యాపారి తోట దగ్గరికి వచ్చి కిలో 5 రూపాయలతో కొనుగోలు చేస్తామని చెప్పి వెళ్లిన విషయాన్ని వాట్సాప్ గ్రూపుల ద్వారా రైతు పేరుతోపాటు గ్రూపులలో షేర్ చేస్తున్నారు. దీంతో మిగిలిన వ్యాపారులు అదే ధరకు లేదా మరో రూపాయి అదనంగా ఇస్తామని మాత్రమే చెబుతున్నారు. పెట్టుబడి కూడా రాలేదు నా పేరు నిరంజన్రెడ్డి. మా ఊరు చిన్నమండెం మండలం రెడ్డివారిపల్లె. 20 ఎకరాల్లో దోస సాగు చేశా. పంట దిగుబడి వచ్చే వరకు 30 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఉద్యానవన అధికా రుల సూచనలతో పురుగు నివారణ మందులు పిచికారీ చేశాను. ఎకరాకు నాలు గైదు టన్ను లు వస్తుందని ఆనందపడ్డాను. ప్రకృతి కరుణించలేదు, తెగుళ్లు వీడలేదు. ఫలితంగా సగం తోట దెబ్బతిన్నది. వచ్చిన దిగుబడితోనైనా పెట్టుబడి వస్తుందని ఆశించాను. మార్కెట్కి వెళ్తే ధరలు లేక, పెట్టిన పెట్టుబడి రాక ఆర్థికంగా కుంగిపోయే పరిస్థితులు వచ్చాయి. అప్పుల పాలైన అన్నదాత ఇదీ ఈ ఇద్దరి రైతుల ఆవేదనే కాదు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి నెలకొంది. -
ప్రాణం లేచొచ్చింది!
ఇవి ప్రాణహిత ప్రాజెక్టు కాలువల కోసం సేకరించిన భూములు. ప్రాజెక్టుపై ఆశలు వదిలేసి, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం రణవెల్లి, బెజ్జూరు మండలం సులుగుపల్లి, మందమర్రి మండలం శంకర్పల్లి గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు నిర్మించారు. చాలాచోట్ల రైతులు సాగులో ఉన్నారు. వానాకాలంలో కాలువల్లో చేపలు పెంచుతున్నారు. మట్టి, బండరాయి, పైపులను తరలించుకుపోగా కొన్ని చోట్ల భూములు కబ్జాకు గురయ్యాయ్యాయి.సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకట నతో ప్రాణహిత ప్రాజెక్టుపై మళ్లీ ఆశలు చిగురిస్తు న్నాయి. రాష్ట్ర బడ్జెట్లో రూ.32 కోట్లు కూడా కేటాయించారు. అయితే పాత డిజైనా, లేక కొత్తది ప్రతిపాది స్తారా, వార్దాపై బరాజ్ నిర్మిస్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. తలాపునే పుష్కలైన నీళ్లు ఉన్నా.. ఏళ్లుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వర్షాధార పంటలే దిక్కు. రెండో పంటతోపాటు వరి పండించని పల్లెలు ఎన్నో ఉన్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణానికి 17ఏళ్లుగా మోక్షం కలగడం లేదు. భూ సేకరణలో ఎకరానికి రూ.1.50 నుంచి రూ.1.75 లక్షల లోపే పరిహారం ఇస్తే, ఇప్పుడా భూముల ధరలు రూ.15 నుంచి రూ.30 లక్షల వరకు పెరిగాయి. దీంతో భూములు తిరిగి ఇవ్వాలనే డిమాండ్లు రైతుల నుంచి వినిపిస్తున్నాయి.అభ్యంతరాలతో ఆగిపోయి...తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు వెన్గంగా, వార్దా కలిసే ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మడి హెట్టి వద్ద ప్రాణహిత నదిపై ప్రాజెక్టు కట్టాలనేది ప్రణాళిక. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి 2008లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 152 అడుగుల ఎత్తులో బరాజ్ నిర్మించి కాలువలతో ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల మీదుగా గోదావరి నదిపై ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు నీటిని తరలించి, అక్కడ నుంచి ఆరు జిల్లాలకు నీరు ఇవ్వాలి. ఏడు జిల్లాలకు నీటి సరఫరాకు భూసేకరణ, కాలువల కోసం రూ.10 వేల కోట్లు వెచ్చించారు. 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మిస్తే.. చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల్లో 30 గ్రామాల ముంపు ఉంటుందని మహారాష్ట్ర దీనికి అభ్యంతరం చెప్పింది. ఉమ్మడి ఏపీలోనూ, తెలంగాణ వచ్చాక కూడా దీనిపై చర్చలు జరిగాయి. చివరగా 2015లో నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు జరిపిన చర్చల్లో కూడా 148 మీటర్ల వరకు ఒప్పుకున్నారు. అయితే అభ్యంతరాల సాకుతో ప్రాజెక్టును పూర్తిగా పక్కకు పెట్టి, దిగువన గోదావరిలో ప్రాణహిత కలిసే మేడిగడ్డ వద్ద ‘కాళేశ్వరం’మొదలు పెట్టి శరవేగంగా పూర్తి చేశారు. తర్వాత వార్దానదిపై బరాజ్ కట్టి మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకే రెండు లక్షల ఆయకట్టుకు నీరిస్తామని డిజైన్లు చేసినా ముందుకు సాగలేదు.మా భూములు మాకియ్యాలి..నాలుగెకరాలు తీసుకొని, ఎకరానికి రూ.1.75 లక్షలు ఇచ్చారు. ఏళ్లు గడుస్తున్నా నీళ్లు రాలేదు. ప్రాజెక్టు కట్టకపోతే మా భూములు మాకియ్యాలి.– కోట అశోక్, శంకర్పల్లి కాలువల ఉపయోగం లేదు30 గుంటలు తీసుకు న్నారు. కాలువలు తవ్వినా, రైతులకు ఉపయోగం లేదు. ప్రాజెక్టు భూమిలోనే పల్లె ప్రకృతివనం నిర్మించారు.– విశ్వనాథ్, రణవెల్లి, -
అన్నదాతకు సర్కారే శాపం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయానికి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే శాపంగా మారింది. ప్రకృతి వైపరీత్యాలు, కరువు దెబ్బతీస్తున్నా, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీంతో 2024–25 ఖరీఫ్, రబీ సీజన్లలో వ్యవసాయమే అస్తవ్యస్తమైపోయింది. రైతులు తీవ్ర ఒడిదొడుకుల మధ్య పంటలు సాగు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. చివరకు రైతులు తీవ్ర నష్టాలపాలయ్యారు. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఖరీఫ్ సాగు ఆలశ్యం కాగా, ఆ ప్రభావం రబీ పైనా పడింది. రబీ సాగు కోసం ముందస్తు ఏర్పాట్లు చేయడంలో విఫలమైన ప్రభుత్వం రెండో పంటకు నీరివ్వడంలోనూ వైఫల్యం చెందింది. ప్రభుత్వ నిర్వాకం, పెట్టుబడి సాయం అందకపోవడం, అదనుకు విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు పడరాని పాట్లుపడ్డారు. ఈ తిప్పలన్నీ పడలేక చాలా మంది రైతులు వారి పొలాల్లో సాగే చేయకుండా వదిలేశారు. రెండు సీజన్లలో కలిపి 1.51 కోట్ల ఎకరాల్లో పంటల సాగు లక్ష్యం కాగా, 1.24 కోట్ల ఎకరాల్లోనే సాగయ్యాయి. ఖరీఫ్లో 16 లక్షల ఎకరాలు.. రబీలో 11 లక్షల ఎకరాల్లో.. మొత్తంగా 27 లక్షల ఎకరాల్లో సాగే లేకుండా సీజన్ ముగిసింది. ఖరీఫ్లో వరుస వైపరీత్యాల బారిన పడి 10 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు 6 లక్షల ఎకరాలు కరువు బారిన పడ్డాయి. అయినా ప్రభుత్వం నుంచి రైతులకు కనీస మద్దతు కూడా దక్కలేదు. దీంతో రైతులు కుదేలైపోయారు. దాని ప్రభావం రబీ పైనా పడింది. సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. లక్షలాది ఎకరాల్లో విత్తనం నాటడానికి కూడా రైతులు సాహసించలేకపోయారు. రబీ సాగు లక్ష్యం 57.65 లక్షల ఎకరాలు కాగా.. సాగైన విస్తీర్ణం 46.40 లక్షల ఎకరాలే. అంటే 11.25 లక్షల ఎకరాల్లో సాగుకు రైతులు ముందుకు రాలేదు. దాళ్వాలో వరి సాగు లక్ష్యం 20 లక్షల ఎకరాలు కాగా సాగైంది 16.52 లక్షల ఎకరాల్లోనే. అంటే 3.50 లక్షల ఎకరాలు ఖాళీగా ఉండిపోయాయి. సాధారణంగా రెండో పంటలో వరి కంటే ఎక్కువగా అపరాలు సాగవుతాయి. ఈసారి అపరాల సాగు లక్ష్యం 23.50 లక్షల ఎకరాలు కాగా, సాగైన విస్తీర్ణం 16.72 లక్షల ఎకరాలే. అంటే దాదాపు 6.78 లక్షల ఎకరాలు ఖాళీగా ఉండి పోయాయి. వీటిలో ప్రధానంగా శనగలు 11.17 లక్షల ఎకరాలకు గాను, 7.5 లక్షల ఎకరాల్లోనే సాగయ్యాయి. మినుము సాగు లక్ష్యం 8.50 లక్షల ఎకరాలు కాగా, 6.95 లక్షల ఎకరాల్లో పంట వేశారు. గతేడాది రికార్డు స్థాయిలో సాగైన మొక్కజొన్న కూడా ఈసారి తగ్గిపోయింది. ఈ ఏడాది మొక్కజొన్న సాగు లక్ష్యం 5.27 లక్షల ఎకరాలకుగాను 4.55 లక్షల ఎకరాలే సాగైంది. ఇలా పంటలన్నీ లక్ష్యానికి ఆమడ దూరంలోనే నిలిచిపోయాయి. ఇప్పటికీ రబీ పంటల సాగు చివరి దశకు చేరుకున్నా కొన్ని ప్రాంతాల్లో సాగు నీరందక పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. సీజన్ ఆరంభంలోనే ఫెంగల్ తుపాన్ దెబ్బతీయగా, ఆ తర్వాత వర్షాభావ పరిస్థితులు రైతులను దెబ్బతీశాయి. దీనికి తోడు సాగు నీటి నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట పెను శాపంగా మారింది. -
బీమా ధీమా లేదు
సాక్షి, హైదరాబాద్: మనదేశంలో వ్యవసాయం అంటే ప్రకృతితో జూదం ఆడినట్లే.. కష్టపడి పండించిన పంట చేతికందుతుందన్న గ్యారంటీ లేదు. అందుకే ప్రభుత్వాలు రైతుల పంటలకు బీమా సౌకర్యం కల్పిస్తాయి. కానీ, రాష్ట్రంలో బీమా పథకాలు లేకపోవటం, కేంద్ర ప్రభుత్వ బీమా పథకంలో రాష్ట్రం చేరకపోవటంతో ప్రకృతి వైపరీత్యాలతో పంటలు కోల్పోయిన రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇటీవల పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలకు 11,298 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖనే అధికారికంగా తేల్చింది. 13 జిల్లాలలోని 64 మండలాలలో 6,670 ఎకరాలలో వరి, 4,100 ఎకరాలలో మొక్కజొన్న, 309 ఎకరాలలో మామిడి, ఇతర పంటలు దెబ్బతిన్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటించారు. నష్టంపై నివేదిక వచ్చిన తరువాత పరిహారం చెల్లిస్తామని చెప్పారు కానీ.. ఎప్పటిలోగా రైతులను ఆదుకుంటారో చెప్పలేదు. గతంలో కూడా పంట నష్టం జరిగినప్పుడు ఇలాంటి ప్రకటనలే వచ్చాయి. కానీ, రైతులకు పైసా అందలేదు. ఈ నేపథ్యంలో పంటల బీమాపై మరోసారి చర్చ మొదలైంది. పదేళ్లుగా రైతులకు నిరాశే.. రైతులకు పంటల బీమా అందించే ‘జాతీయ వ్యవసాయ బీమా పథకం’(ఎన్ఏఐఎస్).. కేంద్ర ప్రభుత్వ రా్రïÙ్టయ కృషి బీమా యోజన (ఆర్కేబీవై) కింద 2016 వరకు అమలులో ఉండేది. ఈ పథకాన్ని కేంద్రం 1999–2000లో ప్రవేశపెట్టింది. 2016లో కేంద్రం ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం (పీఎంఎఫ్బీవై) తీసుకొచ్చింది. కానీ, ఈ పథకంలో తెలంగాణ రాష్ట్రం చేరలేదు. కేంద్ర బీమా పథకం ప్రీమియం ఎక్కువ, వచ్చే పరిహారం తక్కువ అని చెప్పిన అప్పటి సీఎం కేసీఆర్.. అంతకంటే మంచి పథకాన్ని తెస్తామని చెప్పారు. 2018 నుంచి రైతుబంధు అమలు చేయటంతో ఇక బీమా జోలికి పోలేదు. ఎప్పుడైనా ప్రకృతి వైఫరీత్యాలతో రైతులు నష్టపోతే ఆయా ప్రాంతాల్లో ఎకరాకు కొంత మొత్తాన్ని పరిహారంగా ఇచ్చే పద్ధతిని ప్రభుత్వం చేపట్టింది. ఇది కూడా గత పదేళ్లలో పెద్దగా అమలైన దాఖలాలు లేవు. ప్రభుత్వం మారినప్పటికీ అదే విధానం కొనసాగుతోంది. మాటలు మాత్రమేనా? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో చేరనున్నట్లు తొలుత ప్రకటించింది. మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లతో సమావేశం కూడా నిర్వహించారు. దీంతో బీమా పథకం అమలు చేస్తారని రైతులు ఆశించారు. కానీ, చివరికి ఆ హామీ నీటిమూటగానే మిగిలింది. కేంద్ర పథకంలో చేరలేదు.. రాష్ట్ర ప్రభుత్వం సొంత పథకం కూడా తీసుకురాలేదు. దీంతో పంటలు దెబ్బతింటే రైతులు నష్టపోవాల్సి వస్తోంది. సీఎం రేవంత్రెడ్డి పంటల బీమా అమలు చేస్తామని చెప్పినప్పటికీ, ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవలి అకాల వర్షాలకు 11,298 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అధికారికంగా ప్రకటించినప్పటికీ, వాస్తవంగా అంతకు రెండింతల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. -
‘టీడీపీ అధికారంలో ఉంటే రైతన్నకు కష్టాలే’
సాక్షి,విశాఖ: టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతన్నకు కష్టాలే. వ్యవసాయం అంటే దండగన్న చంద్రబాబు రైతన్నను ఆదుకోకుండా వారిపై పగబడుతున్నారని కూటమి ప్రభుత్వంపై మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు కూటమి ప్రభుత్వంలో రైతన్నల దుస్థితిపై బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులకు ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వం అయినా రైతుల కష్టాలను తీర్చేలా ఉంటే బాగున్ను..అది రాష్ట్రంలో లేదు.. టీడీపీ ప్రభుత్వం వస్తే ప్రకృతి కూడా రైతులకు అనుకూలంగా ఉండదు. కడపలో అరటి తోటలు గాలికి నేలకొరిగాయి.పండిన పంటకి గిట్టుబాటు ధర లేదు.మిర్చి పరిస్థితి కూడా అలానే ఉంది ఏం చెయ్యాలో తోచని దుస్థితి.చెరకు రైతులు స్వయంగా పంటను వాళ్ళే కాల్చుకునే పరిస్థితి. ఈ ప్రభుత్వం వ్యవసాయాన్ని, రైతులను ఎందుకు చిన్నచూపు చూస్తుంది. మిర్చి కొంటాం అని హామీ ఇచ్చారు. ఒక్క క్వింటా అయినా కొన్నారా..?.ఒక్క కేజీ అయినా కొన్నారా? కొంటే రైతులు యార్డ్ దగ్గర ఎందుకు ఉంటారు. గోవాడ చెరకు రైతులకు రూ.24 కోట్లు బకాయి పడ్డారు. ఎందుకు రైతులకు చెల్లించడం లేదు. వ్యవసాయం అంటే దండగ అని టీడీపీ నానుడి. ఏ రకంగా చూసినా గత ప్రభుత్వంలో రైతులకు మంచి చేశాం. మా హయాంలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. రైతులకు మాటలే తప్ప చేసినది ఏమి లేదు.గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి వెళ్తే పరిస్థితి తెలుస్తుంది. మేము చెప్పింది అబద్దం అయితే అక్కడికి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. హామీలు ఇవ్వడం కాదు చేతల్లో చూపించండి. కూటమి హామీలు చూసి ప్రజలు మోసపోయారు..హామీలు నమ్మి మోసపోయామని ప్రజలకు కూడా అర్థమైంది.ఇక్కడ పండిన పంటకు ఇతర ప్రాంతాల్లో మార్కెటింగ్ చేయొచ్చు కదా.రైతులను ఆదుకోవాలనే తపన ఈ ప్రభుత్వానికి లేదు.రైతుల ఇబ్బందులను ఈ పరిణామాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రైతులను వెంటనే ఆదుకోవాలి.రైతులకు ఇచ్చిన హామీలను మాటల్లో కాదు చేతల్లో చూపించాలి’ అని డిమాండ్ చేశారు. -
విపత్తులను మించిన ప్రభుత్వ నిర్లక్ష్యం
-
నష్ట పరిహారం ఎప్పుడు చంద్రబాబూ!
-
విపత్తులను మించిన ప్రభుత్వ నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి: కరువు ఉరిమినా.. తుఫాన్లు తుడిచిపెట్టినా.. వరదలు, వర్షాలు ముంచెత్తినా.. అన్నదాతపై చంద్రబాబు ప్రభుత్వానికి కనికరం లేదు. కష్టాల్లో ఉన్న రైతులను ఉదారంగా ఆదుకోవాల్సిందిపోయి వారిని అన్ని విధాలుగా మోసం చేస్తోంది. ఖరీఫ్ సీజన్ ముగిసి, రబీ కూడా చివరి దశకు చేరుకుంది. అయినా, ఖరీఫ్ ప్రారంభంలో దెబ్బతిన్న పంటలకూ పరిహారం ఇవ్వాలన్న ధ్యాసే లేదు. ఉచిత పంటల బీమా పథకాన్ని కూడా అటకెక్కించి ఆ పరిహారమూ అందకుండా చేసింది. సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు చెల్లించాల్సిన రూ.26 వేల ( పీఎం కిసాన్ సాయంతో కలిపి)పెట్టుబడి సాయమూ ఇవ్వకుండా మోసం చేసింది. ఇంకొక వైపు సీజన్ ముగియకుండానే అందించాల్సిన పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) చెల్లింపులోనూ కావాలనే కాలయాపన చేస్తోంది. పంటలకు మద్దతు ధర లభించేలా చూడటంలోనూ చంద్రబాబు సర్కారుది మొండి వైఖరే. ఎరువులు, పురుగు మందులు, నాణ్యౖమెన విత్తనాలు లేక రైతులు అల్లాడుతున్నా పట్టించుకోవడంలేదు. వ్యాపారులు, దళారుల చేతిలో అన్యాయానికి గురవుతున్న అన్నదాతను ఆదుకోవాలన్న ఆలోచనే లేదు. మొత్తం మీద ప్రకృతి విపత్తులకంటే అన్నదాతకు కూటమి సర్కారు నిర్లక్ష్యమే పెద్ద విపత్తుగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి.అడ్డగోలు కోతలతో.. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది మొదలు నెలకొక వైపరీత్యం రైతులను వెంటాడుతూనే ఉంది. ఖరీఫ్ మొదట్లోనే జూలైలో అకాల వర్షాలు రైతులను దెబ్బతీశాయి. 16 జిల్లాల 1.65 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం మాత్రం 44 వేల ఎకరాల్లోనే పంటలు దెబ్బతిన్నాయని, 31 వేల మందికి రూ.31.53 కోట్లు చెల్లించాలని లెక్కతేల్చింది. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కృష్ణా, వంశధార, నాగావళి నదులతో పాటు బుడమేరు, ఏలేరు వరదలు పంట పొలాలను ముంచెత్తాయి. 10 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తొలుత 5.93 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయిన 4 లక్షల మందికి రూ.557.63 కోట్ల పరిహారం ఇవ్వాలని అంచనావేశారు. ప్రభుత్వం ఇందులో అడ్డగోలుగా కోతలు వేసి దెబ్బతిన్న పంటల విస్తీర్ణం 3.11 లక్షల ఎకరాలకు కుదించింది. కేవలం 2 లక్షల మందికి రూ.319.08 కోట్లు ఇవ్వాలని చెప్పింది. పోనీ అదైనా ఇచ్చిందా అంటే అదీ లేదు.వైఎస్ జగన్ హయాంలో..⇒ విపత్తులకు పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకొనేందుకు ప్రత్యేకంగా రూ.2 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు ⇒ ఏ సీజన్ పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) అదే సీజన్ ముగిసేలోగా జమ. ఇలా ఐదేళ్లలో 34.41 లక్షల మందికి రూ.3,261.60 కోట్లు చెల్లించి అండగా నిలిచారు. ⇒ రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం ద్వారా ఐదేళ్లలో 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802.05 కోట్లు అందజేశారు. ⇒ వైఎస్సార్ రైతు భరోసా కింద ఐదేళ్లలో 53.58 లక్షల మందికి రూ.34,288.17 కోట్లు లబ్ధి చేకూర్చారు.చంద్రబాబు హయాంలో.. ⇒ బీమా ప్రీమియం బకాయిలు రూ.1,280 కోట్లు చెల్లించకపోవడం వల్ల రైతులకు దాదాపు రూ.2వేల కోట్లకు పైగా పరిహారం అందకుండా మోకాలడ్డారు. ⇒ 2024–25 ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఈ పాటికే రూ.833 కోట్లు బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంది. ఇందులో పైసా కూడా చెల్లించకపోవడంతో రైతులకు రూ.1200 కోట్లకుపైగా బీమా పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. ⇒ కూటమి పాలనలో పంటల బీమా పథకం ఉందో లేదో కూడా తెలియని అయోమయ స్థితి నెలకొంది. ⇒ సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీ మేరకు కేంద్రమిచ్చే పీఎం కిసాన్ సాయంతో సంబంధం లేకుండానే ఒకే విడతలో ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున 2024–25లో చెల్లించాల్సిన రూ.10,717 కోట్లు కూడా చంద్రబాబు ఎగ్గొట్టారు.సగం మండలాల్లోనే కరువంటూ..లోటు వర్షపాతంతో రాయలసీమ జిల్లాల్లో 100 మండలాలకు పైగా కరువు కోరల్లో చిక్కుకున్నాయి. 60 రోజులకు పైగా చినుకు జాడ లేదు. 10 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం మాత్రం మొక్కుబడిగా 54 మండలాలనే కరువు ప్రభావితంగా ప్రకటించింది. వీటికీ పైసా పరిహారం విదల్చలేదు. నవంబరులో విరుచుకుపడిన ఫెంగల్ తుఫాను కోతకొచ్చిన పంటలను తుడిచిపెట్టింది. దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. అయినా రైతులను ఆదుకున్న పాపాన పోలేదు. ఇలా కూటమి ప్రభుత్వం వచ్చాక గత ఏడాది జూలై మొదలుకొని డిసెంబర్ వరకు వివిధ వైపరీత్యాలకు 20 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిని, రూ.2 వేల కోట్లకు పంట నష్టం జరిగినట్టు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది. ఇందులోనూ కోతలేసి చివరికి 6.65 లక్షల ఎకరాల్లోనే పంటలు దెబ్బతిన్నట్లు, రూ.527.18 కోట్లు చెల్లించాలంటూ లెక్కగట్టింది.దీంతోపాటు ఆధార్ సీడింగ్ కాకపోవడం, సరైన బ్యాంక్ ఖాతా నంబర్లు ఇవ్వక పోవడం వంటి సాంకేతిక కారణాలతో నిలిచిన 2023, 24 సీజన్ల కరువు సాయం బకాయిలు రూ.311.39 కోట్లు విడుదల చేయకుండా మోకాలడ్డింది. ఇలా మొత్తం రూ.838.57 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో కేవలంæ 1.85 లక్షల మందికి రూ.284.56 కోట్లు చెల్లించి చేతులు దులిపేసుకుంది. అదీ కూడా ప్రజలు, వివిధ సంస్థలు ఇచ్చిన వరద విరాళాల పుణ్యమే. -
బీమా ఎగ్గొట్టావు 'పరిహారం కట్టు బాబూ': వైఎస్ జగన్
చంద్రబాబు ఇక్కడి రైతులకు కచ్చితంగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఇన్సూరెన్స్ సొమ్ము కచ్చితంగా రావాలి. ఒకవేళ రైతన్నలకు అది రాని పరిస్థితి ఉంటే.. తదుపరి వచ్చేది మన ప్రభుత్వమే. ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వచ్చాక నెల రోజుల్లోనే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం. అలాగే ఇవాళ రైతులకు రాని ఇన్సూరెన్స్ కూడా ఇప్పిస్తాం. ప్రతి రైతన్న ముఖంలో సంతోషం కనిపించేలా చేస్తాం. సాక్షి కడప: ‘అకాల వర్షం.. పెనుగాలులు.. వడగళ్ల ధాటికి అరటి తోటలు నేల కూలాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతన్నలు ఇవాళో రేపో అరటి గెలలు కోసే సమయంలో తీవ్ర నష్టం సంభవించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలి. ఇన్పుట్ సబ్సిడీ అందించి ఎంతో కొంత ఆసరాగా నిలబడాలి.. కానీ ఈ సర్కారు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకపోవడంతో రైతులకు ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి లేదు.. ఇలాంటప్పుడు ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పరిహారం అందించి రైతులను ఆదుకోవాలి’ అని వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) డిమాండ్ చేశారు. పడిపోయిన గెలలను కూడా కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలో భారీ ఈదురు గాలులు, అకాల వర్షాలకు నేలవాలిన అరటి తోటలను వైఎస్ జగన్ సోమవారం పరిశీలించారు. తాతిరెడ్డిపల్లె, కోమన్నూతలలో అరటి తోటల్లోకి వెళ్లి రైతులను ఓదార్చి నష్టాన్ని ఆరా తీశారు. కోమన్నూతల వద్ద తోటలో మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ జిల్లాలోని లింగాల మండలంతోపాటు అనంతపురం జిల్లాలోని నేర్జాంపల్లె, దాడితోట తదితర గ్రామాల్లో దాదాపు 4 వేల ఎకరాల్లో అరటి తోటలకు నష్టం జరిగినట్లు తెలుస్తోందని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి బాబు ప్రీమియం ఎగ్గొట్టడంతో... అరటి రైతు ఎకరానికి రూ.1.50 లక్షల వరకు ఖర్చు పెట్టి సాగు చేస్తే తీరా పంట చేతికొచ్చే సమయంలో పెను గాలులు దెబ్బతీయడంతో దాదాపు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ఆదాయం రాకపోగా, చివరికి నష్టం మిగలడం బాధేస్తోంది. రైతన్నలకు ఉచిత పంటల బీమా ఒక హక్కుగా వైఎస్సార్సీపీ హయాంలో అమలయ్యేది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఉచిత పంటల బీమాను ఎత్తేశారు. దీన్ని ఎత్తివేయడం ఒక నేరమైతే.. 2024 మే, జూన్ నెలల్లో కట్టాల్సిన పంటల ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని చంద్రబాబు కట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కట్టాల్సిన ప్రీమియం రూ.1,280 కోట్లు కట్టి ఉంటే రైతులకు మేలు జరిగేది. బాబు అధికారంలోకి వచ్చాక ప్రీమియం ఎగ్గొట్టడంతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆ తర్వాత 2024–25కి సంబంధించిన ప్రీమియం కూడా ఆయన కట్టలేదు. అసలు ఈ రోజు ఉచిత పంటల బీమా ఉందా? లేదా? మీరిచ్చిన జీవోను చూస్తే దశల వారీగా ఎత్తేస్తామని చెబుతున్నారు. చంద్రబాబు పుణ్యాన ఇప్పటికే పలు పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ధాన్యం రంగు మారింది. మొక్కజొన్న, జొన్నకు కూడా భారీగా నష్టం వాటిల్లింది. వరుసగా రెండేళ్లు ఖరీఫ్ సీజన్లో అదే జరిగింది. ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. పంటలకు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి. ఈ–క్రాప్ పక్కాగా నమోదు చేయాలి. ప్రతి రైతు పండించిన పంటల వివరాలు ఈ–క్రాప్ కింద నమోదు చేసి నష్టం జరిగితే వారికి ఇన్సూరెన్స్ వచ్చేలా చూడాలి. ఎవరూ ఇన్సూరెన్స్ కట్టలేదన్న పరిస్థితి ఉత్పన్నం కాకూడదు.పెట్టుబడి సాయం... సున్నామన ప్రభుత్వంలో వైఎస్సార్ రైతు భరోసా కింద రైతన్నలకు ఏటా రూ.13,500 చొప్పున ఇచ్చాం. చంద్రబాబు తాము అధికారంలోకి రాగానే రూ.26,000 (కేంద్ర సాయంతో కలిపి మొత్తం) ఇస్తానన్నాడు. కానీ రూ.20 కూడా ఇవ్వలేదు. ఇప్పటికే ఒక ఏడాది పెట్టుబడి సాయాన్ని రైతులకు ఎగ్గొట్టారు. ఇవాళ పరిస్థితి చూస్తుంటే రైతులను ఎంతమాత్రం ఆదుకునే ఉద్దేశం కనిపించడం లేదు. సున్నా వడ్డీ పంట రుణాలకు మంగళం పాడారు. రైతులకు సున్నా వడ్డీ మొత్తం చెల్లించలేదు. ఇలా అన్నదాతలకు అడుగడుగునా చంద్రబాబు అన్యాయం చేస్తూనే ఉన్నారు. నిరుపయోగంగా కోల్డ్ స్టోరేజీ..రాష్ట్రంలోనే అరటి సాగు పులివెందులలో అత్యధికం. ఆ రైతన్నలకు మేలు చేయడం కోసం ఇక్కడ రూ.25 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజీని ఏర్పాటు చేశాం. ఎన్నికలకు ముందే అన్ని వసతులతో ప్రారంభించాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక దారుణంగా వ్యవహరిస్తోంది. టెండర్ పిలిచి యూజర్ ఏజెన్సీకి అప్పగించడం లేదు. దీన్ని బట్టే రైతులపై ఈ సర్కార్ ఎంత కపట ప్రేమ చూపుతోందో అర్థమవుతోంది. ఈ కోల్డ్ స్టోరేజీ సామర్థ్యం 500 మెట్రిక్ టన్నులు కాగా, దాన్ని టెండర్ ద్వారా యూజర్ ఏజెన్సీకి అప్పగిస్తే రైతులకు మేలు జరిగేది. కానీ ఆ పని చేయకుండా, కోల్డ్ స్టోరేజీని వాడుకోకుండా నిరుపయోగంగా వదిలేశారు. అదే ఇప్పుడు యూజర్ ఏజెన్సీ ఉండి ఉంటే వారు పంట కొనుగోలు చేసేవారు. మరోవైపు రైతులు తమ పంటను ఇక్కడ దాచుకునే వీలుండేది. తద్వారా నష్టపోయే అవకాశం లేకపోగా మంచి జరిగేది. వైఎస్సార్సీపీ హయాంలో రెండు కంటైనర్ల ద్వారా ఇతర దేశాలకు ఎగుమతులు కూడా చేసి రైతులకు ప్రోత్సాహం అందించాం. పంటల ధరలు దారుణంగా పతనం.. రాష్ట్రంలో వర్షాలు, ఈదురు గాలులతో పంటలకు తీవ్ర నష్టం జరగ్గా మరోవైపు ధరలు దారుణంగా పడిపోయాయి. నెల క్రితం టన్ను అరటి ధర రూ.26 వేలు ఉంటే ఇప్పుడు రూ.9 వేలకు పడిపోయింది. అయినా కొనుగోళ్లు లేవు. కొన్నిచోట్ల రూ.6వేలకు పతనమైనా ఈ ప్రభుత్వం ఎక్కడా రైతులను పట్టించుకోవడం లేదు. మిర్చిది కూడా అదే పరిస్థితి. ధాన్యం కొనుగోళ్లలోనూ అదే దుస్థితి. ధాన్యం రైతులు క్వింటాల్కు రూ.300 నుంచి రూ.400 వరకు నష్టపోతున్నారు. మిర్చి రూ.11,800కి కొంటామని చెప్పి ఒక్క కేజీ కూడా కొనుగోలు చేయలేదు. పెసలు, శనగలు, మినుములు, కందులు.. ఇలా ఏ పంటకూ ఇవాళ గిట్టుబాటు ధర లేదు. చీనీ రైతులకు వైఎస్సార్సీపీ హయాంలో టన్నుకు లక్ష రూపాయల వరకు ఆదాయం వచ్చింది. స్యూట్ (కమీషన్) లేకుండా రైతులకు మనం మేలు చేయగా, ఈరోజు చీనీ టన్ను కేవలం రూ.23 వేలు, రూ.18 వేలు, రూ.15 వేలు మాత్రమే పలుకుతోంది. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.నష్టపోయిన రైతన్నకు ఇదే నా భరోసా..ఈ 4 వేల ఎకరాల్లో పంట నష్టపోయిన రైతన్నలకు భరోసా ఇస్తున్నా. ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే నా పర్యటన! చంద్రబాబు ఇక్కడి రైతులకు కచ్చితంగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఇన్సూరెన్స్ సొమ్ము కూడా కచ్చితంగా రావాలి. ఒకవేళ రైతన్నలకు అది రాని పరిస్థితి ఉంటే.. తదుపరి వచ్చేది మన ప్రభుత్వమే. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వచ్చాక నెల రోజుల్లోనే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం. అలాగే ఇవాళ రైతులకు రాని ఇన్సూరెన్స్ కూడా ఇప్పిస్తాం. ప్రతి రైతన్న ముఖంలో సంతోషం కనిపించేలా చేస్తాం. అంతేకాకుండా ప్రతి రైతుకు 2023లో మన ప్రభుత్వంలో ఇచ్చినట్లుగా రూ.50 వేలు కూడా ఇస్తాం. ఇది ప్రతి రైతుకూ భరోసా కల్పిస్తూ చెబుతున్నా. పార్టీ తరఫున కూడా రైతులకు సాయం అందించి ఆదుకుంటాం.నేలమట్టమైన తోటలు.. చలించిన జగన్ఎక్కడ చూసినా నేలమట్టమైన అరటి చెట్లు.. మట్టి పాలైన గెలలు.. కంటతడి పెడుతున్న రైతన్నలను చూసి వైఎస్ జగన్ చలించిపోయారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలం తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల గ్రామాల పరిధిలో అరటి తోటలను ఆయన స్వయంగా పరిశీలించారు. తమ బాధలు చెబుతున్న సమయంలో రైతన్నలు కన్నీటి పర్యంతం కాగా, వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. దారి వెంట అరటి తోటలను పరిశీలిస్తూ.. పొలాల్లోకి వెళ్లి ప్రతి రైతుకూ ధైర్యం చెప్పి ఓదార్చుతూ ముందుకు సాగారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్రెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు. జిల్లాలో జగన్ రెండు రోజుల పర్యటన సోమవారం మధ్యాహ్నంతో ముగిసింది. వేంపల్లెలో జడ్పీటీసీ రవికుమార్రెడ్డి నివాసంలో నూతన వధూవరులు సాయి భైరవ ప్రీతంకుమార్రెడ్డి, వైష్ణవిలను ఆశీర్వదించిన అనంతరం ఇడుపులపాయ చేరుకుని తిరిగి విజయవాడకు పయనమయ్యారు. తీవ్రంగా నష్టపోయాం.. ఆత్మహత్యలే శరణ్యం..ఎనిమిది ఎకరాల్లో అరటి పంట సాగు చేశా. మొక్క రూ.20 చొప్పున 9,500 మొక్కలను కొనుగోలు చేశా. సుమారు రూ.16 లక్షలు పెట్టుబడి చేతికి అందకుండా పోయింది. ఇంటిల్లిపాది అన్నపానీయాలు లేకుండా గడుపుతున్నాం. ఎరువుల దుకాణాల్లో అప్పులు చేశాం. పెట్టుబడికి అప్పులు తెచ్చాం. పది రోజుల్లో చేతికొస్తుందనుకున్న పంట కళ్లెదుటే నేలమట్టమైంది. ప్రభుత్వం ఆదుకోకుంటే మాకు ఆత్మహత్యలే శరణ్యం. – మందలపల్లి కేశవయ్య, తాతిరెడ్డిపల్లె, లింగాల మండలంఅరటి వ్యాపారులు, కూలీలను వెళ్లగొట్టారు..గత నెలలో టన్ను అరటి రూ.25–26 వేల వరకు పలికింది. అయితే ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోందని కూలీలను పులివెందుల పోలీసులు చితకబాదారు. లారీలను ఆపి డబ్బులు వసూలు చేశారు. దీంతో పులివెందుల నుంచి వ్యాపారులు, కూలీలు వెళ్లిపోవడంతో ధరలు పడిపోయాయి. ప్రస్తుతం ధర రూ.6–10 వేలుæమాత్రమే ఉంది. లారీలు, కూలీలు లేకపోవడం, పంట ఒక్కసారిగా చేతికి అందడంతో అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు అకాల వర్షాలు నిండా ముంచాయి. 3.5ఎకరాల్లో అరటి సాగుచేసి రూ.7లక్షలు నష్టపోయా. – పీసీ వాసుదేవరెడ్డి, కోమన్నూతుల, లింగాల మండలంపెట్టుబడి సాయం ఏది?మూడు ఎకరాల్లో అరటి సాగు చేశా. సుమారు రూ.6 లక్షల మేర పెట్టుబడులు పెట్టా. గాలివానకు పంట మొత్తం నేలకూలింది. నేల కూలిన అరటి పంటను తొలగించాలన్నా ఎకరాకు రూ. 30 వేల వరకు ఖర్చయ్యే పరిస్థితి నెలకొంది. ఈ ప్రభుత్వం ఇంతవరకు రైతు భరోసా సొమ్ములు కూడా అందించలేదు. – పీసీ ప్రభాకర్రెడ్డి, అరటి రైతు, కోమన్నూతల, లింగాల మండలంఎప్పుడూ చూడలేదుపదేళ్లుగా అరటి సాగు చేస్తున్నా. ఏప్రిల్, మే నెలల్లో ఈదురు గాలులు, వర్షాలు కురిసే నాటికి పంట చేతికి వచ్చేది. ప్రస్తుతం పంట కోత దశకు వచ్చే సమయంలో మార్చిలోనే వడగళ్ల వానలు కురిశాయి. ఈదురు గాలులు వీచాయి. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. ఐదు ఎకరాలలో పంట సాగు కోసం రూ.10 లక్షల వరకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు చేశా. ఊరు వదిలి వలస వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – పురుషోత్తంరెడ్డి, అరటి రైతు, కోమన్నూతల, లింగాల మండలంరూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు..అరటి రైతులకు పంటల బీమాను వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఐదు ఎకరాలలో అరటి సాగు చేశా. 6,000 మొక్కలు అకాల వర్షాల వల్ల నేల కూలాయి. అరటి గెలలపై నల్లటి మచ్చలు ఏర్పడ్డాయి. రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు. – దినేష్కుమార్రెడ్డి, కోమన్నూతుల, లింగాల మండలం -
తాతిరెడ్డిపల్లెలో అరటి రైతులకు వైఎస్ జగన్ పరామర్శ (ఫొటోలు)
-
రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోంది
-
ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం.. రైతులకు జగన్ భరోసా
-
Watch Live: రైతులకు వైఎస్ జగన్ పరామర్శ
-
రైతులపై కూటమి ప్రభుత్వ కపట ప్రేమ: వైఎస్ జగన్
సాక్షి, అనంతపురం: ఏపీలో రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోందన్నారు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇన్యూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. వైఎస్సార్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా తాతిరెడ్డిపల్లిలో అకాల వర్షం కారణంగా పడిపోయిన అరటి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులతో ఆయన మాట్లాడారు. పంట నష్టం కారణంగా వారి ఆవేదనను అర్థం చేసుకున్నారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతుల కోసం పోరాటం చేస్తామన్నారు. అనంతరం, వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఇలాంటి సమయంలో ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలి. కూటమి ప్రభుత్వంలో ఉచిత పంటల బీమాను ఎత్తేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు సున్నా వడ్డీ రుణాలు కూడా అందడం లేదు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్యూరెన్స్ ఇవ్వాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ పర్యటన. అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోంది. వర్షాలు, గాలులతో పంట నష్టం తీవ్రంగా ఏర్పడింది. నెల కింద రూ.26వేలు ధర పలికితే ఇప్పుడు ఎవరూ కొనడం లేదు.వైఎస్సార్సీపీ హయాంలో ఉచిత పంటల బీమా రైతులకు హక్కుగా ఉండేది. మన వైఎస్సార్సీపీ పాలనలో ప్రతీ రైతుకు న్యాయం చేశాం. అరటి సాగులో రాష్ట్రంలోనే పులివెందుల నంబర్ వన్ స్థానంలో ఉంది. మా ప్రభుత్వంలో రూ.25కోట్లతో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేశాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్లు కూడా వాడుకోలేకపోతున్నారు. యూజర్ ఏజెన్సీకి అప్పగించి ఉంటే నష్టం జరిగేది కాదు. మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే. మళ్లీ ప్రతీ రైతు కళ్లలో ఆనందం కనిపించేలా చేస్తాం. అధికారంలోకి వచ్చాక ఇన్యూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం’ అని రైతులకు హామీ ఇచ్చారు. అకాల వర్షానికి భారీ నష్టం..శనివారం రాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి అరటి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైఎస్సార్, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. 4 వేలకు పైగా ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేలకొరిగింది. రెండు జిల్లాల్లోనూ వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీవర్షం కురవడంతో 2,460 ఎకరాల్లో అరటి పంట కూలిపోయిందని, 827 మంది రైతులు తీవ్రంగా నష్టపోయినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని ఉద్యాన శాఖ అధికారి రాఘవేంద్రారెడ్డి చెప్పారు.అనంతపురం జిల్లాలో 1,400 ఎకరాల్లో అరటికి నష్టం ఉమ్మడి అనంతపురం జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి కురిసిన అకాల వర్షం అరటి, మొక్కజొన్న, బొప్పాయి పంటలను దెబ్బతీసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు పంటలు నేలవాలాయి. పుట్లూరు, యల్లనూరు, శింగనమల, పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో సుమారు 1,400 ఎకరాల్లో అరటి పంట పూర్తిగా ధ్వంసమైందని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరసింహారావు తెలిపారు. దీనివల్ల వందలాది మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అదేవిధంగా 47 మందికి చెందిన 87.5 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె, వెలిదండ్ల, పెద్దకుడాల, కె.చెర్లోపల్లె, రామన్నూతనపల్లె, గుణకణపల్లె, లింగాల తదితర గ్రామాల్లో అరటి పంటలు నేలకూలాయి.