Farmers
-
రేపు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(సోమవారం) పులివెందులలో పర్యటించనున్నారు. లింగాలలో పడిపోయిన అరటి తోటలను వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. భారీవర్షాలు, ఈదురు గాలులకు అరటి తోటలకు భారీ నష్టం వాటిల్లింది. బాధిత రైతులను ఆయన పరామర్శించనున్నారు.వైఎస్సార్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానకు భారీగా అరటి పంటలు నేలకూలాయి. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలోని కోమనంతల, వెలిగండ్ల, పార్నపల్లి, లింగాల గ్రామాల్లో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. అకాల వర్షాలతో సరిగ్గా కోతకు వచ్చిన సమయంలో భారీ పంట నష్టం ఏర్పడింది. చేతి కందిన పంట నేలకూలడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కాంగ్రెస్ సర్కార్ అసమర్థ పాలనతోనే రైతులకు కష్టాలు: హరీష్రావు
సాక్షి, సిద్దిపేట: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు డిమాండ్ చేశారు. నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవి పల్లి గ్రామంలో నిన్న(శనివారం) రాత్రి కురిసిన వర్షాలు, వడగండ్ల కారణంగా దెబ్బతిన్న పంటలను ఆదివారం ఆయన పరిశీలించారు.అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందన్నారు. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. రైతు బంధు రూపంలో కేసీఆర్ రైతులకు నేరుగా సాయం చేశారు. వానా కాలం యాసంగి రైతుబంధు రూ. 15 వేలు వెంటనే విడుదల చేయాలి. పంటల బీమా ఉండే రైతులకు ఇంత నష్టం ఉండేది కాదు. రైతులకు మూడు పంటల బీమా రాలేదు. రుణమాఫీ చేయలేదు ఇచ్చామని.. అబద్ధాలు ఆడుతున్నారు’’ అని కాంగ్రెస్పై హరీష్రావు మండిపడ్డారు.‘‘రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. ఎండల వల్ల పంటలు ఎండటం లేదు. కాంగ్రెస్ అసమర్థ పాలన వల్ల నీళ్లులేక పంటలు ఎండిపోతున్నాయి. వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆర్థిక సాయం చేసి అందుకోవాలి. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి’’ అని హరీష్రావు పేర్కొన్నారు. -
అడుగంటిన జలం.. అందని భూగర్భ జలాలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నీళ్లందక ‘బోరు’మంటున్న పొలాలు.. చేతికందిన పంట కళ్ల ముందే ఎండిపోతుంటే రైతులు తల్లడిల్లిపోతున్నారు. అప్పులు చేసి, బోర్లు వేయించి అయినా పంటలను కాపాడుకుందామంటే.. నీళ్లు పడక కన్నీళ్లు పెడుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష ఎకరాల్లో వరి ఎండిపోయినట్టు వ్యవసాయ శాఖ అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. వేసవి మరింత ముదురుతుండటం, భూగర్భ జలాలు మరింతగా తగ్గిపోతుండటంతో మరింతగా పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని పేర్కొంటున్నారు. వేలకొద్దీ బోర్లు వేస్తున్నా... వేసవి తీవ్రత పెరుగుతుండటం, భూగర్భ జలాలు తగ్గి బోర్లు వట్టిపోతుండటంతో.. పంటలను కాపాడుకునేందుకు రైతులు పెద్ద సంఖ్యలో బోర్లు వేయిస్తున్నారు. ముఖ్యంగా నల్లగొండ, యాదాద్రి, సిద్ధిపేట, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, వరంగల్, జనగామ, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బోర్లు వేయిస్తున్న రైతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఒక్కో ఉమ్మడి జిల్లా పరిధిలో గత రెండు నెలల్లో.. కనీసం వెయ్యి వరకు బోర్లు వేయించినట్టు అంచనా. పెరుగుతున్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు తీసుకుంటున్న రైతుల సంఖ్య పెరుగుతోంది. ఇందులో కొంత మంది కాలువల కింద సాగు చేస్తుండగా.. ఎక్కువ మంది కొత్తగా బోర్లు వేసి పంటలు కాపాడుకునేందుకు ప్రయతి్నస్తున్నవారే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గత రెండున్నర నెలల్లో 1,969 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు తీసుకోగా.. మహబూబ్నగర్లో 1,334 కనెక్షన్లు, వరంగల్ జిల్లాలో 1,706 కనెక్షన్లు, ఖమ్మం జిల్లాలో 850 కనెక్షన్లు తీసుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అప్పుల ఊబిలోకి రైతులు పంటను కాపాడుకునేందుకు పెద్ద సంఖ్యలో బోర్లు వేయిస్తున్న రైతులు.. ఇందుకోసం లక్షల రూపాయలు అప్పులు చేస్తున్నారు. అటు బోర్లలో నీరూ పడక, ఇటు అప్పులూ పెరిగిపోయి తలపట్టుకుంటున్నారు. – యాదాద్రి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం ఉప్పలపహడ్ గ్రామానికి చెందిన సైరెడ్డి చంద్రారెడ్డి బావి ఎండిపోవడంతో రెండు నెలల కిందట బోరు వేశారు. నీళ్లు పడలేదు. వారం కింద మరో బోరు 450 ఫీట్లు వేయించగా.. అదీ ఫెయిల్ అయింది. వాటికోసం చేసిన అప్పు రూ.లక్షన్నర, పంట పెట్టుబడి రూ.లక్ష మొత్తం రూ.2.5 లక్షల అప్పులపాలయ్యారు. – నారాయణపేట జిల్లా మరికల్ మండలం పల్లెగడ్డకు చెందిన గుర్రం శ్రీనివాస్ 4 ఎకరాల్లో వరి సాగు చేశారు. మూడెకరాల్లో పంట ఎండిపోతుండటంతో పది రోజుల కింద 3 బోర్లు వేశారు. వాటిల్లో చుక్క నీరు కూడా పడలేదు. చేసేదేమీ లేక పొలాన్ని పశువుల మేతకు వదిలేశారు. బోర్లు వేసేందుకు చేసిన రూ. 2 లక్షల అప్పు భారంగా మారింది. – కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కన్నాపూర్ తండాకు చెందిన కాట్రోత్ రవినాయక్ నాలుగెకరాల్లో వరి సాగు చేశారు. పంట ఎండిపోతుండటంతో మూడు బోర్లు వేయించినా.. ఒక్కదానిలోనూ నీళ్లు పడలేదు. రూ.3.5 లక్షలు అప్పు మీదపడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్పల్లికి చెందిన చింతాకుల రవి రెండెకరాల్లో వరి వేశారు. బోరు ఎండిపోవడంతో.. 20 రోజుల కింద 600 ఫీట్ల వరకు మరో బోరు వేసినా నీరు పడలేదు. రూ.లక్షన్నర అప్పు అయిందని వాపోతున్నారు. మూడు బోర్లు ఫెయిల్ అయ్యాయి..ఈ చిత్రంలోని రైతు పేరు గోగు హరిప్రసాద్. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన ఈయన ఆరు ఎకరాల్లో వరి సాగు చేశారు. అందుకోసం రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ప్రసాద్కు మూడు బోర్లు ఉండగా, భూగర్భ జలాలు అడుగంటి రెండు ఎండిపోయాయి. పంటను కాపాడుకునేందుకు అప్పులు చేసి మరో మూడు బోర్లు వేయించారు. ఒక్కదాంట్లోనూ నీరు పడలేదు. లక్షన్నర రూపాయల వరకు ఖర్చయినా.. పంటకు చుక్క నీరు అందలేదు. కళ్లెదుటే పంట ఎండిపోతోందని వాపోతున్నారు. అప్పులు తీర్చేదెలా? ఐదెకరాల్లో వరి సాగు చేశా. భూగర్భ జలాలు తగ్గి బోరు ఎత్తిపోయింది. పంటను కాపాడుకునేందుకు రూ.1.5 లక్షలు అప్పు చేసి రెండు బోర్లు వేయించినా చుక్క నీరు రాలేదు. పొట్టదశలో ఉన్న వరి ఎండిపోతోంది. ఏం చేయాలో, అప్పు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు. – పెరుగు కొమురయ్య, ఆరేపల్లి, కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా 600 ఫీట్లు వేసినా నీళ్లు పడలే.. నాకు ఆరెకరాలు పొలం ఉంది. భూగర్భ జలాలు అడుగంటడంతో రెండు బోర్లు 600 ఫీట్ల వరకు వేయించా. అయినా నీళ్లు పడలేదు. రూ. లక్ష ఖర్చయింది. మళ్లీ బోరు వేయాలంటే భయంగా ఉంది. – బుర్ర వినయ్కుమార్, లక్ష్మిపూర్, తంగళ్లపల్లి, సిరిసిల్ల ఈయన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్నరామన్చర్లకు చెందిన రైతు మల్గ బీరయ్య. ఒకటిన్నర ఎకరాల్లో మామిడి తోట వేశారు. పదెకరాల్లో వరి సాగు చేశారు. భూగర్భ జలాలు పడిపోవడంతో ఉన్న మూడు బోర్లు వట్టిపోయాయి. పొట్ట దశలో ఉన్న వరిని కాపాడుకునేందుకు వారం రోజుల్లో ఏడు బోర్లు వేశారు. ఒక్కొక్కటి 600 ఫీట్ల లోతు వరకు వేసినా చుక్క నీరు కూడా పడలేదు. సుమారు రూ.4.50 లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయిందని, 8 ఎకరాల వరి పూర్తిగా ఎండిపోయిందని ఆయన వాపోతున్నారు. సాగునీరు లేక పాడి గేదెలకు తాగునీరు అందించలేక మూడు పశువులను అమ్మేసుకున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం కర్నాల్ తండాకు చెందిన ఈ రైతుపేరు మహిపాల్. భూగర్భ జలాలు అడుగంటి పొలంలోని బోరు వట్టిపోయింది. ఎండిపోతున్న పంటను కాపాడుకునేందుకు మరో బోరు వేయించారు. 800 ఫీట్ల లోతు వేసినా నీళ్లు పడలేదు. రూ.1.60 లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేదని ఆయన వాపోయారు. ఈ చిత్రంలోని రైతు యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం రాగిబావికి చెందిన ఏలకంటి సత్తిరెడ్డి. 4 ఎకరాల్లో వరి సాగు చేశారు. పాత బోర్లు వట్టిపోవడంతో.. 20 రోజుల కింద వరుసగా నాలుగు బోర్లు వేయించారు. దేనిలోనూ నీళ్లు పడలేదు. రూ.3 లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకుండాపోయిందని, పొలమంతా ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
లాభాల తీరం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన
పీఎమ్ఎస్సెస్వై (ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన) కిందకు వచ్చే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని 2020లో ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ స్కీమ్ ద్వారా ఎలాంటి పూచీకత్తు లేకుండా చేపలపెంపకందారులకు ఏడు శాతం వడ్డీతో రెండు లక్షల రూపాయాల వరకు రుణాన్ని అందిస్తున్నారు. చేపలు, రొయ్యల పెంపకంపై ఉచిత శిక్షణనూ అందిస్తున్నారు. షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన మహిళలకు 60 శాతం వరకు గ్రాంట్ అందుతోంది. ఈ పథకం తీర్రప్రాంతంలోని చిన్న, సన్నకారు రైతులకు లాభాల పంట పండిస్తోంది. చేపల ఎగుమతిలో భారతదేశాన్ని ముందంజలో నడిపిస్తోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఫిషరీస్, మత్స్యకారుల సంక్షేమశాఖ సహాయసంచాలకుల కార్యాలయంలో మరిన్ని వివరాలను పొదవచ్చు. జిల్లా మత్స్యశాఖ లేదా ఏదైనా హేచరీ నుంచి ఉచితంగా చేప సీడ్ను పొందవచ్చు. ఈ పథకానికి అధికారిక వెబ్సైట్ https://pmmsy.dof.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్ హోమ్ పేజీలో స్కీమ్ లింక్పై క్లిక్ చేయాలి. నింపాల్సిన ఫామ్ కనిపిస్తుంది. అందులోని వివరాలను పూరించాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతా, భూమి వివరాలనూ పొందుపరచాలి. డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సహా సూచించిన పత్రాలను అప్లోడ్ చేయాలి. తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేసి.. ఫామ్ను సమర్పించాలి. దరఖాస్తుదారు అర్హతలు, సంబంధిత పత్రాలను ఆమోదించిన తరువాత పథకం ప్రయోజనాలను పొందవచ్చు. తీర్రప్రాంతం లేని చోటా మత్స్య సంపదను అభివృద్ధి చేసేందుకు ఈ పథకం రుణాన్ని అందిస్తోంది. కమర్షియల్ ఆక్వా కల్చర్ సిస్టమ్ కింద ఈ ప్రాజెక్ట్ విలువ రూ. 20 లక్షలు అయితే రూ. 5 లక్షల వరకు సొంత పెట్టుబడి ఉండాలి. అప్పుడు రూ. 15 లక్షల రుణాన్ని పొందవచ్చు. ఇందులో సబ్సిడీ ఉంటుంది. (చదవండి: Earth Hour: "'స్విచ్ ఆఫ్": ఆ ఒక్క గంగ ప్రకృతితో కనెక్ట్ అవుదామా..!) -
అప్పుల ఊబిలో అన్నదాత.. ఆవు వచ్చి రక్షించింది..
సాక్షి ప్రతినిధి, వరంగల్/వేలేరు: కుమ్మరిగూడెం.. హనుమకొండ జిల్లా వేలేరు మండలంలో కేవలం 300 జనాభా, 72 ఇళ్లున్న ఓ కుగ్రామం.. ఇక్కడి అన్నదాతలు ఒకప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి విలవిల్లాడారు. ఇప్పుడదే గ్రామం అంతర్జాతీయ గుర్తింపు సాధించింది. స్వచ్ఛమైన దేశవాళీ ఆవు నెయ్యిని స్థానికంగా విక్రయించడంతోపాటు అమెరికా, యూకే, జర్మనీ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. కేవలం ఏడేళ్ల వ్యవధిలోనే అప్పుల ఊబి నుంచి బయటపడి ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేసింది. జర్మన్ మహిళ దాతృత్వంతో.. సత్యసాయి బాబా భక్తురాలు, దాతృత్వశీలి అయిన మోనికా రేటరింగ్(జర్మనీ) భారత్లో పర్యటిస్తూ.. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న అన్నదాతలను, ఆపన్నులను ఆదుకుంటున్నారు. ఈ క్రమంలో 2018లో హైదరాబాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పాలేకర్ సాగు విధానంపై శిక్షణ పొందిన కుమ్మరిగూడెంవాసి మారుపాక కోటి, మహర్షి గోశాల నిర్వాహకుడు సర్జన రమేష్ ద్వారా కుమ్మరిగూడెం సహా చుట్టుపక్కల గ్రామాల్లో స్వయంగా పర్యటించారు.అన్నదాతల ఇబ్బందులను ఆమె గుర్తించారు. వారిని ఎలాగైనా ఆదుకోవాలనుకున్న మోనికా రేటరింగ్.. గ్రామస్తులను పాడిపరిశ్రమ వైపు ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గ్రామానికి చెందిన 30 మంది రైతులను గుజరాత్ తీసుకెళ్లి రూ. 50 వేల చొప్పున 30 గిర్ జాతి ఆవులను కొనిచ్చారు. అలాగే నెయ్యి తీసే యంత్రాన్ని కూడా రైతులకు అందించారు.మోనికా రేటరింగ్ అందించిన ఆర్థిక చేయూతతో కుమ్మరి గూడెం రైతులు క్రమంగా నిలదొక్కుకున్నారు. ముఖ్యంగా స్వచ్ఛమైన గిర్ జాతి ఆవు పాలతో గ్రామస్తులు నెలకు సుమారు 50కిలోల మేర తయారు చేస్తున్న నెయ్యికి భారీ డిమాండ్ ఏర్పడింది. సాధారణంగా కిలో ఆవు నెయ్యి తయారీకి 20 లీటర్ల పాలు అవసర మవుతుంది. కుమ్మరి గూడెం రైతులు మాత్రం కిలో నెయ్యి (Ghee) తయారీకి 30 నుంచి 35 లీటర్ల పాలను ఉపయో గిస్తున్నారు. స్వచ్ఛతకు మారుపేరుగా మారడంతో కిలో రూ.4 వేలకు పైగా వెచ్చించి మరీ కొంటున్నారు. ఆదిలాబాద్, విజయవాడ, విశాఖపట్నం వాసులు కూడా ఫోన్ చేసి ఆర్డర్లు ఇస్తున్నారు. అమెరికాలోని డాలస్, యూకేలోని లండన్, జర్మనీలో ఉంటున్న వారు సైతం ఫోన్ చేసి నెయ్యి ఆర్డర్ చేస్తున్నారు. వారికి స్పీడ్ పోస్ట్, కార్గో సర్వీస్ల ద్వారా నెయ్యిని పంపిస్తున్నారు. హనుమ కొండ, వరంగల్, హైదరాబాద్లలోని ఆయుర్వేద వైద్యులు సైతం ఇక్కడి నుంచే తీసుకెళ్తున్నారు.ఇంటి ఖర్చులకు ఉపయోగపడుతోంది..నాకున్న ఎకరంతోపాటు కొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. అలాగే పశుపోషణ చేస్తున్నాను. ప్రస్తుతం ఒక గిర్ ఆవు పాలు ఇస్తోంది. ప్రతి నెలా పాలబిల్లు రూ. 7–8 వేలు వస్తోంది. దీంతో మా కుటుంబ నెలవారీ ఖర్చులు, ఇతర అవసరాలకు ఈ డబ్బు ఎంతో ఉపయోగపడుతుంది. – మారుపాక రవి, కుమ్మరిగూడెం గ్రామస్తుడుప్రభుత్వం రుణాలు మంజూరు చేయాలి..మేము గ్రామంలోనే నెయ్యి తయారు చేసి దేశవిదేశాలకు సరఫరా చేస్తున్నాం. ఇక్కడ తయారు చేసిన నెయ్యికి చాలా డిమాండ్ ఉంది. మాకు ప్రభుత్వం సహకారం అందించి రుణాలు మంజూరు చేస్తే చిన్న తరహా పరిశ్రమ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. – మారుపాక రాజు, పాలకేంద్రం నిర్వాహకుడు, కుమ్మరిగూడెంసంతృప్తిగా ఉంది.. కుమ్మరిగూడెం (Kummarigudem) ఏడేళ్లలో సాధించిన ప్రగతిని చూసి ఎంతో ఆనందిస్తున్నా. ఇప్పుడు ఈ గ్రామంలో పర్యటిస్తుంటే ఇంగ్లిష్ మాట్లాడే యువకులు నా వెంట నడుస్తూ విజయగాథలు వివరిస్తుంటే నా మనసు గర్వంతో ఉప్పొంగుతోంది. గ్రామస్తులు ఫోన్ చేసి వారి ఆవులను చూసేందుకు రావాలని, జీవితంలో ఎంతో బాగుపడ్డామని చెబుతుండటం నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. – మోనికా రేటరింగ్ -
అందుకే శంభు సరిహద్దు తెరిచాం: పంజాబ్ సర్కారు
న్యూఢిల్లీ: పంజాబ్-హర్యానా సరిహద్దులో గత 13 నెలలుగా మూసివేసిన శంభు సరిహద్దు ఇప్పుడు తెరుచుకుంది (Shambu Border Reopen). ఇక్కడ నిరసన చేస్తున్న రైతులను పోలీసులు తరలించారు. ఈ నేపధ్యంలో రైతు నేతలు జగ్జీత్ సింగ్ దల్లెవాల్, సర్వాన్ సింగ్ పంధేర్ సహా దాదాపు 400 మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.పంజాబ్ పోలీసులు శంభు సరిహద్దును తెరవడంతో ఈ దారిలో రాకపోకలు సాగించేవారు.. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు(Entrepreneurs) ఊపిరిపీల్చుకున్నారు. కాగా రైతు నేత రాకేష్ టికైత్ మాట్లాడుతూ పోలీసుల చర్య సరైనది కాదని, దీనిపై రైతు సంఘాలు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. మరోవైపు యునైటెడ్ కిసాన్ మోర్చా మార్చి 26న పంజాబ్ అసెంబ్లీకి మార్చ్ నిర్వహించాలని నిర్ణయించింది. శంభు సరిహద్దు మూసివేయడం వల్ల పంజాబ్లోని పలు పరిశ్రమ భారీ నష్టాలను చవిచూశాయని ప్రభుత్వం చెబుతోంది. ఫలితంగా ఉపాధి సంక్షోభం ఏర్పడుతున్నదని, అందుకే శంభు సరిహద్దును ఖాళీ చేయించామని పేర్కొంది.శంభు సరిహద్దును మూసివేయడం వలన ఇక్కడి పరిశ్రమలు ఎగుమతులు, దిగుమతులను చేయలేకపోతున్నాయనే వాదన వినిపిస్తోంది. కాగా పంజాబ్ రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రంగా ఉండాలని భగవంత్ మాన్ ప్రభుత్వం కోరుకుంటోంది. తద్వారా పంజాబ్ యువతకు ఉపాధి లభిస్తుందని, దీంతో వారు మాదకద్రవ్యాల జోలికి వెళ్లకుండా ఉంటారని ప్రభుత్వం భావిస్తోంది. రైతులను ఆదుకుంటామని కూడా చెబుతోంది. ఇది కూడా చదవండి: గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి.. 70 మంది మృతి -
రైతన్నకు గుండె‘కోత’
సిరిసిల్ల: జిల్లాలో వ్యవసాయానికి 17 గంటలు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అవుతోంది. రాత్రి 12.30 గంటల నుంచి మరుసటి రోజు సాయంత్రం 5.30 గంటల పాటు సరఫరా చేస్తున్నారు. కానీ అప్రకటిత కోతలతో పొలాలు పారడం లేదు. మధ్యలో కరెంట్ పోతే.. రైతులు పొలాల వద్దకు మళ్లీ వెళ్లకుండా రాత్రి నిద్రపోవడంతో పొలం పారడం లేదు. నిరాటంకంగా విద్యుత్ సరఫరా లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరో వైపు లోవోల్టేజీ సమస్యలతో కూడిన కరెంట్ సరఫరా అవుతుంది. ట్రాన్స్ఫార్మర్లపై విద్యుత్ వినియోగ భారం పడి కాలిపోతున్నాయి. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే.. రీప్లేస్ చేసేందుకు రెండు, మూడు రోజులు పడుతుంది. ఫలితంగా ఆ ట్రాన్స్ఫార్మర్ పరిధిలోని బోర్లు, మోటార్లు నడవడం లేదు. ఒక్కసారి పొలం ఆరితే.. మళ్లీ పారడం కష్టమవుతుంది. ఎండలు మండిపోతున్న దశలో కరెంట్ కష్టాలు ఇబ్బందిగా మారాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) విద్యుత్ పంపిణీ చేస్తుండగా.. ఎనీ్పడీసీఎల్ అధికారులు విద్యుత్ సబ్స్టేషన్లను పర్యవేక్షిస్తున్నారు. సబ్స్టేషన్లలో మరమ్మతుల కారణంగా కరెంట్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఫలితంగానే చివరి దశలో వరి మడి.. తడి ఆరి రైతులు తల్లడిల్లుతున్నారు. పక్షమైతే పంట చేతికి జిల్లా వ్యాప్తంగా మరో పక్షం రోజుల్లో వరి పంట చేతికి అందుతుంది. యాసంగి సీజన్లో 1,82,256 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో వరి పంట 1,78,350 ఎకరాల్లో సాగైంది. గతంతో పోలి్చతే జిల్లాలో వరి సాగు విస్తీర్ణం పెరిగింది. కానీ భూగర్భజలాలు అడుగంటిపోయి బోర్లు ఎత్తిపోయి 20 శాతం మేరకు పంటలు పొట్టదశలో ఎండిపోయాయి. ఇప్పుడు అప్రకటిత విద్యుత్ కోతలతో చేతికందే దశలో పొలాలు తడారుతున్నాయి. ఎండిన పొలాల్లో పశువులను మేపుతున్నారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేవు జిల్లా వ్యాప్తంగా వి ద్యుత్ సరఫరాలో ఇబ్బందులేమీ లేవు. వ్యవసాయానికి త్రీఫేజ్ కరెంట్ ఎప్పటిలాగే అందిస్తున్నాం. ఎక్కడైనా ట్రాన్స్ ఫార్మర్ ఫెయిల్ అయితే వెంటనే మార్చుతున్నాం. ట్రాన్స్ఫార్మర్ల రవాణాకు ఆరు వాహనాలు ఉన్నాయి. సాంకేతిక సమస్యలతో అప్పుడప్పుడూ సరఫరాలో అంతరాయం సహజంగానే ఉంటుంది. విద్యుత్ కోతలు ఏమీ లేవు. – విజయేందర్రెడ్డి ‘సెస్’ఎండీ, సిరిసిల్ల -
సాగుకు ‘నీటి’ గండం
సాక్షి, అమరావతి/నెట్వర్క్: నిర్దేశించుకున్న విస్తీర్ణం కంటే దాదాపు పది లక్షల ఎకరాల్లో పంటల సాగు తగ్గింది..! దీనిప్రకారం ఉన్న పంటలకు తగినంతగా నీరందాలి..! కానీ, వంతుల వారీ నీరందించడంలో కూటమి ప్రభుత్వం విఫలం కావడం రైతుల పాలిట శాపంగా మారింది. రబీలో రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల వెతలు వర్ణనాతీతంగా ఉన్నాయి. సాగునీటి కోసం వారు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. దీంతో విసుగుచెంది నిరసన బాట పట్టారు. రెండో పంటకు నీరివ్వడంలోనే కాదు.. విడుదల, నిర్వహణలోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడుతున్నారు. కళ్లెదుటే ఎండిపోతున్న పంట చేలను చూసి కన్నీరుమున్నీరు అవుతున్నారు. వరి దుబ్బులను చూపిస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. బైక్లపై పంట చేలల్లో తిరుగుతూ గోడు వినండి మహాప్రభో అంటూ గగ్గోలు పెడుతున్నారు. పలుచోట్ల రాస్తారోకోలు, ధర్నాలకు దిగుతున్నారు. ఇంత జరుగుతున్నా తమకేమీ పట్టనట్టు ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తుండడం అన్నదాతలను కుంగదీస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. 46 లక్షల ఎకరాల్లోనే సాగు ప్రభుత్వం రబీలో 57.66 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించింది. మార్చి 19 నాటికి 55 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉండగా.. 46 లక్షల ఎకరాల్లోనే సాగయ్యాయి. 19.87 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యం కాగా, 16.50 లక్షల ఎకరాల్లోనే సాగైంది. మొత్తమ్మీద నిర్దేశిత లక్ష్యం కంటే దాదాపు పది లక్షల ఎకరాలు తక్కువ. మరోపక్క రెండో పంటకు సరిపడా నీరిస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పింది. పరిస్థితి చూస్తే శివారు ప్రాంతాలకు చేరలేనేలేదు. కృష్ణా, గోదావరి డెల్టా పరిధిలోనే కాక హంద్రీనీవా, వంశధార నదుల కింద కూడా రైతులు పాట్లు పడుతున్నారు. దాదాపు లక్ష ఎకరాలకు సాగు నీరందని పరిస్థితి నెలకొంది. –నవంబరు, డిసెంబరులో మైనస్ 2.3 మిల్లీ మీటర్ల వర్షపాతం, జనవరి, ఫిబ్రవరిలో 79.2 మిల్లీమీటర్లు, మార్చిలో ఇప్పటివరకు 98.3 శాతం చొప్పున లోటు వర్షపాతం నమోదైంది. కోనసీమ జిల్లాలనే కన్నీరు.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 1.60 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. ఇందులో 95 శాతం పంట గోదావరి కాలువల కిందనే. 5వేలకు పైగా ఎకరాల్లోని పంటలు ఎండిపోతున్నాయి. రబీకి నీటి సరఫరా విషయంలో తొలి నుంచి అధికారులు రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఖరీఫ్ వర్షాలతో చేలల్లో ముంపు దిగక రబీ నారుమడులు ఆలస్యమయ్యాయి. తూర్పు, మధ్య డెల్టాలోని కాలువలకు నీరు విడుదల చేస్తున్నామని చెబుతున్నప్పటికీ శివారుకు చేరడం లేదు. –అమలాపురం మండలం వన్నెచింతలపూడి, ఎ.వేమవరం, ఎ.వేమరప్పాడు, ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి పర్రభూమి ప్రాంతం, కూనవరం, ముక్తేశ్వరం పంట కాలువ కింద లొల్ల, వాడపల్లి, ఆత్రేయపురం, అంబాజీపేట మండలం కె.పెదపూడి, మామిడికుదురు మండలం నిడిమిలంక గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. బొబ్బర్లంక–పల్లంకుర్రు ప్రధాన పంట కాలువ ద్వారా కుండలేశ్వరం వైరులాకు దిగువ, ఎగువ ప్రాంతాలకు వంతుల వారీగా ఇస్తున్నా శివారు ఆయకట్టు బీటలు వారింది. కె.గంగవరంలో యండగండి, కూళ్ల, కోటిపల్లి, యర్రపోతవరం పరిధిలో పరిస్థితి తీవ్రంగా ఉంది. తాళు తప్పలు అధికంగా వస్తాయని రైతులు వాపోతున్నారు. అదనపు భారం అయినప్పటికీ ఆయిల్ ఇంజన్లతో నీటిని తోడుతూ పొట్ట దశలోని వరి పంటను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. పల్నాడు జిల్లా దొడ్లేరు గ్రామంలో సాగునీటి కోసం గురువారం రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులు చేలల్లోనే వినూత్న నిరసనలు అయినాపురం–కూనవరం పంట కాలువ శివారు కూనవరం పరిధి గరువుపేట రైతులు పంట చేలో ద్విచక్ర వాహనాలు నడిపి నిరసన తెలిపారు. ఈనే దశలో ఉన్న సుమారు 350 ఎకరాల్లోని పంట దెబ్బతింటోందని వాపోయారు. కాట్రేనికోన మండలం పల్లంకుర్రు శివారు దాసరివారిపేటలో ఎండిన చేలలో ఓ రైతు మోటారు సైకిల్ నడిపాడు. ఆత్మహత్యలే శరణ్యం.. తాళ్లరేవు మండల పరిధి పి.మల్లవరం శివారు రాంజీనగర్, మూలపొలం, గ్రాంటు తదితర గ్రామాల్లో 600 ఎకరాలకు సాగు నీరు పూర్తిగా అందడం లేదు. దీంతో ఆత్మహత్యలే శరణ్యమంటూ వరిదుబ్బులు, పురుగు మందు డబ్బాలు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కాట్రేనికోన మండలం రామాలయంపేట, గొల్లగరువు, లైనుపేట 150 ఎకరాలు, ఐ.పోలవరం మండలం కేశనకుర్రు, చాకిరేవు చెరువు, తిల్లకుప్ప, మొల్లి చెరువు, జి.మూలపొలం తదితర ప్రాంతాల్లో 300 ఎకరాలు బీడువారుతున్నాయి. పి.మల్లవరం పంచాయతీ మూలపొలం, రాంజీనగర్, గ్రాంటు గ్రామాల్లో వరిచేలకు సాగునీరు అందక బీటలు వారాయి. జాతీయ రహదారిపై బైఠాయించి రైతులు ఎండిపోయిన వరి పంటను ప్రదర్శిస్తూ పెద్దఎత్తున ఆందోళన చేశారు. –కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు ఆయకట్టు, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. బి.ప్రత్తిపాడు, భోగాపురం, రాపర్తి, రాయవరం తదితర గ్రామాల్లో చేలు బీటలు వారాయి. తాళ్లరేవు కరప, గొల్లప్రోలు, శంకవరం మండలాల్లో సుమారు 3 వేల ఎకరాల ఆయకట్టు ఎండిపోయింది. వట్టిపోయిన కేసీ కెనాల్.. శ్రీశైలం నిండింది..రెండో పంటకు దండిగా నీరు అందుతుందని రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఆళ్లగడ్డ సబ్ డివిజన్ కేసీ కాల్వ ఒట్టిపోయింది. ఫిబ్రవరి తొలి వారం నుంచి చేలకు నీరు చేరడం లేదు. కేసీ కెనాల్ రైతుల అగచాట్లు మామూలుగా లేవు. గొప్పాడు మండలం యాళ్లూరు వద్ద ముచ్చుమర్రి పంపుల ద్వారా 675 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నట్టు చెబుతున్నా చివరి ఆయకట్టుకు చేరడమే లేదు. ఆళ్లగడ్డ సబ్ డివిజన్లో 18 వేల ఎకరాల్లో వరి, కంది, మొక్కజొన్న సాగవుతున్నాయి. కోత దశలో ఉన్న మొక్కజొన్నకు కనీసం రెండు తడులు అందించాలి. నీరివ్వకుంటే రూ.లక్షల్లో నష్టపోతామని రైతులు వాపోతున్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు కింద నీరు బంద్ కావడంతో కర్నూలు జిల్లా దేవనకొండ మండలం రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ కాల్వ కింద 42 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఇవన్నీ కోత దశకు రాగా.. తడులందక రైతులు పాట్లు పడుతున్నారు. సాగర్ కిందా ఇదే దుస్థితి.. ఉమ్మడి గుంటూరు జిల్లాకు 9 రోజులు, ఉమ్మడి ప్రకాశంకు 6 రోజులు నీటిని విడుదల చేస్తున్నా చివరి ఆయకట్టుకు అందడం లేదు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు బ్రాంచి కెనాల్, మల్లాయపాలెం, కాకుమాను మేజర్ కాల్వ ద్వారా ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను మండలాల్లోని శివారు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ ప్రాంతంలో రబీలో 36 వేల ఎకరాల్లో మిర్చి, పొగాకు, మినప, శనగ, మొక్కజొన్న వేయగా, ప్రస్తుతం మిర్చి, మొక్కజొన్నకు నీటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వం సాగర్ జలాలను విడుదల చేయకపోవడం, చేసినా చివరి భూములకు నీరు చేరక పంటలు బెట్టకు వస్తున్నాయి. వ్యయ ప్రయాసల కోర్చి చెరువులు, కుంటల్లోని నీటితో ఆయిల్ ఇంజిన్ల ద్వారా పొలాలను తడుపుతున్నారు. మురుగు కాలువల్లో నీటిని తోడి పంటలను కాపాడుకోవల్సిన దుస్థితి దాపురించిందని రైతులు వాపోతున్నారు. –శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బన్నువాడ గ్రామంలో రైతులు ట్యాంకర్లతో నీటిని తెచ్చుకొని తడులు అందిస్తున్నారు. వంశధార జలాశయం కింద నీరందని కొందరు పంటలపై ఆశలు వదులుకుంటున్నారు. –కృష్ణా డెల్టాలోని ఏలూరు జిల్లా పెడపాడు, దెందులూరు మండలాల్లో 48 వేల ఎకరాలను ఖాళీగా వదిలేశారు. దెందులూరుతో పాటు బీమడోలు మండల పరిధి పలు గ్రామాల్లో ప్రస్తుతం పొట్ట, ఈనిక దశలో ఉన్న వరి పంటకు నీరందని పరిస్థితి ఉంది. సుమారు 7 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఆత్మహత్యలే శరణ్యం ఈ ఏడాది సూపర్–10 రకానికి సంబంధించి పది ఎకరాల మిరప సాగు చేశా. రూ.లక్ష దాక పెట్టుబడి అయింది. మరో రెండు విడతల కోతలు రావాల్సి ఉంది. మార్చి మొదటి వారం నుంచే పొన్నాపురం సబ్ చానల్కు నీటి విడుదల ఆపేశారు. భూములు తడులు లేక పగుళ్లిచ్చాయి. కేసీ కెనాల్ అధికారులను వేడుకుంటున్నా సాగు నీటి విడుదలకు ప్రయోజనం లేకపోయింది. దిగుబడులు రాకపోతే తీవ్రంగా నష్టపోతాం. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యం. –చిన్న తిరుపతిరెడ్డి, మిటా్నల, నంద్యాల జిల్లా అధికారులు కన్నెత్తి చూడడం లేదు మాది ఉప్పలగుప్తం మండలం వానపల్లిపాలెం. మూడెకరాలు కౌలుకు చేస్తున్న. దాళ్వాలో వరి వేశా. నీటికి ఢోకా లేదన్నారు. తీరా ఇప్పుడు చూస్తే చాలా ఇబ్బంది పడుతున్నా. మా గ్రామం వైపు అధికారులు కన్నెత్తి చూడడం లేదు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టాం. ఇలాగైతే వ్యవసాయం ఎలా చేసేది? –వల్లూరి నాగేశ్వరరావు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలుషిత నీటిని తోడుకుంటున్నాంవరి చేలు బీటలు వారాయి. టేకి డ్రైన్లో నీటిని మోటార్లతో తోడుతున్నారు. అది ఉప్పగా ఉండడంతో పాటు కలుషితం కావడంతో పంట దిగుబడిపై ప్రభావం పడుతోంది. గతంలో మాదిరిగా తాతపూడి పంపింగ్ స్కీం ద్వారా నీరు సరఫరా చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. –దడాల బుజ్జిబాబు, పోలేకుర్రు, తాళ్లరేవు మండలం, కాకినాడ జిల్లా ఏం చేయాలో పాలుపోవడం లేదు4.5 ఎకరాల్లో మెనుగు పెసర వేశారు. నీరు లేక ఎండల తీవ్రతతో పంట ఎండిపోతోంది. 12 ఎకరాల్లోని జీడి పంటకూ నీరు పెట్టే పరిస్థితి లేదు. ఎండల తీవ్రతకు పువ్వు మాడిపోయింది. కనీస దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఏం చేయాలో పాలుపోవడంలేదు. –కనపల శేఖర రావు, పాతయ్యవలస, శ్రీకాకుళం జిల్లా ఎండిపోతున్న మిర్చి పంట పల్నాడు జిల్లాలో వారబందీ అమలులో ఉన్నప్పటికీ నీరందక మిర్చి పంట ఎండిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రొంపిచర్ల మండలం వీరవట్నం పరిసర గ్రామాల రైతులు సాగునీటి కోసం గురువారం ఆందోళన బాట పట్టారు. నాగార్జున సాగర్ సంతగుడిపాడు ఇరిగేషన్ సర్కిల్ డీఈ ఎస్.విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. సాగర్ జలాశయం డెడ్ స్టోరేజ్లో ఉన్నప్పుడు కూడా సాగుకు సరిపడా నీరు విడుదల చేసేవారని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి కన్పించడం లేదని రైతుసంఘాల నేతలు ఆరోపించారు. రైతులు ఏయే పంటలు సాగు చేశారు, ఎన్ని రోజులు పాటు ఎంతమేర నీటి అవసరాలు ఉన్నాయనే వివరాలు అధికారుల దగ్గర లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని ఆరోపిస్తున్నారు. మిర్చి, మొక్కజొన్న, వరి, ఇతర కూరగాయ పంటలు దెబ్బతినకుండా ఏప్రిల్ 20 వరకు సాగు నీరు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్దఎత్తున సాగర్ కింద ఆయకట్టు రైతులతో కలిసి ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. సాగు నీరు అడిగితే పోలీస్ స్టేషన్లో పెట్టారు రాస్తారోకో చేస్తున్న వీరంతా పల్నాడు జిల్లా దొడ్లేరు గ్రామానికి చెందిన సన్న, చిన్నకారు రైతులు. నీళ్లున్నాయన్న ఆశతో రెండో పంటగా చింతపల్లి నాగార్జున సాగర్ కాల్వ కింద 400 ఎకరాల్లో వరి వేశారు. ప్రస్తుతం పొట్ట దశకు రాగా.. మార్చి తొలి వారం నుంచి నీరందక పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పటికే ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఒక్కో రైతు రూ.లక్ష వరకు నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. సాగు నీటి విడుదలలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ గురువారం రాస్తారోకో చేశారు. దీంతో రైతులను బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించారు. ‘‘నీళ్లు అడిగిన పాపానికి స్టేషన్కు తరలిస్తారా?’’ అంటూ రైతు సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అన్నదాతలపై ఉక్కుపాదం
-
ఆశలు ఎండ‘మామిడి’
సాక్షి, అమరావతి: చెట్టంతా పూత.. దీంతో ఈ ఏడాది ఇక చింత లేదనుకున్నారు..! పిందె పడడమే ఆలస్యం.. తమ పంట పండినట్లేనని భావించారు..! కానీ, పగబట్టినట్లుగా వాతావరణ మార్పులు.. కొత్త రకం పురుగులు కలిపి దాడి చేశాయి..! ఫలితంగా పూతతో పాటు రైతుల ఆశలూ నేలరాలుతున్నాయి. నాలుగు డబ్బులు మిగులుతాయని భావిస్తే.. ఎర్రటి ఎండల్లో నీటి జాడను భ్రమింపజేసే ఎండమావుల్లా మారింది వారి పరిస్థితి. ‘ఆంధ్రప్రదేశ్ మామిడి’ అంటే దేశ విదేశాల్లో గొప్ప పేరు..! అయితే, ప్రస్తుతం చిత్తూరు నుంచి నూజివీడు దాకా ఎటుచూసినా మామిడి రైతులో నిర్వేదమే కనిపిస్తోంది. బంగినపల్లి మొదలు రసాల వరకు పంటను చూస్తే బెంగ పట్టుకుంటోంది. వాస్తవానికి ఏటా డిసెంబరు, జనవరిలో మామిడి పూత వస్తుంది. ఈ ఏడాది మాత్రం ఫిబ్రవరిలో మొదలైంది. అయితే, శ్రీకాకుళం మొదలు చిత్తూరు వరకు ఏ చెట్టు చూసినా పూత బ్రహ్మాడంగా కాసింది. దీంతో దిగుబడికి దిగులు ఉండదని రైతులు ఆశపడ్డారు. కానీ, పూత పిందె కట్టేలోగా వారి ఆశలు ఆవిరయ్యాయి. ఒక్కసారిగా వాతావరణ మార్పులకు తోడు ‘మాంగో లూఫర్’ అనే కొత్త రకం పురుగు, తెగుళ్లు విజృంభణతో కళ్లెదుటే పూత మాడిపోయి, పిందెలు రాలిపోతున్నాయి. ఇదంతా చూసి రైతులు దిగాలు పడుతున్నారు. దాదాపు 10 లక్షల ఎకరాల్లో.. రాష్ట్రంలో 9.97 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. సువర్ణ రేఖ, నీలం, తోతాపూరి, బంగినపల్లి ప్రధానంగా పండిస్తున్నారు. గత రెండేళ్లలో వరుసగా 49.85 లక్షల టన్నులు, 35.78 లక్షల టన్నులు దిగుబడులు వచ్చాయి. ఈ ఏడాది కనీసం 45 లక్షల టన్నుల దిగుబడిని అంచనా వేశారు. అయితే, పూత పట్టింది మొదలు తెగుళ్లు, వైరస్లు విజృంభించాయి. మరోపక్క ఉష్ణోగ్రతలు అనూహ్యంగా 3 నుంచి 5 డిగ్రీల మేర పెరిగిపోయాయి. అసలే పూత ఆలస్యంతో ఇబ్బంది పడుతుండగా, ఉష్ణోగ్రతల ప్రభావం ప్రూట్ సెట్టింగ్ను దెబ్బతీసింది. జనవరి, ఫిబ్రవరిలో 28–29 డిగ్రీల మేర ఉన్న ఉష్ణోగ్రత, ప్రస్తుతం 36–38 డిగ్రీలకు చేరడం మామిడి పంటపై ప్రభావం చూపుతోంది. ⇒ మరోవైపు రాత్రిపూట మంచు ప్రభావం తీవ్రంగా ఉంది. అనూహ్య వాతావరణ పరిస్థితులతో మగ, ద్విలింగ పుష్పాల నిష్పత్తి (రేషియో) మారిపోయి ఆశించిన స్థాయిలో పిందెలు ఏర్పడడం లేదు. ⇒ మిరపను ఆశిస్తున్న నల్ల తామర పురుగు.. రెండేళ్లుగా మామిడిపైనా దాడి చేస్తోంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో దీని దెబ్బకు మామిడి పూత చాలావరకు మాడిపోయింది. 40 శాతం పైగా పంట మీద నల్ల తామర పురుగు ఉ«ధృతి కనిపిస్తోంది.రాయలసీమలో లిచీ లూఫర్ పురుగు దాడి లిచీ పంటలో కనిపించే అరుదైన మ్యాంగో లూఫర్ (కొత్త రకం గొంగలి పురుగు) ఏపీలో తొలిసారి మామిడిపై వ్యాపిస్తోంది. రాయలసీమతో పాటు కృష్ణా, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇది ఎక్కువగా ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. లార్వా దశలోనే పువ్వులు, ఆకులను తినేసే, పిందెల్లోకి చొరబడే ఈ పురుగులు 20–30 శాతం తోటలను దెబ్బతీస్తున్నాయి. వీటికితోడు వాతావరణ పరిస్థితులను బట్టి మంగు, మసి, పండు ఈగ, పెంకు, తేనె మంచు పురుగు, కాండంతొలుచు, కొమ్మ తొలిచే, గూడు పురుగు వంటి ఇతర రసం పీల్చే పురుగుల ఉధృతి మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ఫలితంగా పూత మాడిపోతూ పిందెలు రాలిపోతున్నాయి. ⇒ సాధారణంగా హెక్టార్కు 10 టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా, ఈ ఏడాది మూడు నుంచి నాలుగు టన్నులకు మించి వచ్చే అవకాశాలు లేవని అంచనా వేస్తున్నారు. పురుగుమందుల ఖర్చు రెట్టింపు ⇒ విస్తృతంగా పురుగుమందుల వినియోగంతో రైతులకు పెట్టుబడులు తడిసి మోపెడు అవుతున్నాయి. గతంలో ఎకరాకు రూ.20 వేలు వ్యయం కాగా.. ప్రస్తుతం సగటున రూ.40–50 వేల మధ్య ఖర్చు చేస్తున్నారు.సస్యరక్షణ చర్యలు ఇలా...⇒ అజాడిరక్టివ్ 2 మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఆ తరువాత బీటీ ఫార్ములేషన్ బాసిల్లస్ తురింజియోస్పిస్ వెరైటీ కుర్స్టాకి(డిపెల్) 1.5–2 మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ⇒ క్లోరోఫైరిఫాస్ 50శాతం ఈసీ ఒక మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటిలో లేదా ఇమామోక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు ఒక లీటర్ నీటిలో లేదా నోవాల్యురాన్ 5.25 శాతం ప్లస్ ఇండోక్సా కార్బ్ 4.5 శాతం ఒక మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ⇒ పురుగుల ఉధృతిని నియంత్రించేందుకు ఎకరాకు 8 పండు ఈగ బుట్టలు పెట్టుకోవాలి. ⇒ 10 ఏళ్లు పైబడిన మామిడి తోటలకు రోజుకు ఒక చెట్టుకు కనీసం 100 లీటర్ల నీటిని అందించాలి. ⇒ పిందెలు ఎక్కువగా రాలిపోతుంటే నాఫ్తలిన్ అసిటిక్ యాసిడ్ (ప్లానోఫిక్స్) 100 ఎంఎల్ 500 లీటర్ల నీటిలో (50 చెట్లు) పిచికారీ చేయాలి. ⇒ నీటి వసతి లేని రైతులైతే పొటాíÙయం నైట్రేట్ 10 గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ⇒ తేనె మంచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే డైనోటోప్యూరాన్ 0.25 గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ⇒ నల్లతామర ఉధృతి ఎక్కువగా ఉంటే చెట్టుకొక బ్లూ కలర్ జిగురు అట్ట అమర్చుకోవాలి.ఏం చేయాలో పాలుపోవడం లేదునాకు 6 ఎకరాల మామిడి తోట ఉంది. పూత బాగా వచ్చినప్పటికీ ఎండల తీవ్రతతో పాటు నల్లతామర, కొత్త రకం పురుగుల ప్రభావంతో మాడిపోయింది. పిందెలను కాపాడడానికి పురుగుమందులు విపరీతంగా పిచికారీ చేయాల్సి వస్తోంది. ఎకరాకు రూ.40 వేల పైనే ఖర్చు అవుతోంది. ఇంకా పెట్టుబడి పెట్టాలంటే భయంగా ఉంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే పెట్టుబడీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. గతంలోలా అధికారులు తోటలను పరిశీలించి సలహాలు ఇవ్వడం లేదు. నిరుడు ధర లేక మామిడిని తోటల్లోనే వదిలేశాం. ఈ ఏడాదైనా గట్టెక్కుదాం అనుకుంటే అసలు ఏంచేయాలో పాలుపోవడంలేదు. – ఆకేపాటి రంగారెడ్డి, అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం తూర్పుపల్లిపెట్టుబడి కూడా వచ్చేలా లేదు 2.5 ఎకరాల్లో 12 ఏళ్ల వయస్సున్న 200 చెట్లు ఉన్నాయి. ఎండల ప్రభావం, బంక తెగులుతో పూత మొత్తం నేలవాలింది. ఒకటీ అరా పిందెలు వచ్చినా కొత్తరకం పురుగులతో రాలిపోతోంది. ఇప్పటికే పురుగు మందుల కోసం రూ.40–50 వేలు ఖర్చు చేశా. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చా. తీరా కాపు కొచ్చేసరికి తెగుళ్లు, ఎండలు మా కడుపు కొడుతున్నాయి. ఈసారి దిగుబడికి అవకాశం లేదు. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. –కె.వెంకటసుబ్బయ్య, అనంతపల్లె, పుల్లంపేట మండలం, అన్నమయ్య జిల్లా70 శాతం పూత దెబ్బ.. నాకు సొంతంగా ఐదెకరాలుండగా, 15 ఎకరాల్లో తోటలు లీజుకు తీసుకున్నా. ప్రారంభంలో మంచి పూతే వచ్చింది. ఇటీవల కురుస్తున్న మంచుకు తోడు పగటి ఉష్ణోగ్రతల ప్రభావానికి పూర్తిగా మాడిపోయింది. తేనె మంచు, రసం పీల్చే పురుగుల ప్రభావంతో రాలిపోయింది. 60–70 శాతం పూత దెబ్బతిన్నది. మిగిలిన పూతలో అక్కడక్కడా పిందెలు కట్టినా నిలుస్తాయో లేదోనని అనుమానంగా ఉంది. ఈ ఏడాది లీజుతో పాటు పురుగుమందులకు రూ.8 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. అది కూడా వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. –దుంగ వెంకటరమణ, నీలకంఠాపురం, లక్కవరపుకోట మండలం, విజయనగరం జిల్లాఫ్రూట్ కవర్స్తో కొంత మేర రక్షణ కొత్త రకం గొంగలి పురుగు మ్యాంగో లూఫర్తో పాటు నల్లతామర ఉధృతి ఎక్కువగా ఉంది. పూత ఆలస్యమవడంతో పాటు పెరిగిన ఉష్ణోగ్రతల ప్రభావంతో ఫ్రూట్ సెట్టింగ్ జరగక పిందెకట్టడం తగ్గిపోయింది. ఈసారి దిగుబడులు తగ్గే అవకాశాలు కన్పింస్తున్నాయి. పురుగుల ఉధృతిని ఎదుర్కొనేందుకు సస్యరక్షణ చర్యలు పాటించాలి. పురుగు మందులను సిఫార్సుల మేరకే వాడాలి. పిందెలను కాపాడుకునేందుకు రైతులు ఫ్రూట్ కవర్స్ కట్టాలి. పిందె నిమ్మకాయ పరిమాణంలోకి వచ్చిన తర్వాత కవర్లు కడితే కాయల సైజుతో పాటు నాణ్యత కూడా పెరుగుతుంది. –డి.శ్రీనివాసరెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త ఉద్యాన పరిశోధనా కేంద్రం, తిరుపతి -
లక్ష ఎకరాల్లో ఎండిన వరి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పంటలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట, నిజామాబాద్, కామారెడ్డి, వనపర్తి, యాదాద్రి, మెదక్, సిద్దిపేట, భద్రాద్రి, ఖమ్మం, సిరిసిల్ల జిల్లాల్లో వరిమళ్లు ఎండుతున్నాయి. ప్రాజెక్టుల నీటి మీది ఆశతో వరి సాగు చేసిన రైతులతో పాటు బోర్లు, బావుల కింద పంట వేసిన లక్షలాది మంది రైతులు పొట్ట కొచ్చే దశలో ఉన్న వరిని చూసి తల్లడిల్లుతున్నారు. ప్రాజెక్టుల కింద ఉన్న పొలాలకు వారబందీ ప్రాతిపదికన నీటిని విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, దేవాదుల,ఎల్ఎండీ, మిడ్మానేరు, మల్లన్నసాగర్, సీతారామసాగర్ మొదలైన ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని పొదుపుగా కిందకు వదులుతుండడంతో ఆయకట్టు చివర ఉన్న పొలాలకు నీరు అందడం లేదు. దీంతో పలు జిల్లాల్లో వరిమళ్లు ఎండుతున్నాయి. ఇప్పటికే సుమారు లక్ష ఎకరాల్లో వరి పంట ఎండిపోయినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు తెలిసింది. పడిపోతున్న భూగర్భ జలాలు: ఈ ఏడాది మార్చిలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. చాలాచోట్ల ఏప్రిల్లో ఉండే ఉష్ణోగ్రతలు ఇప్పుడే నమోదవుతున్నాయి. దీంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. గత సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో నమోదైన భూగర్భ నీటి మట్టాలు ఈసారి మార్చి నెలలోనే ఆ స్థాయికి వెళ్లాయి. గత నెలాఖరు నాటికే వికారాబాద్ జిల్లాలో 13.67 మీటర్ల లోతుకు వెళ్లగా, ప్రస్తుతం 14 మీటర్లు దాటింది. కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి, సిరిసిల్ల, మహబూబ్నగర్, భద్రాద్రి, భూపాలపల్లి జిల్లాల్లో.. ఫిబ్రవరిలో రాష్ట్ర సగటు భూగర్భ జల మట్టం 8.32 మీటర్లను మించి 9 మీటర్ల నుంచి ఏకంగా 13 మీటర్ల వరకు వెళ్లింది. ఇక మార్చి రెండో వారం దాటే నాటికి కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో భూగర్భ మట్టాలు మరింత అడుగంటినట్లు అధికారులు చెపుతున్నారు. రికార్డు స్థాయిలో పంటల సాగు రాష్ట్రంలో ఈ యాసంగిలో అత్యధికంగా 73.65 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో వరే 56.13 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ప్రభుత్వం సన్న ధాన్యానికి బోనస్ కింద క్వింటాలుకు రూ.500 ఇస్తుండడంతో సాగు గణనీయంగా పెరిగింది. సన్నాల సాగు పెరగడంతో సాగునీటి అవసరం మరింత పెరిగింది. పంట కాలం ఎక్కువ కావడంతో నీటి తడులు కూడా ఎక్కువ కావలసి ఉంది. అయితే ఎస్ఆర్ఎస్పీ, దేవాదుల వంటి ప్రాజక్టుల కింద పొలాలకు వారబందీ కింద ఒక వారం నీరిచ్చి, మరో వారం బంద్ చేస్తుండడంతో వారం పాటు పంటను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. భూగర్భ జలాలపై ఆధారపడి పంటలు వేసిన చాలా గ్రామాల్లో పంటను పశువులకు వదిలేశారు. మొక్కజొన్న పంట కూడా సాధారణ సాగుతో పోలిస్తే ఈసారి ఏకంగా మూడున్నర లక్షల ఎకరాలు అధికంగా సాగైంది. గిట్టుబాటు ధర ఉండడంతో రైతులు 8.09 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఆరు తడి పంటగా సాగయ్యే మొక్క జొన్నకు వారం, పదిరోజులకు కూడా ఒక తడి నీరు ఇవ్వని పరిస్థితుల్లో నిజామాబాద్, కామారెడ్డి, సూర్యాపేట, మెదక్, సిద్దిపేట, ఖమ్మం జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో మొక్కజొన్న ఎండిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. మొక్కజొన్న, వేరుశనగ కూడా..నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిద్దిపేట, మెదక్ మొదలైన జిల్లాల్లో మొక్కజొన్న, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, వికారాబాద్ తదితర జిల్లాల్లో వేరుశనగ పంటలు కూడా నీళ్లు లేక ఎండిపోతున్నట్లు రైతులు వాపోతున్నారు. ఏప్రిల్ నెలాఖరు వరకు వరి పంట కోతకు వచ్చే అవకాశం ఉండడంతో అప్పటి వరకు ఆయకట్టుకు నీరు ఎలా ఇవ్వాలో తెలియక నీటిపారుదల శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు రైతుల బాధలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ నీరు పెద్దపల్లి జిల్లా గుండా మంథని వరకు నిరాటంకంగా వెళ్లేలా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రయతి్నస్తున్నప్పటికీ, వచ్చే నెలలో ఎలా ఉంటుందో చెప్పలేమని ఓ అధికారి పేర్కొన్నారు. -
రాయలసీమ ఎత్తిపోతలకు చంద్రబాబు సమాధి
నెల్లూరు(బారకాసు): రాయలసీమ లిఫ్ట్కు సీఎంగా వైఎస్ జగన్ శ్రీకారం చుడితే, చంద్రబాబు సమాధి కడుతున్నారని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి విమర్శించారు. నెల్లూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీమ రైతుల కన్నీటి కష్టాలకు బాబు స్వార్థ రాజకీయాలే కారణమని.. నీటి పంపకాలలో అన్యాయం జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశి్నంచలేని అసమర్థుడు అని ధ్వజమెత్తారు. తానూ రాయలసీమకు చెందినవాడినేనని, 15 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకోవడమే తప్ప, రైతాంగానికి చంద్రబాబు ఒక్క మేలు కూడా తలపెట్టలేదన్నారు. శ్రీశైలంలో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాల్వలోకి ఎత్తిపోసేందుకు గత ప్రభుత్వం నిర్ణయించిందని.. హక్కుగా దక్కిన నీటిని వాడుకోవడానికి రూ.3,825 కోట్లతో 2020 మే 5న రాయలసీమ లిఫ్ట్ నిరి్మంచేందుకు ఆమోదం తెలిపిందన్నారు. తద్వారా చెన్నైకి 15 టీఎంసీలు, ప్రాజెక్టుల కింద 9.6 లక్షల ఎకరాలకు నీరివ్వాలనేది లక్ష్యంగా చెప్పారు.సీమ లిఫ్ట్ను అడ్డుకునేందుకు చంద్రబాబు అడుగడుగునా కుట్రలకు పాల్పడ్డారని, ఎన్జీటీ (చెన్నై) బెంచ్లో తెలంగాణ టీడీపీ నేతలతో పిటిషన్ వేయించారని తెలిపారు. హక్కుగా కేటాయించిన 44 వేల క్యూసెక్కులను వాడుకుంటున్నామని ఈఏసీ ఎదుట సమర్థంగా వాదించలేక కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిందని కాకాణి మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం 798 అడుగుల్లోనే తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి పేరుతో నీటిని తోడేస్తోందని.. 800 అడుగులకు చేరగానే సాగుకు విడుదల చేసుకుంటున్నారని, అయినా చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. వైఎస్ జగన్కు పేరొస్తుందనే.. రాయలసీమ లిఫ్ట్ పూర్తయితే వైఎస్ జగన్కు పేరొస్తుందనే కుట్రతో, రైతుల జీవితాలను చంద్రబాబు పణంగా పెట్టారని కాకాణి మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ పనులను కొనసాగించినా బాబు కిమ్మనలేదని విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రాజెక్టులను తాకట్టు పెడుతున్న చంద్రబాబు.. రైతుల దృష్టి మళ్లించేందుకు బనకచర్ల పేరతో కొత్త డ్రామాకు తెరతీశారని కాకాణి పేర్కొన్నారు.ఓవైపు పోలవరం నీటిని బనకచర్లకు తీసుకెళ్తామని, సముద్రంలోకి వృథాగా పోయే బదులు సీమకు తీసుకెళ్తామంటే అభ్యంతరం చెప్పొద్దని తెలంగాణకు సూచిస్తున్నారని తెలిపారు. మరోవైపు తన శిష్యుడు, తెలంగాణ సీఎం రేవంత్ ద్వారా అభ్యంతరాలు లేవనెత్తేలా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రచారం కోసమే చంద్రబాబు ఈ ప్రాజెక్టును వాడుకుంటున్నారని, అంతే తప్ప.. ప్రాజెక్ట్ల విషయంలో ఆయనకు మొదటి నుంచి చిత్తశుద్ధి లేదని కాకాణి ధ్వజమెత్తారు. -
పరిహారం తేల్చకుండానే ... వరుస నోటిఫికేషన్లు!
సాక్షి, రంగారెడ్డిజిల్లా/యాచారం : ప్యూచర్ సిటీ రాకతో తమ దశ తిరిగిపోతుందని భావించిన రైతుల్లో ఇప్పుడు రంది మొదలైంది. రూ. కోట్లు పలికే భూములకు పరిహారం ఎంతో తేల్చకుండా..వరుసగా వస్తున్న భూసేకరణ నోటిఫికేషన్లు రంగారెడ్డి జిల్లా రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాత్రికిరాత్రే నోటిఫికేషన్లు జారీ చేస్తూ బలవంతంగా భూములు లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ హంగులతో ఫ్యూచర్సిటీని నిర్మిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఫార్మాసిటీ పేరుతో గత ప్రభుత్వం సేకరించిన 13,973 ఎకరాలుసహా మొత్తం 30 వేల ఎకరాల్లో ఈ ఫోర్త్సిటీని నిర్మించాలని ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే 56 రెవెన్యూగ్రామాలతో ఎఫ్సీడీఏ ఏర్పాటు చేసి, ప్రత్యేక పాలక మండలిని కూడా ప్రకటించింది. అయితే ఫోర్త్సిటీ, గ్రీన్ఫీల్డ్రోడ్డు, ఐటీ, ఇండ్రస్టియల్ పార్కుల పేరుతో ప్రభుత్వం మరికొంత భూమిని సేకరిస్తోంది. » గత డిసెంబర్లో కందుకూరు మండలం తిమ్మాపూర్ సర్వే నంబర్ 38లో 350 ఎకరాలు, సర్వే నంబర్ 162లో 217 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. » ఫిబ్రవరి మొదటివారంలో మహేశ్వరం మండలం నాగిరెడ్డిపల్లిలో ఇండస్ట్రియల్, ఐటీపార్కు స్థాపనకు 198.21 ఎకరాల భూమి అవసరమని ప్రభుత్వం భావించి, 195.05 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. » మార్చి 13న కందుకూరు మండలం తిమ్మాయిపల్లి సర్వే నంబర్ 9లోని 439 మంది రైతుల నుంచి 366.04 ఎకరాలు సహా మహేశ్వరం మండలం కొంగరకుర్దు సర్వే నంబర్ 289లోని 94 మంది రైతుల నుంచి 277.06 ఎకరాల భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.» రవాణా కోసం ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి ఆర్ఆర్ఆర్ వరకు 41.05 కిలోమీటర్లు...330 ఫీట్ల రోడ్డు నిర్మించనున్నట్టు ప్రకటించి, ఆ మేరకు ఇటీవల 4,725 మంది రైతుల నుంచి 1004.22 ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసి, ఇప్పటికే ఆయా భూముల్లో హద్దురాళ్లను కూడా నాటే పని చేపట్టింది. తమకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా హద్దురాళ్లు నాటడం ఏమిటని రైతులు ప్రశి్నస్తున్నారు. » తాజాగా యాచారం మండలంలో ఇండ్రస్టియల్ పార్కు కోసం 638 మంది రైతుల నుంచి 821.11 ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. మొండిగౌరెల్లి రైతులు ఇదే అంశంపై ఆందోళన చెందుతున్నారు. బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.2 కోట్లకుపైగా పలుకుతుండగా, ప్రభుత్వం రూ.25 లక్షల లోపే నష్ట పరిహారం చెల్లించే పరిస్థితి ఉండటంతో రైతులు తమ భూములను ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసిన భూముల్లో ఎలాంటి క్రయ విక్రయాలు చేయరాదని, బోరుబావులు తవ్వరాదని, నిర్మాణాలు చేపట్టకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో మహేశ్వరం, యాచారం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మంచాల, కడ్తాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఆర్బీకేల ఆక్రమణ
సాక్షి, అమరావతి: గ్రామ స్థాయిలో పౌరులకు సేవలందించిన సచివాలయాలను నీరుగార్చడంతో పాటు వలంటీర్ల వ్యవస్థకు ఉద్వాసన పలికిన టీడీపీ కూటమి సర్కారు... డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల భవనాలను (రైతు సేవా కేంద్రాలు) సైతం ఆక్రమిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో విత్తు నుంచి విక్రయం వరకు అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచి పల్లె దాటాల్సిన అవసరం లేకుండా భరోసా కల్పించిన ఆర్బీకేలను దర్జాగా కబ్జా చేస్తోంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఒత్తిడితో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఉండి, కాళ్ల, ఆకివీడు ఆర్బీకేలను ఇప్పటికే పోలీస్స్టేషన్లుగా మార్చేశారు. ఇదే రీతిలో మిగిలిన జిల్లాల్లోనూ కూటమి నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేసిన సీఎం చంద్రబాబు.. వాటి ఉనికే లేకుండా చేయాలనే కుట్రతో ఆ భవనాలను వివిధ శాఖలకు కేటాయిస్తుండటంపై రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.జగన్ ముద్ర చెరిపేయడమే లక్ష్యం..!సచివాలయాలు.. వలంటీర్లు... ఆర్బీకేల పేరు చెబితే చాలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తుకొస్తారు! ప్రజల ముంగిటే పౌరసేవలు అందించాలన్న సంకల్పంతో ప్రతి రెండువేల జనాభాకు ఓ సచివాలయం.. వాటికి అనుబంధంగా రైతు భరోసా కేంద్రాల వ్యవస్థను దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో ఒకేసారి 10,778 ఆర్బీకేలను నెలకొల్పి వాటి ద్వారా గ్రామ స్థాయిలో రైతులకు సేవలందించేందుకు పట్టభద్రులైన 15,667 మంది వ్యవసాయ, ఉద్యాన, పట్టు, మత్స్య, వెటర్నరీ సçహాయకులను నియమించారు. రైతులకు ఎనలేని సేవలందిస్తున్న వీటిని నిర్వీర్యం చేయడం ద్వారా వైఎస్ జగన్ ముద్రను చెరిపేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరతీసింది. రైతన్న ఇక ఎటు వెళ్లాలి..?గతంలో రైతన్నలు గ్రామ చావిడి, కూడలి లేదా కాలువ గట్లపై కూర్చొని కష్టసుఖాలు చెప్పుకునే వారు. ఆర్బీకేల ఏర్పాటుతో అన్నదాతలు వాటిని తమ సొంత ఇంటి మాదిరిగా భావించారు. తమ కోసం ప్రవేశపెట్టిన విప్లవాత్మక వ్యవస్థను ఎంతో ఆదరించారు. రైతన్నలు ఉదయం పొలానికి వెళ్లే ముందు.. సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు ఆర్బీకేలో అడుగు పెట్టడం ఆనవాయితీగా మారింది. విత్తనాలు, ఎరువులు, ఈ–క్రాప్, రైతు భరోసా, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ.. ఇలా ప్రతి ఒక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నిశ్చింతగా పొలం పనుల్లో నిమగ్నమయ్యేవారు. వివిధ రకాల వ్యవసాయ సంబంధిత మేగజైన్స్తోపాటు స్మార్ట్ టీవీ ద్వారా పంటల సాగులో శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు అందేవి. డిజిటల్ కియోస్క్ల ద్వారా తమకు కావాల్సిన ఉత్పాదకాలను బుక్ చేసుకుని వాతావరణ, మార్కెట్ ధరల సమాచారాన్ని తెలుసుకునేవారు. అన్నదాతలకు గ్రామాల్లో సేవలందించేందుకు రూ.2,260 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో 10,252 ఆర్బీకేల నూతన భవన నిర్మాణాలను కూడా గత ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే రూ.1,165 కోట్ల వ్యయంతో 4,865 భవనాలు పూర్తయి కొన్ని చోట్ల ఆర్బీకేల కార్యకలాపాలు కొనసాగుతుండగా, మరికొన్ని భవనాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 5,387 భవనాల్లో నిర్మాణాలు దాదాపు 80 – 90 శాతం పూర్తి అయ్యాయి. కొద్దిపాటి నిధులిస్తే చాలు పూర్తయ్యే దశలో ఉండగా కూటమి ప్రభుత్వం రావడంతో నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
చేజారుతున్న విత్తన స్వాతంత్య్రం
వ్యవసాయంలో విత్తనాల సమస్య రోజు రోజుకూ తీవ్రమవుతున్నది. హరిత విప్లవం పేరిట మొదలుపెట్టిన పరిణామం విత్తనాలతోనే మొదలైంది. అధిక దిగుబడి వంగడాల హామీతో ఇది మొదలై, క్రమంగా రైతులను విత్తనాలకు దూరం చేసింది. 1960వ దశకంలో మొదలు పెట్టిన ఈ మార్పు 2025 నాటికి తీవ్రరూపం దాల్చింది. ఆహార నాణ్యత దిగజారడానికి విత్తనాలలో వచ్చిన మార్పులే కారణం. దేశీ విత్తనాలను తులనాడి, భారత వ్యవసాయాన్ని హీనపరిచి తెచ్చిన హరిత అధిక దిగుబడి వంగడాలు క్రమంగా రైతుల విత్తన స్వావలంబనను హరించాయి. రసాయనాల దిగుబడివిదేశీయుల ప్రోత్సాహంతో ప్రవేశపెట్టిన వంగడాలు అధిక దిగుబడి ఇవ్వడానికి ప్రధాన కారణం రసాయన ఎరువులు. రసా యన ఎరువులు ఉపయోగించని పరిస్థితులలో ఈ వంగడాలు ఉప యోగపడలేదు, ఉపయోగపడవు. ఆ విధంగా మొదలుపెట్టిన రసా యన ఎరువుల వాడకం ఇప్పుడు విధిగా, అత్యధికంగా ఉపయోగించాల్సిన పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు ఎకరాకు ఒకటో రెండో ఎరువుల బస్తాల వాడకం నుంచి ఇప్పుడు 15 బస్తాలు వాడే దుఃస్థితికి రైతు చేరుకున్నాడు. పరిశోధన చేసి ప్రవేశపెట్టిన హైబ్రిడ్ లేదా అధిక దిగుబడి వంగడాలు, ఎరువులు, కీటకనాశక రసాయనాల ఉపయో గాన్ని కూడా పెంచాయి. ఈ రకం విత్తనాలు మొదట్లో అధిక దిగుబడి చూపినా క్రమంగా ఉత్పాదకత తగ్గింది. దిగుబడి పెరిగి తగ్గుతోందని గుర్తించి ఒక కొత్త వాదన ప్రవేశపెట్టారు శాస్త్రవేత్తలు. విత్తనాలు ఎప్పటికప్పుడు మార్చాలి. మార్చితేనే దిగుబడి! ఏ ఆధునిక విత్తనంలోనూ నూరు శాతం అంకురోత్పత్తి ఉండదు. దాంతో మభ్యపెట్టే సిఫారసు మొదలైంది. ఎకరాకు ఎన్ని గింజలు వెయ్యాలి? సాధారణంగా ఒక్కో పంటకు ఒక్క కొలమానం ఉంటుంది. ఆధునిక విత్తనాల్లో అంకురోత్పత్తి వంద శాతం ఎప్పుడూ ఉండదు కనుక ఈ కొలమానంలో మార్పులు తెచ్చి ఎకరాకు ఎక్కువ విత్తనాలు వాడే విధంగా సిఫారసు చేయడం మొదలు పెట్టారు. వరి పంటకు కొందరు రైతులు ఎకరాకు 18 నుంచి 20 కిలోలు వాడుతుంటే, పరిజ్ఞానం ఉన్న రైతులు కేవలం 250 గ్రాముల దేశీ వరి విత్తనాలు వాడుతున్నారు. ఎంత తేడా! మిర్చి, పత్తి, వరి, గోధుమ, టమాట వంటి పంటలలో నాసి రకం విత్తనాల వల్ల లాభపడు తున్నది ప్రైవేటు కంపెనీలు, నష్టపోతున్నది రైతులు. పోయిన జ్ఞానం, నమ్మకంఆధునిక విత్తనాల వల్ల సాగు ఖర్చు పెరిగింది. ఒకప్పుడు రైతు తన విత్తనాలు దాచుకుని వాడే రోజులలో విత్తనాల మీద సున్నా ఖర్చు ఉండేది. రైతుకు తన విత్తనాల మీద పరిజ్ఞానం ఉండేది. వేరే రైతు దగ్గర తెచ్చుకున్నా నమ్మకం ఉండేది. రైతు తన విత్తనాలు కోల్పోయి ఆధునిక విత్తనాలకు అలవాటు పడ్డ తరువాత విత్తనాల మీద జ్ఞానం, నమ్మకం పోయినాయి. ఆధునిక విత్తనాలకు చీడ పీడ బెడద పెరిగింది. దానికి పరిష్కారంగా కీటక నాశనిల వాడకం పెరి గింది. వాటి వల్ల ఖర్చు పెరిగింది. ప్రమాదకరమైన రసాయనాలు కాబట్టి వాటిని వాడే క్రమంలో రైతు ఆరోగ్యం ప్రమాదంలో పడింది. ఫలితంగా వలసలు, ఆత్మహత్యలు. వ్యవసాయ కూలీ కుటుంబా లతో మొదలైన వలసలు రైతులను కూడా తాకాయి. ఇంకొక వైపు ఎరువులు, విత్తనాలు, వ్యవసాయం మీద సలహాలు ఇచ్చే కంపెనీలు పెరిగాయి. వాటి వార్షికాదాయం యేటా పెరుగుతున్నది.బహుశా నార్మన్ బోర్లాగ్ కూడా ఈ పరిణామం ఊహించి ఉండక పోవచ్చు. బోర్లాగ్ ప్రవేశపెట్టిన ‘అధిక దిగుబడినిచ్చే’ విత్తనా లకు ఖరీదైన ఎరువులే కాక, ఎక్కువ నీరూ అవసరం. వ్యవసాయ ఉత్పత్తిలో అద్భుతాలు లేవు అని చెప్పిన ఈ వ్యక్తి, ప్రపంచానికి ఆహార భద్రత సాధించాలని మొదలు పెట్టిన ‘ఆధునిక విత్తనాల’ వ్యవసాయం జీవ వైవిధ్యాన్ని, జీవనోపాధులను నాశనం చేస్తున్న విషయం పట్ల స్పందించలేదు. ‘అధిక వంగడాల’ వల్ల దిగుబడి పెరుగుతుందనే ఏకైక సూత్రం మీద పని చేసిన ఆ మహానుభావుడు తద్వారా నిర్మాణమైన ‘దోపిడీ’ వ్యవస్థ గురించి ఆలోచించలేదు.పెద్ద కంపెనీల గుప్పిట్లో...ఇప్పుడు ‘ఆధునిక విత్తనాలు’ రైతుల చేతులలో లేవు. విత్తన, పెస్టిసైడ్ కంపెనీల గుప్పిట్లో ఉన్నాయి. ‘మేధో హక్కుల సంపత్తి’ పేరిట రక్షణ పొంది విత్తన మార్కెట్లను సురక్షితం చేసుకున్నాయి. ఎప్పటికప్పుడు దిగుబడులు తగ్గిపోతున్న నేపథ్యంలో యేటా కొత్త ‘విత్తనాలు’ మార్కెట్లో ప్రవేశపెట్టి అటు ప్రభుత్వాలనూ, ఇటు రైతులనూ మభ్యపెడుతూ తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. మన దేశంలో విత్తనాలు, ప్రకృతి వనరుల మీద మేధో సంపత్తి హక్కులు పొందే అవకాశం లేదు కనుక ఇతర మార్గాలలో తమ వ్యాపారాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. పెద్ద కంపెనీలు సిండికేట్ అయ్యి చిన్న కంపెనీలను గుప్పిట్లో పెట్టుకుంటున్నాయి. మార్కెట్ ఒప్పందాలు చేసుకుని దేశీ, చిన్న కంపెనీలకు ‘బంధనాలు’ వేశారు. ప్రభుత్వం ఏదన్నా ‘చర్య’ చేపడితే కోర్టుకు వెళతారు. విత్తన కంపెనీలు కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మీద వేసిన కేసులు కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి.రైతులలో విత్తనాల విజ్ఞానం కొండలా పెరగాల్సిందిపోయి, ప్రైవేటు గుత్తాధిపత్యం వల్ల వారికి అందడం లేదు. రానురాను విత్తన విజ్ఞానాన్ని రహస్యంగా మార్చుతున్నాయి విత్తన కంపెనీలు. ఇక్రి సాట్, ఇర్రి వంటి అంతర్జాతీయ సంస్థలు విత్తన పరిశోధనల సాకుతో భారతీయ జన్యు సంపద తీసుకుని, క్రమంగా ప్రైవేటు పెట్టుబడి దారులకు అందజేస్తున్నాయి. 1966 తరువాత నిర్మాణమైన ప్రభుత్వ విత్తన వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. ఇప్పుడు ఉన్న సంస్థలు, కమి టీల పరిశోధనలు ఉత్సవ పాత్రకే పరిమితమై, పరోక్షంగా ప్రైవేటు కంపెనీల ప్రయోజనాలను కాపాడుతున్నాయి. ప్రభుత్వ రంగంలో ఏదో జరుగుతున్న భ్రమ కల్పించటానికి ఉపయోగపడుతున్నాయి.వ్యాపార సరళీకరణ లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యానికి, దేశాభివృద్ధికి మూలమైన విత్తన రంగాన్ని ప్రైవేటుపరం చేస్తూ, ఉన్న ఒకే ఒక చట్టాన్ని అమలు చేయడం లేదు. 1966లో ప్రభుత్వం రంగంలో చేసే విత్తనాల నాణ్యత, సరఫరా మీద శాస్త్రీయ నియంత్రణకు తెచ్చిన విత్తన చట్టం ప్రైవేటు విత్తనాలకు వర్తింప జేయడానికి సిద్ధంగా లేదు. 2004లో ఒక కొత్త చట్టం తెచ్చే ప్రయత్నం ప్రైవేటు విత్తన కంపెనీల వ్యాపార వెసులుబాటును సరళీకృతం చేయడానికే అని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో 20 యేళ్ల తరువాత కూడా అది రూపుదాల్చలేదు. ఇప్పటి వరకు ప్రతిపాదించిన 4, 5 ముసాయిదాలు రైతుల ప్రయోజనాలు కాపాడటానికీ, భారత దేశంలో ఉన్న అపర విత్తన సంపద స్వచ్ఛతను పరిరక్షణకూ ఉద్దేశించినవి కావు. రైతులు, కంపెనీల ప్రయోజనాల మధ్య కంపెనీల పక్షం వహిస్తున్న కేంద్రం కొత్త చట్టం తేవడానికి భయపడుతున్నది. విత్తనాల మీద స్వావలంబన అత్యంత మౌలికమైన అవసరం. రైతులకు విత్తన స్వాతంత్య్రం కోసం రాష్ట్రాలు చట్టాలు తేవాలి. రైతుల పరిజ్ఞానం పెంచే విధంగా విత్తన వ్యవస్థను నిర్మించాలి. విత్తన జన్యుసంపదను కలుషితం కాకుండా కాపాడాలి. పర్యావరణానికి, జన్యుసంపదకు హాని చేసే విత్తనాలను ప్రవేశపెట్టే కంపెనీలు,సంబంధిత వ్యక్తుల మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి. గ్రామీణ స్థాయి నుంచి విత్తనాలను రైతులు స్వేచ్ఛగా ఇచ్చి పుచ్చుకునే పద్ధతులను ప్రోత్సహించాలి.డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు -
ఆంధ్రప్రదేశ్లో పాడి రైతుకు కూటమి సర్కారు దగా... ప్రైవేటు డెయిరీలు చెప్పిందే ధర, ఇష్టం వచ్చినంతే కొనుగోలు... లీటర్కు 25 రూపాయల దాకా నష్టపోతున్న రైతులు
-
రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు
-
కూటమి ప్రభుత్వంపై రైతన్న ఆగ్రహం
సాక్షి, గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్)/నరసరావుపేట: అధికారం చేపట్టిన కేవలం తొమ్మిది నెలల్లోనే కూటమి సర్కార్ రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. తమ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి, ఆక్వా రైతులు రోడ్డెక్కారు. ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కేంద్రాలలో రైతులు ఆందోళన బాట పట్టారు. రైతును రక్షించండి – దేశాన్ని కాపాడండి అనే నినాదంతో తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి అందిన సమాచారం ప్రకారం...ప్రభుత్వ తీరు విచారకరంవిజయవాడ లెనిన్ సెంటర్లో జరిగిన ధర్నా కార్యక్రమంలో రైతులు పెద్ద హాజరై ప్రభుత్వ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నాలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రైతుసంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ మిర్చి క్వింటాకు రూ. 20వేల ధర నిర్ణయించి, ప్రభుత్వమే కొనుగోళ్లు జరపాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం రాయలసీమ, వెనుకబడిన ప్రాంతాల ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించకపోవడం విచారకరమన్నారు. తెలుగు గంగా, పూలసుబ్బయ్య వెలుగొండ, గాలేరు నగరి, హంద్రీ–నీవా ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ఈశ్వరయ్య, కె. వి. వి. ప్రసాద్, తదితర రైతు ప్రతినిధులు మాట్లాడుతూ ధరల స్థిరీకరణ నిధిని పునరుద్ధరించి రాష్ట్రంలో అన్ని పంటలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. వరికెపూడిశెల ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలికాగా, పల్నాడు జిల్లా రైతులకు మణిహారమైన వరికెపూడిశెల ప్రాజెక్టుకు బడ్జెట్లో నిధులు కేటాయించి త్వరితగతిన పనులు ప్రారంభించాలని పల్నాడు జిల్లా రైతు,ప్రజా సంఘాల సమన్వయ సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది . రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు, కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వై.రాధాకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో 2.50 లక్షల ఎకరాలలో మిర్చి పంట సాగు చేసిన రైతు బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు. రొయ్యల రైతుల రాస్తారోకోవీరవాసరం: రొయ్యల రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని పశ్చిమగోదావరి జిల్లాలోని పలువురు రైతులు బుధవారం పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలోని తూర్పు చెరువు సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వీరవాసరం–బ్రాహ్మణ చెరువు రహదారి నుంచి భారీ మోటార్ సైకిల్ ర్యాలీ జరిగింది. వీరవాసరం మండల రొయ్యల రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మల్ల రాంబాబు మాట్లాడుతూ రొయ్యల ఎగుమతిదారులు సిండికేట్గా మారి రొయ్యల రైతులకు తీరని నష్టం కలుగజేస్తున్నారన్నారు. వారం రోజుల క్రితం కిలో 100 కౌంటు ధర రూ.250 నుంచి రూ.260 ఉండగా రెండు మూడు రోజుల నుంచి రూ.220 నుంచి రూ.230కు తగ్గించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. -
పొలం ఎండి.. గుండె మండి
వరి పంటంతా పశువుల పాలు.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం వీరారం గ్రామానికి చెందిన రైతు గుండె మైసాలు ఎకరం వేరుశనగ, మరో ఎకరం వరిసాగు చేశారు. ఆరు తడి పంట కావడంతో వేరుశనగ చేతికి వచ్చింది. కానీ బావిలో నీళ్లు అడుగంటి సాగునీరు లేక వరి ఎండిపోయింది. దీనితో దిక్కుతోచని మైసాలు.. పొలాన్ని వదిలేయగా బుధవారం పశువులు, గొర్రెల మందలు మేస్తున్నాయి. పంట పెట్టుబడి, రెక్కల కష్టం అంతా వృథా అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. – మరిపెడ రూరల్సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: రాష్ట్రంలో పంటలకు కష్టకాలం వచ్చింది. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. యాసంగిలో సాగుచేసిన వరి, మొక్క జొన్న తదితర పంటలకు నీరందక ఎండిపోతున్నాయి. గోదావరి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల విషయంలో అధికార యంత్రాంగంలో అయోమయం నెలకొంటే... కృష్ణా ప్రాజెక్టుల పరిధిలో పంటలకు సరిపడా నీళ్లు లేక బిక్కమొహం వేసే పరిస్థితి నెలకొంది. గత ఏడాదితో పోలిస్తే వానలు మెరుగ్గానే ఉన్నా, పలు ప్రాజెక్టుల్లో నీటి నిల్వలున్నా కూడా పంటలకు అందడం లేదు. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు, బావులు వట్టిపోతున్నాయి. ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతుండటంతో పశువుల మేత కోసం వదిలేస్తున్న దుస్థితి కనిపిస్తోంది. కాళేశ్వరం ఎత్తిపోతలు నిలిచిపోవడంతో.. గోదావరి నదిపై ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలను నిలిపివేయడంతో.. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్న నీళ్లు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకునే పరిస్థితి. దీనితో మిడ్ మానేరులో ఉన్న నీటిని అవసరానికి అనుగుణంగా లోయర్ మానేర్, మల్లన్నసాగర్కు వదులుతున్నారు. మల్లన్నసాగర్లోని నిల్వలు మరో 20 రోజులకు మించి సాగునీటి అవసరాలు తీర్చలేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లోని చెరువుల్లో నిల్వ ఉన్న నీళ్లు కూడా కనీసం 20రోజుల పాటు అయినా పంటలకు అందే స్థాయిలో లేవు. ⇒ రాష్ట్రంలో ఎల్లంపల్లి దిగువన ఉన్న మిడ్మానేరును ఆనుకొని ఉన్న సిరిసిల్ల జిల్లా తీవ్రమైన సాగునీటి కష్టాలను ఎదుర్కుంటోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) నుంచి లోయర్ మానేరు, వరంగల్ మీదుగా సూర్యాపేట వరకు సాగునీటిని ‘వార బందీ (వారానికి ఒకసారి మాత్రమే సాగునీటిని వదలడం)’ కింద ఇస్తుండటంతో తమ పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. పెద్దపల్లి జిల్లాలో కూడా ఎస్సారెస్పీ నీటి విడుదలను వారబందీ పద్ధతిలోనే కొనసాగిస్తున్నారు. ⇒ మరోవైపు దేవాదుల నుంచి జనగామ జిల్లాలోని చెరువులకు ఇటీవలే సాగునీటిని వదిలినా.. ఆ నీటితో చెరువులు నింపేలోపు పొలాలన్నీ ఎండిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ⇒ మెదక్ జిల్లాలోని పొలాలకు నీళ్లు అందించేందుకు సాగునీటి ప్రాజెక్టులు లేవు. దీనితో 95శాతం మంది రైతులు బోరుబావుల ఆధారంగా పంటలను సాగు చేస్తున్నారు. ఇప్పుడు భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ⇒ రాష్ట్రంలోని నాగర్కర్నూల్, వనపర్తి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, జనగామ, వికారాబాద్, మహబూబ్నగర్, భూపాలపల్లి సహా చాలా జిల్లాల్లో సాగునీటి కష్టాలు తీవ్రరూపం దాల్చాయి. కృష్ణా నది పరిధిలోనూ అదే పరిస్థితి.. దక్షిణ తెలంగాణలో కృష్ణా నది పరిధిలోని ప్రాజెక్టుల కింద పరిస్థితి విభిన్నంగా ఉంది. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలోని నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో చివరి ఆయకట్టుకు, మొక్కజొన్న పంటకు నీరు అందడం లేదు. మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేక, భూగర్భ జలాలు ఇంకిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు. గద్వాల ప్రాజెక్టు పరిధిలోని పొలాలకు సాగునీటితోపాటు భూగర్బ జలాలు కొంత ఆశాజనకంగా ఉన్నా... కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ల కింద పొలాలకు నీరు అందడం లేదు. మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో సాగయ్యే వేరుశనగకు వారానికో తడి నీరు కూడా లేక, భూగర్భ జలాలు ఎండిపోవడంతో రైతులు ఆగమాగం అవుతున్నారు. బాగా పెరిగిన వరి సాగుతో.. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం.. యాసంగి సీజన్కు సంబంధించి ఫిబ్రవరి నెలాఖరు వరకు రాష్ట్రంలో 69.22 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు చేపట్టారు. ఇందులో 53.24 లక్షల ఎకరాలు వరి పంటే. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 5 లక్షల ఎకరాలు అధికం కూడా. వరి తర్వాత మొక్కజొన్న 7.50 లక్షల ఎకరాల్లో సాగయింది. మహబూబ్నగర్, వికారాబాద్, నిజామాబాద్తోపాటు పలు జిల్లాల్లో కలిపి 2.35లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట వేశారు. రెండేసి లక్షల ఎకరాల్లో కందులు, జొన్నలు సాగయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తుండటంతో ఈ సారి వరిసాగు భారీగా పెరిగింది. అయితే వరి సాగుకు నీటి వినియోగం ఎక్కువ. అందులోనూ వరి పొట్టకొచ్చే సమయంలో నీళ్లు కీలకం. ఇలాంటి సమయంలో సాగునీరు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎస్సారెస్పీ కింద కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాలకు నీళ్లు అందుతుండగా.. అక్కడ కూడా వారబందీ విధానం పెట్టే ఆలోచనలో నీటిపారుదల శాఖ ఉంది. ఎస్సారెస్పీ నీటితో రెండుమూడేళ్లుగా యాసంగిలో సూర్యాపేట పొలాలకు నీరు అందగా.. ఈసారి ఎస్సారెస్పీ నీరు రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో సాగునీటి సమస్యతో చాలా పొలాలు ఎండిపోయాయని, వాటిలో పశువులను మేపుతున్నామని రైతులు వాపోతున్నారు. మొక్కజొన్న, వేరుశనగకు కూడా సమస్య.. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో సాగైన మొక్కజొన్న, వేరుశనగ పంటలకు వారానికోసారి కూడా సాగునీళ్లు అందని పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. మహబూబ్నగర్, వికారాబాద్, నాగర్కర్నూల్ తదితర జిల్లాల్లో వేరుశనగ.. మెదక్, నిజామాబాద్, జగిత్యాల, ఖమ్మం, కామారెడ్డి జిల్లాల్లో మొక్కజొన్న పంట ఎండిపోతోంది. నీటి విడుదల విషయంలో అధికారులకు సరైన అవగాహన లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని రైతులు అంటున్నారు. జనగామ జిల్లా దేవరుప్పులకు చెందిన రైతు ఉప్పుల శ్రీను రెండెకరాల్లో వరి సాగు చేశారు. ఆయన తన పొలంలోని బోరు ఆధారంగానే ఏటా రెండు పంటలు సాగు చేసేవారు. కానీ బోరు ఎండిపోవడంతోపాటు చెరువుల్లోకి దేవాదుల రిజర్వాయర్ నీరు కూడా రాలేదు. దీనితో వరి ఎండిపోయింది. పంట చేతికి వచ్చే అవకాశం లేకపోవడంతో పొలాన్ని మూగజీవాలకు వదిలేశారు. ఈ చిత్రంలోని వ్యక్తి మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లికి చెందిన బర్తపురం కొమిరెల్లి. ఆకేరు వాగు పక్కనే ఉన్న రెండున్నర ఎకరాల్లో యాసంగి వరిసాగు చేశారు. గతేడాది భారీ వర్షాలతో చెక్డ్యామ్ కొట్టుకుపోవడంతో నీటి నిల్వ తగ్గింది. ఇప్పుడు పూర్తిగా ఎండిపోయింది. దీనితో పదిహేను రోజులుగా పొలానికి నీళ్లు లేక నెర్రెలు బారింది. లక్ష రూపాయల దాకా పెట్టుబడి పెట్టానని, ఇప్పుడు పశువులను మేపడానికి తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఉందని కొమిరెల్లి కన్నీరు పెడుతున్నారు. పంటలు ఎండిపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. 12 ఎకరాల పొలం ఎండిపోతోంది గోదావరి నీళ్ల మీద ఆశతో 12 ఎకరాల్లో వరి వేసిన. ఈసారి నీళ్లు తక్కువ వచ్చాయని పొలాలకు సరిగా వదలలేదు. వారబందీ పేరుతో రావలసిన నీళ్లను కూడా మూడు రోజులుగా ఇవ్వడం లేదు. రూ.మూడు లక్షలకుపైగా పెట్టుబడి పెట్టా. నీళ్లు సక్రమంగా విడుదల చేయక పంట ఎండిపోతోంది. కొన్నేళ్లుగా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. నీళ్లు బాగుంటే మరో 45 రోజుల్లో పంట చేతికి వచ్చేది. ఇట్లాగయితే ఎలా? – సుంకరి వెంకన్న, రైతు, సీతారాంపురం, జాజిరెడ్డిగూడెం మండలం, సూర్యాపేట జిల్లా -
మల్టీపర్పస్ రోబో : పనులన్నీ చక చకా
తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న అగ్రిహబ్, ఇక్రిశాట్, టిహబ్, ఐఎస్బి, ట్రిపుల్ ఐటి, ఐఐటి హైదరాబాద్, బిరాక్లలో 2017లో ఇంక్యుబేట్ అయిన అగ్రిటెక్ స్టార్టప్ ‘ఎక్స్ మెషిన్స్’. ఈ ఇండియన్ రోబోటిక్స్, ఎఐ కంపెనీ వ్యవస్థాపకుడు త్రివిక్రమ్ కుమార్ డోగ్గా. పటాన్చెరులోని ఇక్రిశాట్లో ఎఐపి బిల్డింగ్ కేంద్రంగా ఎక్స్ మెషిన్స్ రీసెర్చ్ లాబ్ పనిచేస్తోంది. ఎక్స్ మెషిన్స్ రూ పొందించిన కృత్రిమ మేధ ఆధారిత మల్టీపర్పస్ రోబో వ్యవసాయంలో కూలీలు చేసే కలుపుతీత వంటి అనేక పనులను చక్కబెడుతుంది. పంటల సాగులో రసాయనాల వాడకాన్ని సాధ్యమైనంత తగ్గించటం, శాస్త్రీయ, సుస్థిర వ్యవసాయ సాంకేతికతలను రైతులకు అందుబాటులోకి తేవటం ఎక్స్ మెషిన్స్ లక్ష్యాలు. ప్రెసిషన్ అగ్రికల్చర్ కోసం మల్టీపర్పస్ ఎఐ బేస్డ్ రోబోలను తయారు చేస్తోంది. వ్యవసాయంతో ప్రారంభించి ఇతర పరిశ్రమలకు అవసరమైన ఎఐ రోబోలను కూడా ఈ సంస్థ రూపొందిస్తోంది. ఈ రోబోలను ఎవరూ నడపాల్సిన అవసరం లేదు. వాటంతట అవే తమ ప్రయాణాన్ని నిర్దేశించుకొని పనిచేస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. మిరప, పత్తి, పొగాకు తదితర సాళ్లుగా విత్తే పంట పొలాల్లో అన్ని మొక్కలకూ పురుగుమందుల పిచికారీలు అవసరం ఉండదు. కనీసం 30% మొక్కలకు అవసరం ఉండదని ఎక్స్ మెషిన్స్ సంస్థ అంచనా. చీడపీడల బారిన పడిన మొక్కల్ని ఎఐ టెక్నాలజీతో గుర్తించి వాటిపై మాత్రమే పిచికారీ చేయటం ఈ రోబో ప్రత్యేకత అని చెబుతున్నారు. వ్యవసాయంతో పాటు గోదాములు, లాజిస్టిక్స్, రక్షణ శాఖ అవసరాలు, ఉత్పత్తి యూనిట్లకు అవసరమైన ఎఐ రోబోలను కూడా ఈ సంస్థ రూపొందిస్తోంది.చదవండి: ‘మునగరాణి’ : అపుడు ఎన్నో అవహేళనలు..ఇపుడు నెలకు లక్ష రూపాయలు సాంకేతికత: ఎక్స్ 111– మల్టీపర్పస్ రోబోసమస్య: కూలీల కొరత రైతులకు ప్రధాన సవాళ్లలో ఒకటి. దాని అనుబంధ ఖర్చులు కూడా భారీగానే ఉంటాయి. పరిష్కారం: ఈ సవాల్ను అధిగమించడానికి ఎక్స్ మెషిన్స్ రోబోని రూపొందించింది.వ్యవసాయ పంటల్లో కలుపు సమస్య, కూలీల కొరత లేకుండా చేస్తుంది. ఇది విత్తనం వేయటం, నారు పెంపకం, మైక్రో స్ప్రేలు, ఎరువుల పిచికారీ, ఇతర పనులకు సమర్థవంతంగా ఉపయోగించవచ్చు. ఇది 8 గంటల సమయంలో 2.5 ఎకరాల్లోని కలుపు మొక్కల్ని తొలగిస్తుంది. -
రైతులకు శుభవార్త..రూ.5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్.. ఎక్కడంటే?
రైతులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతులకు శాశ్వత విద్యుత్ కనెక్షన్ను కేవలం రూ.5 మాత్రమే అందిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు. మధ్యప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ పథకాన్ని త్వరలో అమలు చేయనుంది.ఈ సందర్భంగా సీఎం మోహన్ యాదవ్ మాట్లాడుతూ... మధ్యప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం రైతులను ప్రోత్సహించడం. వారి జీవితాలను మెరుగుపరచడం. విద్యుత్ సమస్యలు లేకుండా, సాగునీటి అవసరాలను తీర్చేందుకు సౌర (సోలార్) పంప్లను ఏర్పాటు చేయబోతున్నాం. వచ్చే మూడు సంవత్సరాల్లో 30 లక్షల సోలార్ పంప్లను రైతులకు అందించేందుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు. రైతుల నుండి సౌర విద్యుత్ను ప్రభుత్వం కొనుగోలు చేయబోతుంది. తద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందే అవకాశముంది.కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో సరైన రోడ్లు, విద్యుత్, మౌలిక సదుపాయాలు లేకుండా ఇబ్బంది పడ్డాం. కానీ, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది’ అని వ్యాఖ్యానించారు. -
నమ్మించి నయ వంచన!
సాక్షి, అమరావతి : ఆచరణ సాధ్యం కాని హామీలతో అందలమెక్కిన టీడీపీ కూటమి ప్రభుత్వం అనుకున్నట్టుగానే అన్నదాతలకు మొండి చేయి చూపింది. ‘ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డ అని చెప్పుకుంటున్నారు. రైతులకు జగన్ కేవలం రూ.7,500 చొప్పునే ఇస్తున్నారు. మిగతా ఆరు వేలు కేంద్రమే ఇస్తోంది. అదే మాకు అధికారం ఇస్తే తొలి ఏడాది నుంచే ప్రతి రైతుకు మేమే రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తాం’ అంటూ ప్రజాగళంలో చంద్రబాబు గొప్పగా ప్రకటించారు. తీరా ఆచరణకు వచ్చేసరికి అన్నదాతలకు పంగనామాలు పెడుతున్నారు. రైతు సంక్షేమ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటూ.. వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయించింది కేవలం నాలుగు శాతం మాత్రమే కావడం గమనార్హం. రూ.3.22 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేవలం రూ.12,401 కోట్లు కేటాయించడం పట్ల రైతుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. గతేడాది నవంబర్లో ప్రవేశపెట్టిన తొలి ఏడాది బడ్జెట్లో అన్నదాత సుఖీభవ పథకానికి మొక్కుబడిగా రూ.1,000 కోట్లు కేటాయించారు. ఓ వైపు వైపరీత్యాలు, మరోవైపు మార్కెట్లో ధరలు లేక తీవ్రంగా నష్టపోయిన తమకు ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం ఎంతో కొంత ఊరటనిస్తుందని రైతులు ఆశగా ఎదురు చూశారు. కానీ పగ్గాలు చేపట్టి తొమ్మిది నెలలు గడిచినా తొలి ఏడాదికి సంబంధించి పైసా పెట్టుబడి సాయం విదిల్చ లేదు. వాస్తవానికి రాష్ట్రంలో రైతు భరోసా లబి్ధదారులు 53,58,368 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున జమ చేయాలంటే బడ్జెట్లో రూ.10,717 కోట్లు కేటాయించాలి. కానీ కేటాయించింది కేవలం రూ.6,300 కోట్లే. ఈ మొత్తం రూ 20 వేల చొప్పున అర్హులైన రైతులకు చెల్లిస్తే కేవలం 31.50 లక్షల మందికి మాత్రమే సరిపోతుంది. అంటే వాస్తవ లబ్ధిదారుల్లో 22.08 లక్షల మందికి పెట్టుబడి సాయం అందదు. మరో పక్క కౌలు రైతులకు తామే పూర్తిగా పెట్టుబడి సాయం అందిస్తామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం.. పెట్టుబడి సాయంలో ఇలా రూ.4,417 కోట్ల మేర కోత పెట్టడం పట్ల రైతాంగం నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. ఆర్ఎస్కేలు, అగ్రి ల్యాబ్ల నిర్వహణకు కేటాయింపులు నిల్ ఆర్బీకే, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ల నిర్వహణకు బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. ఆర్బీకేలను కుదించాలని ఇప్పటికే నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం అగ్రి ల్యాబ్లను పీ–4 పద్దతిలో ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నామని ఇటీవలే ప్రకటించింది. అందువల్లే వీటి నిర్వహణకు కేటాయింపులు జరపలేదనే వాదన విని్పస్తోంది. ధరల స్థిరీకరణ నిధికి వైఎస్ జగన్ హయాంలో రూ.3 వేల కోట్లు కేటాయిస్తే, చంద్రబాబు ప్రభుత్వం రూ.300 కోట్లు విదిల్చింది. విపత్తుల బారిన పడి పంటలు నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు ప్రకృతి వైపరీత్యాల సహాయనిధి కింద గత జగన్ ప్రభుత్వం రూ.2 వేల కోట్లు కేటాయిస్తే, చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్లో పైసా కూడా కేటాయించ లేదు. విత్తన రాయితీ పథకానికి గతేడాది రూ.268 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది పెంచకపోగా రూ.240 కోట్లకు కుదించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పాడి రైతులకు పశువుల మేత కోసం బంజరు భూముల కేటాయింపు కోసం నిధులు, గోపాల మిత్రల పునర్నియామకం ఊసే లేదు. రాయితీపై సోలార్ పంపు సెట్ల ఏర్పాటుకు కూడా నిధులు కేటాయించలేదు. రైతు కూలీలకు కార్పొరేషన్ స్థాపించి రాయితీలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్న హామీ ప్రస్తావన లేదు. పట్టు పరిశ్రమకు 2023–24 బడ్జెట్తో పోల్చితే భారీగా కోత పెట్టింది. ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసి, స్వచ్ఛంద బీమా నమోదు పథకం తీసుకొచ్చారు. ఈ పథకానికి రూ.1,023 కోట్లు మాత్రమే కేటాయించారు. గత ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా కోసం ఏటా రూ.1,700 కోట్లు కేటాయించారు. అలాగే వడ్డీ లేని పంట రుణాల కోసం వైఎస్ జగన్ సర్కారు హయాంలో ఏటా రూ.500 కోట్లు కేటాయించగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ మొత్తాన్ని సగానికి సగం తగ్గించింది. కేవలం రూ.250 కోట్లు మాత్రమే కేటాయించింది. ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించడం వల్ల ఖరీఫ్ 2024–25 లో 69.51 లక్షల ఎకరాలకు బీమా కవరేజ్ పొందగా, స్వచ్ఛంద బీమా నమోదు పథకాన్ని అమలు చేయడంతో రబీ 2024–25 సీజన్లో కేవలం 7.65 లక్షల మంది రైతులు 9.93 లక్షల ఎకరాలకు మాత్రమే కవరేజ్ పొందగలిగారు. గడిచిన రబీ సీజన్తో పోల్చుకుంటే మూడో వంతు రైతులకు కూడా రక్షణ లేకుండా పోయింది. పాత లబ్దిదారులకే వేట నిషేధ భృతిగద్దెనెక్కగానే వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారునికి రూ.20 వేల చొప్పున వేట నిషేధ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. 2024–25 సీజన్కు 1,30,128 మంది అర్హత పొందగా, వారికి రూ.260.26 కోట్లు జమ చేయాల్సి ఉంది. కాని ఏడాది గడిచినా పైసా విదల్చలేదు. అనర్హులున్నారంటూ రీ సర్వే పేరిట అర్హులను తొలగించి, తమ పార్టీ సానుభూతిపరులను చేర్చి 1,22,968 మంది అర్హత పొందినట్టుగా లెక్క తేల్చారు. వారికి రూ.245.94 కోట్లు జమ చేయాలని ప్రతిపాదనలు పంపారు. అదే విషయాన్ని బడ్జెట్లో ప్రస్తావించారు. కానీ 2025–26 సీజన్లో వేటకు వెళ్లే మత్స్యకారులకు నిషేధ భృతి కోసం కేటాయింపులు జరపక పోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఆక్వా, నాన్ ఆక్వాజోన్తో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ యూనిట్ విద్యుత్ రూ.1.50కే సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. అర్హత కలిగిన 68,134 ఆక్వా కనెక్షన్లకు విద్యుత్ సబ్సిడీ విస్తరిస్తున్నట్టు ప్రకటించినప్పటికీ ఆ మేరకు కేటాయింపులు జరపలేదు. ఎప్పటిలోగా అమలు చేస్తామన్న స్పష్టతా ఇవ్వలేదు. మరో వైపు ఆక్వా రైతులకు సబ్సిడీపై ఏరియేటర్స్, సబ్సిడీపై ట్రాన్స్ ఫార్మర్స్ ఏర్పాటు, కోల్డ్ స్టోరేజ్ల నిర్మాణం వంటి హామీలపై పైసా కేటాయింపు జరపక పోవడంపై ఆక్వా రైతులు మండిపడుతున్నారు. మత్స్య యూనివర్సిటీకి మొండి చేయి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయంతో పాటు వైఎస్సార్ ఉద్యాన, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయాలకు అరకొరగానే కేటాయింపులు జరిపారు. ఆంధ్రప్రదేశ్ మత్స్య యూనివర్సిటీకి కేవలం రూ.38 కోట్లు మాత్రమే కేటాయించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ యూనివర్సిటీకీ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సమీపంలో 400 ఎకరాల్లో రూ.332 కోట్ల అంచనాతో భవన నిర్మాణాలకు ప్రతిపాదించారు. రూ.100 కోట్లతో పరిపాలన భవనం, అకడమిక్ బ్లాక్, బాలుర, బాలికల హాస్టల్స్, రైతు శిక్షణా కేంద్రం, వైస్ చాన్సలర్ బంగ్లా నిర్మాణ పనులు చేపట్టారు. ఈ వర్సిటీకి గతేడాది పైసా ఖర్చు చేయలేదు. ఈ ఏడాది పైసా కేటాయింపులు జరపలేదు. మరోవైపు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ జెట్టీల నిర్మాణానికి సైతం పైసా కేటాయించలేదు. దీంతో వీటి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. -
బాసట్.. చెరకు రసానికి బాసట!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వేసవి వచ్చిందంటే చాలు.. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో, శివారు ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో రోడ్ల పక్కన అనేకచోట్ల చెరకు రసం (కేన్ జ్యూస్) బండ్లు కనిపిస్తుంటాయి. చెరకు రసాన్ని ఇష్టంగా తాగేవారు చాలామందే ఉంటారు. చెరకు నుంచి చక్కెర, బెల్లం తయారు చేస్తారనేది అందరికీ తెలిసిందే. అయితే రసం కోసం ఓ ప్రత్యేకమైన చెరకు పంట ఉంది. అదే ‘బాసట్’. చెరకును సాగు చేసే సంగారెడ్డి జిల్లా రైతులు.. స్థానికంగా ‘బాసట్’ పేరుతో 62175 చెరకు రకాన్ని సాగు చేస్తున్నారు. ఈ చెరకు తెల్ల రంగులో ఉండటంతో పాటు, ఇందులోంచి రసం (జ్యాస్) ఎక్కువగా వస్తుంది. అలాగే ఈ చెరకుకు పూత ఉండదు. దీంతో జ్యూస్ ఎంతో రుచికరంగా ఉంటుంది. సాధారణంగా చక్కెర కర్మాగారాలకు తరలించే చెరుకులో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. కానీ ఈ రకంలో జ్యూస్ ఎక్కువగా వస్తుంది.సుమారు రెండు వేల ఎకరాల్లో..ఈ ప్రత్యేక వెరైటీ చెరకును సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ డివిజన్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. సుమారు రెండు వేల ఎకరాల్లో ఈ ప్రత్యేక రకం సాగ వుతోంది. జహీరాబాద్ మండలంతో పాటు, ఝరా సంఘం, మొగుడంపల్లి, కొహీర్ మండలాల పరిధి లో ఈ బాసట్ రకం ఎక్కువగా సాగవుతోంది. ఏటా ఫిబ్రవరి నుంచే వ్యాపారులు ఇక్కడికి వచ్చి రైతుల వద్ద చెరకును కొనుగోలు చేసి తీసుకెళుతుంటారు.ఎండలు ముదిరితే డిమాండ్ఎండల తీవ్రత ఎక్కువైతే ఈ చెరకుకు డిమాండ్ మరింత పెరుగుతుంది. ఎందుకంటే వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు ఎక్కువమంది చెరుకు రసం తాగుతుంటారు. దీంతో ఏప్రిల్, మే మాసాల్లో టన్ను రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు పలుకుతుంది. ఒకవేళ మే లోనే వర్షాలు ప్రారంభమైతే ధరను తగ్గిస్తుంటారు. సాధారణంగా టన్ను రూ.3 వేల వరకు ఉంటుంది.రెండేళ్లుగా సాగు చేస్తున్నా..గత రెండు సంవత్సరాలుగా ఈ బాసట్ చెరకు పండిస్తున్నా. పది నెలల్లో పంట చేతికందుతుంది. ఇటీవలే పంట నరికి రెండురోజుల క్రితం హైదరాబాద్కు సరఫరా చేశా. టన్నుకు రూ.3 వేల చొప్పున రేటు వచ్చింది. ఎండాకాలం వస్తే చెరకు రసానికి డిమాండ్ పెరుగుతుంది. దీంతో బాసట్ చెరకును ఎక్కువగా తీసుకెళుతుంటారు. ఫ్యాక్టరీ చెరకు సాగు కంటే ఇది కొంత మేలే. – తెనుగు శేఖర్, చెరకు రైతు, ఈదుల్పల్లి, సంగారెడ్డి జిల్లారసం వస్తుందనే వ్యాపారులు కొంటారు..రెండు ఎకరాల్లో బాసట్ రకం వేశా. హైదరాబాద్ నుంచి వ్యాపారులు వచ్చి ఈ చెరకును కొనుగోలు చేస్తుంటారు. ఎండాకాలం వస్తే డిమాండ్ పెరుగుతుంది. రసం బాగా వస్తుందనే ఈ రకాన్ని ఎక్కువగా తీసుకెళుతుంటారు. – మొగులప్ప, చెరకు రైతు,రాయికోడ్, సంగారెడ్డి జిల్లా -
చంద్రబాబు జస్ట్ బిల్డప్ బాబాయ్ అంతే!
విపక్షంలో ఉన్నప్పుడు.. నోటికొచ్చిన ఆరోపణలు చేయడం, అధికారంలోకి వస్తే.. ఎక్కడా లేని నీతులు చెప్పడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఈ విద్యలో ఆరితేరారు. దానికి బిల్డప్ బాబాయిలుగా పేరొందిన ఈనాడు, ఆంధ్రజ్యోతి.. లాంటి ఎల్లో మీడియా భజన ఎటూ ఉంటుంది. ఈమధ్య.. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) గుంటూరు మిర్చియార్డులో రైతులను పరామర్శించడానికి వెళ్లారు. గిట్టుబాటు ధరలు రాక రైతులు విలవిలలాడుతున్న తరుణంలో జగన్ అక్కడకు వెళితే.. ఆ పర్యటనను చంద్రబాబు తీవ్రంగా తప్పు పడుతున్నారు!. రైతులు కష్టాలలో ఉంటే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకాని, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాని పరామర్శ చేసి.. వారిని ఆదుకోవడానికి ఏ చర్యలు తీసుకునేది చెప్పలేదు. పైగా జగనే ఏదో తప్పు చేశాడని చంద్రబాబు పదే పదే అంటున్నారు. శాసనమండలి గ్రాడ్యుయేట్ల నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయట!. కోడ్ అమలులోకి వచ్చిందట!. అందుకే రైతులను ఎవరూ పలకరించి వారి కన్నీరు తుడవరాదట!. రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలట!. ఏమైనా అర్ధం ఉందా?.. అసలు మిర్చియార్డులో పడిగాపులు పడుతున్న రైతుల వద్దకు ఎవరూ వెళ్లరాదని ఎన్నికల కమిషన్ ఎక్కడైనా చెప్పిందా?. విచిత్రం ఏంటంటే.. ఇదే ఎన్నికల సంఘంపై ముఖ్యమంత్రిగా ఉండి 2019లో చంద్రబాబు(Chandrababu) ఎన్ని విమర్శలు చేశారో తెలియదా?. ఏకంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఛాంబర్కు వెళ్లి దబాయించి గొడవ చేశారు. మరి ఇప్పుడేమో సుద్దులు చెబుతున్నారు. కరోనా సమయంలో ర్యాలీల మాదిరి వెళ్లవద్దని, సభలు జరపవద్దని దేశ వ్యాప్తంగా నిబంధనలు వస్తేనే పట్టించుకోని పెద్దమనిషి చంద్రబాబు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు శాంతిభద్రత ల సమస్యలు వస్తాయని ,ఫలానా చోటకు వెళ్లవద్దని పోలీసులు వారించినా, వారిని తోసుకుని మరీ వెళ్లిన చరిత్ర చంద్రబాబుది. 👉అనపర్తి వద్ద అప్పట్లో ఏమి చేశారో గుర్తు లేదేమో!. మదనపల్లె సమీపంలోని అంగళ్లు వద్ద వైఎస్సార్సీపీవాళ్లను చూపిస్తూ.. తన్నండి.. అంటూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. అధికారంలోకి రాగానే ఫిర్యాదుదారుని బెదిరించి ఆ కేసు లేకుండా చేసుకోవడానికి ప్రయత్నించిన చంద్రబాబు చట్టం గురించి చెబుతున్నారు. 👉పుంగనూరు వద్ద తన సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు పోలీసుల వ్యాన్ను తగలబెట్టి, రాళ్లతో పోలీసులపై దాడి చేస్తే ఒక కానిస్టేబుల్ కన్నుపోయింది. ఆ ఘటనలో కనీసం సానుభూతి తెలపని చంద్రబాబు.. ముఖ్యమంత్రి కాగానే ఎక్కడాలేని చట్టాలు, నీతులు చెబుతుంటారు. పోనీ ఆయన ఏమైనా కోడ్ ఉందని ఏ కార్యక్రమం ప్రచారం చేయకుండా ఉంటున్నారా?. విజయవాడలో ఏకంగా మ్యూజిక్ నైట్ పెట్టుకుని ఎంజాయ్ చేశారే! అప్పుడు కోడ్ అడ్డం రాలేదా? రైతులను పరామర్శ చేస్తేనే కోడ్ వచ్చిందా?.. .. గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లినందుకు జగన్తో సహా ఎనిమిదిమందిపై కేసులు పెట్టారు. మరి అక్కడలేని మాజీ మంత్రి పేర్నినానిపై కూడా కేసు పెట్టాలని ఏ చట్టం చెబుతోంది?. మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ వెళితే భద్రత కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత కాదా?. అయితే సీఎంగా ఉండి ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించడమే కాకుండా.. ఎదురు ఆరోపణలు చేయడం చంద్రబాబుకే చెల్లుతుంది మరి. ఆయన మరికొన్ని చిత్రమైన ప్రకటనలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ రైతులకు ఏమీ చేయలేదట..! రైతులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదట. ఇంతకన్నా పచ్చి అబద్దాలు ఏమైనా ఉంటాయా?. రైతుల కోసం ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్ర వ్యవస్థను తెచ్చి వాటి ద్వారా వాళ్లకు అవసరమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు అందించడంతో పాటు పంటల సలహలు, పంట కొనుగోళ్లు.. అన్నీ చేసిందే జగన్. అలాంటి నాయకుడిపై ఇలాంటి విమర్శ చేయడానికి చంద్రబాబు మనసు ఎలా వచ్చిందో అర్ధం కాదు. గతంలో ఎరువుల షాపుల వద్ద రైతులు తమ చెప్పులు క్యూలలో ఎట్టుకుని పడిగాపులు పడి ఉండవలసి వచ్చేది. ఆ పరిస్థితిని తప్పించి రైతులకు గౌరవం తెచ్చిన వ్యక్తి జగన్. దేశంలోనే మొదటిసారిగా రైతులకు పెట్టుబడి సాయం పధకాన్ని ప్రకటించిన రాజకీయ పార్టీ వైఎస్సార్సీపీ. అధికారంలోకి వచ్చాక అన్ని పార్టీల్లా హామీలను ఎగ్గొట్టకుండా.. దానిని అమలు చేసి చూపారాయన. ఏడాదికి రూ13,500 చొప్పున సాయం అందించడం ఒక ఎత్తు అయితే.. ఆయా పంటల ధరల స్థిరీకరణకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది జగన్ కాదా?టమోటా తదితర పంటలకు ధర తగ్గినప్పుడు వెంటనే జోక్యం చేసుకుని మార్కెట్ పెంచింది జగన్ ప్రభుత్వం కాదా?ఇప్పుడేమో కనీసం రైతులను పలకరించని చంద్రబాబేమో.. చాలా చేసేస్తున్నారని ఎల్లో మీడియా బిల్డప్ ఇస్తే సరిపోతుందా?పాపం!గత ఏడాది 21 వేల నుంచి 27 వేల రూపాయల వరకు మిర్చి ధర పలికితే ,ఈసారి అందులో సగం కూడా ఇప్పుడు రావడం లేదని రైతుల ఆక్రోశం. కేంద్రం కూడా దీనిపై తూతూమంత్రంగా వ్యవహరిస్తోంది. అయినా మిర్చి రైతులకు ఊరట అని ఈనాడు బిల్డప్. అవును డబ్బులు ఊరికే రావు.. అన్నట్లుగా ఈనాడుకు చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఆ స్థాయిలో లాభం ఉంటోంది కదా!👉కొందరు రైతులు ఇప్పుడు ఓపెన్గానే చెబుతున్నారు.. 20వేల రూపాయల పెట్టుబడిసాయం ఇస్తామని చంద్రబాబు వాగ్దానం చేస్తే నమ్మి ఓట్లు వేశామని.. తీరా చూస్తే ఇరవై రూపాయలు కూడా ఇవ్వలేదని ఆవేదన చెందుతున్నారు. యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు విజయ్ కేసరి చేసిన వీడియో ఆసక్తికరంగా ఉంది. 👉పవన్ కల్యాణ్ సినిమా టిక్కెట్ల రేట్లు పెంచుకోవడం కోసం ఎంతలా మాట్లాడారు?. సినిమా నిర్మాణానికి పెట్టుబడి ఎలా పెరిగింది?.. తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. దానికి చంద్రబాబు కూడా మద్దతు ఇచ్చారు. ఈ పాయింట్నే విజయ్ కేసరి ప్రముఖంగా ప్రస్తావించారు 👉సినిమా టిక్కెట్ల ధరలు , మద్యం ధరలు పెంచుకోవడానికి చూపిన శ్రద్ద.. రైతుల ఉత్పత్తుల ధరలకు చూపరా? అని విజయ్ కేసరి ప్రశ్నించారు. అలాగే.. రైతులకు పెట్టుబడి వ్యయం పెరగలేదా? అని ఆయన అడిగారు. ఇవి వాస్తవాలు. 👉మిర్చి రైతుల విషయంలో ప్రభుత్వమే చొరవ తీసుకుని కొనుగోళ్లకు రంగంలో దిగాల్సింది. కానీ, ఆ పని చేయకపోగా.. జగన్ పైనే ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రానికి ఆయన ఒక లేఖ రాసి చేతులు దులుపుకున్నారు. 👉చంద్రబాబు ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న విధానాలను తప్పుపడుతూ జగన్ కూడా పలు వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 15న మ్యూజికల్ నైట్ జరుపుకోవడానికి కోడ్ అడ్డం కాలేదా? అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి వెళ్లి.. రైతుల సమస్యలపై వెళ్లినట్లు కలరింగ్ ఇవ్వడమేమిటని చంద్రబాబును జగన్ నిలదీశారు. 👉ధాన్యం కొనుగోళ్లకు తమ హయాంలో 65వేల కోట్లు వ్యయం చేశామని, ఇతర పంటలకు స్థిరీకరణ నిధి ద్వారా సుమారు రూ.7,800 కోట్ల వ్యయం చేశామని కూడా జగన్ చెప్పారు. మిర్చియార్డులో ఓట్ల ప్రస్తావన తేకపోయినా, మైక్ వాడకపోయినా,అసలు ఎన్నికలలో తమ పార్టీ పోటీచేయకపోయినా కేసులు పెట్టారని, దీనికి భయపడేది లేదని.. రైతుల తరపున పనిచేస్తామని జగన్ స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడూ ఇలా రైతుల సమస్యలపై పనిచేసిన రాజకీయ పార్టీల నేతలపై కేసులు పెట్టిన సందర్భాలు లేవు. ఏదో ఒక వంకతో మాజీ సీఎంకు భద్రత కల్పించకపోవడం.. పైగా తప్పుడు కేసులు పెట్టడం అంతా రెడ్ బుక్ పిచ్చి కుక్క ప్రభావంగానే వైఎస్సార్సీపీ భావిస్తోంది. ఒక్కటి మాత్రం వాస్తవం. ఉమ్మడి ఏపీలో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి చూపించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అదే.. ఉచిత విద్యుత్ ఇవ్వడానికి వీలు లేదని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రైతుల రుణాలు మాఫీ అవ్వడానికి రాజశేఖరరెడ్డి కృషి చేస్తే.. తాకట్టులో ఉన్న బంగారంతో సహా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి చేతులెత్తేసిన నేతగా చంద్రబాబు చరిత్రకెక్కారు. అలాగే.. రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న నేత జగన్. అదే.. రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఇరవైవేల రూపాయల సాయం చేస్తామని చెప్పి.. ఏడాది గడిచినా ఆ హామీని గాలికొదిలేసిన నేతగా చంద్రబాబు మిగిలిపోయారు. అయినా ఎల్లో మీడియా ద్వారా రైతన్నపై ఫోకస్ పెట్టారంటూ, మిర్చి రైతుకు ఊరట వచ్చేసిందంటూ బిల్డప్ ఇచ్చుకుని చంద్రబాబు అండ్ కో సంతోషపడవచ్చు. కాని దానివల్ల రైతులకు ఒరిగేది ఏమి ఉంటుంది?..:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
టీడీపీ వర్సెస్ బీజేపీ
సాక్షి, పుట్టపర్తి: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అనుచరులు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అనుయాయుల మధ్య భూ వివాదం రచ్చకెక్కింది. ఇరు వర్గాలు తరచూ ఘర్షణలకు దిగుతుండడంతో చుట్టుపక్కల రైతులు.. కియా కార్ల పరిశ్రమ వద్ద ఉన్న చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నేళ్లుగా తెగని భూ పంచాయితీతో పదేపదే పోలీస్ స్టేషన్కు వెళ్లడం, దారులు మూసేయడం, జేసీబీలతో రోడ్లు ధ్వంసం చేస్తుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా రాడ్లు, కర్రలతో గొడవకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. విలువ పెరగడంతో వివాదం కియా కార్ల కంపెనీ వచ్చిన సమయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పల్లె రఘునాథరెడ్డి, మరో ముగ్గురు కలిసి సుమారు 251 ఎకరాలు కొన్నారు. అప్పట్లో ఎకరా సగటున రూ.20 లక్షలు కూడా లేదు. ఇప్పుడు ధరలు విపరీతంగా పెరిగాయి. మొత్తం భూమిలో రోడ్డు పక్కనే ఉన్నదానిని, ఇతర భూమిని భాగాలుగా చేసి, విలువ కట్టి ఎవరికివారుగా అగ్రిమెంట్లు చేసుకుని కొంత భూమి అమ్ముకున్నారు. ప్రస్తుతం రోడ్డుకు ఆనుకుని ఉన్న సుమారు 50 ఎకరాలపై పల్లె రఘునాథరెడ్డి, ముదిగుబ్బ ఎంపీపీ, బీజేపీ నేత ఆదినారాయణ మధ్య వివాదం రేగింది. ఈ క్రమంలోనే మంత్రి సత్యకుమార్ సన్నిహితుడైన ఎంపీపీ ఆదినారాయణ అనుచరులు ఆదివారం సాయంత్రం కియా వద్ద ఉన్న భూమిలోకి వెళ్లారు. పల్లె రఘునాథరెడ్డి అనుచరుడైన ప్రభాకర్ యాదవ్పై దాడి చేశారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగడంతో తర్వాత సద్దుమణిగింది. సీఎం వరకు ఫిర్యాదులు వివాదాస్పద భూమిలోకి వెళ్లే రోడ్డును గతంలో మాజీ మంత్రి ధ్వంసం చేయించారు. ఫలితంగా రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. ఆ మార్గంలో గోదాములకు వాహనాలు వెళ్లడం కష్టమైంది. దీనిపై బాధితులు జిల్లా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. అంతేకాక సదరు కంపెనీ యాజమాన్యం సీఎం చంద్రబాబుకు కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు పంపింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అద్దె చెల్లించినా.. సరుకు నిల్వ చేసుకునేందుకు వాహన రాకపోకలకు ఇబ్బంది కలిగిందని వాపోతున్నారు.ఆదినారాయణ నుంచి ప్రాణ హాని.. ‘‘ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ నుంచి నాకు ప్రాణహాని ఉంది. నవంబరు ఆఖరులో గొడవకు దిగడంతో కియా పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిర్యాదు చేశా. కేసు కూడా నమోదైంది’’ అని ప్రభాకర్ చెప్పారు. ‘పల్లె’ చిల్లర వేషాలు మానుకోవాలి.. తమ భూమిని ఆక్రమించి పల్లె రఘునాథ్రెడ్డి కాంపౌండ్ వేయడంతోనే సమస్య వచి్చందని ఆదినారాయణ అంటున్నారు. ఈ తగాదా ఏడేళ్లుగా నడుస్తోందని, పల్లె చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించా. లేదంటే రానున్న రోజుల్లో మరిన్ని పరిణామాలు చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. మంత్రి సత్యకుమార్ జిల్లాకు వచ్చి ఎనిమిది నెలలే అవుతోందని.. వివాదంలోకి ఆయనను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. -
చింత.. నిశ్చింత..
సాక్షి, పుట్టపర్తి: అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో అనేక గ్రామాల ప్రజలు చింత చెట్టును నమ్ముకుని నిశ్చింతగా జీవనం సాగిస్తున్నారు. మడకశిర నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి దాదాపు 20 వేల కుటుంబాలు చింతచెట్లనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 334 గ్రామాలు ఉండగా.. సుమారు 2 లక్షల చింతచెట్లు (Tamarind Trees) ఉన్నాయి. ప్రధాన మార్కెట్ అయిన హిందూపురం (Hindupur) మార్కెట్కు వచ్చే సరుకులో అత్యధికంగా మడకశిర నుంచే వస్తుంది. గత మూడేళ్ల నుంచి చింత రైతులకు కూలీ వ్యయం బాగా పెరిగింది. చింతపండు ధర మాత్రం యథావిధిగా ఉండటంతో ఆశించిన స్థాయిలో లాభాలు రావడం లేదని రైతులు చెబుతున్నారు. చింతకాయలు కోసేందుకు కూలీలకు రోజుకు రూ.800 చొప్పున ఇవ్వాలి. మిగతా నూర్పిడి పనులకు అయితే రోజుకు రూ.300 ఇస్తారు.చింతపండును శుద్ధి చేసి మార్కెట్కు తరలించేందుకు క్వింటాల్కు రూ.2 వేల చొప్పున అదనంగా భరించాల్సి ఉంటుంది. పండు బాగా ఉంటే నాణ్యత ఆధారంగా క్వింటాల్ రూ.30 వేల వరకు ధర పలుకుతుంది. సరుకు బాగా లేకపోతే ధరలో వ్యత్యాసం ఉంటుంది. కొందరు సరిగా శుద్ధిచేయలేక తక్కువ ధరకు విక్రయిస్తుంటారు. హిందూపురం యార్డ్లో విక్రయాలు.. ఏటా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు వారానికి రెండు రోజులు (సోమ, గురు) చొప్పున హిందూపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో చింతపండు విక్రయాలు జరుగుతాయి. సీజన్లో గరిష్టంగా 28 సార్లు అమ్మకాలు ఉంటాయి. మార్కెట్ యార్డులో సుమారు 70 ట్రేడ్ ఏజెన్సీలు ఉన్నాయి. ఒక్కో ఏజెన్సీ నుంచి సగటున 100 టన్నుల చింతపండు ఎగుమతి అవుతుంది. అందులో సగంపైగా మడకశిర నియోజకవర్గం నుంచి వస్తుండటం విశేషం. మిగతా సరుకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి చేరుతుంది. సీజన్ ముగిశాక శీతల గిడ్డంగుల్లోకి.. రైతుల నుంచి సేకరించిన సరుకును హిందూపురం మార్కెట్లో బాక్సుల్లో నింపి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. సీజన్ పూర్తయ్యే లోగా మిగిలిన సరుకును స్థానికంగా ఉన్న శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచుతారు. లారీ చింతపండుకు ఏడాదికి రూ.25 వేలు చొప్పున అద్దె చెల్లించి శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచుతారు. మడకశిరకు సమీపంలోనే హిందూపురం ఉండటంతో రైతులకు రవాణా ఖర్చులు కూడా కలిసివస్తాయి. ఈ సారి ఖర్చు పెరిగింది గతంతో పోలిస్తే ఈసారి ధరలు స్థిరంగా ఉన్నాయి. నేను 16 ఏళ్ల నుంచి చింత చెట్ల నుంచి ఫలసాయం పొందుతున్నా. ప్రతి ఏటా లాభాలు వచ్చేవి. అయితే ఈసారి మాత్రం ఖర్చు పెరిగింది. ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు. స్థానికంగా మార్కెట్ సౌకర్యం కల్పిస్తే రవాణా ఖర్చులు మిగులుతాయి. – రైతు జయరామప్ప, మెట్టబండపాళ్యం, మడకశిర మండలం దిగుబడి తగ్గింది మా తోట చుట్టూ 25 చింత చెట్లు ఉన్నాయి. ఈ ఏడాది వింత రోగం వచ్చి దిగుబడి తగ్గింది. అందుకే ఒక్కో చెట్టును రూ.2 వేల చొప్పున వ్యాపారికి అమ్మేశాను. దిగుబడి బాగా ఉండి ఉంటే చెట్టు రూ.3 వేలు పైగా ధర పలికేది. – వీరాముద్దప్ప, మద్దనకుంట, అమరాపురం మండలం చింతపండు మార్కెట్ – హిందూపురం లావాదేవీలు – ప్రతి సోమ, గురువారం సీజన్ – ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ యార్డ్లో ట్రేడ్ ఏజెన్సీలు – 70 ఒక్కో ఏజెన్సీ నుంచి – 100 టన్నులవరకు ఎగుమతి -
‘రామోజీ ఫిలింసిటీ’ కబ్జాలపై రైతుల ఆందోళన
సాక్షి,రంగారెడ్డిజిల్లా : రామోజీ ఫిలింసిటీ భూ ఆక్రమణల వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఫిలింసిటీ కోసం తమ భూములు ఆక్రమించారని అబ్దుల్లాపూర్మెట్ మండలం అనాజ్పూర్ గ్రామ రైతులు శుక్రవారం(ఫిబ్రవరి21) ఉదయం ఆందోళన చేపట్టారు.వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఫిలింసిటీకి వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. రైతుల భూములను ఆక్రమించిన రామోజీ ఫిలింసిటీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిలింసిటీ కబ్జాలో ఉన్న తమ భూములను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్లో వేల ఎకరాల్లో రామోజీ ఫిలింసిటీ నిర్మాణానికిగాను చుట్టుపక్కల ఉన్న రైతులు, ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారని ఫిలింసిటీ యాజమాన్యంపై గతంలో పలువురు ఆరోపణలు చేశారు. తాజాగా అనాజ్పూర్ రైతులు ఇదే విషయమై ఆందోళన చేపట్టడంతో కబ్జాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. -
రైతుల పట్ల ఇదేనా చిత్తశుద్ధి?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు వెళ్తూ.. మిరప రైతుల సమస్యలపై కేంద్రంతో చర్చించేందుకు వెళ్తున్నట్లు ఎందుకీ కలరింగ్..? ఎవరి కోసం ఈ కలరింగ్..? ఇదేనా రైతుల పట్ల మీ చిత్తశుద్ధి? అని ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) పై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan mohan Reddy)ధ్వజమెత్తారు.ఈ ప్రభుత్వం కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకోవాల్సింది పోయి.. వారికి బాసటగా వెళ్లిన తమపై కేసులు బనాయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. మిరప రైతుల విషయంలో టీడీపీ కూటమి సర్కారు వ్యవహరిస్తున్న తీరును తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా ఎండగట్టారు. ట్వీట్లో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..⇒ తెగుళ్లతో మిర్చి దిగుబడులు ఎకరాకు 10 క్వింటాళ్లకు పడిపోయిన దుస్థితి నెలకొంది. కొనేవారు లేక క్వింటాల్ రూ.10 వేలకు రైతులు తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి. పెట్టుబడి ఖర్చులు చూస్తే ఎకరాకు రూ.1.50 లక్షల పైమాటే. కోతల అనంతర ఖర్చులు దీనికి అదనం. ఇంతటి సంక్షోభం కళ్లెదుట కనిపిస్తున్నా.. మేం స్పందించేంతవరకూ మీలో కదలిక లేదు. మీరు ఢిల్లీ నూతన సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్తూ.. మిర్చి రైతుల కోసమే వెళ్తున్నట్లు యథావిధిగా కలరింగ్ ఇస్తున్నారు.⇒ కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ ఎప్పుడూ, ఏ రాష్ట్రంలోనూ, ఎక్కడా మిర్చిని కొనుగోలు చేయలేదని తెలిసి కూడా లేఖ రాయడం ఏమిటి? మీ బాధ్యతను వేరేవాళ్ల మీద నెట్టడం ఏమిటి? మీరు చేయాల్సిన పనులు చేయకుండా సాకులు వెతుక్కోవడం ఏమిటి? ఈ రకంగా రైతులను మోసం చేస్తున్నారు. ⇒ 2021లో పెట్టుబడి ఖర్చులు ఎకరాకు రూ.లక్ష ఉన్నప్పుడు.. ఎకరాకు 20 క్వింటాళ్ల్లకుపైగా దిగుబడులు వచ్చినప్పుడు కనీస మద్దతు ధర రూ.7 వేలుగా నిర్ణయించాం. గతంలో మీరెప్పుడూ మిర్చికి కనీస మద్దతు ధరలు ప్రకటించలేదు. ఐదేళ్ల క్రితం.. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం మద్దతు ధర ప్రకటించని పంటలతోపాటు మరికొన్ని పంటలను అదనంగా చేర్చి మొత్తంగా 24 పంటలకు మద్దతు ధరలు ప్రకటించి పోటీ వాతావరణంతో ధరలు పడిపోకుండా అడ్డుకోవడమే కాకుండా ధరలు పెరిగేటట్టు చూశాం.⇒ ఆ ధరలు ప్రకటించి ఇప్పటికి ఐదేళ్లు అయింది. మరి ఐదేళ్ల తర్వాత పెట్టుబడి ఖర్చులు పెరగవా? అప్పట్లో మిర్చి సాగుకు ఎకరాకు రూ.లక్ష ఖర్చు అయితే ఇప్పుడు రూ.లక్షన్నరకు పైగా వ్యయం అవుతున్న మాట వాస్తవం కాదా? దీనికి కోతల అనంతర ఖర్చులు అదనమన్న విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు కొత్త మద్దతు ధరలు ప్రకటించి రైతులను ఆదుకోవడానికి మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? రాష్ట్ర ప్రభుత్వమే ఎందుకు కొనుగోలు చేయడం లేదు? ⇒ మా హయాంలో (వైఎస్సార్ సీపీ ప్రభుత్వం) మిర్చి రైతులకు మంచి ధరలు వచ్చాయని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు రాసిన లేఖలో మీరే చెప్పారు. మీరు రాసిన లేఖ ప్రకారమే మా హయాంలో మిర్చికి మోడల్ ధర రూ.20 వేలు ఉంటే గరిష్ట ధర రూ.27 వేలు పలకడం వాస్తవం కాదా?⇒ మిర్చి రైతుల కడగండ్లపై ఈ జనవరిలో ఉద్యాన శాఖ అధికారులు నివేదించిన తర్వాత అయినా మీరేమైనా కనీసం పట్టించుకున్నారా? మిర్చి రైతుల పరిస్థితి అన్యాయంగా ఉందని, ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని నివేదిక ఇచ్చినా ఎందుకు పట్టించుకోలేదు? పైగా తప్పుడు రాజకీయాలు చేస్తూ, మిర్చి కొనుగోళ్లతో సంబంధం లేని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి చేతులు దులుపుకొంటారా? మీ చేతిలో ఉన్న మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేయకుండా ఎప్పుడూ మిర్చి కొనుగోళ్లు చేయని నాఫెడ్ ద్వారా కొనాలంటూ లేఖ రాయడం రైతులను నిలువునా మోసం చేయడం, మభ్యపెట్టడం కాదా? ⇒ మిర్చి రైతులకు బాసటగా వెళ్లినందుకు మాపై కేసులు పెట్టారు. మరి ఫిబ్రవరి 15న మీరు పాల్గొన్న మ్యూజికల్ నైట్కు ఎన్నికల కోడ్ అడ్డం రాలేదా? నేను మిర్చి రైతులను కలుసుకుంటే ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిందా? పైగా మేం ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. నిన్నటి కార్యక్రమంలో ఫలానా వారికి ఓటు వేయమని కూడా చెప్పలేదు. కనీసం మైక్లో కూడా మాట్లాడలేదు. అయినా అన్యాయంగా కేసులు మోపడం అప్రజాస్వామికం కాదా?⇒ మీ హయాంలో పంటలకు కనీస మద్దతు ధరలు లభించడం లేదన్నది వాస్తవం కాదా? పత్తి, పెసర, మినుము, కంది, టమాటా, మిర్చి, మొన్న ధాన్యం సహా అన్ని పంటల రైతులకు కనీస మద్దతు ధరలు లభించక మీరే వారిని సంక్షోభంలో నెట్టిన మాట వాస్తవం కాదా?⇒ మా హయాంలో ధాన్యం కొనుగోళ్లకు రూ.65 వేల కోట్లు ఖర్చు చేయడమే కాకుండా ఇతర పంటల కొనుగోళ్లకు దాదాపు మరో రూ.7,800 కోట్లు ఖర్చుచేసి రైతన్నలకు అండగా నిలిచాం.⇒ రైతుల కోసం మేం సృష్టించిన మొత్తం వ్యవస్థలను మీరు నిర్వీర్యం చేశారు. ఆర్బీకేలు, ఈ క్రాప్, ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగా ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ, ఆర్బీకేల్లో కనీస మద్దతు ధరల పోస్టర్లు ప్రదర్శించే విధానం, సీఎం యాప్ ద్వారా కొనుగోలు చేసే విధానం, నాణ్యతను ధ్రువీకరిస్తూ ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను రైతులకు అందుబాటులోకి తెచ్చే విధానం, ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ల వ్యవస్థ, రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కాల్సెంటర్, టోల్ ఫ్రీ నంబరును నిర్వహించే వ్యవస్థ, ఆర్బీకేల్లో కియోస్క్లతో రైతులకు తోడుగా నిలిచే విధానం, సున్నా వడ్డీ, పెట్టుబడి సహాయం, రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి.. ఇలా మొత్తంగా వ్యవసాయ రంగంలో మేం తెచ్చిన విప్లవాత్మక విధానాలు, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు. వ్యవసాయం దండగ అన్న మీ ఆలోచన, మైండ్ సెట్ ఏమాత్రం మారలేదు చంద్రబాబూ!⇒ మీ తప్పుడు కేసులకు భయపడి ప్రజా పోరాటాలు ఆపేది లేదు. నేను రైతుల పక్షపాతిని, ప్రజల పక్షపాతిని. మీరు ఎన్ని కేసులు బనాయించినా రైతుల కోసం, ప్రజల కోసం కచ్చితంగా నిలబడతా. చంద్రబాబూ..! ఇప్పటికైనా తక్షణమే మిర్చి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోండి. ఈ సంక్షోభం నుంచి అన్నదాతలు బయట పడేలా, వారికి ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెంటనే కొనుగోళ్లు ప్రారంభించండి. -
రైతులను మోసం చేస్తున్న చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్
తాడేపల్లి : రైతులను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. తెగుళ్లతో మిర్చి దిగుబడులు ఎకరాకు 10 క్వింటాళ్లకు పడిపోయే పరిస్థితి ఉంటే, చంద్రబాబులో ఏమాత్రం కదలిక లేకపోవడం నిజంగా సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ మేరకు తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ ఎక్స్’ వేదికగా చంద్రబాబు రైతులను మోసం చేస్తున్న తీరును ఎండగట్టారు.మేం స్పందిస్తే గానీ మీలో కదలిక లేదు.. ‘చంద్రబాబు గారూ, తెగుళ్లతో మిర్చి దిగుబడులు ఎకరాకు 10 క్వింటాళ్లకు పడిపోయిన పరిస్థితి ఉంది. కొనేవాడులేక రూ.10వేలకు రైతులు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి. పెట్టుబడి ఖర్చులు చూస్తే ఎకరాకు రూ.1,50,000 పైమాటే. ఇంతటి సంక్షోభం ఉన్నప్పటికీ, మేం స్పందించేంతవరకూ మీలో కదలిక లేదు. మీరు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్తూ మిర్చి రైతుల కోసమే వెళ్తున్నట్టుగా యథావిధిగా కలరింగ్ ఇస్తున్నారు. తూతూ మంత్రంగా మళ్లీ రైతులను మోసం చేసి, ఏ సంబంధం లేని కేంద్రానికి లేఖరాయడం ఏంటి?, కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ ఎప్పుడూ, ఏ రాష్ట్రంలోనూ, ఎక్కడా మిర్చిని కొనుగోలు చేయలేదని తెలిసి కూడా లేఖరాయడం ఏంటి? , మీరు బాధ్యతను వేరేవాళ్లమీద నెట్టడం ఏంటి? , మీరు చేయాల్సిన పనులు చేయకుండా కుంటిసాకులు వెతుక్కోవడం ఏంటి?, ఈ రకంగా రైతులను మోసం చేస్తున్నారు. మేం 2021లో అంటే 5ఏళ్ల కిందట, పెట్టుబడి ఖర్చులు ఎకరాకు రూ.1లక్ష ఉన్నప్పుడు, సాధారణంగా అప్పుడు దిగుబడి ఎకరాకు 20 క్వింటాళ్లుపైన ఉన్నప్పుడు అప్పట్లోనే 5 ఏళ్ల కిందట ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.7,000. గతంలో మీరెప్పుడూ మిర్చికి కనీస మద్దతు ధరలు ప్రకటించలేదు.చంద్రబాబు.. 5 ఏళ్ల తర్వాత పెట్టుబడి ఖర్చులు పెరగవా?5ఏళ్ల కిందట, మేం అధికారంలోకి వచ్చిన తర్వాత, కేంద్రం మద్దతు ధరలు ప్రకటించిన పంటలకే కాకుండా, ప్రకటించని పంటలకూ, రాష్ట్రం మరికొన్ని పంటలను అదనంగా చేర్చి మొత్తంగా 24 పంటలకు మద్దతు ధరలు ప్రకటించి, పోటీవాతావరణం కల్పించి ధరలు పడిపోకుండా అడ్డుకోవడమేకాదు, ధరలు పెరిగేట్టుగా చూశాం. ధాన్యం కొనుగోళ్లకు రూ.65,000 కోట్లు ఖర్చు చేయడమే కాకుండా, ఇతర పంటల కొనుగోళ్లకు మరో రూ.7,800 కోట్లు ఖర్చుచేసి రైతుకు అండగా నిలిచాం. మరి ఈ ధరలు ప్రకటించి అప్పటికీ, ఇప్పటికీ 5ఏళ్లు అయ్యింది. 5 ఏళ్ల తర్వాత పెట్టుబడి ఖర్చులు పెరగవా? ,అప్పట్లో మిర్చి సాగుకు ఎకరాకు రూ.1లక్ష అయితే, ఇప్పుడు రూ.లక్షన్నర అయిన మాట వాస్తవం కాదా?, మీరుకూడా మాలాగే ఇప్పుడు కొత్త మద్దతు ధరలు ప్రకటించి రైతులను ఆదుకోవడానికి ఎందుకు చర్యలు తీసుకోలేదు? , రాష్ట్ర ప్రభుత్వమే ఎందుకు కొనుగోలు చేయలేదు? , కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్చౌహాన్ సింగ్కు రాసిన లేఖలో మా హయాంలో మిర్చి రైతులకు మంచి ధరలు వచ్చాయని మీరే చెప్పారు. మీరు రాసిన లేఖ ప్రకారమే మా హయాంలో మిర్చికి మోడల్ ధర రూ.20,000 ఉంటే, గరిష్ట ధర రూ.27,000 పలికింది వాస్తవం కాదా?, మిర్చిరైతుల సంక్షోభంపై ఈ జనవరిలో ఉద్యానవనశాఖ అధికారులు నివేదించిన తర్వాత అయినా, మీరేమైనా పట్టించుకున్నారా? , మిర్చి రైతుల పరిస్థితి అన్యాయంగా ఉందని, జోక్యం చేసుకోవాలని నివేదిక ఇచ్చినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు?, పైగా తప్పుడు రాజకీయాలు చేస్తూ, మిర్చి కొనుగోళ్లతో సంబంధంలేని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి చేతులు దులుపుకుంటారా? , గతంలో ఎప్పుడైనా, ఏ రాష్ట్రంలోనైనా నాఫెడ్ మిర్చిని కొనుగోలు చేసిందా? , మీచేతిలో ఉన్న మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేయకుండా, ఎప్పుడూ మిర్చి కొనుగోళ్లు చేయని నాఫెడ్ కొనాలంటూ లేఖ రాయడం రైతులను నిలువునా మోసం చేయడం, మభ్యపెట్టడం కాదా? , మిర్చిరైతులకు బాసటగా వెళ్లినందుకు మాపై కేసులు పెట్టారు. అలాంటప్పుడు ఈ ఫిబ్రవరి 15న, మీరు పాల్గొన్న మ్యూజికల్నైట్కు ఎన్నికలకోడ్ అడ్డం రాలేదా?రైతులను కలిస్లే ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిందానేను మిర్చి రైతులను కలుసుకుంటే ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిందా? , పైగా మేము ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయడంలేదు, నిన్నటి కార్యక్రమంలో పలానావారికి ఓటు వేయమనికూడా చెప్పలేదు, కనీసం మైక్లో కూడా మాట్లాడలేదు. అయినా అన్యాయంగా కేసులు పెట్టారు. ఇది అప్రజాస్వామికం కాదా?, మీ హయాంలో పంటలకు కనీస మద్దతు ధరలు రావడంలేదన్నది వాస్తవం కాదా?, పత్తి, పెసర, మినుము, కంది, టమోటా, మిర్చి, మొన్నటి ధాన్యం సహా అన్ని పంటల రైతులకు కనీసమద్దతు ధరలు లభించక మీరే వారిని సంక్షోభంలో నెట్టిన మాట వాస్తవం కాదా?మేం సృష్టించిన మొత్తం వ్యవస్థలను నిర్వీర్యం చేశారు..రైతుకోసం మేం సృష్టించిన మొత్తం వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఆర్బీకేలు, ఈ క్రాప్ నిర్వీర్యం, ఉచిత పంటల బీమా నిర్వీర్యం, సీజన్ ముగిసేలోగా ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ నిర్వీర్యం, ఆర్బీకేల్లో కనీస మద్దతు ధరల పోస్టర్లు అతికించి, CM APP ద్వారా కొనుగోలు చేసే విధానం నిర్వీర్యం, నాణ్యతను ధృవీకరిస్తూ ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను రైతులకు అందుబాటులోకి తీసుకు వస్తూ, బ్లాక్లో అమ్మే పరిస్థితిని నిరోధిస్తూ చేసిన కార్యక్రమం నిర్వీర్యం, ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇంటిగ్రేటెడ్ ల్యాబుల వ్యవస్థ నిర్వీర్యం, రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సెపరేటు కాల్సెంటర్, టోల్ ఫ్రీ నంబరును నిర్వహించే వ్యవస్థ నిర్వీర్యం, ఆర్బీకేల్లో కియోస్క్లు పెట్టి, రైతులకు తోడుగా నిలిచే విధానం నిర్వీర్యం, సున్నావడ్డీ నిర్వీర్యం, పెట్టుబడి సహాయం నిర్వీర్యం, ధాన్యం కొనుగోలు కాకుండా ఇతర పంటల కొనుగోలుకు రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి నిర్వీర్యం.. మొత్తంగా ఇలా వ్యవసాయరంగంలోని మేం తీసుకు వచ్చిన విప్లవాత్మక వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యంచేశారు.వ్యవసాయం దండగ అన్న మీ ఆలోచన, మైండ్ సెట్ మారలేదు చంద్రబాబుగారు. ఇప్పుడు కూడా కలరింగ్ ఇస్తూ రైతులను మోసం చేస్తున్నారు. 10. మీ కేసులకు భయపడి ప్రజా పోరాటాలు ఆపేదిలేదు.నేను రైతు పక్షపాతిని, ప్రజల పక్షపాతిని. మీరు ఎన్నికేసులు పెట్టినా రైతులకోసం, ప్రజలకోసం నిలబడతాను. చంద్రబాబుగారూ… ఇప్పటికైనా తక్షణమే మిర్చి రైతుల్ని ఆదుకునేలా చర్యలు తీసుకోండి. ఈ సంక్షోభం నుంచి రైతులు బయటపడేలా, వారికి ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెంటనే కొనుగోళ్లు ప్రారంభించండి.’ అని వైఎస్ జగన్ కోరారు.1. @ncbn గారూ, తెగుళ్లతో మిర్చి దిగుబడులు ఎకరాకు 10 క్వింటాళ్లకు పడిపోయిన పరిస్థితి ఉంది.కొనేవాడులేక రూ.10వేలకు రైతులు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి. పెట్టుబడి ఖర్చులు చూస్తే ఎకరాకు రూ.1,50,000 పైమాటే. ఇంతటి సంక్షోభం ఉన్నప్పటికీ, మేం స్పందించేంతవరకూ మీలో కదలిక లేదు. మీరు ఢిల్లీ సీఎం…— YS Jagan Mohan Reddy (@ysjagan) February 20, 2025 -
రైతుకు వెన్నుపోటుతో వ్యవసాయానికి పట్టిన బాబు చీడ
-
రైతు బతికే పరిస్థితి లేదు!: వైఎస్ జగన్
ఇవాళ రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. మొన్నటి వరకూ ధాన్యం రైతుల కష్టాలు చూశాం.. ఇవాళ మిర్చి రైతుల కష్టాలను చూస్తున్నాం. ఒక్క మిర్చే కాదు.. పత్తి, మినుము, కందులు, పెసర, టమాటా.. ఇలా ఏ పంట తీసుకున్నా రైతులకు గిట్టుబాటు ధర దక్కని దుస్థితి నెలకొంది. నాడు సీఎం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ధరలను సమీక్షిస్తూ ఎక్కడైనా పతనమైతే వెంటనే రంగంలోకి దిగి రైతులను ఆదుకున్నాం. కానీ నేడు దళారీల దయాదాక్షిణ్యాలకు వదిలేశారు. రైతుల జీవితాల్లో వెలుగులు చూసేందుకు వైఎస్సార్సీపీ హయాంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు ఏవీ ఈరోజు కనిపించడం లేదు. – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, గుంటూరు, సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయానికి... ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డులో అన్నదాతలు పడుతున్న అగచాట్లు చంద్రబాబుకు కనిపిస్తున్నా కళ్లు మూసుకుని కూర్చున్నారని వైఎస్సార్ సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో రైతు బతికే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం అన్నదాతల పాలిట శాపంగా మారింది. ఏ రైతన్నా సంతోషంగా లేడు. అన్నదాతల అవస్థలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు’’ అని మండిపడ్డారు. ‘ఇవాళ రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. మరోవైపు దిగుబడులు పడిపోయాయి. మొన్నటి వరకూ ధాన్యం రైతుల కష్టాలు చూశాం.. ఇవాళ మిర్చి రైతుల కష్టాలను చూస్తున్నాం. ఒక్క మిర్చే కాదు.. పత్తి, మినుము, కందులు, పెసర, టమాటా.. ఇలా ఏ పంట తీసుకున్నా రైతులకు గిట్టుబాటు ధర దక్కని దుస్థితి నెలకొంది. దళారులకు తావు లేకుండా పంటల కొనుగోళ్లు జరిపి రైతులను ఆదుకున్న ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఈ క్రాప్ గాలికి వదిలేశారు. ఉచిత పంటల బీమా ఎత్తివేశారు. సీజన్ ముగిసేలోపు ఇన్పుట్ సబ్సిడీకి స్వస్తి పలికారు. ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని నిర్దాక్షిణ్యంగా తీసేశారు. ఇక ఇస్తామన్న దాన్నీ ఎగ్గొట్టారు. సూపర్ సిక్స్లో చెప్పినవన్నీ విస్మరించారు. సున్నా వడ్డీ రాయితీ అందడం లేదు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ద్వారా పరీక్షలు నిర్వహించి నాణ్యమైన సాగు ఉత్పాదకాలు అందించే విధానానికి తిలోదకాలిచ్చారు. నాడు సీఎం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ధరలను సమీక్షిస్తూ ఎక్కడైనా పతనమైతే వెంటనే రంగంలోకి దిగి రైతులను ఆదుకుంటే నేడు దళారీల దయాదాక్షిణ్యాలకు వదిలేశారు. రైతుల జీవితాల్లో వెలుగులు చూసేందుకు వైఎస్సార్ సీపీ హయాంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు ఏవీ ఈరోజు కనిపించడం లేదు’ అని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం గుంటూరులోని మిర్చి యార్డుకు వచ్చిన వైఎస్ జగన్ రైతులను కలిసి వారి సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కనీస మద్దతు ధర కూడా దక్కకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని మిర్చి రైతులు ఆయన వద్ద మొర పెట్టుకున్నారు. వారి కష్టాలు, బాధలు తెలుసుకుని చలించిపోయారు. సావధానంగా సమస్యలు ఆలకించి ధైర్యం చెప్పారు. అనంతరం మిర్చి యార్డు బయట వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ఖాతాలోనూ తన పర్యటన వివరాలను పంచుకున్నారు. రైతన్నలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలిరావడంతో మిర్చి యార్డు ప్రాంతం కిక్కిరిసిపోయిందని.. అందువల్ల మీడియా ద్వారా పూర్తిగా మాట్లాడలేకపోయానని.. అన్ని అంశాలను ట్వీట్లో పొందుపరుస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..గుంటూరులో భారీగా హాజరైన జన సందోహానికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ ఏ పంట చూసినా ‘మద్దతు’ కరువు..టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలకు అడుగడుగునా కష్టాలు, నష్టాలే మిగులుతున్నాయి. పంటలకు మద్దతు ధర దేవుడెరుగు.. అమ్ముకుందామన్నా కొనేవారు లేక అల్లాడుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చారు.. మళ్లీ రైతులను పట్టి పీడించడం మొదలు పెట్టారు. అటు తెగుళ్లతో దిగుబడి తగ్గిపోవడం.. ఇటు రేటు లేక అమ్ముకోలేని పరిస్థితులతో అన్నదాతల బతుకు దుర్భరంగా మారింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రైతులందరి పరిస్థితి దయనీయంగా ఉంది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి.. ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఒక్క రివ్యూ కూడా చేయలేదు. ప్రభుత్వం తరఫున రైతులను పలకరించేవారు లేరు. రాష్ట్ర సచివాలయానికి అత్యంత సమీపంలోనే గుంటూరు మార్కెట్ యార్డు ఉన్నా రైతుల ఆక్రోశం, ఆవేదన చంద్రబాబుకు వినిపించడంలేదు. సీఎం చంద్రబాబు రైతులను దళారీలకు అమ్మేశాడు. మిర్చి రైతన్న కుదేలు..మన ప్రభుత్వంలో నిరుడు అత్యధికంగా క్వింటాలు రూ.21 – 27 వేల దాకా పలికిన మిర్చి ధర ఇప్పుడు రూ.8 – 11 వేలకు పడిపోయింది. పంట బాగుంటే మిర్చి ఎకరాకు సగటున 20 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. తెగుళ్ల కారణంగా ఈ ఏడాది దిగుబడులు పడిపోయాయి. ఏ జిల్లాలో చూసినా ఎకరాకు 10 క్వింటాళ్లకు మించి రాలేదు. ఇక పెట్టుబడి ఖర్చులు చూస్తే ఎకరాకు కనీసం రూ.1,50,000 పైమాటే అవుతోంది. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఒక్క మిర్చే కాదు.. కంది పండిస్తున్న రైతులు కూడా ధరలు లేక విలవిల్లాడుతున్నారు. కందిపప్పు క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.7,550 అయితే ఇప్పుడు రూ.5,500 కూడా రావడం లేదు. కానీ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.150 పైనే ఉంది. అదే గతేడాది రూ.9–10 వేల మధ్య ధర వచ్చేది. గత ఏడాది క్వింటాలు పత్తి రూ.10 వేలు ఉండగా ఇప్పుడు రూ.5 వేలు కూడా దాటడం లేదు. పెసలు కనీస మద్దతు ధర రూ.8,558 కాగా ఇప్పుడు రూ.6 వేలు రావడం కూడా కష్టంగా ఉంది. మినుములు కనీస మద్దతు ధర రూ.7,400. గత ఏడాది క్వింటాలు మినుములు రూ.10 వేలు పలకగా ఇప్పుడు రూ.7 వేలు కూడా రావడం లేదు. టమాటా రైతులకు కిలోకి రూ.3–5 కూడా దక్కడం లేదు. పలావూ.. లేదు! బిర్యానీ లేదు! ఎన్నికల్లో చంద్రబాబు సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సెవెన్ అని కూడా అన్నారు. రైతుకు ఏటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ సాయం కాకుండా అన్నదాతా సుఖీభవ కింద తాము రూ.20 వేలు చొప్పున ఇస్తామని నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని మోసం చేశారు. మన ప్రభుత్వంలో ఇచ్చిన రైతు భరోసాను కొనసాగించకుండా రద్దు చేశారు. మన ప్రభుత్వంలో ఒక్క రైతు భరోసా కిందే క్రమం తప్పకుండా సుమారు 54 లక్షల మంది రైతులకు రూ.34,288 కోట్లు అందచేశాం. ఇప్పుడు పలావూ.. లేదు! బిర్యానీ లేదు! ధరల స్థిరీకరణ నిధికి ఎగనామంఉచిత పంటల బీమాను కూడా చంద్రబాబు రద్దు చేశారు. ఒక సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీని చెల్లించే గొప్ప విధానాన్ని, రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారు. ఈ–క్రాప్ లేకుండా చేసేశారు. ధరల స్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారు. కనీసం ఎరువుల పంపిణీలోనూ కొరతే. ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోవడం దారుణం. చంద్రబాబూ..! ఇప్పటికైనా కళ్లు తెరవండి. రైతే రాజు అని గుర్తించండి. అన్నదాత కన్నీరు పెట్టుకుంటే అది రాష్ట్రానికే అరిష్టం. చంద్రబాబు గుంటూరు మార్కెట్ యార్డుకు వచ్చి మిర్చి రైతులతో మాట్లాడి వారికి బాసటగా నిలవాలి. ప్రభుత్వమే మిర్చిని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేస్తున్నాం.ఆదుకోకుంటే తీవ్ర పరిణామాలు..‘ఇవాళ రైతులు ప్రతి విషయంలోనూ దారుణంగా నష్టపోతున్నారు. ఇప్పటిౖకైనా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. రైతులకు పెట్టుబడి సహాయం అందించాలి. చంద్రబాబు కళ్లు తెరిచి గుంటూరు మిర్చి యార్డుకు రావాలి. రైతుల కష్టాలను తెలుసుకుని వారికి గిట్టుబాటు ధర లభించే విధంగా అండగా నిలబడకపోతే రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలుంటాయని రైతుల తరఫున హెచ్చరిస్తున్నా’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి కొడాలి నాని, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి, పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున, గుంటూరు, పల్నాడు జిల్లాల పార్టీ పరిశీలకుడు మోదుగుల, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, ఏసురత్నం, మురుగుడు హనుమంతరావు, మేయర్ కావటి మనోహర్నాయుడు, మాజీ మంత్రి విడదల రజిని, పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా, మాజీ ఎంపీ నందిగం సురేష్, పార్టీ నేతలు వనమా బాలవజ్రబాబు, అన్నాబత్తుని శివకుమార్, బలసాని కిరణ్, అంబటి మురళీకృష్ణ, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.గుంటూరు మిర్చి యార్డులో రైతులతో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సాయం చేయకపోగా.. వ్యవస్థలు నిర్వీర్యంచంద్రబాబు అధికారంలోకి వచ్చి రైతులకు సాయం చేయకపోగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలన్నింటినీ మూలన పడేశారు. ఆర్బీకేలను, ఈ–క్రాప్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లను నీరుగార్చారు. సీజన్ మొదలయ్యే సరికి రైతులకు పెట్టుబడి సహాయం, రైతులకు సున్నా వడ్డీకే రుణాలు, విత్తనాలు, ఎరువులకు సైతం నాణ్యతకు ఆర్బీకేల్లో గ్యారంటీ.. ఇలా మేం తెచ్చిన ప్రతి విప్లవాత్మక మార్పునూ ఉద్దేశపూర్వకంగా మూలనపెట్టారు. ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలన్న ఆలోచనే ఈ ప్రభుత్వానికి లేదు.. ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలన్న ఉద్దేశమే లేదు. ఓ నెంబరుకు ఫోన్ చేస్తే ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం రైతన్నల్లో కనిపించడం లేదు. ఆర్బీకేలు, వాటికి అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లతో సహా ప్రతి వ్యవస్థ ఇవాళ నిర్వీర్యం అయిపోయాయి. గతంలో ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మాలంటే భయపడే పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రభుత్వమే దగ్గరుండి ఆర్బీకేల ద్వారా ఎరువులు, విత్తనాల సరఫరా నిలిపివేసింది. రైతులు ప్రైవేట్ డీలర్ల దగ్గర ఎరువులు కొనాల్సి వస్తోంది. వాళ్లు కనీసం రూ.100 నుంచి రూ.400 అధిక ధరలకు బ్లాకులో అమ్ముతున్నారు. క్వాలిటీ కంట్రోల్ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గతంలో ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు విక్రయించిన పరిస్థితి ఉంటే.. ఇవాళ నాణ్యమైనవేవీ అన్నదాతలకు అందని దుస్థితి నెలకొంది. ఇక పెట్టుబడి సాయం కింద పీఎం కిసాన్ కాకుండా తాము ఇస్తామన్న రూ.20 వేలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం అన్నదాతలను దారుణంగా మోసం చేసింది.గొప్ప మార్పులతో రైతన్నకు అండగా..⇒ వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా కేంద్రం కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) ప్రకటించని పసుపు, మిర్చి, ఉల్లి, అరటి లాంటి పంటలకే కాదు.. మొత్తంగా 24 పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటించి, రైతులకు ఎమ్మెస్పీ ధర రాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే జోక్యం చేసుకుని కొనుగోలు చేసింది. ధాన్యం కొనుగోలుకు రూ.65,258 కోట్లు ఖర్చు చేస్తే... ఇతర పంటల కొనుగోలు కోసం రూ.7,773 కోట్లు వెచ్చించి మన ప్రభుత్వం నాడు రైతులను ఆదుకుంది. ఇవాళ మిర్చి రైతులు ఇన్ని కష్టాలు పడుతుంటే చంద్రబాబు నిద్రపోతున్నాడు.⇒ మన ప్రభుత్వ హయాంలో సీఎం యాప్ అనే గొప్ప మార్పును తెచ్చి ఏపీలో ఏ ప్రాంతంలో ఏ పంట ధర ఎలా ఉందో యాప్ తో సమాచారం సేకరించాం. ఆర్బీకేల సిబ్బంది రైతులకు అందుతున్న ధరలపై ఎప్పటికప్పుడు యాప్లో అప్డేట్ చేసేలా చర్యలు తీసుకున్నాం. ఆ సమాచారం ఆధారంగా కనీస మద్దతు ధర రాని పక్షంలో వెంటనే చర్యలు తీసుకునేవాళ్లం. జేసీల ఆధ్వర్యంలో మార్కెటింగ్ శాఖతో కలిసి అవసరమైతే ప్రభుత్వం తరఫున కొనుగోళ్లు చేసేవాళ్లం. కనీస మద్దతు ధరలు ఎంతో తెలియజేస్తూ ఆర్బీకేల్లో పెద్ద పెద్ద పోస్టర్లు ఏర్పాటు చేశాం. రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించడానికి 14400, 1907 టోల్ఫ్రీ నంబర్లు కూడా అందుబాటులోకి తెచ్చాం. ఇప్పుడు ఈ వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశారు.⇒ ఇప్పుడు మిర్చికి సోకిన మాదిరిగా పంటలకు వ్యాధులు వస్తే మన హయాంలో ఆర్బీకేల సిబ్బంది, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు వెంటనే విషయాన్ని ప్రభుత్వానికి చేరవేసి తగిన చర్యలు చేపట్టేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఆర్బీకేల ద్వారా రైతులకు తగిన శిక్షణ అందేది. రైతులకు మెరుగైన అవగాహన కలిగించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్, పొలంబడి లాంటి కార్యక్రమాలు నిర్వహించాం.⇒ రైతులకు అందించే విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యతపై మన హయాంలో ఎప్పటికప్పుడు పరీక్షలు జరిగేవి. ప్రభుత్వం నెలకొల్పిన 147 ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబ్ల్లో పరీక్షలు జరిగేవి. ఇప్పుడు ఆ ల్యాబ్లను గాలికొదిలేశారు. ప్రైవేట్కు అప్పగిస్తున్నారు.⇒ మన ప్రభుత్వంలో మార్కెట్లో క్రమం తప్పకుండా అధికారులు తనిఖీలు చేసేవారు. కలెక్టర్లు, ఎస్పీలు ఈ తనిఖీల మీద, తీసుకుంటున్న చర్యల మీద క్రమం తప్పకుండా రిపోర్టులు ఇస్తూ గట్టి పర్యవేక్షణ చేసేవారు. దీనివల్ల నకిలీలకు అడ్డుకట్ట పడేది. ఎక్కడైనా తప్పు జరిగితే సంబంధిత వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకునేవాళ్లం. ⇒ మనం అధికారంలో ఉన్నప్పుడు మిరప రైతులకు ఎప్పుడూ లేని విధంగా చాలా గొప్పగా పంటల బీమా అందించాం. 2019–20లో రూ.90.24 కోట్లు.. 2020–21లో రూ.36.02 కోట్లు... 2021–22లో రూ.439.79 కోట్లు చొప్పున రైతులకు అందించాం. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. మన ప్రభుత్వంలో రైతులపై ఒక్కపైసా భారం పడకుండా ఉచిత పంటల బీమాను అమలు చేసి 54.55 లక్షల మందికి రూ.7,802 కోట్లు పంట నష్ట పరిహారం కింద చెల్లించాం. ఇప్పుడు ఉచిత పంటల బీమాను పూర్తిగా రద్దు చేసి రైతులపై భారాన్ని మోపారు. -
టీడీపీ కోసం పనిచేస్తున్నట్లుగా పోలీసుల వైఖరి ఉంది: YS Jagan
-
చంద్రబాబు వచ్చాక మళ్లీ రైతులను పట్టి పీడిస్తున్నారు : వైఎస్ జగన్
-
జగన్తో తమ గోడు చెప్పు కున్న మిర్చి రైతులు
-
ఇప్పటికైనా కళ్లు తెరవండి చంద్రబాబు : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి : ధరల్లేక, పంటను కొనేవారు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మిర్చి రైతులను ఇవాళ వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం, కూటమి ప్రభుత్వంలో రైతులు పడుతున్న కష్టాలపై వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. వైఎస్ జగన్ ట్వీట్లో ఏమన్నారంటే 1.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలకు కష్టాలు, నష్టాలే మిగులుతున్నాయి. పంటలకు మద్దతు ధర దేవుడెరుగు.. కనీసం అమ్ముకుందామన్నా కొనేవారు లేరు. మొన్నటి వరకూ ధాన్యం రైతుల కష్టాలు చూశాం. ఇవాళ మిర్చిరైతుల కష్టాలు చూస్తున్నాం. చంద్రబాబు సీట్లోకి వచ్చారు, మళ్లీ రైతులను పట్టి పీడించడం మొదలుపెట్టారు. 2.మన ప్రభుత్వంలో నిరుడు క్వింటాలుకు అత్యధికంగా రూ.21-27 వేల దాకా పలికిన మిర్చి ధర, ఇప్పుడు రూ.8-11వేలకు పడిపోయింది.3.పంట బాగుంటే ఎకరాకు సగటున 20 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. తెగుళ్లు కారణంగా ఈ ఏడాది దిగుబడులు పడిపోయాయి. ఏ జిల్లాలో చూసినా ఎకరాకు 10 క్వింటాళ్లకు మించి రాలేదు. పెట్టుబడి ఖర్చులు చూస్తే, ఎకరా సాగుకు సుమారు రూ.1,50,000 పైమాటే అవుతోంది. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది.4.కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, అనంతపురం ఈజిల్లాల్లో రైతులందరి పరిస్థితీ అంతే. 5.పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ఆ ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి.. వీరంతా పట్టించుకోవడంలేదు. ప్రభుత్వంలో ఒక్క రివ్యూ కూడా చేయలేదు. గవర్నమెంటు తరఫున రైతులను పలకరించే వారు లేరు. రాష్ట్ర సచివాలయానికి అత్యంత సమీపంలో గుంటూరు మార్కెట్ యార్డు ఉంది. ఇక్కడ రైతుల ఆక్రోశం, ఆవేదన చంద్రబాబునాయుడు వినిపించడంలేదు.6.చంద్రబాబుగారు అధికారంలోకి వచ్చి రైతులకు సహాయం చేయకపోగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వ్యవసాయరంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలన్నింటినీ కూడా మూలన పడేశారు. 7.ఆర్బీకేలను, ఈ-క్రాప్ వ్యవస్థలను నిర్వీర్యంచేశారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబులను నిర్వీర్యంచేశారు. సీజన్ మొదలయ్యే సరికి రైతులకు పెట్టుబడి సహాయం, రైతులకు సున్నావడ్డీకే రుణాలు, విత్తనాలు ఎరువులకు సైతం ఆర్బీకేల్లో నాణ్యతకు గ్యారంటీ.. ఇలా ప్రతి విప్లవాత్మక మార్పునూ ఉద్దేశపూర్వకంగా మూలనపెట్టారు.ధరల్లేక, పంటను కొనేవారు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మిర్చి రైతులను గుంటూరు మార్కెట్ యార్డులో పరామర్శించాను. పెద్ద సంఖ్యలో రైతులు ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా తరలిరావడంతో మిర్చియార్డు ప్రాంతం కిక్కిరిసిపోయింది. అందుకే ప్రజలనుద్దేశించి మీడియా ద్వారా పూర్తిగా మాట్లాడలేకపోయాను.…— YS Jagan Mohan Reddy (@ysjagan) February 19, 20258.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం MSP ప్రకటించని పసుపు, మిర్చి, ఉల్లి, అరటి లాంటి పంటలకే కాదు, మొత్తంగా 24 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించి, రైతులకు MSP ధరలు రాకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే జోక్యంచేసుకుని కొనుగోలు చేసేది. కనీస మద్దతు ధరలు తెలియజేస్తూ ఆర్బీకేల్లో పోస్టర్లు ఉంచేవాళ్లం. ధాన్యం కొనుగోలుకు రూ.65,258 కోట్లు ఖర్చు చేస్తే, ధాన్యం కాకుండా ఇతర పంటల కొనుగోలు కోసం అక్షరాల రూ. 7,773 కోట్లు ఖర్చు చేసి మన ప్రభుత్వం రైతులను ఆదుకుంది. ఇవాళ మిర్చి రైతులు ఇన్ని కష్టాలు పడుతుంటే, చంద్రబాబునాయుడు కుంభ కర్ణుడిలా నిద్రపోతున్నాడు.9.మన ప్రభుత్వ హయాంలో CM APP అనే గొప్ప మార్పును తీసుకు వచ్చాం. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ పంట ధర ఎలా ఉందో ఆ యాప్ద్వారా నిరంతరం సమాచారం వచ్చేది. ఆర్బీకేల్లో ఉండే సిబ్బంది రైతులకు అందుతున్న ధరలమీద ఎప్పటికప్పుడు యాప్లో అప్డేట్ చేసేవాళ్లు. ఆ సమాచారం ఆధారంగా కనీస మద్దతు ధర రాని పక్షంలో వెంటనే చర్యలు తీసుకునేవాళ్లం. జేసీల ఆధ్వర్యంలో మార్కెటింగ్ శాఖతో కలిసి అవసరమైతే ప్రభుత్వం తరఫున కొనుగోళ్లు చేసేవాళ్లం. కనీస మద్దతు ధరలు ఎంతో తెలియజేస్తూ ఆర్బీకేల్లో పెద్ద పెద్ద పోస్టర్లు ఉంచేవాళ్లం. రైతులనుంచి ఫిర్యాదులు స్వీకరించి, వాటిని పరిష్కరించడానికి 14400, 1907 నంబర్లు కూడా ఉండేవి. ఇప్పుడు ఈవ్యవస్థలను పూర్తిగా నాశనం చేశారు.10.ఇప్పుడు మిర్చికి వచ్చినట్టే పంటలకు వ్యాధులు వస్తే, ఆర్బీకే సిబ్బంది, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు వెంటనే విషయాన్ని ప్రభుత్వానికి చేరవేయడం, ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన సూచనలు ఇచ్చి, రైతులు పాటించేలా చేసేవాళ్లం. ఆర్బీకేలద్వారా రైతులకు తగిన శిక్షణ అందేది. రైతులకు అవగాహన కలిగించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్, పొలంబడి లాంటి కార్యక్రమాలు నిర్వహించేవాళ్లం. 11.రైతులకు అందే విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు జరిగేవి. ప్రభుత్వం ఏర్పాటుచేసిన 147 ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబుల్లో పరీక్షలు జరిగేవి. ఇప్పుడు ఈ ల్యాబులను గాలికొదిలేశారు. ప్రైవేటుకు అప్పగిస్తున్నారు.12.మార్కెట్లో క్రమం తప్పకుండా అధికారులు తనిఖీలు చేసేవారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు క్రమం తప్పకుండా ఈ తనిఖీలమీద, తీసుకుంటున్న చర్యలమీద రిపోర్టులు ఇస్తూ, గట్టి పర్యవేక్షణ చేసేవారు. దీనివల్ల నకిలీలకు అడ్డుకట్టపడేది. ఎక్కడైనా తప్పు జరిగితే సంబంధిత వ్యక్తులమీద కఠిన చర్యలు తీసుకునేవాళ్లం. 13.మనం అధికారంలో ఉన్నప్పుడు మిరప రైతులకు ఎప్పుడూలేని విధంగా చాలా గొప్పగా పంటలబీమా అందించాం. 2019-20లో రూ.90.24 కోట్లు, 2020-21లో రూ.36.02 కోట్లు, 2021-22లో రూ.439.79 రైతులకు కోట్లు అందించాం. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇప్పుడు ఉచిత పంటల బీమాను పూర్తిగా రద్దుచేసి రైతులపై భారాన్ని మోపారు. మన ప్రభుత్వంలో రైతులపై ఒక్కపైసా భారం మోపకుండా ఉచిత పంటలబీమాను అమలు చేసి, 54.55లక్షల మందికి రూ.7,802 కోట్లు పంట నష్టపరిహారం కింద చెల్లించాం.14.ఒక్క మిర్చే కాదు, కంది పండిస్తున్న రైతులు కూడా ధరల్లేక విలవిల్లాడుతున్నారు. కందిపప్పు క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.7,550 అయితే, ఇప్పుడు రూ.5,500లు కూడా రావడంలేదు. గత ఏడాది రూ.9-10వేల మధ్య ధర వచ్చేది. కాని మార్కెట్లో కిలో కందిపప్పు రూ.150లు పైనే ఉంది.15.గత ఏడాది క్వింటాలు పత్తి ధర రూ.10వేలు ఉండేది. ఇప్పుడు రూ.5వేలుకూడా దాటడం లేదు. పెసలు కనీస మద్దతు ధర రూ.8,558లు. ఇప్పుడు రూ.6వేలు రావడం కష్టంగా ఉంది. అలాగే మినుములు కనీస మద్దతు ధర రూ.7,400. గత ఏడాది క్వింటాలుకు రూ.10వేలు రాగా, ఇప్పుడు రూ.7వేలు కూడా రావడంలేదు. టమోటా రైతులకు కిలోకి రూ.3-5లు కూడా రావడంలేదు.16.ఎన్నికల్లో చంద్రబాబు సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సెవెన్ అన్నారు. రైతుకు ప్రతిఏటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ కాకుండా, రూ.20వేలు ఇస్తామని నమ్మబలికారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని మోసం చేశారు. పోనీ మన ప్రభుత్వంలో ఇచ్చిన రైతు భరోసా కొనసాగించకుండా, రద్దుచేశారు. పలావూ.. లేదు, బిర్యానీ లేదు. కాని, మన ప్రభుత్వంలో ఒక్క రైతు భరోసా కిందే క్రమం తప్పకుండా సుమారు 54 లక్షల మంది రైతులకు రూ.34,288 కోట్లు ఇచ్చాం.17.ఇదొక్కటే కాదు ఉచిత పంటల బీమాను చంద్రబాబు రద్దుచేశారు, ఒక సీజన్లో పంట నష్టం జరిగితే, అదే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీని చెల్లించే గొప్ప విధానాన్ని, రైతులకు సున్నావడ్డీ పథకాన్ని రద్దుచేశారు. ఈ-క్రాప్ను లేకుండా చేసేశారు, ధరల స్థిరీకరణ నిధికీ ఎగనామం పెట్టారు. కనీసం ఎరువులను కూడా సకాలంలో పంపిణీ చేయడంలోనూ కొరతే. ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోవడం అత్యంత దారుణం. 18.చంద్రబాబు.. ఇప్పటికైనా కళ్లు తెరవండి. రైతే రాజని గుర్తించండి, రైతు కన్నీరు పెట్టుకుంటే..అది రాష్ట్రానికి అరిష్టం. చంద్రబాబు గుంటూరు మార్కెట్ యార్డుకు వచ్చి, మిర్చి రైతులతో మాట్లాడి, వారికి బాసటగా నిలవాలి. ప్రభుత్వమే మిర్చిని కొనుగోలుచేసి రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేస్తున్నాం.’ అని ట్వీట్లో వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
రైతులకు అండగా జగన్.. బాబు సర్కార్కు వార్నింగ్ (ఫొటోలు)
-
గుంటూరులో ఘాటెత్తిన అభిమానం (చిత్రాలు)
-
ఏపీలో రైతులు బతికే పరిస్థితి లేదు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ఏపీలో ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడని, ఈ దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. బుధవారం గుంటూరు మిర్చి రైతులకు సంఘీభావం తెలిపిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు.కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడు. ఏ పంటకూ గిట్టుబాటు లేకుండా పోయింది. దీంతో రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారాయన. గతంతో వైఎస్సార్సీపీ పాలనలో రైతులకు చేసిన మేలును వివరించిన ఆయన.. ఈ కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు.మా హయాంలో.. రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించాం. రూ.21 వేల నుంచి రూ. 27 వేల దాకా వచ్చేది. పెట్టుబడి సాయం చేసి రైతులకు అండగా నిలిచాం. వైఎస్సార్సీపీ హయాంలో రైతే రాజు. కానీ, కూటమి ప్రభుత్వం రైతును దగా చేసింది. ఈ ప్రభుత్వం పెట్టుబడి సాయం సాయం ఇవ్వలేదు. రైతులకు సున్నా వడ్డీ రాని పరిస్థితి నెలకొంది. గతంలో కల్తీ విత్తనాలు అమ్మితే భయపడేవారు. ఇప్పుడు సర్కారే దగ్గరుండి కల్తీ విత్తనాలు అమ్మిస్తోంది. ప్రైవేటు డీలర్లు 500 ఎక్కువ ధరకు ఎరువులు అమ్ముతున్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు లభించడం లేదు. మిర్చి రైతుల(Mirchi Farmers) అవస్థలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రైతులు పండించిన పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితి. మిర్చి పంటకు కనీసం రూ.11 వేలు కూడా గిట్టుబాటు ధర లేదు. ఆర్బీకే వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఈ ఏడాది దిగుబడి కూడా బాగా తగ్గిపోయింది. రైతులను దళారీలకు అమ్మేసే పరిస్థితి కనిపిస్తోంది. ఎరువులను బ్లాక్లో కొనాల్సిన పరిస్థితి వచ్చింది... చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. గుంటూరు మిర్చియార్డుకు కావాలి. రైతుల కష్టాలు తెలుసుకోవాలి. వాళ్లకు అండగా నిలబడాలి. లేకుంటే.. రాబోయే రోజుల్లో రైతులకు అండగా వైఎస్సార్సీపీ(YSRCP) ఉద్యమిస్తుందని వైఎస్ జగన్ హెచ్చరించారు.నినాదాలతో జగన్ ప్రసంగానికి అంతరాయంజగన్ గుంటూరు పర్యటన నేపథ్యంలో ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. మిర్చి యార్డ్ బయటకు వచ్చిన వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతుండగా .. సీఎం అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. దీంతో ఆయన ఏం మాట్లాడుతున్నారో వినిపించకుండా పోయింది. ఆపై పక్కకు వచ్చిన ప్రజల నినాదాల నడుమే మీడియాతో బిగ్గరగా మాట్లాడాల్సి వచ్చింది.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రైతులు... అభిమానులే రక్షణ వలయంగా
-
అన్నదాత ఆక్రందన
(పంపాన వరప్రసాదరావు – సాక్షి, అమరావతి/నెట్వర్క్) : చంద్రబాబు పాలన అంటేనే కరువు కాటకాలకు పుట్టినిల్లంటారు! అన్నదాతలు భయపడినట్లుగానే టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది మొదలు ఓవైపు కరువు.. మరోవైపు తుపాన్లు, వరదలు, అకాల వర్షాలు.. ఒకటేమిటి వరుస వైపరీత్యాలతో రైతన్నలు హతాశులయ్యారు! ఇక ఎటు చూసినా కల్తీలు రాజ్యమేలుతున్నాయి. నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో తెగుళ్లు, చీడపీడలు విజృంభించి దిగుబడులు దిగజారిపోయాయి. చివరికి చేతికొచ్చిన పంటకూ మద్దతు ధర దక్కక విలవిల్లాడి పోతున్నారు. మిర్చి నుంచి టమాటా వరకు.. ధాన్యం నుంచి కంది దాకా ఏ పంట చూసినా మద్దతు ధర లభించక.. పెట్టుబడి ఖర్చులూ దక్కక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రధాన పంటలకూ మద్దతు ధర దక్కని దుస్థితి నెలకొన్నా.. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద టన్ను కాదు కదా.. కనీసం క్వింటా పంటను కూడా ప్రభుత్వం కొనుగోలు చేసిన పాపాన పోలేదు. అన్నదాతా సుఖీభవ పెట్టుబడి సాయం లేదు.. కరువు సాయం లేదు.. పంట నష్ట పరిహారం జాడ లేదు... పంటల బీమా రక్షణ లేదు... వెరసి ‘కాల కూటమి’ పాలనలో రైతన్నల బతుకు దుర్భరంగా మారింది!16 లక్షల ఎకరాలు సాగుకు దూరంఈ దఫా ఖరీఫ్ సాగు లక్ష్యం 85.65 లక్షల ఎకరాలు కాగా, అతికష్టమ్మీద 70 లక్షల ఎకరాల్లోపు పంటలు సాగయ్యాయి. దాదాపు 16లక్షల ఎకరాలు సాగుకు దూరమయ్యాయి.ప్రకృతి వైపరీత్యాలతో 10 లక్షల ఎకరాల్లో పంట తుడిచి పెట్టుకుపోయింది. రాయలసీమలో దాదాపు వందకు పైగా మండలాలు కరువు కోరల్లో చిక్కుకోవడంతో సుమారు10 లక్షల ఎకరాలు బీడువారి పోయాయి. మొక్కుబడిగా 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం మినహా ప్రభుత్వం పైసా పరిహారం విదిల్చలేదు. 14.80 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సిన వేరుశనగ కేవలం 6.75 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఆరు లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన మిరప 3.72 లక్షల ఎకరాల్లోనే పరిమితమైంది.కాకి లెక్కలతో రైతు నోట్లో మట్టికష్టకాలంలో రైతన్నకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం కాకి లెక్కలతో వారి నోట్లో మట్టికొట్టింది. సూపర్సిక్స్లో ఇస్తామన్న రూ.20 వేల పెట్టుబడి సాయంలో పైసా విదిల్చిన పాపాన పోలేదు. ఖరీఫ్–23లో 2.37లక్షల మందికి చెల్లించాల్సిన రూ.164.05 కోట్లతోపాటు రబీ–2023–24 సీజన్లో 1.54 లక్షల మందికి జమ కావాల్సిన రూ.163.12 కోట్ల కరువు బకాయిలు ఊసెత్తడం లేదు. చివరకు గత జూలైలో కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన 32 వేల మందికి రూ.31.53 కోట్లు నేటికీ జమ చేయలేదంటే రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో తేటతెల్లమవుతోంది.ఎరువులకూ దిక్కు లేదు..ఎరువుల కొరత రైతులను అడుగడుగునా వేధించింది. చంద్రబాబు పాలనలో ఆనవాయితీగా రైతులు మండల కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తూ బస్తాపై రూ.100–400 వరకు వసూలు చేస్తూ డీలర్లు అందినకాడికి దోచుకుంటున్నారు. పుండుమీద కారం చల్లినట్టుగా కాంప్లెక్స్ ఎరువుల ధరలను కంపెనీలు బస్తాకు రూ.255 వరకు పెంచాయి. నాసిరకం ఎరువుల నిర్వాకం సాక్షాత్తూ పౌరసరఫరాల మంత్రి తనిఖీల్లోనే బట్టబయలైంది.దిగజారిన దిగుబడులు.. దక్కని మద్దతుధాన్యం సహా ఈ ఏడాది ప్రధాన పంటల దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. సాధారణంగా దిగుబడులు తగ్గినప్పుడు మార్కెట్లో మంచి రేటు పలకాలి. కానీ ఈ ఏడాది ఏ పంటకూ కనీస మద్దతు ధర దక్కని దుస్థితి నెలకొంది. ఏటా ముందస్తు ధరలను అంచనా వేసే ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మార్కెటింగ్ కేంద్రం సైతం ఈ ఏడాది ఖరీఫ్ పంట ఉత్పత్తులకు ఆశించిన ధరలు లభించడం లేదని తేల్చి చెప్పింది. అధిక వర్షాలతో పంట నాణ్యత దెబ్బతినడంతో పాటు గోదాముల్లో పేరుకున్న నిల్వల కారణంగా మిరప, పత్తి ధరలు దారుణంగా క్షీణించాయని తేల్చింది.రూ.20,000 సూపర్ సిక్స్లో ఇస్తామని ఎగ్గొట్టిన పెట్టుబడి సాయం 2019–24 మధ్య విత్తనాలు, ఎరువులకు ఇబ్బంది పడని రైతులు.. కూటమి పాలనలో పడరాని కష్టాలు పడుతున్నారు. రైతు సేవా కేంద్రాల్లో నాన్ సబ్సిడీ విత్తనాల సరఫరా నిలిచిపోయింది. సబ్సిడీ విత్తనాలు అరకొరగానే ఇచ్చారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏటా సగటున 4 లక్షల టన్నుల ఎరువులను సరఫరా చేస్తే.. కూటమి సర్కారు మాత్రం చేతులెత్తేసింది. కృత్రిమ కొరత సృష్టిస్తూ బస్తాపై వంద నుంచి 400 వరకు డీలర్లు దండుకున్నారు. కాంప్లెక్స్ ఎరువుల ధర బస్తాకు రూ.250 వరకు పెంపుతో రైతులకు పెనుభారంగా మారింది.» కనీస మద్దతూ కరువు» ధాన్యం బస్తాకు దక్కాల్సింది రూ.1,725 » దళారులు చెల్లిస్తున్నదిరూ.1,350–రూ.1,550 టమాట మీద నిలవని మంత్రి అచ్చెన్న టమాట పంట ధరలు పతనమై అన్నదాతలు గగ్గోలు పెట్టగా.. కిలో రూ.8కి కొంటామని చెప్పిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తర్వాత డబ్బుల్లేవని మాట మార్చారు. మార్కెట్లో టమాట ప్రస్తుతం కిలో రూ.20 ఉంది. రైతులకు దక్కుతున్నది రూ.3నుంచి రూ.5. మిర్చి, పత్తి మినుముధరల పతనం2023–24 సీజన్లో క్వింటా రూ.21 వేల నుంచి రూ.27 వేలు పలికిన మిర్చి... ప్రస్తుతం సగటున రూ.8 వేలు–రూ.11 వేలు కూడా లేదు. నిరుడు పత్తి క్వింటా రూ.10 వేలకు పైగానే పలకగా.. నేడు రూ.4 వేల నుంచి రూ.5,800కు పరిమితమైంది. మినుముల ధర గత సీజన్ లో క్వింటా రూ.10 వేలు ఉండగా.. ఇప్పుడు రూ.6 వేల నుంచి రూ.7,000 మాత్రమే.నిరుడు దిలాసా.. నేడు లాస్ డ్రాగన్ ఫ్రూట్ టన్ను నిరుడు రూ.1.80 లక్షలు పలకగా, నేడు రూ.1.20 లక్షలకు పడిపోయింది. అరటి రూ.25 వేలు, ద్రాక్ష రూ.40 వేలు, బొప్పాయి రూ.11 వేలు, పుచ్చకాయలు రూ.7 వేలు, కర్బూజా రూ.12 వేలకు మించడం లేదు. దిగుబడి లేక దిగాలు.. పరిహారం అందక కుదేలు2.80 ఎకరాల్లో వరి సాగు చేశా. తుపాన్తో రూ.50 వేలకు పైగా నష్టపోయా. పైసా కూడా పరిహారం ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం మా మండలంలో ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఎకరాకు రూ.5వేలు నష్టపోతున్నా. – భాస్కర్, పీవీ పురం, సత్యవేడు మండలం, తిరుపతి జిల్లాఎకరాకు రూ.లక్ష నష్టంఖరీఫ్లో ఆరు ఎకరాల్లో మిరప వేశా. ఎకరానికి రూ.లక్షన్నర వరకు ఖర్చుపెట్టా. బొబ్బర తెగులుతోపంట దెబ్బతింది. ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చేలా కనిపించడం లేదు. నిరుడు క్వింటా రూ.20 వేలు వరకు ఉంటే ఈ ఏడాది రూ.10 వేలకు కూడా కొనేవారు లేరు. ఎకరానికి రూ.లక్ష వరకు నష్టం వాటిల్లుతోంది. మద్దతు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది.– వెన్నపూసల జగన్మోహన్రెడ్డి, కాచవరం, కారంపూడి మండలం, పల్నాడు జిల్లా గత ఐదేళ్లూ బాగుంది..8 ఎకరాల్లో 1,500 చీనీ చెట్లు సాగు చేశా. కూలీలు, మందులు, ఇతర పెట్టుబడి కింద రూ.6.50 లక్షలు ఖర్చు చేశా. హెక్టారుకు 25 టన్నుల దిగుబడి ఆశిస్తే వాతావరణం దెబ్బకొట్టింది. 10 టన్నుల దిగుబడే వచ్చింది. గత నాలుగైదు సంవత్సరాలు మంచి వర్షాలు కురిశాయి. దిగుబడులు బాగా వచ్చాయి. టన్ను రూ.50 వేలకు తక్కువ కాకుండా ధర పలకడంతో లాభాలు ఆర్జించా. వైఎస్ జగన్ హయాంలో ఉచిత పంటల బీమా కింద పరిహారం రూపంలో కూడా లబ్ధి పొందా. – రైతు నాగన్న, ముకుందాపురం, గార్లెదిన్న మండలం, అనంతపురం జిల్లాపత్తి రైతు చిత్తురాష్ట్రంలో పత్తి సాధారణ విస్తీర్ణం 14.91 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది 9.82 లక్షల ఎకరాల్లో సాగైంది. వరదలు, వర్షాలకు తోడు గులాబీ తెగులు ప్రభావంతో ఎకరాకు 4–6 క్వింటాళ్లకు మించిరాలేదు. గతేడాది క్వింటా రూ.10 వేలకు పైగా పలికిన పత్తి... ప్రస్తుతం గ్రేడ్ను బట్టి రూ.4 వేల నుంచి రూ.5,800 మించి పలకని పరిస్థితి నెలకొంది. కొనుగోలు కేంద్రాల్లో సైతం గరిష్టంగా క్వింటాకు రూ.6,500 మించి ధర లేదని రైతులు చెబుతున్నారు. పెసర పంటకు కేంద్రం మద్దతు ధర రూ.8,558 ప్రకటించినా, ప్రస్తుతం మార్కెట్లో రూ.6 వేల నుంచి రూ.6,500 మించి పలకడం లేదు. 2023–24లో క్వింటా రూ.10 వేలు పలికిన మినుముకు ఈ ఏడాది రూ.7 వేలకు మించి ధర లేదు. టమాటా రైతులకు తొలి కోత నుంచే కష్టాలు మొదలయ్యాయి. మార్కెట్లో కిలో రూ.20 పలుకుతున్నా రైతులకు మాత్రం రూ.3–5కు మించి దక్కడం లేదు. ధర లేకపోవడంతో చీని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఏలూరు, పశ్చిమ, తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, పార్వతీపురం మన్యం జిల్లాల్లో సాగయ్యే కోకో పంటకు ఈసారి ధర లేకుండా పోయింది. చామంతి గతేడాది కిలో రూ.130 పలుకగా, ప్రస్తుతం కిలో రూ.20–30కి మించని పరిస్థితి నెలకొంది.మిర్చి రైతు కంట్లో కారంమిరప రైతులు తెగుళ్లు, చీడపీడలతో ఆశించిన దిగుబడులు రాక, మార్కెట్లో గిట్టుబాటు «ధర లేక తీవ్రంగా నష్టపోయారు. 2023–24 సీజన్లో 5.92 లక్షల ఎకరాల్లో మిరప సాగవగా, 2024–25లో కేవలం 3.94 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఎకరాకు రూ.2.50 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. జెమినీ వైరస్, నల్లతామర, ఇతర తెగుళ్ల ప్రభావంతో ఎకరాకు 10–15 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాని పరిస్థితి. 2023–24 సీజన్లో క్వింటా రూ.21 వేల నుంచి రూ.27 వేల వరకు పలకగా, ప్రస్తుతం సగటున క్వింటాకు రూ.8 వేల నుంచి రూ.11 వేలకు మించి రావడం లేదని రైతులు వాపోతున్నారు. వ్యాపారులంతా సిండికేట్గా మారి తేజ రకానికి క్వింటాకు రూ.8 వేల నుంచి రూ.12 వేలు.. లావు రకాలకు రూ.8 వేల నుంచి రూ.10 వేలు.. మధ్యస్థ రకాలకు రూ.10–11 వేలకు మించి ఇవ్వడం లేదు. తెల్లకాయలు గతంలో క్వింటా రూ.10వేలు నుంచి రూ.13 వేలు పలికితే ప్రస్తుతం రూ.3వేల నుంచి రూ.4 వేలకు మించి కొనడం లేదు. రాష్ట్రంలోని గిడ్డంగుల్లో 27 లక్షల బస్తాల నిల్వలు పేరుకుపోయాయి. గతంలో టీడీపీ హయాంలో 12 లక్షల టన్నుల మిరప ఎగుమతులు జరగగా వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా, రికార్డు స్థాయిలో 16.10 లక్షల టన్నులను ఎగుమతి చేయడం గమనార్హం.రైతు కష్టం..పశువుల పాలు టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి కూరగాయల మార్కెట్లో కిలో టమాటా ధర రూ.3 నుంచి రూ.5 మధ్య పలికింది. 27 నుంచి 30 కిలోల బరువున్న టమాటా ట్రే ధర రూ.100 నుంచి రూ.150 మాత్రమే. కూలి, రవాణా ఖర్చులు పోగా, రైతులకు ఒక్కో ట్రేకు రూ.70 కూడా మిగలడం లేదు.చివరికి ఆ ధరకు కూడా మంగళవారం కొనుగోలు చేసేవారు లేకపోవడంతో పలువురు రైతులు తాము తెచి్చన టమాటా పంటను మార్కెట్లోనే పశువులకు పారబోసి వెనుదిరిగారు. ఉద్యాన, కూరగాయల రైతులను ఆదుకుంటామని చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం పత్తా లేకుండా పోయిందని, తమకు కష్టాలు తప్పడంలేదని రైతులు వాపోయారు. – బొబ్బిలి నాడు ప్రతీ పంటకు ‘మద్దతు’ఎన్నికల హామీ మేరకు వైఎస్ జగన్ ప్రభుత్వం 2019లో అధికారంలోకి రాగానే రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. సీఎం యాప్ ద్వారా మార్కెట్ ధరలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పతనమైన ప్రతిసారీ జోక్యం చేసుకుని వ్యాపారులతో పోటీపడి కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర దక్కేలా చేసింది. పొగాకు, పత్తి, పసుపుతో సహా సజ్జలు, కొర్రలు, రాగులు, శనగ, పెసలు, కంది, వేరుశనగ, జొన్నలు, ఉల్లి, టమాటా, బత్తాయి, అరటి రైతులకు అండగా నిలిచింది. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించని మిరప, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, బత్తాయి వంటి పంటలకు సైతం ఎమ్మెస్పీని ప్రకటించి ఐదేళ్లూ ఆ ధరకు ఒక్క రూపాయి తగ్గకుండా చూసింది. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో 3.74 లక్షల మంది రైతుల నుంచి రూ.3,322 కోట్ల విలువైన 9 లక్షల టన్నుల ఉత్పత్తులు కొనుగోలు చేస్తే.. 2019–24 మధ్య వైఎస్ జగన్ హయాంలో 6.20 లక్షల మంది రైతుల నుంచి రూ.7,796.47 కోట్ల విలువైన 21.73 లక్షల టన్నుల ఉత్పత్తులు కొనుగోలు చేశారు.అంటే.. రెట్టింపు కన్నా అధికం. ఇక చరిత్రలో ఎన్నడూలేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1,789 కోట్ల విలువైన 3,403 టన్నుల పత్తి, రూ.18 కోట్ల విలువైన 8,459.56 టన్నుల టమాటాను సైతం కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారు. ఖజానాలో సొమ్ములు లేకపోయినా..వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి ఖజానాలో రూ.100 కోట్లకు మించి డబ్బులు లేకున్నా పగ్గాలు చేపట్టిన తొలి రోజు నుంచే రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టారు. రైతులను ఆదుకోవాలన్న సంకల్పంతో వైఎస్ జగన్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. శనగలు, మొక్కజొన్న, పత్తి, కందులు, పసుపు.. ఇలా తొలి ఏడాదిలోనే 14 రకాల ఉత్పత్తులను కనీస మద్దతు ధరలకు సేకరించారు. 3,76,902 మంది రైతుల నుంచి రూ.4354.11 కోట్ల విలువైన 11,02,105 టన్నుల పంట ఉత్పత్తులను సేకరించి చిత్తశుద్ధిని చాటుకుంది. -
సూక్ష్మ సేద్యం సబ్సిడీలు ఖరారు
సాక్షి, అమరావతి: కేంద్ర రాష్ట్రీయ కృషి వికాస యోజన (ఆర్కేవీవై)–పెర్ డ్రాప్ మోర్ క్రాప్ (పీడీఎంసీ) స్కీమ్లో భాగంగా అమలు చేస్తోన్న సూక్ష్మ సాగునీటి పథకం కింద బిందు, తుంపర పరికరాలను అమర్చేందుకు 2025–26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి సబ్సిడీలు ఖరారయ్యాయి. ఈ మేరకు సోమవారం వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. ⇒ రాష్ట్ర వ్యాప్తంగా ఐదెకరాల్లోపు ఎస్సీ, ఎస్టీ సన్న, చిన్నకారు రైతులకు 100 శాతం సబ్సిడీపై పరికరాలు ఇవ్వనున్నారు. ⇒ ఎస్సీ, ఎస్టీ యేతర సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీ (గరిష్టంగా రూ.2.18 లక్షలు) ఉంటుంది. ⇒ రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 5–10 ఎకరాల్లోపు రైతులతో పాటు గిరిజన ప్రాంతాల్లో ఎస్టీ రైతులకు 90 శాతం సబ్సిడీ (రూ.3.14 లక్షలు) ఇవ్వనున్నారు.⇒ కోస్తా జిల్లాల్లో 5–10 ఎకరాల్లోపు రైతులకు 70 శాతం (రూ.3.10 లక్షలు), 10 ఎకరాలకు పైబడిన రైతులకు 50 శాతం (రూ.4లక్షలు) చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నారు.⇒ఇక తుంపర పరికరాల కోసం దరఖాస్తు చేసే అన్ని సామాజిక వర్గాలకు చెందిన ఐదెకరాల్లోపు సన్న, చిన్నకారు రైతులకు 50 శాతం (రూ.19వేలు), 12.5 ఎకరాల్లోపు భూమి కలిగిన ఇతర సామాజిక వర్గాలకు చెందిన రైతులకు కూడా 50 శాతం (రూ.19వేలు) చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసినట్లుగానే...కాగా, 2024–25 సీజన్ వరకు వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ధేశించిన సబ్సిడీల మేరకే బిందు, తుంపర పరికరాలు ఇస్తున్నారు. రూ.2,700 కోట్లతో 7.50 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం విస్తరించాలని లక్ష్యంగా నిర్ధేశించగా, 7.95 లక్షల ఎకరాల్లో విస్తరణకు రైతులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు కేవలం లక్ష ఎకరాల్లో బిందు పరికరాల అమరికకు పరిపాలనా ఉత్తర్వులిచ్చారు. -
‘చెప్పు’కోలేని బాధలు..
సైదాపూర్ (హుజూరాబాద్): యూరియా తదితర ఎరువుల కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. వెన్నంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్దకు రైతులు ఉదయమే చేరుకున్నారు. ప్రస్తుతం యాసంగి నేపథ్యంలో ఉదయం 7 నుంచి 8 గంటల సమయంలో ఎరువులు తీసుకెళ్తుంటారు. కానీ ఆ సమయంలో గేటు తీయకపోవడంతో.. గోడపై నుంచి లోపలికి దూకి చెప్పులను క్యూలో పెట్టారు. గోడపై ఉదయం 10 గంటల వరకు కూర్చుని నిరీక్షించారు. అధికారులు ఎరువుల కొరత తీర్చాలని అన్నదాతలు కోరుతున్నారు.పంటలు తడారి.. పొలాలు ఎడారిరాజాపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని పలు గ్రామాల్లో వేసవి ఆరంభంలోనే భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోతున్నాయి. వరినాట్లు వేసిన రైతులు పంట పొలాలకు నీరు సరిపోకపోవడంతో ఎండుతున్న పొలాలను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు పంట పొలాల్లో గొర్రెలను మేపుతున్నారు. మండల కేంద్రానికి చెందిన కాకల్ల ఎల్లయ్య, గొల్లపల్లి శ్రీనులు తమకున్న భూమిలో ఒక్కొక్కరు మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు వరి సాగు చేశారు. వర్షాలు సరిగ్గా లేకపోవడం.. వారం రోజులుగా ఎండలు తీవ్రం కావడంతో భూగర్భ జలాలు అడుగంటి పొలాలకు నీరు అందడం లేదు. దీంతో ఎండిపోయిన వరి పొలంలో మూగజీవాలను తోలి మేపుతున్నారు. వర్ణాల పొద్దుఉదయాస్తమయాలు ఎప్పుడూ మనోహరమే. ప్రకృతి ప్రేమికులకు పరవశమే. పగలంతా వెలుగులు నింపే భానుడు.. సాయం సంధ్య వేళ కాషాయరంగులో నిష్క్రమించడం అద్భుతమే. పెద్దపల్లి శివారులో సూర్యాస్తమయమిది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి స్కానర్ కొట్టు.. కల్లు పట్టు మారుతున్న కాలానికి అనుగుణంగా మారితేనే మనుగడ సాధ్యం.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లికి చెందిన గీత కార్మికుడు గంగపురపు వెంకన్న ఇందుకు నిదర్శనం. వెంకన్న వద్దకు కల్లు తాగడానికి వచ్చే వారిలో ఎక్కువ మందికి స్మార్ట్ ఫోన్ ఉంది. వెంకన్న వద్ద స్మార్ట్ ఫోన్ లేకపోవడంతో చెల్లింపులకు ఇబ్బంది ఏర్పడి.. గిరాకీ దెబ్బ తింది. దీంతో చేసేదిలేక వెంకన్న ఇటీవల తన బ్యాంక్ ఖాతాపై క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు కల్లు ప్రియులంతా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి.. డబ్బు చెల్లించి కల్లు తాగుతున్నారు. – కేసముద్రంయక్షగాన కళాకారుల భిక్షాటన టీవీలు, స్మార్ట్ ఫోన్ల రాకతో వీధి నాటకాలు అంతరించి పోయాయి. నేటి తరానికి యక్షగానం అంటే తెలియని పరిస్థితి ఏర్పడింది. ఆదరణ లేక యక్షగాన కళాకారులు.. బతుకు కోసం భువనగిరిలో భిక్షాటన చేస్తూ కనిపించారు. – భువనగిరి టౌన్చదవండి: ఆ రోజు ఇల్లు కదలరు.. ముద్ద ముట్టరుగుమ్మి.. జ్ఞాపకాలు విరజిమ్మి గ్యాస్ పొయ్యిలు వచ్చాక కట్టెల పొయ్యిల్ని మరిచిపోయారు. కానీ ఒకప్పుడు కట్టెల పొయ్యి వెలిగించి వంట చేయాలంటే.. కంకిబెండ్లు, పిడకలు, కట్టెలు.. సేకరించి.. ఇలా గుమ్మిలో దాచుకోవలసిందే. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనుకుల గ్రామ శివారులోని ఓ ఇంట్లోని గుమ్మిలో దాచిన కంకిబెండ్లు పాత జ్ఞాపకాలను ఇలా గుర్తు చేశాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
సుఖీభవ లేనట్టే!
సాక్షి, అమరావతి: 2014లో అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయకుండా రైతులు సహా అన్ని వర్గాల ప్రజలను నిలువునా వంచించిన చంద్రబాబు.. ఇప్పుడూ అదే పనిలో ఉన్నారు. అప్పట్లో రైతు రుణాలు మాఫీ చేస్తామంటూ ఓట్లేయించుకొని, నిలువునా ముంచగా.. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి, రైతులను మరోసారి నిలువునా వంచించారు. ఈ పథకం కింద ప్రతి రైతుకు రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తామన్న హామీని చంద్రబాబు అటకెక్కించేశారు. అధికారంలోకి రాగానే పథకాన్ని అమలు చేస్తామని ఎన్నికల్లో కూటమి నేతలు చెప్పారు. అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మాట మార్చేశారు. పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సాయంతో కలిపి పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. పీఎం కిసాన్ కింద ఇప్పటికే కేంద్రం రెండు విడతలు సాయం అందజేసింది. చంద్రబాబు సర్కారు పైసా ఇవ్వలేదు. మూడో విడత పీఎం కిసాన్తో కలిపి ఇస్తామని సంక్రాంతి పండుగ వేళ సీఎం చంద్రబాబు ప్రకటించారు. కేంద్రం మూడో విడత పీఎం కిసాన్ సాయానికి ఏర్పాట్లు చేస్తోంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు సాయమందించే దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదు. మిగిలిన పథకాల మాదిరిగానే ఈ పథకాన్ని కూడా ఈ ఏడాది పూర్తిగా ఎగ్గొడితే మేలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఎగ్గొట్టడమే మేలన్న భావనలో ప్రభుత్వం వాస్తవంగా చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని అర్హత పొందిన 53.58 లక్షల మంది రైతులకు రూ.20 వేల చొప్పున రూ.10,717 కోట్లు జమ చేయాలి. అధికారంలోకి వచ్చాక పీఎం కిసాన్ సాయంతో కలిపి ఇస్తామని చెప్పారు. ఆ లెక్కన చూసినా ఈపాటికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.7,502 కోట్లు జమ చేయాలి. ఓ వైపు గద్దెనెక్కిన నాలుగో రోజే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తొలి విడత సాయం జమ చేసింది. రెండు విడతల్లో 41.84 లక్షల మందికి రూ.1,661.50 కోట్లు అందజేసింది. మూడో విడతలో మరో రూ.840 కోట్లు జమ చేయబోతోంది. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఒక్క పైసా జమ చేయలేదు. 2024–25 బడ్జెట్లో ఈ పథకానికి కేవలం రూ.1000 కోట్లు విదిల్చిన చంద్రబాబు ప్రభుత్వం.. పథకం అమలుపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. కనీసం మార్గదర్శకాలు రూపొందించలేదు. పీఎం కిసాన్ సాయం రూ.2 వేలతో పాటు ఈ ఏడాది అన్నదాత సుఖీభవ కింద రూ.2 వేలు ఇస్తే సరిపోతుందని తొలుత భావించారు. అలా ఇస్తే విమర్శలు వెల్లువెత్తుతాయన్న భావనతో తల్లికి వందనం, మత్స్యకార భరోసా మాదిరిగా అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా ఈ ఏడాది పూర్తిగా ఎగ్గొట్టడమే మేలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా చెబుతున్నారు. 2025–26 సీజన్ నుంచే పీఎం కిసాన్తో కలిపి 3 విడతల్లో అమలు చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టుగా చెబుతున్నారు. చెప్పిన దానికంటే ఎక్కువగా ఇచ్చిన జగన్ ప్రజలకు మేలు చేయడంలో వైఎస్ జగన్కి ఉన్న చిత్తశుద్ధి చంద్రబాబు ప్రభుత్వానికి లేదని రైతులు అంటున్నారు. వైఎస్ జగన్ ఇచ్చిన మాటకంటే మిన్నగా తొలి ఏడాది నుంచే వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా 3 విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించిన విషయాన్ని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ఐదేళ్లలో 53.58 లక్షల మందికి రూ.34,288.17 కోట్లు జమ చేసి వైఎస్ జగన్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచింది. టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అటకెక్కించేస్తుండడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ ఏడాది పెట్టుబడిసాయం లేనట్టే.. అన్నతాద సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ.20 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. 9 నెలలు గడుస్తున్నా పైసా కూడా విదల్చలేదు. ఈ ఏడాది ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కని్పంచడం లేదు. – ఎం.హరిబాబు, ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలు రైతుల సంఘం -
రైతుసేవా కేంద్రాల కుదింపు నిజమే
సాక్షి, అమరావతి: రైతు సేవా కేంద్రాలను (ఆర్ఎస్కే) సాగు విస్తీర్ణం ప్రాతిపదికన కుదించేందుకు కసరత్తు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ‘ఆర్బీకేలు అదృశ్యం..!’ శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం తరఫున వ్యవసాయ శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్ఎస్కేల (పూర్వపు రైతుభరోసా కేంద్రాలు–ఆర్బీకే) హేతుబద్ధీకరణ ప్రక్రియను గ్రామ, వార్డు సచివాలయాల విభాగం పర్యవేక్షిస్తుందని ప్రకటించింది. గతంలో జనాభా ప్రాతిపదికన ఏర్పాటు.. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో జనాభా ప్రాతిపదికన ప్రతీ రెండువేల మంది జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఏర్పాటుచేశారని, వీటికి అనుబంధంగా గ్రామస్థాయిలో మొత్తం 10,778 రైతు సేవా కేంద్రాలను ఏర్పాటుచేశారని వ్యవసాయ శాఖ పేర్కొంది. ఆ సమయంలో సాగు విస్తీర్ణాన్ని పరిగణలోకి తీసుకోలేదని, ఈ కారణంగా కొన్ని ఆర్ఎస్కేలు 100–2,500 ఎకరాల పరిధితో ఏర్పాటయ్యాయని తెలిపింది. వీటి ద్వారా రైతులకు కావాల్సిన సాగు ఉత్పాదకాలతో పాటు రైతుసేవలన్నీ అందించేవారని.. కానీ, ప్రస్తుతం సాగు విస్తీర్ణం ప్రాతిపదికన హేతుబద్ధీకరణ (కుదింపు) చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయ శాఖ పేర్కొంది. సాగు ఉత్పాదకాల పంపిణీ నిలిపివేత నిజమే2020 మే 30 నుంచి గత ప్రభుత్వ పాలనలో రైతులకు కావలసిన ఎరువులు, సబ్సిడీ నాన్ సబ్సిడీ విత్తనాలు, పురుగు మందులు, ఆక్వాఫీడ్, సీడ్, సంపూర్ణ దాణా వంటి సాగు ఉత్పాదకాలన్నీ ఆర్ఎస్కేల ద్వారానే పంపిణీ జరిగేవని వ్యవసాయ శాఖ ఆ ప్రకటనలో వివరించింది. ప్రస్తుతం వాటిల్లో పనిచేస్తున్న సిబ్బందిని పూర్తిగా రైతులకు విస్తరణ సేవలు, సాంకేతిక సూచనలు, సలహాలందించేందుకు ఉపయోగిస్తున్నామని.. ఈ కారణంగానే ఆర్ఎస్కేల ద్వారా సాగు ఉత్పాదకాల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిందని పేర్కొంది. వీటిని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్) ద్వారా చేయాలని, తద్వారా వాటిని బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. -
అన్నదాత మెచ్చిన రైతుబిడ్డ
పొలాలే బడులుగా రైతులకు సరికొత్త వ్యవసాయ పాఠాలు చెబుతుంది సిద్దిపేట జిల్లా అక్కన్నపేట (Akkannapet) మండలంలోని రామవరం క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిణి (ఏఈవో) కరంటోతు శ్రీలత. ఆమె పాఠాలు వృథా పోలేదు. సేంద్రియ ఎరువుల ప్రాధాన్యత నుంచి మల్చింగ్ (mulching) పద్ధతిలో కూరగాయల సాగు వరకు ఎన్నో విషయాలను అవగాహన చేసుకొని కొత్తదారిలో ప్రయాణిస్తున్నారు అన్నదాతలు...అక్కన్నపేట మండలం పంతులు తండాకు చెందిన శ్రీలతకు ఏఈవో ఉద్యోగం వచ్చినప్పుడు ‘నాకు ఉద్యోగం వచ్చింది’ అనే సంతోషం కంటే ‘ఈ ఉద్యోగం వల్ల ఎంతోమంది రైతులకు సహాయంగా నిలబడవచ్చు’ అనే సంతోషమే ఎక్కువ. రైతు కుటుంబంలో పుట్టిన శ్రీలతకు రైతుల కష్టాలు, నష్టాలు తెలియనివేమీ కాదు. సాగులో మెలకువలు పాటించకపోవడం వల్ల పంట దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు. అయితే మెలకువలు పాటించకపోవడం నిర్లక్ష్యం వల్ల కాదు... అవగాహన లేకపోవడం వల్లే జరుగుతోందని గ్రహించిన శ్రీలత రంగంలోకి దిగింది.ఆమె పొలం దగ్గరికి వస్తే ఎక్కడి నుంచో అగ్రికల్చరల్ ఆఫీసర్ (Agriculture Officer) వచ్చినట్లు ఉండదు. తెలిసిన వ్యక్తో, చుట్టాలమ్మాయో వచ్చినట్లుగా ఉంటుంది. ఎలాంటి బేషజాలు లేకుండా అందరితో కలిసిపోయి వారి సమస్యలు తెలుసుకుంటుంది. పొలం దగ్గరికి వచ్చినప్పుడు శ్రీలత కూడా రైతుగా మారిపోతుంది. తానే స్వయంగా ట్రాక్టర్తో వరి పొలం దున్నుతుంది. వరిలో కాలిబాటల ప్రయోజనాల గురించి చెబుతుంది. ఎరువులు ఎంత మోతాదులో చల్లాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రత్యక్షంగా చేసి చూపిస్తోంది. వ్యవసాయ శాస్త్రవేత్తలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ నూతన సాగు పద్ధతులను తెలుసుకుంటూ, వాటిని తన క్లస్టర్ పరిధిలోని రామవరం, గండిపల్లి, కుందన్వానిపల్లి, మైసమ్మవాగు తండా రైతులకు చెబుతుంటుంది. రసాయనిక మందుల వినియోగం లేకుండా సేంద్రియ పద్దతిలో సాగు చేసే విధంగా రైతులనుప్రోత్సహిస్తోంది. గిరిజన గ్రామాల్లో సైతం మల్చింగ్ పద్ధతిలో కూరగాయలు ఎక్కువగా సాగు చేసేలా చేస్తోంది. చదవండి: చేనేతను ఫ్యాషైన్ చేద్దాం!పంటల్లో అధిక దిగుబడులు సాధించడానికి రసాయన ఎరువులు మోతాదుకు మించి వాడటం వల్ల భూసారం దెబ్బతింటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సేంద్రియ ఎరువులప్రాధాన్యత గురించి ఒకటికి పదిసార్లు చెప్పడమే కాదు సేంద్రియ ఎరువులను ఎలా తయారు చేసుకోవాలని అనే అంశంపై ప్రత్యేక వీడియోను తయారు చేసింది. జీవ ఎరువుల వినియోగంపై కూడా ప్రత్యేక వీడియోను తయారు చేసి రైతులకు అవగాహన కలిగిస్తోంది.క్షేత్రస్థాయిలోకి...రైతు అంటే నా దృష్టిలో ఒక పొలానికి యజమాని మాత్రమే కాదు... మన ఇంటి వ్యక్తి. మనకు అన్నం పెట్టే అన్నదాత. రైతుకు మంచి జరిగితే లోకానికి మంచి జరిగనట్లే. నా ఉద్యోగం ద్వారా రైతులకు ఏదో రకంగా మేలు చేసే సలహాలు, సూచనలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. – శ్రీలత – గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, సిద్దిపేట– మాలోతు శ్రీనివాస్, సాక్షి, అక్కన్నపేట -
కొంప ముంచిన క్యాబేజీ
ఎంతో కష్టపడి పండించిన క్యాబేజీకి ధర పడిపోవడంతో రైతులు పంటను దున్నేస్తున్నారు. క్యాబేజీ పంటను కొనేందుకు వ్యాపారులు రాకపోవడం... వ్యయప్రయాసలను ఎదుర్కొని మార్కెట్కు తీసుకువెళితే బస్తా రూ.50కి అడుగుతుండటంతో కోత కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావని రొటోవేటర్తో పంటను తొక్కించేస్తున్నారు. ఎకరాకు రూ.80వేల నుంచి రూ.లక్ష వరకు నష్టపోతున్నారు. కృష్ణాజిల్లా మోపిదేవి మండలంలోని పలు గ్రామాల్లో 80 ఎకరాల్లో క్యాబేజీ పంటను సాగుచేశారు. వీరిలో ఎకరాకు రూ.30వేల నుంచి రూ.40వేలు ఇచ్చి కౌలుకు సాగుచేస్తున్న వారు కూడా ఉన్నారు. ఎకరా క్యాబేజీ సాగుకు రూ.80వేల వరకు ఖర్చులయ్యాయి. ప్రతి సంవత్సరం క్యాబేజీ తోటలను సాగుచేసిన తర్వాత పంట చేతికొచ్చేముందు ఇతర ప్రాంతాల వ్యాపారులు వచ్చి ఎకరాల లెక్కన కొనుగోలు చేస్తుంటారు. వీరు క్యాబేజీ కోత సమయంలో డబ్బులు ఇస్తుంటారు. గత ఏడాది ఎకరా క్యాబేజీ పంటను రూ.2 లక్షల వరకూ కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఎకరా పంట రూ.80వేలకు పడిపోయింది. కొంతమంది రైతులు ఆ ధరకే అమ్ముకున్నారు. –మోపిదేవివార్పు(మోపిదేవి)బస్తా రూ.50 మాత్రమే... ధర పెరుగుతుందని కొందరు రైతులు క్యాబేజీ పంటను అమ్మకుండా ఎదురు చూశారు. వ్యాపారులు రాకపోవడంతో సొంతంగా మార్కెట్కు తరలిస్తే బస్తా రూ.50లకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో కోత, రవాణా కూలీ ఖర్చులు దండగని రైతులు పంటను దున్నించేస్తున్నారు. తోటలను కొనుగోలు చేసిన వ్యాపారులు కూడా క్యాబేజీ కోసుకునేందుకు రావడం లేదు. దీంతో మోపిదేవి వార్పు, బండికోళ్ల లంక, బొబ్బర్లంక ప్రాంతాల్లో రైతులు రొటోవేటర్తో క్యాబేజీ పంటను తొక్కించేస్తున్నారు. ప్రస్తుతం పది ఎకరాలకు పైగా పంటను తొక్కించేశారు. మిగిలిన రైతులు కూడా ఇదే బాట పడుతున్నారు. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.జగన్ హయాంలో వెన్నుదన్నుగా... సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలో అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచి ఆదుకున్నారు. మార్కెట్లో ధర తగ్గిపోయిన ప్రతిసారి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద మార్కెట్లో జోక్యం చేసుకుని వ్యాపారులతో పోటీ పడి రైతుల దగ్గర నుంచి కనీస మద్దతు ధరకు పంట ఉత్పత్తులను కొనుగోలు చేసేవారు. ఇందుకోసం రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న 2014–19 మధ్య 3.74 లక్షల మంది రైతుల నుంచి రూ.3,322 కోట్ల విలువైన 9 లక్షల టన్నుల వివిధ రకాల పంట ఉత్పత్తులను సేకరించింది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 2019 – 24 మధ్య 6.17 లక్షల మంది రైతుల నుంచి రూ.7,745 కోట్ల విలువైన 21.59 లక్షల టన్నుల పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులకు వెన్నుదన్నుగా నిలిచారు. నాడు ధర లేని సమయంలో టమోటాలు, ఉల్లిపాయలు లాంటి కూరగాయలు కూడా సేకరించి రైతులకు అండగా నిలిచారు. -
తెలంగాణ వ్యాప్తంగా ఆగిన పత్తి కొనుగోళ్లు.. రైతులు ఆగ్రహం
వరంగల్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. గత రెండ ోరోజులుగా సీసీఐ(కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) సర్వర్ పని చేయడం లేదని పత్తి కొనుగోళ్లు నిలిపివేశారు తెలంగాణ రాష్ట్రంలో. దాంతో మార్కెట్ యార్డులలో వేల ట్రాక్టర్లు నిలిచిపోయాయి. దీనిపై పత్తి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వర్ ఔన్ అంటూ సాకులు చెబుతున్నారని మండిపడుతున్నారు. ప్రైవేట/ వ్యాపారులకు లాభం చేకూర్చేందుకు సర్వర్ డౌన్ పేరుతో పత్తి కొనుగోలు ఆపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబందంధి ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
రెండెకరాల వరకు ‘భరోసా’ విడుదల
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసా పథకంలో భాగంగా రెండెకరాల లోపు సాగుభూములున్న రైతులకు రూ.1,092 కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. 13.24 లక్షల మంది రైతులకు చెందిన 18.19 లక్షల ఎకరాల విస్తీర్ణంలోని భూములకు ఈ మొత్తం నిధులను కేటాయించారు. దీంతో కలిపి ఇప్పటివరకు మూడు విడతల్లో 36.97 లక్షల ఎకరాల విస్తీర్ణానికి సొంతదారులైన 34.69 లక్షల మంది రైతులకు రూ.2,218.49 కోట్లు ప్రభుత్వం విడుదల చేసినట్లయింది. గణతంత్ర దినోత్సవం నుంచి.. రాష్ట్రంలోని వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా అందజేసే కార్యక్రమాన్ని గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఆ మేరకు ముందుగా ఎంపిక చేసిన 563 గ్రామీణ మండలాల్లోని 563 రెవెన్యూ గ్రామాల (577 గ్రామ పంచాయతీలు)కు చెందిన 4,41,911 మంది రైతులకు చెందిన 9.48 లక్షల ఎకరాలకు జనవరి 27వ తేదీన రూ.569 కోట్లు విడుదల చేశారు.ఈ గ్రామాల్లో ఎకరాలతో సంబంధం లేకుండా మొత్తం వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా డబ్బులను జమ చేశారు. తర్వాత ఈ 577 గ్రామ పంచాయతీలను మినహాయించి ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకరం విస్తీర్ణం లోపు గల (9.29 లక్షల ఎకరాలకు) 17.03 లక్షల మంది రైతులకు రూ.557 కోట్లు విడుదల చేశారు. తాజాగా సోమవారం రూ.1,092 కోట్లు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. సిద్దిపేటలో అత్యధికంగా.. మూడు దఫాలుగా విడుదలైన రైతు భరోసా కింద సిద్దిపేట జిల్లా రైతులు అత్యధిక సంఖ్యలో లబ్ధి పొందారు. ఈ జిల్లాలోని 1,86,241 మంది రైతుల ఖాతాల్లోకి రూ.116. 26 కోట్లు జమయ్యాయి. ఇక్కడ సుమారు 1.94 లక్షల ఎకరాలకు రైతుభరోసా అందింది. తర్వాత నల్లగొండ జిల్లాకు చెందిన 1.85 లక్షల మంది రైతులకు రూ.113.33 కోట్లు విడుదలయ్యాయి. తర్వాత సంగారెడ్డి జిల్లాలో 1.82 లక్షల మంది రైతులకు రూ.116.26 కోట్లు జమ కాగా, అతి తక్కువగా మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలో కేవలం 4,981 మంది రైతులకు 3.82 కోట్లు జమయ్యాయి. అంటే ఈ జిల్లాలో రెండెకరాల లోపు 6,370 ఎకరాలు మాత్రమే సాగుయోగ్యమైన భూములు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ జిల్లాలో సాగు భూములన్నీ చాలావరకు రియల్ వెంచర్లు, విద్యాసంస్థలు, ఇతర వాణిజ్య సంస్థలుగా మారిపోవడంతో వాటిని రైతుభరోసా పోర్టల్ నుంచి తొలగించారు. -
BRS రైతు మహాధర్నా
-
ఇంత మోసమా?
సాక్షి ప్రతినిధి, గుంటూరు : అమరావతి రైల్వే ప్రాజెక్టు( Amaravati railway line) భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని రాజధాని గ్రామాల ప్రజలు తీవ్ర అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు నిర్మించ రైల్వే లైన్కు భూమి ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. భూ సేకరణ కాకుండా సమీకరణ చేయాలని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వారు ఆరోపిస్తున్నారు. బలవంతంగా భూసేకరణకు సిద్ధమైతే కోర్టును ఆశ్రయించక తప్పదని స్పష్టం చేస్తున్నారు.అమరావతి రైల్వే లైన్ కోసం గుంటూరు జిల్లాలో 1,753 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది.అమరావతి మండలం కర్లపూడి గ్రామంలోనే 232 ఎకరాలు సేకరించనున్నారు. ఇదే గ్రామంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం 153 ఎకరాలు, ఈ7, ఈ8, ఈ9 రోడ్లు, అవుటర్ రింగ్ రోడ్డు కోసం 900 ఎకరాలు కోల్పోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రైల్వే లైన్కు భూమి ఇవ్వాలని, దీనికి కేంద్రం ఇచ్చే ప్యాకేజి సరిపోదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానాశ్రయం కోసం ఎక్కడో ఉన్న గన్నవరంలో భూములిచ్చిన వారికి రాజ«దానిలో 1,450 గజాలు ల్యాండ్పూలింగ్ ప్యాకేజి కింద ఇచ్చారని, తమకు మాత్రం ఇవ్వకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.పెగ్ మార్కింగ్ ఎలా చేస్తారు?ప్రభుత్వం రైతులతో సమావేశాలు పెట్టినా, వారి అభ్యంతరాలు స్వీకరించకుండానే రైల్వే లైన్ భూసేకరణకు పెగ్మార్కింగ్కు సిద్ధపడుతోంది. ఇలా ఇష్టానుసారం పెగ్ మార్కింగ్కు షెడ్యూల్ ప్రకటించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం అమరావతి తహసీల్దార్తో జరిగిన సమావేశంలో కర్లపూడి రైతులు ఇదే విషయాన్ని చెప్పారు. పోలీసు బందోబస్తుతో పెగ్మార్కింగ్కు రావడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారని, ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.రాజధాని పరిసర ప్రాంతాల్లోని కంతేరు, కొప్పురావూరు, తాడికొండ, మోతడక గ్రామాల రైతులు రైల్వే లైన్ భూసేకరణను వ్యతిరేకిస్తూ గ్రామసభల్లో తీర్మానాలు కూడా చేశారు. రైల్వేలైన్ వల్ల పక్కన ఉన్న భూముల ధరలు కూడా పడిపోతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల పక్కనే 500 మీటర్ల వరకూ భూమిని సేకరించి, రైల్వే లైన్కు రెండువైపులా సర్వీస్రోడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఇంత అన్యాయమా?ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా భూముల ప్రభుత్వ విలువ పెంచిన రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని, పరిసర ప్రాంతాల్లో మాత్రం పెంచలేదు. ఇదేమి అన్యాయమని రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల రైల్వే లైన్ భూ సేకరణలో తాము తీవ్రంగా నష్టపోతామని చెబుతునానరు. తమ గ్రామంలో భూమి ప్రభుత్వ విలువ రూ. 16 లక్షలు ఉంటే దాన్ని కేవలం రూ. 4 లక్షలు పెంచి రూ. 20 లక్షలు చేశారని, మిగిలిన చోట్ల అసలు పెంచలేదని కర్లపూడి రైతులు చెబుతున్నారు.బహిరంగ మార్కెట్లో తమ భూముల ఎకరా దాదాపు రూ. 4 కోట్లు ఉండగా, ఇప్పుడు రైల్వే నుంచి రూ. 50 లక్షలు కూడా రావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క రైల్వే ప్యాకేజికి అదనంగా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చే ప్యాకేజిలో 33 శాతం అంటే 410 గజాల స్థలం ఇప్పిస్తామని మంత్రి నారాయణ ఇటీవల రైతులకు సర్దిచెప్పారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 650 గజాల వరకు ఇప్పించడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. అయితే దీనికి కూడా రైతులు అంగీకరించడంలేదు. పూర్తిగా పూలింగ్ ప్యాకేజి ఇవ్వాలని కోరుతున్నారు.రాజధాని రైతులకు ఇచ్చినట్లుగా ఫారం.9.14 ఇవ్వాలని, అందులో ఎంత భూమి ఇస్తారు, ఇళ్ల స్థలం ఎంత, వాణిజ్య స్థలం ఎంత? కౌలు ఎన్ని సంవత్సరాలు ఇస్తారన్న విషయాలను స్పష్టం చేయకుండా భూములు ఇచ్చేది లేదని వారు చెబుతున్నారు. అసలు రైల్వే లైన్ అలైన్మెంటే తప్పు అని రైతులు అంటున్నారు. ల్యాండ్ పూలింగ్ చేసిన గ్రామాల నుంచి కాకుండా బయట నుంచి రైల్వే లైన్ వెళ్లడం వల్ల 4 కిలోమీటర్ల దూరం పెరుగుతుందని వాదిస్తున్నారు. గతంలో ఇచ్చిన మాస్టర్ ప్లాన్ను కదపకుండా బయట నుంచి అలైన్మెంట్ ఇచ్చామని మంత్రి నారాయణ చెబుతున్నారు. -
రైతు బజార్లలో సబ్జి కూలర్లు
కూరగాయలు, పండ్లు నిల్వ చేసుకునేందుకు వీలుగా ఐఐటీ బాంబే విద్యార్థులు అభివృద్ధి చేసిన సబ్జి కూలర్లను రాష్ట్రంలోని రైతుబజార్లలో రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. టమాటాలు, దోసకాయలు, కాప్సికమ్, ఆకుకూరలను 3 నుంచి 5 రోజులు, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, బెండకాయలు వంటి ఇతర కూరగాయలతోపాటు పండ్లు, పూలు వంటివి తాజాదనం కోల్పోకుండా 6 నుంచి 7 రోజులపాటు వీటిలో నిల్వ చేయవచ్చు. ఏడు లేయర్ల ఎవాపరేటివ్ కూలింగ్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ సబ్జి కూలర్లు సాధారణ విద్యుత్ లేదా సౌర విద్యుత్ ఆధారంగా పనిచేస్తాయి. – సాక్షి, అమరావతిమూడు మోడల్స్లో సబ్జి కూలర్లుఈ సబ్జి కూలర్లను 100 కేజీలు (ధర రూ.50వేలు), 50 కేజీలు (రూ.35,400), 25 కేజీలు (రూ.17,700) సామర్థ్యంతో అభివృద్ధి చేశారు. వీటిని పైలట్ ప్రాజెక్టుగా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 13మంది రైతులకు 50 శాతం సబ్సిడీపై అధికారులు ఇచ్చారు. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరం నగరాల్లోని ఎనిమిది రైతుబజార్లలో రైతులు అందరూ ఉపయోగించుకునేలా మార్కెటింగ్ శాఖ ఏర్పాటుచేసింది.వీటి పనితీరును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వీటిని పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో 59 రైతుబజార్లలో ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత మిగిలిన రైతుబజార్లలో కూడా వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. రైతుబజార్లలో రైతులకు కనీసం 100 కేజీల సామర్థ్యం కలిగిన కూలర్లను 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేయాలని సంకల్పించారు.కుప్పంలో 50 మంది రైతులకు...కుప్పంలో 50 మంది పూల రైతులకు సబ్జి కూలర్లు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. యూనిట్ విలువలో 50శాతం ఉద్యానవన శాఖ భరిస్తుంది. మిగిలిన మొత్తాన్ని పొదుపు సంఘాలు, విలేజ్ ఆర్గజనైషన్స్(వీవో) భరించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. కుప్పంలో ఈ నెల 20వ తేదీన రైతులకు ఈ సబ్జి కూలర్లను ప్రదర్శించనున్నారు. అనంతరం 28వ తేదీన పొదుపు సంఘాలు, వీవోల నుంచి అర్హులైన వారిని ఎంపిక చేస్తారు. మార్చి 5న అర్హులను ఎంపకి చేసి, 15వ తేదీలోగా లబ్ధిదారులు తమ వాటా డబ్బులు చెల్లించేలా గడువు ఇస్తారు. మార్చి 31వ తేదీన లబ్ధిదారులకు సబ్జి కూలర్లు పంపిణీ చేయాలని ప్రణాళిక రూపొందించారు. -
రైతుకు సాయం ఎక్కడ?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధాన్యంసహా ప్రధాన పంట ఉత్పత్తులకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కనీస మద్దతు ధరలు దక్కని దుస్థితి నెలకొందని ఏపీ కౌలు రైతుల సంఘం(ap tenant rythu sangam) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.రాధాకృష్ణ, ఎం.హరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇచ్చిన ఎన్నికల హామీలను రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోతోందన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం ‘ఆదాయం వచ్చే ఉద్యాన, వాణిజ్య పంటలకు ప్రోత్సాహం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందంటూ’ పేర్కొనడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన ఆహార పంటలను దెబ్బతీసి, వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పచెప్పాలన్న ప్రయత్నమేనని మండిపడ్డారు. శనివారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రకటనలో ముఖ్యాంశాలు..⇒ ధాన్యం కనీస మద్దతు ధర 75 కేజీల బస్తాకు రూ.1,730లు ఇవ్వాల్సి ఉండగా, రాష్ట్రంలో ఒక్కరైతుకూ ఈ ధర దక్కలేదు. కేవలం రూ.1,400–1,500 మధ్య చెల్లించారు. ⇒ పత్తికి గతేడాది రూ.12వేలు ఉంటే, ఈ ఏడాది రూ.6వేలు, మిరపకు గతేడాది రూ.25వేలు ఉంటే, ఈ ఏడాది రూ.13వేలు, కందికి గతేడాది రూ.10 వేలుంటే, నేడు రూ.7వేలుకు మించి పలకడం లేదు. ⇒ అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుకు రూ.20వేల పెట్టుబడి సాయం మాటలకే పరిమితమయ్యింది.పక్క రాష్ట్రాలను చూస్తే...⇒ కేరళలో 16 రకాల పంటలకు స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం ఉత్పత్తి ఖర్చులకు 50 శాతం కలిపి మద్దతు ధరలను నిర్ణయించడమే కాకుండా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది.⇒ ఒరిస్సాలో ఈ ఏడాది నుంచి ధాన్యానికి ఎమ్మెస్పీకి రూ.800 బోనస్ కలిపి క్వింటాకు రూ.3,100 చొప్పున చెల్లించింది.⇒ తెలంగాణలో కూడా క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. -
పండినా ‘ఫలం’ లేదాయె!
పంటలు బాగా పండితే ధరలుండవు. మంచి ధరలున్నప్పుడు దిగుబడి సరిగా రాదు. రాష్ట్రంలోని ఉద్యాన రైతుల దీనస్థితి ఇది. ‘ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రా’గా పిలుచుకునే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ ఏడాది ఉద్యాన పంటల దిగుబడి ఆశించిన మేరకు వచ్చినా ధరలు లేక రైతులు దారుణంగా నష్టపోయారు. వాణిజ్య పంటలైన ద్రాక్ష, డ్రాగన్ ఫ్రూట్ వంటివి పంటలకు సైతం ఆశించిన ధర లభించక ఆర్థికంగా దెబ్బతిన్నారు. – సాక్షి ప్రతినిధి, అనంతపురంచీనీ రైతులకు నష్టాలేఆంధ్రప్రదేశ్లో మేలిమి రకం చీనీ అనంతపురం జిల్లాలోనే పండుతుంది. ప్రస్తుతం టన్ను చీనీ ధర రూ.20 వేలు కూడా పలకడం లేదు. తొలినాళ్లలో గరిష్టంగా రూ.40 వేలు పలికింది. టన్నుకు రూ.60 వేల లభిస్తేనే రైతుకు బాగా గిట్టుబాటు అవుతుంది. గత ఏడాది డ్రాగన్ ఫ్రూట్స్ టన్ను ధర రూ.1.80 లక్షలు పలికింది. ఈ ఏడాది రూ.1.20 లక్షలకు పడిపోయింది. దానిమ్మకు మంచి ధరలు ఉన్నా.. అకాల వర్షాలు, వైరస్, తెగుళ్లతో దిగుబడి సరిగా రాలేదు.టమాట రైతు చిత్తుఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా టమాట, పచ్చిమిర్చి రైతులు విలవిల్లాడుతున్నారు. ఈ పంటలు టన్నుల కొద్దీ దిగుబడి వచ్చినా ధరలు లేక నష్టపోయారు. టమాటాలకు ఐదు నెలలుగా కేజీ రూ.10కి మించి ధర లేదు. ఒక్కోసారి కూలి ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నారు. కొన్నిసార్లు ధరలు లేక మండీలోనే టమాట బాక్సులను వదిలేసి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఇక కందిరైతు అవస్థలు చెప్పడానికి లేదు. ధర గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. క్వింటాల్కు రూ.7,500 కనీస మద్దతు ధర కల్పించాలని రైతులు రోడ్డెక్కినా.. సర్కారు కనికరించడం లేదు. గిట్టుబాటు కావడం లేదునేను రెండు ఎకరాల్లో మిరప సాగు చేశాను. సుమారు రూ.రెండు లక్షల పెట్టుబడి పెట్టాను. ప్రస్తుతం క్వింటాల్ ధర రూ.15 వేలు ఉంది. ధరలు ఉన్నట్టుండి పడిపోయాయి. దీంతో పూర్తిగా నష్టం వచ్చింది. ఒకప్పుడు క్వింటాల్ ధర రూ.35 వేలు ఉండేది. ఇలా ఉంటేనే మిరప రైతుకు లాభం. లేదంటే అప్పుల్లో కూరుకుపోవాల్సిందే. – రవి, మిరప రైతు, ఒంటిమిద్ది, కళ్యాణదుర్గం మండలంధర పడిపోయిందిగత ఏడాదికీ ఇప్పటికీ చూస్తే డ్రాగన్ ఫ్రూట్స్ ధర పడిపోయింది. గతంలో టన్ను రూ.1.80 లక్షల వరకూ పలికింది. ఇప్పుడు ధర పూర్తిగా పడిపోయింది. ఉత్పత్తి ఎక్కువై ఇలా అయిందా.. మార్కెట్లోనే రేటు లేదా అనేది అర్థం కావడం లేదు. – రమణారెడ్డి, మర్తాడు, గార్లదిన్నె మండలం -
ఎకరంలోపు రైతులకు ‘తొలి’ భరోసా
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసా పథకం అమల్లో భాగంగా తొలుత ఎకరం విస్తీర్ణం వరకున్న సాగు భూములకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం విడుదల చేసింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 17.03 లక్షల రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.533 కోట్లకు పైగా నిధులు జమ చేసింది. గత నెల 26న రైతు భరోసా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుని 27వ తేదీన 4,41,911 మంది రైతుల ఖాతాల్లో రూ.593 కోట్లు జమ చేశారు. దీంతో ఇప్పటివరకు దాదాపుగా 21.45 లక్షల మంది రైతులకు రూ.1,126.54 కోట్ల మొత్తాన్ని రైతుభరోసా కింద అందజేసినట్లయింది. 72 లక్షల మందికి పైగా రైతులకు... రాష్ట్రంలో తాజాగా నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వే ప్రకారం కోటిన్నర ఎకరాలకు పైగా వ్యవసాయ యోగ్యమైన భూమిని రైతు భరోసాకు అర్హత గలదిగా తేల్చారు. 72 లక్షల మందికి పైగా రైతుల వద్ద ఉన్న ఈ భూములన్నింటికీ ఖజానాలో నిధుల లభ్యతను బట్టి రైతుభరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖజానాలో ఉన్న నిధులను బట్టి విడతల వారీగా రెండు, మూడు ఎకరాల ప్రాతిపదికన రైతులకు పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం ఎకరం వరకు ఉన్న భూమికి రైతు భరోసా నిధులివ్వగా, ఎకరం పైబడి రెండు ఎకరాల వరకు గల రైతులకు త్వరలోనే ఈ పథకం కింద నిధులను జమ చేయనున్నారు. అయితే సరిగ్గా ఎప్పుడు మలివిడత నిధులు విడుదల చేస్తారనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. వ్యవసాయ యోగ్యం కాని భూములు 2.50 లక్షల ఎకరాలు! రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యం కాని భూములు అటు ఇటుగా రెండున్నర లక్షల ఎకరాలని అధికారులు లెక్క తేల్చినట్లు తెలిసింది. గత నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ ఎక్స్టెన్షన్ అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా జరిపిన సర్వేలో 2.10 లక్షల ఎకరాలు సాగు యోగ్యం కానివిగా గుర్తించగా, 21 నుంచి 24వ తేదీ వరకు సాగిన గ్రామ సభల్లో వచ్చిన విజ్ఞప్తులు, ఫిర్యాదుల అనంతరం వాటి విస్తీర్ణం 2.50 లక్షల ఎకరాలకు పెరిగినట్లు తెలిసింది. హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి, యాదాద్రి–భువనగిరి, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాల్లో రియల్ వెంచర్లుగా, ఇతర అవసరాలకు వినియోగిస్తున్న భూములపై ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా పలు జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో తొలుత వ్యవసాయ యోగ్యం కాని భూములుగా గుర్తించిన వాటిని తర్వాత సాగుకు పనికొచ్చేవిగా మార్చారు. ఈ కసరత్తు కోసం ప్రభుత్వం దాదాపు వారం రోజుల సమయం తీసుకుంది. కూడికలు, తీసివేతల తరువాత సాగు యోగ్యం కాని భూముల విస్తీర్ణం 2.50 లక్షల ఎకరాలుగా నిర్ధారించినట్లు తెలిసింది. రైతులకిచ్చిన మాట నిలబెట్టుకుంటాం రైతులకిచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం రైతు భరోసా నిధులను నిర్ణీత కాల వ్యవధిలో చెల్లిస్తుంది. ఈ పథకం కింద ఇప్పటివరకు రూ.1,126.54 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఇప్పటికే రైతుబంధు (కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో) కింద రూ.7,625 కోట్లు, రుణమాఫీకి రూ.20,616.89 కోట్లు, రైతు భీమాకు రూ.3000 కోట్లు చెల్లించాం. పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. గతంలో ఎన్నడూలేని విధంగా రూ.14,893 కోట్లతో 20,11,954 మెట్రిక్ టన్నుల పత్తిని మద్దతు ధరకు సేకరించాం. రూ. 406.24 కోట్లతో సోయాబీన్, పెసర, కంది పంటలను మార్క్ఫెడ్ ద్వారా మద్దతు ధరకు కోనుగోలు చేశాం. యాసంగిలో 48.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రూ.10,547 కోట్లు వెచ్చించి సేకరించాం. సన్న ధాన్యానికి రూ.500 బోనస్ కింద రూ.1,154 కోట్లు రైతులకు అందజేశాం. ఈ యాసంగికి కూడా సన్నాలకు బోనస్ కొనసాగిస్తాం. – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు -
రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నగదు జమ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం బుధవారం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. మండలాల్లో గ్రామాల వారీగా నగదు జమ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేసింది. మొత్తంగా 17.03 లక్షల రైతుల అకౌంట్లకు ఇవాళ రైతుభరోసా నిధులు జమ కానున్నట్లు సమాచారం. నాలుగు పథకాల అమలులో భాగంగా.. గణతంత్ర దినోత్సవంనాడు రైతు భరోసా నిధులను విడుదల చేసింది. అయితే ఆరోజు సెలవు రోజు కావడంతో.. ఆ మరుసటిరోజు రాష్ట్ర ప్రభుత్వం 32 జిల్లాల్లోని 563 గ్రామాల్లో 4,41,911 మంది రైతులకు ఒక్కో ఎకరానికి తొలి విడతగా రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించింది. ఆయా గ్రామాల్లో 9,48,333 ఎకరాల విస్తీర్ణంలోని సాగుభూమికి రూ.569 కోట్లను చెల్లించింది. ఇక భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థికసాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి శ్రీకారం చుట్టింది. మొదటి రోజున 18,180 కుటుంబాలకు మొదటి విడతగా రూ.6 వేల నగదును వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకానికి తొలి రోజున ఆర్థికశాఖ రూ.10.91 కోట్లు విడుదల చేసింది. రైతు భరోసా నగదు జమ ఆలస్యం అవుతుండడంతో.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. -
నిత్య ఆదాయం..పచ్చ తోరణం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: నిత్య కల్యాణం.. పచ్చతోరణం అనే నానుడిని అక్కడి రైతులు ‘నిత్య ఆదాయం.. పచ్చతోరణం’గా మార్చేసుకున్నారు. 300 ఏళ్లుగా వారసత్వ సాగునే కొనసాగిస్తూ అలనాటి వ్యవసాయ పద్ధతులను నేటికీ ఆచరిస్తున్నారు. సేంద్రియ విధానంలో ఆకు కూరల్ని పండిస్తున్నారు. తమ గ్రామం నుంచే ఆకు కూరల సాగు తెలుగు రాష్ట్రాలకు విస్తరించిందని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎనీ్టఆర్ జిల్లా నందిగామ మండలంలోని కంచల గ్రామంలోకి అడుగు పెడితే... మునేరు ఒడ్డున.. పోషకాల వడ్డన మునేరుకు ఒడ్డున గల కంచల గ్రామంలో ఇసుకతో కూడిన తువ్వ (మెతక) నేలలు ఉండటంతో ఆ గ్రామ రైతులు ఆకు కూరల సాగుకు అనువుగా మలచుకున్నారు. ఈ నేలలో పండించిన ఆకు కూరలు రుచికి పెట్టింది పేరుగా మారాయి. పోషకాల పుట్టినిల్లుగా రెండు తెలుగు రాష్ట్రాలకు పోషక విలువలతో కూడిన ఆకు కూరలను నిత్యం ఇక్కడి రైతులు సరఫరా చేస్తున్నారు. తమ తాత ముత్తాతలు ఏ విధానంలో ఆకు కూరల్ని పండించారో నేటికీ అదే పద్ధతుల్ని అనుసరిస్తున్నారు. పశువుల పేడ, వానపాముల ఎరువు వినియోగించడం వల్ల మంచి నాణ్యతతో కూడిన ఆకు కూరలు ఉత్పత్తి చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. మార్కెట్లో కంచల ఆకు కూరలకు డిమాండ్ ఉంది. తాము పండించిన ఆకు కూరలను రైతులే నేరుగా విజయవాడ, నందిగామ, జగ్గయ్యపేట, కోదాడ, హైదరాబాద్ వరకు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. ఏడాది మొత్తం రోజూ ఆదాయం వచ్చే ఆకు కూరలకు కాలంతో సంబంధం లేకుండా పండిస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉండటంతో తమ పూర్వీకులు ఆకు కూరల సాగును ఎంచుకున్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. ఎకరాకు రూ.30 వేల కౌలు రెండు వేలకు పైగా జనాభా ఉన్న కంచల గ్రామంలో కులం, మతం భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఆకు కూరలను కలిసిమెలిసి సాగు చేస్తున్నారు. వీరికి చెరువుల కింద సాగు భూమి ఉన్నప్పటికీ ఆ భూమిలో తినడానికి వరి పండిస్తూ.. మెట్ట భూములను కౌలుకు తీసుకుని మరీ ఆకు కూరలను సాగు చేస్తున్నట్టు చెప్పారు. ఏడాదికి కౌలు రూపంలో ఎకరానికి రూ.30 వేల వరకు చెల్లిస్తున్నామన్నారు. కౌలు, పెట్టుబడి పోగా ఎకరానికి రూ.70 వేల నుంచి రూ.2 లక్షల వరకు వార్షికాదాయం పొందుతున్నట్టు చెప్పారు. గ్రామంలో 1,000కి పైగా ఎకరాల్లో ఆకు కూరలు పండిస్తున్నట్టు పేర్కొన్నారు. మునేరు పొంగితే నష్టమే..భారీ వర్షాలు కురిసినప్పుడు మునేరు పొంగి పంటలకు నష్టం వాటిల్లుతోంది. గతేడాది ఆగస్ట్లో వచ్చిన వరదలకు పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని రైతులు చెప్పారు. సొంత విత్తనాలతోనే.. కంచల రైతులు విత్తనాలను సొంతంగానే తయారు చేసుకుంటున్నారు. తోటకూర, బచ్చలికూర, పాలకూర, గోంగూర, పొన్నగంటికూర, మెంతికూర, చుక్కకూర, కొత్తిమీర, కరివేపాకు వంటి ఆకు కూరలను సాగు చేస్తూ వీటినుంచి వచ్చే విత్తనాలనే సేకరిస్తున్నారు. తమకు సరిపడా ఉంచుకుని ఇతర గ్రామాల రైతులకు విక్రయిస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు. కంచల గ్రామ ఆకు కూరలకు ప్రత్యేక గుర్తింపు ఉండటంతో మార్కెట్లో లభించే విత్తనాల కంటే ఇక్కడి విత్తనాలకు డిమాండ్ ఎక్కువ.సొంతంగా విత్తనాల తయారీ మేం పండిస్తున్న ఆకు కూరల విత్తనాలను మేమే తయారు చేసుకుంటాం.దీంతో మంచి దిగుబడులు సాధిస్తున్నాం. విత్తనాల ఖర్చూ తగ్గుతుంది. మేం పండించే ఆకు కూరలతో పాటు ఇక్కడి విత్తనాలకు కూడా మంచి డిమాండ్ ఉంది..– ఎం.భూలక్ష్మి, ఆకు కూరల రైతువరదలతో తీవ్ర నష్టం మా పెద్దోళ్ల కాలం నుంచి ఆకు కూరలనే పండిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నాం. రూ.లక్షల్లో ఆదాయం రాకపోయినా రోజువారీ కూలీ రూ.500కి తగ్గకుండా ఆదాయం వస్తుంది. ఇటీవల మునేరు వరదతో తీవ్రంగా నష్టపోయాం. – చలమల సుబ్బారావు, ఆకు కూరల రైతు -
అన్నదాత ఆశలపై నీళ్లు
సాక్షి, అమరావతి: వ్యవసాయ, అనుబంధ రంగాలకు కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై మిశ్రమ స్పందన లభిస్తోంది. వ్యవసాయ రంగంలో పలు మిషన్ల ఏర్పాటు చేయడం ఒకింత మేలు చేస్తుందంటున్న నిపుణులు.. పీఎం కిసాన్ యోజన వంటి కొన్ని పథకాల సాయాన్ని పెంచకపోవడం రైతుల ఆశలపై నీళ్లు చల్లడమేనని చెబుతున్నారు. పీఏం కిసాన్ యోజన సాయం పెంచుతారని రైతులు ఎంతగానో ఎదురు చూశారు.ఈ పథకం కింద ఏటా మూడు విడతల్లో రూ.6 వేల చొప్పున అందించే పెట్టుబడి సాయాన్ని కనీసం రూ.10 వేలకి పెంచాలన్న డిమాండ్ను కేంద్రం ఆమోదిస్తుందని ఆశించారు. అయితే ఈ డిమాండ్ను కేంద్రం పట్టించుకోకపోవడం పట్ల రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఏటా ఇచ్చినట్టే ఈ ఏడాది కూడా బడ్జెట్లో రూ.186 కోట్లు కేటాయించారు. ఆక్వా, మత్స్య రంగాలకు ఎలాంటి కేటాయింపులు జరపకపోవడం పట్ల ఆ రంగాల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రొయ్యలు, చేపల ఫీడ్పై ఇంపోర్ట్ డ్యూటీని రద్దు చేయాలన్న విజ్ఞప్తిని కేంద్రం ఏమాత్రం పరిగణనలోకి తీసుకపోవడం పట్ల జాతీయ రొయ్య రైతుల సమాఖ్య నిరసన తెలిపింది.మిషన్లతో కొంత మేలుబడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు లేకపోయినప్పటికీ కేంద్రం ప్రకటించిన పలు మిషన్ల ద్వారా రాష్ట్రానికి కొంత మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కొత్త వంగడాలు, పత్తి ఉత్పాదకత పెంచేందుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక మిషన్లను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయాల నుంచి ఏటా పదుల సంఖ్యలో కొత్త వంగడాలు విడుదలవుతున్నాయి.కొత్తగా ఏర్పాటు చేసిన హైబ్రిడ్ విత్తన మిషన్ రాష్ట్రంలో పరిశోధనలకు మరింత ఊతమిస్తుందని, మరిన్ని కొత్త వంగడాల అభివృద్ధికి నిధులు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఏటా 15 నుంచి 16 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. 18.78 లక్షల టన్నుల దిగుబడులొస్తాయి. సాధారణంగా బోర్ల కింద 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ ఏడాది మాత్రం 7 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. గడిచిన ఐదేళ్లలో క్వింటా రూ.10వేలకు పైగా పలికిన పత్తి ప్రస్తుతం ఐదారు వేలకు మించి పలకక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఏర్పాటు చేస్తున్న పత్తి మిషన్ రాష్ట్రంలో పత్తి సాగు విస్తరణకు, ఉత్పాదకత పెంచేందుకు దోహదపడుతుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పప్పు దినుసుల కోసం ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేయడం రాష్ట్రంలో అపరాల సాగుకు కొంత మేర ప్రోత్సాహకరంగా ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్రంలో ఖరీఫ్లో 7.50 లక్షల ఎకరాల్లో, రబీలో 23 లక్షల ఎకరాల్లో అపరాలు సాగవుతుంటాయి. రెండు సీజన్లకు కలిపి 62 లక్షల టన్నుల దిగుబడులొస్తాయి. ప్రత్యేక మిషన్ ద్వారా సాగు విస్తీర్ణం, ఉత్పాదకత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.రుణ పరపతి పెంపుతో 55 లక్షల మందికి లబ్ధికిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా వడ్డీ రాయితీ రుణ పరపతిని రూ.5 లక్షలకు పెంచడం ద్వారా రాష్ట్రంలో రైతులతో పాటు ఆక్వా, పాడి రైతులకు కూడా మేలు జరగనుంది. సుమారు 55 లక్షల మంది రైతులకు లబ్ధి కలుగుతుందని అంచనా వేస్తున్నారు. స్వల్ప కాలిక వ్యవసాయ రుణాలకు కూడా ఈ వడ్డీ రాయితీ వర్తిస్తుంది.సాధారణంగా ఇలా పొందిన రుణాలకు రూ.లక్ష వరకు సున్నా వడ్డీ రాయితీ ఇస్తుండగా, రూ. 3 లక్షల వరకు ఇంట్రస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ కింద 3 శాతం వడ్డీ రాయితీ పొందే అవకాశం ఉండేది. ఇక నుంచి రూ.5 లక్షల వరకు ఈ రాయితీ పొందే వెసులుబాటు కల్పించారు. -
సాగుకు ఊతమేది?
భారత్ను అభివృద్ధి పథంలో పయనింపజేసే కీలకమైన నాలుగు ఇంజిన్లలో వ్యవసాయం ఒకటని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వ్యవసాయ అభివృద్ధి– ఉత్పాదకతల్లో సాధించే ప్రగతి... గ్రామీణ భారతం తిరిగి పుంజుకోవ డానికీ, సౌభాగ్యవంతం కావడానికీ దారితీస్తుందని ఆమె 2025–26 బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. కానీ అందుకు తగిన కేటా యింపులు చేయడం మాత్రం మరిచారు. భూతాపం పెరుగు తున్న నేపథ్యంలో ప్రకృతిలో సంభవిస్తున్న వాతావరణ ప్రతి కూల ప్రభావాలు, అతివృష్టి, అనావృష్టి, సారం లేని నేలలు, నాణ్యత లేని విత్తనాలు వల్ల సగటు రైతులు పంట దిగుబడిలో తీవ్ర మార్పులు ఎదుర్కొంటున్నారు. బడ్జెట్లో ఈ పరిస్థితి నుంచి వారిని బయటపడవేయడానికి ఎట్లాంటి నిధులూ లేవు. ఈ ఏడాది వ్యవసాయ బడ్జెట్ రూ. 1,27,290.16 కోట్లుగా ప్రకటించారు. ఇది 2024–25లో రూ.1,22,528 కోట్లు, 2023–24లో రూ. 1,16,788 కోట్లుగా ఉంది. 2025–26 మొత్తం బడ్జెట్ అంచనా (బీఈ) రూ. 50,65,345 కోట్లు. అంటే వ్యవసాయానికి మొత్తం బడ్జెట్లో ఇచ్చింది కేవలం 2.51 శాతం మాత్రమే అన్నమాట. వ్యవసాయం, వ్యవసాయ పరిశోధన, చేపలు, పాడి పశువుల శాఖలకు కలిపి మొత్తం రూ. 1,45,300.62 కోట్లు. గత ఏడాది ఇది రూ. 1,39,607.54 కోట్లుగా ఉంది. వ్యవసాయ పరి శోధనకు గతేడాది రూ. 9,941.09 కోట్లు ఇస్తే ఈసారి రూ. 10,466.39 కోట్లు కేటాయించారు (పెరుగుదల 5.2 శాతం).ఆశ్చర్యంగా, పంటల దిగుబడి ప్రభుత్వ లెక్కలలో పెరుగుతోంది. అననుకూల పరిస్థితుల వల్ల కేరళ రాష్ట్రంలో 3 పంటలు పండించే ప్రాంతంలో ఒకే పంట వేస్తున్నారు. గత 10 ఏండ్లలో వేల ఎకరాల వ్యవసాయ భూమి రోడ్లకు, ఇంకా ఇతర అభివృద్ధి పనులకు మళ్ళింది. దాదాపు 100 నదులు ఎండిపోయాయి. ఇవేవీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పంటల దిగుబడి మీద వ్యతిరేక ప్రభావం చూపకపోగా... దిగుబడి పెర గడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పంటల విలువ పెరిగింది అని ఆర్థిక సర్వే చెబుతున్నది. అంటే ధరలు పెరిగినాయి. దీని వలన రైతుల ఆదాయం పెరగలేదు. కాగా ఆహార వస్తువుల ధరలు పెరిగాయి. అందువల్ల సాధారణ పౌరులకు అనేక పంట ఉత్పత్తులు అందుబాటులోకి రాకుండా పోతున్నాయి.ఆర్థిక మంత్రి తన 2024–25 బడ్జెట్ ప్రసంగంలో 9 ప్రాధాన్యాలను ప్రస్తావించారు. వ్యవసాయంలో దిగుబడి పెంచడం, వ్యవసాయాన్ని దృఢంగా సవాళ్ళను ఎదుర్కునే విధంగా తయారు చేయటం వంటివి ఇందులో ఉన్నాయి. అయితే ఏడాది గడిచేటప్పటికి ఈ ప్రాధాన్యాలు మరిచి పోయారు. పశుగణ అభివృద్ధికి, మత్స్య రంగానికి కలిపి రూ. 7,544 కోట్ల కేటాయింపు జరిగింది. వ్యవసాయ రంగ పెరుగు దలలో ఆర్థిక సర్వే కీలకంగా గుర్తించిన ఈ రెండు రంగాల మీద ప్రభుత్వం బడ్జెట్ పెరుగుదల 5 శాతం లోపే. మొత్తం బడ్జెట్ దిశ మారలేదు. ఈ రంగాల అభివృద్ధిని నిలువరిస్తున్న మౌలిక అంశాల మీద మాత్రం దృష్టి పెట్టలేదు. ప్రధానంగా నీటి వనరుల కాలుష్యం, పశువులకు దొరకని దాణా వంటి అంశాల మీద దృష్టి లేనే లేదు. వ్యవసాయ పరిశోధనలకు రూ. 9,504 కోట్లు కేటాయించారు. వ్యవసాయ శాఖ ఆఫీసు ఖర్చులు 167 శాతం పెంచిన ప్రభుత్వం, ‘ప్రధాన మంత్రి పంటల బీమా పథకా’నికి 13 శాతం కోత విధించింది. ఈ సారి ఇచ్చింది కేవలం రూ. 13,625 కోట్లు మాత్రమే. ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో, నకిలీ విత్తనాల బారిన పడి, రైతులకు పంట నష్టం పెరుగుతుంటే ఆదుకునే ఒకే ఒక్క బీమా పథకం తగ్గించడం శోచనీయం.రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ కూలీల కొరత, వ్యవ సాయ కూలీ భారం వంటి అంశాల మీద ఆర్థిక సర్వేతో పాటు బడ్జెట్ కూడా ప్రస్తావించలేదు. గ్రామీణ భారతంలో ఉన్న భూమి లేని వారి ఉపాధికి, దాని రక్షణకు కేటాయింపులు లేవు. గ్రామీణ శ్రామిక శక్తికి అవసరమైన వసతుల కల్పనకు, సంక్షేమానికి, ఉపాధి రక్షణకు నిధులు మృగ్యం. వ్యవసాయంతో గ్రామీణ శ్రామిక శక్తి అనుసంధానం గురించిన కేటాయింపులు లేవు. పెరుగు తున్న ఉష్ణోగ్రతల వల్ల శ్రామికుల ఉత్పాదకత శక్తి పడి పోతున్నది. ఆహార ద్రవ్యోల్భణం వల్ల సరైన పరిమాణంలో పౌష్టిక ఆహారం శ్రామిక కుటుంబాలకు అందడం లేదు. ఈ సమస్యలను ప్రభుత్వం గుర్తించకపోవటం దురదృష్టకరం.భారత ప్రభుత్వం పెరుగుతున్న ఆదాయాన్ని గ్రామీణ ప్రాంతాల మీద ఖర్చు చేయడం లేదు. కరోనా లాంటి కష్టకాలంలో ఉపాధి ఇచ్చి ఆదుకున్న వ్యవసాయానికి కాకుండా ఇతర రంగాలకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. వ్యవసాయంలో ఉపాధిని తగ్గించే డిజిటలీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోక పోగా హాని కలిగించే పనుల మీద దృష్టి సారించడం మంచిది కాదు. కేంద్ర బడ్జెట్లో తీవ్ర మార్పులు అవసరం ఉన్నాయి. దార్శనిక నిధుల కేటాయింపుల అవసరం ఎంతైనా ఉంది.డా‘‘ దొంతి నరసింహారెడ్డి వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు -
మానవాభివృద్ధి దిశగా!
2025–26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశ పెట్టారు. వ్యవసాయం; సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు; పెట్టుబడి, ఎగుమతుల అభివృద్ధిని వేగవంతం చేయడం, సమ్మిళిత సాధన, ప్రైవేటు రంగ పెట్టుబడులను ప్రోత్సహించడం, మధ్యతరగతి ప్రజల వినియోగ వ్యయ సామర్థ్యం పెంపు లాంటి లక్ష్యాల సాధన ‘వికసిత్ భారత్’ ఆకాంక్షలుగా ఆర్థిక మంత్రి అభివర్ణించారు. నూతన పన్ను వ్యవస్థలో భాగంగా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంపు వల్ల ప్రజల వ్యయార్హ ఆదాయాలు పెరిగి, కుటుంబ వినియోగ వ్యయం పెరుగుతుంది. తద్వారా దేశంలో సమష్టి డిమాండ్ పెరిగి, ఆర్థికాభివృద్ధి వేగవంతం అవుతుంది.బీమా రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించడం ఆహ్వానించద గిన పరిణామం. ఈ చర్య ఆరోగ్య బీమా రంగంపై దీర్ఘకాల ప్రభా వాన్ని కలుగజేస్తుంది. బీమా రంగంలో పెట్టుబడులు పెరగడంతో పాటు పోటీతత్వం పెరిగి బీమా పాలసీల రూపకల్పన, సేవల డెలి వరీలో నవకల్పనలు చోటుచేసు కుంటాయి. తద్వారా వ్యక్తులు, కుటుంబాలు తమ ఆరోగ్య సంర క్షణ వ్యయాన్ని సక్రమంగా నిర్వ హించుకోవడం ద్వారా నాణ్యతతో కూడిన ఆరోగ్య సేవలను పొంద గలుగుతారు. ఆర్థిక సేవల అందు బాటు దేశంలో మానవాభివృద్ధికి దారితీస్తుంది, ఆర్థికాభివృద్ధి వేగ వంతమవుతుంది.ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ను విద్యారంగానికి విస్తరించి పెట్టుబడులను ప్రకటించడం ద్వారా దీన్ని భవిష్యత్ సామాజిక – ఆర్థిక ప్రగతికి కారకంగా ప్రభుత్వం గుర్తించింది. అదనంగా పదివేల మెడికల్ సీట్లు, ఐఐటీలలో అదనంగా 6,500 సీట్ల పెంపు, నాణ్యతతో కూడిన శ్రామిక శక్తి పెంపు నవకల్పనలకు దారితీస్తాయి. గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పనపై పెట్టు బడులు, ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలకు దారితీసి, అధిక వినియోగం, మార్కెట్ విస్తరణకు నూతన అవకాశాలు ఏర్ప డతాయి. 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్కు కస్టమ్ సుంకాన్ని మినహా యింపునివ్వడం వల్ల పేషెంట్లపై ఆర్థిక ఒత్తిడి తగ్గి ఆరోగ్య ప్రమాణాలు మెరుగవుతాయి.బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీల క్షీణతకు మూలధన వ్యయంలో స్వల్ప పెరుగుదల కారణంగా భావించవచ్చు. 2024–25 ఆర్థిక సంవత్సరం మూలధన వ్యయంతో పోల్చినప్పుడు 2025–26లో మూలధన వ్యయంలో పెరుగుదల 10 శాతం మాత్రమే. ఆర్థికాభివృద్ధికి మూలధన వ్యయంలో పెరుగుదల అధికంగా లేనప్పుడు ఆ ప్రభావం ఉత్పాక రంగాలపై రుణాత్మకంగా ఉండి, వృద్ధి క్షీణతకు దారితీస్తుంది. ప్రభుత్వ కోశ విధానాలకు అనుగుణంగా స్టాక్ మార్కెట్లు స్పందిస్తాయి. 2024–25 ఆర్థిక సంవ త్సరం ద్రవ్యలోటు జీడీపీలో 4 శాతంగా నమోదు కావడం, పెరుగుతున్న ప్రభుత్వ రుణాలు, బాండ్ల రాబడి, ఈక్విటీ మార్కెట్లపై స్వల్పకాల ఒడుదొడుకులను కలుగజేస్తాయి. విదేశీ పెట్టుబడులను భారత్ అధికంగా ఆకర్షించడమనేది ప్రతి పాదిత బడ్జెట్ చర్యలు ఆర్థిక విస్తరణ, రాజకీయ సుస్థిరత, కార్పొరేట్ సంస్థల రాబడుల పెరుగుదలకు దారితీశాయా, లేదా అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది.ఆదాయపు పన్ను మినహాయింపు వలన పెరిగిన వ్యయార్హ ఆదాయాన్ని, వినియోగదారులు వినియోగ వ్యయంగా మరల్చగలరనే విషయంలోనూ అనిశ్చితి ఉంది. పన్ను రేట్ల తగ్గింపు స్వల్పకాల ప్రయోజనాలకే దారి తీస్తుంది. మరోవైపు అవస్థాపనా సౌకర్యా లపై పెట్టుబడులు అధికవృద్ధి సాధనకు దారి తీస్తాయి.రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వా మ్యంతో వంద జిల్లాల్లో వ్యవసాయ ఉత్పాదకత పెంపు, పంట మార్పిడి విధానాన్ని ప్రోత్సహించడం, సరకు నిల్వ, నీటి పారుదల సౌకర్యాల విస్తరణ, స్వల్పకాల, దీర్ఘకాల వ్యవసాయ పరపతి పెంపు లక్ష్యాలుగా, ‘ప్రధాన మంత్రి ధన్ – ధాన్య క్రిషి యోజన’ పథకాన్ని ప్రకటించారు. భారత్లో వ్యవసాయ రంగానికి సంబంధించి అధిక శాతం రైతులు ఉపాంత, చిన్న కమతాలపై ఆధా రపడి జీవనం సాగిస్తున్నారు. మొత్తం వ్యవసాయ భూమిలో రెండు హెక్టార్ల కన్నా తక్కువ ఉన్న కమతాల వాటా 86 శాతం. కమతాల విస్తీర్ణం తక్కువగా ఉండటం వలన ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులు అవలంబించలేకపోతున్నారు. బడ్జెట్లో ప్రతిపాదించిన సంస్క రణలు ముఖ్యంగా మేలు రకమైన వంగడాల వినియోగం,పంటమార్పిడి విధానాన్ని అవలంబించగలిగే సామర్థ్యం తక్కువగా ఉండటానికి రైతులలో ఆధునిక వ్యవసాయ పద్ధతు లపై అవగాహన లేకపోవడంతోపాటు, పరపతి లభ్యత తక్కు వగా ఉండటాన్ని కారణాలుగా పేర్కొనవచ్చు.స్టార్టప్లు, సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థలకు బడ్జెట్ ప్రతిపాదనలు అనుకూలంగా ఉన్నప్పటికీ లోప భూయిష్ఠ సప్లయ్ చెయిన్ వ్యవస్థ, అసంఘటిత రంగ కార్య కలాపాలు, సంస్థాపరమైన పరపతి లభ్యతలో ఇబ్బందులు అభివృద్ధికి అవరోధంగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.డా‘‘ తమ్మా కోటిరెడ్డి వ్యాసకర్త ప్రొఫెసర్ అండ్ డీన్, ఇక్ఫాయ్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఐఎఫ్ హెచ్ఇ, హైదరాబాద్ -
కాపలా పనిలేదు.. చీడపీడల బాధలేదు
గజ్వేల్: భూములు కలిగివున్నా ఎప్పటికప్పడు చూసుకోలేని, పంటల్ని కాపాడుకోలేని పరిస్థితుల్లో.. వ్యవసాయం చేయలేక బీడుగా ఉంచుతున్న రైతులకు అటవీ వ్యవసాయం చక్కని తరుణోపాయంలా మారుతోంది. ఇంతకాలం నిరుపయోగంగా ఉన్న భూముల్లో అటవీ మొక్కలను తోటల మాదిరిగా సాగు చేస్తున్నారు. సమయం చిక్కినప్పుడు వచ్చి చూసుకొని వెళుతున్నారు. సాధారణ వ్యవసాయంతో పోలిస్తే నామమాత్రపు పెట్టుబడి కావడం అధిక ఆదాయం లభిస్తుండటంతో దీనివైపు మొగ్గుచూపుతున్నారు. నేలలో సారం తగ్గకుండా కాపాడుతున్నారు. వాతావరణ కాలుష్య నియంత్రణకు దోహదపడుతున్నారు. సిద్దిపేట జిల్లా ములుగులోని సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ (సీఈసీ) ఈ కొత్త తరహా సాగుకు శ్రీకారం చుట్టి ఈ మేరకు రైతుల్ని ప్రోత్సహిస్తోంది.సాగుకు సర్కారు అనుమతివెదురు, సుబాబుల్, శ్రీగంధం, సరివి చెట్లు గతంలో అక్కడక్కడా రైతుల పొలం గట్లపై మాత్రమే కన్పించేవి. అటవీ ప్రాంతాల్లోనే వెదురు ఎక్కువగా ఉంటుంది. తాజాగా వీటిని తోటల మాదిరిగా విరివిగా పెంచి అమ్ముకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ములుగులోని సీఈసీ గత రెండేళ్లుగా అటవీ మొక్కల్లో మేలైన రకాలను ఉత్పత్తి చేస్తూ రైతులకు అందిస్తోంది. తమిళనాడు, అసోం, కేరళ రాష్ట్రాల్లోని పలు పరిశోధన కేంద్రాల నుంచి మేలైన వెదురు విత్తనాన్ని తెప్పించి భారీగా మొక్కల ఉత్పత్తి చేపడుతోంది. ప్రధానంగా బీ–స్ట్రిక్టస్, తుల్డా పేరుతో ఉన్న అత్యంత నాణ్యత కలిగిన మొక్కలను ఉత్పత్తి చేసి రైతులకు నామమాత్రపు ధరకు విక్రయిస్తోంది. సిద్దిపేటతో పాటు యాదాద్రి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, వరంగల్, మెదక్, ఖమ్మం, మహబూబ్నగర్ తదితర జిల్లాలకు చెందిన రైతులకు సరఫరా చేస్తోంది. వెదురు మాదిరిగానే శ్రీగంధం, సరివి, సుబాబుల్ మొక్కలను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. కేసీఆర్ ఫామ్హౌస్లోనూ..వ్యవసాయంలో వచ్చే మార్పులను నిరంతరం గమనిస్తూ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగుపై దృష్టి పెట్టే మాజీ సీఎం కేసీఆర్ సైతం అటవీ వ్యవసాయం వైపు మళ్లారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని తన ఫామ్హౌస్లో కూడా వెదురు పెంపకాన్ని చేపట్టారు. జగదేవ్పూర్ మండలంలో ఇటిక్యాలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి కిరణ్ ఆరు ఎకరాల్లో సాగు చేసిన వెదురు తోటను స్వయంగా పరిశీలించి వివరాలను తెలుసుకున్న కేసీఆర్...ఫామ్హౌస్లో ఇటీవలే వివిధ రకాల మొక్కలను తెప్పించి నాటించారు.మొక్కలు నాటితే చాలు..భూములు ఉన్నప్పటికీ ఇతర వృత్తుల రీత్యా బీజీగా ఉండటం, పంటలు వేసినా వాటిని పరిరక్షించుకోలేని పరిస్థితుల్లో చాలామంది బీళ్లుగా ఉంచేస్తున్నారు. ఇలాంటి వారికి అటవీ వ్యవసాయం చక్కని పరిష్కారంగా మారుతోంది. ఒకసారి మొక్కలు నాటితే చాలు ఈ తరహా మొక్కలు వాటంతట అవే పెరిగిపోతాయి. పైగా వీటిని చీడపీడలు ఆశించవు. ఎరువులు, క్రిమిసంహారకాల అవసరం లేదు. నీటి సదుపాయం కూడా పెద్దగా అవసరం లేదు. బిందు (డ్రిప్) సేద్యం తరహాలో అందిస్తే చాలు. దీంతో రైతులు పెద్ద సంఖ్యలో ఈ మొక్కల పెంపకం వైపు ఆకర్షితులవుతున్నారు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే అటవీ వ్యవసాయంతో భూముల్లో సారం స్థిరంగా ఉంటుందని, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేలా ఆక్సిజన్ అత్యధికంగా ఉండే గాలిని వెదురు మొక్కలు అందిస్తాయని సీఈసీ అధికారులు చెబుతున్నారు. ఈ తోటలతో ఇతర పంటల మాదిరిగా వెంటనే ఆదాయం రాకున్నా..రెండు మూడేళ్ల తర్వాత మంచి, మెరుగైన ఆదాయం మొదలవు తుండటంతో భూముల్ని బీళ్లుగా ఉంచడం కంటే ఇది మేలని రైతులు భావిస్తున్నారు. ఎన్ని సానుకూలతలో..ఒక్కసారి మొక్కలు నాటితే చాలు నిరంతర పర్యవేక్షణ అవసరం లేదు నీటి అవసరం అంతగా లేదుభూసారం తగ్గనే తగ్గదుచీడపీడలు సోకుతాయనే చింత లేదుక్రిమిసంహారకాలు, ఎరువులతో పనే లేదువెదురుతో అత్యధిక స్థాయిలో ఆక్సిజన్అటవీ వ్యవసాయానికి మంచి భవిష్యత్తు అటవీ వ్యవసాయానికి మంచి భవిష్యత్తు ఉంది. ఇప్పటికే రైతులు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో మేం కూడా మేలైన అటవీ మొక్కలను ఉత్పత్తి చేసి నామమాత్రపు ధరకే అందిస్తున్నాం. రాబోయే రోజుల్లో మరింత విరివిగా ఈ ప్రక్రియ చేపట్టనున్నాం. – శ్రీధర్, ఉద్యానవన శాఖ ఏడీ (ములుగు సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఇన్చార్జి)వెదురుకు విదేశాల్లో మంచి గిరాకీ నేను వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజినీర్ను. హైదరాబాద్లో ఉంటున్నా. మా స్వగ్రామం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని ఇటిక్యాలకు వచ్చి వ్యవసాయం చేయాలంటే సమయం కుదరడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆరు ఎకరాల్లో వెదురు సాగు చేశా. సీఈసీ నుంచి తుల్డా రకం మొక్కలు తెప్పించి వేశా. ఏడాది గడిచింది. మరో రెండేళ్ల తర్వాత నాకు మంచి ఆదాయం వచ్చే అవకాశముంది. గృహాలకు సంబంధించిన ఫర్నిచర్, ఇతర ఉపకరణాల కోసం ఇతర దేశాల నుంచి వెదురు దిగుమతి చేసుకుంటున్నారని తెలుసుకొని ఇది సాగు చేశా. ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఉన్నందువల్ల భారీగా లాభాలు రావచ్చని భావిస్తున్నా. – కిరణ్, సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఇటిక్యాల, సిద్దిపేట జిల్లా -
రైతులకు ‘సౌర’ పంట!
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం–కుసుమ్) పథకం కింద 4 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్కో) ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానించింది. రైతులు, రైతు సంఘాలు, సహకార సంఘాలు, పంచాయతీలు, రైతుల గ్రూపులు, నీటి వినియోగ సంఘాలు, డెవలపర్లు, ఎస్హెచ్జీల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కోరింది. రైతులు, ఇతరుల ఆధ్వర్యంలో 3 వేల మెగావాట్లు.. ఎస్హెచ్జీల ఆధ్వర్యంలో 1,000 మెగావాట్ల సామర్థ్యంగల ప్లాంట్ల ఏర్పాటుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. సొంత భూముల్లో కరెంటు ఉత్పత్తి ఎస్హెచ్జీలు, రైతులు వ్యక్తిగతంగా లేదా ఇతరులతో కలిసి తమ పొలాల్లో 0.5 మెగావాట్లు నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్ ప్లాంట్లను నెలకొల్పటానికి అవకాశం కల్పించారు. ఆర్థిక స్తోమత లేకుంటే డెవలపర్లకు తమ భూములను లీజుకు ఇచ్చి ప్లాంటు పెట్టించవచ్చు. లీజుకు ఇస్తే లీజు డబ్బును డిస్కంలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తాయి. ఒక మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు 4 ఎకరాల స్థలం అవసరం. ఈ ప్లాంట్లు ఉత్పత్తి చేసే విద్యుత్ను రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు 25 ఏళ్ల పాటు కొనుగోలు చేస్తామని హామీ ఇస్తూ ఒప్పందం చేసుకోనున్నాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) నిర్ణయించిన ధర ప్రకారం యూనిట్ విద్యుత్కు రూ.3.13 చొప్పున రైతులు, ఎస్హెచ్జీలకు డిస్కంలు చెల్లిస్తాయి. భవిష్యత్తులో ఈఆర్సీ నిర్ణయం మేరకు ఈ ధరల్లో మార్పులుంటాయి. ఒక మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంటు ద్వారా ఏటా సగటున 15–16 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. వ్యవస్థాపకులకు రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఎస్హెచ్జీలకు భూములు, 90% రుణాలు.. సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు ఒక మెగావాట్కు రూ.2.97 కోట్ల వ్యయం అవుతుందని రెడ్కో అంచనా వేసింది. ఎస్హెచ్జీలు 10 శాతం వాటా భరిస్తే, మిగిలిన 90 శాతాన్ని బ్యాంకులు రుణంగా ఇస్తాయి. అంటే, మెగావాట్ ప్లాంటు ఏర్పాటుకు ఎస్హెచ్జీలు రూ.29.7 లక్షలు పెట్టుబడి పెడితే, బ్యాంకులు రూ.2.61 కోట్లు రుణంగా ఇవ్వనున్నాయి. ప్లాంట్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఎస్హెచ్జీలకు ప్రభుత్వ, అటవీ, దేవాదాయ భూములను లీజుకు ఇవ్వనుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఆధ్వర్యంలో అత్యుత్తమ పనితీరు కలిగిన ఎస్హెచ్జీలను ఎంపిక చేసి, వారితో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుచేయిస్తారు. ఇక రైతులు 30 శాతం పెట్టుబడి పెట్టుకుంటే, మిగిలిన 70 శాతం మూలధనాన్ని బ్యాంకులు రుణంగా ఇవ్వనున్నాయి. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు 6 శాతం వడ్డీకే రూ.2 కోట్ల వరకు రుణం ఇచ్చేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ముందుకొచి్చంది. రూ.2 కోట్లకు మించిన రుణానికి 9 శాతం వడ్డీ వసూలు చేయనుంది. ఎస్బీఐ అధికారులతో బుధవారం ఇంధన శాఖ, సెర్ప్ అధికారులు జరిపిన చర్చల సందర్భంగా ఈ మేరకు నిర్ణయించారు. ఏడాదిలోగా పూర్తి చేయాలి.. రాష్ట్రంలోని ఒక్కో 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో ఎంత సామర్థ్యం మేరకు సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టే అవకాశం ఉందో డిస్కంలు ప్రకటించాయి. దీని ఆధారంగా రైతులు ప్లాంటు ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మెగావాట్కు రూ.5,000 దరఖాస్తు ఫీజును 18 శాతం జీఎస్టీతో కలిపి చెల్లించాలి. ప్లాంట్ కెపాసిటీ మెగావాట్కు మించితే రూ.10,000 దరఖాస్తు ఫీజుతో పాటు 18 శాతం జీఎస్టీ చెల్లించాలి. ఎంపికైన వ్యవస్థాపకులు లెటర్ ఆఫ్ అవార్డు (ఎల్ఓఏ) జారీ చేసిన 10 రోజుల్లోగా బ్యాంకు గ్యారెంటీగా మెగావాట్కు రూ.5 లక్షల చొప్పున డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ప్లాంట్ల నిర్మాణం ఈ ఏడాది డిసెంబర్ 31లోగా పూర్తి చేయాలని నిబంధనల్లో పేర్కొన్నారు. ప్లాంటు నుంచి సబ్ స్టేషన్ వరకు వ్యవస్థాపకులే ప్రత్యేక విద్యుత్ సరఫరా లైన్ వేసుకోవాలి. సబ్ స్టేషన్కు 5 కి.మీల పరిధిలోపల ప్లాంటు పెట్టుకునే వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఒకే సబ్ స్టేషన్ పరిధిలో ఒకరి కంటే ఎక్కువ మంది ప్లాంట్లు ఏర్పాటుచేస్తే.. అందరూ కలిసి ఒకే సరఫరా లైన్ వేసుకోవచ్చు. కొనుగోలు చేసే ప్రతి యూనిట్ విద్యుత్కు 40 పైసల చొప్పున ఐదేళ్ల పాటు డిస్కంలకు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ (ఎంఎన్ఆర్ఈ) ప్రోత్సాహకంగా అందిస్తుంది. మెగావాట్కు మొత్తం రూ.6.6 లక్షలకు మించకుండా ఈ ప్రోత్సాహం ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ దరఖాస్తుదారులు పీఎం కుసుమ్ తెలంగాణ వెబ్సైట్ www.pmkusum.telangana.gov.in లో ఫిబ్రవరి 28లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఏదైనా సబ్స్టేషన్ పరిధిలో సామర్థ్యానికి మించి ప్లాంట్ల ఏర్పాటుకు దరఖాస్తులు వస్తే రాష్ట్ర ప్రభుత్వ టెండర్ల వెబ్సైట్ https://eprocurement.telangana.gov.in ద్వారా రివర్స్ బిడ్డింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఎవరు ప్లాంట్ నిర్మించి తక్కువ ధరకు విద్యుత్ విక్రయించేందుకు ముందుకు వస్తే వారినే ఎంపిక చేస్తారు. ఎస్హెచ్జీల నుంచి దరఖాస్తులను స్వీకరించడం లేదు. పనితీరు ఆధారంగా సెర్ప్ అధికారులే వారిని ఎంపిక చేస్తున్నారు. -
ఎన్నికల ముందు పథకాల డ్రామా
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: స్థానికసంస్థల ఎన్నికలు వస్తుండటంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పథకాల డ్రామా ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు మండిపడ్డారు. ఆ ఎన్నికలు పూర్తయితే రైతుభరోసా బంద్ అవుతుందన్నారు. మంగళవారం నల్లగొండ గడియారం సెంటర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నాలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎన్జీ కాలేజీ నుంచి గడియారం సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడే నిర్వహించిన మహాధర్నాలో కేటీఆర్ ప్రసంగించారు. మేం నాట్లకు ముందు.. కాంగ్రెస్ ఓట్లకు ముందు‘రేవంత్కు.. ఎన్నికలప్పుడే పథకాలు గుర్తుకొస్తా యి. అవి పూర్తయితే పట్టించుకోరు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తుండటంతో ఓట్ల కోసం కొత్త డ్రామా అడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో నాట్లకు ముందు రైతుబంధు ఇచ్చాం. కానీ రేవంత్ ప్రభుత్వం రైతుభరోసా డ్రామా ఆడుతోంది’అని కేటీఆర్ దుయ్యబట్టారు. ఒక్క హామీనీ పూర్తిగా అమలు చేయలేదు ఆరు గ్యారంటీల పేరుతో మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని కేటీఆర్ విమర్శించారు. రూ. 2 లక్షల మేర రైతు రుణాలను డిసెంబర్ 9న మాఫీ చేస్తానని ప్రకటించి మోసం చేశారని ఆరోపించారు.ఏ ఊళ్లోనూ 100 శాతం రుణమాఫీ చేయలేదని.. యాసంగి రైతు భరోసా సైతం ఇవ్వలేదన్నారు. ఎన్నికల ముందు కేసీఆర్ రైతుబంధు ఇస్తానంటే రేవంత్రెడ్డి ఎన్నికల సంఘానికి లేఖ రాసి ఆపించారని కేటీఆర్ విమర్శించారు. వానాకాలం రైతు భరోసాను ఎగ్గొట్టారని, ఇప్పటివరకు ఒక్కో ఎకరానికి రూ.17,500 రేవంత్రెడ్డి బాకీ పడ్డారన్నారు. మోసం చేయడంలోనూ చరిత్రాత్మకమే బీఆర్ఎస్ రూ.12 వేలు రైతుబంధు ఇస్తానంటే, తాను రూ.15 వేలు ఇస్తానని చెప్పి రేవంత్రెడ్డి ప్రజలను మభ్య పెట్టారని కేటీఆర్ విమర్శించారు. ఓట్లు వేయించుకొని గెలిచాక సిగ్గులేకుండా రూ.12 వేలకు కుదించారన్నారు. ప్రజలను మోసం చేయడంలోనూ కాంగ్రెస్ది చరిత్రాత్మకమేనని ఎద్దేవా చేశారు. ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తానని చెప్పి, చివరకు సన్నాలకే ఇస్తానని మెలిక పెట్టి మోసం చేశారన్నారు. . కేసీఆర్ హయాంలో 11 విడతలుగా రైతుబంధు కింద రూ.73 వేల కోట్లు రైతుల అకౌంట్లలో వేశారని గుర్తు చేశారు. రైతులు తిరగబడాలి: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై తిరగబడాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యార్థులు, రైతు లు, చేనేత కారి్మకులు చనిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతుబంధు, రైతుభరోసా, రుణమాఫీ విషయంలో ప్రజలు తిరుగబడాలని, నల్లగొండ నుంచే పోరుబాట పట్టాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు అండగా ఉండేందుకే..: జగదీశ్రెడ్డి రైతులను మోసం చేస్తున్న రేవంత్రెడ్డి ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ఆ అన్యాయంపై పోరాడేందుకు బీఆర్ఎస్ ముందుంటుందన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్రెడ్డి చేస్తున్న మోసాన్ని ప్రజలకు చెప్పేందుకే కేటీఆర్ నల్లగొండ వచ్చారన్నారు. ప్రశ్నిస్తున్న రైతులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందన్నారు.పలువురు నేతల ఫోన్లు, గొలుసులు చోరీ నల్లగొండలో కేటీఆర్ పాల్గొన్న రైతు మహాధర్నాలో దొంగలు రెచ్చిపోయారు. ఎన్జీ కాలేజీ నుంచి బీఆర్ఎస్ నేతలు చేపట్టిన ర్యాలీలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, స్థానిక నేత హమీద్ సెల్ఫోన్లతోపాటు ఆరుగురు నేతల నుంచి సుమారు 11 తులాల బంగారు గొలుసులు కొట్టేశారు. దొంగల ముఠాలోని ఒకరిని టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆరోగ్యశ్రీ అంటే వై.ఎస్..రైతుబంధు అంటే కేసీఆర్ ఆరోగ్యశ్రీ పథకం పేరు చెప్పగానే ప్రజలందరికీ ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుకొస్తారని కేటీఆర్ చెప్పారు. అలాగే రైతుబంధు పథకం అనగానే మాజీ సీఎం కేసీఆర్ గుర్తుకొస్తారన్నారు. ఈ పథకాలను ఎవరూ చెరపలేరన్నారు. కానీ రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని పదేపదే చెబుతున్న సీఎం రేవంత్రెడ్డి రైతుబంధు పథకాన్ని బంద్ చేయాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. సామాన్యులకు రేషన్కార్డు కావాలన్నా, రైతుబంధు కావాలన్నా ప్రభుత్వం కేవలం దరఖాస్తులే తీసుకుంటోందని విమర్శించారు. -
ఆహార భద్రతకు ఆ ఆదాయమే కీలకం
ప్రస్తుత వేగంతో 2050 నాటికి ప్రపంచం మొత్తానికి ఆహారాన్ని అందించడమనే పెను సవాలును ఎదుర్కోవడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో బిగ్గరగానూ, స్పష్టంగానూ వ్యవసాయ శాస్త్ర వేత్తలు, పరిశోధకులు తమ లేఖ ద్వారా చేసిన హెచ్చరిక సకాలంలో వినిపించిన మేల్కొలుపులా కనపడుతోంది. ‘‘భవిష్యత్ ఆహార అవసరాలను తీర్చడానికి మనం సరైన మార్గంలో లేకపోగా, కనీసం దానికి సమీపంలో కూడా లేము’’ అని వారి లేఖ అప్రమత్తం చేసింది.14వ దలైలామా, జోసెఫ్ స్టిగ్లిడ్జ్, కైలాస్ సత్యార్థి, రాబర్ట్ హుబెర్, డరోన్ అసెమోగ్లు, సర్ జాన్ ఇ వాకర్ వంటి నోబెల్ గ్రహీ తలు, డాక్టర్ గురుదేవ్ ఎస్ ఖుష్, పెర్ పిన్ స్ట్రప్ ఆండర్సన్, రట్టన్ లాల్, హాన్స్ ఆర్ హెర్రెన్ వంటి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ గ్రహీతలు ఈ లేఖపై సంతకాలు చేసినవారిలో ఉన్నారు. ‘‘సైన్స్, ఆవిష్కరణల నాయకులుగా మేము ప్రపంచ ఆహార, పోషకాహార భద్రతకు హామీ నివ్వడానికి, ప్రపంచాన్ని మేల్కొలపటంలో, సామూహిక ఆకాంక్షలను పెంచడంలో మాతో చేరాలని, పరిశోధనాపరమైన పెద్ద ముందంజ వేయాలని మిమ్మల్ని కోరుతున్నాము’’ అని ఆ లేఖ ముగుస్తుంది.2050 నాటికి ప్రపంచం 980 కోట్ల మంది ప్రజల అవసరాలను తీర్చడానికి తగినంత ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి పూనుకుంటున్న వేళ, దాదాపు 80 కోట్లమందిని ఆకలితో అలమటింపజేస్తున్న ఆహార కొరత అనేది ఉత్పత్తి పడిపోవడం వల్లనే ఏర్పడలేదు. ఆహార కొరత కేవలం తప్పుడు విధానాల ఫలితమేనని అందరూ గ్రహించాలి. ‘హంగర్స్ టిప్పింగ్ పాయింట్’ అనే శీర్షికతో కూడిన ఆ లేఖ... ‘వాతావరణ మార్పులతో ముడిపడి ఉన్న సాధారణమైన తీవ్ర వాతావరణ ఘటనల’ గురించి ఈ శతాబ్ది మధ్యనాటికి ఆహార, పోషకాహార సంక్షోభం మరింత తీవ్రమవడం గురించి మాట్లాడుతుంది. ఇక ఆ లేఖలోనే సరిగ్గానే వేర్కొన్నట్లుగా.. నేలకోత, భూమి క్షీణత, జీవవైవిధ్య నష్టం, నీటి కొరత, సంఘర్షణలు వంటి అదనపు అంశాలు ఆహార ఉత్పాదకతను తగ్గిస్తాయి.ఇది కచ్చితంగా ఆందోళన కలిగించే విషయమే. ఆఫ్రికాకు ప్రధాన ఆహారమైన మొక్కజొన్న గురించి ఆ లేఖలో పేర్కొన్నప్పటికీ భవిష్యత్తులో ఆహార దిగుబడి తగ్గుతుందనే అంచనాల వల్ల ఆ పంటకు నిజంగానే ముప్పు పొంచి ఉంది. అయితే చేతులు కలిపి సహకరించాల్సిన తక్షణ అవసరాన్ని ప్రపంచం గ్రహించేవరకు, ఆహార, పోషకాహార భద్రతకు సంబంధించిన ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడం సాధ్యం కాదు. ఉదాహరణకు, ఆఫ్రికా తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నప్పటికీ, అమెరికాలో దేశీయ మొక్కజొన్న ఉత్పత్తిలో 44 శాతం ఇథనాల్ ఉత్పత్తికి మళ్లిస్తున్నారు. అలాగే, న్యూ సైంటిస్టు జర్నల్ (2022 మార్చి 14) లోని ఒక నివేదిక ప్రకారం, 9 కోట్ల టన్నుల ఆహారధాన్యాలను ఇథనాల్ కోసం మళ్లించారు. ఇక యూరో పియన్ యూనియన్ గోధుమలు, మొక్కజొన్నతో సహా కోటి 20 లక్షల టన్నులను ఆటోమొబైల్స్ కోసం ఆహారంగా ఉపయోగిస్తోంది. ఇంకా, 35 లక్షల టన్నుల పామాయిల్ను ఈయూ డీజిల్ ఉత్పత్తి కోసం మళ్లించింది.రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆహార సరఫరాలు దెబ్బతిన్నప్పుడు ఇదంతా జరిగింది. అమెరికా, యూరోపియన్ యూనియన్ లలో జీవ ఇంధన ఉత్పత్తిలో కేవలం 50 శాతం తగ్గించినట్లయితే, అలా ఆదా చేసిన ధాన్యం... యుద్ధం వల్ల ఏర్పడిన మొత్తం ఆహార కొరతను తీర్చగలదు. గోధుమ, వరి వంటి పంటల్లో కిరణజన్య సంయోగక్రియను పెంపొందించడం, ప్రధాన తృణ ధాన్యాలలో జీవసంబంధమైన నత్రజనిని స్థిరీకరించడం, వార్షిక పంటలను శాశ్వత పంటలుగా మార్చడం, పంటల వ్యవస్థను వైవిధ్యీకరించడం, సూక్ష్మజీవులు – శిలీంధ్రాల నుండి పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను సృష్టించటం వంటి అవసరమైన పరివర్తనా ప్రయత్నాలను చేపట్టాలని ఈ లేఖ కోరుతోంది. ‘‘బిలియన్ల కొద్దీ ప్రజలకు ఆరోగ్యకరమైన, ఉత్పాదక, సురక్షితమైన జీవితాలను కల్పించడం వల్ల కలిగే ప్రయోజనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతటా విస్తృతంంగా రాబడిని ప్రవహింపజేస్తుంది’’ అని అంగీకరించాలని ఆ లేఖ పేర్కొంది.వ్యవసాయ పరిశోధనలో పెట్టే పెట్టుబడి బహుళ రాబడిని కలిగిస్తుందని చూపడానికి తగినన్ని ఆధారాలు ఉన్నప్పటికీ, ‘‘భవి ష్యత్తులో విజయవంతమైన ఆహార వ్యవస్థను నడిపించే ఆవిష్క రణకు పునాదిగా సమాజం స్పాన్సర్ చేసిన పరిశోధన ఉండాలని’’ కూడా నివేదిక పిలుపునిచ్చింది. అయితే ప్రభుత్వ ప్రాయోజిత పరిశోధనకు ప్రాధాన్యం ఉందా, లేక ప్రైవేట్ పరిశోధనల ఆధిపత్యంపై ప్రాధాన్యం ఉందా అనేది ఇంకా అస్పష్టంగానే ఉంది. ప్రజలకు ఆరోగ్యకరమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్న స్థిరమైన ఆహారాన్ని అందించడంలో బహుళ మార్కెట్ వైఫల్యాల గురించి ఈ లేఖ మాట్లాడుతుంది. అయితే ఇంకా అతి పెద్ద ఉపద్రవం ఏమిటంటే, ప్రపంచంలోని ప్రతిచోటా వ్యవసాయ ఆదాయాలను పెంచడంలో మార్కెట్ల వైఫల్యం!నా అవగాహన ప్రకారం, స్థిరమైన వ్యవసాయ జీవనోపాధికి హామీ ఇచ్చేందుకు కఠినమైన ప్రయత్నాలు చేయకపోతే భవిష్యత్తులో ఆహారం, పోషకాహార భద్రతకు సంబంధించి సవాళ్లను ఎదుర్కో వడం కష్టం కావచ్చు. ఉదాహరణకు, 2024 సెప్టెంబర్లో ముగిసిన చివరి ఐదు సంవత్సరాలకు సంబంధించిన బడ్జెట్ కోసం అమెరికా వ్యవసాయ బిల్లు రైతులకు, వ్యవసాయానికి 1.8 ట్రిలియన్ డాలర్లను కేటాయించింది. అయినప్పటికీ ఈ సంవత్సరం ఐదుగురు రైతుల్లో ఒకరు వ్యవసాయం మానేస్తారని అమెరికా అంచనా వేస్తోంది. నిజానికి, సరకుల ధరలు తక్కువగా ఉండడం, అధిక ఉత్పత్తి వ్యయం కారణంగా రైతులు ఎదుర్కొన్న నష్టాన్ని పూడ్చడానికి 10 బిలియన్ డాలర్ల తక్షణ సాయం వాగ్దానం చేసింది. అయినప్పటికీ ఈ పరిణామం జరగబోతోంది. కొత్త వ్యవసాయ బిల్లు–2024 ఆమోదం కోసం వేచి ఉంది.గత సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో 24 దేశాల్లో రైతుల నిరసన తర్వాత యూరోపియన్ యూనియన్లో హామీ ఇచ్చిన వ్యవసాయ ఆదాయం ఒక సాధారణ సూత్రంగా ముందుకొచ్చింది. పక్షం రోజుల క్రితం ఫ్రాన్స్లోని చిన్న రైతుల సమాఖ్య అయిన కాన్ఫెడరేషన్ పేజన్, వ్యవసాయ ఆదాయాన్ని వ్యవసాయ ఆహార సరఫరా గొలుసుకు చెందిన సర్దుబాటు అస్థిరతగా వదిలివేయ కూడ దని పిలుపునిచ్చింది. రైతులకు హాని కలిగించే విధంగా దిగువ స్థాయి అదనపు మార్జిన్లను సమాఖ్య ఖండించింది. దీని అర్థం ఏమిటంటే ఆహార గొలుసులోని అన్ని ఇతర వాటాదారులు భారీ లాభాలతో ముందుకు వెళ్లిపోతున్నప్పటికీ, రైతు మాత్రం దాని అంచుల వద్దే మనుగడ సాగించాల్సి వస్తుంది.భారత్లో, పంజాబ్–హరియాణా సరిహద్దులో 11 నెలలకు పైగా జరుగుతున్న రైతుల నిరసన నేపథ్యంలో గమనిస్తే, 14 ఖరీఫ్ పంటలలో ఏడింటి మార్కెట్ ధరలు కనీస మద్దతు ధర కంటే 12 నుండి 26 శాతం తక్కువగా ఉన్నాయి. సంవత్సరాలుగా, వ్యవసాయ ఆదాయాలు స్తబ్ధుగా ఉంటున్నాయి లేదా కిందికి పడిపోతున్నాయి. నిజం చెప్పాలంటే, 2050లో 150 కోట్ల మంది అదనపు ప్రజలకు ఆహారమివ్వడం కచ్చితంగా సాధ్యమే. కానీ వ్యవసాయాన్ని ఆచరణీ యమైనదిగా, లాభదాయకమైనదిగా మార్చే కార్యాచరణ విధానం కీలకం. అప్పుడే అది సాధ్యం. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు -
సాగు యోగ్యం కాని భూములు 2.10 లక్షల ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం నుంచి ప్రారంభమైన ‘రైతు భరోసా’ పథకం కింద ఎన్ని లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించాలనే విషయంలో ప్రభుత్వానికో స్పష్టత వచ్చింది. రైతుల వద్ద ఉన్న పట్టా భూముల్లో వ్యవసాయ యోగ్యం కాని భూముల లెక్క తేలింది. రాష్ట్రంలోని 10,277 గ్రామాల్లో 2,10,864 ఎకరాల విస్తీర్ణంలోని భూములు సాగు యోగ్యమైనవి కావని గుర్తించారు. అంటే ఇవి ‘రైతు భరోసా’కు అర్హత లేనివని నిర్ధారించారన్నమాట. అయితే గ్రామసభల్లో వచ్చిన విజ్ఞప్తుల మేరకు వీటిలో 5 నుంచి 10 శాతం వరకు భూములను వ్యవసాయానికి యోగ్యమైనవిగా నిర్ధారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకటీ రెండురోజుల్లో పూర్తిస్థాయిలో వ్యవసాయ యోగ్యం కాని భూముల లెక్కను నిర్ధారించుకుని,ఎన్ని ఎకరాలకు రైతు భరోసా వర్తింపజేస్తారనే అంశంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయనుంది. తర్జన భర్జనల అనంతరం తెరపైకి ‘యోగ్యత’ బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో రైతుబంధు (పస్తుతం రైతు భరోసా) పథకం కింద గుట్టలు, కొండలు, రోడ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, క్వారీలకు కూడా పెట్టుబడి సాయం అందించారని సీఎం రేవంత్రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తదితరులు పలుమార్లు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే రైతుభరోసా ఎవరికి వర్తింప జేయాలనే విషయమై సిఫారసు చేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఓ కేబినెట్ సబ్కమిటీని నియమించారు. ఈ మేరకు చర్చోప చర్చలు, కూడికలు, తీసివేతలు జరిపిన మంత్రులు.. తొలుత సాగులో ఉన్న భూములకే పెట్టుబడి సాయం అందజేయాలని, ఎకరాకు ఒక సీజన్కు రూ. 6,000 చొప్పున అందించాలంటూ ప్రాథమిక నివేదిక ఇచ్చారు. ఏ సీజన్కు ఆ సీజన్లో సాగైన భూములకే రైతుభరోసా అమలు చేస్తే వ్యతిరేకత వస్తుందని భావించిన సీఎం రేవంత్రెడ్డి.. మంత్రివర్గ సమావేశంలో చర్చించిన అనంతరం వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతుభరోసా అమలు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు గత నాలుగేళ్లుగా సాగులో లేని భూముల వివరాలను క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారులకు పంపించి సర్వే చేయాలని ఆదేశించారు. గత కొన్నేళ్లుగా సాగు చేయకుండా, రియల్ ఎస్టేట్ వెంచర్లు చేయడంతో పాటు కాలేజీలు, కోళ్ల ఫారాలు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్న భూములు, గుట్టలు, కొండలు, ప్రభుత్వం స్వా«దీనం చేసుకున్న భూముల ఫ్రీజింగ్ (రైతు పట్టా పాస్ పుస్తకాల్లో సాగు యోగ్యం కాని భూములుగా నిర్ధారించడం)కు కూడా ఆదేశాలిచ్చారు. ఈ మేరకు రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్తో కలిసి వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవోలు) ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు ఫీల్డ్ సర్వే చేశారు. కోటిన్నర ఎకరాలకు రైతుభరోసా? రాష్ట్రంలోని 600 గ్రామీణ మండలాల్లోని 10,622 గ్రామాలకు గాను వ్యవసాయ యోగ్యం కాని భూములు ఉన్న 10,277 గ్రామాల్లో సర్వే నిర్వహించిన అధికారులు.. వాటిలో 2,10,864 ఎకరాలు వ్యవసాయ యోగ్యత లేని భూములని తేల్చారు. గతసారి ‘రైతుబంధు’ పథకం కింద 1.52 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించినట్లు వ్యవసాయ శాఖ రికార్డులను బట్టి తెలుస్తోంది. 2023 జూన్ 26న పదకొండో విడత రైతుబంధు పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లోకి జమ ప్రారంభం కాగా, ఆ సీజన్లో రూ.7,624 కోట్లను 68.99 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి జమచేశారు. ఈ లెక్కన 2 లక్షల పైచిలుకు ఎకరాలను వ్యవసాయ యోగ్యం కాని భూములుగా నిర్ణయిస్తే కోటిన్నర ఎకరాలకు రైతుభరోసా అందే అవకాశం ఉందని అధికారులంటున్నారు. హైదరాబాద్ శివార్లలో రియల్ వెంచర్లు, కళాశాలలు! హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ రియల్ వెంచర్లుగా, కళాశాలలు, కోళ్ల ఫారాలుగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యవసాయ, రెవెన్యూ శాఖలు నిర్వహించిన సర్వేలో.. రాష్ట్రంలో అత్యధికంగా వ్యవసాయ యోగ్యం కాని పట్టా భూములు రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నట్లు తేలింది. ఈ జిల్లాలో 28,287 ఎకరాల సాగు యోగ్యం కాని భూములకు ఇప్పటివరకు 11 విడతల్లో రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందినట్లు అధికారులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా తరువాత యాదాద్రి భువనగిరి జిల్లాలోని 18,190 ఎకరాలను వ్యవసాయ యోగ్యత లేని పట్టా భూములుగా తేల్చారు. ఆ తర్వాత స్థానంలో మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా (14,444 ఎకరాలు), సంగారెడ్డి జిల్లా (12,174 ఎకరాలు), నల్లగొండ (12,040 ఎకరాలు) ఉన్నాయి. మెదక్, మహబూబాబాద్, సూర్యాపేట, సిద్దిపేట, కామారెడ్డి, తదితర జిల్లాల్లో కూడా సాగుయోగ్యం కాని భూములకు రైతుబంధు అందినట్లు తేలింది. ఈ భూములన్నిటినీ ఇప్పుడు ఫ్రీజ్ చేయడంతో వాటికి రైతుభరోసా అందే అవకాశం లేదు. -
ట్రిపుల్ ఆర్ రైతుల ధర్నాతో ఉద్రిక్తత
సాక్షి, యాదాద్రి: రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) అలైన్మెంట్ మార్చాలంటూ భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద భూ నిర్వాసితులు శనివారం తలపెట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. రైతులు హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు వేర్వేరుగా ట్రిపుల్ ఆర్ రైతులకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. రీజినల్ రింగ్రోడ్డు ఉత్తర భాగం అలైన్మెంట్ మార్చాలని కోరుతూ భూ నిర్వాసితులు భువనగిరి కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పిలుపు నివ్వగా.. ధర్నాకు అనుమతి లేదని నిర్వాసితులు ఏర్పాటు చేసుకున్న శిబిరాలను పోలీసులు తొలగించారు. ధర్నా నిర్వహించేందుకు కలెక్టరేట్ వద్దకు బీజేపీ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్, కంచర్ల రామకృష్ణారెడ్డి, క్యామ మల్లేశ్ తదితరులు హాజరయ్యారు. రైతులు బారికేడ్లను తోసుకుని కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనంతరం బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ నాయకత్వంలో బీజేపీ ప్రతినిధి బృందం, మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి క్యామ మల్లేశ్తోపాటు 10 మంది నిర్వాసితులు వేర్వేరుగా కలెక్టరేట్లోకి వెళ్లి అదనపు కలెక్టర్ వీరారెడ్డికి వినతిపత్రం అందించారు. -
మీ భోజనానికో దండం.. మిర్చికి మంచి ధర ఇప్పించండి
కొరిటెపాడు (గుంటూరు): ‘అయ్యా..! మీ భోజనానికో దండం. మాకు ఉచిత భోజనం అవసరం లేదు. మెరుగైన ధర ఇప్పించేలా చూడండి మహాప్రభో అని మిర్చి రైతులు మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఎం.విజయ సునీత, గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.భార్గవ్తేజను వేడుకున్నారు. మిర్చి యార్డులో రైతులకు ఉచిత భోజన పథకాన్ని మార్కెటింగ్ శాఖ కమిషనర్, జాయింట్ కలెక్టర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యార్డుకు వచ్చిన రైతులంతా వారిద్దరినీ కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. మిర్చి యార్డులో ధరలు రోజురోజుకు పతనమవుతున్నాయని వాపోయారు. వారం క్రితం రూ.16 వేలు పలికిన క్వింటాల్ మిర్చి ప్రస్తుతం రూ.10 వేలు–రూ.13 వేల మధ్య ఊగిసలాడుతున్నాయని తెలిపారు. గత ఏడాది ఇదే సమయంలో క్వింటాల్కు రూ.21 వేల నుంచి రూ.26 వేల వరకు ధరలు లభించాయని గుర్తు చేశారు. ఉదయం పూట బేరం అయిన కాయలు కూడా మధ్యాహ్నానికి ధరలు మారిపోతున్నాయని వివరించారు.కౌలు ధరలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయన్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పంటను యార్డుకు తీసుకొస్తే కనీసం ఖర్చులు కూడా దక్కడం లేదని రైతులు వాపోయారు. ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు సాగు ఖర్చులయ్యాయని, దిగుబడి మాత్రం ఎకరాకు సగటున 10 క్వింటాళ్లు (తాలు, ఎరుపు కలిపి) కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇవే ధరలు కొనసాగితే ఎకరాకు సుమారు రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు నష్టం వచ్చే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మేమే ఎంతో మందికి అన్నం పెడుతున్నాం. మాకు కావాల్సింది ఉచిత భోజనం కాదు. మెరుగైన ధర కల్పించి మా ప్రాణాలు, మా కుటుంబ సభ్యుల ప్రాణాలు కాపాడండి’ అంటూ చేతులు జోడించి రైతులంతా వేడుకున్నారు. ఈ సందర్భంగా మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఎం.విజయ సునీత, జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ మాట్లాడుతూ రైతులకు మెరుగైన ధర వచ్చేలా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. -
ఘాటెక్కిన వెల్లుల్లి
సాక్షి, భీమవరం: నిత్యావసరాల పెరుగుదలతో ఉక్కిరిబిక్కిరవుతున్న సామన్యుడిని వెల్లుల్లి ‘ఘాటు’ మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. కిలో రూ.450 చేరి చుక్కలు చూపిస్తోంది. పదేళ్ల తర్వాత మళ్లీ ధర భారీగా పెరగడం చూస్తున్నామని వ్యాపారస్తులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్లో సాగు విస్తీర్ణం తగ్గడమే కారణమని చెబుతున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్, పిప్లే, ఉజ్జయిని, దలోదా తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు వెల్లుల్లిని తాడేపల్లిగూడెంలోని హోల్సేల్ మార్కెట్కు తీసుకువస్తుంటారు. ఇక్కడి నుంచే ఉమ్మడి ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, కృష్ణాజిల్లాల్లోని రిటైల్ మార్కెట్లకు తరలిస్తుంటారు. తాడేపల్లిగూడెం మార్కెట్కు గతంలో రోజుకు 125 టన్నుల నుంచి 150 టన్నుల వరకు దిగుమతులు జరిగేవి. వెల్లుల్లి పంట దేశంలో అత్యధికంగా మధ్యప్రదేశ్లో సాగవుతుండగా రాజస్థాన్, గుజరాత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గతేడాది ధర ఆశాజనకంగా లేక రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపడంతో వెల్లుల్లి సాగు విస్తీర్ణం తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. ఉన్నకొద్ది నిల్వలను అక్కడి వ్యాపారులు భారీ ఎత్తున స్టాకులు పెట్టడంతో కృత్రిమ కొరత ఏర్పడి కొద్దినెలలుగా ధర పెరుగుతూ వచ్చింది. సాధారణంగా వెల్లుల్లి సైజు, పాత, కొత్త రకాన్ని బట్టి పది వరకు క్వాలిటీల్లో విక్రయిస్తుంటారు. వారం పదిరోజుల క్రితం వరకు వాటి క్వాలిటీ మేరకు హోల్సేల్ ధర కిలో రూ.180 నుంచి రూ.380 వరకు అమ్మకాలు జరిగాయి. రిటైల్ మార్కెట్లోకి వచ్చేసరికి మంచి క్వాలిటీ వెల్లుల్లి కిలో రూ.450 వరకు చేరింది. పదేళ్ల క్రితం అత్యధికంగా కిలో రూ.220 నుంచి రూ.350 వరకు చేరినట్టు హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు. తర్వాత అంత ఎక్కువగా ధర పెరగడం మళ్లీ ఇప్పుడే చూస్తున్నామని చెబుతున్నారు. ధర పెరగడంతో ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్కు 25 నుంచి 50 టన్నుల లోపు సరుకు మాత్రమే వస్తున్నట్టు తెలిపారు. వారం రోజులుగా కొత్త పంట మార్కెట్లోకి వస్తుండటంతో నాణ్యతను బట్టి హోల్సేల్ ధర రూ.130 నుంచి రూ.280 వరకు ఉంది.అయితే కొత్త పంట పాయల్లో తేమశాతం ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా త్వరగా పాడైపోతుంటాయి. ప్రస్తుతం కొత్త పంట రాకతో ధర కొంత తగ్గడం మూన్నాళ్ల ముచ్చటేనని హోల్సేల్ వ్యాపారి ఒకరు తెలిపారు. రెండు మూడు నెలల తర్వాత మధ్యప్రదేశ్ నుంచి మళ్లీ ఆరబెట్టిన వెల్లుల్లి మార్కెట్లోకి వస్తే ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు. వినియోగదారుల బెంబేలు మసాల కూరలు వండాలంటే వెల్లుల్లి తప్పనిసరి. నాన్వెజ్ వంటకాలకు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చే కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వెల్లుల్లి వినియోగం ఎక్కువ. ఇప్పటికే పప్పుదినుసులు, నూనెలు, ఇతర నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలొచ్చి సామాన్యుల జీవనం దుర్భరంగా మారింది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో క్వాలిటీ వెల్లుల్లి కిలో రూ.450 ఉండటంతో గతంలో అరకిలో, కిలో చొప్పున కొనుగోలు చేసే వినియోగదారులు మరింత తగ్గించి కొనుగోళ్లు చేస్తున్నారు. కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లిఇక, పూర్తిస్థాయిలో దిగుమతులు లేక ఉల్లి ధర దిగిరావడం లేదు. నాసిక్, షోలాపూర్ నుంచి తాడేపల్లిగూడెం హోల్సేల్ మార్కెట్కు రోజుకు 150 టన్నులు ఉల్లిపాయలు వస్తున్నాయి. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోని ఏలూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, మండపేట, నరసాపురం తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచే రిటైల్ వ్యాపారులు తీసుకువెళుతుంటారు. ప్రస్తుతం హోల్సేల్ ధర క్వాలిటీని బట్టి రూ.10 నుంచి రూ.35 వరకు ఉండగా రిటైల్ మార్కెట్లో రూ.20 నుంచి రూ.50 వరకు ఉంటోంది. గతంలో నాణ్యమైన ఉల్లి రూ.25లోపే ఉండగా ప్రస్తుతం రెట్టింపై వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతోంది. -
కాంగ్రెస్ పాలనలో రైతు వంచన: మాజీ మంత్రి కేటీఆర్
-
‘మైనింగ్’ అనుమతులు రద్దు చేయండి
బల్మూర్/వెల్దండ: మైనింగ్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని మైలారం గ్రామస్తులు పురుగుమందు డబ్బాలతో రోడ్డెక్కారు. వివరాల్లోకి వెళితే.. మైలారం గుట్టపై సర్వే నంబర్ 121లోని 35 ఎకరాల్లో మైనింగ్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ సోమవారం నుంచి గ్రామంలో రిలే దీక్షలు చేపట్టేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. అయితే దీక్షలకు అనుమతి లేదంటూ పోలీసులు కొందరిని ముందస్తుగా అరెస్టు చేశారు. మరోవైపు గ్రామస్తుల ఆందో ళనకు మద్దతు ప్రకటించేందుకు, మైలారం గుట్టను పరిశీలించడానికి ప్రొఫెసర్ హరగోపాల్, పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వస్తుండగా.. వెల్దండలో పోలీసులు అడ్డుకొని స్టేషన్కు తరలించారు.దాదాపు గంటసేపు వారిని స్టేషన్లోనే ఉంచారు. విషయం తెలియగానే కోపోద్రిక్తులైన గ్రామస్తులు ప్రధాన రహదారిపై ముళ్ల కంచె వేసి పురుగుమందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. అక్రమంగా అరెస్టు చేసిన తమ గ్రామస్తులను విడుదల చేయడంతోపాటు గ్రామానికి ఎమ్మెల్యే వచ్చి..మైనింగ్ అనుమతులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించాలని డిమాండ్ చేశారు. గుట్టపై ప్రజాభిప్రాయం లేకుండానే మైనింగ్ తవ్వకాలకు అధికారులు ఎలా అనుమతులు ఇస్తారని నిలదీశారు. ఆరు గంటలపాటు ఉద్రిక్తత ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సీఐ రవీందర్, ఎస్ఐ రమాదేవి ఆధ్వర్యంలో లింగాల, ఉప్పునుంతల, అమ్రాబాద్, అచ్చంపేట, సిద్దాపూర్ పోలీసులు అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. గ్రామస్తులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మైలారం గ్రామం మీదుగా అప్పాయిపల్లి, అంబగిరి, చెన్నంపల్లి గ్రామాలకు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. మధ్యాహ్నం తర్వాత గ్రామానికి చెందిన మైలారం గుట్ట పోరాట సమితి అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, లింగయ్యగౌడ్, లక్ష్మయ్య, సుమిత్ర తదితరులను పోలీసులు విడుదల చేయడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.ఖనిజ లవణాలపై గద్దల్లా వాలుతున్నారు: ప్రొఫెసర్ హరగోపాల్దేశవ్యాప్తంగా ఖనిజ, లవణాలను తవ్వేందుకు గద్దల్లా వాలిపోతున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ప్రకృతిని నాశనం చేసే మైనింగ్ తవ్వకాలను ప్రభుత్వాలు నిలిపివేయకుండా వ్యాపారులకు మద్దతు తెలపడం ఏమిటని ప్రశ్నించారు. స్టేషన్ నుంచి బయటకు వచ్చి అనంతరం హరగోపాల్ విలేకరులతో మాట్లాడుతూ ప్రకృతిని నాశనం చేయడం వల్ల భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ అందడం కష్టంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం పునరాలోచించి మైలారంలో మైనింగ్ తవ్వకాలను నిలిపివేయాలన్నారు. ప్రజా ఉద్యమాలను అణచివేయాలని చూడటం తగదని చెప్పారు. -
కంటతడి ఆరలేదు..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఆగస్టు 31, 2024.. ఆకేరు వాగు నడిరాత్రి వేళ రైతు కంట వరద పారించింది. బువ్వపెట్టే భూమిని బీడుపెట్టింది. నాడు ఆకేరు సృష్టించిన విలయంతో పచ్చని పొలాల్లో ఇసుక, రాళ్లురప్పలు మేటవేశాయి. ఇళ్లు నేలకూలాయి. గొడ్డూగోదా, సామగ్రి.. సర్వం కొట్టుకుపోయాయి. ఎటుచూసినా ఐదారు మీటర్ల మేర పేరుకుపోయిన రాళ్లదిబ్బలు.. ఎకరాకు రూ.2 లక్షలు వెచ్చించి వీటిని తొలగిస్తే తప్ప సాగులోకి వచ్చే పరిస్థితి లేని భూములు.. ఏటా రెండు పంటలు పండించి.. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేక చేష్టలుడిగి కూలీలుగా మారిపోయిన రైతన్న.. నాడు అతలాకుతలమైన వీరి జీవితాలు ఇప్పుడెలా ఉన్నాయి?.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాసితండాలోని పరిస్థితులపై ‘సాక్షి’ పరిశీలన..ఆరు నెలలుగా అదే దైన్యం.. పోతుగంటి సహదేవ్ రెక్కలు ముక్కలు చేసుకుని 90 బస్తాల ధాన్యాన్ని నిల్వ చేశాడు. రేపోమాపో మిల్లుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నంతలోనే వరద ముంచెత్తింది. 40 బస్తాలు నీళ్లపాలయ్యాయి. తడిసిన 50 బస్తాల ధాన్యా న్ని కొని ఆదుకుంటామన్న అధికారులు ఇప్పుడు చేతులెత్తేశారు. 6 నెలలుగా ఆ ధాన్యం అలాగే పడి ఉంది.సాయం చేస్తేనే సాగుపోతుగంటి బ్ర హ్మం ఐదెకరాల ఆసామి. 2.20 ఎకరాల్లో వరి, ఎకరంన్నరలో మిర్చి, ఎకరంలో పత్తి వేశాడు. పంటపండి చేతికొస్తుందనుకున్న దశలో ఆకేరు వరదతో పొలమంతా ఇసుక మేటలు వేసింది. ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేల చొప్పున ఐదెకరాలకు ఇచ్చనా రూ.50 వేలకు తోడు మరో లక్ష వెచ్చించి పొలాన్ని బాగు చేసుకున్నాడు. మిగతా భూమి పరిస్థితేమిటో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు.చి‘వరి’కిలా మిగిలా..పోతుగంటి వెంకన్న నాలుగెకరాల్లో వరి సాగు చేశాడు. వరద దెబ్బకు పంట మొత్తం రాళ్లురప్పల పాలైంది. రూ.2 లక్షలు ఖర్చుచేసి 200 ట్రిప్పుల మట్టి తోలించి పొలాన్ని సాగు యోగ్యం చేసుకుని ప్రస్తుతం వరి సాగుచేస్తున్న ఆయన.. బావులు పూడుకుపోవడంతో ఏటిలోని నీటిని మోటార్ల ద్వారా తరలిస్తూ తలకుమించిన భారాన్ని మోస్తున్నానని వాపోతున్నాడు. -
పోరాడితేనే కాపాడుకోగలం!
మన దేశం ప్రపంచ వాణిజ్య సంస్థలో భాగస్వామిగా చేరినప్పటి నుంచి రైతాంగం, వ్యవసాయ రంగం పరిస్థితి మరింత వేగంగా క్షీణించడం ప్రారంభమైంది. 2022 నాటికల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, స్వామినాథన్ సిఫారసుల ప్రకారం వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధర ఇస్తామని నమ్మబలికిన ఎన్డీయే పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గెలిచే వరకు మద్దతు ధర గురించి ఊదరగొట్టి, గెలిచిన తర్వాత సి2 + 50 సూత్రం (ఉత్పత్తికి అయ్యే ఖర్చుకు అదనంగా అందులో సగభాగం కలిపి ఆ మొత్తంపై లెక్కగట్టటం) ప్రకారం తాము కనీస మద్దతు ధర ఇవ్వలేమని సుప్రీంకోర్టుకు ఎన్డీఏ ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించడం ద్వారా తన రైతు వ్యతిరేక విధానాన్ని బయట పెట్టుకొన్నది.ఇప్పటికే దేశంలోని 52 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాయని, వారి నెత్తిపై సగ టున 74,121 రూపాయల అప్పు ఉందని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మార్కెట్లో పంటల ధరలు గిట్టుబాటు కాక, పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక అప్పుల సుడి గుండంలో చిక్కుకుంటున్న రైతు కుటుంబాల్లో ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నది. 2013 నుండి 2022 వరకు అధికారిక లెక్కల (ఎన్సీఆర్బీ) ప్రకారమే గత పదేళ్లలో లక్షా ఇరవై వేల మందికి పైగా రైతులు ఆత్మ హత్య చేసుకున్నారంటే రైతాంగం పరిస్థితి ఎంత దయ నీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయ పంటలపై కార్పొరేట్ శక్తులకు అధి కారాన్ని కట్టబెట్టే విధంగా మోదీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఉరితాళ్ల వంటి మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల పాటు ఢిల్లీ కేంద్రంగా రైతులు వీరోచితంగా పోరాడారు. ఫలితంగా ప్రభుత్వం కనీస మద్దతు ధర చట్టబద్ధత అవకాశాల పరిశీలన కోసం ఉద్యమ నాయ కత్వానికి రాతపూర్వక హామీ ఇచ్చింది. అయితే మూడు సంవత్సరాలు దాటినా దీనిపై ఎలాంటి పురోగతి లేకపోగా తిరిగి దొడ్డి దారిన ఆ మూడు నల్ల చట్టాలను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధం అవుతోంది. దానిలో భాగంగానే కొత్త వ్యవసాయ మార్కెట్ విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. అటవీ సంరక్షణ నియమాల పేరుతో 2006 అటవీ హక్కుల చట్టానికి పాతరేయటానికి పూనుకున్నది. అటవీ సంరక్షణ నియమాల బిల్లు ఆమోదం పొందితే అడవులకు, అడవుల్లో నివసించే జన సమూహాల హక్కులకు ముప్పు ఏర్పడుతుందని పార్లమెంట్ సభ్యులకు కాన్స్టిట్యూషనల్ కండక్ట్ గ్రూపు తరపున 155 మంది మాజీ ఐఏఎస్ అధికారులు తమ సంతకాలతో లేఖ రాశారు. అయినా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా ఆ బిల్లును ఆమోదింప చేసు కుంది. మరోవైపు విద్యుత్ బిల్లు–2020ని చట్టం చేయడా నికి మార్గం సుగమం చేసుకుంది. కచ్చితంగా ఇది వ్యవ సాయ రంగంపై పెను భారం మోపే బిల్లు అనొచ్చు.వ్యవసాయ రంగంలో పని చేసే వారంతా రైతులే. వీరిలో కౌలు రైతులు, మహిళా రైతులు, వ్యవసాయ కూలీల పరిస్థితి మరింత దారుణంగా వుంది. రైతును, వ్యవసాయ రంగాన్ని రక్షించుకోలేక పోతే దేశంలో ఆహార కొరత ఏర్పడే ప్రమాదం వుంది. ఇప్పటికైనా రైతులు, రైతు సంఘాలు మేల్కొనాలి. ప్రమాదంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాలి. ఉద్యమ శక్తుల ఐక్యత ద్వారానే రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్నీ కాపాడుకోగలుగుతాం. ‘అఖిలభారత రైతుకూలీ సంఘం’ అనే పేరుతో కొనసాగుతూ వస్తున్న రెండు వేర్వేరు నిర్మాణాలు ఈ నేపథ్యంలోనే ‘ఆలిండియా కిసాన్ మజ్దూర్ సభ’ (ఏఐకేఎంఎస్)గా ఒకటి అవుతున్నాయి. ఆదివారం మహబూబాబాద్లో విలీన సభ జరుపుకొంటున్నాయి.– గౌని ఐలయ్య,ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
కచ్చితత్వం దిశగా...
పక్షుల, పాముల, జంతువుల ప్రవర్తనను చూసీ...ఆకాశం తీరుతెన్నులు గమనించీ, గాలివాటు, దాని వేగం గ్రహించీ వాతావరణాన్ని అంచనా కట్టే గతకాలపు రోజుల నుంచి ఇవాళ ఏం జరుగుతుందో, వచ్చే నాలుగైదు రోజుల్లో ఎలాంటి వాతావరణం ఉండబోతున్నదో, రాగల సంవత్సరమంతా ఎలాంటి స్థితిగతులుంటాయో స్పష్టంగా వివరించే సమాచారం అందరికీ అందుబాటులో కొచ్చింది. గత నూట యాభయ్యేళ్లుగా అవిచ్ఛిన్నంగా ఈ పనిలోనే నిమగ్నమై కోట్లాది పౌరులకు చేదోడువాదోడుగా నిలిచిన భారతీయ వాతావరణ విభాగం(ఐఎండీ) తన వార్షికోత్సవాన్ని మంగళ వారం ప్రధాని మోదీ సమక్షంలో ఘనంగా నిర్వహించుకుంది. ఒక దేశ విజ్ఞాన శాస్త్ర అవగాహన ఆ దేశంలోని వైజ్ఞానిక సంస్థల ప్రగతిలో ప్రతిఫలిస్తుందని ఈ సందర్భంగా మోదీ చెప్పిన మాట అక్షరసత్యం. ఈ నూటయాభయ్యేళ్లలో ఐఎండీ సాధించిన ప్రగతి ఇందుకు సాక్ష్యం. ‘వాన రాకడ... ప్రాణం పోకడ’ ఎవరికీ తెలియదనే నానుడి నుంచి మనం చాలా దూరం వచ్చాం. ఇక పోవటం ఖాయమనుకున్న ప్రాణాన్ని నిలబెట్టడానికీ, పునర్జన్మ ఇవ్వడానికీ అధునాతన వైద్య సదుపాయాలు విస్తృతంగా అందుబాటులోకొచ్చాయి. అలాగే వాన ఎక్కడ కురుస్తుందో, దాని తీవ్రత ఏపాటో అంచనా వేయగలుగుతున్నాం. తుపాను ఏర్పడే అవకాశాలు, దాని గమ్యం, గమనం, అది మోసుకు రాగల విపత్తు గురించీ హెచ్చరించటంతో పాటు కరవుకాటకాల ప్రమాదాన్ని తెలియజెప్పటం ఆ రంగంలో సాధించిన ప్రగతికి తార్కాణం. మూడు రోజుల వరకూ వాతావరణం ఎలా ఉండబోతు న్నదో చెప్పే స్వల్పకాలిక అంచనాలు, పదిరోజుల వరకూ వాతావరణ పోకడల్ని వివరించగల మధ్య శ్రేణి అంచనాలు, నెల పాటు ఏ వారమెలా వుంటుందో తెలియజేయగల సామర్థ్యం ఇప్పుడు మన సొంతం. ఇంకా స్థానిక వాతావరణాలను అంచనా వేయగలిగే దిశగా ఐంఎండీ ముందుకెళ్తోంది.పేరులో తప్ప జనాభా రీత్యా, సంపద రీత్యా, లేదా విస్తీర్ణం రీత్యా ఏ రకంగానూ ‘గ్రేట్’ అనే పదానికి అర్హత లేని బ్రిటన్ నుంచి వచ్చిన వలస పాలకులు ఈ దేశంలోని వాతావరణ తీరుతెన్నులు చూసి అయోమయంలో పడ్డారు. వీటిని సక్రమంగా అంచనా వేసే సాధనాలు లేకపోతే సరిగా పాలించటం అసాధ్యమన్న నిర్ణయానికొచ్చిన ఫలితంగానే 1875లో సర్ చార్లెస్ చాంబర్లేన్ నేతృత్వంలో ఐఎండీని నెలకొల్పారు. అంతవరకూ రైతులు సంప్రదాయంగా అనుసరిస్తూ వచ్చిన విధానాలన్నీ క్రమేపీ కనుమరుగై వాతావరణ అధ్యయనం కొత్త పుంతలు తొక్కటం ప్రారంభించింది. కేవలం బ్రిటన్ వాతావరణాన్ని పోలి వుంటుందన్న ఏకైక కారణంతో తమ వెసులుబాటు కోసం సిమ్లాలోని పర్వత ప్రాంతంలో మొదలెట్టిన ఐఎండీ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని గ్రహించాక 1928లో పుణేకు తరలిరావటం, ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఢిల్లీకి వెళ్లటం తప్పనిసరైంది. ఐఎండీ డైరెక్టర్ జనరల్గా వచ్చిన గిల్బర్ట్ వాకర్ 1904–1924 మధ్య రెండు దశాబ్దాల సమయంలో భారత వాతావరణంలో చోటుచేసుకున్న అసాధారణతలపై అధ్యయనం చేయటంతో అనేక అంశాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంత పసిఫిక్ మహా సముద్ర జలాలపై ఉండే వాయుపీడనంలో వచ్చే హెచ్చుతగ్గులే ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ స్థితిగతులను ప్రభావితం చేస్తున్నాయని ఆ అధ్యయనం తేల్చాక వాతావరణాన్ని అర్థంచేసుకునే తీరే మారిపోయింది. పసిఫిక్ జలాలపై ఉండాల్సిన సాధారణ ఉష్ణోగ్రతలో మైనస్ 17 డిగ్రీల సెల్సియస్ మేరకు హెచ్చితే లాæనినో... ఆ ఉష్ణోగ్రత మైనస్ 17 డిగ్రీల కన్నా తగ్గితే లానినా ఏర్పడు తుందని తేలింది అప్పుడే. ఇదంతా అర్థమయ్యాక రాగల కాలంలో వాతావరణమెలా వుండనున్నదో అంచనా వేయటం సులభమైంది. వాతావరణంలో విడిచిపెట్టే బెలూన్లు గాలిలో తేమనూ, ఉష్ణోగ్రతనూ ఇట్టే చెప్పగలుగుతుండగా ఉపగ్రహాలు నేల పరిస్థితుల గురించి సమాచారం ఇస్తున్నాయి.స్వాతంత్య్రానంతరం వాతావరణాన్ని కొలవటానికి రాడార్ల వంటి ఉపకరణాలు అందుబాటు లోకొచ్చాయి. 1971లో తొలి తుపాను హెచ్చరిక కేంద్రం ఏర్పాటైతే, 1990ల్లో ఇస్రో ఉపగ్రహాలు పంపే డేటాతో వాతావరణ అంచనాల కచ్చితత్వం పెరిగింది. సెకనుకు కొన్ని లక్షల గణనలను చేయగలిగిన అధునాతన సూపర్ కంప్యూటర్ వినియోగం మొదలయ్యాక రుతుపవనాలు, తుపానుల గురించి మాత్రమే కాదు... వడగాల్పులు, వరదల వంటి వైపరీత్యాల గురించి కూడా చెప్పగలుగుతున్నారు. మన దేశంలో సాగుకు యోగ్యమైన భూమిలో 60 శాతం కేవలం వర్షాధారం కావటం, జనాభాలో మూడింట రెండొంతుల మందికి జీవనాధారం వ్యవసాయమే కావటం వల్ల ఐఎండీ చెప్పే అంచనాలు ఎంతో అవసరం. అందుకే వర్షాలు సరిగ్గా ఎక్కడ పడతాయో, ఏ ప్రాంతంలో వడగాడ్పులు వీచవచ్చో, ఎక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నదో కూడా పదేళ్లుగా చెప్పగలుగుతోంది. కృత్రిమ మేధ దీన్ని మరింత పదునెక్కించింది.ఐఎండీ అంచనాల వల్ల ప్రభుత్వాలు అప్రమత్తమై లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించటం, వేలాది ప్రాణాలను కాపాడుకోవటం సాధ్యమవుతోంది. ఇది మున్ముందు ఇంకా విస్తరించి కనీసం అయిదురోజుల ముందు 90 శాతం కచ్చితత్వంతో చెప్పగలిగే విధానాలను అభివృద్ధి చేసుకోవాలనీ, ఆఖరికి భూకంపాల రాకడను సైతం పసిగట్టగలగాలనీ ఐఎండీ 2047 విజన్ డాక్యుమెంటు విడుదల సందర్భంగా మోదీ చేసిన సూచన శిరోధార్యం. ఈ అంచనాలు మన దేశానికి మాత్రమే కాదు...ఆసియా ప్రాంత దేశాలకు సైతం ఎంతో మేలుచేస్తాయి. పంటల దిగుబడిపై, ఆర్థికవ్యవస్థ తీరుతెన్నులపై మరింత మెరుగైన అంచనాలకు తోడ్పడతాయి. -
మన నగరంలోనే అరుదైన పంటలు..రుద్రాక్ష, కుంకుమ పువ్వు..
హైదరాబాద్ నగరం కేవలం ఐటీ, పారిశ్రామిక స్టార్టప్లకు మాత్రమే కాదు.. అరుదైన పంటల ఆవిష్కర్తలకు నగరంలోని శివారు ప్రాంతాలు వేదికగా నిలుస్తున్నాయి.. బీటెక్ కోర్సులు పూర్తి చేసి, ఐటీ, ఇతర సాంకేతిక సాగులో ఆరితేరాల్సిన జిల్లా యువత.. అరుదైన పంటల పరిశోధనలు, సాగుపై దృష్టిసారించింది. అందమైన కాశ్మీర్ లోయల్లో మాత్రమే సాగయ్యే అరుదైన కుంకుమ పువ్వు బాలాపూర్ మండలం గుర్రంగూడలో సాగవుతుండగా, కేరళ తీరం వెంట మాత్రమే సాగయ్యే వక్క తోటలు శంకర్పల్లిలోనూ సాగవుతున్నాయి. ఇక సిమ్లా, ఇతర శీతల ప్రదేశాల్లో మాత్రమే కనిపించే యాపిల్ ప్రస్తుతం కందుకూరు మండలం పులిమామిడిలోనూ దర్శనమిస్తున్నాయి. సౌదీ అరేబియా దేశాల్లో విరివిగా పండే ఖర్జూర సరస్వతి గూడలో నోరూరిస్తుంది. ఇప్పటి వరకూ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అవకాడో ప్రస్తుతం దెబ్బగూడలోనూ లభిస్తుంది. నేపాల్ సరిహద్దులో అరుదుగా లభించే రుద్రాక్ష.. ప్రస్తుతం మేడ్చల్ మండలం రాయిలాపూర్లో సాగవుతుండటం గమనార్హం.. ఎస్బీఐలో ఉద్యోగం చేస్తూ.. పూర్వ మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేటలో వ్యవసాయ కుటుంబం. నల్లగొండ ఎన్జీకాలేజీలో డిగ్రీ, ఉస్మానియాలో ఎంబీఏ పూర్తి చేశాను. ప్రస్తుతం కోఠి ఎస్బీఐలో పని చేస్తున్నా. అచ్చంపేటలో పదెకరాలు, సరస్వతి గూడలో ఏడెకరాలు ఉంది. యూట్యూబ్ ద్వారా అనంతపూర్లో ఖర్జూర సాగు చేస్తున్న విషయం తెలుసుకున్నా. ఆ మేరకు ఆరేళ్ల క్రితం మొత్తం 17 ఎకరాల్లో 1260 మొక్కలు నాటాను. ఎకరాకు రూ.5 లక్షల వరకూ వచి్చంది. మూడేళ్ల క్రితం దిగుబడి ప్రారంభమైంది. తొలిసారిగా 1.50 టన్నుల దిగుబడి వచి్చంది. ఆ తర్వాత 55 నుంచి 60 టన్నుల దిగుబడి వచ్చింది. – ఏమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అచ్చంపేట (ఖర్జూర) విదేశాల నుంచి తిరిగొచ్చి.. బీటెక్ పూర్తి చేసి, ఎంబీఏ కోసం పదేళ్ల క్రితం లండన్ వెళ్లాను. అక్కడ సరైన ఉపాధి అవకాశాలు లేక వెనక్కి తిరిగొచ్చా. అవకాడోపై అవగాహన ఉండటంతో అటువైపు చూశా.. మూడేళ్ల క్రితం 1.10 ఎకరాల విస్త్రీర్ణంలో 220 అవకాడో మొక్కలు నాటాను. సాధారణంగా 25 డిగ్రీల వాతావరణంలో మాత్రమే పెరిగే అవకాడో 40 డిగ్రీలకుపైగా నమోదైన ఉష్ణోగ్రతలను సైతం తట్టుకొని నిలబడింది. డ్రిప్ సాయంతో మొక్కలకు నీరు అందించా. చీడపీడల సమస్యే కాదు.. పెట్టుబడికి పైసా ఖర్చు కూడా కాలేదు. ఒక్కో చెట్టు నుంచి 150 నుంచి 200 కాయలు దిగుబడి వచ్చింది. ఆన్లైన్లో చూసి, స్వయంగా తోట వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. – రమావత్ జైపాల్, దెబ్బడిగూడ (అవకాడో) బీటెక్ చదువుతూనే.. బాలాపూర్ మండలం గుర్రంగూడ మాది. ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నా. వ్యవసాయ కుంటుంబం కావడంతో నాన్నతో పాటు తరచూ పొలానికి వెళ్తుంటా. కాశ్మీర్లో ప్యాంపూర్, పుల్వొమా జిల్లాల్లో అరుదుగా పండే కుంకుమ పువ్వు పంటను ఎంచుకున్నా. మార్కెట్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. కల్తీని నివారించి, నాణ్యమైన పువ్వును అందివ్వాలనుకున్నా. ఇంటిపై ఖాళీగా ఉన్న ఓ గదిలో 2024 సెప్టెంబర్లో సాగు ప్రారంభించాను. రూ.5 లక్షలు ఖర్చు అయ్యింది. ఇప్పటి వరకూ 20 గ్రాముల వరకూ సేకరించాం. ఒక గ్రాము రూ.800 నుంచి రూ.1000 వరకూ పలుకుతోంది. – లోహిత్రెడ్డి, గుర్రంగూడ (కుంకుమ పువ్వు) వక్కసాగులో విశ్రాంత వైద్యుడు.. ఐడీపీఎల్ బాలానగర్లో ఫ్యామిలి ఫిజీషియన్గా నాలుగు దశాబ్దాల పాటు సేవలు అందించా. శంకర్పల్లి మాసానిగూడలోని భూమిలో ఏదైనా చేయాలని భావించా. ఏలూరులో నా స్నేహితుడు విజయసారధి సూచనలతో 2015లో నాలుగు ఎకరాల్లో.. ఎకరాకు 300 చొప్పున వక్క మొక్కలు నాటాను. 2023లో తొలిసారిగా పంట దిగుబడి 1500 కేజీలు వచ్చింది. కేజీ రూ.350 నుంచి రూ.400 పలుకుతుంది. వక్కతోటలోనే అంతరపంటలుగా మిరియాలు, యాలకులు, జాజికాయ, జాపత్రి, లవంగాలు, అల్లం, యాపిల్, ద్రాక్ష, బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీ, అవకాడో, మ్యాంగో, జామ వంటి పండ్ల మొక్కలను సాగు చేస్తున్నా. మరో ఏడాదిలో పండ్ల దిగుబడి ప్రారంభమవుతుంది. – డాక్టర్ విజయ్కుమార్ కొడాలి, బోధన్ (వక్కసాగు)రాయలాపూర్లో రుద్రాక్ష.. ఫిన్లాండ్కు చెందిన మహిళను వివాహం చేసుకుని మేడ్చల్ మండలం రాయలాపూర్ గ్రామ శివారులో స్థిరపడ్డారు. ఇంటి చుట్టూ వివిధ రకాల చెట్లు నాటారు. దక్షిణ భారతదేశంలో అత్యంత అరుదుగా కనిపించే రుద్రక్ష మొక్కలను ఇంటి ముందు నాటారు. ప్రస్తుతం దిగుబడి ప్రారంభమైంది. జనవరి, ఫిబ్రవరిలో కాయలు తెంపి, ఆరబెడుతుంటారు. ప్రదీప్ ఇటీవల వెయ్యి రుద్రాక్షలతో పూజ చేయడం కొసమెరుపు. – ప్రదీప్, మేడ్చల్ (రుద్రాక్ష) (చదవండి: గట్ బయోమ్ 'పవర్ హోమ్'..!) -
అన్నదాత ఇంట కానరాని సంక్రాంతి
సాక్షి, అమరావతి: తెలుగింట సంక్రాంతి పెద్ద పండుగ.. మరీ ముఖ్యంగా ఇది రైతన్న పండుగ. పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు సంబరాలు చేసుకోవలసిన తరుణం. కానీ అన్నదాత లోగిలి కళతప్పింది. పల్లెల్లో సంక్రాంతి సందడి కానరావడం లేదు. అన్ని విధాలుగా మోసపోయిన రైతన్న దిగాలుగా కనిపిస్తున్నాడు. కొత్త సర్కారు వచ్చి ఏడు నెలలు గడిచాయి. ఖరీఫ్, రబీ రెండు సీజన్లు పూర్తయ్యాయి. పెంచి ఇస్తామన్న పెట్టుబడిసాయం ఒక్క విడత కూడా అందలేదు. పంటలబీమా పరిహారం లేదు.. పైగా ప్రీమియం కట్టాల్సిరావడం.. కరువు సాయానికి ఎగనామం.. ఆర్బీకేలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. విత్తనాలు, ఎరువులు దొరకలేదు. తుపానులు, వరదలు దారుణంగా దెబ్బతీశాయి. దిగుబడులు ఆశించినట్లులేవు.. వాటికీ కనీస మద్దతు ధర రాలేదు. అన్ని విధాలుగా దగా పడిన రైతన్న ఏడు నెలలుగా రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున ఇస్తానన్న పెట్టుబడి సాయం లేదు. ఈ సాయం కోసం రాష్ట్రంలోని 54 లక్షల మందికి రూ.10వేల కోట్లు అవసరం కాగా, బడ్జెట్లో రూ.1,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇంతమోసం చేస్తారా.. అని అన్నదాతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఖరీఫ్–2023 సీజన్కు సంబంధించి రైతుల తరఫున చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించకపోవడం వలన రూ.1,358 కోట్ల పంటల బీమా పరిహారం అందకుండా పోయింది. రబీ సీజన్లో కరువు సాయానికి సంబంధించి రూ.328 కోట్లకు ఎగనామం పెట్టారు. ఇలా రైతులకు ఈ ఏడు నెలల్లో అందించాల్సిన రూ.12,563 కోట్లు ఈ ప్రభుత్వం ఎగ్గొట్టింది. వీటి కోసం కళ్లల్లో ఒత్తులేసుకొని రైతులు ఎదురు చూస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వలేక ఈసారి పండుగకు దూరమవ్వాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లుగా విత్తు నుంచి విక్రయం వరకు గ్రామ స్థాయిలో రైతులను చేయిపట్టి నడిపించిన రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)ను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. దీంతో విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు నానా అగచాట్లు పడ్డారు. రోడ్డునపడిన అన్నదాత..ఇంటికొచ్చే కొత్త పంటతో సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలికే రైతన్నల ఇంట ఈసారి ఆ పరిస్థితి మచ్చుకైనా కన్పించడం లేదు. ప్రభుత్వ నిర్వాకానికి తోడు వరుస వైపరీత్యాల ప్రభావంతో ఓ వైపు పంటలు దెబ్బతినగా, చేతికొచ్చిన అరకొర పంటకు మద్దతు ధర కోసం రైతన్నలు రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. గడిచిన ఐదేళ్లుగా విత్తనాలు, ఎరువులకు ఏరోజు ఇబ్బందిపడని రైతులు గడిచిన ఖరీఫ్ సీజన్లో వాటి కోసం నానా అవస్థలు పడ్డారు. మళ్లీ, మళ్లీ పెట్టుబడులు పెట్టి పండించిన వరి, పత్తి, ఉల్లి, టమోటా, మిర్చి వంటి పంటలకు మార్కెట్లో సరైన ధర లేక రైతులు తీవ్రమైన ఆవేదనతో ఉన్నారు. ఖరీఫ్ సీజన్లో కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతంలో తుపానులు, వరదలతో అధికారికంగా 6 లక్షల ఎకరాలలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వర్షాభావ పరిస్థితులతో రాయలసీమ జిల్లాల్లో మరో 2 లక్షల ఎకరాలకు పైగా పంటలు ఎండిపోయాయి. రాయలసీమ జిల్లాల్లో 80కి పైగా మండలాలు కరువు కోరల్లో చిక్కుకున్నప్పటికీ మొక్కుబడిగా 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకున్నారే తప్ప పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. పంటల బీమా రక్షణేది?గతేడాది ఇదే రబీ సీజన్లో పంటల బీమాలో నమోదైన రైతుల సంఖ్య అక్షరాల 43.82 లక్షల మంది. మరిప్పుడూ.. కేవలం 7.64 లక్షల మంది. అంటే ఆరో వంతు మందికి కూడా పంటల బీమా రక్షణ దక్కలేదు. గత ఐదేళ్లూ అన్నదాతలపై పైసా భారం పడకుండా డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేసింది. ఈ–క్రాప్ నమోదు ప్రామాణికంగా నోటిఫై చేసిన ప్రతి పంటకు, సాగు చేసిన ప్రతి ఎకరాకు నూరు శాతం యూనివర్శల్ కవరేజ్ కల్పిస్తూ పంటల బీమా రక్షణ లభించేది. ఈ బీమాతో ఎలాంటి విపత్తు ఎదురైనా రైతన్నలు నిశ్చింతగా ఉండే వారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో వివిధ విపత్తుల కారణంగా పంటలు దెబ్బతిన్న 54.55 లక్షల మంది రైతులకు రికార్డు స్థాయిలో రూ.7,802.05 కోట్లు పరిహారంగా అందించింది. వరి పంటకు ప్రీమియం చెల్లింపు గడువు బుధవారంతో ముగుస్తుంది. మిగతా పంటలకు గత నెల 31వ తేదీనే ముగిసింది. అయినా 50.67 లక్షల ఎకరాలకు రైతులు బీమా చేయించలేదు. చంద్రబాబు ప్రభుత్వం బీమా ప్రీమియం భారాన్ని రైతులపైనే వేయడమే ఇందుకు కారణం. ఈ భారం భరించలేక లక్షలాది రైతులు పంటల బీమా చేయించుకోలేకపోయారు. పైగా, బీమాకు అవసరమైన సర్టిఫికెట్లు, నమోదు వంటి వాటి కోసం ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన దుస్థితి. దీంతో పంటల బీమా అంటేనే రైతులు భయపడిపోయారు.17న విజయవాడలో ధర్నాకు పిలుపుప్రతీ రైతుకు రూ.20వేల పెట్టుబడి సాయం ఇస్తామన్న హామీని ఎప్పుడు అమలు చేస్తారంటూ సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎన్నికలలో ఇచ్చిన అన్ని హామీలన్నీ అమలు చేస్తున్నామని గొప్పగా చెబుతున్న చంద్రబాబు.. రైతులకు ఇచ్చిన హామీల సంగతేమిటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. రైతులకు ఇచ్చిన పెట్టుబడి సాయం హామీ ముఖ్యమంత్రికి గుర్తులేదా? గుర్తు ఉన్నా రైతులకు ఇవ్వటం ఇష్టం లేక అమలు చేయటం లేదా? స్పష్టం చేయాలి. రైతులకు ఇచ్చిన హామీల అమలు, పెండింగ్ బకాయిలు చెల్లింపుతోపాటు రైతులపై భారం వేయకుండా ఉచిత పంటల బీమా పథకం కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా చేయబోతున్నాం. – కె.ప్రభాకరరెడ్డి, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
17న విజయవాడలో రైతుల మహా ధర్నా
సాక్షి, అమరావతి : రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైన టీడీపీ కూటమి ప్రభుత్వం పట్ల రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ జిల్లాలలో దాదాపు 80కు పైగా మండలాలు కరువు కోరల్లో చిక్కుకున్నప్పటికీ మొక్కుబడిగా 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకుందే తప్ప పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. 2023–24లో ఖరీఫ్తో పాటు రబీ సీజన్లలో వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టపోయిన 3.91 లక్షల మంది రైతులకు చెల్లించాల్సిన రూ.328 కోట్ల కరువు సాయం బకాయిలు విడుదల చేయలేదు.ఖరీఫ్–2023 సీజన్లో రైతుల తరఫున రూ.930 కోట్ల ప్రీమియం బకాయిలు చెల్లించకపోవడం వల్ల రైతులకు న్యాయంగా దక్కాల్సిన రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారం అందలేదు. ఇలా రైతులకు చెల్లించాల్సిన రూ.12,563 కోట్లు ఎగ్గొట్టింది. ఈ నేపథ్యంలో రైతాంగ సమస్యలపై ఈ నెల 17న విజయవాడలో భారీ ధర్నా నిర్వహణకు ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణయ్య, కే ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి రైతుకు రూ.20 వేల పెట్టుబడి సాయం ఇస్తామన్న హామీని ఎప్పుడు అమలు చేస్తారంటూ ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని నిలదీశారు.ఎన్నికలలో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నామని గొప్పగా చెబుతున్న చంద్రబాబు.. రైతులకు ఇచ్చిన హామీల సంగతేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. పెట్టుబడి సాయం హామీ ముఖ్యమంత్రికి గుర్తులేదా? గుర్తు ఉన్నా రైతులకు ఇవ్వటం ఇష్టం లేక అమలు చేయటం లేదా.. అన్నది స్పష్టం చేయాలన్నారు. ఈ నేపథ్యంలో రైతాంగ సమస్యల సాధనకు డిమాండ్ చేస్తూ ఈ నెల 17న విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా నిర్వహించబోతున్నామని వారు స్పష్టం చేశారు. -
రైతుల ఆస్తులు వేలం
కర్నూలు (అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీబీ) బకాయిలను రాబట్టుకునేందుకు రైతుల ఆస్తులను వేలం వేసేందుకు రంగం సిద్ధంచేస్తున్నారు. రైతులకు అవసరమైన రుణాలను పంపిణీచేసి ఆదుకోవాల్సి ఉండగా.. గతంలో ఎప్పుడూలేని విధంగా ఆ విషయంలో పూర్తిగా వెనుకబడింది. పైగా ఇప్పుడు వారి ఆస్తులను విక్రయించి బకాయిలకు జమచేసుకునేందుకు న్యాయ ప్రక్రియ కూడా మొదలుపెట్టింది. ఇందులో భాగంగా తాకట్టు పెట్టిన ఆస్తులను వేలంపాట ద్వారా విక్రయించే ప్రక్రియను జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, పీఏసీఎస్లు ముమ్మరం చేశాయి. ఈ ఏడాది జూన్ నుంచి ఒకవైపు సెక్షన్–71 కింద నోటీసులివ్వడం, మరోవైపు ఎగ్జిక్యూషన్ పిటిషన్ (ఈపీ) పైల్చేయడం వంటివి జరుగుతున్నాయి. అలాగే, 2024 జూన్ నుంచి డిసెంబరు వరకు రూ.122.82 కోట్ల బకాయిలను రాబట్టుకునేందుకు 1,457 మంది రైతులకు సహకార చట్టం సెక్షన్–71 కింద నోటీసులు ఇచ్చారు. ఇదే సమయంలో 522 మంది రైతుల నుంచి రూ.41.92 కోట్లను రాబట్టేందుకు ఈపీలు కూడా దాఖలు చేశారు. ఆస్తుల అమ్మకానికి డిక్రీ కూడా చేయడం గమనార్హం. నిజానికి.. ఈ ఏడాది అన్ని రకాలుగా వ్యవసాయం కలిసిరాక నష్టాల బారిన పడినా రైతుల ఆస్తుల విక్రయాలకు డీసీసీబీ రంగం సిద్ధంచేయడంపట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాటి రోజులు మళ్లీ పునరావృతం.. 2014–15 నుంచి 2018–19 వరకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, పీఏసీఎస్లు పాత బకాయిలను రాబట్టుకునేందుకు రైతుల జీవితాలతో చెలగాటమాడాయి. మళ్లీ అదే పరిస్థితి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోను పునరావృతమవుతోంది. బకాయిలు పేరుకుపోవడానికి బ్యాంకు, పీఏసీఎస్ సిబ్బంది అవినీతి అక్రమాలే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వల్పకాలిక రుణమైన, దీర్ఘకాలిక రుణమైన రైతులు కమీషన్లు ఇచ్చుకోకపోతే రుణాలిచ్చే పరిస్థితిలేదు. వెరిఫికేషన్ కోసం వెళ్లే అధికారులకూ ముడుపులు సమర్పించాల్సిందే. రూ.లక్ష రుణం తీసుకుంటే చేతికి వచ్చేది రూ.80 వేలే. రికవరీ మాత్రం రూ.లక్ష చేయాల్సిందే. ఈ కారణాలతోనే అనేకమంది రైతులు రుణాలు తిరిగి చెల్లించలేకపోతున్నారు. దీంతో వీరి ఆస్తుల వేలంపాట ద్వారా విక్రయించి బకాయిలు జమచేసుకుంటున్నారు. రూ.5 కోట్లు రుణాలు ఇస్తే ఒట్టు.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రుణాల పంపిణీ కోసం ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బ్రాంచీలకు, పీఏసీఎస్లకు రూ.330 కోట్ల బడ్జెట్ ఇచ్చిoది. ఈ బడ్జెట్ పూర్తయితే అదనంగా ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉంది. దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాల పంపిణీకి ఈ బడ్జెట్ని వినియోగించాలి. బడ్జెట్ దండిగా ఉన్నప్పటికీ రుణాల పంపిణీ మాత్రం పెద్దగాలేదు. వాణిజ్య బ్యాంకులకు రైతులు పోటెత్తుతుంటే జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బ్రాంచీల్లో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిఏటా జూలై నుంచి నవంబరు లేదా డిసెంబరు మూడవ వారం వరకే రుణాలు పంపిణీ చేస్తారు. ఆ తర్వాత రికవరీపై దృష్టిసారిస్తారు. ఈ నేపథ్యంలో.. రుణాల పంపిణీకి ఇంత పెద్ద మొత్తం కేటాయించినప్పటికీ ఇప్పటివరకు రుణాల పంపిణీ రూ.5 కోట్లలోపే ఉండటం గమనార్హం. లాభాల బాట పట్టించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. నష్టాల ఊబిలో చిక్కుకున్న కర్నూలు డీసీసీబీకి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఊపిరిపోసింది. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు కేడీసీసీబీ రుణాలు పంపిణీచేసే ఏర్పాటుచేసింది. కస్టమ్స్ హయ్యరింగ్ సెంటర్లు, మల్టీపర్పస్ గోదాముల నిర్మాణాలకు డీసీసీబీ రుణాలు అందజేసింది. గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా బ్యాంకు లోనింగ్ భారీగా పెరిగింది. వైఎస్సార్సీపీ హయాంలో దశాబ్దాల నాటి నష్టాలను అధిగమించి నికర లాభాల్లోకి వచి్చంది. 2022–23, 2023–24 సంవత్సరాల్లో గణనీయమైన నికర ఆదాయం పొందింది. రికార్డు స్థాయిలో ఏకంగా రూ.10 కోట్లు లాభం ఆర్జించగా.. సభ్యులైన పీఏసీఎస్లకు రూ.4 కోట్లు డివిడెండ్ ఇచ్చిoది. రాయలసీమ జిల్లాల్లోనే అత్యధిక టర్నోవర్ కలిగిన బ్యాంకుగా వరుసగా రెండేళ్లు అవార్డు కూడా అందుకుంది. నికర లాభాల్లోకి వచ్చిన కేడీసీసీబీ మళ్లీ నష్టాల్లోకి వచ్చి బలహీనమైన బ్యాంకుగా రికార్డు నమోదుచేసుకోవడం ఆందోళన కలిగించే విషయం. రైతుల ఆస్తుల స్వాధీనానికి రంగం సిద్ధం.. ఇక కల్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో బకాయిపడిన రైతులు 70 మందికి జూన్ నుంచి సెక్షన్–71 కింద నోటీసులిచ్చారు. తర్వాత 30 మంది రైతులకు ఈపీ దాఖలు చేశారు. కొంతమంది బకాయిలు చెల్లించారు. 20 మంది రైతులు స్పందించకపోవడంతో వారి ఆస్తుల వేలానికి చర్యలు తీసుకున్నారు. దీంతో 13 మంది రైతులు బకాయిలు చెల్లించారు. ఇక ఏడుగురు స్పందించకపోవడంతో వారి ఆస్తులను పీఏసీఎస్ పరం చేసుకోవడానికి చర్యలు చేపట్టారు. -
రైతుల సేవలో కేవీకే
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని మల్యాల కృషి విజ్ఞాన కేంద్రాన్ని (Krishi Vigyan Kendra) 1989లో ఏర్పాటు చేశారు. 36 ఏళ్లుగా ఈ కేంద్రం రైతులకు సేవలందిస్తోంది. జెన్నారెడ్డి రఘోత్తంరెడ్డి తన తండ్రి వెంకటరెడ్డి పేరు మీద మల్యాల గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రానికి 46.6 ఎకరాల భూమిని కేటాయించారు. మల్యాల కేవీకేలో సమన్వయకర్తగా డాక్టర్ ఎస్.మాలతి, విస్తరణ విభాగ అధిపతిగా డాక్టర్ ఎన్.కిషోర్ కుమార్, పంట సేద్యం ఉత్పత్తి శాస్త్రవేత్తగా బి.క్రాంతికుమార్, ఉద్యాన శాస్త్రవేత్తగా డాక్టర్ ఈ.రాంబాబు పనిచేస్తున్నారు. సస్యరక్షణ విభాగం, వెటర్నరీ, గృహ విజ్ఞాన విభాగాల శాస్త్రవేత్తల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రైతులకు అవగాహన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిపిన పరిశోధనలపై మల్యాల కేవీకే ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. స్థానిక భూముల నాణ్యతను బట్టి వాటికి అనువుగా ఉంటే ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాలుగా ఎంపిక చేసి పరీక్షలు నిర్వహిస్తారు. మళ్లీ వాటిని పరిశోధనకు తీసుకువెళ్లి ఇతర రైతులకు ఉపయోగపడే విధంగా తెలియజేస్తున్నారు. రైతు దినోత్సవాలు, కిసాన్ మేళాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఉన్న ప్రధాన పంటలపైన రైతులకు శిక్షణ కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలను సమన్వయం చేస్తూ సీజన్లో రైతులు సాగుచేస్తున్న పంట క్షేత్రాలను సందర్శించి పురుగులు, తెగుళ్ల నివారణ విషయంలో రైతులను చైతన్యపరుస్తున్నారు. చిరు సంచుల్లో వంగడాలు.. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన వంగడాలను చిరు సంచుల రూపంలో రైతులకు అందజేస్తున్నారు. రైతులు చిరు సంచుల ధాన్యం అభివృద్ధి బాగా ఉందని చెబితే కొత్తగా మరింత మంది రైతులకు ఇస్తున్నారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, యాంత్రీకరణ, చీడపీడల నివారణ, పురుగుమందుల వాడకంపై మల్యాల కేవీకే శాస్త్రవేత్తలు క్షేత్ర దినోత్సవాలు, ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతుల క్షేత్రాల్లో వరి, పత్తి, మిరప, మొక్కజొన్న పంటలతోపాటు ఆరుతడి పంటలపై క్షేత్ర ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మట్టి పరీక్షలు.. భూసార పరీక్ష కేంద్రం ద్వారా రైతులకు మట్టి, నీళ్ల పరీక్షలు నిర్వహించి ఫలితాలు తెలియజేస్తున్నారు. వ్యవసాయ రంగంలో రోజురోజుకూ కొత్తకొత్త మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడంతోపాటు సేంద్రియ సాగుపై ఆసక్తి పెరిగే విధంగా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. పెట్టుబడులు తగ్గించి అధిక దిగుబడులు పొందడం కోసం రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ వ్యవసాయంలో రాణించే విధంగా శిక్షణ ఇస్తున్నారు. వరి విత్తన ఉత్పత్తి.. మల్యాల కేవీకేలోని ఫాంలో వరి విత్తన ఉత్పత్తిలో భాగంగా సిద్ధి సన్న రకం, ఆర్ఎన్ఆర్ 15048 (తెలంగాణ సోనా), కునారం 118 సన్నాలు, డబ్ల్యూజీఎల్ 962 సన్నాలు తయారు చేస్తున్నారు. వరిలో విత్తన ఉత్పత్తి ద్వారా జిల్లాలోని రైతాంగానికి నాణ్యమైన విత్తనాలను అందిస్తున్నారు. గిరిజన ఉప ప్రణాళిక, ఎస్సీ ఉప ప్రణాళిక పథకంలో భాగంగా ఎంపిక చేసిన గ్రామాల రైతులకు పంటల సాగులో మెళకువలపై శిక్షణ ఇస్తున్నారు. అదే విధంగా స్కిల్ ట్రైనింగ్లు, ఒకేషనల్ ట్రైనింగ్లు, గుర్తించబడిన అంశాలపై ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆర్య (అట్రాక్టింగ్ అండ్ రిటైనింగ్ రూరల్ యూత్ ఇన్ అగ్రికల్చర్) పథకంలో భాగంగా గ్రామాలను దత్తత తీసుకుని 18 నుంచి 35 ఏళ్ల వయసుగల వారిని ఎంపిక చేసి పురుష, మహిళా రైతులకు శిక్షణ ఇస్తున్నారు. కూరగాయల సాగు, పెరటికోళ్ల పెంపకం.. కేవీకేలోని షేడ్ నెట్లలో కూరగాయల సాగు పెంపకం, వర్మి కంపోస్టు తయారీ, పెరటి కోళ్ల పెంపకం, చిరుధాన్యాలతో వంటకాలు తయారు చేయడంపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. గిరిజనులు, దళితులు ఎక్కువగా ఉండే గ్రామాలను ఎంపిక చేసి, దత్తత తీసుకొని అక్కడి స్థానికులకు కుట్టు మెషీన్లపై శిక్షణ ఇచ్చారు. మూడు నుంచి నాలుగు సంవత్సరాలకుగాను జిల్లాలో కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని శిక్షణ ఇస్తున్నారు. కాటన్ స్పెషల్ ప్రాజెక్టులో భాగంగా నాగ్పూర్ అఖిల భారత పత్తి పరిశోధన సంస్థ (సీఐసీఆర్) సహకారంతో అధిక సాంద్రత పత్తి సాగు వల్ల జరిగే మేలుపై రైతులకు శిక్షణ ఇచ్చారు. తద్వారా రోజురోజుకూ రైతులు అధిక సాంద్రత పత్తి సాగుపై మక్కువ కనబరుస్తున్నారు. దీంతో మొక్కల సంఖ్య పెరిగి పంట దిగుబడి పెరగటంతో పాటుగా ఆర్థికంగా చేయూత వచ్చే విధంగా కృషి చేస్తున్నారు.మరిన్ని విశేషాలు.. » పెసర, మినుము, కందిలో కొత్త రకాలను చిరు సంచుల రూపంలో రైతులకు అందజేసి పంటల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. » కిసాన్ సారథి మొబైల్ యాప్ ద్వారా జిల్లా వ్యాప్తంగా 1,12,124 మంది రైతులను అందులో సభ్యులుగా చేర్చారు. పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలను కిసాన్ సారథి మొబైల్ యాప్ ద్వారా సమాచారాన్ని రైతులకు చేరవేస్తున్నారు. » డిస్ట్రిక్ట్ ఆగ్రో మెటరాలజీ యూనిట్ (దాము) వాట్సాప్ గ్రూపు ద్వారా 2023–24 సంవత్సరంలో రైతులకు వాతావరణ సూచనలు చేరవేశారు. »మల్యాల కేవీకే అనుసంధానంలో రైతులకు మిరపలో సాగు జాగ్రత్త చర్యలో భాగంగా నీలిరంగు, పసుపు రంగు జిగురు అట్టలను మిరప పంట చేలలో ఏర్పాటు చేసుకుని పంటను కాపాడుకునే విధానాలపై తెలియజేస్తున్నారు. మిరపలో సమగ్ర వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ మల్చింగ్ విధానం వల్ల కలిగే లాభాలు, మిరప పంట చేనుల చుట్టూ బంతి పూల చెట్లు, మొక్కజొన్న వేసుకుంటే మేలుదాయకమని అవగాహన కల్పిస్తున్నారు. » వరిలో నేరుగా వెదజల్లే పద్ధతి ద్వారా రైతులకు లాభాలు చేకూరుస్తున్నారు. » మొక్కజొన్నలో జంటసాళ్ల పద్ధతిపై అవగాహన కల్పిస్తున్నారు. » యాసంగిలో జీరో టిల్లేట్ పద్ధతిలో మొక్కజొన్న సాగు లాభదాయకంపై తెలియజేస్తున్నారు. » వరి, మిరప పంటలకు ముందుగా పచ్చిరొట్ట పంటలు సాగు చేయాలని అవగాహన కల్పించటం వల్ల 40 శాతం వరకు రైతులు వృద్ధి సాధిస్తుండగా సూడోమోనోస్ జీవ నియంత్రికల వాడకాన్ని పెంచారు.మందుల వాడకం తగ్గించాలి రైతులు పంటల సాగు సమయంలో పురుగు మందులు, తెగుళ్ల మందులు అధికంగా వాడటం వల్ల భూసారం దెబ్బతింటుంది. పురుగు మందులు, తెగుళ్ల మందుల వాడకం తగ్గించడం శుభసూచకం. తద్వారా మనం సాగుచేసే నేల పాడైపోకుండా భావితరాల వారికి అందించే విధంగా ఉంటుంది. విచక్షణారహితంగా మందుల వాడకాన్ని తగ్గించాలి. సమీకృత వ్యవసాయాన్ని ఆచరించాలి. భావితరాల పురోగతికి నాంది పలకాలి. – డాక్టర్ ఎస్.మాలతి, మల్యాల కేవీకే సమన్వయకర్త గ్రామీణ యువతకు అవగాహన కల్పిస్తున్నాం... మల్యాల కేవీకే ద్వారా నిర్వహించే వివిధ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలతో గ్రామీణ యువతకు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై అవగాహన కల్పిస్తున్నాం. తద్వారా వారు ఉపాధి అవకాశాలు పొందే విధంగా ప్రోత్సహిస్తున్నాం. జిల్లాలోని రైతులకు సమగ్ర ఎరువులు, పురుగు మందుల వాడకంపై తెలియజేస్తూ వారు సమగ్ర వ్యవసాయం చేసే విధంగా అవగాహన కల్పిస్తున్నాం. - డాక్టర్ ఎన్.కిషోర్ కుమార్, మల్యాల కేవీకే శాస్త్రవేత్త కొత్త రకాల విత్తనాలతో దిగుబడి సాధించా.. మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా నేను కొత్త రకాలైన వరి, పెసర విత్తనాలను తీసుకున్నాను. వాటి ద్వారా అధిక దిగుబడి సాధిస్తూ నాతోటి రైతులకు కొత్త రకం వరి, పెసర రకాలను పరిచయం చేస్తున్నాను. కేవీకే ద్వారా ఏర్పాటు చేస్తున్న అనేక శిక్షణ కార్యక్రమాలు, రైతు సదస్సులకు హాజరవుతున్నాను. తద్వారా రైతులు కొత్త విషయాలను తెలుసుకునే విధంగా సాయం చేస్తున్నాను. ముఖ్యంగా నేరుగా వరిలో విత్తేపద్ధతి, సమగ్ర వ్యవసాయం, కొత్త రకాలు, వివిధ పంటల్లో జంటసాళ్ల పద్ధతి మొక్కజొన్నలో అవలంబిస్తూ ఆర్థిక లబ్ధి పొందుతున్నాను. –గండ్రాతి భాస్కర్రెడ్డి, రైతు, బయ్యారం అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేస్తున్నాను మల్యాల కేవీకే ద్వారా గత మూడు సంవత్సరాలుగా నేను అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేస్తున్నాను. దీని ద్వారా ఎకరాకు పది నుంచి 11 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తుండగా ఆర్థికంగా అభివృద్ధి ఉంటోంది. పత్తి తర్వాత జొన్న, బొబ్బెర పంటలను సాగుచేసి ఆదాయాన్ని పొందుతున్నాను. మల్యాల కేవీకే ద్వారా ముఖ్యంగా సమగ్ర ఎరువులు, పురుగు మందుల యాజమాన్యం, అధిక సాంద్రత పత్తిసాగు, కొత్త రకాలైన విత్తనాలు, సమగ్ర వ్యవసాయంపై విషయాలు తెలుసుకుని తోటి రైతులు అవలంబించే విధంగా ప్రోత్సహిస్తున్నాను. –మాలోతు బాలాజీ, రైతు, చంద్రుతండా -
నాడు హడావుడి చేసి.. నేడు ముఖం చాటేసి!
సాక్షి ప్రతినిధి, విజయవాడ/హనుమాన్జంక్షన్ రూరల్: గోడు వినలేదు.. కనికరం చూపలేదు.. కనీసం కలిసేందుకు అవకాశం ఇవ్వలేదు. నాడు హామీ ఇచ్చారు కదా.. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా.. అని ఆశతో వస్తే.. ముఖం చాటేశారు. రోజంతా ఎదురుచూసినా ఫలితం దక్కలేదు. ఇక చేసేది లేక నిరాశతో వెనుదిరిగారు. ఇదీ మంగళవారం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం వద్ద డెప్యూటీ సీఎం పవన్కల్యాణ్ను కలిసేందుకు వచ్చిన మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడ నిర్వాసితుల పరిస్థితి. 2019 ఎన్నికల ముందు స్వయంగా మల్లవల్లి వచ్చి భూ నిర్వాసితుల ఆందోళనకు మద్దతు తెలపటంతో పాటుగా, అధికారంలోకి రాగానే బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన పనన్ కల్యాణ్ ఇప్పుడూ ముఖం చాటేయటంతో ఉసూరుమంటూ వెనుదిరిగారు.అసలు విషయం ఏమిటంటే..2016లో పారిశ్రామికవాడ ఏర్పాటుకు మల్లవల్లిలోని రీ సర్వే నంబర్–11లో 1360 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించారు. అప్పటికే ఆ భూములను సాగు చేస్తున్న రైతులను గుర్తించేందుకు జియోకాన్ అనే సంస్థతో ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 623 మంది సాగుదారులు ఉన్నట్లు నివేదిక ఇవ్వగా, ఆ తర్వాత రెవెన్యూ అధికారులు 716.44 ఎకరాల్లో 490 మంది సాగుదారులు ఉన్నట్లుగా తుది జాబితాను ప్రకటించారు. కానీ వివిధ కారణాలతో చివరికి 443 మంది రైతులకు గానూ 615.6 ఎకరాలకు మాత్రమే రూ.7.50 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని పంపిణీ చేశారు. దీంతో పరిహారం దక్కని సాగుదారులు ఎనిమిదేళ్లుగా ప్రజాప్రతినిధులు, అధికారుల చూట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సాగుదారుల లెక్క తేల్చే విషయంలో రెవెన్యూ అధికారులపై నాటి టీడీపీ నాయకుల ఒత్తిడితోనే పలువురి పేర్లు తుది జాబితాలో గల్లంతయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయగా, 217 మంది సాగుదారులు 713 ఎకరాలకు నష్టపరిహారం దక్కలేదని అర్జీలు దాఖలు చేశారు.పవన్కల్యాణ్, లోకేష్ హడావుడి హామీలు..నష్టపరిహారం అందని సాగుదారులు పలు దఫాలుగా ఆందోళనలు చేపట్టారు. ఏపీఐఐసీ ఇప్పటికే పరిశ్రమలకు భూకేటాయింపులు చేయటంతో ఆ సంస్థలు చేపట్టిన నిర్మాణాలను సాగుదారులు అడ్డుకుంటూ నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే గత ఏడాది ఆగస్ట్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మల్లవల్లి పారిశ్రామికవాడలో పర్యటించారు. నష్టపరిహారం అందని సాగుదారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ మల్లవల్లి గ్రామానికి వచ్చినప్పుడు బాధితులు తమ గోడును విన్నవించగా న్యాయం చేస్తానని హామీనిచ్చారు. ఈ హామీలను నమ్మిన భూనిర్వాసితులు ఇప్పుడు నెత్తికొట్టుకుంటున్నారు. పవన్ కల్యాణ్ను కలిసి తమ కష్టాన్ని చెప్పుకునేందుకు వెళ్తే కనీసం దర్శనభాగ్యం కలగలేదంటూ వాపోతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లవల్లి భూనిర్వాసితుల ఊసే పవన్ కల్యాణ్, నారా లోకేష్కు పట్టలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తాజా పరిణామాలు ఇవి..బాపులపాడు మండలం మల్లవల్లిలోని ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో పరిహారం దక్కని రైతుల స్వాధీనంలో ఉన్న భూములను బలవంతంగా లాక్కునేందుకు కూటమి ప్రభుత్వం దౌర్జన్యకాండకు దిగింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ నెల మూడో తేదీ నుంచి నాలుగురోజుల పాటు గ్రామాన్ని అదుపులోకి తీసుకుంది. భూనిర్వాసితులను గృహ నిర్బంధం చేసి, వారి భూములను దౌర్జన్యంగా స్వాధీనం చేసుకుంటోంది. పారిశ్రామికవాడలోకి ఇతరులను ఎవ్వరిని అనుమతించకుండా బారికేడ్లు ఏర్పాటు చేసింది. ఎనిమిదేళ్లుగా పరిహారం కోసం కళ్లు కాయలు కాసేటట్లు ఎదురుచూస్తున్న సాగుదారులను నిర్ధాక్షిణ్యంగా ఇళ్లలో బంధించి, వారి భూములను బలవంతంగా లాక్కొంటున్న కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది.పవన్కల్యాణ్, లోకేష్ హడావుడి హామీలు..నష్టపరిహారం అందని సాగుదారులు పలు దఫాలుగా ఆందోళనలు చేపట్టారు. ఏపీఐఐసీ ఇప్పటికే పరిశ్రమలకు భూకేటాయింపులు చేయటంతో ఆ సంస్థలు చేపట్టిన నిర్మాణాలను సాగుదారులు అడ్డుకుంటూ నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే గత ఏడాది ఆగస్ట్లో జనసేన అధినేత పవన్కల్యాణ్ మల్లవల్లి పారిశ్రామికవాడలో పర్యటించారు. నష్టపరిహారం అందని సాగుదారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ మల్లవల్లి గ్రామానికి వచ్చినప్పుడు బాధితులు తమ గోడును విన్నవించగా న్యాయం చేస్తానని హామీనిచ్చారు. ఈ హామీలను నమ్మిన భూనిర్వాసితులు ఇప్పుడు నెత్తికొట్టుకుంటున్నారు. పవన్ కల్యాణ్ను కలిసి తమ కష్టాన్ని చెప్పుకునేందుకు వెళ్తే కనీసం దర్శనభాగ్యం కలగలేదంటూ వాపోతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లవల్లి భూనిర్వాసితుల ఊసే పవన్కల్యాణ్, నారా లోకేష్ కు పట్టలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాక్కోవటం తగదు.. మల్లవల్లి పారిశ్రామికవాడ భూముల్లో సుమారు 150 మందికిపైగా నష్టపరిహారం అందలేదు. దీనిపై ఎనిమిదేళ్లుగా పలు రకాలుగా ఆందోళనలు, పోరాటాలు చేశాం. ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ కూడా వచ్చి న్యాయం చేస్తామని మాట ఇచ్చారు. కానీ ఇప్పుడు నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా పోలీసు బలగాన్ని అడ్డుపెట్టుకుని బలవంతంగా భూములు లాక్కోవటం సబబు కాదు. – చిన్నాల వరప్రసాద్, భూ నిర్వాసితుల ఉద్యమ నేత, మల్లవల్లికోర్టు ఆదేశాలు ఉన్నా బేఖాతరు.. మల్లవల్లిలోని ఆర్ఎస్ నంబర్ 11లో మా కుటుంబానికి 15 ఎకరాల భూమి ఉంది. దశాబ్దాలుగా ఆ భూమిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. కానీ పారిశ్రామికవాడకు భూసేకరణ జరిగినప్పుడు మాకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఈ భూమిపై గతంలోనే కోర్టు ద్వారా పరి్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది. అయినప్పటికీ రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులు భూములు స్వా«దీనం చేసుకుంటున్నారు. – బొకినాల సాంబశివరావు, నిర్వాసితుడు, మల్లవల్లిఅలసిపోయాను.. చెట్లు, ముళ్ల పోదలతో అడవిలా ఉన్న భూమిని మా కుటుంబం అంతా కలిసి నానా కష్టాలు పడి చదును చేసుకున్నాం. ఆ భూమిలోనే పంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తరుణంలో టీడీపీ ప్రభుత్వం పారిశ్రామికవాడ ఏర్పాటు చేస్తామని భూములు లాక్కొది. కానీ ఒక్క రూపాయి కూడా పరిహారం చెల్లించలేదు. ఎన్నో సార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి అలసిపోయాను. ఆ మనోవేదనతో ఆరోగ్యం బాగా క్షీణించింది. – పంతం కామరాజు, నిర్వాసితుడు, మల్లవల్లి -
సాగు యోగ్యతతోనే ‘భరోసా’!: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏటా రూ.12 వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ప్రకటించారు. భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా ఏటా రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. ఈ కొత్త పథకానికి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’అని పేరుపెట్టినట్టు తెలిపారు. ఇక రాష్ట్రంలో రేషన్కార్డు లేని పేద కుటుంబాలన్నింటికీ కొత్త రేషన్కార్డులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి జనవరి 26తో 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ మూడు పథకాల అమలును ప్రారంభించాలని నిర్ణయించామని తెలిపారు. శనివారం సాయంత్రం సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలసి రేవంత్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. వారికి రైతు భరోసా వర్తించదు.. రైతుభరోసా విషయంలో ఎలాంటి గందరగోళం అవసరం లేదని సీఎం రేవంత్ పేర్కొన్నారు. వ్యవసాయ యోగ్యం కాని భూములంటే.. రాళ్లు, రప్పలు, గుట్టలు, రోడ్ల నిర్మాణంలో పోయిన భూములు, మైనింగ్ భూములు, నాలా కన్వర్షన్ పొందిన భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పరిశ్రమల కోసం సేకరించిన భూములు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయబోమని సీఎం స్పష్టం చేశారు. రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా (లబ్ధిదారుల) సమాచారం సేకరించి గ్రామసభల ద్వారా ప్రజలకు వివరిస్తారని తెలిపారు. ప్రభుత్వం, అధికారుల వద్ద ఉన్న సమాచారం ఆధారంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను వర్తింపజేస్తామని వెల్లడించారు. రెవెన్యూ రికార్డుల్లో, ధరణిలో లోపాలతో గతంలో వ్యవసాయానికి యోగ్యంకాని భూములకూ రైతుబంధు వచ్చిందని.. వారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి వివరాలు అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్థిక పరిస్థితి, వెసులుబాటు మేరకు.. రైతు భరోసా కింద ఎకరాకు ఏటా రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయాన్ని మీడియా గుర్తు చేయగా.. గత ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరాకు రూ.10 వేలు ఇస్తే తాము రూ.12 వేలకు పెంచామని సీఎం రేవంత్ బదులిచ్చారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, వెసులుబాటును బట్టి భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు సైతం రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఆదాయం పెంచి పేదలకు పంచడమే తమ ప్రభుత్వ విధానమని చెప్పారు. ఎంత వెసులుబాటు ఉంటే అంతగా రైతులకు మేలు చేయాలన్నదే తమ ఆలోచన అని పేర్కొన్నారు. భూమి లేని వారి ఆవేదన తీర్చడానికి.. ‘‘తమకు భూములు లేకపోవడం ఒక శాపమైతే, ప్రభుత్వం పట్టించుకోకపోవడం మరో శాపమని గతంలో నేను, భట్టి విక్రమార్క, ఇతర సహచరులు నిర్వహించిన పాదయాత్రల సందర్భంగా తండాల్లో, మారుమూల ప్రాంతాల్లోని భూమి లేని వ్యవసాయ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. వాళ్లు కూడా సమాజంలో, మనలో భాగమని గుర్తించి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకాన్ని తీసుకొచ్చాం. చాలా ఏళ్ల నుంచి రేషన్కార్డుల సమస్య పేదవాళ్లను పట్టి పీడిస్తోంది. రేషన్కార్డులు లేని వారందరికీ జనవరి 26 నుంచి కొత్త కార్డులు ఇస్తాం’’ అని సీఎం రేవంత్ చెప్పారు. కేసీఆర్ కుటుంబం వెయ్యేళ్లు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది రైతుబంధు కింద అనర్హులకు చెల్లించిన రూ.వేల కోట్లను తిరిగి వసూలు చేస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘గతంలో ఏం జరిగిందో వెనక్కి వెళితే కేసీఆర్ కుటుంబం వెయ్యేళ్లు జైలు శిక్షకు వెళ్లాల్సి ఉంటుంది. రైతు భరోసాకు సంబంధించి విపక్షాలు శాయశక్తులా ఊహాగానాలు రేపాయి. ఉన్నవి లేనివి ప్రభుత్వ నిర్ణయాలంటూ ప్రచారం చేసి రైతుల్లో గందరగోళం సృష్టించాయి. రైతులకు మేం శుభవార్త వినిపించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం’’ అని సీఎం రేవంత్ చెప్పారు. కొత్త సంవత్సరంలో మొదటిసారి పత్రికా సమావేశం నిర్వహిస్తున్నామని.. రాష్ట్ర రైతాంగానికి మంచి జరగాలని, ఈ ప్రభుత్వం వాళ్లను అన్నిరకాలుగా ఆదుకోవాలని సీఎం ఆకాంక్షించారు. వ్యవసాయం దండుగ కాదు పండుగ చేయాలని తమ ప్రభుత్వం పట్టుదలతో ఈ పథకాలను చేపట్టిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్రావు, కొండా సురేఖ, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు.కేబినెట్ తీసుకున్న ఇతర కీలక నిర్ణయాలివే..పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్రెడ్డి పేరు పెట్టాలని నిర్ణయంసింగూరు ప్రాజెక్టు కెనాల్కు మంత్రి దామోదర రాజనర్సింహ తండ్రి, మాజీ మంత్రి రాజనర్సింహ పేరు పెట్టేందుకు ఆమోదం.జూరాల జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించి మహబూబ్నగర్ జిల్లాలో కొత్తగా ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఉన్న మార్గాలు, ప్రత్యామ్నాయాల పరిశీలన కోసం టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ నియామకం. ఎంత నీటి లభ్యత ఉంది? ఎక్కడ ఉంది? ఎక్కడి నుంచి ఎంతెంత నీటిని తీసుకునే వీలుంది? ఎక్కడెక్కడ రిజర్వాయర్లు నిర్మించాలనే అంశాలతోపాటు ఇప్పుడున్న ప్రాజెక్టుల ద్వారా మరింత నీటిని తీసుకునేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై ఈ కమిటీతో అధ్యయనం చేయించాలని నిర్ణయం.మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను తాగునీటి అవసరాల కోసం హైదరాబాద్కు తరలించేందుకు ప్రతిపాదించిన గోదా వరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్–2,3లకు ఆమోదం. గతంలో 15 టీఎంసీల తరలింపునకు ఈ ప్రాజెక్టు ప్రతిపాదించగా.. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 20 టీఎంసీలకు పెంచేందుకు నిర్ణయం. కొత్తగూడెం మున్సిపాలిటీకి మున్సిపల్ కార్పొరేషన్గా హోదా పెంపు. -
‘రీజినల్’లో మెరుగైన పరిహారం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు భూనిర్వాసితులకు మెరుగైన పరిహారం అందించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు పరిహారంలో ఉదారంగా వ్యవహరించాలని... ఆర్బిట్రేటర్లుగా ఉన్న జిల్లా కలెక్టర్లు వీలైనంత మేర దాన్ని ఖరారు చేయాలని సూచించారు. సీఎం రేవంత్ శుక్రవారం రాత్రి రోడ్లు భవనాల శాఖ అధికారులతో సమీక్షించారు. రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం భూసేకరణను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణ సమయంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించాలని, తరచూ రైతులతో సమావేశమై రహదారి నిర్మాణంతో కలిగే ప్రయోజనాలను వివరించాలని సూచించారు. రీజినల్ రింగు రోడ్డు దక్షిణ భాగం నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ సూత్రప్రాయ ఆమోదం తెలిపినందున.. హెచ్ఎండీఏతో అలైన్మెంట్ చేయించాలని ఆదేశించారు. జిల్లాల నుంచి హైదరాబాద్ను కలిపే 11 రహదారులకు ఆటంకం లేకుండా రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు, రీజినల్ రింగురోడ్డు మధ్య అనుసంధానంలో ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఇతర ప్రధాన రహదారులపై ఫోకస్ మంచిర్యాల– పెద్దపల్లి– భూపాలపల్లి– వరంగల్– హన్మకొండ– మహబూబాబాద్– ఖమ్మం మీదుగా సాగే నాగ్పూర్–విజయవాడ రహదారి... ఆర్మూర్–జగిత్యాల–మంచిర్యాల రహదారి.. జగిత్యాల–కరీంనగర్ రహదారుల నిర్మాణంతోపాటు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల (ఎల్డబ్ల్యూఎఫ్) రోడ్ల నిర్మాణంపైనా సీఎం రేవంత్ సమీక్షించారు. ఈ రహదారుల నిర్మాణానికి సంబంధించి భూసేకరణ, అటవీ అనుమతుల్లో ఆటంకాలను అధిగమించేందుకు పలు సూచనలు చేశారు. ప్రజలకు ఉపయోగపడే రహదారుల నిర్మాణంలో అటవీ శాఖ ఎందుకు కొర్రీలు పెడుతోందని ‘ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు (పీసీసీఎఫ్)’డోబ్రియల్ను ప్రశ్నించారు. పలు అంశాల్లో నిబంధనలు పాటించకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని సీఎంకు పీసీసీఎఫ్ బదులిచ్చారు. దీనితో రాష్ట్రస్థాయిలో తేల్చగల సమస్యలను ఇక్కడే పరిష్కరిస్తామని.. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ వరకు వెళ్లే అంశాలపై వెంటనే నివేదిక రూపంలో సమర్పించాలని సూచించారు. ఆర్అండ్బీ, అటవీ శాఖల నుంచి ఒక్కో అధికారిని ప్రత్యేకంగా ఈ సమస్యల పరిష్కారం కోసం కేటాయించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సీఎస్ వారితో పదిరోజులకోసారి సమీక్షించి త్వరగా క్లియరెన్సులు వచ్చేలా చూడాలని... ఇక్కడ కాకపోతే సంబంధిత మంత్రులు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి, అధికారులను కలవాలని స్పష్టం చేశారు. జాతీయ రహదారుల నిర్మాణంలో అండర్ పాస్ల ఏర్పాటును విస్మరిస్తుండటంతో రైతులు ఇబ్బందిపడుతున్నారని సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గుర్తుచేశారు. దీనితో ఈ సమస్య ఎదురుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణంపై... హ్యామ్ విధానంలో ఆర్అండ్బీ పరిధిలో 12 వేల కిలోమీటర్లు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 17,700 కిలోమీటర్లు రహదారులు నిర్మించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ రహదారుల నిర్మాణానికి సంబంధించి పాత జిల్లాలను యూనిట్గా తీసుకోవాలని సూచించారు. కన్సల్టెన్సీల నియామకం, డీపీఆర్ల తయారీ, వేగంగా పనులు చేపట్టడంపై దృష్టి సారించాలని... మూడేళ్లలో నిర్మాణం పూర్తికావాలని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టాలని, కూలిన వంతెనలను వెంటనే నిర్మించాలని ఆదేశించారు. రహదారుల నిర్మాణం, మరమ్మతులకు సంబంధించి రాష్ట్ర వాటా నిధులు వెంటనే విడుదల చేసి.. కేంద్రం నుంచి రావాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ను పొందాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రామీణ రోడ్ల నిర్మాణానికి రూ.వెయ్యి కోట్లు రాష్ట్రంలో గ్రామీణ రహదారుల నిర్మాణానికి సీఎం రూ.వెయ్యి కోట్లను కేటాయించారు. ఈ నెల నుంచే నెలకు రూ.150 కోట్ల చొప్పున ఈ నిధులను విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. గతంలో ఎడ్ల బండ్లు, సైకిళ్లు, మోటార్ సైకిళ్ల రాకపోకలకు అనుగుణంగా గ్రామ రోడ్లను నిర్వహించేవారని.. ఇప్పుడు అన్నిచోట్లా కార్లు, ట్రాక్టర్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలు తిరుగుతున్నందున వాటి రాకపోకలకు వీలుగా రోడ్లను వెడల్పు చేయాలని సూచించారు. ప్రతి పంచాయతీకి బీటీ రోడ్డు ఉండాలని, గ్రామాల నుంచి మండలాలకు సింగిల్ రోడ్లు, మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు కచి్చతంగా ఉండాలని పేర్కొన్నారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రహదారుల నిర్మాణ నాణ్యతలో తేడాలు చూపొద్దని స్పష్టం చేశారు. అటవీ ప్రాంతాల్లోని గ్రామాలకు సైతం రహదారులు నిర్మించాలని సూచించారు. -
రైతు భరోసా కోసం తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: రైతులకు పంట పెట్టుబడి సాయం ‘రైతు భరోసా’(Rythu Bharosa) అందించే విషయంలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఈ పథకం అమలుపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. వ్యవసాయేతర భూములకు పెట్టుబడి సాయం అందించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని.. ఈ విషయంలో రెవెన్యూ, వ్యవసాయ శాఖలు కలసి క్షేత్రస్థాయిలో సంయుక్త తనిఖీలను చేపట్టాలని సిఫారసు చేసింది. గురువారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీ(Cabinet sub committee) సమావేశంలో ఈ మేరకు ఆరు సిఫారసులను ఆమోదించింది. ‘రైతు భరోసా’పై సబ్ కమిటీ చేసిన సిఫారసులివే.. ⇒ పంటలు పండించే భూములకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయాలి. తోటలు పెంచే భూములకు వానాకాలం లేదా యాసంగిలో ఒక్క సీజన్లో మాత్రమే సాయం ఇవ్వాలి. ఏ భూమికి కూడా ఏడాదికి రెండుసార్లకు మించి సాయం అందించకూడదు. ⇒ ప్రతి సీజన్కు ముందు రైతులు సాగు ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్లైన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ లేదా ప్రజాపాలన కేంద్రాల్లో రైతులు ఇచ్చే ఈ ధ్రువీకరణలను శాటిలైట్, క్షేత్రస్థాయి పరిశీలనల ఆధారంగా నిర్ధారించాలి. ⇒ ఈ ఏడాది యాసంగి సీజన్లో పంటల సాగును శాటిలైట్ చిత్రాల ద్వారా నిక్షిప్తం చేయాలి. ⇒ రాష్ట్రంలో పంటల సాగు పరిస్థితిని తెలుసుకోవడంతోపాటు డిజిటల్ రికార్డులను అప్డేట్ చేసేందుకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణాధికారులు, మండల వ్యవసాయాధికారులు, గ్రామ పంచాయతీల కార్యదర్శులు, పలు శాఖలకు చెందిన గ్రామస్థాయి అధికారులతో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలి. ⇒ సాగు యోగ్యం కాని భూములను గుర్తించాలి. కొండలు, రోడ్లు, రాళ్లు ఉండే భూములు, భౌగోళికంగా సాగుకు అనర్హమైన భూములను గుర్తించాలి. ఆర్వోఆర్ డేటాలో వ్యవసాయ భూములుగా ఉండి నివాస, పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న భూములను వేరు చేయాలి. ⇒ రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి భౌగోళికంగా వ్యవసాయానికి పనికిరాని భూములను, వ్యవసాయేతర అవసరాలకు జరిగిన మార్పిడిని గుర్తించాలి. ఈ భూములకు రైతు భరోసా వర్తింపజేయకూడదు. ⇒ మాజీ, తాజా ప్రజాప్రతినిధులకు, వారి కుటుంబాలకు, ఐటీ చెల్లింపుదారులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఈ పథకం వర్తింపచేయకూడదు. వీరిని గుర్తించేందుకు ఆహార భద్రత కార్డులు, 2024లో నిర్వహించిన కులగణనను ప్రాతిపదికగా తీసుకోవాలి. అయితే ఈ మినహాయింపును రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం మేరకు వర్తింపచేయాలి. -
ఉగాదికి సన్నబియ్యం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పేదలందరికీ రేషన్కార్డులపై ఉచితంగా సన్న బియ్యం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. కుటుంబంలో ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీని.. ఉగాది నుంచి ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఖరీఫ్ (వానాకాలం)లో రైతులు పండించిన సన్న ధాన్యాన్ని క్వింటాల్కు రూ.500 బోనస్ ఇచ్చి సేకరిస్తున్న ప్రభుత్వం.. ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన శనివారం సచివాలయంలో జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు కొత్త రేషన్కార్డుల కోసం ఇప్పటికే 20 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. అయితే మరోసారి కొత్త రేషన్కార్డుల కోసం దరఖాస్తులు కోరుతూ కేబినెట్ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని సమాచారం. అదనంగా 10 లక్షల కొత్త కార్డులు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది. పేద, దిగువ మధ్య తరగతికి ఊరట ప్రస్తుతం రాష్ట్రంలో 89.6 లక్షల రేషన్ కార్డుల ద్వారా 2.81 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. ప్రతి లబ్ధిదారుకు నెలకు 6 కిలోల చొప్పున దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్నారు. దీనికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయనుంది. తద్వారా బియ్యం బ్లాక్ మార్కెటింగ్, రీసైక్లింగ్ను పూర్తిగా కట్టడి చేయవచ్చని భావిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో సన్న బియ్యం ధరలు బాగా పెరిగిపోయాయి. సాధారణ రకం సన్న బియ్యం ధర కిలో రూ.60–65 వరకు ఉండగా.. ఫైన్ రకాల బియ్యం ధర రూ.70కిపైగానే ఉంది. దీనితో పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలపై భారం పడుతోంది. ప్రభుత్వం రేషన్కార్డులపై ఇస్తున్న దొడ్డు బియ్యాన్ని తినేందుకు ఆసక్తి చూపని మధ్య తరగతి వర్గాల వారు ఆ బియ్యాన్ని కిలో రూ.10–20 చొప్పున దళారులకు విక్రయిస్తున్నారు. ఈ బియ్యం తిరిగి రైస్మిల్లులకు చేరుతోంది. మిల్లులు ఈ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కస్టమ్ మిల్లింగ్ కింద ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. రేషన్పై సన్న బియ్యం పంపిణీ ప్రారంభిస్తే దానిని వినియోగించుకుంటారని.. బ్లాక్ మార్కెట్ సమస్య తీరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అదనపు ఖర్చేమీ లేకుండానే పేద, మధ్యతరగతి కుటుంబాల వారు సన్న బియ్యం అన్నం తింటారని, ఇది వారికి భారీ ఊరట అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సర్కార్పై మరో రూ.1,500 కోట్ల భారం రాష్ట్రంలో 89.6 లక్షల రేషన్కార్డులు ఉండగా.. అందులో జాతీయ ఆహార భద్రత పథకం కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినవి 54.5 లక్షలు ఉన్నాయి. అంత్యోదయ అన్న యోజన పథకం కింద మరో ఐదున్నర లక్షల కార్డులున్నాయి. వీరందరికీ కేంద్ర ప్రభుత్వమే ఒక్కొక్కరికి నెలకు 5 కిలోల చొప్పున బియ్యం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చేదానికి అదనంగా మరో కిలో అదనంగా కలిపి ఆరు కిలోల చొప్పున లబ్ధిదారులకు అందిస్తోంది. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన మరో 35.66 లక్షల ఆహార భద్రత కార్డులపై రాష్ట్ర ఖర్చుతోనే బియ్యం పంపిణీ చేస్తోంది. ఇదంతా దొడ్డు బియ్యం మాత్రమే. అయితే కేంద్రం నేరుగా బియ్యం ఇవ్వకుండా కిలోకు రూ.36 చొప్పున రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్ ద్వారా.. ఈ బియ్యాన్ని సమకూర్చుకుంటుంది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 89.6 లక్షల కార్డుదారులకు సన్న బియ్యం సరఫరా చేయనుంది. సన్న బియ్యం కోసం కిలోకు రూ.55, ఆపై ఖర్చవుతుందని అంచనా. అంటే కేంద్రం ఇచ్చే నిధులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వమే వ్యయాన్ని భరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏటా సుమారు రూ.3,600 కోట్ల సబ్సిడీని భరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై సన్న బియ్యం పంపిణీతో మరో రూ.1,500 కోట్ల వరకు భారం పడే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. బియ్యం బాగుంటాయన్న సూచనలతో..సంక్రాంతి నుంచే సన్నబియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ వానాకాలంలో రైతుల నుంచి సేకరించిన సన్నవడ్లను కనీసం రెండు మూడు నెలలైనా మాగనిచ్చి మిల్లింగ్ చేస్తేనే బియ్యం బాగుంటాయని నిపుణులు సూచించడంతో.. రెండు నెలల తర్వాతే సన్న వడ్లను మిల్లింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఉచిత సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించడానికి కొంత సమయం పడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గంలో చర్చించిన అనంతరం దీనిపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నాయి. ఉగాది (మార్చి నెలాఖరు) నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. -
అన్నదాతలకు అండగా కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు... డీఏపీపై వన్-టైమ్ స్పెషల్ ప్యాకేజీ పొడిగింపు
-
నడి రోడ్డుపై అన్నదాతకు అవమానం
పది మందికి అన్నం పెట్టే అన్నదాతను అగచాట్లకు గురిచేసింది. కూటమి ప్రభుత్వం నడి రోడ్డుపై అవమానించింది. నూతన సంవత్సరం వేళ మిల్లర్లతో కలిసి అన్నదాతలతో ఆడుకుంది. ఆరుగాలం శ్రమించి పంటను అమ్ముకునేందుకు వెళ్లిన రైతులను నడిరోడ్డుపై నిలబెట్టింది. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ప్రియాగ్రహారంలో బుధవారం జరిగిన ఈ ఘటన రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది.పోలాకి: ఇటీవల కురిసిన ఎడతెరిపి లేని వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో చాలా చోట్ల ధాన్యం రంగుమారింది. ప్రభుత్వం వారిని పట్టించుకోకుండా వదిలేసింది. ఇదే అదనుగా కొందరు మిల్లర్లు అక్రమాలకు తెగబడుతున్నారు. తేమ పేరిట రైతులను నిలువునా దగా చేస్తున్నారు. అధికారులూ మిల్లర్లకే అమ్మాలని తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వం, మిల్లర్లు కలిసి ఆడుతున్న ఈ ఆటలో రైతులు నలిగిపోతున్నారు. బుధవారం పొలాకి మండలం ప్రియాగ్రహారంలో 20 మంది అన్నదాతలు నడిరోడ్డుపై నిలబడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రియాగ్రహారానికి చెందిన రైతులు బుధవారం రైతు సేవా కేంద్రానికి వెళ్లి ధాన్యానికి ట్రక్షీట్ వేయాలని కోరారు. ధాన్యం శాంపిల్ చూసిన సిబ్బంది.. తాము తేమ శాతం మాత్రమే నిర్థారించగలమని, రంగు మారినట్లు కనిపిస్తున్నందున మిల్లర్ను సంప్రదించాలని చెప్పారు. రైతులు మిల్లర్ దగ్గరకు వెళ్లగా.. మద్దతు ధర ఇవ్వలేనంటూ కరాఖండిగా చెప్పేశారు. కొద్దిసేపటికి మిల్లర్ తరపున దళారీ ఎంటరయ్యాడు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర (80 కేజీలు) రూ.1,840 కాగా.. రైతు సొంత ఖర్చులతో ధాన్యాన్ని మిల్లు వద్ద చేర్చేలా రూ.1,700కు దళారీ రేటు మాట్లాడాడు. గత్యంతరం లేక రైతులు అంగీకరించారు. ధాన్యం ట్రాక్టర్లకు లోడ్ చేశారు. ఇంతలో మిల్లర్ మళ్లీ మాటమార్చేశాడు. ఆ ధాన్యం తమకు వద్దని, రూ.1,500 మాత్రమే ఇస్తామని, లేదంటే అసలు తీసుకోనని తెగేసి చెప్పాడు. దీంతో రైతులు నిర్ఘాంతపోయారు. సొంత ఖర్చులతో ధాన్యం తెచ్చిన తర్వాత తీసుకోకపోతే ఎలా అంటూ రోడ్డపైన ఆందోళనకు దిగారు. రైతంటే ఇంత చిన్నాచూపా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య మండలం అంతా ఉందని రైతులు తెలిపారు. బియ్యం బాగున్నా కొనరెందుకు?ధాన్యం పైకి రంగు మారినట్లు కనిపిస్తున్నా, లోపల బియ్యం బాగుందని రైతులు చెబుతున్నారు. రంగు మారిన ధాన్యం నుంచి తీసిన బియ్యాన్ని వారు చూపించి, నాణ్యత ఏమాత్రం తగ్గలేదని తెలిపారు. అయినా ఎందుకు కొనడంలేదని నిలదీశారు. రైతులకు జరిగిన అవమానాన్ని, వారి ఆవేదనను ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. ఉన్నతాధికారులు రంగంలోకి దిగి మిల్లర్లకు నచ్చజెప్పారు. మిల్లర్లు చెప్పిన ధరకు, మద్దతు ధరకు మధ్యస్తంగా మరో ధరకు రైతులను బలవంతంగా ఒప్పించారు.అవగాహన కల్పిస్తాంధాన్యం కొనుగోలు ప్రక్రియపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తాం. రంగు మారిన ధాన్యంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానందున మిల్లర్లు కొనడంలేదు. తుపాను ప్రభావం నేపథ్యంలో రైతుల వద్ద ఉన్న రంగు మారిన ధాన్యంపై ఉన్నతాధికారులకు నివేదిస్తాం. స్పష్టమైన ప్రకటన వచ్చిన తర్వాత రైతులకు తెలియజేస్తాం. – ఎం.సురేష్కుమార్, తహశీల్దార్, పోలాకిరైతులను వంచించారువర్షంతో పంట నేలవాలి అనేక గ్రామాల్లో ధాన్యం రంగు మారటంతో రైతులంతా నష్టపోయారు. అన్నదాతకు అండగా ఉంటామని చెప్పిన ప్రభుత్వం మమ్మల్ని వంచించింది. నూతన సంవత్సర ఆరంభం రోజున నడిరోడ్డుపై నిలబెట్టింది. అధికారులు మా సమస్య పరిష్కరించకుండా నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు లైన్లో నిలబడ్డారు. – దుర్రు యర్రయ్య, రైతు, ప్రియాగ్రహారంమళ్లీ దళారుల రాజ్యమే..పంట కొనుగోలులో మళ్లీ దళారుల రాజ్యం వచ్చింది. చాలాచోట్ల మిల్లర్లు దళారులతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని రైతులను నిలువునా ముంచుతున్నారు. మిల్లర్లు బ్యాంక్ గ్యారెంటీ పూర్తయ్యేలా కొనుగోలు చేసినట్లు రికార్డులు చూపించి, ఎంపిక చేసిన వారి ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నారు. వాస్తవానికి ఆ రైతులు ధాన్యం నూర్పిడి కూడా చేయడంలేదు. ఇది ముమ్మాటికీ మోసమే. ఇలాంటి వాటిపై ప్రతి మండలంలో మిల్లర్ల వారీగా అధికారులు సూక్ష్మ పరిశీలన చేయాలి. – కరిమి రాజేశ్వరరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ -
అసైన్డ్ భూములపై హక్కులు ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా అసైన్డ్ భూములకు హక్కులు కల్పించే అంశంలో అడుగు ముందుకుపడటం లేదు. రాష్ట్రంలోని 18 లక్షల మందికిపైగా పేద రైతులు అసైన్డ్ భూములపై హక్కులు ఎప్పుడు కల్పిస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు వెంటనే దీనిని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భూపరిపాలన అంశాలపై దృష్టి సారించి ఎంతో కొంత ముందుకెళుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. అసైన్డ్పై హక్కుల అంశాన్ని మాత్రం పక్కన పెట్టినట్టు వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. చట్టాన్ని సవరించాల్సిందే! భూమి లేని పేదలకు ఆర్థిక భద్రత కల్పించడం, సామాజిక గుర్తింపు ఇవ్వడమే ప్రధాన ఉద్దేశంగా తెలంగాణలో దశాబ్దాలుగా భూమి పంపిణీ జరుగుతోంది. పలు రకాల భూములను పేదలకు కేటాయిస్తూ వస్తున్నారు. ఇలా అసైన్ చేసిన భూములు అన్యాక్రాంతం కాకూడదనే ఉద్దేశంతో అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం (పీవోటీ)– 1977 తీసుకొచ్చారు. దాని ప్రకారం ప్రభుత్వం నుంచి ఉచితంగా భూమి పొందినవారు.. ఆ భూమిని ఇతరులకు విక్రయించకూడదు. దానం చేయకూడదు. కౌలుకు కూడా ఇవ్వకూడదు. వారసత్వంగా అనుభవిస్తూ వెళ్లే హక్కులు మాత్రమే ఉంటాయి. అయితే మాజీ సైనికులు పదేళ్ల తర్వాత, రాజకీయ బాధితులు మార్కెట్ ధర చెల్లించి ఉంటే వెంటనే అమ్ముకునే హక్కులు కల్పించారు. అయితే రైతుల అసైన్డ్ భూముల క్రయ, విక్రయ లావాదేవీలు జరగాలంటే భూబదలాయింపు నిరోధ చట్టాన్ని సవరించాలి. ఇందుకోసం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ఇచ్చేశారు! అసైన్డ్ భూములపై పేదలకు హక్కులు కల్పించడంలో కొన్ని దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. అసైన్ చేసి 20 ఏళ్లు దాటితే వాటిపై అసైనీలకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో 15 ఏళ్లకు, తమిళనాడులో 20 ఏళ్లకు, కేరళలో 25 ఏళ్లకు అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు వస్తాయి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలో అయితే పదేళ్లకే యాజమాన్య హక్కులు వస్తాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా అసైన్డ్ భూములపై హక్కులు కల్పించాలనే డిమాండ్ రోజురోజుకూ ఊపందుకుంటోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ దిశగా పలుమార్లు హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదు. దీనిపై ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. భిన్నాభిప్రాయాలతో.. అసైన్డ్ భూములపై పేదలకు హక్కులు కల్పించే అంశంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ హక్కుల కల్పన ద్వారా తెలంగాణలో పెరిగిన భూముల ధరలతో పేద రైతులకు ఆర్థిక స్థిరత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కు టుంబ అవసరాల కోసం అత్యవసర పరిస్థితుల్లో భూములను అమ్ముకుని గట్టెక్కవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఇలా హక్కులిస్తే ఎస్సీ, ఎస్టీల చేతుల్లో ఉన్న భూకమతాల సంఖ్య తగ్గిపోతుందని.. సంపన్నుల చేతుల్లోకి భూమి వెళుతుందనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలతో కమిటీ వేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందనే చర్చ జరిగింది. కానీ ప్రభుత్వం భూభారతి చట్టం, ఇతర భూసంబంధిత అంశాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడంతో ఈ అసైన్డ్ భూముల అంశం పక్కన పడింది. ఇప్పటికైనా అసైన్డ్ భూ ముల విషయంలో ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలనే వాదన వినిపిస్తోంది. -
సంక్రాంతికే భరోసా!
ఏమిటీ సెల్ఫ్ డిక్లరేషన్?‘అయ్యా.. ఫలానా గ్రామానికి చెందిన నాకు సర్వే నంబర్ 1లో ఎకరం పొలం ఉంది. నా ఇంటి ఆవరణతో కలిపి 100వ సర్వే నంబర్లో మరో ఎకరం చెలక ఉంది. ఇంటి జాగా 2 గుంటలు పోను మొత్తం ఎకరా 38 గుంటల్లో కూరగాయలు సాగు చేస్తున్నాను. ఇందులో ఎలాంటి తప్పుడు లెక్కలు చూపినట్లు తేలినా.. ప్రభుత్వం తీసుకునే చర్యలకు కట్టుబడి ఉంటాను. దయచేసి నేను సాగు చేసే భూమికి సంబంధించి రైతు భరోసా అందించగలరని మనవి’ రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందాలనుకునే రైతు ఎవరైనా భవిష్యత్తులో వ్యవసాయ శాఖకు ఇవ్వాల్సిన ‘సెల్ఫ్ డిక్లరేషన్ ’ నమూనా ఇది. సాక్షి, హైదరాబాద్: ‘రైతుభరోసా’ అమలుకు ముహూర్తం ఖరారైంది. కొత్త సంవత్సరంలో సంక్రాంతి కానుకగా ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత కొన్నేళ్లుగా అమల్లో ఉన్న పెట్టుబడి సాయం ‘రైతుబంధు’ స్థానంలో ‘రైతు భరోసా’ను కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశమై పథకం మార్గదర్శకాలపై చర్చించింది. తాజాగా రెండురోజుల క్రితం జరిగిన సమావేశంలో తుది కసరత్తు కూడా పూర్తి చేసింది. వానాకాలం, యాసంగి సీజన్లలో రైతు ఎంత మేర భూమి సాగు చేస్తే అంత విస్తీర్ణానికే లెక్కగట్టి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. గతంలో ఎంత భూమి ఉంటే అంత భూమికి రైతుబంధు అందేది. ఇలాఉండగా రైతు ఎంత భూమిలో సాగు చేశాడో స్వయంగా తెలియజేసే ‘సెల్ఫ్ డిక్లరేషన్’ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని కూడా మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. శాటిలైట్ ఇమేజ్, రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా రైతు సాగు చేసిన భూమిని లెక్కగట్టనున్నారు. అలాగే వ్యవసాయాధికారి ఇచ్చే పంటల విస్తీర్ణంతో రైతు నుంచి తీసుకున్న ‘సెల్ఫ్ డిక్లరేషన్’ను సరిపోల్చుకున్న తర్వాతే పెట్టుబడి సాయాన్ని రైతు ఖాతాలో జమ చేస్తారు. రైతే స్వయంగా తన పేరిట ఉన్న భూమి, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను తెలియజేయడంతో పాటు తాను ఎంత విస్తీర్ణంలో ఏ పంట వేస్తున్నాననే విషయాన్ని ప్రకటించేలా చూడటం ద్వారా రైతుల్లో జవాబుదారీతనాన్ని పెంచవచ్చనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. తద్వారా ప్రభుత్వ సొమ్ము దారి మళ్లకుండా రైతు సాగు చేసిన భూమికే కచ్చితంగా పెట్టుబడి సాయం అందుతుందని భావిస్తోంది. సాగు విస్తీర్ణంలో కచ్చితత్వం కోసమే అంటున్న సర్కారు రైతు అందించే సెల్ఫ్ డిక్లరేషన్ వల్ల ఒక గ్రామంలో ఉన్న పట్టా భూమి ఎంత? అందులో సాగవుతున్న విస్తీర్ణం ఎంతో తెలియడమే కాకుండా రాష్ట్రంలో సాగవుతున్న పంటల వివరాలు కూడా కచ్చితంగా తెలుస్తాయని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి సీజన్లో ఇచ్చే పంటల సాగు విస్తీర్ణం లెక్కల్లో కచ్చితత్వం ఉండడం లేదని భావిస్తున్న ప్రభుత్వం.. రైతు భరోసా పథకం ద్వారా ఈ వివరాలను కూడా తెలుసుకోవాలని నిర్ణయించింది. ఉదాహరణకు ఈ యాసంగిలో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 63.54 లక్షల ఎకరాలు కాగా, రైతులు ఏకంగా 79.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ లెక్కలు వేసింది. ఇందులో వరి 63.20 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 7.18 లక్షల ఎకరాల్లో సాగవుతుందంటూ ప్రతిపాదనలు రూపొందించింది. అయితే ఇప్పుడు రైతు భరోసాకు రైతు సెల్ఫ్ డిక్లరేషన్ నిబంధన వల్ల ఈ పంటలకు సంబంధించి కచ్చితమైన వివరాలు తెలిసే అవకాశం ఉందని, అలాగే ఏ పంటల లోటు ఎంత ఉందో తెలుసుకుని తదనుగుణంగా ఆయా పంటల విస్తీర్ణం పెంచే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే పంట సాగు చేస్తేనే పెట్టుబడి సాయం అందుతుందనే నిబంధన వల్ల..గతంలో పునాసలో మాత్రమే సాగు చేసే రైతు యాసంగిలో కూడా తప్పకుండా ఏదో ఒక పంట పండించేందుకు ఆసక్తి చూపుతారని, తద్వారా యాసంగిలోనూ సాగు విస్తీర్ణం పెరుగుతుందని మంత్రివర్గ ఉప సంఘం అభిప్రాయపడింది. ఎంత పెద్ద రైతుకైనా భరోసా ఖాయం! రైతు భరోసా కింద ఒక్కో సీజన్లో ఎకరాకు రూ.7,500 చొప్పున చెల్లించాలని భావిస్తున్నప్పటికీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనిని ఎంతకు పరిమితం చేయాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. జనవరి 2 లేదా 3వ తేదీన ఉపసంఘం మరోసారి సమావేశమై దీనిపై చర్చించే అవకాశం ఉంది. అదే సమయంలో ఒక్కో రైతుకు ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలనే అనే అంశాన్ని కూడా ఖరారు చేయనున్నట్లు సమాచారం. అయితే ఎంత పెద్ద రైతైనా నిరీ్ణత సీలింగ్ పరిధికి లోబడి సాగు చేసిన భూమికి రైతు భరోసా ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు. పీఎం కిసాన్ పథకంలో ఐదెకరాలు పైనున్న భూ యజమానికి పెట్టుబడి సాయం అందని విషయం విదితమే. రైతు భరోసాకు సంబంధించిన విధివిధానాలతో కూడిన నివేదికను మంత్రివర్గ ఉప సంఘం 3వ తేదీలోపు ప్రభుత్వానికి అందజేస్తే 4వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో ఆమోదముద్ర పడే అవకాశం ఉంది. -
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక అస్తవ్యస్థంగా ఈ క్రాప్
-
రైతన్నల పడిగాపులు
-
పంజాబ్లో రైతుల బంద్
చండీగఢ్: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంసహా తమ పలు డిమాండ్ల సాధనకు ఉద్యమిస్తున్న పంజాబ్ కర్షకులు సోమవారం చేపట్టిన తొమ్మిది గంటల రాష్ట్రవ్యాప్త బంద్తో జనజీవనం స్తంభించింది. పంజాబ్ గుండా సాగే జాతీయ రహదారులపై రాస్తారోకోలు, రైల్వేపట్టాలపై బైఠాయింపులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైల్వే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పంజాబ్–ఢిల్లీ రూట్లో రాకపోకలు సాగించే 163 రైళ్ల సర్వీసులు రద్దయ్యాయి. రాస్తారోకోలతో వాహనాల్లో జనం ఎక్కడికక్కడ చిక్కుకుపోయి అవస్థలు పడ్డారు. సోమవారం ఉదయం ఏడు గంటలకు మొదలెట్టి సాయంత్రం నాలుగు గంటలకు బంద్ను ముగిస్తామని రైతు సంఘాలు ప్రకటించినా బంద్ ప్రభావం రోజంతా కనిపించింది. పటియాలా, జలంధర్, అమృత్సర్, ఫిరోజ్పూర్, బఠిందా, పఠాన్కోట్లలో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. పటియాలా–చండీగఢ్ జాతీయ రహదారిపై ధరేరీ జఠాన్ టోల్ప్లాజా వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించడంతో కిలోమీటర్ల పొడవునా వాహ నాలు నిలిచిపోయి సామాన్యులు ఇబ్బందులపా లయ్యారు. VIDEO | Punjab: Shops remain closed, and buses are off the roads in Moga in the wake of shutdown called by protesting farmers.#PunjabBandh #PunjabNews(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/bxerq4Pm7u— Press Trust of India (@PTI_News) December 30, 2024అమృత్సర్లోని గోల్డెన్ గేట్సహా చాలా పట్టణాల్లో వేల సంఖ్యలో రైతులు బంద్లో పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాలు ఈ బంద్కు పిలుపునివ్వడం తెల్సిందే. గత 35 రోజులుగా ఖనౌరీ సరిహద్దు వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న రైతు సంఘం నేత జగ్జీత్సింగ్ ధల్లేవాల్కు బంద్ సందర్భంగా రైతులు సంఘీభావం ప్రకటించారు. మరోవైపు దీక్ష మొదలై 35 రోజులు పూర్తవడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఇప్ప టికైనా తమ డిమాండ్లపై కేంద్రం దృష్టిసారించాలని సోమవారం ఒక వీడియో విన్నపంలో ధల్లేవాల్ కోరారు. -
ఆంధ్రప్రదేశ్ రైతులకు ఉచిత పంటల బీమాను దూరం చేసిన కూటమి సర్కారు... ప్రీమియం భారం భరించలేక రైతుల గగ్గోలు
-
సంక్రాంతికే కానీ..!
సాక్షి, హైదరాబాద్: రైతులకు పెట్టుబడి సాయం అందించే ‘రైతు భరోసా’పై కాంగ్రెస్ సర్కారు కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. సంక్రాంతి నుంచే రైతు భరోసా సొమ్మును రైతులకు అందిస్తామని సర్కారు ప్రకటించినా.. విధి విధానాల రూపకల్పన ఇంకా ఓ కొలిక్కి రాలేదు. రైతు భరోసాకు ఎవరు అర్హులు? ఎవరు అనర్హులనే దానిపై ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నా.. ఎలా ఇవ్వాలి, ఎంత మేర ఇవ్వాలి, ఉద్యాన పంటలకు పెట్టుబడి సాయం ఎలా అందించాలి, ఇందుకోసం ఏ విధానాన్ని అనుసరించాలన్న అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ క్రమంలో రైతుభరోసాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఆదివారం మళ్లీ సమావేశమై చర్చించింది.అధికాదాయ వర్గాలు మినహా..ఐటీ చెల్లింపుదారులు, సివిల్ సర్వీస్, గ్రూప్–1 స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు వంటి వారికి మినహా సాగుభూమి ఉన్న ప్రతి ఒక్కరికీ రైతు భరోసా అందించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించినట్టు సమాచారం. ఎన్ని ఎకరాలకు సీలింగ్ అమలు చేయాలనే అంశాన్ని సీఎంకే వదిలేసినట్టు తెలిసింది. అయితే 10 ఎకరాల్లోపు సొంత భూమి ఉన్న రైతులందరికీ సాగు చేసిన కమతాలను లెక్కకట్టి పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఎంత భూమి ఉన్నా ప్రభుత్వ నిర్ణయించిన సీలింగ్ లోపు అందరికీ రైతుభరోసా ఇవ్వాల్సిందేనని ఉప సంఘం సభ్యులు పేర్కొన్నట్టు తెలిసింది. కుటుంబం యూనిట్గా రైతు భరోసాను అమలు చేయాలనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని... పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మార్గదర్శకాలను రైతుభరోసాకు వర్తింపజేస్తే వ్యతరేకత వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడినట్టు సమాచారం.సాగుభూములకు సరే.. పక్కాగా నిర్ధారణ ఎలా?సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో.. సాగును నిర్ధారించే అంశంపైనా ఉప సంఘం భేటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలిసింది. ఖరీఫ్లో సాగు ఎక్కువగా ఉంటే రబీలో తగ్గుతుందని.. ఖరీఫ్లో పత్తి సాగు చేసే రైతులు రబీలో నీరు లేక ఏ పంట వేయక బీడు పెట్టే పరిస్థితి మహబూబ్నగర్, మెదక్, ఆదిలాబాద్ తదితర ఉమ్మడి జిల్లాల్లో ఉందని సభ్యులు గుర్తు చేసినట్టు తెలిసింది. వారికి ఎలా రైతు భరోసా వర్తింపజేస్తారనే అంశం ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. అంతేగాకుండా ఆయిల్ పామ్, మామిడి, ఇతర పండ్ల తోటలకు సంబంధించి రైతు భరోసాను ఎలా వర్తింపజేస్తారనే విషయంలోనూ స్పష్టత రాలేదని తెలిసింది. ఒకసారి పంట వేస్తే మళ్లీ పెట్టుబడి అవసరం ఉండదు కాబట్టి ఇలాంటి భూములకు రైతుభరోసా ఎలాగనే సందేహాలు వ్యక్తమైనట్టు సమాచారం. ఇక ఖరీఫ్ సీజన్లో మాత్రమే సాగయ్యే భూములకు రెండు సీజన్లలో రైతుభరోసా ఇవ్వడంపైనా సుదీర్ఘ చర్చ జరిగినట్టు తెలిసింది. మరోవైపు సీజన్కు రూ.7,500 చొప్పున ఒకేసారి రూ.15 వేలు ఇవ్వాలా? లేక విడివిడిగా ఇవ్వాలా అన్న అంశం ప్రస్తావనకు వచ్చిందని... రూ.7,500 కాకుండా సీజన్కు రూ.6,000 చొప్పున ఒకేసారి రెండు సీజన్ల మొత్తాన్ని రైతు ఖాతాల్లో వేయాలనే ప్రతిపాదన కూడా వచ్చినట్టు సమాచారం.రోడ్లు, నాలా కన్వర్షన్లు, కొత్త రిజిస్ట్రేషన్లపై ఫోకస్!రోడ్లు, నాలా కన్వర్షన్ అయిన భూములు, పెద్ద మొత్తంలో కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన భూములకు రైతు భరోసా నిలిపివేయాలని ఉపసంఘం నిర్ణయించినట్టు తెలిసింది. అలాగే గుట్టలు, కొండలు, చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో రిజిస్టరైన భూములకు కూడా ఇవ్వొద్దనే భావనకు వచ్చినట్టు సమాచారం. మొత్తంగా ఖరీఫ్, రబీ సీజన్లలో పంటలు వేసిన భూములకు సంబంధించి మాత్రమే రైతు భరోసా అందించేలా విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది.రైతులెవరూ నష్టపోకుండా ‘రైతుభరోసా’: భట్టిఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. బడ్జెట్లో వ్యవసాయానికి రూ.72,659 కోట్లు కేటాయించడమే తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు రైతులకు మాట ఇచ్చిన విధంగా రైతు భరోసా ఇచ్చి తీరుతామన్నారు. రైతులెవరూ నష్టపోకుండా రైతు భరోసా విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆదివారం సచివాలయంలో రైతు భరోసా మంత్రివర్గ ఉపసంఘం భేటీ కేబినెట్ సబ్కమిటీ భేటీ అయింది. భట్టితోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డితోపాటు వ్యవసాయ శాఖ అధికారులు ఇందులో పాల్గొన్నారు. యాసంగి పంటకు రైతు భరోసా ఇచ్చేందుకు ఖరారు చేయాల్సిన విధివిధానాలపై రెండు గంటల పాటు చర్చించారు. గతంలో పెట్టుబడి సాయం పథకం అమలు నుంచి నేటి వరకు ఏం జరిగింది? రైతుల అభిప్రాయాలు ఏమిటన్న అంశాలను పరిశీలించారు. పలు అంశాలపై వ్యవసాయ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రుణమాఫీ కింద ఇప్పటికే రూ.21వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమచేశామని, రైతు కమిషన్ను నియమించామని, రైతు వేదికలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. రైతులకు ఇబ్బందులు లేకుండా పాలన చేయడం కాంగ్రెస్ పేటెంట్ అని పేర్కొన్నారు. -
ప్రీమియం భారం బీమాకు దూరం
సాక్షి, అమరావతి: గతేడాది ఇదే రబీ సీజన్లో పంటల బీమాలో నమోదైన రైతుల సంఖ్య ఏకంగా 43.82 లక్షలు.. మరిప్పుడు.. కేవలం 5.94 లక్షలు.. ఏడాదిలో ఎంత తేడా! లక్షల ఎకరాలు.. లక్షలాది మంది రైతన్నలు బీమా రక్షణకు దూరమై గాలిలో దీపంలా సాగు చేయాల్సిన దుస్థితి నెలకొంది.. గత ఐదేళ్లూ అన్నదాతలపై పైసా భారం పడకుండా డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసింది. ఎక్కడా తిరగాల్సిన అవసరం లేకుండా ఈ–క్రాప్ ప్రామాణికంగా గ్రామంలోనే పని పూర్తయ్యేది. నోటిఫై చేసిన ప్రతీ పంటకు, సాగు చేసిన ప్రతీ ఎకరాకు నూరు శాతం యూనివర్శల్ కవరేజ్ కల్పిస్తూ పంటల బీమా కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకంతో ఉచితంగా లబ్ధి చేకూరేది. రైతన్నలు నిశ్చింతగా పొలం పనుల్లో నిమగ్నమైతే కావాల్సిన కాగితాలు.. మిగతా ప్రక్రియ విషయాన్ని గ్రామ సచివాలయాలు, వలంటీర్లు దగ్గరుండి చూసుకునేవారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో 54.55 లక్షల మంది రైతన్నలకు పంటలు నష్టపోతే రికార్డు స్థాయిలో రూ.7,802.05 కోట్లు పరిహారంగా అందచేసి సాగుకు అండగా నిలిచింది. ఇప్పుడు వరికి పంటల బీమా వర్తించాలంటే హెక్టార్కు రూ.1,575 చొప్పున రైతన్నలు తమ చేతి నుంచి ఖర్చు పెట్టుకోవాలి. పనులు మానుకుని బ్యాంకులు, కార్యాలయాల చుట్టూ తిరగాలి. రోజుల తరబడి పడిగాపులు కాయాలి. అసలు బీమా పథకానికి ఎప్పటిదాకా గడువు ఉందో చెప్పేవారు లేక.. ఈ అవస్థలు భరించలేక.. డబ్బులు కట్టలేక ఎంతో మంది ఈ పథకానికి దూరమయ్యారు. టీడీపీ కూటమి సర్కారు నిర్వాకాలతో అన్నదాతలు అన్యాయమైపోయారు! ఐదేళ్ల పాటు పైసా భారం పడకుండా అమలైన ఉచిత పంటల బీమా పథకం ద్వారా పూర్తి స్థాయిలో రక్షణ పొందిన రైతన్నలంతా నేడు ప్రీమియం భారాన్ని భరించలేక, పంటల బీమా చేయించుకోలేక గగ్గోలు పెడుతున్నారు.బీమా కవరేజ్ విస్తీర్ణం 8.44 లక్షల ఎకరాలేరబీ–2024–25 సీజన్లో దిగుబడి ఆధారిత పంటల బీమా పథకం కింద 13 పంటలను, వాతావరణ ఆధారిత పంటల కింద 3 పంటలను నోటిఫై చేశారు. జీడి మామిడి పంటకు ప్రీమియం చెల్లింపు గడువు నవంబర్ 15వ తేదీతోనే ముగియగా వరి మినహా మిగతా వాటికి ఈ నెల 15తో గడువు ముగిసింది. వరితో పాటు ఇటీవలే నోటిఫై చేసిన మామిడి పంటకు ఈ నెల 31వతేదీతో గడువు ముగియనుంది. దిగుబడి ఆధారిత పంటల బీమా కింద నోటిఫై చేసిన సాగు విస్తీర్ణం 45.55 లక్షల ఎకరాలు కాగా వాతావరణ ఆధారిత పంటల బీమా కింద నోటిఫై చేసిన జీడిమామిడి, మామిడి, టమాటా పంటల సాగు విస్తీర్ణం 15 లక్షల ఎకరాలు.. అంటే రెండూ కలిపి 60.55 లక్షల ఎకరాల పైమాటే. కానీ ఇప్పటి వరకు పంటల బీమా కవరేజ్ పొందిన విస్తీర్ణం కేవలం 8.44 లక్షల ఎకరాలు మాత్రమే కావడం గమనార్హం. వీటిలో వాతావరణ పంటల బీమా కింద 24,550 ఎకరాలు, దిగుబడి ఆదారిత పంటల బీమా కింద 8.20 లక్షల ఎకరాలలో సాగైన పంటలకు మాత్రమే బీమా కవరేజ్ పొందగలిగారు. రైతుల పరంగా చూస్తే ఈ రబీలో కేవలం 5,94,336 మంది మాత్రమే బీమా చేయించుకోగలిగారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పంటల బీమా తీరు ఎలా ఉందో చెప్పేందుకు ఇదే నిదర్శనం. పంటల బీమా వర్తించాలంటే గరిష్టంగా హెక్టార్కు మామిడికి రూ.5,625, జీడి మామిడికి రూ.3,837.50, టమాటాకు రూ.3,775, వరికి రూ.1,575 చొప్పున బీమా ప్రీమియాన్ని చెల్లించాలి. ఇతర పంటలకూ అదే స్థాయిలో ప్రీమియం భారం పడుతోంది. ఇంత భారం భరించలేక పంటల బీమాకు దూరం అవుతున్నట్లు అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు.ఐదేళ్లు నూరు శాతం కవరేజ్మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత ఐదేళ్లూ ఈ – క్రాప్ నమోదు ప్రామాణికంగా నోటిఫై చేసిన పంటలకు ఉచితంగా నూరు శాతం పంటల బీమా కవరేజ్ కల్పించింది. రబీ 2023–24 సీజన్లో 37.80 లక్షల ఎకరాల్లో సాగైన నోటిఫైడ్ పంటలకు బీమా కవరేజ్ కల్పించడంతో 43.82 లక్షల మంది బీమా రక్షణ పొందగలిగారు. టీడీపీ కూటమి సర్కారు పగ్గాలు చేపట్టిన మరుక్షణమే రైతుల మదిలో వైఎస్ జగన్ ముద్రను చెరిపివేయాలనే అక్కసుతో ఉచిత పంటల బీమా పథకాన్ని నిలిపివేసింది. పంటల బీమా అమలులో రైతులను భాగస్వాములను చేస్తామని చెబుతూ పెనుభారం మోపింది. స్వచ్ఛంద నమోదు పద్థతిలో పంటల బీమాకు శ్రీకారం చుట్టింది. చివరకు అవగాహన కల్పించలేక చేతులెత్తేసింది.తుపాన్, అకాల వర్షాలతో ఇప్పటికే తీవ్ర నష్టం..పంటల బీమా ప్రీమియం చెల్లింపు గడువును జనవరి నెలాఖరు వరకు పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను కేంద్రం పట్టించుకోలేదు. దీంతో రబీ సీజన్ ప్రారంభంలో విరుచుకుపడిన ఫెంగల్ తుపాన్తో పాటు ఇటీవల అల్పపీడన ప్రభావంతో కురిసిన అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న రబీ పంటలకు బీమా పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. దురదృష్టవశాత్తూ సీజన్ ముగిసేలోగా మరేదైనా విపత్తు సంభవిస్తే తమ పరిస్థితి అగమ్యగోచరమేనని అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.పారదర్శకంగా పథకం..1965లో కేంద్రం రూపొందించిన క్రాప్ ఇన్స్రూెన్స్ బిల్లు ఆధారంగా తెచ్చిన మోడల్ ఇన్స్రూెన్స్ పథకం వివిధ రూపాలు మార్చుకుని 2016 నుంచి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై)గా అమలవుతోంది. దీని ప్రకారం నోటిఫై చేసిన వ్యవసాయ పంటలకు ఖరీఫ్లో 2 శాతం, రబీలో 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం చొప్పున ప్రీమియాన్ని రైతులు చెల్లించగా మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించేవి. అయితే ప్రీమియం భారం అధికంగా ఉండడం, ఆర్థిక ఇబ్బందులు, అవగాహన లేక రైతులు సొంతంగా బీమా చేయించుకునేందుకు ముందుకొచ్చేవారు కాదు. రుణాలు తీసుకుంటే మాత్రం బ్యాంకులు ప్రీమియం రూపంలో నిర్దేశిత మొత్తాన్ని మినహాయించుకునేవి. లక్షలాది మంది రైతన్నలు తాము పండించిన పంటలకు బీమా చేయించుకోలేకపోవడంతో విపత్తుల బారిన పడితే తీవ్ర నష్టాల పాలయ్యేవారు. గతంలో బీమా చేయించుకున్న వారు సైతం ఎంతొస్తుందో? ఎప్పుడొస్తుందో తెలియక ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఉండేవి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో రాగానే ఈ దుస్థితిని తొలగిస్తూ చర్యలు చేపట్టింది. ఈ క్రాప్తో పాటు ఈ కేవైసీ నమోదు పూర్తికాగానే ఉచిత పంటల బీమా పధకం వర్తించే నోటిఫై చేసిన పంటలను (స్టార్ గుర్తు) ప్రత్యేకంగా తెలియచేస్తూ రైతులకు భౌతిక రసీదులు అందచేసింది. డాక్టర్ వైస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద నోటిఫై చేసిన పంటకు మీరు చెల్లించాల్సిన ప్రీమియాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి పంటకు బీమా చేసినట్లు స్పష్టంగా తెలియజేసింది. ఈ జాబితాలను ఏటా సామాజిక తనిఖీల్లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శించడమే కాకుండా అభ్యంతరాలను పరిష్కరించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ బీమా పరిహారం అందేలా చర్యలు తీసుకుంది. కూటమి సర్కారు వచ్చాక ఈ క్రాప్ అస్తవ్యస్థంగా మారింది. ఎవరు ఏ పంట సాగు చేశారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక పంటల బీమాలో నమోదు చేసేందుకు అవసరమైన సాగు పత్రాల కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు.బాబు హయాంలో అరకొరగా..2014–19 మధ్య టీడీపీ హయాంలో ఏటా సగటున 46 లక్షల ఎకరాల చొప్పున 2.32 కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్ కల్పించగా, ఏటా సగటున 14.88 లక్షల మంది చొప్పున 74.4 లక్షల మంది రైతులు ప్రీమియం కట్టి బీమా సదుపాయం పొందారు. నాడు హుద్హుద్, తిత్లీ లాంటి భారీ తుపాన్లు, 324 మండలాల్లో కరువు ప్రభావం వల్ల రూ.వేల కోట్ల విలువైన పంటలను కోల్పోయినా రైతులకు దక్కిన పరిహారం అరకొరే. 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్లు మాత్రమే బీమా పరిహారం దక్కింది.జగన్ హయాంలో రికార్డు..2019–23 మధ్య వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా ఏటా 1.08 కోట్ల ఎకరాల చొప్పున 5.42 కోట్ల ఎకరాలకు ఉచిత పంటల బీమా సదుపాయాన్ని కల్పించింది. ఏటా సగటున 40.50 లక్షల మంది చొప్పున ఐదేళ్లలో 2.04 కోట్ల మంది రైతులకు బీమా రక్షణ కల్పిస్తూ చర్యలు తీసుకుంది. రైతుల తరపున వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.3,022.26 కోట్లను బీమా కంపెనీలకు ప్రీమియం రూపంలో చెల్లించింది. ఇక ఐదేళ్లలో 54.55 లక్షల మంది రైతులకు రూ.7,802.08 కోట్ల మేర బీమా పరిహారాన్ని అందచేసి ఆదుకుంది. అంతేకాకుండా 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో 6.19 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల బకాయిలు కూడా చెల్లించి అండగా నిలిచింది. టీడీపీ హయాంతో పోల్చితే అదనంగా 23.70 లక్షల మందికి రూ.4,390.88 కోట్ల మేర అదనంగా బీమా పరిహారం అందించి వైఎస్ జగన్ అన్నదాతలకు అండగా నిలిచారు.ప్రభుత్వమే చెల్లించాలి..నాకున్న 75 సెంట్ల పల్లపు భూమిలో వరి పండిస్తుంటా. 2021 సెప్టెంబరులో గులాబ్ తుపాను కారణంగా పంట నష్టపోతే నా బ్యాంకు ఖాతాకు ప్రభుత్వం రూ.4,650 జమ చేసి ఆదుకుంది. వైఎస్సార్సీపీ హయాంలో ఈ – క్రాప్లో నమోదైన ప్రతీ పంటకు బీమా వర్తించేది. ఇప్పుడు పంటల బీమా ప్రీమియాన్ని రైతులే చెల్లించాలని చెబుతున్నారు. ప్రీమియం భారాన్ని భరించలేక.. బ్యాంకులు, కార్యాలయాల చుట్టూ తిరగలేక, అవగాహన లేక చాలా మంది నష్టపోతున్నాం. రైతుల తరపున ప్రీమియాన్ని గతంలో మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి.– తమ్మిన సీతారమణ, రైతు, టి.నగరపాలెం, భీమిలి మండలం, విశాఖ జిల్లాప్రీమియం భారాన్ని మోయలేం..ప్రీమియం భారాన్ని భరించలేకనే రైతులు పంటల బీమాకు దూరమవుతున్నారు. వరుస వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు కనీసం మద్దతు ధర చెల్లించి ఆదుకోవడంలోనూ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అన్నదాతలు ఈ తరుణంలో ప్రీమియం చెల్లించి బీమా చేయించుకునే పరిస్థితిలో లేరు. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలి. – కోసూరి శివనాగేంద్ర, రైతు, పమిడిముక్కల మండలం, గడ్డిపాడు, కృష్ణా జిల్లాఉచిత బీమా కొనసాగించాలి..గత ఐదేళ్లూ రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకం ఎంతగానో ఆదుకుంది. స్వచ్ఛంద నమోదు పద్ధతి పేరుతో కూటమి ప్రభుత్వం తెచ్చిన పంటల బీమా వల్ల కౌలు రైతులకు తీరని అన్యాయం జరుగుతుంది. గతంలో మాదిరిగా రైతుల తరపున ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలి.– ఎం.హరిబాబు, ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శిఏటా రూ.900 కోట్లకుపైగా భారం..ప్రీమియం భారాన్ని భరించ లేకనే రాష్ట్రంలో రైతన్నలు పంటల బీమాకు దూరమయ్యారు. గత ఐదేళ్లు పైసా భారం పడకుండా నోటిఫై చేసిన ప్రతీ పంటకు, సాగు చేసిన ప్రతీ ఎకరాకు పూర్తి స్థాయిలో బీమా కవరేజీ రైతులకు వైఎస్ జగన్ అండగా నిలిచారు. కూటమి సర్కారు కక్షకట్టినట్లు వ్యవహరిస్తూ ఉచిత పంటల బీమా పథకాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఏటా రూ.900 కోట్లకుపైగా అన్నదాతలపై భారాన్ని మోపడం దుర్మార్గం.–వడ్డి రఘురాం, వర్కింగ్ ప్రెసిడెంట్, వైఎస్సార్ సీపీ రైతు విభాగం2021లో పైసా కట్టకుండా రూ.55 వేల పరిహారం..ఐదెకరాల్లో వరి సాగు చేస్తున్నా. ఖరీఫ్ 2021లో గులాబ్ తుపాను వల్ల మూడు ఎకరాల్లో పంట దెబ్బ తినడంతో రూ.55 వేల బీమా పరిహారం నా ఖాతాలో జమైంది. గత ఐదేళ్లలో ఎప్పుడూ ప్రీమియం కింద పైసా చెల్లించలేదు. ప్రస్తుతం బీమా ప్రీమియాన్ని రైతులే చెల్లించాలని ఈ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది రైతులకు ఎంతో భారంగా ఉంది. మా తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఆదుకోవాలి. – ఎం.శ్రీనివాసరావు, రైతు, కేసీహెచ్ పల్లి, విజయనగరం జిల్లా -
ఆ రైతు కుటుంబాలకు రూ.20లక్షల పరిహారం ఇవ్వాలి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురంలో కుటుంబంతో సహా కొమ్మర నాగేంద్ర ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఏపీ రైతు సంఘం(సీపీఎం) అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.ఇదే రోజున నంద్యాల జిల్లా ఎం.లింగాపురానికి చెందిన చిమ్మె నడిపి మారెన్న ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమన్నారు. వీరి కుటుంబాలకు రూ.20 లక్షలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను నివారించడంలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఏపీ రైతు సంఘం(సీపీఐ) రాష్ట్ర అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య మరో ప్రకటనలో విమర్శించారు. -
రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. కుదరని ఏకాభిప్రాయం
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసా విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరిగింది. సుదీర్ఘంగా రెండున్నర గంటల పాటు మంత్రులు చర్చించారు. కేబినెట్ సబ్ కమిటీలో ఏకాభిప్రాయం కుదరలేదు. విధి విధానాల ఖరారు పూర్తిస్థాయిలో కొలిక్కిరాలేదు. దీంతో మరోసారి భేటీ కావాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. సాగు భూమికి రైతు భరోసా పూర్తిస్థాయిలో ఇవ్వాలనే చర్చ జరిగింది.పథకం ప్రారంభమైనప్పటి నుంచి రైతు భరోసా అమలు తీరు, కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా పర్యటించిన క్రమంలో రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, అధికారులు సేకరించిన సమాచారంపై మంత్రులు చర్చించారు. కమిటీ ఛైర్మన్ భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, కమిటీ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి భేటీలో పాల్గొన్నారు.ఇదీ చదవండి: తెలంగాణలో పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ -
అన్నదాతల ప్రాణాలపై కూటమి నిర్లక్ష్యం
-
ఇది సర్కారు లెక్క.. 95 మంది రైతుల ఆత్మహత్య
రేటు పతనమై.. బతుకు భారమై..గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన కౌలు రైతు యనగందుల వీరారావు (54) 30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తుండేవాడు. గతేడాది అధిక వర్షాల వల్ల పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. పత్తి, మిరపకు మంచి ధరలు రావడంతో ఈ ఏడాది రూ.4 లక్షలు అప్పులు చేసి 2.5 ఎకరాల్లో మిరప సాగు చేశాడు. కోతలు ప్రారంభమయ్యే నాటికి క్వింటా రూ.15 వేలు ఉండడంతో, ధరలు పెరుగుతాయన్న ఆశతో కోల్డ్ స్టోరేజీలో పెట్టాడు. వ్యాపారులు సిండికేట్గా మారడంతో క్వింటా రూ.10 వేలకు పడిపోయింది. మరింత పడిపోతాయన్న ఆందోళనతో అమ్ముకోగా, కోల్డ్ స్టోరేజీ ఖర్చులన్నీ పోనూ రూ.70 వేలు మిగిలింది. గతంలో చేసిన వాటితో కలిపి రూ.10 లక్షల అప్పులు తీర్చే దారిలేక, అప్పులోళ్లకు ముఖం చూపించలేక గత నెల 23న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరారావు భార్య కూలీ పనికి వెళ్తోంది. ఉన్న ఇంటిని అమ్మి రేకుల షెడ్లో అద్దెకు ఉంటున్నామని, తల్లితో పాటు తన వద్ద ఉన్న బంగారాన్ని కుదవ పెట్టినా అప్పులు తీరలేదని, ఆదుకోవాల్సిన ప్రభుత్వం తమను పట్టించుకోలేదని వీరారావు కుమారుడు సుబ్బారావు కన్నీటి పర్యంతమయ్యాడు.సాగు నిజం.. వ్యవ‘సాయం’ దుర్లభంవైఎస్సార్ జిల్లా రామిరెడ్డిపల్లెకు చెందిన ఎన్.శ్రీనివాసులు రెడ్డి (47) గత నెల 28న, వేంపల్లికి చెందిన ఆశీర్వాదం (63) ఈ నెల 15న ఆత్మహత్యలకు పాల్పడ్డారు. శ్రీనివాసులురెడ్డికి సొంత పొలంతో పాటు 4 ఎకరాల కౌలు భూమి ఉండగా, సొసైటీలో రూ.5 లక్షలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.20 లక్షల అప్పులున్నాయి. ఆశీర్వాదానికి సొంతంగా 2 ఎకరాలుండగా, 4 ఎకరాలు కౌలుకు చేస్తున్నాడు. ఆయన సొసైటీలో రూ.2 లక్షలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.3 లక్షలు అప్పులు చేసి పెట్టుబడి పెట్టాడు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఇద్దరి పంటలు పూర్తిగా దెబ్బ తినడంతో పొలంలో గుళికలు మింగి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే అధికార పార్టీ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి.. వీరిద్దరి ఆత్మహత్యలకు వ్యక్తిగత ఇబ్బందులే కారణమని అధికారులు తేల్చారు. పరిహారం అందక ఈ రెండు కుటుంబాలు రోడ్డునపడ్డాయి.టీడీపీ నేతల బెదిరింపులు తాళలేకబాపట్ల జిల్లా బుల్లికురువ మండలం వెలమవారిపాలెంలోని ఎస్సీ సామాజికవర్గానికి చెందిన చింతల శ్రీను(41) 25 ఏళ్లుగా సాగు చేస్తున్నాడు. తనకున్న 20 ఎకరాలను గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ఆక్రమించుకొని అక్రమంగా ఆన్లైన్లో వారి పేరిట మార్చుకున్నారు. రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. టీడీపీ నేతల వేధింపులు తాళలేకపోతున్నానని, తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ అధికారులకు సమాచారమిచ్చినా స్పందన లేదు. చనిపోయే ముందు 100కు ఫోన్ చేసినా పట్టించుకోలేదు. చివరికి అద్దంకి సమీపంలోనే పురుగుల మందు తాగి విగతజీవిగా పడి ఉన్న శ్రీనును స్థానిక వైఎస్సార్సీపీ కార్తకర్తలు హుటాహుటిన ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతూ గత నెల 28న మృతి చెందాడు. తండ్రి చనిపోయిన తర్వాత కూడా టీడీపీ నేతల వేధింపులు కొనసాగుతున్నాయంటూ శ్రీను కుమారులు భూదేశ్వరరావు, వీరయ్యలు కన్నీటి పర్యంతమవుతున్నారు. పంపాన వరప్రసాదరావు – సాక్షి, అమరావతి/నెట్వర్క్ : ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఇల్లు గడిచే దారిలేక, పిల్లల చదువులు సాగక, పెళ్లిళ్లు ఆగిపోయి ఆర్థిక ఇబ్బందులతో ఆ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ‘మేమున్నాం అని ధైర్యం చెప్పి ఆదుకోవాల్సిన ఆపన్న హస్తం కనిపించకపోవడంతో వారంతా రోడ్డున పడి దిక్కులు చూస్తున్నారు. అందలం ఎక్కింది మొదలు అన్నదాతపై కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వ తీరుతో పుడమి తల్లి బిడ్డలు విసిగివేసారి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. సాగు వేళ తుపానులు, వరదలు, వర్షాభావ పరిస్థితులు ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా వైపరీత్యాలు ముప్పేట దాడి చేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నల పాలిట ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు మృత్యు పాశాలుగా మారాయి. సూపర్ సిక్స్ హామీలను అటకెక్కించిన ప్రభుత్వం తమను వంచించడంతో పాటు తమకు న్యాయంగా దక్కాల్సిన పంటల బీమా పరిహారం కూడా అందకుండా చేయడంతో పెట్టుబడికి చేతిలో చిల్లిగవ్వలేక సాగు భారమై అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అధికారిక లెక్కల ప్రకారమే ఆరున్నర నెలల కూటమి పాలనలో ఆత్మహత్యలకు పాల్పడిన వారి సంఖ్య సెంచరీకి చేరువయ్యిందంటే రైతులు ఎంతటి దయనీయ స్థితిలో ఉన్నారో అర్థమవుతోంది. వీరంతా త్రీమెన్ కమిటీ నిర్ధారించిన వారే. ఇక వివిధ కారణాలతో కమిటీ వద్ద పెండింగ్లో ఉన్న కేసులు, తిరస్కరించిన కేసులు కలుపుకుంటే ఆత్మహత్య చేసుకున్న వారు 150కి పైగానే ఉన్నారు. ఆరున్నర నెలల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా పైసా పరిహారం ఇవ్వక పోవడంతో బాధిత కుటుంబాలు గుండెలవిసేలా రోదిస్తున్నాయి. తాజాగా వైఎస్సార్ జిల్లాకు చెందిన రైతు తన భార్య, కొడుకు, కుమార్తెలకు ఉరి వేసి.. తనూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో రైతుల దుస్థితికి అద్దం పడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల దయనీయ పరిస్థితి కంట నీరు తెప్పిస్తోంది.కూటమి ప్రభుత్వం రాకతో కష్టాలురాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఏటా సీజన్కు ముందు అందే పెట్టుబడి సాయం లేదు. పంటల బీమా పరిహారం జాడ లేదు. కరువు సాయం ఊసే లేదు. సున్నా వడ్డీ రాయితీ లేదు. పోనీ రూ.3–5 వడ్డీలకు అప్పులు చేసి మరీ సాగు చేస్తుంటే సకాలంలో విత్తనాలు, ఎరువులు దొరక్క పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. బహిరంగ మార్కెట్లో ఓ పక్క కల్తీలు రాజ్యమేలుతుంటే మరోపక్క బ్లాక్ మార్కెటింగ్ పెచ్చు మీరింది. ఇంటిల్లిపాది రెక్కలు ముక్కలు చేసుకొని ఆరుగాలం శ్రమించి సాగు చేస్తే ఓ వైపు వైపరీత్యాలు, మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వారి కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ప్రతికూల పరిస్థితుల్లో సాగు చేసి పండించిన కొద్దిపాటిæ పంట చేతికొచ్చే సమయంలో ధర లేక అయినకాడకి తెగనమ్ముకుంటూ తమ కష్టాన్ని దళారుల పాల్జేయాల్సిన దుస్థితి ఏర్పడింది. వైపరీత్యాలకు తోడు ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతు కుటుంబాలను ఓదార్చే వారు కరువయ్యారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన ప్రజాప్రతినిధులు అటువైపు కన్నెత్తిచూడడం లేదు.ఆరున్నర నెలల్లోనే సడలిన నమ్మకంప్రభుత్వ నిర్వాకం, అస్తవ్యస్త విధానాల వల్ల అన్నదాతల్లో నమ్మకం పోతోంది. వెరసి జూన్ 12వ తేదీ నుంచి ఇప్పటి దాకా.. కేవలం ఆరున్నర నెలల్లో 95 మంది ఆత్మహత్యకు పాల్పడినట్టుగా త్రీమెన్ కమిటీ ధ్రువీకరించింది. తాజాగా వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో శనివారం ఆత్మహత్య చేసుకున్న వారితో కలుపుకుంటే ఈ సంఖ్య 97కు చేరుకుంది. త్రీమెన్ కమిటీ ధ్రువీకరించకుండా పెండింగ్లో ఉన్న కేసులు మరో 10–15 వరకు ఉంటాయని, తిరస్కరించిన కేసులు ఇంకో 50 ఉంటాయని అధికార వర్గాల సమాచారం. ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్న వారిలో రాయలసీమ జిల్లాలకు చెందిన వారే అత్యధికంగా ఉన్నారు. కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, గుంటూరు జిల్లాల్లోనే 51 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా 30 మంది అర్ధాంతరంగా తనువు చాలించారు. దాదాపు ప్రతి జిల్లాలోనూ కనీసం ఇద్దరు ముగ్గురికి తక్కువ కాకుండా ఆత్మహత్యలకు పాల్పడిన రైతులున్నారు. వీరికి ఎంత పరిహారం ఇవ్వాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది.2014–19 మధ్య ఎన్నో ఆంక్షలుఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతులకు రూ.లక్ష పరిహారం ఇచ్చేవారు. రూ.లక్ష కోసమే రైతులు ఆత్మహత్య చేసుకుంటారంటూ చంద్రబాబు అవహేళనగా మాట్లాడడమే కాదు.. ఆ ఇచ్చే పరిహారాన్ని కూడా 2003లో ఆపేశారు. 2014లో పరిహారం పునరుద్ధరించగా, 2015 ఫిబ్రవరి 18వ తేదీ వరకు రూ.1.50 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారు. ఆ తర్వాత రూ.5 లక్షలకు పెంచారు. దాంట్లో రూ.1.50 లక్షలను వన్ టైం సెటిల్మెంట్ కింద ఆత్మహత్యకు పాల్పడిన రైతుల అప్పుల ఖాతాకు జమ చేసేవారు. రూ.3.5 లక్షల పరిహారాన్ని విత్ డ్రా చేసుకునేందుకు వీలు లేకుండా డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీని మాత్రమే వాడుకునేలా ఆంక్షలు విధించారు. 2014–19 మధ్య ఐదారువేల మంది ఆత్మహత్యలకు పాల్పడితే అధికారికంగా గుర్తించింది కేవలం 1,223 మందిని మాత్రమే. కానీ పరిహారం ఇచ్చింది కేవలం 450 మందికి రూ.20.12 కోట్లే. కౌలు రైతుల ఊసే లేదు.పరామర్శ లేదు.. సాయం ఊసు లేదు ‘రైతు కుటుంబాల్లో జరగరానిది జరిగితే వెంటనే స్థానిక ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్ వారింటికి వెళ్లి ధైర్యాన్నివ్వాలి. అదేరోజు వీఆర్వో వెళ్లి వివరాలు సేకరించాలి. మండల స్థాయి కమిటీ విచారణ చేపట్టి, 24 గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలి. డివిజన్ స్థాయి త్రీమెన్ కమిటి సిఫార్సు మేరకు నిర్దేశిత గడువులోగా పరిహారం అందించేలా జిల్లా ఉన్నతాధికారులు వ్యవసాయ శాఖకు నివేదిక సమర్పించాలి’ అనే విధానాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ మేరకు కూటమి ప్రభుత్వంలో రైతు ఆత్మహత్య తర్వాత బాధితులను కలెక్టర్, ఎమ్మెల్యే పరామర్శించిన పాపాన పోలేదు. తుది నివేదిక రూపకల్పనలో ప్రభుత్వ ఒత్తిళ్లు బలంగా పని చేస్తున్నాయి. సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక పొలంలోనే పురుగుల మందుతాగి ఆత్మహత్యలకు పాల్పడినా సరే, వ్యక్తిగత కారణాలతోనే చనిపోతున్నారంటూ నివేదికలు ప్రభుత్వం వద్దకు వెళ్తున్నాయి. బాధిత కుటుంబాలు స్పందనలో అర్జీలు ఇచ్చినా స్పందించడం లేదు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు లేవనే సాకుతో అన్యాయం చేస్తున్నారు.2019–24 మధ్య ఆదుకున్న ప్రభుత్వంవైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచింది. కారణాలు ఏమైనా సరే ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను పార్టీలు, ప్రాంతాలు, కులమతాలకతీతంగా ఆదుకుంది. 2014–19 మధ్య ఆత్మహత్య చేసుకున్న రైతు ఘటనలకు సంబంధించి కూడా రీ వెరిఫికేషన్లో 474 మంది అర్హత పొందగా, వారికి పరిహారం అందజేసింది. ఈ విధంగా ఐదేళ్లలో 1,794 మందికి రూ.116.10 కోట్ల ఎక్స్గ్రేషియా జమ చేసింది. ఇందులో 495 మందిక కౌలు రైతులున్నారు. ఊరూరా ఆర్బీకేల ఏర్పాటు ద్వారా విత్తు నుంచి పంట కొనుగోలు వరకు రైతులను చేయి పట్టుకుని నడిపించింది. ఉచిత పంటల బీమా ద్వారా అండగా నిలిచింది. ఏటా వైఎస్సార్ రైతు భరోసా ద్వారా రూ.13,500 చొప్పున సాయం అందించింది. రూ.12,563 కోట్లు ఎగ్గొట్టిన కూటమి సర్కారుఅధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీని చంద్రబాబు ప్రభుత్వం అటకెక్కించింది. వైఎస్సార్ రైతు భరోసా కింద గత ఐదేళ్లలో లబ్ధి పొందిన 53.58 లక్షల మందికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించాలంటే ఏటా రూ.10,718 కోట్లు అవసరం. ఇప్పటికీ దాని ఊసే ఎత్తడం లేదు. 2023–24 సీజన్కు రూ.930 కోట్ల రైతుల వాటా ప్రీమియం సొమ్ము చెల్లించక పోవడం వల్ల ఆ సీజన్లో కరువు వల్ల పంటలు దెబ్బ తిన్న దాదాపు 11 లక్షల మంది రైతులకు రూ.1,385 కోట్ల బీమా పరిహారం అందకుండా పోయింది. రబీ సీజన్ నుంచి స్వచ్ఛంద నమోదు పద్ధతిలో పంటల బీమా అమలు చేస్తుండడంతో బీమా ప్రీమియం భరించలేక రైతులు పంటల బీమాకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్తోపాటు రబీ 2023–24 సీజన్లో కరువు ప్రభావంతో దెబ్బతిన్న 3.91 లక్షల మంది రైతులకు రూ.328 కోట్ల కరువు సాయం బకాయిలు ఎగ్గొట్టారు. సున్నా వడ్డీ రాయితీ కింద ఖరీఫ్ 2023 సీజన్కు సంబంధించి 6.31 లక్షల మందికి రూ.132 కోట్ల వరకు జమ చేయలేదు. ఇలా ఆరున్నర నెలల్లో అన్నదాత సుఖీభవ, పంటల బీమా, కరువు సాయం బకాయిలు, సున్నా వడ్డీ రాయితీలు కలిపి రైతులకు ఈ ప్రభుత్వం రూ.12,563 కోట్లు ఎగ్గొట్టింది.పెద్దదిక్కు కోల్పోయి రోడ్డున పడ్డారు..నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం రహిమానుపురానికి చెందిన సలీంద్ర మధు (35) సొంతంగా 1.50 ఎకరాలు, మరో 2 ఎకరాలు కౌలుకు తీసుకొని కంది, పత్తి, టమాటా, మిరప, ఉల్లి పంటలు సాగు చేసేవాడు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ ఏడాది కలిసి రాలేదు. సాగు కోసం రూ.5 లక్షల వరకు అప్పులు చేశాడు. వీటిని తీర్చే దారిలేక గత నెల 16న ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధు మృతితో అతని భార్య సంధ్యాదేవి కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ప్రభుత్వం నుంచి పైసా పరిహారం కూడా అందలేదని, ఏం చేయాలో పాలుపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది.పరిహారం కోసం ఎదురు చూపుప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం సిద్ధినాయునిపల్లికి చెందిన రుద్రపాటి చిన్న వెంకట చన్నయ్య (70) 30 ఏళ్లుగా వ్యవసాయం చేసేవాడు. సొంతంగా ఆరెకరాలు, కౌలుకు 2 ఎకరాలు తీసుకొని టమాటా, పొగాకు సాగు చేశాడు. అప్పులు చేసి మూడు బోర్లు వేసినా నీరందక అవస్థలు పడ్డాడు. సకాలంలో వర్షాలు కురవక పోవడంతో పాటు చీడపీడలు కారణంగా పంటలు దెబ్బతినగా, పెట్టుబడులు కూడా దక్కలేదు. రూ.9 లక్షలకుపైగా చేసిన అప్పులు తీర్చే దారిలేక గత నెల 8న సొంత పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. త్రీమెన్ కమిటీ విచారణలో కూడా ఇదే విషయం నిర్ధారణ అయింది. అయినా పరిహారం ఇవ్వ లేదంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.అప్పులోళ్ల ఒత్తిళ్లు భరించలేక..పల్నాడు జిల్లా వెల్దురికి చెందిన పల్లపోలు వేణుగోపాల రెడ్డి (68) 1.50 ఎకరాలు కౌలుకు తీసుకొని పదేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా పంటలు దెబ్బ తిన్నాయి. సాగు కోసం చేసిన అప్పులు రూ.20 లక్షల వరకు చేరుకున్నాయి. వాటిని తీర్చే దారిలేక, అప్పులోళ్ల ఒత్తిళ్లు భరించలేక గత నెల 22న ఇంట్లోనే ఉరి పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త చనిపోవడంతో తామంతా రోడ్డున పడ్డామని, తమకు ఆసరా లేకుండాపోయిందని, పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కూలి పనికి వెళ్తోన్న భార్య లక్ష్మి వేడుకుంటోంది.స్వాతంత్య్రం వచ్చిన రోజే.. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పందిర్లపల్లెకు చెందిన మహిళా రైతు మాదిగ సువర్ణ (39) తన 7 ఎకరాల భూమిలో ఆముదం, మిరప పంటలు సాగు చేసింది. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. చేసిన అప్పులు రూ.8 లక్షలకు పైగా ఉన్నాయి. వాటిని తీర్చే దారిలేక స్వాతంత్య్ర దినోత్సవం రోజైన ఆగస్టు 15న పొలంలోనే బావి వద్ద పురుగుల మందు తాగి తనువు చాలించింది. కుటుంబానికి జీవనాధారమైన సువర్ణ అర్ధాంతరంగా చనిపోవడంతో తనకున్న ముగ్గురు కుమార్తెలు, కుమారుడ్ని పోషించుకునే దారిలేక అనారోగ్యంతో బాధ పడుతున్న భర్త పాండు కన్నీటి పర్యంతమవుతున్నాడు.30 ఏళ్లకే తనువు చాలించి..అనంతపురం జిల్లా కాలువపల్లికి చెందిన యువ రైతు ఎర్రిస్వామి(30) అప్పుల బాధతో జూన్ 17న ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న ఐదెకరాల్లో సాగు కోసం అప్పులు చేసి మరీ బోరుబావులు తవ్వించాడు. నీరు పడలేదు. మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని కర్బుజా, టమాటా పంటలు సాగు చేశాడు. వర్షాభావ పరిస్థితులతో కలిసి రాలేదు. అప్పులు రూ.25 లక్షలు తీర్చే దారిలేక పొలం వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు ఇలా 30 ఏళ్లకే మృత్యువాత పడడంతో తల్లి లక్ష్మిదేవి, భార్య ప్రియాంకలు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే తమ గతేమిటని ప్రశ్నిస్తున్నారు. -
అలా చేయొద్దు.. రైతు సంఘాల నేతలపై సుప్రీం కోర్టు సీరియస్
ఢిల్లీ: పంజాబ్లో రైతు సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ గత నెల 26 నుంచి నిరాహారదీక్ష చేపట్టిన రైతు నేత జగ్జీత్ సింగ్ దలేవాల్ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకీ క్షీణిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు వైద్య సహాయం అందకుండా అడ్డుకుంటున్న రైతు సంఘాల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజంగా ఆయన క్షేమం కోరుకునేవారైతే అలా అడ్డుకోరంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.దల్లేవాల్కు వైద్య సహాయం అందించాలన్న ఆదేశాలను అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు శనివారం విచారణ చేపట్టింది. దలేవాల్ను ఆస్పత్రికి తరలించకుండా రైతు నేతలు అడ్డుకుంటున్నారని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.దీంతో కోర్టు ఆ రైతు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దలేవాల్ క్షేమం కోరేవారు ఆవిధంగా ప్రవర్తించరని వ్యాఖ్యానించింది. రైతు నేతలతో మాట్లాడి దలేవాల్ను వెంటనే ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. ఈ విషయంలో పంజాబ్ రాష్ట్రానికి ఏదైనా సహాయం అవసరమైతే, కేంద్ర ప్రభుత్వం మద్దతివ్వాలంటూ సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణను డిసెంబర్ 31కి వాయిదా వేసింది.ఇదీ చదవండి: Year Ender 2024: ఎన్నటికీ మరువలేని ఐదు విషాదాలు -
భారీ వర్షాల ప్రభావంతో నష్టపోయిన రైతులు
-
నష్టపోయి'నారు'
దేవరపల్లి: ధరలు పడిపోవడం, ఇతర ప్రాంతాల్లో రైతులు సొంతంగా నారు పెంచడంతో.. పొగాకు నారు వేసిన రైతులు, కౌలుదార్లు ఈ సీజన్లో నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో సుమారు 23 వేల హెక్టార్లలో పొగాకు సాగుకు టుబాకో బోర్డు అనుమతి ఇచ్చింది.అయితే, గత ఏడాది పొగాకుకు రికార్డు స్థాయి ధర రావడంతో ఈసారి రైతులు బోర్డు అనుమతించిన దానికి మించి, ఇప్పటికే సుమారు 25 వేల హెక్టార్లలో పొగాకు నాట్లు వేశారు. ఇప్పటికే చాలా వరకూ నాట్లు దాదాపు పూర్తి కావడంతో పొగాకు నారు సీజన్ ముగిసింది. గత ఏడాది కాసుల పంట గత ఏడాది పొగాకు నారుకు చివరి దశలో ఊహించని డిమాండ్ ఏర్పడి, రైతులకు ఊహించని లాభాలు వచ్చాయి. నాట్ల ప్రారంభంలో ఎకరం నారు (6 వేల మొక్కలు) ధర రూ.3 వేల నుంచి రూ.3,500 వరకూ పలికింది. ఇది గిట్టుబాటు కాక కొంత మంది రైతులు నష్టపోయారు. అనంతరం గత ఏడాది డిసెంబర్ 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుపాను నారు రైతుల పాలిట వరంగా మారింది. వేసిన పొగాకు నాట్లు ఈ తుపాను ప్రభావంతో దెబ్బ తిన్నాయి. తుపాను అనంతరం రైతులు మళ్లీ నాట్లు వేయడంతో నారుకు ఎక్కడ లేని డిమాండూ ఏర్పడింది. దీంతో నారుమడులు కట్టిన కౌలు రైతులు ఊపిరి పీల్చుకున్నారు. తుపాను అనంతరం ఎకరం నారు ధర ఏకంగా రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకూ పలికింది. ఈ ధర పొగాకు నారు చరిత్రలో రికార్డుగా నిలిచింది. ఎకరం విస్తీర్ణంలో నారు మడులు కట్టిన రైతుకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ ఆదాయం వచ్చింది. అప్పటి వరకూ గిట్టుబాటు ధర లేక గగ్గోలు పెట్టిన కౌలు దారులకు కాసుల పంట పండింది. ఆశ పడితే మొదటికే మోసం గత ఏడాది ధరలు చూసిన కౌలుదార్లు, రైతులు ఈసారి కూడా పొగాకు నారుకు మంచి ధరలు పలుకుతాయని ఆశ పడ్డారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టులో అధిక ధరలకు భూములను కౌలుకు తీసుకున్నారు. గత ఏడాది ఎకరం కౌలు రూ.40 వేలు కాగా, ఈ ఏడాది అది రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకూ పలికింది. అయినా సరే తగ్గేదేలే.. అన్నట్లు కౌలుదార్లు పోటీ పడి మరీ భూములను కౌలుకు తీసుకుని నారుమడులు కట్టారు. తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లోని ఉత్తర తేలికపాటి నేలల (ఎన్ఎల్ఎస్) ప్రాంతంలోని నాలుగు వేలం కేంద్రాల పరిధిలో సుమారు 2 వేల ఎకరాల్లో నారుమడులు కట్టినట్లు అధికారులు అంచనా వేశారు. అయితే, వాతావరణం అనుకూలించడంతో తక్కువ సమయంలోనే రైతులు పొగాకు నాట్లు పూర్తి చేశారు. నాట్ల ప్రారంభంలో నారు ధర రూ.2 వేల నుంచి రూ.2,500 పలకగా, నవంబరులో అది రూ.1,500కు పడిపోయింది. అయినప్పటికీ నారు అడిగే నాథుడు లేక చాలా మంది రైతులు బోణీ కూడా చేయలేదు. ఎకరాకు సుమారు రూ.5 లక్షలు ఖర్చవడంతో పెట్టుబడులు కూడా దక్కకపోవడంతో కౌలుదార్లు, రైతులు మొదటికే మోసపోయిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. నారుమడులు కట్టిన రైతుల్లో 80 శాతం కౌలుదార్లే ఉన్నారు. వీరు భూములను కౌలుకు తీసుకుని, ఏటా నారుమడులు కట్టి, నారు విక్రయాలు జరుపుతారు. సాధారణంగా వీరి వద్ద నుంచి ఈ ప్రాంతంతో పాటు తెలంగాణలోని జీలుగుమిల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి ప్రకాశం జిల్లాలోని పొదిలి, కనిగిరి ప్రాంతాల రైతులు నారు కొనుగోలు చేస్తూంటారు. ఈ ఏడాది అక్కడ కూడా రైతులు సొంతంగా మడులు కట్టి, నారు పెంచడంతో ఇక్కడి నారుకు డిమాండ్ తగ్గింది. దాదాపు 50 ఏళ్లుగా ఈ ప్రాంతంలో పొగాకు నారు వ్యాపారం జరుగుతోంది. గత ఏడాది నారు ధర చూసి బెంబేలెత్తిన పొగాకు రైతులు ఈ ఏడాది ముందుగానే జాగ్రత్త పడ్డారు. తమ అవసరాలకు సరిపడా సొంతంగా మడులు కట్టి నారు పెంచారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో నారు రైతులు ఈ సీజన్లో నష్టాలు ఎదుర్కోవలసి వచ్చింది. పెట్టుబడులు కూడా రాలేదు నేను 60 సెంట్ల విస్తీర్ణంలో నారుమడులు కట్టాను. కౌలు రూ.40 వేలు, పెట్టుబడి రూ.1.50 లక్షలు అయ్యింది. రెండేళ్లుగా నారు రేటు ఆశాజనకంగా లేదు. పొగాకు సాగుకు మించి నారుమడులు ఉండటంతో డిమాండ్ తగ్గింది. చాలా మంది రైతులకు పెట్టుబడులు కూడా రాలేదు. – గెల్లా గోవిందరాజు, సుబ్బరాయపురం, కౌలు రైతు, దేవరపల్లి కోలుకోలేని దెబ్బ ఎకరం విస్తీర్ణంలో నారుమడులు కట్టాను. కౌలు రూ.80 వేలు, పెట్టుబడి రూ.2.30 లక్షలు అయ్యింది. ఎకరం నారు ధర రూ.1,500 పలికింది. అది కూడా అడిగిన నాథుడే లేడు. ఈ ఏడాదికి నారు సీజన్ ముగిసింది. ఎకరాకు రూ.2 లక్షల నష్టం వస్తోంది. నారు రైతులు నిండా మునిగారు. – సీహెచ్ వెంకటేశు, కౌలు రైతు, రామన్నపాలెం, దేవరపల్లి మండలం -
ఏపీలో అన్నదాతపై ప్రకృతి పగ.. సర్కార్ దగా
-
రైతుకు దక్కాల్సిన సొమ్ములో 30% తినేస్తున్నారు
సాక్షి, అమరావతి: ధాన్యం సేకరణలో రైతుకు తీరని అన్యాయం జరుగుతోంది. అలా అనడం కంటే ప్రభుత్వమే రైతుకు అన్యాయం చేస్తోందని చెప్పడం కరెక్ట్. రైతుకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం.. కల్లాల్లో ధాన్యం పెట్టుకొని ధాన్యం విక్రయించడానికి ఎదురుచూసు్తన్న రైతు బలహీనతను ఆసరాగా చేసుకొని దళారులు దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం అడ్డుకోకపోగా ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం మిల్లర్లు, దళారులతో కలిసి ధాన్యం రైతులకు దక్కాల్సిన సొమ్ములో నేరుగా 30% తినేస్తోంది. మిల్లర్లు–దళారుల దోపిడీని నిలువరించాల్సిన ప్రభుత్వ పెద్దలు.. ప్రచార ఆర్భాటానికి ధాన్యం సేకరణ అంశాన్ని ఉపయోగించుకుని జబ్బలు చరుచుకుంటున్నారు. దోపిడీ సాగుతున్న తీరు ఇలా..మద్దతు ధరలోనూ 30–40 శాతానికి పైగా లూటీరైతులకు చెల్లించాల్సిన కనీస మద్దతు ధరలో 30–40 శాతానికి పైగా లూటీ అవుతోంది. ఖరీఫ్ సీజన్లో 32.75 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించగా.. దాన్ని ఇటీవలే 37 లక్షల టన్నులకు పెంచారు. ఇప్పటివరకు 22 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. మరో 15 లక్షల టన్నులు సేకరించాల్సి ఉంది. అత్యధికంగా ఉత్తరాంధ్రలోనే 5.20 లక్షల టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంది. ఆ తర్వాత కృష్ణా జిల్లాలో 2.50 లక్షల టన్నులు, ఎన్టీఆర్ జిల్లాలో లక్ష టన్నులు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 1.50 లక్షల టన్నులు సేకరించాల్సి ఉంది. ఇప్పటివరకు సేకరించిన ధాన్యంలో 90 శాతానికి పైగా రైతుల పేరిట దళారులే సేకరించారు. ఇప్పటివరకు తాము సేకరించామని చెబుతున్న ధాన్యానికి కనీస మద్దతు ధర ప్రకారం రైతులకు రూ.5,397 కోట్లు చెల్లించినట్టుగా చెబుతున్నారు. కానీ.. ఇందులో వివిధ రూపాల్లో రూ.1,618 కోట్లకు పైగా.. అంటే 30 శాతానికి పైగా స్వాహా అయినట్టు తెలుస్తోంది.మిల్లర్లతో కుమ్మక్కుమిల్లర్లతో కొనుగోలు కేంద్రాల సిబ్బంది కుమ్మక్కయ్యారు. ఆర్ఎస్కేలలో నిర్ధారించిన తేమ శాతానికి అమ్మించేలా మిల్లర్లను ఒప్పించాల్సింది పోయి, మిల్లర్లు నిర్ధారించిన తేమ శాతానికి అమ్ముకోవాలంటూ రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. ఆర్ఎస్కేల్లో 17 శాతం ఉందని నిర్ధారించిన ధాన్యాన్ని మిల్లు దగ్గరకు తీసుకెళితే ధాన్యంలో ధూళి, దుమ్ము ఉందనే సాకుతో 18–20 శాతంగా నమోదు చేస్తున్నారు. దోపిడీ కోసమే ఇలా పొంతనలేని లెక్కలు చెబుతున్నారు. పొరుగు జిల్లాల నుంచి వచ్చే మిల్లర్లు సైతం 16–17 తేమ శాతం ఉన్న ధాన్యాన్ని 18–21 శాతం వరకు నిర్ధారించి మీకు నచ్చితే లోడింగ్ చేస్తాం, లేకుంటే పట్టుకెళ్లిపోండని తెగేసి చెబుతున్నారు.దళారులు పంపిస్తే గంటలోనే అన్లోడింగ్దళారులు ప్రారంభంలో రైతులకు మద్దతు ధర 75 కేజీల బస్తాకు రూ.1,350 నుంచి రూ.1,500 మధ్య చెల్లించేవారు. ప్రస్తుతం కాస్త పెంచి రూ.1,500 నుంచి రూ.1,600 మధ్య చెల్లిస్తున్నారు. అదే ఎంటీయూ 1262, 1318 రకం ధాన్యానికైతే నేటికీ రూ.1,100 నుంచి రూ.1,300 మధ్యే చెల్లిస్తున్నారు. ఫలితంగా 75 కేజీల బస్తా దగ్గరే 125 నుంచి రూ.400 వరకు నష్టపోతున్నారు. ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీలు, మిల్లర్ల వేధింపులు తట్టుకోలేక చివరకు దళారులకే ధాన్యాన్ని ఇచ్చి మిల్లులకు పంపిస్తున్నారు. కాగా.. దళారులు తెచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు గంటలోనే అన్లోడ్ చేసుకుంటున్నారు. అదే రైతు నేరుగా తీసుకెళ్తే అన్లోడింగ్కు 24 నుంచి 48 గంటల సమయం పడుతోంది. మొహం చాటేస్తున్న మిల్లర్లువర్షాలతో ధాన్యంలో తేమ శాతం పెరిగిపోతోంది. ఎంత ఆరబెట్టినా మిల్లు వద్ద 25 శాతం కన్నా తక్కువ తేమ చూపడం లేదు. తేమ శాతం వంకతో మిల్లర్లు కొనేందుకు కూడా మొహం చాటేస్తున్నారు. ధాన్యం వ్యాపారులు 75 కేజీల బస్తాకు రూ.1,100.. మహా అయితే రూ.1,200కు మించి ఇవ్వలేమని తెగేసి చెబుతున్నారు. ఏం చేయాలో పాలుపోక రైతులు దిక్కులు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ధాన్యం సొమ్ములు గంటలోనే జమ చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నప్పటికీ సాంకేతిక కారణాల సాకుతో 15 నుంచి నెల రోజుల వరకు వేచి చూడాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు.పక్కదారి పడుతోందిలా..సాధారణంగా రైతులు కోసిన ధాన్యాన్ని 40 కేజీల చొప్పున బస్తాలలో కాటా వేస్తారు. గోనె సంచి బరువు మరో 500 గ్రాములు కలిపి 40.50 కేజీల చొప్పున కాటా వేయాలి. కానీ.. 41.50 కేజీల వరకు కాటా తూస్తున్నారు. అంటే కేవలం 40 కేజీల కిట్టీ దగ్గరే ఏకంగా కిలో చొప్పున టన్నుకు 25 కేజీలకుపైగా నష్టపోతున్నారు. అంటే కిలోకు రూ.23 చొప్పున 25 కిలోలకు రూ.575 చొప్పున ప్రతి టన్నుకూ రైతులకు నష్టం వాటిల్లుతోంది. ఇక తేమ శాతం విషయానికి వస్తే 17 శాతం వరకు తేమ ఉంటే పూర్తిస్థాయి మద్దతు ధర (క్వింటాకు రూ.2,300) చొప్పున చెల్లించాలి. కానీ.. బూతద్దం పెట్టి వెతికినా పూర్తిస్థాయి మద్దతు ధర రైతులకు దక్కడం లేదు. నిబంధనల ప్రకారం తేమ 17 శాతం ఉన్నా 75 కేజీల బస్తాకు కేజీన్నర నుంచి రెండున్నర కేజీల చొప్పున తరుగు మినహాయిస్తున్నారు. అంటే ఇక్కడ టన్నుకు 35–40 కేజీలు చొప్పున రూ.920 నష్టపోతున్నాడు. తేమ శాతం 17 దాటితే ఒక్కో శాతానికి రెండున్నర కేజీల వరకు తరుగు మినహాయిస్తున్నారు. 25 శాతం తేమ ఉంటే బస్తాకు 8–12 కేజీల చొప్పున కోత పడుతోంది. ఈ విధంగా టన్నుకు 140 కేజీల చొప్పున రూ.3,864 మేర రైతులకు నష్టం వాటిల్లుతోంది. నిబంధనల మేరకు తేమ శాతం ఉన్నా సరే టన్నుకు రూ.1,495 నష్టపోతుంటే.. తేమ శాతం గనుక 17–25 మధ్య ఉంటే టన్నుకు రూ.5,355 వరకు నష్టపోతున్నారు. అంటే టన్నుకు రూ.23 వేలు దక్కాల్సిన రైతులకు కేవలం సుమారు రూ.17 వేలు మాత్రమే దక్కుతోంది. మిగిలిన మొత్తం దళారులు, మిల్లర్లు స్వాహా చేస్తున్నారు. వారినుంచి మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులకు వాటాలు ముడుతున్నాయి.తేమ శాతంలో పొంతన లేని లెక్కలుధాన్యం కొనుగోలులో దోపిడీకి కూటమి ప్రభుత్వమే దగ్గరుండి ద్వారాలు తెరిచింది. దళారులు, మిల్లర్ల ప్రమేయం లేకుండా గడచిన ఐదేళ్లుగా అత్యంత పారదర్శకంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరిగితే.. ప్రస్తుతం మిల్లర్ల కనుసన్నల్లోనే «కొనుగోళ్లు జరిగే పరిస్థితి నెలకొంది. తొలుత 25 శాతం వరకు తరుగు లేకుండానే తీసుకుంటామని తొలుత చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత మాటమార్చి 17 శాతం దాటితే ఐదు కేజీలు తరుగుతో తీసుకుంటామని ప్రకటించింది. చివరకు నిబంధనల మేరకు 17 శాతం తేమ ఉన్నా సరే పూర్తి మద్దతు ధర చెల్లించే పరిస్థితి కన్పించడం లేదు. గతంలో రైతు భరోసా కేంద్రాల్లో నిర్ధారించిన తేమ శాతమే ఫైనల్. అదే తేమ శాతానికి మద్దతు ధర లెక్కగట్టి రైతులకు జమ చేసేవారు. కానీ.. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రస్తుతం రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే)తో పాటు మిల్లుల వద్ద కూడా తేమ శాతాన్ని నిర్ధారిస్తున్నారు. ఈ రెండుచోట్ల నిర్ధారిస్తున్న తేమ శాతానికి పొంతన లేకుండా పోతోంది.కాళ్లా వేళ్లా పడినా కొనడం లేదు ఈ రైతు పేరు గుడవర్తి వెంకట సుబ్బరాజు. బాపట్ల జిల్లా మంతెనవారిపాలేనికి చెందిన సుబ్బరాజు పదెకరాల్లో ఎంటీయూ–1262 రకం సాగు చేశారు. ఈ నెల 16న కోయగా.. ఎకరాకు 35 బస్తాల చొప్పున 350 బస్తాల దిగుబడి వచ్చింది. 8 రోజులు ఆరబెట్టి.. 24వ తేదీన రైతు సేవా కేంద్రంలో తేమ పరిశీలిస్తే 23 శాతం వచ్చింది. బాపట్ల ఉప్పరపాలెం రైసుమిల్లుకు అదే రోజున 100 బస్తాలను తోలితే 23 శాతం తేమ ఉందని 5 కేజీల తరుగుతో తీసుకున్నారు. బుధవారం మరో 200 బస్తాలు తీసుకెళ్తే 27 శాతం తేమ ఉంది. మీ ధాన్యం మాకొద్దని తెగేసి చెప్పారు. ‘తరుగు ఎంతైనా తీసుకోండి. మీకు నచ్చిన ధర ఇచ్చి ధాన్యం దింపుకోండ’ని కాళ్లావేళ్లా పడినా మిల్లు యాజమాన్యం పట్టించుకోలేదు. అధికారుల దృష్టికి తీసుకెళ్తే.. మిల్లర్ ఏం చెబితే అదే ఫైనల్ అన్నారు. వాతావరణం చూస్తే గంటకోలా మారుతోంది. చేసేది లేక టార్పాలిన్లు అద్దెకు తెచ్చి మిల్లు ఎదుటే ట్రాక్టర్లో ఉన్న ధాన్యం బస్తాలపై కప్పి అక్కడే పడిగాపులు పడుతున్నాను. ఉదయం నుంచి తిండీ తిప్పల్లేవు. ఏంచేయాలో పాలుపోవడం లేద’ని సుబ్బరాజు కన్నీరుమున్నీరయ్యారు.బస్తాకు రూ.1,470కు మించి ఇవ్వడం లేదు ఈ రైతు పేరు కొండవీటి వెంకటసుబ్బారావు. కృష్ణా జిల్లా మంతెనకు చెందిన ఈయన నాలుగు ఎకరాల్లో ఎంటీయూ–2077 వరి సాగు చేసారు. బుడమేరు ముంపు వల్ల ఎకరాకు 30 బస్తాలకు మించి రాలేదు. రైతు సేవా కేంద్రానికి శాంపిల్ తీసుకెళ్లి తేమ శాతం చూడమంటే.. ‘అవసరం లేదు నేరుగా మిల్లుకు తీసుకుపొండి..అక్కడ వాళ్లు చెప్పిన తేమ శాతమే ఫైనల్’ అని కొనుగోలు కేంద్రం సిబ్బంది బదులిచ్చారు. దీంతో దాములూరులోని బాలాజీ రైస్మిల్లుకు 213 (ఒక్కొక్కటీ 40 కేజీల) బస్తాలు తీసుకెళితే 24 శాతం తేమ వచ్చింది. రెండో రోజు మరో 105 బస్తాలు తీసుకెళితే 26 శాతం వచ్చిందని చెప్పారు. దాదాపు 8 కేజీలు తరుగు తీసేశారు. 75 కేజీల బస్తాకు రూ.1,470 చొప్పున ఇస్తామన్నారు. అడ్డగోలుగా దోచుకుంటున్నారు. కనీసం పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు’ అని సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు.పొంతన లేని తేమ లెక్కలు ఈ రైతు పేరు గుడిపూడి అవినాశ్. ఏలూరు జిల్లా దెందులూరుకు చెందిన ఈయన ఐదెకరాల్లో ఎంటీయూ–1318 రకం సాగు చేశారు. ఎకరాకు 33 బస్తాల దిగుబడివచ్చింది. 18న కోత కోయగా.. 23న రైతు సేవా కేంద్రంలో 17 శాతం తేమ వచ్చింది. అదే రోజున మారుతి మిల్లుకు 154 బస్తాలు తరలిస్తే.. అక్కడ తేమ శాతం 19గా చూపించారు. 75 కేజీల బస్తాకు రూ.1,725 ఇవ్వాల్సి ఉండగా.. రూ.1,650 చొప్పున ఇచ్చారు. రైతు సేవాకేంద్రంలో చెబుతున్న తేమ శాతానికి మిల్లులో చెబుతున్న తేమ శాతానికి పొంతన ఉండడం లేదు. ఇదేమిటని అడిగితే మీకు నచ్చకపోతే తీసుకెళ్లిపోవచ్చని మిల్లర్ చెబుతున్నారు. -
సాగు రైతుకే ‘భరోసా’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు సాగు చేసిన భూమిని శాస్త్రీయ పద్ధతిలో లెక్కగట్టి తదనుగుణంగా ‘రైతు భరోసా’ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. రైతులు భూమిని సాగు చేశారో లేదో తెలుసుకునేందుకు ప్రతి సీజన్లో శాటిలైట్ సర్వే చేయాలని కూడా నిర్ణయించింది. ఇందుకోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) సహకారాన్ని తీసుకోనుంది. అదే సమయంలో సహాయ వ్యవసాయ అధికారుల (ఏఏఓలు)తో క్షేత్రస్థాయిలో పంటల లెక్కలు సేకరించనుంది. ఎన్ఆర్ఎస్సీ సాంతికేతిక పరిజ్ఞానంతో ఏ రైతు ఎంత భూమిలో ఏ పంట సాగు చేశాడనే వివరాలను తీసుకుని.. ఏఏఓలు ఇచ్చే నివేదికలతో సరిపోల్చుకొని రైతు భరోసాను జమ చేయాలనే అభిప్రాయంతో ఉన్నట్టు తెలిసింది. తద్వారా సాగు చేసే భూమికే పెట్టుబడి సాయం అందించడంతోపాటు రైతులను వ్యవసాయం దిశగా ప్రోత్సహించినట్టు అవుతుందని భావిస్తున్నట్టు సమాచారం. దీని ప్రకారం రైతులకు ఖరీఫ్ (వానకాలం)లో వచ్చే పెట్టుబడి సాయానికి, రబీ (యాసంగి)లో అందే సాయానికి మధ్య కూడా తేడా ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలో రబీలో సాగు విస్తీర్ణం తక్కువగా ఉంటుండటమే దీనికి కారణం. మార్గదర్శకాల రూపకల్పన దాదాపు పూర్తి రైతులకు ఆరేళ్లుగా అందుతున్న పెట్టుబడి సాయం ‘రైతుబంధు’ స్థానంలో... కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న ‘రైతు భరోసా’ పథకానికి మార్గదర్శకాల రూపకల్పన దాదాపు పూర్తయింది. కొత్త సంవత్సరంలో సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్టు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇటీవల శాసనసభలో ప్రకటించారు కూడా. ఈ నెల 30న జరిగే మంత్రివర్గ సమావేశంలో రైతు భరోసాకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ‘రైతు భరోసా’ అమలులో ప్రభుత్వం అనుసరించనున్న విధివిధానాలపై చర్చ జరుగుతోంది. ఏడెకరాల సీలింగ్? ఇక ఒక రైతుకు గరిష్టంగా ఎన్ని ఎకరాల వరకు రైతుభరోసా పెట్టుబడి సాయం ఇవ్వాలనే విషయంలో మంత్రివర్గ సమావేశంలో స్పష్టత రానుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వ పెట్టుబడి సాయం అందుతున్న నేపథ్యంలో... రాష్ట్ర పథకంలోనూ భూమికి సీలింగ్ విధించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసినట్లు సమాచారం. పదెకరాలలోపు భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని తొలుత అభిప్రాయం వ్యక్తమైనా.. మధ్యే మార్గంగా ఏడెకరాల సీలింగ్ను అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. పీఎం కిసాన్ పథకంలో ఐదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతుకు పెట్టుబడి సాయం అందదు. రాష్ట్ర ప్రభుత్వం అలా కాకుండా ఎంత భూమి ఉన్నా గరిష్టంగా ఏడెకరాలకు రైతు భరోసా సాయం అందించాలని భావిస్తున్నట్టు సమాచారం. కుటుంబం యూనిట్గా తీసుకుంటే..? పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో కుటుంబం యూనిట్గా తీసుకున్నారు. రైతు రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే విధానాన్ని అనుసరించి కుటుంబాన్ని యూనిట్గా తీసుకుని.. ఒక కుటుంబం మొత్తానికి కలిపి రూ. 2లక్షల రుణమాఫీ చేసింది. ఇప్పుడు రైతు భరోసాకు కూడా కుటుంబాన్ని యూనిట్గా తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. అంటే ఒక కుటుంబంలో ఎంత మంది పేర్ల మీద ఎంత భూమి ఉన్నప్పటికీ... ఆ కుటుంబం మొత్తానికి కలిపి ఏడెకరాలకే ప్రభుత్వ సాయం అందేలా విధి విధానాలు రూపొందించినట్టు తెలిసింది. ఇక గత ఐదేళ్లలో వరుసగా రెండేళ్లపాటు ఆదాయ పన్ను చెల్లించినవారు కుటుంబంలో ఒక్కరున్నా కూడా.. ఆ కుటుంబానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వర్తించదు. ఈ విధానాన్ని రైతు భరోసాకు కూడా వర్తింపజేస్తే పెద్ద సంఖ్యలో అర్హులు తగ్గిపోయే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, పలు వర్గాలకు కోత! పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్రం ఇచ్చే పెట్టుబడి సాయానికి కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. అందులో ఒకటి ఆదాయ పరిమితి. ఆదాయపన్ను చెల్లించే వ్యాపారులు, కార్పొరేట్ ఉద్యోగులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులను పీఎం కిసాన్ సమ్మాన్నిధి నుంచి మినహాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి నుంచి తీసుకురానున్న రైతుభరోసాలో కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలిసింది. సాగు చేసే నిజమైన రైతులకే సర్కార్ సాయం అందాలన్న లక్ష్యంలో భాగంగా వీరికి రైతుభరోసా తొలగించాలని మంత్రివర్గ ఉపసంఘం సూచించినట్టు తెలిసింది. అయితే ఇందులో నాలుగో తరగతి ఉద్యోగులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను మినహాయించినట్టు సమాచారం. కుటుంబ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని.. కుటుంబంలోని ఇతర సభ్యులు ఐటీ చెల్లింపుదారులుగా ఉంటే కోత పెట్టాలనే యోచన ఉన్నట్టు తెలిసింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయానికి అనర్హులు వీరే.. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు (జీతాలు పొందేవారు, పెన్షనర్లు) ఆదాయ పన్ను చెల్లించేవారు (గత ఐదేళ్లలో కనీసం వరుసగా రెండేళ్లు ఐటీ చెల్లించినవారు. ఒక్కరున్నా ఆ కుటుంబానికి పథకం వర్తించదు) డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్స్ వంటి నిపుణులు కుటుంబంలో ఎంత మంది రైతులు ఉన్నా సరే.. ఒక్కరికి మాత్రమే పెట్టుబడి సాయం రైతులు, పెట్టుబడి సాయంలో తగ్గుదల కొత్త మార్గదర్శకాలతో రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం తగ్గే అవకాశం ఉంది. రాష్ట్రంలో పీఎం కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా 30 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందుతుండగా.. రైతుబంధు ద్వారా 1,48,70,045 ఎకరాలకు సంబంధించి 65 లక్షల మంది రైతులకు సాయం అందుతూ వస్తోంది. ఏటా సగటున రూ.13 వేల కోట్ల చొప్పున ఆరేళ్లలో రూ.80,453.41 కోట్లను ప్రభుత్వం అందజేసింది. ఇందులో రూ.21,283.66 కోట్లు సాగులో లేని భూములకు, గుట్టలు, రాళ్లతో కూడిన భూములకు అందాయని మంత్రి తుమ్మల అసెంబ్లీలో చెప్పారు. ఇలా సాగులో లేని భూములతోపాటు ప్రభుత్వం పెట్టనున్న ఆంక్షలతో.. ఏటా రూ.3 వేల కోట్ల నుంచి రూ. 4 వేల కోట్ల మేర పెట్టుబడి సాయంలో కోతపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. -
వ్యవసాయ ప్రమాదాలపై విధానమేది?
వ్యవసాయ కార్మికులు అనేక రకాల ప్రమాదాలకు లోనవుతున్నారు. కరెంటు షాకులు, రసాయనాల (పురుగు మందుల) విష ప్రభావం, పాము కాట్లు, యంత్రాలు, పిడుగులు, వడదెబ్బ, ఇంకా అనేక ఇతర సహజ, అసహజ, మానవ తప్పిదాలు వ్యవసాయ కార్మికుల భౌతిక భద్రతను ప్రభావితం చేస్తున్నాయి. వాటి బారిన పడి కుటుంబాలు ఛిద్రం అవుతున్నాయి. కానీ దేశంలో సంఖ్యాపరంగా అతి పెద్ద శ్రామిక శక్తిగా ఉన్న వ్యవసాయ రంగం పట్ల సర్కారుల పూర్తి స్థాయి నిర్లక్ష్యం కనబడుతుంది. వ్యవసాయ కూలీలకు ప్రమాదాలు ఎదురైతే రాజకీయ, సామాజిక స్పందన శూన్యం. చట్టాలు కూడా వీళ్ళ విషయంలో ఏమీ నిర్దేశించడం లేదు. వ్యవసాయ కార్మికులందరికీ వైద్య, ఆర్థిక సహాయంతో కూడిన ఉపశమన విధానాన్ని రూపొందించాలి.పరికరాలు, యంత్రాలు, రసాయనాలు, డ్రోన్లు, మోటార్లు, ‘రసాయన’ పూత విత్త నాలు వగైరాలను వ్యవసాయంలో ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం దానికి తగిన శ్రేయో మార్గదర్శకాలు రూపొందించడం లేదు. ప్రమాదాల బారిన పడిన వ్యవసాయ కూలీలు, చిన్న, సన్నకారు రైతుల సత్వర చికిత్సకు ఏర్పాట్లు లేవు. నష్టపరిహారం, ఆర్థిక మద్దతు వగైరా అంశాలు గురించి ఆలోచననే లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక రైతు రసాయన పిచికారీ చేస్తూ స్పృహ తప్పితే పొలంలో నుంచి గ్రామంలోకి తేవడానికి 3 గంటలు పట్టింది. జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి ప్రాణం పోయింది. వ్యవసాయంలో ప్రవేశపెడుతున్న ‘ఆధునిక’ పరికరాలు, రసాయనాలతో జరిగే ప్రమదాలకు సంబంధించి ప్రాథమిక వైద్య కేంద్రాలలో కనీస చికిత్స, మందులు లేవు. జిల్లా ఆసుపత్రిలోనే ఉండవు. విద్యుదాఘాతం కారణంగా ప్రతిరోజూ కనీసం ముప్పై మంది భారతీయులు చనిపోతున్నారని అంచనా.ఇందులో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాలలోనే జరుగుతున్నాయి. వీళ్లలో వ్యవసాయ కూలీలు, చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ. ప్రమాదకరమైన వృత్తి న్యూఢిల్లీలోని ‘ఇండియన్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ సహకారంతో ‘జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి’ ఆధ్వర్యంలో 2004–07 నుంచి 2012–13 మధ్య కాలానికి వ్యవసాయ ప్రమాద సర్వే జరిగింది. ఒక సంవత్సరంలో మొత్తం సంఘటనల రేటు లక్ష మంది కార్మికులకు 334 ప్రమాదాలు కాగా, మరణాల రేటు లక్ష మంది కార్మికులకు 18.3గా ఉంది. ఇది చాలా తక్కువ అంచనా. వాస్తవంగా వ్యవసాయంలో వివిధ ప్రమాదాల మీద, తదుపరి పర్యవసానాల మీద ఏ ఒక్క ప్రభుత్వ సంస్థ సమాచారం సేకరించడం లేదు. యాంత్రీకరణ, రసాయనీకరణ, డిజిటలీ కరణను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు వాటి ఉపయోగం వల్ల ఏర్పడుతున్న ప్రమాదాలు, సంభవిస్తున్న మరణాల పట్ల దృష్టి పెట్టడం లేదు.ఆధునికత పొంగిపొర్లే అమెరికాలోనే వ్యవసాయం ప్రమాదకర వృత్తిగా పరిణమిస్తున్న వైనాన్ని అక్కడి పరిశోధకులు చెబుతున్నారు. అమెరికా వ్యవసాయ శాఖకు సంబంధించిన ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్’ మద్దతుతో చేసిన ఒక అధ్యయనం,ఐదేళ్ల కాలంలో జరిగిన ప్రమాదాలను విశ్లేషిస్తూ వ్యవసాయ పరిశ్రమ గతంలో అనుకున్న దానికంటే మరింత ప్రమాదకరమైనదని సూచించింది. 2015–19 వరకు 60,000 మందికి పైగా వ్యవసాయ సంబంధిత గాయాలతో అత్యవసర చికిత్స పొందారని వెల్లడించింది. గాయపడిన వారిలో దాదాపు మూడోవంతు మంది యువకులు.ట్రాక్టర్లు, డ్రోన్ల ప్రమాదాలుభారతదేశంలో మధ్యప్రదేశ్లో 1995–99 వరకు, సంవత్సరానికి ప్రతి 1000 మంది వ్యవసాయ కూలీలలో 1.25 మందికి పనిచేసే సమయంలో గాయాలు, దాదాపు 9.2% మరణాలు అయినట్లు ఒక అధ్యయనం కనుగొంది. అత్యధిక మరణాలు ట్రాక్టర్లు, పాము కాటు వల్ల జరిగాయి. మరణాలు, గాయాలతో ఆర్థిక నష్టం కూడా ఎక్కువే. ఉత్తరప్రదేశ్లోని ఒక జిల్లాలో వ్యవసాయంలో ప్రమాదాల కారణంగా ఏటా సుమారు రూ.6.19 కోట్ల నష్టం వాటిల్లుతోందని ఒక అధ్యయనం అంచనా వేసింది. దేశంలో సగటున వ్యవసాయ క్షేత్ర ప్రమాదాలలో ట్రాక్టర్ ప్రమాదాలు అత్యధికం (పల్టీలు కొట్టడం, ట్రాక్టర్ నుండి పడిపోవడం మొదలైనవి) (27.7%). తర్వాత నూర్పిడి యంత్రాల వల్ల (థ్రెషర్) (14.6%), పిచికారీ (స్ప్రేయర్ /డస్టర్) వల్ల (12.2%), చెరకు క్రషర్ (8.1%), గడ్డి కట్టర్ (7.8%) వల్ల జరిగాయి. ఇప్పుడు కొత్తగా డ్రోన్లు వస్తున్నాయి. 2010–17 మధ్య కాలంలో అమెరికాలో 12,842 మందికి డ్రోన్ల వల్ల గాయాలైనాయి. భారతదేశంలో దాదాపు ఆరు లక్షలకు పైగా డ్రోన్లు ఉపయోగిస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి వీటి వినియోగాన్ని ప్రోత్స హిస్తున్నది. వీటి వల్ల కలిగే ప్రమాదాల మీద మాత్రం ఏ సంస్థ సమాచారం సేకరించడం లేదు. పెరుగుతున్న డ్రోన్ల సంఖ్య చూస్తే, సంబంధిత ప్రమాదాలు పెరగడం అనివార్యంగా కనిపిస్తోంది.పని కోసం వెళ్తున్నప్పుడు జరిగే ప్రమాదాల గురించి ప్రభుత్వం, యాజమాన్యాల స్పందన మీద చట్టం నిశ్శబ్దంగా ఉన్నది. పని ప్రదేశంలో భద్రత కల్పించే బాధ్యత ఆ యా వ్యక్తులు, లేదా సంస్థల మీదనే ఉంటుంది. కానీ పని ప్రదేశం చేరకముందు జరిగే ప్రమాదాల బాధ్యత ఎవరి మీదా ఉండటం లేదు.అదే ‘యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్’ ప్రకారం, కార్మికుల ప్రయాణ సమయాన్ని కూడా పని సమయంగా పరిగణించాలి. అప్పుడు వారి భద్రత కూడా పని ఇచ్చేవారి మీద ఉంటుంది. ప్రయాణ సమయంలో కార్మికుల భద్రత, ఆరోగ్యాన్ని కాపాడవలసిన అవసరాన్ని ప్రపంచ కార్మిక సంస్థ ‘గ్లోబల్ స్ట్రాటజీ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్’ 2024–2030 నొక్కి చెబుతోంది.బాధితులకు ఉపశమనం కలిగేలా...2024 నవంబర్లో అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలో ఆర్టీసీ బస్సు, ప్యాసింజర్ ఆటో ఢీకొన్న ప్రమాదంలో 9 మంది వ్యవసాయ కూలీలు మరణించారు. 2019 ఆగస్ట్లో మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో రిక్షాను లారీ ఢీకొనడంతో 14 మంది వ్యవసాయ కూలీలు మృతి చెందారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు, కొన్ని కుటుంబాలు వైద్య చికిత్స కోసం ఉన్న అరకొర ఆస్తులను అమ్ముకోవాల్సి వస్తున్నది. సరైన సమయంలో చికిత్స లభించనందున దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రమాద బాధితుల వైద్యానికి బీమా నుంచి కూడా మద్దతు లేదు. రవాణా వాహన ప్రమాదాలలో వ్యవసాయ కార్మికులకు థర్డ్ పార్టీ బీమా ప్రయోజనం ఉండదు.వారి ప్రయాణం తరచుగా నాన్ పర్సనల్ ట్రాన్స్పోర్ట్ వాహనాలలో ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలో ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలకు సాధారణంగా బీమా ఉండదు. డ్రైవర్కు లైసెన్స్ కూడా ఉండదు. ఒకే వాహనంలో ఎక్కువ మంది ప్రయాణించడం కూడా ఒక కారణం. ప్రమాదాల కారణంగా రోజువారీ కూలీపై ఆధారపడిన కుటుంబాలు ఇంకా పేదరికంలోకి నెట్టబడుతున్నాయి. అవయవాలను కోల్పోయి వికలాంగులైతే, ఆ కుటుంబం పరిస్థితి ఇంకా దుర్భరంగా ఉంటుంది. ప్రమాదాలలో మరణమే మేలు అనే విధంగా పరిణామాలు ఉంటున్నాయి.వ్యవసాయ కార్మికులందరికీ, ప్రత్యేకించి క్షేత్రస్థాయి కూలీలు, మహిళలపై దృష్టి సారించి, వైద్య, ఆర్థిక సహాయంతో కూడిన ఉపశమన విధానాన్ని రూపొందించాలి. ప్రతి గ్రామీణ ప్రమాదాన్ని నమోదు చేయాలి, దర్యాప్తు చేయాలి. ఇది జరగాలంటే, మోటారు వాహనాల రవాణా చట్టంతో సహా సంబంధిత చట్టాల్లో తగిన సవరణలు చేయవలసి రావచ్చు. తమ తప్పులేకుండా బలి పశువులయ్యే వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలను మెరుగు పరచాలి.వ్యవసాయ మార్కెట్ సెస్, ఇతర పద్ధతుల ద్వారా ఒక ప్రమాద సహాయ నిధి ఏర్పాటు చేయాలి. వ్యవసాయ కూలీలకు కనీస బీమా కవరేజీ రూ.5 లక్షలతో ప్రారంభించి మున్ముందు పెంచాలి. రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి.డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
అన్నదాతలపై కూటమి నిర్లక్ష్యం
-
వాన కాటు.. సర్కారు పోటు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ నిర్వాకం, నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేయడం రైతులకు ఆశనిపాతంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ నిర్వాకం వల్ల మద్దతు ధర దక్కక గగ్గోలు పెడుతున్న రైతులు.. తాజాగా ముసురు పట్టి కురుస్తున్న వర్షాలతో మరింత కుదేలవుతున్నారు. మరో వైపు కళ్లాల్లోని పంట నేలకొరిగి ముంపునకు గురవుతుంటే.. ఇంకో వైపు కోసిన ధాన్యం రాసులన్నీ తడిసి ముద్దవుతున్నాయి. కళ్లెదుటే ధాన్యం మొలకలెత్తి.. రంగు మారిపోతూ.. తేమ శాతం అంతకంతకు పెరిగిపోతుండడం రైతులను తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి వరుస వైపరీత్యాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట ఏపుగా ఎదిగే వేళ జూలైలో కురిసిన అకాల వర్షాలతో పలు జిల్లాల్లో రెండోసారి విత్తుకున్నారు. పంట ఏపుగా ఏదిగే వేళ సెప్టెంబర్లో వరదలు, భారీ వర్షాలు దెబ్బతీస్తే.. కోత కోసే సమయంలో ఫెంగల్ తుపాన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. తాజాగా అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న అకాల వర్షాలు రైతుల ఆశలను పూర్తిగా చిదిమేస్తున్నాయి. కృష్ణా డెల్టాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కోతలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పల్నాడు జిల్లాలో ఇంకా పంట పూర్తిగా చేనుపైనే ఉంది. ఉత్తరాంధ్ర మొదలు పల్నాడు వరకు 8 లక్షల ఎకరాల్లో పంట చేలల్లోనే ఉంది. శ్రీకాకుళంలో 70 వేల ఎకరాలు, అనకాపల్లిలో 65 వేలు, కృష్ణా డెల్టాలో 80 వేలు, గుంటూరులో 30 వేల, బాపట్లలో 1.82 వేల ఎకరాలు, పల్నాడులో 50 వేల ఎకరాల్లో పంట చేనుపై ఉంది. ఆయా జిల్లాల్లో 50 శాతానికి పైగా పంట ముంపు నీటిలో చిక్కుకుని నేలకొరిగింది.మొలకెత్తుతున్న ధాన్యం మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో కోతకు సిద్ధంగా ఉన్న పంట పూర్తిగా నేలకొరిగింది. ఆయా జిల్లాల్లో కోసిన ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. వర్షానికి తడవకుండా కప్పుకునేందుకు టార్పాలిన్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. వీటిని సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో అద్దెకు తెచ్చుకొని మరీ కప్పుకుంటున్నారు. మరొక వైపు ఒబ్బిడి చేసుకునేందుకు, చేనుపై వరిగిన పంటను కాపాడుకునేందుకు కూలీలు దొరక్క రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మరొక వైపు రైతుల వద్ద సిద్ధంగా ఉన్న 3–4 లక్షల టన్నుల ధాన్యం రంగుమారి, మొలకలొచ్చే పరిస్థితి ఏర్పడడంతో లబోదిబోమంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మద్దతు ధర లభించక అయినకాడకి అమ్ముకోవల్సిన దుస్థితి ఏర్పడింది. పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖాధికారులు.. దళారీలు, మిల్లర్లతో కుమ్మక్కు కావడంతో 75 కేజీల బస్తాకు 300–400 వరకు నష్టపోతున్నారు. వరుస వైపరీత్యాలతో తేమ 20–25 శాతం మధ్య నమోదవుతోంది. తాజాగా కురుస్తున్న వర్షాలు, మంచు ప్రభావంతో అది 25–30 శాతం వరకు వెళ్లొచ్చని వాపోతున్నారు. 16 లక్షల టన్నుల ధాన్యం మాటేంటి?రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో 70 లక్షల ఎకరాల్లో పంటలు సాగవ్వగా, 34.92 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 84.13 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. ఆ మేరకు తొలుత 32.75 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ధేశించగా, దాన్ని 36–37 లక్షల వరకు పెంచినట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే 22.80 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్టుగా ప్రభుత్వం చెబుతుండగా, ప్రొక్యూర్మెంట్ వెరైటీస్కు సంబంధించి 16 లక్షల టన్నులకు పైగా ధాన్యం ఇంకా రైతుల వద్దే ఉంది. అత్యధికంగా శ్రీకాకుళం, కృష్ణ జిల్లాల్లో 2.50 లక్షల టన్నుల చొప్పున, విజయనగరం జిల్లాలో 1.50 లక్షల టన్నులు, పార్వతీపురం మన్యం, కాకినాడ జిల్లాల్లో లక్ష టన్నుల చొప్పున ధాన్యం ఉంది. నాన్ ప్రొక్యూర్మెంట్ వెరైటీస్కు సంబంధించి మరో 3–4 లక్షల టన్నుల ధాన్యం రైతుల దగ్గర ఉండడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. -
బ్యాంకోళ్ల జబర్దస్తీ!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: రైతులు తీసుకున్న దీర్ఘకాలిక రుణాల వసూలు కోసం సహకార బ్యాంకు అధికారులు జబర్దస్తీకి దిగుతున్నారు. తనఖాలో ఉన్న భూములను వేలం వేస్తున్నట్టుగా రైతులకు నోటీసులు ఇవ్వడమే గాకుండా, పొ లాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. బ్యాంకోళ్ల జబర్దస్తీతో తమ పరువు పోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (ఎన్డీసీసీబీ) అధికారులు కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండలం అంకోల్ తండా, సంగెం, మైలారం, దుర్కి, బస్వాయిపల్లి, అంకోల్, హాజీపూర్ తదితర గ్రామాల్లో రైతులకు నోటీసులు జారీ చేశారు.రైతుల భూములను వేలం వేస్తున్నట్టు నోటీసులు జారీ చేశారు. అంతటితో ఆగకుండా కుదువ పెట్టిన భూములను వేలం వేయడానికి తాము అ«దీనంలోకి తీసుకున్నట్టు కొందరు రైతుల భూముల్లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జూన్లో లింగంపేట మండలంలోని పోల్కంపేట గ్రామంలో రైతుల భూములను వేలం వేస్తున్నట్టు పొలాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయంపై ‘సాక్షి’ప్రచురించిన కథనంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించి సహకార బ్యాంకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పరువు తీసేలా వ్యవహరించవద్దని ఆదేశించారు.దీంతో రైతుల భూముల వేలం నిలిచిపోయింది. తాజాగా నస్రుల్లాబాద్ మండలంలో సహకార బ్యాంకు అధికారులు తిరిగి అదే పద్ధతిని మొదలుపెట్టారు. ఈనెల 26న పలువురు రైతుల భూములను వేలం వేయనున్నట్టు రైతులకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. రైతుల ఆవేదన..: బ్యాంకు అధికారులు తమ భూములను వేలం వేస్తున్నట్టు నోటీసులు ఇవ్వడంతో పాటు భూముల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు రైతులు బయట అప్పులు చేసి బ్యాంకు రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తుండగా, మరికొందరు ఆస్తులు అమ్ముకుని అయినా కడతామని, తమ భూములు వేలం వేసి పరువు తీయద్దని వేడుకుంటున్నారు. -
రైతులకు కేటీఆర్ పిలుపు
-
తెలంగాణలో రైతు భరోసా ఎగవేత కుట్రలను ఎదిరించండి... రైతులకు కేటీఆర్ బహిరంగ లేఖ
-
రైతు భరోసా ఎగవేత కుట్రలు ఎదిరించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఎగవేసేందుకు చేస్తున్న కుట్రలను ఎదిరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతులకు పిలుపునిచ్చారు. అసెంబ్లీలో రైతుబంధు పథకంపై అబద్ధాలతో దు్రష్పచారం చేశారని, చివరికి అన్నంపెట్టే రైతన్నను దొంగలా చిత్రీకరించే దుర్మార్గానికి ఒడిగట్టారని ధ్వజమెత్తారు. కోతలు, కొర్రీలతో రైతు భరోసాను సగానికి సగం ఎగవేసే ఎత్తుగడతో ఉన్నట్లు అర్థమవుతోందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన రైతులకు బహిరంగ లేఖ రాశారు. లేఖలోని ముఖ్యాంశాలు.. పెద్ద దోఖా జరగబోతోంది.. ‘రైతుబంధును బొంద పెట్టి పనికిమాలిన షరతులతో అరకొరగా రైతు భరోసా అమలు చేసి మిమ్మల్ని నిండా ముంచే ఒక పెద్ద దోఖా జరగబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల గండాన్ని దాటడం కోసం మాయోపాయాలు చేసి మమ అనిపించి, పెట్టుబడి సాయానికి పూర్తిగా ఘోరీ కట్టేలా ఘోరాలు చేయబోతున్నారు. వంచనను గ్రహించి, ఆంక్షలు వద్దని ఆందోళన చేయాల్సిన సమయం వచి్చంది. ఇప్పుడు మేల్కొనకపోతే భరోసా ఉండదు గోస మాత్రమే మిగులుతుంది. రైతుబంధుతో రూ.73 వేల కోట్లు జమ వానాకాలం.. యాసంగి రెండు పంటలకు అవసరమైన పైసలు నేరుగా బ్యాంకు ఖాతాల్లో పడే ఒక అపురూపమైన ఆలోచనకు ఆచరణే రైతుబంధు. మొత్తం 11 సీజన్లలో రూ.73 వేల కోట్లు కర్షకుల ఖాతాల్లో జమ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అవినీతికి, లీకేజీలకు తావులేని అతిపెద్ద నగదు బదిలీ పథకం రైతుబంధు. దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ పథకాన్ని ఆదర్శంగా తీసుకున్నాయి. ఇక రుణమాఫీ కింద రూ.28 వేల కోట్లు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో పడ్డాయి. ఈ రెండు పథకాల ద్వారానే అక్షరాలా లక్ష కోట్ల రూపాయలు అన్నదాతల ఖాతాల్లో నేరుగా జమయ్యాయి. రైతులకు హామీ ఇచ్చి మోసం చేస్తున్న కాంగ్రెస్ రైతుబంధు కింద కేసీఆర్ ఎకరానికి ఏటా రూ.10 వేలే ఇçస్తున్నాడని, మేం వస్తే రూ.15 వేలు ఇస్తామని ఎన్నికల్లో చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాది గడిచినా ఇంతవరకూ రైతు భరోసా జాడా పత్తా లేదు. రైతుబంధు కింద ఇచ్చే రూ.10 వేలను ఊడగొట్టారు. ఇప్పటికే రెండు పంట సీజన్లు అయిపోయి మూడో సీజన్ కూడా వచ్చేసింది. రేవంత్రెడ్డి సర్కారు మొత్తంగా ఒక్కో రైతుకు ఒక్కో ఎకరానికి రూ.17,500 బాకీ పడింది. రైతులకు హక్కుగా రావాల్సిన ఈ సొమ్మును వదులుకోవద్దు. ఏ పంట పైసలు వేస్తారు? ఈ సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. సంక్రాంతి తర్వాత వేసే రైతు భరోసా వానాకాలం పైసలా? యాసంగి పైసలా? ఏడాదికి ఒకే పంటకు ఇస్తారా? రెండు పంటలకు వేస్తారా? ఈ కుట్రను రైతాంగం గుర్తించాలి. ఇప్పుడు వేయాల్సింది ఎకరానికి రూ,7,500 కాదు..రూ.17500 డిమాండ్ చేయాలి. పీఎం కిసాన్తో లింక్ చేస్తే సగం మందికి కూడా రాదు ఆదాయం పన్ను కట్టేవాళ్లకు, పాన్ కార్డు ఉన్న వాళ్లకు రైతుబంధు కట్ అని పత్రికల్లో కథనాలు రాయించారు. లక్షలాది మంది ఉద్యోగులకు ఇక భూమితో బంధం తెంపేస్తారా? పీఎం కిసాన్ మార్గదర్శకాలనే రైతు భరోసాకు కూడా వర్తింపజేస్తే రాష్ట్రంలో సగం మంది రైతులకు కూడా పెట్టుబడి పైసలు రావు. 70 లక్షలకు పైగా రైతన్నలు ఉంటే 30 లక్షల మందికి కూడా పీఎం కిసాన్ రావట్లేదు. రైతులను అవమానపరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంరూ.22 వేల కోట్లు రియల్ ఎస్టేట్ ప్లాట్లకు, క్రషర్లకు ఇచ్చారనే దు్రష్పచారంతో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానిస్తోంది. వానా కాలంలో పోలి్చతే యాసంగిలో సాగు తగ్గుతుంది. పత్తి, పసుపు, చెరుకు వంటి పంటలు రెండు సీజన్లు వేయడం సాధ్యం కాదు. కానీ కేసీఆర్ ప్రభుత్వం యాసంగిలో కూడా వానాకాలం లెక్క ప్రకరామే రైతుబంధు పైసలు జమ చేసింది. అయితే యాసంగిలో వేసిన రైతుబంధు పైసలను దుర్వినియోగం లెక్కల్లో వేసి కాంగ్రెస్ సర్కారు అన్నదాతలను దొంగలుగా చూపుతోంది. రైతులందరికీ రైతుభరోసా అమలు చేయాలి. రైతులకు ఇస్తున్నది భిక్ష కాదు, వారి హక్కు అని ప్రభుత్వం తెలుసుకోవాలి. మేం రైతులకు అండగా ఉంటాం’అని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. -
ప్రాజెక్టుల పేరుతో భూముల్ని సేకరిస్తే సహించం
తాడికొండ: రాజధాని ప్రాజెక్టుల పేరుతో భూములు సేకరిస్తుండటంపై మంత్రి పి.నారాయణను కలిసి సమస్య వివరిస్తే.. కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్టుగా ముచ్చట్లు చెబుతున్నారని రాజధాని భూసేకరణ బాధిత రైతుల సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు యెడ్డూరి వీరహనుమంతరావు, కంచర్ల శివరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గుంటూరు జిల్లా తాడికొండలో రైల్వే ప్రాజెక్టు, ఇన్నర్ రింగ్ రోడ్డు, కొండవీటి వాగు ఆధునికీకరణ, ఇతర కనెక్టివిటీ రోడ్ల పేరుతో భూములు సేకరించేందుకు ముందుకెళుతున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఐదు గ్రామాల రైతులు సమావేశమయ్యారు. పార్టీలకు అతీతంగా నిర్వహించిన ఈ సమావేశంలో టీడీపీ నాయకులే ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించడం, న్యాయపోరాటానికి సిద్ధమని వెల్లడించడం విశేషం. పలువురు రైతులు మాట్లాడుతూ రైతుల అంగీకారం లేకుండా భూముల సేకరణ ప్రక్రియ ఎలా కొనసాగుతుందో చూస్తామని హెచ్చరించారు. ఓ పద్ధతి లేకుండా ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో భూసేకరణ చేస్తే సహించేది లేదని, సమీకరణ ద్వారా తీసుకుంటే భూములిచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ అంశాలపై ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను సంప్రదించగా సానుకూలంగా స్పందించలేదని, మంత్రి నారాయణ కూడా స్పష్టత ఇవ్వకుండా కాలం గడిపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాల నుంచి వస్తున్న భూములను కోల్పోకుండా ప్రభుత్వంపై న్యాయపోరాటం చేసి కాపాడుకునేందుకు పార్టీలకు అతీతంగా తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. ఇందుకోసం లీగల్, పొలిటికల్, ఫైనాన్స్ కమిటీలను ఏర్పాటు చేసి కోర్టులో న్యాయపోరాటానికి దిగనున్నట్టు వెల్లడించారు. ఇటీవల కాలంలో రైల్వే ప్రాజెక్టు పేరుతో పంట పొలాలను తొక్కించుకుంటూ అధికారులు పెగ్ మార్క్ సర్వే చేస్తుంటే.. తాము అడ్డుకొని రాళ్లు తొలగించామని, కొప్పురావూరు, ఇతర గ్రామాలకు చెందిన రైతులు కూడా రాళ్లు తొలగించాలని సూచించారు.పూలింగ్ ప్యాకేజీ వర్తింపజేయాలిరాజధానిలో రైతుల భూములకు ఇచ్చిన ప్యాకేజీని తమకూ వర్తింపజేయాలని, 1,250 చదరపు గజాల భూమిని అమరావతిలో అందజేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైల్వే ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీని ప్రభుత్వమే తీసుకుని రైతులకు మాత్రం పూలింగ్ ప్యాకేజీ ఇస్తే తప్ప రూ.కోట్ల విలువ చేసే భూములకు తగిన న్యాయం జరగదన్నారు. ప్రభుత్వ విధానాన్ని ఎండగడుతూ టీడీపీకి చెందిన నాయకులే కమిటీ సభ్యులుగా ఉండి పార్టీలకు అతీతంగా పోరాడతామనిప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటివరకు గ్రామాల్లో భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం కనీసం గ్రామ సభలు కూడా నిర్వహించకుండా ముందుకెళ్లడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. అడ్డగోలు భూసేకరణకు దిగుతున్న ప్రభుత్వానికి బుద్ధిచెప్పి హక్కులు సాధించుకుంటామని హెచ్చరించారు. -
దేశానికి మన విత్తన పాదు
(యెన్నెల్లి సురేందర్) గజ్వేల్: భారత్ ఇప్పటికీ వ్యవసాయాధారిత దేశమే. కోట్లమంది రైతులు, కోట్ల ఎకరాల్లో అనేక రకాల పంటలు పండిస్తున్నారు. మంచి పంట రావాలంటే అతి ప్రధానమైనది విత్తనం. పంటలు పండే ప్రతి చోటా విత్తనాన్ని ఉత్పత్తి చేయటం సాధ్యం కాదు. అందుకు సమృద్ధిగా నీరు ఉండాలి.. మంచి నేలలు కావాలి. అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉండాలి.. వీటన్నింటినీ చక్కగా వాడుకోగల నిపుణులైన రైతులు ఉండాలి. ఈ వనరులన్నింటికీ ఇప్పుడు తెలంగాణ ఆలవాలమైంది. అందుకే రాష్ట్రం నుంచి ఏటా విత్తన ఎగుమతులు పెరుగుతున్నాయి. దేశానికి అవసరమైన మొత్తం విత్తనాల్లో 55 శాతం తెలంగాణ నుంచే సరఫరా అవుతున్నాయని తెలంగాణ విత్తనాభివృద్ధి కార్పొరేషన్ అధికారులు తెలిపారు. నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేయటం ఎంత ముఖ్యమో.. దానిని పాడవకుండా దీర్ఘకాలం నిల్వచేయటం కూడా అంతే ముఖ్యం. తెలంగాణ వాతావరణం విత్తన నిల్వకు చక్కగా సరిపోతోంది. అందుకే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో ఉత్పత్తి చేసిన విత్తనాలను కూడా తెలంగాణకు తరలించి నిల్వ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా విత్తనోత్పత్తి పరిశ్రమను ప్రోత్సహిస్తూ దేశంలోనే తొలిసారి ఇక్కడే సీడ్ పార్కును ఏర్పాటుచేసింది. ఏటా విత్తనోత్పత్తి పంటల సాగు పెరుగుతున్న తీరుపై ‘సాక్షి’గ్రౌండ్ రిపోర్ట్..ఒక్కో జిల్లాలో ఒక్కో విత్తనం విత్తనోత్పత్తి రాష్ట్రంలోని దాదాపు అన్ని ఉమ్మడి జిల్లాలకు విస్తరిస్తోంది. ఉమ్మడి వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్నగర్తోపాటు సిద్దిపేట జిల్లా విత్తనోత్పత్తికి హబ్గా అవతరించాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని గద్వాల, భూత్పూర్ ప్రాంతాల్లో పత్తి విత్తనోత్పత్తి భారీగా జరుగుతోంది. ముఖ్యంగా గద్వాల జిల్లాలో విత్తన పత్తి పంట దాదాపు 35 వేల ఎకరాల్లో సాగవుతోంది. మిగితా జిల్లాల్లో వరి, మొక్కజొన్న, సోయా, సజ్జలు, పచ్చ జొన్న తదితర పంటల విత్తనోత్పత్తి జోరుగా సాగుతోంది. నిర్మల్, నిజామాబాద్ ప్రాంతాల్లో సజ్జ విత్తనాల ఉత్పత్తి అధికంగా ఉంది. 2014–15లో వరి విత్తన ఉత్పత్తి 3 లక్షల కిలోలకుపైగా ఉండగా, ఇప్పుడు రెట్టింపైంది. ఇలా అన్ని రకాల విత్తనోత్పత్తి పెరుగుతూనే ఉన్నది. ఈ ఏడు మరింత పెరుగుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. విత్తనోత్పత్తితో మంచి ఆదాయం నాకు పదెకరాల భూమి ఉంది. సాధారణ పద్ధతిలో ఎంత కష్టపడినా ఎకరాకు 25–30 క్వింటాళ్లకు మించి దిగుబడి రాదు. ఆ వడ్లను అమ్మితే ఖర్చులు పోను రూ.20–25 వేలు కూడా మిగిలేవి కాదు. అందువల్ల విత్తనోత్పత్తి వైపు వచ్చాను. ఖ ర్చులు పోను ఒక సీజన్లో ఎకరాలో రూ.60–80 వేల వరకు ఆదాయం వస్తోంది. చిమ్ముల సీతారాంరెడ్డి, వేలూరు, వర్గల్ మండలం, సిద్దిపేట జిల్లామూడేళ్లుగా సజ్జ విత్తనోత్పతి చేస్తున్న మూడేళ్లుగా సజ్జ పంటలో విత్తనోత్పత్తి చేస్తున్న. ఖర్చులు పోను ఎకరాకు రూ.50 వేలకుపైనే ఆదాయం వస్తోంది. ఇప్పటివరకు మంచి ఫలితాలే వచ్చినయ్. – చంద్రం, దండుపల్లి, వర్గల్ మండలం, సిద్దిపేట జిల్లావిత్తనోత్పత్తికి తెలంగాణ నేలలు అనుకూలం తెలంగాణలో విత్తనోత్పత్తికి అనుకూలమైన నేలలు ఉన్నాయి. చౌడు నేలలు మినహా మిగితా నేలల్లో విత్తన సాగు చేపట్టవచ్చు. విత్తన సాగు రైతులకు లాభదాయకమే అయినప్పటికీ కంపెనీలతో సరిగ్గా అగ్రిమెంట్లు చేసుకోకపోతే నష్టపోవడం ఖాయం. – డాక్టర్ విజయ్కుమార్, సిద్దిపేట జిల్లా డాట్ సెంటర్ శాస్త్రవేత్తలక్షల టన్నులవిత్తనాల ఎగుమతి రాష్ట్ర వ్యవసాయశాఖ, తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారుల లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1,400లకు పైగా గ్రామాల్లో 3.10 లక్షల మంది రైతులు 7.5 లక్షల ఎకరాల్లో విత్తనోత్పత్తి చేస్తున్నారు. విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏటా 80 వేల టన్నుల విత్తనోత్పత్తి జరుగుతోంది. 20 లక్షల టన్నుల విత్తనాల నాణ్యతను ఈ సంస్థ ధ్రువీకరించి ఎగుమతి చేస్తోంది. ప్రైవేట్ కంపెనీలు మరో 11.200 లక్షల టన్నుల విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. మొత్తంగా రాష్ట్రంలో 12 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతున్నట్లు అంచనా. మరో 12 లక్షల టన్నుల విత్తనాలను ప్రాసెసింగ్ చేస్తున్నారు. దేశంలో సుమారుగా 44 లక్షల టన్నులకుపైగా విత్తనాల అవసరం ఉండగా.. తెలంగాణ నుంచే 24 లక్షల టన్నులు సరఫరా అవుతుండటం విశేషం. చైనా, థాయ్లాండ్, బంగ్లాదేశ్, వియత్నాం తదితర 20 దేశాలకు తెలంగాణ విత్తనాలు ఎగుమతి అవుతున్నాయి. విత్తన సాగుపై రైతుల ఆసక్తి సాధారణ పంటలకంటే విత్తనోత్పత్తి పంటల సాగులో ఆదాయం అధికంగా వస్తుండటంతో రైతులు అటువైపు మొగ్గుచూపుతున్నారు. సాధారణ పద్ధతిలో ఎకరా విస్తీర్ణంలో వరి సాగుచేస్తే పెట్టుబడి ఖర్చులుపోను రూ.20–30 వేలు మిగలడమే గగనం. కానీ విత్తనోత్పత్తి పంటలు వేస్తే ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్షకుపైగా ఆదాయం వస్తోంది. ఈ పంటల సాగు క్లిష్టమైనదే అయినప్పటికీ.. నిష్టాతులైన కూలీలతో సులువుగా సాగు చేపడుతున్నారు. విత్తన వడ్లకు క్వింటాలుకు వివిధ కంపెనీలు రూ.10 వేల నుంచి రూ.13 వేల వరకు ధర చెల్లిస్తున్నాయి. ఒకవేళ 10 క్వింటాళ్లలోపు మాత్రమే దిగుబడి వస్తే సదరు కంపెనీ రైతుకు పరిహారం కింద ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.1 లక్ష చెల్లిస్తోంది. ఇదే తరహాలో పంట రకాలను బట్టి ధరను చెల్లిస్తున్నారు. మంచి లాభం ఉండటంతో ఒక్క సిద్దిపేట జిల్లాలోనే 5 వేల ఎకరాల్లో వరితోపాటు ఇతర విత్తన పంటల సాగు చేస్తూ ఏటా రూ.80 కోట్లకుపైగానే లాభం పొందుతున్నారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ సేకరించే విత్తనాలపై క్వింటాల్కు కనీస మద్దతు ధ రకంటే వరికి 20 శాతం అధికంగా ఇన్సెంటివ్స్ ఇ స్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. తృణధా న్యాలకు 17 శాతం, సోయాబీన్స్కు 25 శాతం, ఇతర పంటలకు 15 శాతం ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. విత్తనోత్పత్తిలో అగ్రిమెంట్లే కీలకం విత్తనోత్పత్తి విధానంలో రైతులు, కంపెనీలతో కుదుర్చుకునే ఒప్పందాలు సక్రమంగా లేకుంటే నష్టాలు తప్పవు. అగ్రిమెంట్లు సరిగా లేకపోతే కంపెనీ ముందుగా చెప్పే దిగుబడుల కంటే తక్కువ వస్తే పరిహారం ఇవ్వటంలేదు. అందువల్ల రైతులు విత్తనోత్పత్తి చేపట్టే సందర్భంలో ప్రాంతీయ విత్తన అధికారి వద్ద తమ పంటకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. అయితే, ప్రైవేటు కంపెనీలు భారీ ఎత్తున విత్తనోత్పత్తి చేపడుతున్నా.. ప్రభుత్వం వైపు క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. విత్తనోత్పత్తికి సంబంధించి రైతుల్లో స్వయం ప్రతిపత్తిని పెంపొందించడానికి ఆరేళ్ల క్రితం వరకు వ్యవసాయశాఖ అధ్వర్యంలో గ్రామ విత్తనోత్పత్తి పథకాన్ని అమలు చేశారు. ఈ పథకాన్ని పునరుద్ధరించాలని రైతుల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. -
వైఎస్ జగన్ పాలనలో వ్యవసాయ రంగం వృద్ధి రేటు 16.46 శాతం
-
ధాన్యం విక్రయానికి అడ్డంకులు ఎందుకు?
కృష్ణా: ధాన్యం విక్రయంలో అడ్డంకులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నారాయణ పేట జిల్లా కృష్ణా మండల సరిహద్దు కర్ణాటకలోని శక్తినగర్లో రాయచూర్ జిల్లా రైతు సంఘం నాయకులు తెలంగాణ రైతుల ధాన్యం వాహనాలను అడ్డుకొని రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అటు కర్ణాటకలో, ఇటు తెలంగాణలో తమ రైస్ మిల్లులు ఉన్నాయని, నిరంతరం తమ మిల్లుల ద్వారానే హైదరాబాద్లోని ప్రముఖ హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలకు బియ్యం పంపిస్తున్నామని చెప్పారు. తెలంగాణలోని తమ రైస్ మిల్లులకు కర్ణాటకలోని ధాన్యాన్ని అన్ని అనుమతులతో తీసుకెళ్తుంటే తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు. తెలంగాణలోని రైతులు కూడా ధాన్యాన్ని కర్ణాటకకు తీసుకెళుతున్నారు. వీరంతా రాయచూర్ మార్కెట్పై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. వరినే కాకుండా.. పత్తి, కంది, ఆముదం తదితర అన్ని పంటలు రాయచూర్ మార్కెట్కు తరలిస్తామని, తమ పంటలకు అవసరమైన పెట్టుబడులు సైతం అక్కడి కమీషన్ ఏజెంట్ల వద్దే తీసుకుంటున్నామని చెప్పారు. ఇరు రాష్ట్రాల అధికారులు, ప్రభుత్వాలు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
రైతు భరోసా కేంద్రాలతో రైతులకు అండగా నిలిచిన వైఎస్ జగన్
-
సిబ్బందిపై పంటల బీమా భారం
సాక్షి, అమరావతి: పంటల బీమా అమలులో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. ప్రీమియం భారం భరించలేక పంటల బీమాలో తాము చేరలేమని రైతులు తెగేసి చెబుతుంటే.. ఎలాగైనా రైతులను చేర్పించాలంటూ రైతు సేవా కేంద్రాల సిబ్బంది (వీఏఏ)కి లక్ష్యాలను నిర్దేశించి మరి అధికారులు ఒత్తిడికి గురి చేస్తున్నారు. రైతులు కట్టలేమంటున్నారని చెబితే.. వారి తరఫున ఆ ప్రీమియం సొమ్ములు మీరే కట్టండంటూ అధికారులు హుకుం జారీ చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లు తట్టుకోలేక 15 రోజుల క్రితమే ఆళ్లగడ్డ మండలం జి.జంబులదిన్నె ఆర్ఎస్కే వ్యవసాయ అసిస్టెంట్ హరినాథ్రెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని గుర్తు చేస్తూ తమకూ ఇదే పరిస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు.బీమా చేయాల్సింది 51.90 లక్షల ఎకరాలురబీ సాగు లక్ష్యం 57.50 లక్షల ఎకరాలు. నోటిఫై చేసిన పంటల సాగు విస్తీర్ణం 44.72 లక్షల ఎకరాలు, వీటికి అదనంగా బీమా పరిధిలోకి తీసుకొచ్చిన మామిడి విస్తీర్ణం మరో 7.18 లక్షల ఎకరాలు. అంటే బీమా చేయించాల్సిన విస్తీర్ణం 51.90 లక్షల ఎకరాలు. ఇప్పటివరకు సాగైన విస్తీర్ణం 18.50 లక్షల ఎకరాలు. దిగుబడి, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాల కింద ఈ నెల 17వ తేదీ వరకు బీమా కవరేజీ పొందిన విస్తీర్ణం కేవలం 7,40,875 ఎకరాలు మాత్రమే. రైతులు పంటల బీమాకు ఏ స్థాయిలో ఆసక్తి చూపిస్తున్నారో ఈ గణాంకాలే చెబుతున్నాయి.వీఏఏలపై రైతుల ప్రీమియం భారంకేవలం వరి పంటకు మాత్రమే బీమా చేయించుకునేందుకు ఈ నెలాఖరు వరకు గడువు ఉంది. రబీలో 20.50 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. నోటిఫై చేసిన జిల్లాల పరిధిలో 15.77 లక్షల ఎకరాలు మాత్రమే బీమా కవరేజీ కల్పించాల్సి ఉండగా.. ఇప్పటివరకు కనీసం 10 శాతం విస్తీర్ణంలో కూడా బీమా కల్పించలేని దుస్థితి ఏర్పడింది. స్వచ్ఛందంగా ఈ పథకంలో చేరేందుకు రైతులెవరూ ముందుకు రాకపోవడంతో ఆ భారాన్ని వీఏఏలపై వేస్తున్నారు. ఇప్పటికే ఇంటర్నెట్తో పాటు పాడిపంటలు మ్యాగజైన్ కోసం చందాలు చేర్పించేందుకు వీఏఏలకు చేతిచమురు వదిలిపోతోంది. ఇప్పుడు రైతుల తరఫున ప్రీమియం చెల్లించాలని ఒత్తిడి చేస్తే తాము బతికేదెలా అని వీఏఏలు ప్రశ్నిస్తున్నారు. ప్రీమియం భారం భరించలేక రైతులెవరూ పంటల బీమాపై ఆసక్తి చూపకపోవడంతో.. రోజుకు కనీసం 10 మందికి తక్కువ కాకుండా రైతులతో బీమా చేయించాల్సిందేనంటూ అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. చేసేది లేక ఉద్యోగాలను కాపాడుకునేందుకు రైతుల తరఫున ప్రీమియం కడుతున్నామని వీఏఏలు చెబుతున్నారు. ఈ నెలలో వచ్చిన జీతంలో మూడో వంతు మ్యాగజైన్స్కు, మిగిలిన మొత్తం ప్రీమియానికి చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రూ.2, రూ.3 వడ్డీలకు తెచ్చి మరీ కట్టాల్సి వస్తోందని చెబుతున్నారు. -
రాళ్లపాడు రైతులను పట్టించుకోని బాబు
-
లగచర్ల రచ్చ! శాసనసభలో చర్చకు బీఆర్ఎస్ పట్టు
సాక్షి, హైదరాబాద్: ‘లగచర్ల’ఘటనపై సోమవారం శాసనసభ అట్టుడికింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సభ్యుల నిరసనలు, నినాదాలతో హోరెత్తింది. ‘రాష్ట్రంలో పర్యాటక విధానం’అంశంపై మంత్రి జూపల్లి కృష్ణారావు లఘుచర్చను ప్రారంభించగానే బీఆర్ఎస్ సభ్యులంతా లేచి.. ‘లగచర్ల’రైతుల నిర్బంధం, అరెస్టులపై చర్చించాలని పట్టుబట్టారు. స్పీకర్ అంగీకరించకపోవడంతో ప్లకార్డులను ప్రదర్శిస్తూ, నినాదాలు చేశారు. వెల్లోకి దూసుకొచ్చి నిరసన తెలిపారు. అధికార పక్షం నుంచి డిప్యూటీ సీఎం భట్టి, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు లేచి బీఆర్ఎస్ సభ్యుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. అయినా బీఆర్ఎస్ సభ్యులు నిరసన కొనసాగించారు. ఈ గందరగోళంలో సభను కొనసాగించలేక మంగళవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ప్రకటించారు. వాయిదా తీర్మానాలను తిరస్కరించడంతో.. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో ఫార్మా విలేజీ భూసేకరణను ప్రతిఘటించిన రైతులను నిర్బంధించిన ఘటనపై చర్చించాలంటూ టి.హరీశ్రావు, ఇతర బీఆర్ఎస్ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత స్పీకర్ ప్రసాద్కుమార్ ప్రకటించారు. దీనితో పార్టీ సభ్యులంతా నిలబడి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ‘ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం..దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం.. నహీ చలేగా.. తానా షాహీ నహీ చలేగా..’అని నినాదాలు చేశారు. దీనితో సభను కొద్దిసేపు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. వెనక్కి తగ్గని బీఆర్ఎస్ సభ్యులు సభ తిరిగి ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సభ్యులు తమ నిరసన కొనసాగించారు. ఈ గందరగోళం మధ్యే పర్యాటక విధానంపై లఘు చర్చను ప్రారంభించాలని మంత్రి జూపల్లి కృష్ణారావుకు స్పీకర్ సూచించారు. కానీ బీఆర్ఎస్ సభ్యులు నినాదాలతో గందరగోళ వాతావరణం నెలకొంది. దీనిపై స్పీకర్ కల్పించుకుని... బీఆర్ఎస్ సభ్యులు ప్లకార్డులను అప్పగించి ఎవరి స్థానాల్లో వారు కూర్చుంటే హరీశ్రావుకు మాట్లాడే అవకాశం ఇస్తామని చెప్పారు. అయితే ముందు మాట్లాడేందుకు అవకాశమిస్తే ప్లకార్డులను అప్పగిస్తామని హరీశ్రావు బదులిచ్చారు. స్పీకర్ అవకాశం ఇవ్వకపోవడంతో నిరసనను కొనసాగించారు. శ్రీధర్బాబు, భట్టి కల్పించుకున్నా.. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనను స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్తోపాటు శాసనసభా వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్బాబు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. అందరం కలసి రూల్స్ బుక్ తయారు చేసుకున్నామని, సభలో ప్లకార్డులు ప్రదర్శించడం, నినాదాలు చేయడం దానికి విరుద్ధమని స్పీకర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ సభ్యులు ప్రశాంతంగా కూర్చోవాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఇక సభలో ప్లకార్డులు, కరపత్రాలు ప్రదర్శించరాదని నిబంధనలు ఉన్నాయని, శాసనసభా వ్యవహారాల మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన హరీశ్రావుకు అది బాగా తెలుసని మంత్రి డి.శ్రీధర్బాబు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ కార్యకలాపాలపై ప్రతిరోజూ బులెటిన్ ఇస్తారని, వాటి ప్రకారమే సభ నడుస్తుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సభ్యులు లేవనెత్తిన ప్రతి అంశంపై ప్రభుత్వం సమాధానమిస్తుందని హామీ ఇచ్చారు. ఇక సభ గౌరవాన్ని పరిరక్షించాలని... పర్యాటక విధానంపై మంత్రి మాట్లాడుతుంటే బీఆర్ఎస్ సభ్యులు బాధ్యతారాహితంగా వ్యవహరించడం సరికాదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ బీఆర్ఎస్ సభ్యులు నిరసన కొనసాగించారు. ‘రైతులకు కరెంట్ షాకులా?.. రైతులకు బేడీలా..? సిగ్గు సిగ్గు’అంటూ నినాదాలు చేశారు. నిరసనల మధ్య జూపల్లి ప్రసంగం బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన కొనసాగుతుండగానే మంత్రి జూపల్లి కృష్ణారావు కాసేపు ప్రసంగించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆదాయాన్ని పెంచలేకపోయిందని, తాము పర్యాటక అభివృద్ధి ద్వారా ఆ పనిచేస్తున్నామని చెప్పారు. బంగారు పళ్లెంలో రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పగించామని హరీశ్రావు అంటుంటారని, తెరిచి చూస్తే అప్పులకుప్పగా ఉందని విమర్శించారు. 15 నిమిషాలే కొనసాగిన సభ బీఆర్ఎస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూనే ఉండటంతో గందరగోళం నెలకొంది. దీనితో బీఆర్ఎస్ సభ్యుల నుంచి ప్లకార్డులు తీసుకోవాలని మార్షల్స్ను స్పీకర్ ఆదేశించారు. మార్షల్స్ వచ్చేలోపే హరీశ్రావు, ఇతర బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ ముందు వెల్లోకి దూసుకొచ్చారు. ఇంకా ముందుకు వెళ్లకుండా మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. ఈ గందరగోళం నడుమ సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. బీఆర్ఎస్ సభ్యులంతా వెల్లోకి దూసుకురాగా.. కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి సభ్యుల కుర్చీల వద్దే నిలబడి నిరసన తెలిపారు. మధాŠయ్హ్నం 2.25 గంటలకు లఘు చర్చ ప్రారంభంకాగా 2.40 గంటలకు వాయిదా పడింది. అంటే 15 నిమిషాలు మాత్రమే సభ నడిచింది. మండలిలోనూ ‘లగచర్ల’నిరసన ‘లగచర్ల’గిరిజన రైతుల అరెస్టులు, బేడీలు వేయడంపై సోమవారం శాసన మండలిలోనూ బీఆర్ఎస్ తీవ్రంగా నిరసన తెలిపింది. వాయిదా తీర్మానం ఇచ్చింది. దానికి మండలి చైర్మన్ అనుమతించకపోవడంతో శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, కల్వకుంట్ల కవిత, ఎల్.రమణ, శంభీపూర్ రాజు, వాణిదేవి, రవీందర్రావు తదితరులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ‘ఇదేమి రాజ్యం... దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం.. రైతులకు బేడీలు సిగ్గు సిగ్గు’అంటూ నినాదాలు చేశారు. నేడు అంబేడ్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, చిత్రహింసలకు గురిచేశారని.. దీనిపై మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలపాలని బీఆర్ఎస్ పిలుపు ఇచ్చింది. జైళ్లలో నిర్బంధించి, రైతన్న చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ అమానవీయ, అణచివేత విధానాలను నిలదీయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మంగళవారం ఉదయం 11 గంటలకు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. లగచర్ల రైతులపై కేసులను ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
తిరుగు వలసలు చెబుతున్నదేమిటి?
కోవిడ్ మహమ్మారి కాలంలో లక్షలాది మంది నగరాల నుంచి తమ గ్రామాలకు తిరిగి వెళ్లారు. మహమ్మారి ముగిసిన తర్వాత వీరందరూ తిరిగి నగరా లకు చేరుకుంటారన్న అంచనాలకు భిన్నంగా గ్రామాల్లోనే ఉండిపోయారు. 2020–22 మధ్య కాలంలో గ్రామీణ శ్రామిక శక్తికి సుమారు 5 కోట్ల 60 లక్షల మంది కార్మికులు జోడించబడ్డారు. వీళ్లలో ఎక్కువమంది యువత. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లాంటివాటిని మినహాయిస్తే, చాలా రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబాల సంఖ్య పెరిగింది. ఇవన్నీ కూడా జీవనోపాధికి చెందిన సవాళ్లను ఎదుర్కోవటంలో వ్యవసాయానికి ఉన్న ప్రాముఖ్యాన్ని చాటుతున్నాయి. వ్యవసాయం మీద ఆధారపడేవారి సంఖ్యను తగ్గించే ఆర్థిక విధానాలకు బదులుగా, వ్యవసాయాన్ని స్థిరమైన, లాభదాయకమైన వ్యవస్థగా మార్చాలి.భారత ప్రజలు ప్రస్తుతం పెద్ద సంఖ్యలో తమ గ్రామాలకు తిరిగి వెళ్తున్నారు. గత ఐదేళ్లలో, పట్టణ కేంద్రాల్లో మెరుగైన ఉపాధి అవకాశాల కోసం, ‘తక్కువ–ఉత్పాదకత’ కలిగిన వ్యవసాయం నుండి కార్మికులను బయటకు నెట్టడానికి సంకల్పించిన విధానం ఇప్పుడు అడ్డం తిరిగింది.కోవిడ్–19 మహమ్మారి కాలంలో మొదటిసారి తిరుగు వలసలు (రివర్స్ మైగ్రేషన్) మొదలయ్యాయి. లక్షలాది మంది పట్టణ పేదలు అనంత దూరాలు, చాలామంది కాలినడకన తమ తమ ఊళ్లకు ప్రయా ణించారు. దేశ విభజన రోజుల తర్వాత ఇది ప్రజల అతిపెద్ద చలనం. కనీవినీ ఎరుగనంత స్థాయిలో సాగిన ఈ అంతర్–రాష్ట్ర వలసలు, రాష్ట్రం లోపలి వలసలు తాత్కాలికమని నమ్మారు. కానీ, మహమ్మారి ముగిసిన తర్వాత శ్రామికశక్తి నగరాలకు తిరిగి వస్తుందనే అంచనాను తోసిపుచ్చుతూ, వాళ్లలో ఎక్కువ మంది తమ ఊళ్లలోనే ఉండడానికి ఇష్టపడటం జరిగింది.వ్యవసాయంలోనే ఉపాధి‘నేషనల్ శాంపిల్ సర్వే’, ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే’ల డేటా ఆధారంగా, ‘ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్’, న్యూఢిల్లీకి చెందిన ‘ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్’ రూపొందించిన ఒక నివేదికలో వ్యవసాయ ఉపాధి పెరిగిందని తేలింది. సాధారణ అభి ప్రాయానికి విరుద్ధంగా, 2020–2022 మధ్య గ్రామీణ శ్రామికశక్తికి 5 కోట్ల 60 లక్షలమంది కార్మికులు జోడించబడ్డారు. నిరుద్యోగం వృద్ధి చెందుతున్న సమయంలో, నగరాల్లో లభించే ఉపాధి అవకాశాలు వలస కార్మికులకు అంతగా ఆకర్షణీయంగా లేవని ఇది నిరూపిస్తోంది. తయారీ రంగంలో మందగమనం, నిర్మాణ రంగ ఉద్యోగాలు తగ్గుముఖం పట్టడం వల్ల నగరాలకు వలస వచ్చినవారు గ్రామాలకు తిరిగి వెళ్లడమే మంచిదని భావించారు.ఆసక్తికరమైన విషయమేమిటంటే, 2004–05, 2018–19 మధ్య అంటే 13 సంవత్సరాల కాలంలో 6 కోట్ల 60 లక్షల మంది వ్యవసాయ శ్రామికులు పట్టణాలలో చిన్న ఉద్యోగాల కోసం వలస వెళ్లారు. కానీ 2018–19, 2023–24 మధ్య ఐదేళ్లలో 6 కోట్ల 80 లక్షల మంది పైగా ప్రజలు గ్రామాలకు తిరిగి వచ్చారని జవహర్లాల్ నెహ్రూ విశ్వ విద్యా లయానికి చెందిన ఆర్థికవేత్త హిమాన్షు అంచనా వేశారు. వ్యవసాయం అకస్మాత్తుగా లాభదాయకంగా మారిందని దీని అర్థం కాదు. ప్రజ లను పొలాల నుండి బయటకు నెట్టడం ఆచరణీయమైన వ్యూహం కాదని ఇది స్పష్టంగా చెబుతోంది.గ్రామీణ శ్రామిక శక్తిలో వ్యవసాయం వాటా 2018–19లో 42.5 శాతం నుండి 2023–24లో 46.1 శాతానికి పెరిగిందని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక చెబుతోంది. పైగా ఇందులో గణనీయమైన యువ జనాభా కూడా ఉంది. ఇది విస్మరించలేని సందేశాన్ని ఇస్తోంది. ప్రజలను ఆ రంగం నుండి బయటకు నెట్టాలనే లక్ష్యంతో సంవత్సరాలుగా వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా వెనుకపట్టున ఉంచిన విధానాల మీద మన ఆర్థిక ఆలోచనలు నడుస్తున్నాయి. కానీ ఢిల్లీ సరిహద్దుల్లో ఒక సంవత్సరం పాటు జరిగిన ఆందోళనల తరువాత రైతుల నిరసనలు వెల్లువెత్తాయి. తమకు సరైన ఆదాయాన్ని నిరంతరం తిరస్కరించడంపై రైతాంగం ఆగ్రహంతో ఉంది.ప్రపంచ బ్యాంకుకు దూరంగా– గాంధీజీకి దగ్గరగా!భారతదేశం తన వ్యవసాయరంగం నుండి 40 కోట్ల మంది ప్రజలను నగరాలకు వలసబాట పట్టించాలని ప్రపంచ బ్యాంకు 1996లో కోరింది. ఇది బ్రిటన్, ఫ్రాన్ ్స, జర్మనీల ఉమ్మడి జనాభా కంటే రెండింతలకు సమానం. అయితే పట్టణ కేంద్రాలకు వలస వెళ్లడానికి వీలుగా ఆర్థిక పరిస్థితులను సృష్టించే బదులు, వ్యవ సాయాన్ని ఆచరణీయమైన వాణిజ్యంగా మార్చడం ద్వారా వ్యవ సాయాన్ని పునర్నిర్మించడంపై దృష్టి సారించాలి. మహాత్మా గాంధీ కోరుకున్నది ఇదే. వలస కార్మికులు తిరిగి వచ్చిన రేటు ఆయన అభి ప్రాయం ఎంత సరైనదో చూపిస్తుంది. అందువల్ల, ప్రపంచ బ్యాంకు ఆలోచనను విడనాడి వ్యవసాయాన్ని పునరుజ్జీవింపజేయడం, వ్యవసాయాన్ని స్థిరమైన, ఆచరణీయమైన, లాభదాయకమైన వ్యవస్థగా మార్చడంపై దృష్టి పెట్టాల్సిన సమయం ఇది.మీకు ఇంకా నమ్మకం లేకుంటే, ఇటీవల విడుదల చేసిన ‘నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్’ (నాబార్డ్)కు చెందిన ‘ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ సర్వే 2021–22’ నివేదికను చూడండి. దీని ప్రకారం, వ్యవసాయంలో నిమగ్నమై ఉన్న జనాభా వాటా సంవత్సరాలుగా గణనీయంగా పెరి గింది. 2016–17లోని 48 శాతం నుండి 2023–24లో గరిష్ఠంగా 57 శాతానికి చేరుకుంది. వ్యవసాయ కుటుంబాల సంఖ్యలో పెను గంతు స్థానికుల తిరిగిరాకను స్పష్టంగా సూచిస్తోంది. వ్యవసాయ కుటుంబాల వాటా 2016–17లో 42 శాతం నుండి 2021–22 నాటికి 36 శాతానికి తగ్గిన పంజాబ్; 70 నుండి 63 శాతానికి తగ్గిన హిమాచల్ ప్రదేశ్, కొంచెం తగ్గుదల చూపిన గుజరాత్, కర్ణాటకలను మినహాయిస్తే... అనేక రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబాల పెరుగుదల గణనీయంగా ఉంది. వ్యవసాయ కుటుంబాలు గోవాలో 3 నుండి 18 శాతానికి, హరియాణాలో 34 నుండి 58 శాతానికి పెరిగాయి. ఉత్తరా ఖండ్లో 41 నుంచి 57 శాతం; తమిళనాడులో 13 నుండి 57 శాతం పెరుగుదల కనబడింది. ఇతర రాష్ట్రాలు కూడా ఈ పెరుగుదల ధోరణినే చూపుతున్నాయి.కారణాలు ఏమైనప్పటికీ, అంతర్జాతీయ కార్మిక సంస్థ, పీరి యాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, నాబార్డ్ చేసిన మూడు అధ్యయనాలు కూడా ఉపాధి, జీవనోపాధికి చెందిన సవాళ్లను ఎదుర్కోవటంలో వ్యవసాయానికి ఉన్న ప్రాముఖ్యతను చాటుతున్నాయి. అందుకే గృహ ఆహార భద్రతను నిర్ధారించడంలో వ్యవసాయ రంగం సామర్థ్యాన్ని విస్మరంచకూడదు.ఆందోళనలో శుభవార్త వ్యవసాయంలో సంఖ్యలను తగ్గించడంపై ఆధారపడిన మును పటి ఆర్థిక విధానాలను రివర్స్ మైగ్రేషన్ తారుమారు చేసినప్పటికీ, వ్యవసాయంలో ఉపాధి పెరుగుదలను ప్రధాన ఆర్థికవేత్తలు ‘ఆందో ళన కలిగించే అంశం’గా చూస్తున్నారు. భారతదేశంలో కనిపిస్తున్న ఈ తిరుగు వలసల ధోరణి తక్కువ మధ్య–ఆదాయ వర్గానికి ప్రత్యే కమైనదిగా చూస్తున్నారు. కానీ వ్యవసాయాన్ని పునర్నిర్మించడానికి అవసరమైన ఆర్థిక విధానాలను పునరుజ్జీవింపజేయవలసిన అవస రాన్ని ఇది సూచిస్తుంది. మారుతున్న క్షేత్ర వాస్తవికతను గుర్తించాల్సిన సమయం ఇది.ప్రభుత్వం తగిన వనరులను కల్పించడానికి సిద్ధంగా ఉంటే, వ్యవసాయంపై ఆధారపడటం దాని సొంత ఆచరణీయ మార్గాలను సృష్టిస్తుంది. వ్యవసాయం కోసం కేటాయించే బడ్జెట్ వ్యయంలో ఏదైనా పెరుగుదలను ప్రతిపాదిస్తే, అది ఆర్థిక లోటుకు అదనపు మొత్తంగా పరిగణించడాన్ని ఆర్థికవేత్తలు ఇకనైనా మానేయాలి. ‘ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్’ (ఓఈసీడీ) ప్రకారం, వ్యవసాయంలో నిమగ్నమై ఉన్న 54 ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం మాత్రమే రైతుల నష్టాలను బడ్జెట్ కేటాయింపుల ద్వారా భర్తీ చేయడం లేదు. నేను తరచుగా చెప్పినట్లు, రైతులు దాదాపు 25 సంవత్సరాలుగా ఏటా పంట నష్టపోతున్నారు. రైతులకు ‘దేవుడే దిక్కు’ అయ్యే ఈ లోపభూయిష్ట ఆర్థిక రూపకల్పన ఇకనైనా అంతం కావాలి.ఒక విధంగా తిరుగు వలసలను శుభవార్తగా చూడాలి. వనరులను అత్యంత అవసరమైన చోట ఉంచడానికి ఇది సరైన సమయం. అది చివరకు ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’కు దారి తీస్తుంది.దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులుఈ–మెయిల్: hunger55@gmail.com -
వెజి‘ట్రబుల్’ సాగు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కూరగాయల సాగు గణనీయంగా పడిపోయింది. డిమాండ్, సరఫరాలో అంతరం ఏటికేడు పెరుగుతోంది. అవసరమైన కూరగాయల్లో సగానికి పైగా ఇతర రాష్ట్రాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. రవాణా ఖర్చులు, మధ్య దళారుల కారణంగా కూరగాయల ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. తాజావి కాకుండా నిల్వ కూరగాయలే జనానికి అందుతున్నాయి. కూరగాయల సాగులో సమస్యలు, ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం, పట్టణ ప్రాంతాలు విస్తరించడం, శివారు భూములన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోతుండటంతోపాటు సాగునీటి వసతి పెరిగి రైతులు వరి సాగువైపు దృష్టిపెట్టడం వంటివి కూరగాయల సాగు తగ్గిపోవడానికి కారణమవుతున్నాయి. రిజర్వుబ్యాంక్ ఇటీవల విడుదల చేసిన హ్యాండ్బుక్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. పదేళ్లలో 80శాతం తగ్గిపోయి.. రాష్ట్రంలో ఏటా 2 కోట్ల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. అందులో ఈసారి ఖరీఫ్లో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 12.96 లక్షల ఎకరాలే. మిగతా అంతా వరి, పత్తి వంటి పంటలే. ఉద్యాన పంటల్లోనూ పండ్ల తోటలు 4 లక్షల ఎకరాల్లో, సుగంధ ద్రవ్యాల సాగు 3 లక్షల ఎకరాల్లో, ఆయిల్ పామ్ 2 లక్షల ఎకరాల్లో, ఆగ్రో ఫారెస్ట్రీ లక్ష ఎకరాల్లో, పూలు, ఇతర వాణిజ్యపర ఉద్యాన పంటలు కలిపి లక్షన్నర ఎకరాల్లో సాగయ్యాయి. రాష్ట్రంలోని నాలుగున్నర కోట్ల జనాభాకు అవసరమైన కూరగాయల సాగు జరుగుతున్నది కేవలం 1.13 లక్షల ఎకరాల్లో మాత్రమే. నిజానికి 2013–14లో తెలంగాణలో 5.46 లక్షల ఎకరాల్లో కూరగాయలు సాగుకాగా.. తర్వాతి నుంచి ఏటా తగ్గిపోతూ వచ్చింది. ఈసారి 1.13 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అంటే పదేళ్లలో 4.33 లక్షల ఎకరాల మేర (80శాతం) కూరగాయల సాగు తగ్గింది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న నిల్వ కూరగాయలనే జనం వాడాల్సి వస్తోంది. కూరగాయల సాగులో రాష్ట్రం దేశంలో 15 స్థానానికి, ఉత్పత్తిలో 14వ స్థానానికి పడిపోవడం గమనార్హం. ఏటా 40 లక్షల టన్నులు అవసరం రాష్ట్ర జనాభా వినియోగం కోసం ఏటా 40 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం. హార్టికల్చర్ విభాగం లెక్కల ప్రకారం 1.13 లక్షల ఎకరాల్లో ఉత్పత్తి అవుతున్న కూరగాయలు 21 లక్షల టన్నులు మాత్రమే. ఇందులోనూ వంకాయ, టమాటాలను అవసరానికి మించి పండిస్తున్నారు. పచ్చి మిర్చితో పాటు బెండ, దొండ, ఉల్లి, బంగాళాదుంప, చిక్కుడు, పొట్లకాయ, సొరకాయ, బీరకాయ, కాలీఫ్లవర్, క్యాబేజీ, క్యారెట్తోపాటు పాలకూర, తోటకూర, కొత్తిమీర, పుదీనా వంటివి కూడా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. రవాణా ఖర్చు కారణంగా రాష్ట్రంలో కూరగాయల ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రోత్సాహకాలు, నిల్వ సదుపాయాలు లేక.. కూరగాయల సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం, కోల్డ్ స్టోరేజీ సదుపాయాల కొరత, పండించిన కూరగాయలకు సరైన మార్కెట్ కల్పించకపోవడం వంటి సమస్యలతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లుతున్నారు. కూరగాయల విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలతోపాటు కూలీల ఖర్చులు పెరగడం, పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోవడం కూడా కూరగాయల సాగు పట్ల రైతులకు ఆసక్తి తగ్గడానికి కారణమని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. పెరిగిన వరి, పత్తి, మొక్కజొన్న సాగు విస్తీర్ణం తెలంగాణలో కూరగాయల సాగు తగ్గిపోగా వరి సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. భూగర్భ జలాలు, సాగునీటి సదుపాయాలు పెరగడం దీనికి కారణం. ఈ ఏడాది వానకాలం సీజన్లో వరి 66 లక్షల ఎకరాల్లో, పత్తి 44 లక్షల ఎకరాల్లో సాగవడం గమనార్హం. యాసంగిలోనూ 60 లక్షల ఎకరాల్లో వరి వేశారు. దీనితోపాటు మొక్కజొన్న, మిర్చి వంటి పంటల సాగు కూడా గణనీయంగా పెరుగుతోంది. కూరగాయల సాగు మరింతగా క్షీణిస్తోంది. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న ఎల్లంపల్లి, మిడ్మానేరు, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, ఖమ్మం పరిధిలో సీతారామ ప్రాజెక్టు వంటివి అందుబాటులోకి వచ్చాక... రాష్ట్రంలో వరితో పాటు కూరగాయల సాగు కూడా పెరుగుతుందని వ్యవసాయశాఖ అధికారులు భావించారు. కానీ దీనికి భిన్నంగా జరుగుతోంది. కూరగాయలు ఎక్కువగా పండించే.. రంగారెడ్డి, మహబూబ్నగర్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో కూడా సాగు తగ్గుముఖం పడుతుండటం ఆందోళనకరంగా మారింది. హైదరాబాద్లో తగ్గిన కూరగాయల వినియోగం హైదరాబాద్లో కూరగాయల వినియోగంపై జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ సంయుక్తంగా జరిపిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సగటున నెలకు ఒక్కొక్కరు 8.08 కిలోల కూరగాయలు(ఉల్లిపాయలతో కలిపి) వినియోగిస్తున్నట్లు తేలింది. అంటే రోజుకు 269 గ్రాములు అన్నమాట. దేశ సగటు కంటే ఇది 56 గ్రాములు తక్కువ. మన దేశ పరిస్థితుల మేరకు.. ప్రతి ఒక్కరూ రోజుకు 325 గ్రాముల కూరగాయలు తీసుకోవాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సూచించడం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు 2,006 టన్నులు అంటే నెలకు 60,182 టన్నులు, ఏడాదికి 7,22,186 టన్నుల కూరగాయలు అవసరమని అంచనా. కానీ ఏటా హైదరాబాద్కు 6 లక్షల టన్నుల కూరగాయలు మాత్రమే వస్తున్నట్టు అంచనా. ఇందులోనూ 80శాతం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నవే. సరిపడా కూరగాయలు రాకపోవడం, ధరలు ఎక్కువగా ఉండటంతో వినియోగం తక్కువగా ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పెట్టుబడులు, కూలీల సమస్యతో.. మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో కూరగాయలు, ఉద్యాన పంటల సాగు క్రమంగా తగ్గుతోంది. పెట్టుబడుల ఖర్చు, ఎక్కువ శ్రమ, పురుగు మందులు, ఎరువుల వాడకం ఎక్కువగా ఉండటం వల్ల రైతులు కూరగాయల సాగుకు ఆసక్తి చూపడం లేదు. కూలీల కొరత కూడా సమస్యగా మారింది. మరోవైపు నీటి లభ్యత పెరగడం, ప్రభుత్వం ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేస్తుండటంతో వరి పండించేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. – ప్రభాకర్రెడ్డి, కోఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం, పాలెం, నాగర్కర్నూల్ జిల్లా కొత్తగా సాగు చేసేవారే లేరు పట్టణీకరణతో కూరగాయలకు డిమాండ్ పెరుగుతోంది. కానీ కొత్తగా కూరగాయల సాగుకు ఎవరూ ముందుకు రావడం లేదు. నీటి లభ్యత, మద్దతు ధరతో కొనుగోళ్లతో రైతులంతా వరివైపు చూస్తున్నారు. – కె.వేణుగోపాల్, జిల్లా హార్టికల్చర్ అధికారి, మహబూబ్నగర్ కూరగాయల సాగు ఖర్చులు బాగా పెరిగాయి కూరగాయలకు చీడపీడల సమస్య ఎక్కువ. పురుగు మందులు, ఎరువులు, ఇతర సాగు ఖర్చులు పెరిగిపోతున్నాయి. కొన్నిసార్లు పెట్టుబడి కూడా తిరిగిరాని పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో క్రమంగా కూరగాయల సాగు తగ్గించుకుంటూ వస్తున్నాం. సూపర్ మార్కెట్లు పెరగడం, ఇతర ప్రాంతాల నుంచి టోకుగా తెప్పించుకుంటుండటంతో.. స్థానికంగా మార్కెటింగ్ సమస్య వస్తోంది. – ముత్యంరెడ్డి, రైతు, బుస్సపూర్, బాల్కొండ నియోజకవర్గం దళారీలే బాగుపడుతున్నారు.. మా గ్రామంలో ఇప్పుడు టమాటా పండిస్తున్నారు. నెల కింద టమాటా ఒక్క బాక్స్ (సుమారు 25 కిలోలు) 500 రూపాయలకు అమ్మేవాళ్లం. ఇప్పుడు రూ.200 కూడా రావడం లేదు. టమాటాలను నిల్వ చేసుకునే సదుపాయం లేదు. దళారీలు ఎంతకు అడిగితే అంతకు అమ్మడం తప్ప ఏం చేయలేం. రైతులు, వినియోగదారులు ఇద్దరికీ నష్టమే. దళారీలు బాగుపడుతున్నారు. విత్తనాల నుంచి మార్కెట్లో అమ్ముకునేదాకా నష్టం కలుగుతున్నప్పుడు కూరగాయల సాగు నుంచి వేరే పంటల వైపు వెళ్లక ఏం చేస్తాం? – మొగుళ్లపల్లి వెంకటరెడ్డి, ముట్పూర్, కొందుర్గు మండలం, రంగారెడ్డి జిల్లా లాభాలపై గ్యారంటీ లేదు కూరగాయలు పండిస్తే పెట్టిన పెట్టుబడికి అదనంగా వచ్చే లాభాలపై ఎలాంటి గ్యారంటీ లేదు. ఒకవైపు వాతావరణ పరిస్థితులు. మరోవైపు చీడపీడల బెడద. అన్నీ తట్టుకొని సాగుచేసినా.. మహారాష్ట్ర నుంచి దిగుబడి అవుతున్న కూరగాయలతో పోటీపడలేకపోతున్నాం. మొన్నటి వరకు మంచి ధర పలికిన టమాటా, కొత్తిమీర ధరలు ఇప్పుడు బాగా తగ్గాయి. దిగుబడి వస్తున్న సమయంలో ధర తగ్గిపోవడంతో నష్టపోవాల్సి వస్తోంది. – సాతాళే విజయ్కుమార్, కూరగాయల రైతు, గుడిహత్నూర్నిలకడైన ధర లేక ఇబ్బంది అవుతోందికూరగాయలకు మార్కెట్లో నిలకడైన ధర లేకపోవడం వల్ల నష్టపోవాల్సి వస్తోంది. దగ్గరలో మార్కెట్ అందుబాటు లేక రవాణా, ఇతర ఖర్చులు పెరుగుతున్నాయి. హార్టికల్చర్ శాఖ నుంచి ఎలాంటి సబ్సిడీలు కూడా అందడం లేదు. అందుకే ప్రస్తుతం కూరగాయలు సాగు చేయడం లేదు. – లింగారెడ్డి. రైతు, రెంజర్ల -
నీళ్ల కోసం రోడ్డెక్కిన రైతులు
కందుకూరు/లింగసముద్రం: సాగునీటి కోసం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని రాళ్లపాడు ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ఆందోళనకు దిగారు. ఆదివారం ప్రాజెక్టు వద్ద బైఠాయించి నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని నినదించారు. ఈ ఏడాది రాళ్లపాడు ప్రాజెక్టులోకి పూర్తి స్థాయిలో నీళ్లు వచ్చాయి. దీంతో ప్రాజెక్టు కుడి కాలువ కింద ఉన్న లింగసముద్రం, కొండాపురం మండలాల రైతులు నెల రోజులుగా పెద్ద ఎత్తున నార్లు పోశారు. వారం కిందట కుడికాలువ గేటు ఊడి కింద పడిపోవడంతో నీటి విడుదల నిలిచిపోయింది. గేటుకు మరమ్మతులు చేసి పైకి లేపడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో నీరు రాక నారు ఎండిపోతోంది. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఒక్కసారిగా రెండు మండలాల రైతులు ఆందోళనకు దిగారు. ప్రాజెక్టుపై రోడ్డు మీద బైఠాయించి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆయకట్టు రైతులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రాజెక్టులో చేపల పెంపకంపై ఉన్న శ్రద్ధ... రైతులపై లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రాజెక్టులో పది రోజుల కిందట చేప పిల్లలను వదిలారని, అవి పెరిగేందుకు నీరు అవసరం కావడంతో కావాలనే కొందరు నాయకులు నీటి విడుదల కాకుండా జాప్యం చేయిస్తున్నారని ఆరోపించారు.ధర్నా చేయడానికి వీల్లేదంటూ గొడవఈ ఏడాది ప్రాజెక్టులో చేపలు వేసిన టీడీపీ నాయకుడు మద్దెల రామారావు వచ్చి ఇక్కడ ధర్నా చేయడానికి వీల్లేదని రైతులతో వాగ్వాదానికి దిగారు. రామారావుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ప్రాజెక్టులో చేపలు వేసి గేట్లు పైకి లేవకుండా మీరే చేస్తున్నారా...’ అని మండిపడ్డారు. దీంతో కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నంఈ తరుణంలో చినపవని గ్రామానికి చెందిన తూమాటి బాలకోటయ్య అనే రైతు పురుగు మందు తాగేందుకు ప్రయత్నించగా, వెంటనే తమకు న్యాయం జరగకపోతే ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకుంటానని మరోరైతు సిద్ధమయ్యారు. మిగిలిన రైతులు వారిని అడ్డుకుని సమస్య పరిష్కారం కోసం పోరాటం చేద్దామని సర్ది చెప్పారు. అదే సమయంలో అక్కడి చేరుకున్న వలేటివారిపాలెం ఎస్ఐ మదిరినాయుడు, గుడ్లూరు ఎస్ఐ వెంకట్రావ్, ప్రాజెక్టు ఈఈ వెంకటేశ్వర్లు రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా, నీరు ఇచ్చే వరకు ధర్నాను విరమించే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. చేతులెత్తేసిన నిపుణుడు బాషా ఊడిపడిపోయి కిందకు చేరిన గేటును పైకి లేపేందుకు నాలుగైదు రోజులుగా ప్రయత్నం చేస్తున్న నరసరావుపేటకు చెందిన నిపుణుడు, మెకానిక్ బాషా ఆదివారం పూర్తిగా చేతులెత్తేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు ఉండడం వల్ల మరమ్మతులు చేయడం సాధ్యంకాని, ఇక తాము ఏమీ చేయలేమని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే ప్రచార ఆర్భాటంపై రైతుల ఆగ్రహంకాలువకు నీరు రాక తాము అల్లాడుతుంటే ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాత్రం నీటిని విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. నీరు విడుదలయ్యాయో... లేదో.. మా పొలాల వద్దకు వచ్చి చూస్తే తెలుస్తుందని మండిపడ్డారు. 25 ఎకరాల్లో వరినారు పోశానుప్రాజెక్టులోకి పూర్తి స్థాయిలో నీరు వచ్చాయని తెలియడంతో 25 ఎకరాల్లో వరి నారుమడులు పెట్టాను. తుపాను కారణంగా కురిసిన వర్షాలకు దుక్కులు కూడా దున్నాను. కుడికాలువకు నీరు విడుదల చేస్తారని 10 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. నీరు విడుదల కాకపోవడం వరినారు ఎండిపోయింది. – ఇనుకొల్లు సతీష్, ఆయకట్టు రైతు, చినపవని, లింగసముద్రం మండలం చేపల కోసమే నీరు విడుదల చేయడం లేదుకొందరు నేతలు రాళ్లపాడు ప్రాజెక్టులో చేపలు వదిలారు. చేపలకు నీరు ఉంచుకోవాలనే ఉద్దేశంతో సాగుకు సక్రమంగా నీటిని విడుదల చేయడం లేదు. ఈ ఏడాది పుష్కలంగా ప్రాజెక్టులో నీరు ఉండడంతో 10 ఎకరాల్లో వరినార్లు పోశాను. నీరు విడుదల కాకపోవడంతో నార్లు ఎండిపోతున్నాయి. – టి.కమలాకర్రెడ్డి, పెదపవని, లింగసముద్రం మండలం -
అన్నదాతలకు తోడుగా వైఎస్ జగన్
-
వామ్మో.. పంటంతా తినేస్తున్నాయ్!
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర ప్రాంతంలో వరి చేలను కత్తెర, కొమ్ము పురుగులు రైతుల పాలిట అశనిపాతంలా తయారయ్యాయి. నివారణ చర్యలు చేపట్టేలోగా చేలను చుట్టేసి కేవలం మూడు రోజుల్లోనే వరి కంకులను తినేస్తున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది.ఆ మూడు జిల్లాల్లో ఖరీఫ్ సీజన్లో 10లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఇప్పటికే 50 శాతం కోతలు పూర్తయ్యాయి. ఈ దశలో కత్తెర, కొమ్ము పురుగులు విజృంభిస్తూ పంటను తినేస్తున్నాయి. పురుగులు ఆశించిన పొలాల్లో 30నుంచి 80 శాతం పంట పూర్తిగా దెబ్బతింది. నీటిఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ పురుగుల దాడి తీవ్రంగా కనిపిస్తోంది. విజయనగరం జిల్లాలో 30 వేల ఎకరాల్లో పంట ఈ పురుగుల ఉ«ధృతితో దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. జామి, గంట్యాడ, గరివిడి, నెల్లిమర్ల, గజపతినగరం, బొండపల్లి, పూసపాటిరేగ, చీపురుపల్లి మండలాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. పంటకు నిప్పు పెడుతున్న రైతులువిజయనగరం జిల్లా బుడతనాపల్లిలో పురుగు సోకడంతో 75 ఎకరాల్లో వరి పంట గడ్డిలా తెల్లబారిపోవడంతో కోసేందుకు పనికిరాకుండా పోయింది. దీంతో చేసేది లేక ఈ ప్రాంత రైతులు వరి పొలాలకు నిప్పు పెడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం ఎస్.నర్సాపురం పరిసర గ్రామాలతో పాటు అనకాపల్లి జిల్లాలోని పలు మండలాల్లో కూడా కత్తెర పురుగు వ్యాపిస్తున్నట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదని, స్థానిక వ్యవసాయాధికారులకు చెప్పినా తమను పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. గతంలో ఇలాంటి పురుగులు, తెగుళ్లు సోకినప్పుడు శాస్త్రవేత్తల బృందాలను రంగంలోకి దింపి సామూహిక నివారణ చర్యలు చేపట్టేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఆరోపిస్తున్నారు.ఏడెకరాల పంటను మూడు రోజుల్లో తినేశాయి 7 ఎకరాలను కౌలుకు తీసుకుని ఎంటీయూ–1126 రకం వరి వేశాను. ఎకరాకు 40 బస్తాలకుపైగా దిగుబడి వస్తుందని ఆశించాను. పంట కోత కొచి్చన వేళ ఉన్నట్టుండి కత్తెర, కొమ్ము పురుగులు విరుచుకుపడ్డాయి. కేవలం మూడే మూడు రోజుల్లో 7 ఎకరాల పంటను పూర్తిగా తినేశాయి.. ఎకరాకు రూ.35వేల చొప్పున అప్పు చేసి పెట్టిన రూ.2.50 లక్షలు ఆవిరైపోయాయి. ఏం చేసేది లేక పంటకు నిప్పు పెట్టాను. అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. – చల్లా రామునాయుడు, బుడతానాపల్లి, విజయనగరం జిల్లానష్టపరిహారం చెల్లించాలి యుద్ధప్రాతిపదికన ఆ ప్రాంతాలకు శాస్త్రవేత్తలను పంపించి వరి పంటను ఆశిస్తున్న పురుగులను పరిశీలించి డ్రోన్ల సాయంతో సామూహిక నివారణ చర్యలు చేపట్టాలి. ఈ పురుగుల ఉధృతి కారణంగా ఉత్తరాంధ్రలో కోతకు సిద్ధంగా ఉన్న పంట పొలాల్లో 30 శాతానికి పంట దెబ్బతింది. నష్టపోయిన రైతులకు ప్రకృతి విపత్తుల కింద పంట నష్టపరిహారం ఇవ్వాలి. – ఎం.హరిబాబు, ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలురైతుల సంఘం -
అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక చంద్రబాబు..?
-
రోడ్డెక్కిన అన్నదాతలకు YSRCP బాసట
-
నేడే వైఎస్సార్ సీపీ రైతు పోరుబాట
-
ఆంధ్రప్రదేశ్లో నేడు రైతు పోరు... కూటమి సర్కార్ మోసాలపై అన్నదాతల నిరసనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాసట
రైతులు, ధర్నా, ఆంధ్రప్రదేశ్
-
చంద్రబాబు మోసాలపై రైతుపోరు నేడే
సాక్షి, అమరావతి: రెండు సీజన్లు గడుస్తున్నా పెట్టుబడి సాయం రూ.20 వేలు అందక.. గిట్టుబాటు ధర దక్కక.. ఉచిత పంటల బీమా రద్దుతో ధీమా లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నలకు వైఎస్సార్ సీపీ దన్నుగా నిలిచింది. అన్నదాతను దగా చేస్తున్న కూటమి సర్కారు నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఆ పిలుపునందుకున్న వైఎస్సార్సీపీ అన్ని జిల్లాల కేంద్రాల్లో శుక్రవారం రైతులతో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనుంది. అన్నదాతల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు అందించనున్నారు.కుడి, ఎడమల దగా..కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందుతుందని అన్నదాతలు ఆశించారు. అయితే రెండు వ్యవసాయ సీజన్లు గడిచిపోతున్నా కూటమి సర్కారు పైసా సాయం జమ చేసిన పాపాన పోలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడి సాయం కింద రూ10,718 కోట్లు చెల్లించాల్సి ఉండగా బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లే విదిలించిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదు. మరోవైపు పంటల బీమా ప్రీమియం బకాయిలను ఎగ్గొట్టి రైతులకు దక్కాల్సిన రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారాన్ని అందకుండా చేసింది. సున్నా వడ్డీ రాయితీ కింద రూ.131.68 కోట్ల ఊసెత్తడం లేదు. రబీలో కరువు సాయం బకాయిలు రూ.319.59 కోట్లు ఎగ్గొట్టింది. ఖరీఫ్ ధాన్యాన్ని కొనే నాధుడు లేక రైతులు అల్లాడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్నెల్లలోనే రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. గత ఐదేళ్ల పాటు వెన్నుదన్నుగా నిలిచిన వైఎస్సార్ ఉచిత పంటల బీమాను కూటమి సర్కారు రాగానే అటకెక్కించడంతో ఆ భారం భరించలేక, బ్యాంకుల చుట్టూ తిరగలేక, అవస్థలు పడలేక అన్నదాతలు పంటల బీమాకు దూరమవుతున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఏకంగా 70 మంది వరకు రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడగా ఏ ఒక్కరికీ ఆర్థిక సాయాన్ని అందించి ఆదుకోలేదు.రైతన్నకు బాసటగా జగన్..కూటమి ప్రభుత్వం దగా చేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నలకు వైఎస్ జగన్ దన్నుగా నిలిచారు. ప్రభుత్వంపై పోరాటానికి పిలుపునిచ్చారు. ఈమేరకు వైఎస్సార్సీపీ శ్రేణులు అన్ని జిల్లా కేంద్రాల్లో రైతులతో కలసి శుక్రవారం భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నాయి. టీడీపీ కూటమి సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రభంజనంలా కదిలి వచ్చేందుకు రైతన్నలు సన్నద్ధమయ్యారు. అన్నదాతల సమస్యలను పరిష్కరించాలని పేర్కొంటూ కలెక్టర్లకు డిమాండ్ పత్రాలను అందించనున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో పేర్కొన్న ప్రకారం రైతులకు పెట్టుబడి సాయంగా తక్షణమే రూ.20 వేలు అందించాలని కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు సమర్పించనున్నారు. ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించాల్సిందేనని.. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని.. ధాన్యంలో తేమ శాతం లెక్కలతో రైతులను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు. తక్షణమే ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని.. రైతులపై అదనపు భారం మోపే చర్యలను కూటమి ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేయనున్నారు.నాడు... చెప్పిన దాని కంటే మిన్నగారైతు భరోసా కింద ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలను పెట్టుబడి సాయంగా అందిస్తానని నాడు పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాగానే ఎవరూ అడగకపోయినా సరే ఆ సాయాన్ని రూ.13,500కి పెంచడమే కాదు.. ఐదేళ్లలో ఒక్కో రైతుకు పెట్టుబడి సాయంగా రూ.67,500 అందజేశారు. చెప్పిన దాని కంటే మిన్నగా సాయం అందించి రైతు పక్షపాతినని నిరూపించుకున్నారు. ఇక రైతులపై పైసా భారం పడకుండా వైఎస్ జగన్ అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. నోటిఫై చేసిన పంటలకు సాగు చేసిన ప్రతీ ఎకరాకు యూనివర్శల్ కవరేజీ కల్పిస్తూ ఉచిత పంటల బీమాను అమలు చేశారు. దెబ్బతిన్న పంటలకు సంబంధించి బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ముగిసేలోగా అందించి రైతులకు అండగా నిలిచారు. పంట నష్ట పరిహారమైతే ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి సంబంధించి అదే సీజన్ ముగిసేలోగానే రైతుల ఖాతాల్లో జమ చేశారు. సున్నా వడ్డీ రాయితీని ప్రతి ఏటా క్రమం తప్పకుండా జమ చేశారు. విత్తు నుంచి విక్రయం వరకు గ్రామస్థాయిలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సచివాలయాలకు అనుబంధంగా నెలకొల్పిన ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన విత్తనాలు, నాన్ సబ్సిడీ విత్తనాలతో పాటు ఎరువులు, పురుగుల మందులను కూడా రైతుల ముంగిటికే అందించారు. లక్ష మందికి పైగా అభ్యుదయ రైతులతో ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా మండళ్ల ద్వారా సీజన్కు ముందుగానే పంటల ప్రణాళికలు రూపొందించి సాగులో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. రైతన్నలు పండించిన ధాన్యాన్ని మిల్లర్లు, దళారీల ప్రమేయం లేకుండా కళ్లాల నుంచే నేరుగా కొనుగోలు చేశారు. ప్రతీ గింజకు కనీస మద్దతు ధర కల్పించడమే కాకుండా గన్నీ బ్యాగ్స్, లోడింగ్, రవాణా (జీఎల్టీ) భారాన్ని సైతం భరిస్తూ ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేలా వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. మార్కెట్లో ధరలు పతనమైన ప్రతీసారి మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కీమ్ కింద జోక్యం చేసుకొని మద్దతు ధరలకు ఆయా పంట ఉత్పత్తులను సేకరించి రైతన్నలకు ప్రతి అడుగులోనూ అండగా నిలిచారు. ఇలా వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా 2019–24 మధ్య ఐదేళ్లలో అన్నదాతలకు ఏకంగా రూ.1,88,541 కోట్ల మేర ప్రయోజనాన్ని వైఎస్ జగన్ చేకూర్చారు. -
రైతుల భుజం తట్టి భరోసా ఇచ్చాము: Vidadala Rajini
-
రైతులను కూటమి ప్రభుత్వం నట్టేట ముంచింది: వంగా గీత
-
కూటమి ప్రభుత్వంలో లబోదిబో అంటున్న రైతులు
-
రైతులకు అండగా వైఎస్ జగన్
-
లాభాల సిరి స్ట్రాబెర్రీ
గత రెండేళ్లుగా వాతావరణ పరిస్థితులు అనుకూలించక నష్టపోయిన స్ట్రాబెర్రీ రైతులకు ఈ ఏడాది పరిస్థితులు అనుకూలించాయి. దిగుబడి ఆశాజనకంగా ఉండటంతో అన్నిఖర్చులు పోనూ ఎకరాకు రూ.2 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని రైతులు పేర్కొన్నారు. సేంద్రియ విధానంలో పండించడం వల్ల కొనుగోలు చేసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. సాక్షి,పాడేరు: అల్లూరి జిల్లా మన్యం ప్రాంతంలో స్ట్రాబెర్రీ పండ్ల సీజన్ ప్రారంభమైంది. పర్యాటక సీజన్ కావడంతో మంచి ఆదరణ నెలకొంది. అరకులోయ, లంబసింగి ప్రాంతాల్లో 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేస్తున్నారు. కొంతమంది మైదాన ప్రాంత రైతులు గిరిజనుల వద్ద భూములు లీజుకు తీసుకుని చింతపల్లి మండలం లంబసింగి ప్రాంతంలో పండిస్తున్నారు. అరకులోయలోని పెదబల్లుగుడ సమీపంలో ఎకరా విస్తీర్ణంలో గిరిజన రైతులే స్వయంగా స్ట్రాబెర్రీని పండిస్తున్నారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో పండ్ల దిగుబడి ఆశాజనకంగా ఉంది. అరకులోయ, లంబసింగి, రాజుపాకల ప్రాంతాల్లో స్ట్రాబెర్రీ పండ్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు నేరుగా రైతుల వద్దకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగించకుండా పండించడం వల్ల పండ్లకు మంచి డిమాండ్ ఉంది. 200 గ్రాములు రూ.100 అరకులోయ, లంబసింగి ప్రాంతాల్లో రైతులు, వ్యాపారులు 200 గ్రాముల పండ్లను రూ.100కు విక్రయిస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో పండ్ల వ్యాపారులకు వారు ఇదే పండ్లను రూ.90కు అమ్ముతున్నారు. విశాఖపట్నం, విజయనగరం, రాజమండ్రి, విజయవాడ ప్రాంతాలకు లంబసింగి ప్రాంతం నుంచి ప్రతిరోజు ఎగుమతి అవుతోంది. ఎకరానికి రూ.2లక్షల ఆదాయం ఎకరాకు మూడు వేల కిలోల వరకు దిగుబడి వస్తోందని రైతులు తెలిపారు. అన్ని ఖర్చులు పోను ఎకరాకు రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తుందని వారు వివరించారు. ఈ ఏడాది పంట ఆశాజనకంగా ఉందని రాజుపాకలు ప్రాంతానికి చెందిన రైతు సత్యనారాయణ తెలిపారు. అనుకూలించిన వాతావరణం స్ట్రాబెర్రీ సాగుకు ఈఏడాది వాతావరణం అనుకూలంగా ఉంది. గత రెండేళ్లు అధిక వర్షాల కారణంగా పంటకు నష్టం వాటిల్లింది. ఈసారి మాత్రం పూత బాగుంది. పండ్ల సైజు కూడా పెద్దదిగా ఉండడంతో మరింత ఇష్టంగా తింటున్నారు. గిరిజన రైతులు సాగు చేపట్టేందుకు ముందుకు వస్తే ప్రోత్సహిస్తాం. హెక్టార్కు రూ.50వేల వరకు ఆర్థిక ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. – రమేష్ కుమార్రావు, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి, పాడేరు -
రైతు కంట కన్నీరు
సాక్షి, అమరావతి: అన్నదాత కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పడరాని పాట్లు పడుతున్నారు. ఏటా సీజన్కు ముందే అందే పెట్టుబడి సాయం లేదు. ఉచిత పంటల బీమా అటకెక్కింది. పంటల బీమా పరిహారం జాడలేదు. కరువు సాయం ఊసే లేదు. సున్నా వడ్డీ రాయితీ లేదు. సకాలంలో విత్తనాలు, ఎరువులు అందడం లేదు. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలకు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కనీస మద్దతు ధర దక్కక రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టే దుస్థితి నెలకొంది. ప్రభుత్వ తీరుపై అన్నదాతలు కన్నెర్ర చేస్తున్నారు. ఓవైపు విత్తనాలు, ఎరువుల కోసం ధర్నాలు చేస్తున్నారు. మరోవైపు పండించిన పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆందోళన బాటపట్టారు. ఇటీవలే ధాన్యం రాశులతో మండల కేంద్రాల ఎదుట పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు డిమాండ్తో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగడం రాష్ట్రంలో రైతుల దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో ఆర్నెల్ల కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షోభంలో కూరుకుపోయిన రైతులకు అండగా వైఎస్సార్ సీపీ ఆందోళన బాటపట్టింది. ఈ నెల 13వ తేదీన జిల్లా కలెక్టరేట్ల ఎదుట వైఎస్సార్ సీపీ తలపెట్టిన ఆందోళన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన వ్యక్తం చేసేందుకు రైతులు సన్నద్దమవుతున్నారు. అన్నదాతా.. ఎక్కడ సుఖీభవ? అధికారంలోకి రాగానే ప్రతీ రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తామంటూ సూపర్ సిక్స్లో ఇచి్చన హామీని చంద్రబాబు అటకెక్కించేశారు. గత ఐదేళ్లుగా వైఎస్సార్ రైతు భరోసా కింద లబ్ధి పొందిన 53.58 లక్షల మంది రైతులకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించాలంటే ఏటా రూ.10,718 కోట్లు అవసరం. కానీ బడ్జెట్లో కేవలం రూ.వెయ్యి కోట్లు మాత్రమే విదిలించి చేతులు దులిపేసుకున్నారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ముగిసింది. రబీ సీజన్ ప్రారంభమై 40 రోజులు దాటింది. కేంద్రం రెండు విడతల్లో పీఎం కిసాన్ సాయం అందించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక్క విడత కూడా పెట్టుబడి సాయాన్ని జమ చేసిన పాపాన పోలేదు. అన్నదాత సుఖీభవ కోసం విధివిధానాల రూపకల్పన కూడా జరగలేదు. పెట్టుబడిసాయం అందక, సకాలంలో రుణాలు దొరక్క గత రెండు సీజన్లలో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. పంటల బీమాకు దూరం రైతులపై పైసాభారం పడకుండా ఐదేళ్ల పాటు నోటిఫై పంటలకు యూనివర్శల్ కవరేజ్ కల్పిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కూటమి ప్రభుత్వం అటకెక్కించేసింది. 2023–24 సీజన్కు సంబంధించి రైతులతో సహా రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి రూ.930 కోట్ల ప్రీమియం మొత్తాన్ని జమ చేయకపోవడం వల్ల ఆ సీజన్లో కరువు వల్ల పంటలు దెబ్బతిన్న దాదాపు 15 లక్షల మంది రైతులకు రూ.1,385 కోట్ల బీమా పరిహారం అందకుండా పోయింది. రబీ సీజన్ నుంచి స్వచ్ఛంద నమోదు పద్ధతిలో పంటల బీమా అమలు చేస్తుండడంతో ప్రీమియం భరించలేక రైతులు పంటల బీమాకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. రబీలో ఇప్పటి వరకు 16.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే బీమా కవరేజ్ పొందిన విస్తీర్ణం కేవలం 65 వేల ఎకరాలు మాత్రమే. ప్రీమియం భారం రైతుల నెత్తిన వేయడంతో ఈ సీజన్లో రూ.350 కోట్లకుపైగా భారం భరించలేక పంటల బీమాకు దూరమవుతున్నారు. కరువు సాయం అందక అగచాట్లు వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్–2023 సీజన్లో పంటలు నష్టపోయిన 8.89 లక్షల మంది రైతులకు రూ.1,126.31 కోట్లు జమ చేశారు. సాంకేతిక కారణాల వల్ల 1.54 లక్షల మందికి రూ.163.12 కోట్లు జమ కాలేదు. రబీ–2023–24 సీజన్లో కరువు ప్రభావం వల్ల 2.52 లక్షల హెక్టార్లలో దెబ్బతిన్న పంటలకు గాను 2.32 లక్షల మంది రైతులకు రూ.164.05 కోట్ల కరువు సాయం చెల్లించాల్సి ఉంది. ఈ రెండు బకాయిలు కలిపి 3.91 లక్షల మంది రైతులకు రూ.327.71 కోట్ల కరువు సాయం ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతోంది.ఇక ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో కురిసిన వర్షాల వల్ల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల తొలుత 16 జిల్లాల్లో 1.65 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, చివరికి నాలుగు జిల్లాల్లో 54 వేల ఎకరాలకు పరిమితం చేశారు. 29,944 మంది రైతులకు రూ.37.33 కోట్లు పరిహారం చెల్లించాలని లెక్కతేల్చగా ఆచరణకు వచ్చేసరికి కేవలం 23వేల మందికి రూ.25.75 కోట్లకు కుదించేశారు. ఆ పరిహారం నేటికీ జమ చేయలేదు. సెప్టెంబర్ లో కురిసిన భారీవర్షాలు, వరదలకు తొలుత 6 లక్షల ఎకరాల్లో పంటలతో పాటు పెద్ద ఎత్తున పాడి రైతులకు జరిగిన నష్టానికి సంబంధించి రూ.557 కోట్ల పరిహారం ఇవ్వాలని అంచనా వేయగా చివరికి 2.15 లక్షల మందికి రూ.319.59 కోట్లకు కుదించేశారు. సాంకేతిక కారణాలతో లక్షలాది మందికి నేటికీ పరిహారం అందక పడరాని పాట్లు పడుతున్నారు. మరొక పక్క వర్షాభావ పరిస్థితుల వల్ల కరువుతో అల్లాడుతున్న రాయలసీమ జిల్లాల్లో కంటి తుడుపుగా కరువు మండలాల ప్రకటన చేసిన ప్రభుత్వం ఆయా జిల్లాల రైతులను ఆదుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. కలసిరాని సాగు.. ఆదుకోని ప్రభుత్వం ప్రభుత్వ నిర్వాకానికి తోడు వైపరీత్యాల ప్రభావంతో ఖరీఫ్తో పాటు రబీ సాగు కూడా రైతులకు కలిసిరావడం లేదు. పెట్టుబడుల కోసం పడరాని పాట్లు పడ్డారు. రూ.3–5 వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ సాగు చేసినా వైపరీత్యాల ప్రభావంతో పంటలు దెబ్బతినడంతో పాటు ఆశించిన దిగుబడులు రాక లక్షలాది మంది రైతులు నష్టాలపాలయ్యారు. చేతికొచ్చిన పంటలు అమ్ముకునే సమయంలో మార్కెట్లో ధరలేక ధాన్యం రైతులతో పాటు పత్తి తదితర పంటల రైతులకు పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి నెలకొంది. ఓ వైపు ముమ్మరంగా కోతలు జరుగుతున్న దశలో విరుచుకు పడిన ఫెంగల్ తుపాన్ ప్రభావంతో చేతికొచ్చిన పంట దెబ్బతిని మరింత నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయడంతో తమ రెక్కల కష్టార్జితాన్ని దళారీల పాల్జేయాల్సిన దుస్థితి రైతులకు దాపురించింది.తేమ శాతం సాకుతో దోపిడీ..కేంద్ర ప్రభుత్వం ధాన్యం సాధారణ రకానికి క్వింటా రూ.2300, ఏ–గ్రేడ్కు రూ.2320గా మద్దతు ధర ప్రకటించింది. అంటే 75 కేజీల బస్తాకు సాధారణ రకానికి రూ.1725, ఏ–గ్రేడ్కు రూ.1740 గిట్టుబాటు ధర చెల్లించాలి. కానీ కూటమి ప్రభుత్వ పాలనలో 75 కేజీల బస్తాకు రూ.400 నుంచి రూ.500 వరకు రైతు నష్టపోతున్నారు. రైతు సేవా కేంద్రాలకు తీసుకొచ్చే ధాన్యాన్ని తేమ శాతాన్ని బట్టి ధర నిర్ణయించాల్సిన అధికారులు మిల్లర్లు చెప్పిన ధరకు అమ్ముకోమంటూ సలహాలిస్తున్నారు. మరోవైపు మార్కెట్లో మద్దతు ధరకు మించి రేటు పలికే ఎంటీయూ 1262, ఎంటీయూ 1318, బీపీటీ 5204 వంటి ఫైన్ వెరైటీస్కు కూడా ఈసారి మద్దతు ధర కూడా దక్కడం కష్టంగా ఉంది. 75 కేజీల బస్తా రూ.1300–1500 మధ్య కొనే పరిస్థితి నెలకొంది. కోసిన ధాన్యాన్ని కొనే నాధుడు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. గోనె సంచుల కొరత తీవ్రంగా ఉంది. ఆరబోతకు కూలీల కొరత వేధిస్తోంది. కూలీల ఖర్చులు, పంటను కాపాడుకునేందుకు టార్పాలిన్స్కు ఎకరాకు రూ.వెయ్యి వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.ఆందోళన కలిగిస్తున్న రైతు ఆత్మహత్యలు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్న రైతులు పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కేవలం ఆర్నెల్ల వ్యవ«ధిలోనే సుమారు 70 మందికి పైగా అన్నదాతలు ఆత్మహత్యలకు ఒడిగట్టడం రాష్ట్రంలో రైతుల దయనీయ పరిస్థితులకు నిదర్శనంగా నిలుస్తోంది. అత్యధికంగా ఒక్క కర్నూలు జిల్లాలోనే 30 మందికి పైగా బలవన్మరణం చెందారు. రాయలసీమ జిల్లాలతో పాటు కోస్తాంధ్ర, గోదావరి జిల్లాల్లో కూడా రైతు ఆత్మహత్యలకు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఏ ఒక్క రైతు కుటుంబానికీ కూటమి సర్కారు పరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు.జగన్ ప్రభుత్వం ఉండి ఉంటే..అదే వైఎస్ జగన్ ప్రభుత్వం ఉండి ఉంటే.. జూన్లో అన్నదాతకు తొలి విడత వైఎస్సార్ రైతు భరోసా సాయం అందేది. గడిచిన సీజన్ మాదిరిగానే ఈ ఏడాది కూడా 53.58 లక్షల మందికి మేలో రూ.7,500, అక్టోబర్లో రూ.4,000 చొప్పున పెట్టుబడి సాయాన్ని జమ చేసేవారు. ఖరీఫ్–2023 సీజన్కు సంబంధించి రూ.1,385 కోట్ల బీమా పరిహారం అందేది. కరువు సాయం బకాయిలు రూ.327.71 కోట్ల కూడా జమ చేసేవారు. సున్నా వడ్డీ రాయితీ కింద సుమారు రూ.130 కోట్ల వరకు జమయ్యేది. ఖరీఫ్ సీజన్లో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రతీ రైతుకు పూర్తి స్థాయిలో పరిహారం జమయ్యేది. -
గుంటూరు జిల్లాలో ధాన్యాన్ని ఎక్కడ కొనుగోలు చేశారో చెప్పాలి: అంబటి
-
రైతుల కోసం 13న జరగబోయే కార్యక్రమంపై దేవినేని అవినాష్
-
రైతు భూమి వేలానికి దండోరా
మదనాపురం: రైతు తీసుకున్న రుణాన్ని పూర్తిస్థాయిలో చెల్లించలేదని ఆత్మకూర్ డీసీసీబీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏకంగా గ్రామంలో డప్పు మోగిస్తూ.. సదరు రైతు భూమిని వేలం వేస్తామంటూ దండోరా వేశారు. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా మదనాపురం మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన రైతు లచ్చాగౌడ్ 2019లో గేదెల పెంపకం కోసం ఆత్మకూర్ డీసీసీబీలో తన రెండెకరాల పొలాన్ని కుదువపెట్టి రూ. 3.50 లక్షల అప్పు తీసుకున్నారు. దాదాపుగా రూ. 5 లక్షలకు పైగా బ్యాంక్కు చెల్లించినా అప్పు తీరలేదు. ఇంకా రూ.1.75 లక్షల బకాయి ఉందని.. బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 21న గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రైతు లచ్చాగౌడ్ భూమిని వేలం వేస్తామంటూ మంగళవారం గ్రామంలోని ప్రధాన వీధుల్లో డప్పు మోగిస్తూ.. మైక్లో చాటింపు చేశారు. ఆర్థిక ఇబ్బందులతో కట్టలేదు.. నేను అనారోగ్యానికి గురై ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సకు రూ. లక్షలు ఖర్చు పెట్టుకున్నాను. పంటలు సరిగ్గా పండక పెట్టుబడులు మీద పడి నష్టం జరిగింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల రూ. 1.75 లక్షల రుణం కట్టలేదు. నాకు రుణమాఫీ కూడా వర్తించలేదు. భూమి వేలం వేస్తామంటూ గ్రామంలో దండోరా వేయడం చాలా బాధగా ఉంది. – లచ్చాగౌడ్, రైతు, మదనాపురం -
రైతుల తరపున పోరాడతాం: భూమన
సాక్షి,తిరుపతి:కూటమి ప్రభుత్వం రైతులకు పెద్ద ఎత్తున సహాయం చేస్తామని చెప్పి మోసం చేసిందని, చంద్రబాబు మొదటి నుంచి రైతు వ్యతిరేకి అని వైఎస్సార్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు.‘అన్నదాతకు అండగా’ పేరుతో ఈ నెల 13 నుంచి వైఎస్సార్సీపీ చేపట్టనున్న నిరసన కార్యక్రమాల పోస్టర్ను భూమన మంగళవారం(డిసెంబర్10) విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.‘ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సహాయం చేస్తామని,వరికి మద్దతు ధర ఇస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి 6 నెలలయినా రైతులను పట్టించుకోక పోవడం దారుణం.20 ఏళ్ల క్రితమే చంద్రబాబు రైతు వ్యతిరేకి, ఉచిత కరెంటు ఇస్తామని ఆనాడు వైఎస్సార్ చెబితే హేళన చేసిన వ్యక్తి చంద్రబాబు.రూ.86 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని 2014లో మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. రైతుల పక్షాన పోరాటం చేస్తాం. ఈనెల 13న తిరుపతి జిల్లా కలెక్టరేట్ ముందు నేతలు ఆర్కే రోజా, అభినయ్,మోహిత్,రాజేష్,మధుసుధన్రెడ్డితో కలిసి నేను నిరసనలో పాల్గొంటా. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట పూతలపట్టు పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ సునీల్,విజయానందారెడ్డి కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతాం. విద్యుత్ చార్జీలు పెంపునకు వ్యతిరేకంగా ఈ నెల 27న నిరసన కార్యక్రమాలు చేపడతాం. డిస్కంల ఎదుట ఆందోళన చేస్తాం’అని భూమన తెలిపారు. -
అన్నదాతకు అండగా YSRCP పోస్టర్ విడుదల
-
శంభు సరిహద్దులో హైవేల మూసివేత పిటిషన్పై సుప్రీం కోర్టులో విచారణ
న్యూఢిల్లీ: శంభు సరిహద్దులో హైవేల మూసివేతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరగనుంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం విచారించనుంది.పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంతోపాటు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ.. హర్యానా, పంజాబ్ రైతులు ఢిల్లీ చలో కార్యక్రమం చేపట్టారు. సంయుక్త కిసాన్ మోర్చ నేతృత్వంలో వందలాది మంది రైతులు శంభు సరిహద్దు గుండా రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు శంభు సరిహద్దు హైవేలను నిర్బందించారు. రాకపోకల్ని నిలిపివేశారు. హైవేల నిర్బందం, రైతులు చేపట్టిన ఢిల్లీ చలో కార్యక్రమంపై పంజాబ్కు చెందిన ఓ సామాజిక కార్యకర్త సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో రైతుల నిరసనలతో మూతపడ్డ శంభు సరిహద్దు సహా హైవేలను తిరిగి తెరవాలని, నిరసన తెలుపుతున్న రైతులను హైవేపై నుంచి తొలగించాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి సూచించాలని పిటిషన్లో పేర్కొన్నారు. శాంతిభద్రతలను కాపాడేలా నిరసన తెలిపే రైతులను కూడా కోర్టు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విధంగా హైవేలను అడ్డుకోవడం ప్రజల ప్రాథమిక హక్కులకు విరుద్ధమని, జాతీయ రహదారి చట్టం భారతీయ న్యాయ సంహిత ప్రకారం నేరమని, హైవేలను దిగ్బంధించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిటిషనర్ పేర్కొన్నారు. -
సెజ్ భూములు తిరిగిచ్చిన ఏకైక సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, కాకినాడ/కాకినాడ రూరల్: ప్రత్యేక ఆర్థిక ప్రాంతం (సెజ్)కు తీసుకున్న భూములను రైతులకు తిరిగిచ్చిన చరిత్ర దేశంలో గత సీఎం వైఎస్ జగన్ కే దక్కుతుందని కాకినాడ సెజ్ రైతులు కొనియాడారు. ప్రతిపక్షంలో ఉండగా భూములు తిరిగి ఇచ్చేస్తానని సెజ్ భూముల్లో ఏరువాక చేసిన చంద్రబాబు తీరా గద్దె నెక్కాక అక్రమ కేసులు పెట్టించి రైతుల భూములు లాగేసుకున్నారని మండిపడ్డారు. పోలీసు కేసులు, జైలు జీవితం, నిత్యం నిర్బంధాల మధ్య తమ కుటుంబాలను అనుక్షణం వేదనకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత ఆ భూములను కాకినాడ సెజ్ ప్రధాన ప్రమోటర్ కేవీ రావు, జీఎంఆర్లకు చంద్రబాబు కారుచౌకగా కట్టబెట్టారని దుమ్మెత్తిపోశారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం తమ పీకలమీద కత్తిపెట్టి ఎకరం రూ.5 లక్షలు, రూ.9 లక్షలకే కొట్టేస్తే.. ఇచ్చిన మాట కోసం జగన్ ఆ భూములు తమకు తిరిగి ఇచ్చేసి దేవుడయ్యారని కొనియాడారు. జగన్ తిరిగిచ్చిన భూముల విలువ ఇప్పుడు ఎకరం రూ.రెండు కోట్ల నుంచి రూ.ఐదు కోట్లు ఉందన్నారు. అలాంటి జగన్ను దోషిగా చూపించేందుకు చంద్రబాబు అండ్ కో, ఎల్లో మీడియా కుట్రలు చేస్తున్నాయని, ఈనాడు పత్రిక అసత్యాలు వండివారుస్తోందని ధ్వజమెత్తారు. శనివారం కాకినాడలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగా గీతలతో కలిసి రైతులు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు మాటమార్చారు.. ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట.. అధికారంలోకి వచ్చాక ఇంకోమాట.. ఇదీ చంద్రబాబు తీరు. మా భూములు వెనక్కి ఇవ్వకుండా ఆయన మాట మార్చారు. తర్వాత మా ప్రాంతానికి వచ్చిన వైఎస్ జగన్ మా బాధలను తెలుసుకుని అధికారంలోకి వచ్చాక కమిటీ వేసి భూములు వెనక్కి ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక రైతులు కోరుకున్న ఆరు గ్రామాలను వదిలేయడంతోపాటు డబ్బు తీసుకోని రైతుల భూములను కూడా వదిలివేశారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా ఆయన చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. భూములపై ఈనాడు తప్పుడు రాతలు రాయడం అన్యాయం. – బావిశెట్టి నారాయణస్వామి, సెజ్ బాధిత రైతు నాయకుడు, రావివారిపోడు, యు.కొత్తపల్లి మండలం వైఎస్ జగన్ పెట్టిన భిక్ష మాకు ఎకరం భూమి ఉంది. వైఎస్ జగన్ మాకు పెట్టిన భిక్ష ఇది. ఈ రోజు ఎకరం రూ.5 కోట్లు పలుకుతోంది. కన్నబాబు, వంగా గీత, దాడిశెట్టి రాజా రైతులకు అండగా నిలిచారు. వారికి రుణపడి ఉంటాం. వైఎస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2,180 ఎకరాలు వెనక్కి ఇచ్చారు. – మేడిబోయిన కృష్ణ, రమణక్కపేట, కొత్తపల్లి మండలం కేవీ రావుపై కేసు పెట్టాలి.. పరిశ్రమలు పెడతామంటూ మా భూములపైనే రుణాలు తీసుకుని మా భూములనే కేవీ రావు అనే వ్యక్తి కొన్నారు. మా భూములు కొన్నాక ఎకరాకు రూ.6 లక్షలు చొప్పున బ్యాంకులో లోను తీసుకుని రూ.3 లక్షలు మాత్రమే రైతుకు ఇచ్చారు. మిగతా రూ.3 లక్షలు కేవీ రావు తన వద్దే ఉంచుకున్నారు. ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తూ 8,500 ఎకరాలపై రుణాలు తీసుకున్నాడు.. ఒక్క పరిశ్రమ కూడా పెట్టలేదు.. సెజ్ను జీఎంఆర్కు అప్పగించారు. అలాంటి కేవీ రావుపై కేసు పెట్టి, లుక్ అవుట్ నోటీసు ఇవ్వాలి. జీఎంఆర్ కూడా పరిశ్రమలు పెట్టకుండా మా భూములపై రూ.2500 కోట్లు అప్పు తెచ్చుకుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మా ప్రాంత రైతుల జీవితాలను నాశనం చేశారు. – వై.ప్రసాదరెడ్డి, సెజ్ ఫార్మర్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు, నాగులాపల్లి, కొత్తపల్లి మండలం రైతులకు న్యాయం చేశారు.. సెజ్ రైతులకు, మా గ్రామాలన్నింటికీ వైఎస్ జగన్ న్యాయం చేశారు. పాదయాత్రలో సెజ్ రైతుల బాధలు తెలుసుకుని పిఠాపురం సభలో రైతులకు ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక నెరవేర్చారు. ఆయన దయ వల్ల లక్షలు విలువ గల భూములు మాకు దక్కాయి. – బోనం రాముడు, సెజ్ వ్యతిరేక పోరాట కమిటీ కార్యదర్శి, రావివారిపోడు జగన్ లేకపోతే ఆత్మహత్యలే.. మా భూములు వెనక్కి తిరిగి ఇచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి రుణం తీర్చుకోలేం. ఆయనే లేకపోతే మా కుటుంబాలకు ఆత్మహత్యలే శరణ్యమయ్యేవి. ఈనాడు పేపర్లో తప్పుడు రాతలు రాయడం సరికాదు. – చింతపల్లి బుచ్చియ్య, సెజ్ రైతు, నాగులాపల్లి జగన్ వల్లే మా కుటుంబాల్లో వెలుగులు మా కుటుంబాలకు గత సీఎం వైఎస్ జగన్ వెలుగునిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు భూములను ఇచ్చారు. వాటిని ఎవరికైనా అమ్ముకునే హక్కును కూడా కల్పించారు. చిత్రమేమిటంటే కాకినాడ సెజ్లో రైతులు, ఎస్సీలు, బీసీలు చాలా నష్టపోయారని ముఖ్యమంత్రికి యనమల రామకృష్ణుడు లెటర్ రాశారంట.. అసలు ఎవరి వల్ల నష్టపోయారు? పోర్టు ఆధారిత పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేయకపోతే ఎందుకు ప్రశ్నించలేదు? చంద్రబాబుతో ఏరువాక సాగించి ఎందుకు ఆదుకోలేదు? సీబీఐ విచారణ చేయమని తాము కోరితే రూ.2 లక్షలు అదనంగా ఇచ్చి కొత్త చట్టం ప్రకారం పరిహారం ముట్టిందని రైతులకు అన్యాయం చేయలేదా? ఆరోజు ఆర్థిక మంత్రిగా యనమల సమావేశాలు పెట్టి భూములు ఖాళీ చేయించి సెజ్కు అప్పగించారు. ఈరోజు మా భూములు మేము అమ్ముకుంటే అభాండాలు వేస్తున్నారు. మమ్మల్ని బెదిరించి ఎవరూ భూములు కొనుగోలు చేయలేదు. – చింతా సూర్యనారాయణమూర్తి, కాకినాడ సెజ్ పోరాట కమిటీ కన్వినర్, మూలపేట, కొత్తపల్లి మండలం జగన్ వల్లే మా కుటుంబానికి రూ.4 కోట్లు కాకినాడ సెజ్కు వేల ఎకరాలు అవసరమా అన్న చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే సెజ్ను రద్దు చేస్తానన్నారు. రైతుల భూములు తిరిగి ఇచ్చివేస్తానని నమ్మించారు. తర్వాత అధికారంలోకి వచ్చి మాటతప్పారు. సెజ్లో పోయిన 8 ఎకరాలు వైఎస్ జగన్ వల్ల మాకు తిరిగొచ్చాయి. తద్వారా మా కుటుంబానికి రూ.4 కోట్లు కలిసి వచ్చింది. – కృష్ణారెడ్డి, సెజ్ బాధిత రైతు, నాగులాపల్లి చాలా మంచి జరిగింది.. చంద్రబాబు ప్రభుత్వం మా నాన్న సుబ్బారెడ్డిని 200 రోజులు జైలులో పెట్టి వేధించింది. దీంతో ఆయన చనిపోయారు. జగన్ ప్రభుత్వం వచ్చాక నాలుగు ఎకరాల మా భూమికి ప్రత్యామ్నాయంగా సాగర్మాల రోడ్డు పక్కన ఇచ్చారు. ఎకరా రూ.2 కోట్లు ధర పలుకుతోంది. మాకు చాలా మంచి జరిగింది. ఈనాడులో నేను అనని మాటలను అన్నట్టుగా రాశారు. – సత్యానందరెడ్డి, సెజ్ రైతు, రమణక్కపేట ఈనాడు రాతలు పచ్చి అబద్ధాలు.. జగన్ ప్రభుత్వంలో భూములను లాక్కున్నారని ఈనాడు పచ్చి అబద్ధాలను రాసింది. వైఎస్ జగన్ చేసిన మేలుకు రైతులు ఆయనకు పాలాభిõÙకం చేయాలి. కేవీ రావు, జీఎంఆర్ ప్రజాభిప్రాయ సేకరణకు రైతులను రానివ్వలేదు. అరబిందో మాత్రం రైతుల అభిప్రాయాలు సేకరించడమే కాకుండా దాదాపు రూ.4 వేల కోట్లతో ఇన్సులిన్ తయారు చేసే పరిశ్రమను పెట్టి రైతుల్లో నమ్మకం కలిగించింది. – పి.ధర్మరాజు, సెజ్ రైతు, పొన్నాడ, కొత్తపల్లి మండలం -
దళిత రైతులపై దౌర్జన్యం
చంద్రగిరి: తరతరాలుగా కుటుంబమంతా కలిసి ఆరుతడి పంటలను పండించుకుంటూ జీవనం గడుపుతున్న దళిత రైతులపై పెత్తందారులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్న భూమిని కాజేయాలని యత్నించారు. అడ్డుకున్న దళి త రైతులపై బెదిరింపులకు పాల్పడిన ఘ టన శనివారం తిరుపతి జిల్లా, చంద్రగిరి మండల పరిధిలోని నరసింగాపురంలో చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. నరసింగాపురం హరిజనవాడకు చెందిన కృష్ణయ్య కుమారులు శ్రీనివాస్, హరికుమార్, గోపాలకృష్ణ సర్వే నంబరు 321లోని సుమారు 20 సెంట్ల భూమిలో ఉమ్మడిగా సాగుచేసుకుంటున్నారు.ఈ క్రమంలో తమ భూమికి ఆనుకుని ఉన్న బుచ్చినాయుడుపల్సికి చెందిన చిట్టిబాబునాయుడు, మనోహర్నాయుడు అక్రమంగా ప్రవేశించి, జేసీబీ లతో హద్దులు తొలగించారని ఆవేదన వ్య క్తం చేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే కొంతమంది రౌడీలను తీసుకొచ్చి, తమపై దౌర్జన్యం చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నారని లబోదిబోమన్నారు. ఎన్నో ఏళ్లుగా భూమిలో సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తుంటే, ఇప్పుడు అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, మహిళలని కూడా చూడకుండా అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటూ ఆ వేదన వ్యక్తం చేశారు. పెసర, మినుము, జొన్న పంటలను ధ్వంసం చేయడంతో పాటు సుమారు 30 అడుగుల మేర జేసీ బీతో పంటను ధ్వంసం చేసినట్లు తెలి పారు. కాగా, అక్రమంగా జేసీబీతో హద్దులను తొలగిస్తుండడంతో శ్రీనివాస్, హరికుమార్, గోపాలకృష్ణలు జేసీబీకు అడ్డుగా పడుకుని నిరసనకు దిగారు. తాతముత్తాతల కాలం నుంచి ఉన్న భూమిని ఆక్రమించుకుని తమను వేధిస్తున్నారంటూ వారు తమ గోడు చెప్పుకున్నారు. ఇప్పటికే దీనిపై రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదు చేశామని, తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకోవడమే మార్గమంటూ బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాల వారిని పోలీసుస్టేషన్కు తీసుకెళ్లారు. -
దళారి అవతారమెత్తిన ఏపీ సర్కార్
-
ధాన్యం రైతుకు దగా!
సాక్షి, అమరావతి: ‘ఎందుకు ఇబ్బంది పడతారు. మిల్లరు చెప్పిన రేటుకు ధాన్యం ఇచ్చేయండి. మిల్లరు అనుమతిలేకుండా మీ ధాన్యం రోడ్డెక్కదు. మా చేతుల్లోనూ ఏమీలేదు..’ అంటూ ఆరుగాలం కష్టించి వరిపంట పండించిన అన్నదాతకు అండగా ఉండాల్సిన ప్రభుత్వమే వారిని ఇలా డీలాపరుస్తూ నిండా ముంచేస్తోంది.చరిత్రలో ఎన్నడూలేనివిధంగా దళారీగా మారి రైతుకు మద్దతు ధర దక్కకపోవడానికి కారణమవుతోంది. రైతుసేవా కేంద్రాల్లో అన్నదాతలకు ప్రభుత్వ సేవలు అందించకపోగా వాటిని దళారీలు, మిల్లర్లకు అడ్డాగా మార్చేసింది. దీంతో అన్ని ప్రాంతాల్లోనూ అన్నదాతలు మద్దతు ధర కోసం రోడ్డెక్కుతున్నారు. దళారీకి ‘ధర’హాసం..!ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం రైతులకు చుక్కలు చూపిస్తోంది. సకాలంలో ధాన్యాన్ని తరలించకుండా వారు దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి కల్పిస్తోంది. దీంతో దళారులు, మిల్లర్లు మద్దతు ధరకు భారీగా కోత పెడుతున్నారు. 75 కేజీల బస్తా సాధారణ రకానికి రూ.1,725, ఏ–గ్రేడ్కు రూ.1,740గా మద్దతు ధర నిర్ణయిస్తే.. తేమ శాతం పేరుతో మిల్లర్లు రూ.1,200–1,400కు పరిమితం చేస్తున్నారు. మళ్లీ తిరిగి అదే ధాన్యాన్ని.. అదే రైతు పేరుతో ప్రభుత్వానికి విక్రయించి పూర్తి మద్దతు ధర కొట్టేస్తున్నారు. ఇలా బస్తాకు రూ.300 నుంచి రూ.400 వరకు అన్నదాతలు నష్టపోతున్నారు. ఎకరాకు ఒక్కో రైతు సుమారు రూ.9వేలకు పైగా మద్దతు ధరను కోల్పోతున్నారు. పైగా.. రైతులకిచ్చే గన్నీ, లేబర్, ట్రాన్స్పోర్టు (జీఎల్టీ) ఊసేలేదు. ఫలితంగా వారిపై అదనపు భారం పడుతోంది. నిజానికి.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17 శాతం, అంతకంటే తక్కువ తేమ శాతం ఉంటే సంపూర్ణ మద్దతు ధర కల్పించాలి. కానీ, రైతుసేవా కేంద్రాల్లో తేమ పరీక్షలు చేయకపోవడంతో మిల్లర్లు పేట్రేగిపోయి రైతులను దోచేస్తున్నారు.చిక్కిపోతున్న ‘సన్నాల’ ధర..ఇక కూటమి ప్రభుత్వంలో సాధారణ రకాలకే మద్దతు ధర లేదంటే.. బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఉన్న సన్నాలు (ఫైన్ వెరైటీలు) ధర కూడా చిక్కిపోతోంది. గోదావరి డెల్టాలో బీపీటీ సాంబ మసూరి రకాన్ని వేసిన రైతులకు దళారులు చుక్కలు చూపిస్తున్నారు. కోసిన పంటను ఆరబెట్టుకుంటే 75 కిలో బస్తా రూ.2,500 వరకు వస్తుందని రైతులు ఆశించారు. కానీ, ఫెంగల్ తుపాను దెబ్బకు 75 కేజీల బస్తా రూ.1,400, రూ.1,500కి మించి పలకడంలేదు. కడప ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి. అలాగే, కృష్ణా డెల్టాలో అధికంగా ఎంటీయూ–1262, ఎంటీయూ–1318 సూపర్ఫైన్ వెరైటీ రకాలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయడంలేదు. తేమ శాతంవల్ల ధాన్యంలో ముక్కు విరుగుడు ఎక్కువగా ఉండటంతో మిల్లర్లు ధాన్యం తీసుకోవడానికి నిరాకరిస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. తక్కువ ధరకు ధాన్యం కొనే వ్యాపారస్తులపై కేసులు పెడతామని హూంకరిస్తోందే తప్ప.. ఒక్కరిపై కూడా అలా చేసిన దాఖలాల్లేవని రైతులు మండిపడుతున్నారు.కొనుగోళ్లు 50% కూడా లేవు..రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో 80 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఇందులో 50 శాతం కూడా ప్రభుత్వం కొనుగోలు చేయట్లేదు. ఎందుకంటే.. చాలా రైతుసేవా కేంద్రాల్లో అన్నదాతలు ధాన్యం తీసుకెళ్తే ‘టార్గెట్ అయిపోయింది. ప్రభుత్వం అనుమతిస్తే ధాన్యం కొంటాం.. లేదంటే దళారికి అమ్ముకోండి’ అనే సమాధానం వస్తోంది. ఉన్నతాధికారుల నుంచి దాదాపు సహాయ నిరాకరణే ఎదురవుతోంది. ఇప్పటికీ చాలా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. మరోవైపు.. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు విషయంలోనూ సర్కారు ప్రకటనలు గందరగోళ పరుస్తున్నాయి. 37 లక్షల టన్నులని ఒకసారి.. 32 లక్షల టన్నులని మరోసారి.. 35 లక్షల టన్నులు అంటూ ఇంకోసారి ఇలా పొంతనలేని ప్రకటనలు ఇవ్వడంపై రైతుల్లో ఆందోళన నెలకొంది. అప్పట్లో ప్రత్యేక రకంగా పరిగణించి..నిజానికి.. వాతావరణ పరిస్థితులను బట్టి ధాన్యం రకాల్లో ముక్క విరుగుడు సమస్య వస్తుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు రైతులకు నష్టంలేకుండా చర్యలు చేపట్టింది. ముక్క విరుగుడు ధాన్యాన్ని.. మొలక, రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని ప్రత్యేక రకంగా పరిగణించి పూర్తి మద్దతు ధరకు కొనుగోలు చేసింది. ఆ ధాన్యాన్ని బాయిల్డ్ మిల్లులకు తరలించి మిల్లర్లకు, రైతులకు నష్టంలేకుండా చూసింది. అలాగే, మిల్లర్ల మోసం నుంచి రైతులను కాపాడేందుకు.. మొబైల్ మిల్లింగ్ యంత్రాలు పెట్టి వ్యవసాయ క్షేత్రం వద్దే శాంపిల్ ధాన్యాన్ని మరాడించి ముక్క విరుగుడు శాతాన్ని పరిశీలించి స్వయంగా మిల్లుకు తరలించేది. కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ధాన్యం రవాణా వ్యవస్థ పూర్తిగా మిల్లర్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. మంత్రులకు నిరసన సెగ..ఎక్కడికక్కడ ధాన్యం రైతులు రోడ్డెక్కడంతో కూటమి ప్రభుత్వంలోని మంత్రుల్లో గుబులు మొదలైంది. జిల్లాల్లో పర్యటనలకు వెళ్లిన ప్రతిచోటా అన్నదాతలు నిలదీస్తుండడంతో కంగుతింటున్నారు. ఫెంగల్ తుపాను నేపథ్యంలో రైతాంగం అతలాకుతలమైతే ఒక్క మంత్రి కూడా స్పందించిందిలేదు. ఇక వాట్సాప్ ద్వారా రైతులు ‘హాయ్’ అని చెబితే గంటల వ్యవధిలోనే ధాన్యం కొనుగోలు చేస్తామని ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన ప్రకటన మాటలకే పరిమితమైంది. కృష్ణా జిల్లాలో ఆయన పర్యటించి.. రోడ్లపై ఉన్న ధాన్యాన్ని సాయంత్రానికల్లా కాటావేసి మిల్లులకు తరలించాలని చిటికలేసి మరీ చెప్పారు. కానీ, ఒక్క గింజ కూడా కాటా వేయలేదు. ఇక బాపట్ల జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి కొల్లూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించేందుకు గురువారం వెళ్తే.. ‘పండించిన పంటను కొనడానికి ముప్పతిప్పలు పెడుతున్నారు. మిల్లర్లే దళారులుగా మారి తక్కువ ధరకు ధాన్యం తీసుకుని రైతులను నట్టేట ముంచుతున్నారు’ అంటూ రైతులు తిరగబడడంతో మంత్రులు షాకయ్యారు. మరోవైపు.. సీఎం సైతం క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా మొక్కుబడి సమీక్షలు చేస్తుండటం గమనార్హం.‘కౌలు’కోలేని దెబ్బ!» ధాన్యం కొనుగోళ్లలో కౌలు రైతులకే భారీ నష్టం»పంట ఎంత నష్టానికి అమ్ముకున్నా పూర్తి కౌలు చెల్లించక తప్పని పరిస్థితి» పెట్టుబడి ఖర్చులు, కౌలు చెల్లించగా రైతుకు చి‘వరి’కి మిగిలేది అప్పేసాక్షి, అమరావతి : రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఒకవైపు కౌలు చెల్లించి, పెట్టుబడికి అప్పులుచేసి సాగుచేస్తే.. తీరా పంట చేతికొచ్చాక ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోలేక నానా అవస్థలు పడుతున్నారు. ఇదే అదనుగా దళారులు, మిల్లర్లు వారినీ ముంచేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం పాతిక, ముప్పై లక్షల మంది కౌలు రైతులు ఉంటారని అంచనా. కానీ, ఇటీవల ప్రభుత్వ అధికారిక ప్రకటనల ప్రకారం 16 లక్షల మందిని కౌలు రైతులుగా తేల్చారు. వారిలో 9.30 లక్షల మందికి పంట సాగు హక్కు పత్రాలు (సీసీఆర్సీ కార్డు) జారీచేశారు. వీరికే నామమాత్రంగా మద్దతు ధర దక్కుతోంది. అవిలేని కౌలు రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇదీ కౌలు రైతుల దుస్థితి..సాధారణంగా ఒక ఎకరా వరి సాగుకు రూ.35 వేలు వరకు ఖర్చవుతుంది. క్వింటా సాధారణ రకానికి కేంద్ర ప్రభుత్వ మద్దతు ధర రూ.2,300గా నిర్ణయించారు. ఈ లెక్కన సగటున 35–40 (ఒక్కోటి 45 కిలోలు) బస్తాల దిగుబడి వస్తే ఎకరాకు రూ.36,225 నుంచి రూ.41,400 రావాల్సి ఉంటుంది. కానీ, రూ.28,225 నుంచి రూ.32,400 మాత్రమే దక్కుతోంది. ఇందులో మళ్లీ కౌలు 15 బస్తాల సొమ్మును భూ యజమానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మద్దతు ధర ఎంత ఉందో అదే మొత్తాన్ని భూ యజమానికి ఇవ్వాల్సి వస్తోంది. అంటే.. సుమారు రూ.15 వేలు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన కౌలు రైతుకి రూ.21,225 నుంచి రూ.26,400 మాత్రమే మిగులుతోంది. ఖరీఫ్లో రూ.8,600 లోటు ఏర్పడుతోంది. ఈ లోటును రెండో పంటలో పూడ్చుకుంటే సరాసరి సరిపోతుంది. ఆ సమయంలోనూ అకాల విపత్తులు వచ్చి పంట నష్టపోతే కౌలు రైతుకు చి‘వరి’కి అప్పే మిగులుతోంది. మరోవైపు.. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ విధానం కౌలు రైతుల పాలిట శాపంగా మారుతోంది. వాస్తవ సాగుదారులైన కౌలు రైతుల్లో చాలామందికి గుర్తింపు కార్డుల్లేని కారణంగా వారి నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయబోమని తెగేసి చెబుతోంది. ఈ క్రమంలో దళారులు, మిల్లర్లు మద్దతు ధరను మరింత తగ్గిస్తున్నారు. కౌలు రైతుల్లో కొందరు భూయజమానుల పేరుతో విక్రయిద్దామంటే కొనుగోలు సమయంలో భూయజమాని వేలిముద్రలు తప్పనిసరి చేశారు. పైగా.. చాలామంది కౌలుకు ఇచ్చే వ్యక్తులు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉంటున్నారు. వాళ్లు వచ్చే వీలులేకపోవడంతో ప్రభుత్వానికి అమ్ముకోలేక కౌలురైతులు అవస్థలు పడుతున్నారు.తేమ శాతం పేరుతో దోపిడీ..రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగానే కౌలురైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. భూయజమానులతో మాట్లాడి కౌలురైతులు పంటలు అమ్ముకోవడానికి అవకాశం కల్పించాలి. సీసీఆర్సీ కార్డులు లేనందున భూ యజమానులు పేరుపై పంటను విక్రయించుకోవడానికి వీలుండట్లేదు. ఇదే అదనుగా దళారులు మద్దతు ధరను దారుణంగా తగ్గిస్తున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో 75 కిలో బస్తాను రూ.1,300 నుంచి రూ.1,400కే అమ్ముకుని తీవ్రంగా నష్టపోతున్నారు. – పి.జమలయ్య, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం -
పూచీకత్తు లేకుండా రైతులకు రూ.2 లక్షలు రుణం
చిన్న, సన్నకారు రైతులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పెద్ద ఊరట కల్పించింది. రైతులకు పూచీకత్తు లేకుండా ఇచ్చే రుణాల పరిమితిని రూ.1.66 లక్షల నుండి రూ. 2 లక్షలకు పెంచింది. ద్రవ్య విధాన కమిటీ సమావేశం పూర్తయిన అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తన ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు.“వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు, మొత్తం ద్రవ్యోల్బణం పెరుగుదలను పరిగణనలోకి తీసుకొని తాకట్టు రహిత వ్యవసాయ రుణాల పరిమితిని రూ. 1.6 లక్షల నుండి రూ. 2 లక్షలకు పెంచాలని నిర్ణయించడం జరిగింది. ఇది చిన్న, సన్నకారు రైతులకు రుణ లభ్యతను మరింత పెంచుతుంది.’’ అని శక్తికాంత దాస్ పేర్కొన్నారు.తాకట్టు రహిత వ్యవసాయ రుణాల పరిమితి పెంపునకు సంబంధించి ఆర్బీఐ త్వరలో ప్రత్యేక సర్క్యులర్ను జారీ చేయనుంది. ఈ రుణాలను రుణాలు పొందడానికి రైతులు హామీగా ఎలాంటి ఆస్తులను తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ తాకట్టు రహిత వ్యవసాయ రుణాల పరిమితిని చివరిసారిగా 2019లో సెంట్రల్ బ్యాంక్ సవరించింది. అప్పట్లో రూ. 1 లక్ష నుండి రూ. 1.6 లక్షలకు పెంచింది.రైతుల మేలు కోసం..చిన్న, సన్నకారు రైతుల కష్టాలు, ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం 2019 ఫిబ్రవరిలో రూ.3 లక్షల లోపు ఉన్న క్రాప్ లోన్లకు ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్, తనిఖీ, లెడ్జర్ ఫోలియో ఛార్జీలను కూడా మాఫీ చేసింది. అంతకు ముందు 2014లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల (సిఐసి) నుండి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లను (సిఐఆర్) పొందేందుకు తగిన నిబంధనలను తమ క్రెడిట్ అప్రైజల్ ప్రాసెస్లు/లోన్ పాలసీలలో చేర్చాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ సూచించింది. తద్వారా క్రెడిట్ నిర్ణయాలు సిస్టమ్లో అందుబాటులో ఉన్న సమాచారంపై ఆధారపడి ఉంటాయి. -
రైతులపైకి టియర్ గ్యాస్
శంభు: పంజాబ్–హరియాణా సరిహద్దుల్లోని శంభు వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం వంటి పలు డిమాండ్లతో రైతు సంఘాలు ఢిల్లీ చలో కార్యక్రమాన్ని ప్రకటించడం తెలిసిందే. ఇందులో భాగంగా రైతులు, రైతు సంఘాల నేతలతో కూడిన 101 మందితో కూడిన రైతు జాతా సరిగ్గా మధ్యాహ్నం ఒంటిగంటకు శంభులోని నిరసన దీక్షా శిబిరం నుంచి కాలినడకన బయలుదేరింది. సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ సంఘ్ జెండాలను చేబూనిన రైతులు కొన్ని మీటర్ల దూరం మాత్రమే వెళ్లగలిగారు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని, ముందుకు రావద్దని పోలీసులు వారిని పదేపదే కోరారు. అయినప్పటికీ, రైతులు పలు అంచెల బారికేడ్లను దాటుకుని, వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుగా ఏర్పాటు చేసిన ఇనుప మేకులను, ఇనుప ముళ్ల కంచెను తొలగించారు. సిమెంట్ బారికేడ్లనూ దాటేందుకు యత్నించారు. ఇనుప కంచెను కొందరు ఘగ్గర్ నదిలోకి దొర్లించారు. దీంతో, పోలీసులు వారిపైకి పలు రౌండ్ల టియర్ గ్యాస్ను ప్రయోగించారు. రైతులు టియర్ గ్యాస్ నుంచి రక్షణ కోసం తడి గన్నీ బ్యాగులతో కళ్లు, ముఖాన్ని కప్పేసుకున్నారు. బారికేడ్లపై నుంచి వస్తున్న వారిపైకి పోలీసులు లాఠీలు ఝళిపించారు. టియర్ గ్యాస్తో గాయపడిన కనీసం ఆరుగురు రైతులను అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలించారు. రైతులు గాయపడిన నేపథ్యంలో జాతాను శుక్రవారానికి నిలిపి వేస్తున్నట్లు రైతు నేత సర్వాన్ సింగ్ చెప్పారు. తదుపరి కార్యాచరణపై చర్చించుకుని, నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, అంబాలా జిల్లాలో గురువారం నుంచే నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. ఐదు, అంతకంటే ఎక్కువ మంది ఒకే చోట గుమికూడరాదని ప్రకటించారు. ముందు జాగ్రత్తగా శుక్రవారం జిల్లాలోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అంబాలా జిల్లాలోని 11 గ్రామాల పరిధిలో ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు. పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను ఆ మార్గంలో మోహరించారు. -
చంద్రబాబు ప్రభుత్వంపై అన్నదాతల ఆగ్రహం
-
అన్నీ కోతలే.. కొన్నది ఏదీ!
అవనిగడ్డ/సాక్షి ప్రతినిధి, బాపట్ల/బండి ఆత్మకూరు: రాష్ట్రంలో ధాన్యం రైతుల విషయంలో ప్రభుత్వం చెబుతున్నది ఒకటి.. వాస్తవంగా క్షేత్ర స్థాయిలో జరుగుతున్నది మరొకటి. ఏ ఒక్క రైతుకూ పూర్తి స్థాయిలో కనీస మద్దతు ధర దక్కడం లేదు. ప్రభుత్వమే ధాన్యం దళారీగా మారి.. రైతులకు, మిల్లర్లకు మధ్య మధ్యవర్తిత్వం నడుపుతుంటే అన్నదాతలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది? మిల్లర్లు చెప్పిన ధరకే ధాన్యం ఇచ్చేయాలని ఒత్తిడి తీసుకు రావడం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా, ఎక్కడైనా జరిగిందా.. అని రైతులు మండిపడుతున్నారు. రెండు మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. ‘మొన్నటి ఇబ్బందులు చెప్పొద్దు. ఈ రోజే మీ సమస్యను పరిష్కరిస్తాం. ఎన్ని సంచులు కావాలంటే అన్ని... ఎన్ని లారీలు కావాలంటే అన్ని లారీలు పంపిస్తాం. దళారులకు ధాన్యం అమ్మొద్దు. ఈ రోజు సాయంత్రానికే మీ ధాన్యం కొనుగోలు చేసి తీరతాం’ అని మంత్రి మనోహర్ బుధవారం అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని మాజేరు, లంకపల్లి, లక్ష్మీపురం, చల్లపల్లి, కప్తానుపాలెం, పెదప్రోలు గ్రామాల్లో ధాన్యం రాశులను పరిశీలించి రైతులకు హామీ ఇచ్చారు.గురువారం రాత్రి వరకు కూడా అటు వైపు ఏ అధికారీ కన్నెత్తి చూడక పోవడం గమనార్హం. చేత కానప్పుడు ఇలాంటి వాగ్దానాలు చేయకూడదని రైతులు హితవు పలుకుతున్నారు. ‘15 రోజుల క్రితం కోత కోయించి ధాన్యం తీసుకొచ్చి రోడ్డు పక్కన ఆరబెట్టుకుంటున్నాం. వర్షం వచ్చి ధాన్యం తడిస్తే ఎందుకూ పనికిరావు. ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని చేతులెత్తి మంత్రిని వేడుకున్నా. బుధవారం సాయంత్రానికి కొనేస్తామన్నారు. గురువారం సాయంత్రం వరకు ఎవరూ పత్తాలేరు. రైతులపై కనీస కనికరం లేదు’ అని లంకపల్లికి చెందిన మోటుపల్లి జయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. బిత్తరపోయిన మంత్రులుబాపట్ల జిల్లా కొల్లూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం పరిశీలించేందుకు వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి, మంత్రి గొట్టిపాటి రవికుమార్కు ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా దోపిడీకి గురవుతున్న తీరును స్థానిక రైతులు ఏకరువు పెట్టారు. ‘ఏం బాబూ.. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయా’ అని మంత్రి కొలుసు పార్థసారథి ఆరా తీశారు. దీనికి కౌలు రైతు ప్రసాదరావు సమాధానమిస్తూ.. ‘ఏంటండీ కొనేది? పండించిన పంటను కొనడానికి ముప్ప తిప్పలు పెడుతున్నారు. మిల్లర్లే దళారులుగా మారి తక్కువ ధరకు ధాన్యం తీసుకుని రైతులను నట్టేట ముంచుతున్నారు. కొల్లూరులో 6 ఎకరాల్లో పండించిన ధాన్యాన్ని మిల్లుకు తెచ్చాం. ధాన్యం కొనాలని కోరుతూ తిరగని రోజు లేదు. ఈకేవైసీ చేయించిన పత్రాలు చూపెట్టా. తేమ శాతం 21 ఉన్నా.. మిల్లర్లు వారి కింద పనిచేసే బ్రోకర్లను అడ్డం పెట్టుకుని బస్తా (75 కిలోలు) రూ.1,200కే అడుగుతున్నారు’ అని అవస్థలను ఏకరువు పెట్టాడు. దీంతో బిత్తరపోయిన మంత్రులు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో తీవ్రంగా నష్టపోతున్నామంటూ రైతులు గురువారం నంద్యాల జిల్లా సంతజూటూరు గ్రామంలో రోడ్డెక్కారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజశేఖర్, రైతు సంఘం నాయకులు వెంకట కృష్ణారెడ్డి, సుధాకర్ రెడ్డి, శ్రీనివాసులు ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం సన్న రకం వడ్లు బస్తా రూ.1,300 నుంచి రూ.1,400 ధర పలుకుతోందని, గత ప్రభుత్వం క్వింటాకు రూ.2,600 మద్దతు ధర ప్రకటించడంతో రూ. 2,500 నుండి రూ.2,900 వరకు ధర పలికిందన్నారు. గత ప్రభుత్వంలోనే మేలు జరిగిందని గుర్తు చేశారు. -
నాదెండ్ల మనోహర్ కు అడుగడుగునా చేదు అనుభవం
-
మాయమాటలు చెప్పి తప్పించుకున్న నాదెండ్ల.. ధాన్యం కొనుగోళ్లపై రైతుల ఆందోళన
-
ధాన్యం దళారీగా సర్కారు
సాక్షి, అమరావతి: ‘ప్రభుత్వం ధాన్యం దళారీగా మారింది. రైతులకు, మిల్లర్లకు మధ్య మధ్యవర్తిత్వం నడుపుతోంది. మిల్లర్లు చెప్పిన ధరకు ధాన్యం ఇచ్చేయాలంటూ రైతులపై ఒత్తిడి తీసుకొస్తోంది. రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకూ పూర్తిస్థాయిలో కనీస మద్దతు ధర దక్కడంలేదు. చరిత్రలో ఎప్పుడూ ఇంత దారుణమైన పరిస్థితులు చూడలేదు’.. అంటూ అన్నదాతలు మండిపడుతున్నారు. తేమశాతంతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. గడిచిన రెండ్రోజులుగా మండల తహసీల్దార్ కార్యాలయాలు, ఆర్బీకేలు, రైతుక్షేత్రాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం రాశుల ఎదుట నిరసనలు వ్యక్తంచేసిన రైతులు బుధవారం విజయవాడలోని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన వివిధ మండలాల రైతులు, కౌలు రైతులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం పౌరసరఫరాల సంస్థ ఉన్నతాధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బాధిత రైతులు, వివిధ రైతు సంఘాల నేతలు మాట్లాడారు. వారు ఏమన్నారంటే..మంత్రి చిటికలేసినా ధాన్యం కదల్లేదు..కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించి, రోడ్లపై ఉన్న ధాన్యాన్ని సాయంత్రానికి కల్లా కాటావేసి మిల్లులకు తరలించాలని నాలుగు రోజుల క్రితం అధికారులకు చిటకలేసి మరీ చెప్పారు. రోజులు గడుస్తున్నా గింజ ధాన్యం కూడా కాటా వేయలేదు. మంత్రులు, ఉన్నతాధికారుల ఆదేశాలు క్షేత్రస్థాయిలో పట్టించుకోవడంలేదు. వాళ్లు పర్యటించిన చోట కూడా ధాన్యం కాటా వేయడం కానీ, మిల్లులకు తోలడంగానీ జరగడంలేదు. మారుమూల గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు ‘మద్దతు’ దక్కడంలేదు..తేమ శాతం ఎంతున్నా కొంటామంటున్నారు. ఆ తర్వాత 17 శాతం దాటితే ఐదు కేజీల కోత వేసి మిగిలిన ధాన్యాన్ని కొంటామన్నారు. పూర్తిస్థాయి మద్దతు ధర కల్పించాల్సిన ప్రభుత్వమే తరుగు మినహాయించి కొంటామని చెప్పడం దారుణం. తుపాను, వర్షాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తేమ శాతం 20 నుంచి 24 శాతం వస్తోంది. రెండు శాతమో, ఐదు శాతమో కట్ చేసి మిగిలిన ధాన్యానికి మద్దతు ధర ప్రకారం లెక్కిస్తే 75 కేజీల బస్తాకు రూ.1,670 చొప్పున ఇవ్వాలి. కానీ, రూ.1,470–1,500కు మించి ఇవ్వడంలేదు. పైగా.. ధాన్యం బాగోలేదంటూ మిల్లర్లు పేచీ పెడుతున్నారు. కొనేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. ఎంటీయూ 1,262, 1,318 వంటి ఫైన్ వెరైటీ ధాన్యానికి కూడా మద్దతు లభించని దుస్థితి ఏర్పడింది.రైతులకు–మిల్లర్లకు మధ్య బ్రోకర్లుగా మారారు..నిజానికి.. రైతుసేవా కేంద్రాల్లో తేమ శాతాన్ని పరీక్షించాలి. అక్కడ నిర్ధారించే దానినే ప్రామాణికంగా తీసుకుని ధరను నిర్ణయించి అదే ధరకు కొనుగోలు చేయాలి. కానీ, ఎక్కడా ఆ పరిస్థితిలేదు. ఆర్ఎస్కేలకు వెళ్తుంటే తేమ శాతం కూడా చూడడంలేదు. ఏ మిల్లుకు వెళ్తారని అడిగి అక్కడకు పంపించేస్తున్నారు. మిల్లు వాళ్లు ఏ ధర నిర్ణయిస్తారో ఆ ధరకు అమ్ముకోండంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇది చాలా దారుణం. ఇది రైతాంగాన్ని మిల్లర్లు దోచుకునేందుకు ఉపయోగపడే పద్ధతే తప్ప రైతులకు మేలుచేసే విధానం కాదు. ఇక వాట్సప్లో ‘హాయ్’ అని మెసేజ్ పెడితే చాలు క్షణాల్లో మీ ధాన్యం కొనేస్తామంటున్నారు. కానీ, ఆచరణలో ఇదెక్కడా అమలుకు నోచుకోవడంలేదు.ఒక్క ప్రైవేటు వ్యాపారిపైనైనా కేసు పెట్టారా?ఇక ప్రైవేటు వ్యాపారులు కొనే ధాన్యాన్ని ప్రభుత్వం ఎందుకు కొనడంలేదో అర్థం కావడంలేదు. తక్కువ ధరకు కొనే వ్యాపారస్తులపై కేసులు పెడతామని చెప్పారుగానీ.. రాష్ట్రంలో ఒక్క ధాన్యం వ్యాపారిపైనైనా కేసు పెట్టారా? ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు తక్కువ రేటుకు ధాన్యం కొంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. పోనీ ప్రభుత్వమైనా కొంటుందా అంటే అదీలేదు. గతేడాది కోసిన ధాన్యాన్ని కోసినట్లుగానే తీసుకెళ్లారు.. ప్రతీ రైతుకూ మద్దతు ధర లభించింది. కానీ, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితిలేదు. ధర్నాలో ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. హరిబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు టీవీ లక్ష్మణస్వామి, కృష్ణాజిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కే. శివనాగేంద్ర, పంచకర్ల రంగారావు, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పీవీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.ఇలా అయితే ఎండ్రిన్ తాగి చావాలి..ఏడెకరాల్లో వరి వేశాం. పంట కోసి 15 రోజులైంది. తేమ 17 శాతం ఉంది. 20 శాతమైనా తీసుకుంటామన్నారు. కానీ తీసుకోలేదు. బేరగాళ్లు వచ్చి 75 కేజీల బస్తాకు రూ.1,450 ఇస్తామన్నారు. మా రైతు రూ.1,740 చొప్పున లెక్కగట్టి కౌలు ఇవ్వాలంటున్నారు. ఇలా అయితే మా చేతి డబ్బులు పెట్టుకోవాలి. పైగా పంటను కాపాడుకునేందుకు పరదాలకు రోజుకు రూ.2వేలు ఖర్చవుతోంది. డబ్బులు కట్టలేక చచ్చిపోతున్నాం. ఇలా అయితే ఎండ్రిన్ తాగి చావడం తప్ప వేరే దారిలేదు.– పొద్దుటూరు ప్రసాద్, గొడవర్రు. కంకిపాడు మండలం, కృష్ణాజిల్లాఇలా అయితే కౌలు రైతులు బతికేదెలా?నేను మూడెకరాల్లో వరి వేశాను. గతేడాదితో పోలిస్తే ఎకరాకు ఐదు బస్తాలు తగ్గింది. తేమ శాతం తక్కువగానే ఉన్నప్పటికీ ఈ రకం ధాన్యాన్ని కొనడంలేదు. ఆర్బీకేల్లోనే 20–25 శాతం ఉంటే 1,450 ఇస్తామంటున్నారు.బయట వాళ్లు కొనడం లేదు. పంటను కాపాడుకునేందుకు పరదాల కోసం రోజుకు ఎకరాకు రూ.300–500 చొప్పున చెల్లిస్తున్నాం. ఇలా అయితే కౌలురైతులు బతికేదెలా? కోసూరి శివనాగేంద్ర, గడ్డిపాడు, పమిడిముక్కల మండలం, కృష్ణాజిల్లాగతేడాది మద్దతు ధర వచ్చింది..ఎనిమిది ఎకరాల్లో వరికోసి 10 రోజులైంది. తేమ 15.5 శాతం ఉంది. మిల్లుకు పంపిస్తామన్నారు. కానీ ఎవరూ రాలేదు. మళ్లీ వెళ్లి అడిగితే మిల్లు దగ్గరకు వెళ్లండి అంటున్నారు. బేరగాళ్లు రూ.1,400 ఇస్తామంటున్నారు. అధికారులు పట్టించుకోవడంలేదు. గతేడాది కోసిన వెంటనే 75 కేజీల బస్తాకు రూ.1,630కు కొన్నారు. ఈ ఏడాది కొనేవాడులేడు. 10 రోజులుగా రోడ్డుపైనే ధాన్యం ఉంది. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – గెద్దా నరేంద్ర, గొడవర్రు, కంకిపాడు మండలం, కృష్ణాజిల్లానష్టానికి తోలాల్సి వస్తోంది..ఐదెకరాల్లో వరివేసా. ఎకరాకు 30 బస్తాలొచ్చింది. గొడవర్రు ఆర్ఎస్కు తీసుకెళ్తే 15.4% తేమ వచ్చింది. రేటు చెప్పలేదు. 90 బస్తాలు మిల్లుకు తోలారు. అక్కడ 75 కేజీల బస్తాకు రూ.1,600 కు మించి ఇవ్వమని తెగేసి చెప్పారు. ఆర్ఎస్కే సిబ్బందికి చెబితే పట్టించుకోలేదు. చేసేది లేక బస్తాకు రూ.130 చొప్పున నష్టానికి మిల్లుకు తోలాల్సి వచ్చింది.– గెడ్డం రాజా, గొడవర్రు, కృష్ణాజిల్లా