breaking news
Farmers
-
యూరియా ఉన్నా.. రైతుకు సున్నా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యూరియా కొరత లేదని ప్రభుత్వం ప్రకటిస్తున్నా, నాలుగు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా యూరియా నిల్వలున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు యూరియా దొరకడం లేదు. దాదాపు 60 శాతానికి పైగా నిల్వలు మార్క్ఫెడ్ గోదాముల్లోనే మూలుగుతున్నా..రైతులకు వీటిని సరఫరా చేసే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (ప్యాక్స్లు), సహకార సంఘాలకు యూరి యా రావడం లేదు. దీంతో రైతులు ఎరువుల కోసం దుకాణాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఒకవైపు కేంద్రం నుంచి రావాల్సిన ఎరువులు పూర్తిస్థాయిలో రాలేదు. మరోవైపు వచి్చన నిల్వలు రైతులకు అందడం లేదు. ముఖ్యంగా ప్యాక్స్ల పాలకమండళ్ల తీరుతో యూరియా రైతులకు చేరడం లేదు. పుష్కలంగా ఉన్నా..‘అందని ద్రాక్ష’ రాష్ట్రంలో ఈనెల 22 నాటికి 3.91 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అందులో 2.56 లక్షల టన్నుల యూరియా మార్క్ఫెడ్ గోదాముల్లోనే ఉంది. రైతులకు నేరుగా అందుబాటులో ఉండే డీలర్ల వద్ద 94 వేల టన్నులు, సహకార సంఘాల వద్ద 25 వేల టన్నులు ఉండగా, ఆయా ఎరువుల కంపెనీల గోడౌన్లలో మరో 16 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఉంది. ఈ విధంగా ప్రభుత్వ లెక్కల్లో మాత్రమే యూరియా పుష్కలంగా ఉంది. కానీ అది రైతులకు మాత్రం అందని ద్రాక్షగా మారింది. కేంద్ర ప్రభుత్వం కేటాయించే యూరియా రైల్వే ర్యాక్ల ద్వారా రాష్ట్రానికి చేరిన వెంటనే అందులోని 60 శాతం యూరియాను మార్క్ఫెడ్ గోదాములకు తరలిస్తారు. మిగతా 40 శాతం వ్యవసాయ శాఖ ద్వారా ప్రైవేటు వ్యాపారులకు పంపించడం జరుగుతుంది. ప్రైవేటు దుకాణాలను చూపిస్తున్న యాప్ ప్రతి ఖరీఫ్ సీజన్లో ప్యాక్స్లు, సహకార సంఘాలు ఇండెంట్ పెడితే మార్క్ఫెడ్ యూరియా సరఫరా చేస్తుంది. ఇందుకోసం ఆయా సహకార సంఘాలు ఇండెంట్ ఇవ్వాలి. అయితే ప్రస్తుతం ప్యాక్స్కు కొత్త పాలక మండళ్ల విషయంలో అయోమయం నెలకొంది, కొత్తగా సంఘాలు ఏర్పాటయ్యేంత వరకు పాత పాలక మండళ్లనే కొనసాగించాలని హైకోర్టు తీర్పు చెప్పినా యూరియా ఇండెంట్లపై పాలకమండళ్లు దృష్టి పెట్టడం లేదు.ప్యాక్స్ సీఈవోలు కూడా యూరియా బాధలు తమకెందుకులే అనే ధోరణిలో ఉన్నారు. ఈ కారణంగానే ప్యాక్స్కు యూరియా తగినంత వెళ్లడం లేదు. కేవలం 25 వేల మెట్రిక్ టన్నులు (5.64 లక్షల బస్తాలు) మాత్రమే సహకార సంఘాల వద్ద ఉండగా.. మార్క్ఫెడ్ గోదాముల్లో 56.74 లక్షల బస్తాల (2.56లక్షల మెట్రిక్ టన్నులు) నిల్వలు ఉన్నాయి. మార్క్ఫెడ్ గోదాముల నుంచి జిల్లాలకు, అక్కడి నుంచి ప్యాక్స్ కేంద్రాలకు సరఫరా జరగకపోవడంతో రైతులు యాప్లో యూరియాను బుక్ చేయగానే దగ్గర్లోని ప్రైవేట్ దుకాణాలను చూపెడుతోంది. జూలైలో డిమాండ్ భారీగా పెరిగే చాన్స్ డీలర్లకు కూడా పరిమిత సరఫరా కారణంగా యూరియా కోసం పోటీ నెలకొంది. యాప్ ఓపెన్ చేసినప్పుడు స్టాక్ ఉన్నట్లు చూపించి, కొద్ది నిమిషాల్లోనే నోస్టాక్ అని చూపిస్తున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ఎరువుల వ్యాపారులు సైతం తమకు అవసరమైన మేర స్టాక్ అందడం లేదని చెబుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే నాలుగో వంతు కూడా ఈసారి సాగు కాలేదు.పత్తి పంట కేవలం ఐదున్నర లక్షల ఎకరాల్లోనే సాగు జరగగా, వరి కేవలం 11వేల ఎకరాల్లోనే సాగైంది. కానీ యూరియా కోసం మాత్రం గత సంవత్సరంతో పోటీ పడి మరీ కొనుగోలు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ లెక్కలు చెపుతున్నాయి. పంటల సాగు లేకపోయినా, భవిష్యత్తులో యూరియా దొరుకుతుందో లేదో అనే భయంతో రైతులు ముందుస్తుగానే కొనుగోలు చేస్తున్నారని వ్యవసాయ శాఖ చెబుతోంది.అయితే వరి ధాన్యం, మొక్కజొన్న, పత్తి సాగు గరిష్ట స్థాయికి చేరే జూలైలో యూరియా అవసరం భారీగా పెరగనుంది. మార్క్ఫెడ్ గోదాముల్లో ఉన్న నిల్వలను వెంటనే జిల్లాలకు తరలించి, ప్యాక్స్లు, సహకార సంఘాల ద్వారా రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోకపోతే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. -
మామిడి గుజ్జు ఫ్యాక్టరీ వద్ద యువరైతు ఆత్మహత్యాయత్నం
గంగాధర నెల్లూరు: చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల దుస్థితి దారుణంగా తయారైంది. సీరియల్ నంబర్ కోసం నాలుగు రోజులుగా గుజ్జు ఫ్యాక్టరీ వద్ద వేచి చూసిన ఓ యువరైతు చివరికి ఫ్యాక్టరీ గేటు వద్దే ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే.. గంగాధర నెల్లూరు మండలం బొమ్మవారిపల్లికి చెందిన యువరైతు లోకేశ్ నాయుడు నాలుగు రోజుల క్రితం మామిడి లోడుతో జైన్ మామిడి గుజ్జు పరిశ్రమకు చేరుకున్నాడు. వరుసలో ఉన్నప్పటికీ ఇప్పటివరకు సీరియల్ నంబర్ ఇవ్వలేదు. కానీ అర్ధరాత్రి వేళ సిఫారసులతో వచ్చిన వాహనాలను వరుసగా ఫ్యాక్టరీలోకి వెళ్తుండటంతో ప్రశ్నించగా, అక్కడి సిబ్బంది, దళారులు ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ దురుసుగా ప్రవర్తించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అవమానంతో కుంగిపోయిన లోకేశ్ ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న రైతులు అప్రమత్తమై అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో అక్కడున్న రైతులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ఫ్యాక్టరీ లోపల బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. -
రాజధాని రైతు హక్కుల కోసం పోరాటం
సాక్షి,అమరావతి: రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం దామాషా ప్రకారం అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించాల్సి ఉందని వైఎస్సార్సీపీ సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సమావేశం అభిప్రాయపడింది. రైతులకు న్యాయం జరిగేలా ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనలు, ఒప్పందాల ప్రకారమే ప్లాట్ల కేటాయింపు జరగాలని డిమాండ్ చేశారు. రైతుల హక్కులను దెబ్బతీసేలా ఎటువంటి నిర్ణయాలూ తీసుకోవద్దని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. రాజధాని ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, రైతుల హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో పాల్గొన్న కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల హక్కులు, ప్రయోజనాలు పూర్తిగా పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. రైతులు ఎంతో నమ్మకంతో తమ భూములను అప్పగించారని, వారికి ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రభుత్వ కర్తవ్యమని పేర్కొన్నారు. రాజధాని కోసం ఇప్పటికే భూములు ఇచ్చిన రైతుల నుంచి మరోసారి భూ సమీకరణ పేరుతో బలవంతంగా భూములు తీసుకోవడం అన్యాయమని సమావేశం స్పష్టం చేసింది. ఒకసారి భూములు సమీకరించిన తర్వాత మళ్లీ రైతులపై అదనపు భారం మోపడం సరికాదని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా జరిగే ఎటువంటి చర్యలనైనా వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. రాజధాని ప్రాంతంలో అదనపు భూ సమీకరణకు సంబంధించిన అంశంపై ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించామని కమిటీ సభ్యులు గుర్తు చేశారు. కోర్టులో విచారణలో ఉన్న అంశాల విషయంలో ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలని సూచించారు. న్యాయ ప్రక్రియను గౌరవిస్తూ రైతుల హక్కులను కాపాడాలని కోరారు. నిడమర్రు, పెనుమాక గ్రామాల్లో లీగల్ టీం పర్యటన.. రాజధాని ప్రాంత రైతులపై ఒత్తిళ్లు, బెదిరింపులు, భయాందోళనలు సృష్టించే విధానాలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని సమావేశంలో కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. రైతులతో చర్చలు జరపకుండా, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ముందుకు వెళ్లడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.రైతుల ఆందోళనలను అర్థం చేసుకుని వారి సమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు. రైతుల అభ్యర్థన మేరకు సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీకి చెందిన లీగల్ టీం నిడమర్రు, పెనుమాక గ్రామాల్లో పర్యటించిన విషయాన్ని సమావేశంలో ప్రస్తావించారు. ఆ గ్రామాల రైతులను ప్రత్యక్షంగా కలిసి వారి అభిప్రాయాలు, సమస్యలు, ఆందోళనలను తెలుసుకున్నట్లు తెలిపారు. రైతులు వ్యక్తం చేసిన అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి తదుపరి కార్యాచరణను రూపొందించాలని నిర్ణయించారు. న్యాయ, రాజకీయ, ప్రజా పోరాటాలు చేపట్టాలని నిర్ణయం రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై మరింత విస్తృత చర్చ జరిపేందుకు ఈ నెలలోనే మరోసారి సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. రైతుల అభిప్రాయాలను సేకరించి, వారి హక్కుల పరిరక్షణ కోసం అవసరమైన న్యాయ, రాజకీయ, ప్రజా పోరాట కార్యక్రమాలను చేపట్టాలని సమావేశం నిర్ణయించింది. రాజధాని ప్రాంత రైతుల హక్కులను కాపాడడం కోసం వైఎస్సార్సీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని, రైతులకు అన్యాయం జరిగే ప్రతి అంశంపై పోరాటం కొనసాగిస్తామని సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ స్పష్టం చేసింది. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులు అంబటి రాంబాబు, లేళ్ళ అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, నందిగం సురేష్, దేవినేని అవినాష్, దొంతిరెడ్డి వేమారెడ్డి, వనమా బాల వజ్రబాబు, మలసాని మనోహర్ రెడ్డి, కొమ్మసాని శ్రీనివాస రెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు. -
పొలం.. కదలని హలం!
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్లో పల్లెల్లో తెల్లవారుజామునే వినిపించే ట్రాక్టర్ల శబ్దాలు ఇప్పుడు అంతగా లేవు. నాగళ్లు భుజాన వేసుకుని వెళ్లే రైతులూ లేరు. నాగలి సాళ్లు పడాల్సిన పొలాల్లో అనేకచోట్ల ఇంకా పిచ్చి మొక్కలే కనిపిస్తున్నాయి. జూన్ మూడో వారం ముగుస్తున్నా చాలాచోట్ల భూములింకా బీడుపడే కనిపిస్తున్నాయి. రైతులు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. వాన రాకకోసం నిరీక్షిస్తున్నారు. ముఖ్యంగా తొలకరి జల్లులతో పత్తి విత్తనాలు వేసిన వారు మొలకలు రాక దిగాలుగా దిక్కులు చూస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యం కావడం, అక్కడక్కడా అడపాదడపా కురిసిన చిరు జల్లులు కూడా నిలకడగా లేకపోవడంతో రాష్ట్రంలో వ్యవసాయ కార్యకలాపాలు దాదాపు స్తంభించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్లో 132 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేయగా, ఇప్పటివరకు కేవలం 7.5 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగయ్యాయి. గత ఏడాది ఇదే సమయానికి 26 లక్షల ఎకరాల్లో పంటలు వేశారంటే..ప్రస్తుతం సాగులో ఎంత జాగు చోటు చేసుకుందో అర్థమవుతుంది. రాష్ట్రంలో ఖరీఫ్ ప్రధాన పంటగా మారిన వరి సాగు ఈసారి దాదాపు నిలిచిపోయినట్లే కనిపిస్తోంది. జూన్ మూడో వారం వరకు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 10 వేల ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు లేదా విత్తనాలు వేయగలిగారు. గత ఏడాది ఇదే సమయానికి సుమారు 59 వేల ఎకరాల్లో వరి సాగు ప్రారంభం కావడం గమనార్హం. వరి నాట్లు వాయిదా సాధారణంగా జూన్ రెండో వారం నుంచే నారుమళ్లు సిద్ధమై, అనేక ప్రాంతాల్లో నాట్లు కూడా మొదలవుతాయి. కానీ ఈసారి వర్షాలు లేకపోవడం, చెరువులు, కుంటలు, బోర్లు కూడా ఆశించిన స్థాయిలో నిండకపోవడంతో రైతులు నాట్ల ప్రక్రియను వాయిదా వేస్తున్నారు. ప్రత్యేకించి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాభావం తీవ్రంగా ఉండటంతో రైతులు విత్తనాలు కొనుగోలు చేసినా పొలాల్లోకి దిగలేకపోతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా తగినంత వర్షపాతం నమోదయ్యే వరకు రైతులు తొందరపడి విత్తనాలు వేయవద్దని సూచిస్తున్నారు. మొలకెత్తని పత్తి.. రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే పత్తి పంట పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఇప్పటివరకు 5.43 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. అయితే వీటిలో సగానికి పైగా విస్తీర్ణంలో విత్తనాలు మొలకెత్తలేదని క్షేత్రస్థాయి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. జూన్ ప్రారంభంలో తొలకరి జల్లులు కురవడంతో రైతులు ఆశగా విత్తనాలు వేశారు. కానీ ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో నేలలో తేమ తగ్గిపోయి గింజలు ఎండిపోయాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, మహబూబ్నగర్ తదితర కొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 50 శాతం వరకు మాత్రమే మొలకలు వచ్చినట్లు రైతులు చెబుతున్నారు. గత ఏడాది ఇదే సమయానికి దాదాపు 20 లక్షల ఎకరాల్లో పత్తి సాగు పురోగతిలో ఉండగా, ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. కుప్పకూలిన సోయా సాగు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి తదితర జిల్లాల్లో ఎక్కువగా సాగయ్యే సోయాబీన్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 6,735 ఎకరాల్లో మాత్రమే సోయాబీన్ విత్తనాలు వేశారు. గత ఏడాది ఇదే సమయానికి 1,15,069 ఎకరాల్లో సోయాబీన్ సాగు జరిగింది. అంటే సుమారు 94 శాతం మేర విస్తీర్ణం తగ్గిపోయింది. సోయాబీన్కు విత్తే సమయంలో నేలలో సరిపడా తేమ అవసరం. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో రైతులు విత్తనాలను నిల్వలోనే ఉంచుతున్నారు. మొక్కజొన్న, కంది పంటలకూ బ్రేక్ వర్షాధార పంటలైన మొక్కజొన్న, కంది పంటల సాగు కూడా తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కేవలం 11 వేల ఎకరాల్లో మాత్రమే మొక్కజొన్న సాగైంది. గత ఏడాది ఇదే సమయానికి 80,500 ఎకరాల్లో మొక్కజొన్న సాగు నమోదు కావడం గమనార్హం. అలాగే కంది పంట నిరుడు ఇదే సమయానికి లక్షా 2 వేల ఎకరాల్లో సాగవగా..ఈసారి కేవలం 17 వేల ఎకరాల్లో మాత్రమే సాగవడం గమనార్హం. వర్షాభావ పరిస్థితుల్లో ప్రస్తుతం రైతులంతా వానల రాక కోసం ఎదురుతెన్నులు చూస్తున్నారు. -
బాబు ప్రేమ బూటకం.. మోసం నిజం!
సాక్షి, అమరావతి: అన్నదాతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు దారుణంగా వంచిస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు హామీలిస్తూ చంద్రబాబు చెప్పిన మాటల వీడియో క్లిప్ను జత చేస్తూ.. చంద్రబాబు చేసిన మోసాలను తూర్పారబడుతూ ‘రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం – మోసం నిజం..’ అంటూ ఆదివారం తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ పోస్టు చేశారు.పీఎం కిసాన్తో కాకుండా మూడేళ్లలో టీడీపీ కూటమి సర్కార్ ఒక్కో రైతు కుటుంబానికి రూ.60 వేలు ఇవ్వాల్సి ఉండగా ఇచ్చింది కేవలం రూ.19 వేలేనని స్పష్టం చేశారు. టీడీపీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం.. ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కకున్నా చీమ కుట్టినట్టైనా లేదా? అంటూ నిలదీశారు. మీరు రైతులకు ఇచ్చింది.. వాగ్దానాల మోసం, బకాయిల భారం, నిరాశ మాత్రమేనంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపడ్డారు. ‘ఎక్స్’లో వైఎస్ జగన్ ఏమని పోస్టు చేశారంటే..రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం - మోసం నిజం!@ncbn గారు రైతులను మోసం చేయడంలో మీ రికార్డులను మీరే బద్దలు కొడుతున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అయినా, మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన 143 హామీలు అయినా, అన్నీ మోసాలే. •మా ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఐదేళ్లపాటు 53.58 లక్షల రైతు… pic.twitter.com/0y5C93csiF— YS Jagan Mohan Reddy (@ysjagan) June 21, 2026⇒ చంద్రబాబు గారు.. రైతులను మోసం చేయడంలో మీ రికార్డులను మీరే బద్ధలు కొడుతున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అయినా.. మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన 143 హామీలైనా అన్నీ మోసాలే. మా ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఐదేళ్లపాటు 53.58 లక్షల రైతు కుటుంబాలకు క్రమం తప్పకుండా రైతు భరోసా అందించింది. ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నా, కరోనా వచ్చినా ఒక్క సంవత్సరం కూడా మాట తప్పలేదు. పైగా మేం మేనిఫెస్టోలో చెప్పినదానికన్నా మిన్నగా చేశాం. ఎన్నికల ముందు రాజమహేంద్రవరం వేదికగా పీఎం–కిసాన్కు అదనంగా ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.20,000 చొప్పున ఇస్తానని ఘనంగా ప్రకటించారు. ఇప్పుడు అదే రైతులను మోసం చేసి మళ్లీ రైతు ప్రేమికుడిలా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఈ పోస్టుకు మీరు మాట్లాడిన మాటలు జత చేస్తున్నా.⇒ 2024–25లో పీఎం–కిసాన్కు అదనంగా మీరు ఇస్తానన్నది, ఇవ్వకుండా ఎగరగొట్టింది రూ.20,000. రైతులకు ఇచ్చింది – సున్నా. 2025–26లో ఇవ్వాల్సింది రూ.20,000. ఇచ్చింది కేవలం రూ.14,000 మాత్రమే. 2026–27లో ఇవ్వాల్సింది రూ.26,000. ఇప్పటివరకు ఇచ్చింది – కేవలం రూ.5,000. అంటే మూడేళ్లలో ఒక్కో రైతు కుటుంబానికి మీరు ఇచ్చిన హామీ ప్రకారం పీఎం–కిసాన్ కాకుండా రూ.60,000 ఇవ్వాల్సి ఉండగా ఇచ్చింది కేవలం రూ.19,000. పైగా మీరు పథకం నుంచి 7 లక్షల మందిని నిర్దాక్షిణ్యంగా తొలగించారు. మా హయాంలో 53.58 లక్షలమంది రైతు కుటుంబాలకు పెట్టుబడి సహాయం అందితే, మీరు దాన్ని 46.85 లక్షల మందికి కుదించారు. కౌలు రైతులకు, ఆర్వోఎఫ్ఆర్ పట్టాలున్న గిరిజనులకూ మొండిచేయి చూపారు.⇒ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ధరల స్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారు. ఐదేళ్లలో మేం ధరల స్థిరీకరణ కింద రూ.7,800 కోట్లు ఖర్చు చేసి రైతులకు గిట్టుబాటు ధరలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచాం. ఈ రెండేళ్లలో మీ హయాంలో వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తి, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమోటా, కోకో, చీనీ, మామిడి.. ఇలా పంటల ధరలు పడిపోయినా మీకు పట్టనట్టే వ్యవహరించారు.⇒ ఉచిత పంటల బీమాను రద్దు చేశారు. రైతులే ఇప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టుకోవాల్సిన పరిస్థితి. రైతులు కష్టనష్టాలు భరించి ఇన్సూరెన్స్ కట్టినా మీరు ప్రభుత్వం నుంచి కట్టాల్సిన ప్రీమియం కూడా కట్టకపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. మా హయాంలో రూ.7,802కోట్లు పంటల బీమా కింద ఇచ్చాం. అది కూడా రైతులు ఒక్క రూపాయి కూడా కట్టకుండానే. ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని మీరు ఆపేశారు. ఇప్పటికి 8 నెలలు దాటుతున్నా మోంథా తుపాను బాధిత రైతులకు ఒక్కపైసా ఇన్పుట్ సబ్సిడీ అందలేదు. రైతులకు అందే సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారు. ఉద్దేశ పూర్వకంగా ఆర్బీకేలను, ఈ–క్రాప్ను, టెస్టింగ్ ల్యాబ్లను నాశనం చేశారు.⇒ ఆక్వా రైతులను నట్టేట ముంచారు. ముఖ్యమంత్రి ఛైర్మన్గా ఉన్న ‘అప్సడా’ అనుమతి లేకుండానే ఫిబ్రవరిలో కిలో ఆక్వా ఫీడ్కు రూ.4 పెంచారు. జూన్లో మరో రూ.10– రూ.12 పెంచారు. కిలోకు ఏకంగా రూ.14– రూ.16 చొప్పున పెంచుకుంటూ పోయారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత టన్ను రొయ్యల మేత ధర రూ.72 వేల నుంచి రూ.1.08 లక్షలకు అమాంతంగా పెంచేస్తే, మరోవైపు 100 కౌంట్ రొయ్యల ధర రూ.225కు పడిపోయిన పరిస్థితి. ధరలు తగ్గించాలని, లేదంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామంటూ మేం ఇచ్చిన అల్టీమేటంతో మళ్లీ కిలోకు రూ.4లు తగ్గిస్తామని ప్రకటించి, తీరా చూస్తే తగ్గించింది కేవలం రూ.2 మాత్రమే. ఇక మీరు రైతులకు చేసిందేమిటి? మోసం తప్ప! ఆక్వా రైతులకు మేం అమలు చేసిన కరెంటు సబ్సిడీని పవర్ ఫ్యాక్టర్ పేరుతో ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ⇒ మామిడి రైతుల పరిస్థితీ అంతే. గత ఏడాది కిలోకు రూ.12 చొప్పున రైతులకు ఇస్తామని ప్రకటించి ఇవ్వాళ్టికీ రూ.380 కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. మళ్లీ ఈ ఏడాది ధరల సంక్షోభం వచ్చింది. కిలోకు రూ.4 ఇస్తామంటూ మళ్లీ రైతులను మోసం చేయాలని చూస్తున్నారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏముంటుంది? పొగాకు ధర కుప్పకూలిపోయినా మీకు చీమకుట్టినట్టైనా లేదు. సీఎం.. సరాసరి ధర కిలోకు రూ.200 ప్రకటిస్తే, ఆ మరుసటి రోజు రూ.182లకు పడిపోయింది. ట్రాక్టర్లతో రైతులు చేసిన ఆందోళన మీ కళ్లకు కనిపించడంలేదా? ౖఇక మీరు రైతుల కోసం ఏం చేసినట్టు చంద్రబాబు గారూ? మీరు రైతులకు ఇచ్చింది వాగ్దానాల మోసం, బకాయిల భారం, నిరాశ మాత్రమే!ఎన్నికల ముందు ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తానని చంద్రబాబు చెబుతున్న వీడియో కోసం క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి... -
అన్నదాతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు దారుణలు: వైఎస్ జగన్
-
‘రైతులపై బాబు ప్రేమ బూటకం- మోసం.. నిజం’
సాక్షి, తాడేపల్లి: రైతులను మోసం చేస్తున్న చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం-మోసం నిజం అంటూ ట్వీట్ చేశారు. ‘‘చంద్రబాబూ.. రైతులను మోసం చేయడంలో మీ రికార్డులను మీరే బద్దలు కొడుతున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అయినా, మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన 143 హామీలు అయినా, అన్నీ మోసాలే’’ అంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు.‘‘మా ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల పాటు 53.58 లక్షల రైతు కుటుంబాలకు క్రమం తప్పకుండా రైతు భరోసా అందించింది. ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నా, కరోనా వచ్చినా, ఒక్క సంవత్సరం కూడా తప్పలేదు. పైగా మేము మేనిఫెస్టోలో చెప్పినదానికన్నా మిన్నగా చేశాం. ఎన్నికల ముందు రాజమండ్రి వేదికగా నిలబడి, పీఎం-కిసాన్కు అదనంగా ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.20,000 ఇస్తానని ఘనంగా ప్రకటించారు. ఇప్పుడు అదే రైతులను మోసం చేసి, మళ్లీ రైతు ప్రేమికుడిలా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఈ ట్వీట్కు మీరు మాట్లాడిన మాటలు జతచేస్తున్నాను...2024-25లో పీఎం-కిసాన్కు అదనంగా మీరు ఇస్తానన్నది ఇవ్వకుండా ఎగరగొట్టింది రూ.20,000. రైతులకు ఇచ్చింది.. సున్నా. 2025-26లో ఇవ్వాల్సింది రూ.20,000. ఇచ్చింది కేవలం రూ.14,000 మాత్రమే. 2026-27లో ఇవ్వాల్సింది రూ.26,000. ఇప్పటివరకు ఇచ్చింది.. కేవలం రూ.5,000. అంటే మూడేళ్లలో ఒక్కో రైతు కుటుంబానికి మీరు ఇచ్చిన హామీ ప్రకారం పీఎం-కిసాన్ కాకుండా రూ.60,000 ఇవ్వాల్సి ఉండగా, ఇచ్చింది కేవలం రూ.19,000...పైగా మీరు పథకం నుంచి 7 లక్షల మందిని నిర్దాక్షిణ్యంగా తొలగించారు. మా హయాంలో 53.58 లక్షలమంది రైతు కుటుంబాలకు పెట్టుబడి సహాయం అందితే, మీరు దాన్ని 46.85లక్షల మందికి కుదించారు. కౌలు రైతులకు, ఆర్వోఎఫ్ఆర్ పట్టాలున్న గిరిజనులకూ మొండిచేయి చూపారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ధరల స్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారు. ఐదేళ్లలో ధరల స్థిరీకరణ కింద రూ.7,800 కోట్లు ఖర్చు చేసి, రైతులకు గిట్టుబాటు ధరలకు కేరాఫ్ అడ్రస్గా మేం నిలిచాం. ఈ రెండేళ్లలో మీ హయాంలో వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తి, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమోటా, కోకో, చీనీ, మామిడి ఇలా పంటల ధరలు పడిపోయినా మీకు పట్టనట్టే వ్యవహరించారు.రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం - మోసం నిజం!@ncbn గారు రైతులను మోసం చేయడంలో మీ రికార్డులను మీరే బద్దలు కొడుతున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అయినా, మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన 143 హామీలు అయినా, అన్నీ మోసాలే. •మా ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఐదేళ్లపాటు 53.58 లక్షల రైతు… pic.twitter.com/0y5C93csiF— YS Jagan Mohan Reddy (@ysjagan) June 21, 2026..ఉచిత పంటల బీమాను రద్దుచేశారు. రైతులే ఇప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టుకోవాల్సిన పరిస్థితి. రైతులు కష్ట, నష్టాలు భరించి ఇన్సూరెన్స్ కట్టినా, మీరు ప్రభుత్వం నుంచి కట్టాల్సిన ప్రీమియంకూడా కట్టకపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. కాని, మా హయాంలో రూ.7,802కోట్లు పంటల బీమా కింద ఇచ్చాం, రైతులు ఒక్క రూపాయి కూడా కట్టకుండానే. ..ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఆపేశారు. ఇప్పటికి 8 నెలలు దాటుతున్నా మోంథా తుపాను బాధిత రైతులకు ఇప్పటికీ ఒక్కపైసా ఇన్పుట్ సబ్సిడీ అందలేదు. రైతులకు అందే సున్నా వడ్డీ పథకాన్ని రద్దుచేశారు. ఉద్దేశ పూర్వకంగా ఆర్బీకేలను, ఈ-క్రాప్ను, టెస్టింగ్ ల్యాబులను నాశనం చేశారు...ఆక్వారైతులను నట్టేట ముంచారు. ముఖ్యమంత్రి ఛైర్మన్గా ఉన్న అప్సడా అనుమతి లేకుండానే ఫిబ్రవరిలో కిలో ఆక్వాఫీడ్కు రూ.4లు పెంచారు, జూన్లో మరో రూ.10- రూ.12లు పెంచారు. కిలోకు ఏకంగా రూ.14- రూ.16లు చొప్పున పెంచుకుంటూ పోయారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత టన్ను రొయ్యలమేత ధర రూ.72వేల నుంచి రూ.1.08లక్షలకు అమాంతంగా పెంచేస్తే, మరోవైపు 100 కౌంట్ రొయ్యల ధర రూ.225కు పడిపోయిన పరిస్థితి...ధరలు తగ్గించాలని, లేదంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామంటూ మేం ఇచ్చిన అల్టిమేటంతో మళ్లీ కిలోకు రూ.4లు తగ్గిస్తామని ప్రకటించి, తీరాచూస్తే తగ్గించింది కేవలం రూ.2లు మాత్రమే. ఇక మీరు రైతులకు చేసిందేమిటి? మోసం తప్ప? పవర్ ఫ్యాక్టర్ పేరుతో ఆక్వారైతులకు మేం అమలు చేసిన కరెంటు సబ్సిడీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు...మామిడి రైతుల పరిస్థితీ అంతే. గత ఏడాది కిలోకు రూ.12లు చొప్పున రైతులకు ఇస్తామని ప్రకటించి, ఇవ్వాళ్టికీ రూ.380కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. మళ్లీ ఈ ఏడాది ధరల సంక్షోభం వచ్చింది. కిలోకు రూ.4లు ఇస్తామంటూ మళ్లీ రైతులను మోసం చేయాలని చూస్తున్నారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏముంటుంది?. పొగాకు ధర కుప్పకూలిపోయినా మీకు చీమకుట్టినట్టైనా లేదు. సీఎం సరాసరి ధర కిలోకు రూ.200 ప్రకటిస్తే, ఆ మరుసటి రోజు ఆ ధర రూ.182లకు పడిపోయింది. ట్రాక్టర్లతో రైతులు చేసిన ఆందోళన మీ కళ్లకు కనిపించడంలేదా?. ఇక మీరు రైతులకోసం ఏంచేసినట్టు చంద్రబాబూ మీరు రైతులకు ఇచ్చింది వాగ్దానాల మోసం, బకాయిల భారం, నిరాశ మాత్రమే’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు. -
ప్రతి గింజా కాదు.. 'కోటా మేరకే'!
సాక్షి, హైదరాబాద్: ఇకపై కేంద్ర ప్రభుత్వం నిర్దేశించే కోటా మేరకే రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయనుంది. ఏటా కేంద్రం ఖరారు చేసే కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)తో నిర్దేశిత కోటా మేరకే కొనుగోళ్లు జరపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. గురువారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన అనధికార మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి.. సహచర మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, సీతక్కతో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా.. రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విషయం విలేకరులు ప్రస్తావించగా.. పంట ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉండదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు బదులిచ్చారు. మిర్చి, పత్తి, ఇతర పంటల ఎగుమతి కేంద్రం వల్లే సాధ్యమని స్పష్టం చేశారు. ఇందుకోసమే గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎఫ్సీఐ, సీసీఐ, నాఫెడ్ సంస్థలను నెలకొల్పిందని గుర్తు చేశారు. పంటల కొనుగోలు బాధ్యతల నుంచి తప్పుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తుండడంతో ఒత్తిడి పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో పండించే అన్ని రకాల పంటలను ఎంఎస్పీతో పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి.. ఎల్నినో ప్రభావం తీవ్రమవుతోందని, ప్రధానంగా తెలంగాణ, ఏపీపైనే అధిక ప్రభావం ఉండబోతోందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని తుమ్మల చెప్పారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని, కాబట్టి మొదటి వర్షం పడగానే తొందరపాటుతో విత్తనాలు నాటవద్దని రైతులకు సూచించారు. కనీసం 7 సెం.మీ.ల వర్షం కురిస్తేనే విత్తనాలు మొలకెత్తేందుకు సరిపడ తేమ లభిస్తుందని చెప్పారు. మండల వ్యవసాయ అధికారులు చేసే సూచనలను రైతులు పాటించాలని కోరారు. 83% రైతులు ఈ 7 రకాలే పండిస్తున్నారు.. సన్న ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న బోనస్ను ఈ ఏడాది ఏడు రకాల సన్నాలకు మాత్రమే ఇవ్వాలని మంత్రుల సమావేశం నిర్ణయించింది. బీపీటీ–5204, ఆర్ఎన్ఆర్–15048,హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్ఎం–1638, డబ్ల్యూజీఎల్–44, కేఎన్ఎం–7715.. ఈ ఏడు రకాల సన్నాలకు మాత్రమే బోనస్ వర్తిస్తుంది. రాష్ట్రంలో సన్నాలు పండించే 83 శాతం రైతులు ఈ రకాలనే పండిస్తున్నారని తుమ్మల చెప్పారు. మార్కెట్ డిమాండ్, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వీటిని పండిస్తే ప్రభుత్వం కొనుగోలు చేయకపోయినా రైతులు మార్కెట్లో విక్రయించుకోవచ్చని అన్నారు. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు గతంలో ఎన్నడూ లేని విధంగా యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఇప్పటికే దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేంద్రం మన రాష్ట్రం నుంచి తక్కువ ధాన్యాన్ని సేకరించటంపై కేబినెట్ ఆందోళన వ్యక్తం చేసిందని చెప్పారు. ఖమ్మం జిల్లా మధిరలో ఈ నెల 30న భారీ స్థాయిలో రైతు సమ్మేళనం సభ ఏర్పాటు చేసి ఆ వేదిక నుంచి వానాకాలం పంటల సాగుకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. యూరియా కోసం త్వరలో మరోసారి ఢిల్లీకి.. వానాకాలం సీజన్కు రాష్ట్రానికి కేటాయించిన ఎరువుల కోటాను వెంటనే విడుదల చేయాల్సిందిగా కేంద్రానికి మళ్లీ విజ్ఞప్తి చేయాలని నిర్ణయించినట్టు ఉత్తమ్ తెలిపారు. ఇందుకోసం త్వరలో ఇతర మంత్రులతో కలిసి ఢిల్లీ వెళతామని తుమ్మల చెప్పారు. గత ఏప్రిల్, మే నెలల్లో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి కేటాయించి, లక్ష మెట్రిక్ టన్నులు కూడా విడుదల చేయలేదని విమర్శించారు. రామగుండం ఫ్యాక్టరీలో ఉత్పత్తి అవుతున్న ఎరువులను మధ్యప్రదేశ్, బిహార్కు తరలిస్తున్నారని, ఇకపై అధ్యధిక కోటాను రాష్ట్రానికే కేటాయించాలని డిమాండ్ చేశారు. మెట్రో–2కు సహకరించాలి.. ‘మెట్రో రైలు రెండో దశ విస్తరణకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రివర్గం విజ్ఞప్తి చేస్తోంది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) నుంచి ఒప్పందం ప్రకారం రావాల్సిన రుణాన్ని వెంటనే మంజూరు చేయించాలని కోరుతున్నాం. రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలందరూ మెట్రో విస్తరణకు సహకరించాలి..’ అని ఉత్తమ్ కోరారు. ఈ నెల 21న రాష్ట్రంలోని 2,008 పరీక్ష కేంద్రాల్లో జరగనున్న నీట్ పరీక్షకు 2.95 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారని, ఈ విద్యార్థులందరికీ (హాల్ టికెట్లు చూపాలి) ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. వీబీజీ రామ్ జీ వద్దు..పాత నరేగా కావాలి పాత ఉపాధి హామీ చట్టం యథాతథంగా కొనసాగించాలని కేంద్రానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) పేరు మార్చిన కేంద్రం.. కొత్తగా తెచ్చిన వీబీజీ రామ్ జీ పథకాన్ని రాష్ట్రంలో జూలై 1 నుంచి అమల్లోకి తీసుకువచ్చేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలంటూ ఒత్తిడి చేస్తోందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా (60:40 నిష్పత్తి) నిధులతో కేంద్రం ఈ పథకాన్ని అమలు చేయనుందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై పడే ఒత్తిడిపై అధ్యయనం కోసం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నేతృత్వంలో తనతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామితో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. ఇక డిజిటల్ కేబినెట్ భేటీలు.. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను పేపర్ లెస్గా నిర్వహించే పద్ధతికి గురువారం నాటి సమావేశంతో రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భవిష్యత్తులో డిజిటల్ కేబినెట్ భేటీలే నిర్వహిస్తారు. ఇందుకోసం గురువారం ఐటీ విభాగం తరఫున మంత్రి శ్రీధర్బాబు.. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులందరికీ స్పెషల్ ట్యాబ్లు అందజేశారు. ఇకపై ఈ– బుక్ ద్వారానే కేబినెట్ సమావేశం ఎజెండా, నోట్స్ అన్నీ మంత్రులకు అందుబాటులో ఉంచుతారు. -
మక్క రైతుకు మార్క్ఫెడ్ టెన్షన్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మార్క్ఫెడ్ ద్వారా మక్కలు విక్రయించిన రైతులు పంట సొమ్ము కోసం ఎదురుచూస్తున్నారు. యాసంగి సీజన్లో ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చినా మార్కెట్లో మద్దతు ధర దక్కక ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు నానా అగచాట్లు పడ్డారు. ఆ తర్వాత మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వం మక్కలను కొనుగోలు చేసినా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంకా 30,382 మంది రైతులకు రూ.482 కోట్లు బకాయి ఉండడం... ప్రస్తుతం వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో పెట్టుబడి కోసం ప్రతీరోజు బ్యాంకుల వద్దకు వెళ్లి ఆరా తీస్తున్నారు. 8.64 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిఈ ఏడాది యాసంగిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతటా మొక్కజొన్న విస్తారంగా సాగు చేశారు. ఫలితంగా 3.17 లక్షల ఎకరాల్లో సాగవగా 8.64 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వచ్చింది. దిగుబడి వచ్చిందన్న ఆనందంలో ఉన్న రైతులకు ధర చూస్తే నిరాశ ఎదురైంది. ప్రభుత్వం క్వింటాల్కు మద్దతు ధర రూ.2,400గా ప్రకటించినా, వ్యాపారులు రూ.1,600కు మించి చెల్లించలేదు. ఈనేపథ్యంలో ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేపట్టింది. అయితే కేంద్రాలు అరకొరగా ఏర్పాటు చేయడం, నిబంధనలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోజుల తరబడి కేంద్రాల వద్దనే పడిగాపులు కాయగా.. కాంటాలు వేశాక కూడా మిల్లులకు తరలింపులో జాప్యంతో కేంద్రాల వద్దే వేచి ఉండాల్సి వచ్చింది. 3.32 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ..కొనుగోళ్లలో ఇక్కట్లు ఎదురుకావడంతో పలుమార్లు రైతులు ఆందోళనలకు దిగారు. చివరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 50,382 మంది రైతుల నుంచి 3,32,700 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను ప్రభుత్వం సేకరించింది. వీటి విలువ రూ.797 కోట్లు. ఇందులో 20వేల మంది రైతులకు చెందిన 1.32 లక్షల మెట్రిక్ టన్నుల పంటకు సంబంధించి రూ.315 కోట్లను ఖాతాల్లో జమ చేశారు. రైతుల ఖాతాల్లో జమ అయిన సొమ్ము కన్నా.. ఇంకా అందాల్సిన సొమ్ము ఎక్కువగా ఉంది. 30,382 మంది రైతులకు సంబంధించి రూ.482 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.డబ్బు కోసం ఎదురుచూస్తున్నాం నేను 18 ఎకరాల్లో మొక్క జొన్న పంటను సాగు చేశా. 497 క్వింటాళ్లను మార్క్ఫెడ్కు విక్ర యించి 50 రోజులు గడిచినా డబ్బు రాలేదు. ప్రభుత్వం గోనె సంచులు కూడా ఇవ్వక బయట కొనడంతోపాటు కాంటా, రవాణా ఖర్చులకు రూ.50 వేలు వడ్డీకి తెచ్చి పెట్టా. వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో పెట్టుబడికి ఇబ్బంది పడుతున్నాం. – బంధం రంగయ్య, ముష్టికుంట్ల, బోనకల్అమ్మి 45 రోజులైంది..నాకున్న ఐదెకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. 225 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. తనికెళ్లలోని కొనుగోలు కేంద్రంలో మక్కలను విక్రయించి 45 రోజులు గడిచింది. ఇప్పటి వరకు నగదు బ్యాంక్ ఖాతాలో జమ కాలేదు. ఈ సమయంలో డబ్బులు జమ చేస్తే విత్తనాలు, ఎరువులు ఇతర అవసరాలకు ఉపయోగపడతాయి. – ఆకుతోట పుల్లారావు, తనికెళ్ల, కొణిజర్ల -
రైతులకు ఎప్పుడూ కష్టాలే..అధికారంలో ఉన్న బాబు వేస్ట్
-
‘చంద్రబాబూ.. బీచ్ల్లో బార్లపై ఉన్న శ్రద్ధ.. రైతులపై లేదా?’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోందని, కానీ ప్రభుత్వం మాత్రం బీచ్ల్లో బార్లు ఏర్పాటు చేయడంపైనే దృష్టి పెట్టిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి రైతుల ఉసురు తగిలితే గాలికి కొట్టుకుపోతారని మండిపడ్డారు.తాడేపల్లిలో గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘అన్నపూర్ణగా పిలుచుకునే ఏపీలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలో అనేక మంది రైతులు తనువు చాలించారు. ప్రభుత్వానికి రైతుల గురించి మాట్లాడే తీరిక లేదు. కార్పొరేట్ రంగానికి పెద్దపీట వేస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో 60 నుంచి 65 శాతం వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారు. ప్రతిపక్ష నేతలను తిట్టడం, డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. మంచి పనులు చేయటం మీద దృష్టి పెట్టకుండా నిత్యం వైఎస్ జగన్ మీద విషం చిమ్మే పనిలో ఉన్నారు.గతేదాడి వేలాది మంది రైతులు ఎరువులు, విత్తనాలు దొరక్క ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది కూడా ఇప్పటివరకు ఎరువుల మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోలేదు. ప్రతీ విషయంలో మోసం చేయటం చంద్రబాబు నైజం. రాయలసీమను హార్టికల్చర్ హబ్ చేస్తా అన్నారు.. ఇప్పుడు పట్టించుకున్న పాపాన పోలేదు. వైఎస్సార్ హయంలో తెచ్చిన ప్రాజెక్టుల వల్ల రైతులు నిలబడ్డారు. జగన్ వచ్చిన తర్వాత 1700 కోట్లు ఖర్చు చేసి 9 గంటలు విద్యుత్ ఇచ్చారు. తోతాపురి మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. గత ఏడాది జగన్ వెళ్ళి ఆందోళన చేస్తే కేసులు పెట్టారు. ప్రతిపక్షంగా మేము గట్టిగా మాట్లాడితే మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. రైతులకు కావాల్సిన మినిమం సపోర్ట్ కూడా ప్రభుత్వం నుంచి లభించటం లేదు. ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు.గాదె సాయికృష్ణ అనే యువకుడిని పోలీసులు చంపేశారు.. కనీసం డెడ్ బాడీ ఇవ్వాలని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. మేం ఇదే విషయం ప్రశ్నిస్తే కులాల ప్రస్తావన తీసుకువస్తారు. బీచ్లో బార్స్ పట్టడానికి ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదు. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ బ్లాక్ చేస్తున్నారు. ప్రభుత్వానికి రైతుల ఉసురు తగిలితే గాలికి కొట్టుకుపోతారు. తక్షణమే రైతుల గురించి ఆలోచన చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
ఆ సన్నాలే కావాలి!
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన వేళ..రాష్ట్రంలో సన్న రకాల వరి విత్తనాలకు అనూహ్య డిమాండ్ ఏర్పడింది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, మిల్లర్లు, ఎగుమతిదారుల సూచనల మేరకు ఎంపిక చేసిన ఏడు ప్రధాన సన్న రకాల వంగడాల సాగునే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలని నిర్ణయించింది. తెలంగాణ సోనా, జై శ్రీరామ్, సాంబమసూరి, హెచ్ఎంటీ సోనా, కూనారం సన్నాలు, సిద్ధి, కేఎన్ఎం–7715 రకాల సన్నరకం విత్తనాలను ఈ ఖరీఫ్లో సాగు చేయాలని ప్రభుత్వం రైతులకు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు ఇస్తున్న క్వింటాల్కు రూ.500 బోనస్ను కూడా ఈ ఏడు రకాల వరి వంగడాలకే పరిమితం చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ఇప్పటి వరకు 36 రకాల సన్నాల్లో ఏ వంగడాన్ని పండించినా, ఈ బోనస్ అందేది. అయితే సర్కార్ తాజా నిర్ణయంతో ఒక్కసారిగా ఈ ఏడు వంగడాలకు డిమాండ్ పెరిగింది. దీంతో ఈ వంగడాల కోసం ప్రభుత్వ విక్రయ కేంద్రాలు, తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎస్డీసీ) డిపోలు, ప్రైవేట్ విత్తన దుకాణాల వద్ద రైతుల తాకిడి పెరిగింది. నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, కామారెడ్డి, జగిత్యాల, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంది. ఆ ఏడింటికే ప్రాధాన్యం ఎందుకంటే.. వరి సాగులో తెలంగాణ దేశంలో అగ్రస్థానాల్లో ఉన్నా, రాష్ట్రంలో పండే బియ్యానికి మార్కెట్లో స్థిరమైన గుర్తింపు లేకపోవడం చాలా కాలంగా సమస్యగా ఉంది. రైతులు వివిధ రకాల వంగడాలను సాగు చేయడం వల్ల కొనుగోలు, నిల్వ, మిల్లింగ్, ఎగుమతుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ, మిల్లర్లు, ఎగుమతిదారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో జరిగిన సమావేశాల్లో మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న సన్న రకాల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఈ జాబితాలో తెలంగాణ సోనా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రాజేంద్రనగర్లోని భారత వరి పరిశోధన సంస్థ (ఐఐఆర్ఆర్) అభివృద్ధి చేసిన ఈ రకం దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటంతో మధుమేహ బాధితులు, ఆరోగ్య స్పృహ కలిగిన వినియోగదారుల్లో తెలంగాణ సోనాకు మంచి డిమాండ్ ఉంది. సాంబా మసూరి ఇప్పటికీ దేశీయ మార్కెట్లో అత్యధిక ఆదరణ పొందుతున్న సన్నబియ్యం రకాల్లో ఒకటిగా కొనసాగుతోంది. రైతుల పరుగులు.. వ్యాపారుల లాభాపేక్ష ప్రభుత్వం ఖరీఫ్కు అవసరమైన విత్తనాల కన్నా ఎక్కువగానే నిల్వలను సిద్ధం చేసింది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఈ సీజన్కు సుమారు 19.42 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా, 38 లక్షల క్వింటాళ్లకుపైగా నిల్వలు అందుబాటులో ఉన్నాయి. అయితే రైతులు తెలంగాణ సోనా, సాంబా మసూరి, హెచ్ఎంటీ సోనాతో పాటు ఏడు రకాల విత్తనాలనే ఎక్కువగా కోరుతుండటంతో కొన్ని కేంద్రాల్లో నిల్వలు వేగంగా ఖాళీ అవుతున్నాయి. దీంతో రైతులు ఒక కేంద్రం నుంచి మరో కేంద్రానికి వెళ్లి విత్తనాల కోసం వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో కొందరు వ్యాపారులు లాభాపేక్షతో నాసిరకం విత్తనాలను రైతులకు అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. చాలా చోట్ల తెలంగాణ సోనా, సాంబా మసూరి, హెచ్ఎంటీ సోనా , జై శ్రీరాం విత్తనాలకు కొరత ఏర్పడింది. కొందరు వ్యాపారులు డిమాండ్ ఉన్న విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ, ఎక్కువ ధరకు విక్రయించే పనిలో ఉన్నారు. -
కుదేలవుతున్న కర్షకుడు
సాక్షి, అమరావతి: పెరిగిన ఖర్చులు, గిట్టుబాటు ధర అందని అనిశ్చిత వాతావరణం నేపథ్యంలో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్నదాత.. ఇప్పుడు బయో ప్రొడక్ట్స్ వివాదంలో మరోసారి నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. కంపెనీలు, హోల్సేలర్లు, డీలర్లు, అధికారుల మధ్య జరుగుతున్న ఈ వ్యవహారంలో రైతే బలిపశువుగా మారుతున్న పరిస్థితి కనబడుతోంది.ఎరువులతో పాటు ఇతర ఉత్పత్తుల కొనుగోలుకు రైతును బలవంతం చేయొద్దని డీలర్లకు స్పష్టంచేస్తూ వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే వ్యవసాయ శాఖ జారీ చేసిన ఆదేశాలపై డీలర్లు మండిపడుతున్నారు. మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండే యూరియా, డీఏపీ కావాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ బయో ప్రొడక్ట్స్ తీసుకోవాలని కంపెనీలు, హోల్సేలర్స్ తమపై ఒత్తిడి తీసుకొస్తారని, విధిలేని పరిస్థితుల్లోనే వాటిని రైతులకు అవసరం లేకున్నా అంటగట్టాల్సి వస్తోందని డీలర్లు చెబుతున్నారు. తమపై ఇలాంటి ఒత్తిడి వద్దని కంపెనీలు, హోల్సేలర్స్కు తొలుత స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే యూరియా, డీఏపీ అమ్మకాలు నిలిపివేస్తామని తేల్చి చెబుతున్నారు. ఈ వివాదం ఎటు తిరిగినా చివరికి ఆర్థికంగా నష్టపోయేది రైతేనన్న ఆందోళన అన్నదాతల్లో వ్యక్తమవుతోంది. రైతుల నుంచి రూ.1,000 కోట్లకుపైగా దోపిడీ» రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో 18 లక్షలు, రబీలో 23 లక్షల టన్నుల ఎరువుల వినియోగం ఉంటుంది. కాంప్లెక్స్ ఎరువులతో పోలిస్తే కాస్త చౌకగా లభించే యూరియాతో పాటు డీఏపీ ఎరువుల వినియోగం కాస్త ఎక్కువగా ఉంటుంది. » ఇందులో ప్రధానంగా ఖరీఫ్లో 7 లక్షల టన్నులు యూరియా, 2.50 లక్షల టన్నులు డీఏపీ, రబీలో 9.38 లక్షల టన్నుల యూరియా, 2.20 లక్షల టన్నుల డీఏపీ ఎరువులు వినియోగిస్తారు. వీటి కోసం సీజన్లో ఎనలేని డిమాండ్ ఉంటుంది. » ఈ డిమాండ్ను ఆసరాగా చేసుకొని సాగులో పెద్దగా అవసరం లేని బయో ఫెర్టిలైజర్లు, బయో స్టిమ్యులెంట్లు, పురుగుమందులు, సూక్ష్మపోషకాలు, ఇతర వ్యవసాయ ఇన్పుట్స్ను రైతులకు బలవంతంగా అంట గట్టడం పరిపాటిగా మారింది. » యూరియా, డీఏపీ బస్తాలు కొనుగోలు చేసే పరిమాణంలో కనీసం 40–50 శాతం ఈ బయో ప్రొడెక్ట్స్ను కొనుగోలు చేయాలంటూ ఒత్తిడి తీసుకొస్తారు. చేసేది లేక చేతిచమురు వదులుతున్నా విధిలేని పరిస్థితుల్లో వీటిని కొనుగోలు చేసి, అవసరం లేకున్నా మోతాదుకు మించి అన్నదాతలు వినియోగిస్తుంటారు. » ప్రతీ ఏటా ఈ చట్ట వ్యతిరేక లింక్ ప్రొడెక్ట్స్ వ్యాపారం అక్షరాల రూ.1000 కోట్లకుపైగానే ఉంటుందని అంచనా. » ఈ తరహా అమ్మకాలను నిలిపివేయాలన్న రైతుల డిమాండ్ను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. రెండేళ్లుగా ఓ వైపు యూరియా, డీఏపీ అదునుకు దొరక్క రైతులు పడరాని పాట్లు పడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది నుంచి ఏపీ వ్యవసాయ సమాచార, నిర్వహణా వ్యవస్థ (ఏపీఏ ఐఎంఎస్) యాప్ ద్వారా విక్రయాలకు శ్రీకారం చుట్టగా, లింక్ ప్రొడెక్ట్స్ ట్యాగింగ్, అమ్మకాలపై రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. » 100 బస్తాల యూరియా కావాలంటే వాటితో పాటు కనీసం 10 బస్తాల సల్ఫర్, 5 బాక్సుల బయో ప్రొడెక్ట్స్ తీసుకోక తప్పని పరిస్థితి కల్పించడం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. » కొన్ని కంపెనీలు తమ డీలర్లకు సబ్సిడీ ఎరువుల కేటాయింపును ఇతర ఉత్పత్తుల కొనుగోలుతో అనుసంధానం చేస్తున్నారు. ఈ విషయంలో నిబంధనలను ఉల్లంఘిస్తూ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. » దీనిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం, విస్తృత తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై లైసెన్స్ రద్దు, క్రిమినల్ కేసుల నమోదు వంటి కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. » దీంతో రాష్ట్ర వ్యవసాయశాఖ డీలర్లకు స్పష్టమైన మార్గదర్శకాలతో కూడిన ఆదేశాలు జారీ చేసింది. » చట్ట వ్యతిరేక బలవంతపు విక్రయాలకు పాల్పడే వారిపై సంబంధిత వ్యవసాయ అధికారి, ఎరువుల ఇన్స్పెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారులకు వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ ఆదేశాలు ఇచ్చారు. కంపెనీలు, హోల్సేలర్లకు కూడా ఆదేశాలు ఇవ్వండి యూరియా, డీఏపీతో పాటు లింక్ ప్రొడెక్ట్స్ బలవంతపు విక్రయాలపై వ్యవసాయ శాఖ జారీ చేసిన ఆదేశాలను స్వాగతిస్తున్నాం. బలవంతపు ట్యాగింగ్ను ఆపాలని మేము ఎప్పటి నుంచో కోరుతున్నాం. అయితే కంపెనీల ఒత్తిడి మేరకే విధిలేని పరిస్థితుల్లో రైతులకు అమ్మాల్సి వస్తోంది. తమపై ఒత్తిడి తెచ్చే ముందు తయారీ దారులు, హోల్సేల్ వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. – వజ్రాల వెంకటనాగిరెడ్డి, అధ్యక్షుడు, రాష్ట్ర ఎరువులు, పురుగు మందులు, విత్తన డీలర్ల సంక్షేమ సంఘం -
ధరల పతనంపై రోడ్డెక్కిన పొగాకు రైతులు
కందుకూరు /కొండపి: రోజురోజుకూ పొగాకు ధరలు పతనమవుతుండడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలం కేంద్రాల్లో దిగజారుతున్న ధరలతో రోడ్డెక్కి నిరసనకు దిగారు. బుధవారం ప్రకాశం జిల్లా కందుకూరులోని రెండు కేంద్రాల్లో ధరలు దారుణంగా పతనమవడంతో వేలాన్ని అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు. ప్రధానంగా కనిగిరి రోడ్డులోని ఒకటో వేలం కేంద్రానికి పొన్నలూరు మండలం విప్పగుంట క్లస్టర్ రైతులు బేళ్లు తీసుకొచ్చారు.అయితే ఎఫ్2 రకం బేళ్లకు క్వింటాకు రూ.16 వేలు మాత్రమే ధర రావడంతో రైతులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వేలాన్ని అడ్డుకుని కేంద్రం అధికారులతో వాదనకు దిగారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో కనిగిరి రోడ్డుపై వాహనాల రాకపోకలను అడ్డుకుని నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఇప్పటికే లక్షలాది రూపాయలు అప్పులు చేసి పొగాకు పండించామని, ఈ విధంగా ధరలు ఉంటే అప్పులు ఎలా తీరుతాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కందుకూరు రెండో వేలం కేంద్రానికి మాలకొండరాయునిపాలెం, కొండసముద్రం క్లస్టర్ల రైతులు బేళ్లను తీసుకొచ్చారు. ఇక్కడ కూడా క్వింటా రూ.17 వేలు పలకడంతో రైతులు వేలాన్ని అడ్డుకున్నారు. ఈ ధరలకు పొగాకు అమ్మే ప్రసక్తే లేదంటూ వేలాన్ని పూర్తిగా నిలిపేశారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పొగాకు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.కొండపిలోనూ నిలిచిన పొగాకు వేలంప్రకాశం జిల్లా కొండపి వేలం కేంద్రంలో బుధవారం అధిక సంఖ్యలో పొగాకు బేళ్లు తిరస్కరణకు గురవడంతో రైతులు వేలాన్ని మధ్యలోనే అడ్డుకొని నిలిపేశారు. క్లస్టర్ పరిధిలోని గుర్రప్పడియ మూగచింతల, కె.అగ్రహారం నెన్నూరుపాడు, చతుకుపాడు గ్రామాల రైతులు వేలం కేంద్రానికి బేళ్లు తీసుకొచ్చారు. మొదటి రెండు లైన్లు కొనుగోలు అయ్యే సరికి అధిక మొత్తంలో బేళ్లు తిరస్కరణకు గురవడాన్ని గమనించిన రైతులు వేలాన్ని అడ్డుకున్నారు. కేజీ రూ.160కి కూడా వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో వేలం కేంద్ర నిర్వహణ అధికారితో రైతులు వాగ్వాదానికి దిగారు. అసలే మద్దతు ధర లేక అల్లాడిపోతుంటే కనిష్ట ధర కిలో రూ.160కు అయినా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. -
ఇప్పుడే విత్తొద్దు..
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా ఇంకా విస్తరించలేనందున రైతులు తొందరపడి విత్తనాలు వేయవద్దని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచించింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన తరువాత విత్తే నియమాన్ని పాటించి.. అంటే ఒక వారం వ్యవధిలో తేలికపాటి నేలలో 50–60 మి.మీ., బరువు నేలలో 60–75 మి.మీ వర్షపాతం నమోదైన తరువాత లేదా 15–20 సెం.మీ. లోతు నేల తడిసిన తరువాతనే రైతులు వర్షాధార పంటలైన పత్తి, సోయాచిక్కుడు, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, మినుము, ఆముదం పంటలను విత్తుకోవాలని తెలిపింది. నైరుతి రుతుపవనాల ద్వారా జూన్ నెలలో ఉత్తర, దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాలలో సాధారణంకంటే తక్కువ వర్షపాతం, మిగిలిన జిల్లాలలో సాధారణంకంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నందున అధిక తేమ, నీటి ఎద్దడి నుంచి ఆరుతడి పంటలను కాపాడుకోవడానికి పంటలను వాలుకు అడ్డంగా, బోదెలు–కాలువల పద్ధతిలో, ఎత్తు మడులు–కాలువల పద్ధతిలో విత్తుకోవాలని యూనివర్సిటీ ఆగ్రో క్లైమేట్ రీసెర్చ్ యూనిట్ హెడ్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ పి.లీలా రాణి తెలిపారు. చెరువులు, కుంటలకు దూరంగా ఉండి తక్కువ నీటి వసతి ఉన్న రైతులు తమకు అనువైన తక్కువ నీటి అవసరమున్న ఆరుతడి పంటలను సాగుచేసుకోవాలని సూచించారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నందున కోసిన పంటలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించాలని చెప్పారు. -
చంద్రబాబు సర్కార్కు వైఎస్ జగన్ అల్టిమేటం
సాక్షి,తాడేపల్లి : చంద్రబాబు సర్కార్కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. పెంచిన ఆక్వా ఫీడ్ ధరల్ని ఈ నెలాఖరులోగా తగ్గించాలని.. లేకుంటే జులై 1, లేదా 2న ఆక్వా రైతుల తరుఫున పోరాటం చేస్తామన్నారు. తాను కూడా ఆక్వా రైతులకు మద్దతుగా వెళ్తానని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఇవాళ(మంగళవారం) వైఎస్ జగన్తో ఆక్వా రైతులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కూటమి సర్కార్ పాలనతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వైఎస్ జగన్కు వివరించారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు, ఆక్వా రైతులు దారుణమైన స్థితిలో ఉన్నారని.. రైతులు, ఆక్వా రైతులు సంతోషంగా ఉండాలనే ఉద్దేశ్యంతో తమ హయాంలో మంచి ఆలోచనలు చేశామన్నారు. ‘‘రైతులు చేయిపట్టుకుని నడిపించే వ్యవస్థలో భాగంగా ఆర్బీకేలను అందుబాటులోకి తీసుకొని వచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా రూ.10వేలకుపైగా ఆర్బీకేలను తీసుకొచ్చాం. రాష్ట్రంలో వ్యాప్తంగా 10వేలకుపైగా ఆర్బీకేలు తీసుకు వచ్చాం. ఆక్వా రైతులకు తోడుగా 35 ఆక్వా ఇంటిగ్రేటెడ్ ల్యాబులు, 782 ఆర్బీకేల్లో ఫిషరీస్ అసిస్టెంట్లను పెట్టాం. అప్సడా చట్టాన్ని సైతం తెచ్చాం. ముఖ్యమంత్రేనే అప్సడా ఛైర్మన్గా చేశాం. రైతులకు నష్టం రాకుండా సిండికేట్కు స్థానం లేకుండా చేశాం. రూపాయిన్నరకే యూనిట్ కరెంటును సబ్సిడీపై ఇచ్చాం. మన ప్రభుత్వమే ఇవ్వగలిగిందని గర్వంగా చెప్తున్నా. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్ సరఫరా చేశాం. అలా 57 నెలల్లో రూ.3,306 కోట్లు విద్యుత్ సబ్సిడీ కింద చెల్లించాం. 2014-19 మధ్య చంద్రబాబు యూనిట్కు రూ.3.82లు వసూలు చేసేవాడు.మనం పాదయాత్రలో ఉనప్పుడు చివరి ఆరునెలల్లో యూనిట్కు రూ.2లకు ఇస్తానని ఒక జీవో విడుదల చేశాడు. కాని అక్కడ కూడా చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. చివరకు చంద్రబాబు కట్టాల్సిన బకాయిలు రూ.340 కోట్లు కూడా మనమే కట్టాం. చిత్తశుద్ధితో మనం చేసిన కార్యక్రమాల వల్ల ఆక్వా రంగం నిలదొక్కుతుంది.చంద్రబాబు హయాంలో 2018–19లో 38 లక్షల టన్నులు ఉన్న రొయ్య, మత్స్య ఉత్పత్తులు 2022–23 నాటికి ఏకంగా 51 లక్షల టన్నులకు పెరిగింది. 2021-22,2022-23లో రెండుసార్లు బెస్ట్ మెరైన్ అవార్డులు వచ్చాయి. ఫీడ్ కంపెనీలు రేట్లు పెంచితే, మూడు సార్లు ఉప సంహరించుకునేలా చేశాం.చంద్రబాబు హయాంలో 2018–19లో రూ.13,855 కోట్ల విలువైన 2.61 లక్షల టన్నుల ఆక్వా ఎగుమతులు జరిగితే.. 2022–23లో రూ.19.847 కోట్ల విలువైన 3.28 లక్షల టన్నుల ఆక్వా ఎగుమతులు జరిగాయి. మన ప్రభుత్వ చిత్తశుద్దికి ఇదే నిదర్శనం. ఫిషరీస్ యూనివర్శిటీ ద్వారా ఆక్వాసాగుకు నిపుణులను తయారుచేసేలా ఏర్పాటు చేశాం. క్లాసులు కూడా మొదలు పెట్టించాం. చంద్రబాబు మిగిలిన పనులు చేయకుండా విడిచిపెట్టారు. ఆక్వా ఫీడ్, సీడ్, ప్రాససింగ్ యూనిట్లు అన్నీ చంద్రబాబు సానుభూతిపరులవే. సిండికేటై పంట చేతికి అందేనాటికి రేట్లు తగ్గించేస్తున్నారు.ఫిబ్రవరిలో ఫీడ్ రేట్లు కిలో రూ.4 పెంచారు. జూన్లో మరో రూ.10, రూ.12 పెంచారు. ఈ ప్రభుత్వానికి కచ్చితంగా బుద్ధిచెప్పాల్సిందేనని’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
అన్నదాత.. ‘ఆత్మ’ఘోష!
(పంపాన వరప్రసాదరావు, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి సాక్షి ప్రతినిధి): రెండేళ్ల ‘కాల కూటమి’ పాలనలో అన్నదాతలు అ«ధోగతి పాలయ్యారు! నష్టాల సాగులో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారు. సాగు భారమై... బతుకు బరువై సంక్షోభంలో కూరుకుపోయారు. ఏ పంటకూ మద్దతు ధర దక్కపోవడం.. చంద్రబాబు సర్కారు చేస్తున్న మోసాలకు బలైపోతున్నారు. కొనేవారు లేక.. అమ్ముకునే దారిలేక.. పెట్టుబడి ఖర్చులు దక్కక.. అప్పులు తీర్చలేక రైతన్నల బతుకు దుర్భరంగా తయారైంది. దేశానికి అన్నంపెట్టే రైతులు భార్య పిల్లలకు పట్టెడన్నం పెట్టలేక పురుగు మందులను ఆశ్రయిస్తున్నారు. ఇంతటి విపత్తులో ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. పగ్గాలు చేపట్టిన తొలి రోజు నుంచే కాడిపారేయడంతో ఆసరా లేక, భరోసా కరువై అన్నదాతలు విగత జీవులుగా మారుతున్నారు. ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుండటంతో రైతు ఆత్మహత్యల వార్త లేని రోజు లేదనే చెప్పాలి. ఉత్తరాంధ్ర మొదలు రాయలసీమ వరకూ ఏ పల్లెకు వెళ్లినా ఇదే దుస్థితి. ఏ రైతును కదిపినా కన్నీటి గాధలే. విత్తు నుంచి విక్రయం వరకు గతంలో ఐదేళ్ల పాటు గ్రామ స్థాయిలో చేయిపట్టి నడిపించిన తోడు కరువైందంటూ విలపిస్తున్నారు. మేమున్నామంటూ తమకు భరోసా ఇచ్చే నాధుడు లేకుండా పోయారంటూ వాపోతున్నారు. రెండేళ్ల చంద్రబాబు సర్కారు పాలనలో రైతుల వెతలపై అనంతపురం, కర్నూలు జిల్లాల్లో దాదాపు ఏడు నియోజకవర్గాల్లో సుమారు 30కిపైగా పల్లెల్లో ‘సాక్షి ప్రతినిధి’ బృందం రెండు రోజుల పాటు క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించింది. అన్నదాతలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కళావిహీనంగా సీమ పల్లెలు.. రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో రైతులు, రైతు కూలీల ఆత్మహత్యలు చోటు చేసుకున్న రాయలసీమ జిల్లాల్లో రైతన్నల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. ఉద్యాన హబ్లో ఉద్యాన పంటలకు గిట్టుబాటు ధర దక్కని దుస్థితి నెలకొంది. సీమలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే ఉల్లి మొదలు టమాటా, బత్తాయి (చీని), మామిడి, బొప్పాయి, అరటి, పత్తి, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, పప్పుశనగ.. ఇలా ఏ పంట పండించే రైతు పరిస్థితి చూసినా దయనీయంగా ఉంది.సాగుభారమై బతుకు తెరువు కోసం పొరుగు రాష్ట్రాలకు వలస పోతుండడంతో సీమ పల్లెలు కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి. సీజన్కు ముందే పెట్టుబడి సాయం లేదు.. అదునుకు విత్తనం లేదు.. కట్ట యూరియాకు దిక్కులేదు.. కరువు కాటకాలు, వైపరీత్యాల బారిన పడి పంటలు దెబ్బ తింటే పైసా పరిహారం లేదు... ఉచిత పంటల బీమాకు మంగళం పాడేశారు.. ఏ పంటకూ మద్దతు ధర లేక, కొనేవారు లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ రైతన్నలు మండిపడుతున్నారు. ఏ పంట చూసినా కన్నీళ్లే..మామిడి, బత్తాయి, అరటి, ఉల్లి, వేరుశనగ, కూరగాయలు లాంటివి రాయలసీమలో ప్రధాన పంటలు. వేరుశనగలో 90 శాతం.. పత్తి, సజ్జ లాంటి పంటలు సగానికిపైగా సీమ జిల్లాల్లోనే సాగవుతుండగా.. జొన్న, మొక్కజొన్న సైతం 40 శాతానికిపైగా సీమ జిల్లాల్లోనే సాగు చేస్తున్నారు. రెండేళ్లుగా ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కక రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఎగుమతి రకమైన జీ–9 అరటితో పాటు తోతాపురి మామిడి, బత్తాయి, ఉల్లి, పత్తి, పుచ్చకాయ, కర్భూజ, బొప్పాయి లాంటి పండ్లను సాగు చేసే రైతులు గిట్టుబాటు ధరలు లేక రోడ్డు ఎక్కి ఆందోళనకు దిగడం సర్కారు నిర్వాకాలకు నిదర్శనం.పత్తి మద్దతు ధర రూ.8110 కాగా మార్కెట్లో రూ.5 వేలకు మించి కొనలేదు. మొక్కజొన్న మద్దతు ధర రూ.2,400 కాగా మార్కెట్లో రూ.1,400–1,600 మించి ఇవ్వడం లేదు. అరటి రైతులైతే ఖరీఫ్లో రూపాయికి తెగనమ్ముకోగా రబీలో రూ.5కు మించి దక్కలేదు. సజ్జ మద్దతు ధర రూ.2,750 కాగా మార్కెట్లో రూ.1,800–1,900 మధ్య అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది.తోతాపురి మామిడికి కిలో రూ.4–6కు మించి దక్కలేదు. చివరికి బత్తాయికి కూడా ఖరీఫ్లో కిలో రూ.6మించి లభించలేదు. ఉల్లి, టమాటా రైతుల పరిస్థితి మరీ దారుణం. కిలో రూపాయి.. అర్ధ రూపాయి పలకడంతో చేసేదిలేక వేలాది టన్నులు రోడ్లపైనే పారబోసిన ఘటనలు కోకొల్లలు. రెండేళ్లుగా కర్భూజ, పుచ్చకాయ పంటకు ధర లేదు. చివరికి పూలకు కూడా రేటు లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. అన్నదాతకు సున్నం.. పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాతా సుఖీభవ పథకం కింద ప్రతీ రైతుకు ఇస్తామన్న రూ.20 వేల పెట్టుబడి సాయాన్ని చంద్రబాబు సర్కారు తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టింది. రెండో ఏడాది ఏడు లక్షల మందికి కోతపెట్టి 46.85 లక్షల మంది భూ యజమానులకు అరకొరగా రూ.14 వేల చొప్పున రూ.6,560.18 కోట్లతో సరిపెట్టారు. రెండేళ్లలో భూ యజమానులకే రూ.14,873.28 కోట్లు ఎగ్గొట్టారు. ఇక కౌలు రైతులకైతే రెండేళ్లూ పెట్టుబడి సాయానికి ఎగనామం పెట్టారు. దాదాపు 16 లక్షలమంది కౌలు రైతులుండగా ఏడాదికి రూ.20 వేల చొప్పున రెండేళ్లలో రూ.6,400 కోట్లను చంద్రబాబు ఎగ్గొట్టారు. పెట్టుబడి కోసం రైతులు సీజన్లో పడరాని పాట్లు పడ్డారు. రూ.3–5 వడ్డీలకు అప్పుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.బలవన్మరణాలు..సాగు కలిసి రాకపోవడంతో అప్పుల పాలైన అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోకపోవడంతో రైతు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వర్షాభావం, వరదలు, తుపాన్లు.. ఒక్కొక్కటిగా వైపరీత్యాలు విరుచుకుపడటంతో దిక్కు తోచని స్థితిలో ఉన్న రైతన్నల పాలిట చంద్రబాబు సర్కారు అవలంబిస్తున్న విధానాలు మృత్యుపాశాలుగా మారాయి.టమాటా నుంచి పొగాకు వరకు పంట ఉత్పత్తులను కొనే నాథుడు లేక, అప్పులు తీర్చే దారిలేక 2024–25లో 150 మందికి పైగా అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడగా.. ఇక 2025–26లో 393 మంది రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టినట్లు పోలీస్ శాఖ అధికారికంగా ప్రకటించింది. వీరిలో అత్యధికులు సీమ జిల్లాలకు చెందిన వారే కావడం గమనార్హం. ఇప్పటి వరకు ఏ ఒక్కరికి ప్రభుత్వం పైసా పరిహారం ఇచి్చన పాపాన పోలేదు.చేయిపట్టి నడిపించిన ఆర్బీకేలు నిర్వీర్యంవిత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని విధాలా గ్రామ స్థాయిలో అండగా నిలిచిన రైతు భరోసా కేంద్రాలు కూటమి పాలనలో నిరీ్వర్యమైపోయాయి. 10,778 ఆర్బీకేలు కాస్తా రేషనలైజేషన్ పేరిట 8451 క్లస్టర్లుగా కుదించారు. నాణ్యమైన సాగు ఉత్పాదకాలు అందించే సంకల్పంతో గత ప్రభుత్వం నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ల్లో సగానికి పైగా మూతపడగా మిగిలినవి అలంకారప్రాయంగా తయారయ్యాయి. సిబ్బందిని సర్వేలు, ఇతర అవసరాలకు వినియోగిస్తుండడంతో ఆర్బీకేలకు వెళ్తే పలుకరించే నాధుడే కరువయ్యారు.అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన భవనాలను ఇతర అవసరాలకు కేటాయిస్తున్నారు. నాన్ సబ్సిడీ విత్తన పంపిణీని నిలిపి వేశారు. సబ్సిడీ విత్తనాల పంపిణీలో అడ్డగోలుగా కోత పెట్టారు. అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఎరువులను పక్కదారి పట్టిస్తుండడంతో రైతులకు యూరియా, డీఏపీ దొరకని పరిస్థితి నెలకొంది. రెండేళ్లుగా కట్ట యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నామని వాపోతున్నారు.మరోవైపు కాంప్లెక్స్ ఎరువుల ధరలు రెండేళ్లలో 50–70 శాతం మేర పెరిగిపోవడంతో సాగు భారం మారింది. మత్స్యకార, పశుసంవర్ధక శాఖలకు చెందిన సాగు ఉత్పాదకాల సరఫరాకు మంగళం పాడేశారు. వరుస వైపరీత్యాలు, కరువు సాయం కలిపి దాదాపు 7 లక్షల మంది రైతులకు చంద్రబాబు సర్కారు దాదాపు రూ.1,100 కోట్లకు పైగా పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) ఇప్పటి వరకు చెల్లించిన పాపాన పోలేదు.అటకెక్కిన ఉచిత పంటల బీమా రైతులపై ఒక్క పైసా భారం పడకుండా ఐదేళ్ల పాటు రైతులకు అండగా నిలిచిన డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి కూటమి ప్రభుత్వం వచీ్చరాగానే మంగళం పాడేసింది. ఎన్నికల కోడ్ కారణంగా ఆగిన 2023–24 సీజన్కు సంబంధించిన ప్రీమియం బకాయిలు రూ.930 కోట్లు చెల్లించకుండా చంద్రబాబు సర్కారు రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారాన్ని అందకుండా చేసింది. ఖరీఫ్ 2024 సీజన్ వరకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత పంటల బీమా పథకం కొనసాగగా.. రబీ–2024–25 సీజన్ నుంచి చంద్రబాబు సర్కారు స్వచ్ఛంద నమోదు పద్ధతి తెచ్చింది.2024–25 వ్యవసాయ సీజన్తో పాటు ఖరీఫ్–2025–26 సీజన్లో ప్రభుత్వం చెల్లించాల్సిన బీమా ప్రీమియం బకాయిలు రూ.1,095.11 కోట్లు ఎగ్గొట్టడంతో కంపెనీలు ఏపీని బ్లాక్లిస్ట్లో పెట్టాయి. రబీ –2025–26 సీజన్లో కనీసం బీమా పోర్టల్ కూడా తెరవలేదు. ఫలితంగా ఒక్క రైతు కూడా స్వచ్ఛందంగా బీమా చేయించుకోలేకపోయారు. ఇక రూ.500 కోట్ల మేర సున్నా వడ్డీ రాయితీని రెండేళ్లుగా చెల్లించకుండా చంద్రబాబు సర్కారు ఎగనామం పెట్టింది. మద్దతు ధర కోసం ఆందోళనలు.. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కల్పించడంలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైంది. ధరల స్థిరీకరణ నిధి కింద పైసా ఇచి్చన పాపాన పోలేదు. ఉల్లి, టమాటా, కందులు, మినుము, పెసలు, శనగ, వేరుశనగ, పసుపు, జొన్న, సజ్జ, మొక్కజొన్న, పొగాకు, కోకో, మామిడి.. ఇలా ఏ పంట చూసినా మద్దతు ధర దక్కని పరిస్థితి. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం 2024–25 సీజన్లో 75 కేజీల ధాన్యం బస్తాకు రూ.1,725 దక్కాల్సి ఉండగా ఏ ఒక్క రైతుకు రూ.1,150–1,450కి మించి దక్కలేదు.2025–26లో 75 కేజీల బస్తాకు రూ.1,777 దక్కాల్సి ఉండగా రూ.1,250 నుంచి రూ.1,500 మధ్య దక్కింది. మద్దతు ధర కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం, మామిడి, జొన్న, మొక్కజొన్న, పొగాకు రైతులు రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలకు దిగారు. 2023–24లో క్వింటా రూ.27 వేలకు పైగా పలికిన మిర్చి రైతుకు గతేడాది రూ.6–8 వేలకు మించి దక్కలేదు. మొక్కజొన్న ఎమ్మెస్పీ క్వింటాకు రూ.2,400 అయితే రైతులకు దక్కింది కేవలం రూ.1,400 నుంచి రూ.1,600 మధ్యే. టమాటా, ఉల్లి రైతుల పరిస్థితి రెండేళ్లుగా దారుణంగా ఉంది. పైసా సాయం అందలేదు.. గత ఖరీఫ్లో 10 ఎకరాల్లో శనగ, మినుము, నాటుపొగాకు సాగు చేశా. దాదాపు రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. పత్తి తెగుళ్ల బారిన పడింది. నాటు పొగాకు కొనేవారు లేకుండా పోయారు. శనగ, మినుము పంటలు వర్షాలకు దెబ్బతిన్నాయి. అధికారులు రాసుకుని వెళ్లారే గానీ పైసా సాయం అందలేదు. – సుద్దాల సుబ్బరాయుడు, కొనకుంట్ల, నంద్యాల జిల్లారూ.60 లక్షలు నష్టపోయా.. 4 ఎకరాల్లో దానిమ్మ, మరో 4.5 ఎకరాల్లో అరటి సాగు చేశా. ఎకరాకు రూ.3 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టా. ముంపునీటి బారిన పడి గతేడాది అరటి పంట దెబ్బతింటే.. ఈ ఏడాది బాక్టీరియల్ బ్లైట్ తెగులు బారిన పడి దానిమ్మ పూర్తిగా నాశనమైంది. మరో 15–20 రోజుల్లో పంట కోతకొచ్చే దశలో అకాల వర్షాలు, వడగండ్లతో తెగులు సోకింది.చెట్టుకు 28 కేజీలకు తక్కువ కాకుండా ఎకరాకు 10 టన్నులకు పైగా దిగుబడి వస్తుందని ఆశించా. బెంగళూరు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. టన్ను రూ.1.50 లక్షల వరకు పలుకుతోంది. ఆ లెక్కన రూ.60 లక్షల వరకు నష్టపోయా. ఇది వాణిజ్య పంట కాబట్టి మీకు పరిహారం రాదని అధికారులు చెబుతున్నారు. వైఎస్ జగన్ హయాంలో ఉద్యాన పంటలన్నింటికి ఉచితంగా బీమా పరిహారం ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వంలో పైసా సాయం లేదు. – ధర్మవరపు రవిశేఖర్రెడ్డి, కందుకూరు, అనంతపురం జిల్లాపరిస్థితి దారుణంగా ఉంది.. ఐదెకరాల్లో మొక్క జొన్న, వేరుశనగ వేశా. మొక్కజొన్నకు ఎకరాకు రూ.లక్ష, వేరుశనగకు రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. మొక్కజొన్న 125 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మద్దతు ధర రూ.2,400 కాగా మార్కెట్లో రూ.1,500కి మించి ధర రాలేదు. క్వింటాకు రూ.900 చొప్పున దాదాపు రూ.1.13 లక్షల మేర నష్టపోయా. వేరుశనగ అకాల వర్షాల బారిన పడి ఎందుకు పనికి రాకుండా పోయింది. రూ.8 లక్షలు అప్పు మిగిలింది. వైఎస్ జగన్ హయాంలో పైసా కట్టించుకోకుండా రూ.లక్షన్నరకు పైగా పంటల బీమా పరిహారం ఇచ్చారు. సీజన్ ముగియకుండానే పంట నష్టపరిహారం ఇచ్చేవారు. నేడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. – మన్నెపూల శివశంకర్, మద్దాలపురం, అనంతపురం జిల్లాపాడి రైతులకు దగా.. మాకు మూడు ఆవులున్నాయి. రోజుకు నాలుగైదు లీటర్ల పాలు ఇస్తాయి. మా గ్రామంలో లీటర్ గేదె పాలకు రూ.40, ఆవుపాలకు రూ.20 మించి ఇవ్వడం లేదు. అదేమిటని అడిగితే వెన్న శాతం లేదంటారు. గత ప్రభుత్వ హయాంలో మంచి రేటు వచ్చేది. అమూల్ కేంద్రాల్లో పాలు పోసేవాళ్లం. లీటర్ గేదె పాలకు రూ.80, ఆవుపాలకు రూ.50కిపైగా ఇచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇలా అయితే పాడి రైతులు బతికేదెలాగో అర్ధం కావడం లేదు. – ఎం.జానకమ్మ, మద్దాలపురం, అనంతపురం జిల్లాపరిహారం లేదు.. వితంతు పింఛనూ ఇవ్వరు.. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్న ముష్ఠూరు గ్రామానికి చెందిన రాగులపాడు సురేష్ (35) తనకున్న 1.5 ఎకరాల సొంత భూమితోపాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని గత ఖరీఫ్లో మొక్కజొన్న, శనగ సాగుచేశాడు. పెట్టుబడి కోసం నాలుగు తులాలు బంగారు ఆభరణాలు బ్యాంకులో కుదవ పెట్టాడు. తీరా పంట చేతికొచ్చే సరికి మద్దతు ధరలేక పెట్టుబడి కూడా రాలేదు.అప్పులు రూ.5 లక్షలకు చేరుకోవడంతో ఒత్తిళ్లు భరించలేక మార్చిలో ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముగ్గురు బిడ్డలను పోషించుకునేందుకు కూలి పనులకు వెళ్తున్నట్లు సురేష్ భార్య సునీత కన్నీటిపర్యంతమైంది. తన భర్తకు పరిహారం ఇవ్వలేమని ప్రభుత్వం చెబుతోందని, కనీసం వితంతు పింఛన్ అయినా ఇప్పించండి బాబూ అంటూ కాళ్లా వేళ్లా పడినా పట్టించుకోవడంలేదంటూ వాపోయింది. పిల్లలతో కలిసి కూలి పనులకు పోతున్నా.. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం చెరుకులపాడు మజర కోసనా పల్లె గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు కురువ రామచంద్రుడు (45)కి సొంతంగా 2.5 ఎకరాలు, మరో 2 ఎకరాల డీ పట్టా భూమి ఉంది. రెండు బోర్లు వేసినా చుక్కనీరు పడలేదు. దాదాపు రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టి ఉల్లి, పొగాకు సాగు చేసినా పంటలు కొనేవారు లేక తీవ్రంగా నష్టపోయాడు.ప్రభుత్వం నుంచి పైసా సాయం అందలేదు. అప్పులు కాస్తా వడ్డీలతో రూ.12 లక్షలకు చేరుకున్నాయి. అప్పులోళ్ల వేధింపులు తాళలేక ఉల్లి, తెగులు నివారణకు తెచ్చిన పురుగుల మందు తాగి గతేడాది సెప్టెంబర్ 14న ఆత్మహత్యకు ఒడిగట్టడంతో రామచంద్రుడి కుటుంబం దిక్కుతోచక అల్లాడుతోంది. ఇద్దరు కుమార్తెలను పోషించుకునేందుకు కూలి పనులకు పోతున్నానంటూ రామచంద్రుడు భార్య లక్ష్మీ వాపోయింది. తనకు భర్తకు కౌలు కార్డు లేదనే సాకుతో పరిహారం రాదు పొమ్మంటున్నారని.. అప్పులోళ్లు భూమిని లాగేసుకున్నారని.. ఎలా బతకాలో తెలియడం లేదంటూ కన్నీటి పర్యంతమైంది.భూములు అమ్ముకుంటున్న అన్నదాతలు ఈ ఫొటోలో కనిపిస్తున్న వారంతా అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం దోసులుడికి గ్రామానికి చెందిన రైతులు. గ్రామంలో 2,500 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఉల్లి, శనగ, వేరుశనగ, బంతి, చామంతి సాగు చేస్తారు. రెండేళ్లుగా వ్యవసాయం కలిసి రాకపోవడంతో గ్రామంలో 90 శాతం మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పులు తీర్చేదారిలేక కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకున్న భూములను తెగనమ్ముకుంటున్నారు. అప్పులోళ్ల వేధింపులు తాళలేక ఇప్పటికే 500 ఎకరాలకు పైగా అమ్ముకున్నామంటూ వాపోతున్నారు.వేరుశనగకు దూరమైన పల్లెలు.. ఈ ఫొటోలో ఉన్నవారంతా అనంతపురం జిల్లా గార్లెదిన్న మండలం కోటంక గ్రామానికి చెందిన రైతులు. గ్రామంలో దాదాపు 3 వేల ఎకరాల సాగు భూమి ఉండగా 95 శాతం మంది రైతులు వేరుశనగ సాగు చేస్తుంటారు. రెండేళ్లుగా చీడపీడలతో దిగుబడులు తగ్గిపోవడం.. పెట్టుబడులు పెరిగిపోవడంతో పాటు ఏ ఒక్క సీజన్లోనూ మద్దతు ధర దక్కక పోవడంతో ప్రతీ ఒక్కరూ రూ.లక్షల్లో అప్పుల పాలయ్యారు. దీంతో వేరుశనగ సాగుకు గ్రామం పూర్తిగా దూరమైంది. ప్రత్యామ్నాయ పంటలు సైతం కలసి రావడం లేదు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో ఉచిత పంటల బీమా కింద ఒక్క అనంతపురం, కర్నూలు జిల్లాలకే రూ.1,000 కోట్లకు పైగా పరిహారం దక్కింది. దాదాపు ప్రతీ రైతు రూ.లక్ష నుంచి రూ.నాలుగైదు లక్షల వరకు పరిహారం అందుకున్నారు. కానీ రెండేళ్లుగా తమ పరిస్థితి దారుణంగా ఉందంటూ గ్రామానికి చెందిన రైతు టి.నారాయణ ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. -
కల నిజమాయెగా..!
నోయిడా/లక్నో: మార్చిలో ప్రధాని మోదీ ప్రారంభించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుంచి విమానాల రాకపోకలు మొదలయ్యాయి. ఈ ఎయిర్పోర్టు నిర్మాణానికి తమ భూములిచ్చిన జెవార్ ప్రాంతానికి చెందిన 170 మంది రైతులతో కూడిన మొట్టమొదటి విమానం లక్నోకు బయలుదేరింది. ఈ బృందంలో 28 మంది మహిళలతోపాటు 170 మంది గ్రామస్తులున్నారు. వీరందరినీ యూపీ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్ వెంటబెట్టుకెళ్లారు. లక్నోలోని తన నివాసం వద్ద వీరందరికి సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇతర ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రైతులతో సమావేశమయ్యారు. వీరంతా గౌతమబుద్ధ నగర్లోని జెవార్ ప్రాంతానికి చెందిన వారు. వీరిలో 99 శాతం మంది రైతులు గతంలో ఎన్నడూ విమానంలో ప్రయాణం చేయని వారే. ఈ సందర్భంగా రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. విమానంలో ప్రయాణించాలన్న తమ చిరకాల కోరిక సాకారమైందన్నారు. ‘ఈ అరుదైన అనుభవాన్ని ఎన్నటికీ మర్చిపోలేం. ఈ సంతోషాన్ని మాటల్లో వరి్ణంచలేం. మా భూముల్లో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంతో ఎందరికో ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించడం చూసి సంతోషంగా ఉంది’అని వారు సీఎం యోగికి చెప్పారు. తమ భూములకు తగిన పరిహారం అందించేలా చేయడంతోపాటు, తమకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం యోగికి వారు ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు, లక్నోకు మొదటిసారిగా బయలుదేరిన ఇండిగో విమానంలో రైతుల కోసం ప్రత్యేకంగా ఒక అనౌన్స్మెంట్ చేశారు. ‘తమ కష్టార్జితంతో ఈ భూమిని సాగు చేసి, అభివృద్ధి కోసం త్యాగం చేసిన రైతులు.. ఈ రోజు అదే స్థలం నుంచి విమాన ప్రయాణం చేస్తున్నారు. ఇది పరస్పర నమ్మకం, భాగస్వామ్యం, ప్రగతికి ఒక నిదర్శనం’అని ఎమ్మెల్యే సింగ్ ప్రకటించారు. ఒక్కటే రన్ వే లక్నోలో రైతులతో ఏర్పాటైన సమావేశంలో సీఎం యోగి ఆదిత్యనాథ్తోపాటు, సీఎం సలహాదారు అవనీశ్ కుమార్ అవస్థి, మంత్రి సురేశ్ కుమార్ ఖన్నా, అదనపు ప్రధానకార్యదర్శి(పౌర విమానయాన) దీపక్ కుమార్, యమునా ఎక్స్ప్రెస్వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ సీఈవో రాకేశ్ సింగ్, ఇండిగో, నోయిడా విమానాశ్రయం ప్రతినిధులు పాల్గొన్నారు. 2021 నవంబర్ 25వ తేదీన ప్రధాని మోదీ ఈ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది మార్చి 28వ తేదీన ప్రారంభించారు. ప్రస్తుతానికి ఒకటే రన్వే ద్వారా ఏడాదికి 1.2 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యంతో నిర్మించిన ఈ విమానాశ్రయాన్ని భవిష్యత్తులో ఐదు రన్వేలతో 22.5 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలకు వీలయ్యేలా విస్తరించనున్నారు. -
నోయిడా ఎయిర్పోర్ట్: భూములిచ్చిన దాతలకు తొలి విమాన యోగం..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో నిర్మించిన ప్రతిష్టాత్మక ‘నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం’ సోమవారం (జెవార్ ఎయిర్పోర్ట్) చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. ఈ విమానాశ్రయం కోసం తమ భూములను త్యాగం చేసిన స్థానిక రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు తమ జీవితంలోనే మొదటిసారి విమానమెక్కి గగన విహారం చేశారు. వాణిజ్య కార్యకలాపాల ప్రారంభోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ తొలి విమానంలో లక్నోకు ప్రయాణమైన మహిళల ముఖాల్లో ఆనందం కినిపించింది.భావోద్వేగంలో మహిళా రైతులు‘మేము విమానం ఎక్కుతామని ఎప్పుడూ అస్సలు ఊహించలేదు’ అంటూ మిథిలేష్, బబ్లీ, పింకీ అనే మహిళా రైతులు అత్యంత భావోద్వేగానికి లోనయ్యారు. తమ జీవితాల్లోకి ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని తీసుకువచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తొలి విమానం స్థానిక రైతులను తీసుకుని లక్నో వెళ్లగా, మొదటి అధికారిక వాణిజ్య విమానం బెంగళూరుకు సర్వీస్ ప్రారంభించింది. ఈ విమానాశ్రయం కేవలం ప్రయాణ సాధనంగానే కాకుండా, తమ సొంత భూముల్లో నిర్మితమైన గగన తలాన్ని తామే స్వయంగా చూసేలా చేసి,పలువురు అన్నదాతల కళ్లల్లో ఆనంద బాష్పాలు నింపింది.1.2 కోట్ల మంది ప్రయాణ సామర్థ్యంయమునా ఎక్స్ప్రెస్వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ను చేపట్టింది. ప్రస్తుతం పూర్తయిన మొదటి దశలో ఒక రన్వే, ఇంటిగ్రేటెడ్ టెర్మినల్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ను నిర్మించారు. ఏడాదికి 1.2 కోట్ల మంది ప్రయాణికులను చేరవేసే సామర్థ్యంతో సిద్ధమైన ఈ విమానాశ్రయానికి ఈ ఏడాది మార్చిలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి ఏరోడ్రోమ్ లైసెన్స్ లభించింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఎన్సీఆర్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయం చేరువయ్యింది.లక్ష మందికి ఉపాధి అవకాశాలుమొత్తం నాలుగు దశల్లో, సుమారు 1,334 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ విమానాశ్రయాన్ని విస్తరించనున్నారు. భవిష్యత్తులో 5 రన్వేలతో ఏటా 22.5 కోట్ల మంది ప్రయాణించేలా దీని తుది బ్లూప్రింట్ను సిద్ధం చేశారు. ఈ భారీ ప్రాజెక్ట్ ద్వారా లాజిస్టిక్స్, వేర్హౌసింగ్, హాస్పిటాలిటీ, పారిశ్రామిక రంగాలలో సుమారు లక్ష మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని, భారీగా పెట్టుబడులు తరలివస్తాయని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.ఇది కూడా చదవండి: ఒక్క రీల్కు రూ. 80 లక్షలు.. షాకిస్తున్న సమయ్ రైనా! -
భూ వ్యవస్థ అస్తవ్యస్తం
సాక్షి, అమరావతి: భూమి అంటే సామాన్యుడికి కేవలం ఆస్తి మాత్రమే కాదు.. తరాల కష్టం, బతుకునకు భరోసా. ఆ భరోసాను ప్రభుత్వమే కూల్చేస్తే ప్రజలు ఎక్కడికి వెళ్లాలి? రీ సర్వేకు తూట్లు.. 22ఏ జాబితాలో 20 లక్షల ఎకరాలు.. పేదల ఫ్రీహోల్డ్ హక్కులు రెండేళ్లుగా ఫ్రీజ్.. కలెక్టరేట్ల వద్ద ప్రతి సోమవారం పెరుగుతున్న బాధితుల క్యూలు.. పాస్బుక్ల దందా.. అధికార పార్టీ అండతో సాగుతున్న భూ బాగోతాలు.. ఈ రెండేళ్లలో రాష్ట్రంలో భూముల వ్యవస్థ సాధించిన ప్రగతి ఇదే. ఈ అస్తవ్యస్త పరిస్థితికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వానిదేనని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో రాష్ట్ర భూ పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయింది. 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన చారిత్రక భూ సంస్కరణలను చంద్రబాబు ప్రభుత్వం వచ్చీ రాగానే నిలిపివేసింది. ఫలితంగా లక్షలాది మంది రైతులు, సామాన్య భూ యజమానులు వారి సొంత భూమిపై హక్కులు కోల్పోయారు. ఫలితంగా బ్యాంకు రుణాలు అందక, విక్రయ రిజిస్ట్రేషన్లు ఆగిపోయి అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు తమ భూములు వివాదాల్లో కూరుకుపోవడంతో పరిష్కారం కోసం వేలాది మంది ప్రతి సోమవారం కలెక్టరేట్ల ముందు పడిగాపులు పడుతున్నారు. విజయవాడ కలెక్టరేట్లో పీజీఆర్ఎస్లో వినతులు అందజేయటానికి వచ్చిన రైతులు, ప్రజలు(ఫైల్) 22ఏ జాబితాలో ఏకంగా 20 లక్షల ఎకరాలు ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం 20 లక్షల ఎకరాలకు పైగా భూములను 22ఏ నిషేధిత జాబితాలో పెట్టింది. 13.59 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూములు, 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములు, 1.39 లక్షల ఎకరాల సర్వీస్ ఈనాం భూములు, 40 వేల ఎకరాల షరతులు గల పట్టా భూములు, 50 వేల ఎకరాల అనాధీనం భూములు ఇందులో ఉన్నాయి. ఇవి కాకుండా పలు జిల్లాల్లో గతంలో 22ఏ జాబితా నుంచి విముక్తి పొందిన లక్షల ఎకరాల భూములను టీడీపీ ప్రజాప్రతినిధులు 22ఏ జాబితాలో పెట్టించారు. అసలు వివాదమే లేని ప్రైవేట్ పట్టా భూములు, తరతరాలుగా అనుభవంలో ఉన్న పూర్వీకుల ఆస్తులను సైతం ఈ జాబితాలోకి నెట్టేశారు. దీంతో ఆ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయాయి. తనఖా పెట్టుకునే అవకాశం లేదు, బ్యాంకు రుణం రాదు. ఒక సర్వే నంబర్లో కొంత భాగంపై వివాదం ఉంటే మొత్తం సర్వే నంబర్నే నిషేధిత జాబితాలో పెట్టిన ఘటనలు కోకొల్లలు. ఫ్రీహోల్డ్ భూములపై పగబట్టిన చంద్రబాబు 20 ఏళ్లకు పైగా అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న పేదలకు 2023లో జగన్ ప్రభుత్వం యాజమాన్య హక్కులు (ఫ్రీహోల్డ్) కల్పించింది. 27 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ పరిధిలోకి రాగా, ఎన్నికలు పూర్తయ్యే నాటికి 13.59 లక్షల ఎకరాలు నిషేధిత జాబితా నుంచి విముక్తి పొందాయి. ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల పేదలు పట్టాదారులయ్యారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చీ రాగానే అక్రమాల పేరుతో ఫ్రీ హోల్డ్ భూములను మళ్లీ 22ఏ జాబితాలో పెట్టేసింది. రెండేళ్లయినా ఆరోపణలు నిరూపించలేకపోయింది. కానీ ఆ భూములపై రైతులకు హక్కులు మాత్రం పునరుద్ధరించలేదు. ఒకవైపు లక్షలాది ఎకరాలను 22ఏ జాబితాలో పెట్టి.. పైకి మాత్రం 22ఏ జాబితా నుంచి భూములను తొలగిస్తున్నట్లు చంద్రబాబు సర్కారు డబ్బా కొట్టుకుంటుండటం విస్తుగొలుపుతోంది. జగన్ సంస్కరణలతో రూ.500 కోట్లు ప్రోత్సాహకాలు వైఎస్ జగన్ హయాంలో అమలైన భూ సంస్కరణలన్నింటినీ చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కింది. దేశంలోనే తొలిసారిగా ఏపీలో ప్రారంభమై విజయవంతంగా జరుగుతున్న రీసర్వేపై విష ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చాక కొద్ది నెలలు దాన్ని నిలిపివేసి.. తప్పు తెలుసుకుని మళ్లీ తూతూ మంత్రంగా కొనసాగిస్తోంది. ఇప్పుడు తానే రీ సర్వేను మొదలు పెట్టినట్లు ప్రచారం చేసుకుంటోంది. 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా సమగ్ర భూ రీసర్వేను చేపట్టింది. శాటిలైట్, డ్రోన్, జీపీఎస్ సాంకేతికతతో గ్రామ గ్రామాన సర్వే జరిగింది. రికార్డుల ట్యాంపరింగ్, నకిలీ డాక్యుమెంట్లు, భూ కబ్జాలకు తావులేని వ్యవస్థ దిశగా అడుగులు పడ్డాయి. భూ రికార్డుల డిజిటలీకరణలో దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నివేదిక ధృవీకరించింది. ఈ పనితీరుకు ప్లాటినం గ్రేడింగ్, కేంద్ర ఆర్థిక శాఖ ప్రోత్సాహకాలు రూ.500 కోట్లు కూడా దక్కాయి. జగన్ అమలు చేసిన కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాలు అందుకుంది. పీజీఆర్ఎస్కు బాధితుల క్యూ ప్రతి సోమవారం రాష్ట్రంలోని కలెక్టరేట్లు, మండల కార్యాలయాల వద్ద జరిగే పీజీఆర్ఎస్ (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్) కార్యక్రమానికి వస్తున్న ఫిర్యాదుల్లో అత్యధికం భూ సమస్యలే ఉంటున్నాయి. పట్టా ఉన్నా రిజిస్ట్రేషన్ కాని భూములు, 22ఏ జాబితాలో ఇరుక్కుపోయిన ఆస్తులు, పాస్బుక్లు రాని రైతులు, ఇచ్చిన పాస్బుక్కుల్లో తప్పులు, రికార్డుల్లో పేర్లు మాయమైన బాధితులు దరఖాస్తులు పట్టుకుని క్యూ కడుతున్నారు. అర్జీలు తీసుకుని రశీదులు ఇవ్వడమే తప్ప ఆ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. బాధితులు పది సోమవారాలు తిరిగినా సమస్య మాత్రం అలాగే ఉంటోంది. దీనికితోడు మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆర్భాటంగా వినతులు తీసుకుని పక్కన పడేస్తున్నారు. చంద్రబాబు స్వయంగా తీసుకున్న అర్జీలకే దిక్కులేని పరిస్థితి నెలకొంది. ఆయన కొడుకు, ఇతర మంత్రులు పీజీఆర్ఎస్ను ప్రచారానికి వాడుకోవడమే తప్ప.. సమస్యలను పరిష్కరించడంపై శ్రద్ధ చూపడం లేదు. సమస్యలు పరిష్కారం కాకుండానే పరిష్కారం అయిపోయినట్లు బాధితులకు మెసేజ్లు పంపిస్తున్నారు. ఇలాంటి నిస్సహాయ పరిస్థితుల్లో కలెక్టరేట్ల వద్ద పలువురు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటుండటం తెలిసిందే.మా భూమి లోంచి మమ్మల్ని వెళ్లగొడుతున్నారు పది ఎకరాల భూమిని మా తాతలు, ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుని బతుకుతున్నాం. ఇప్పుడు కొందరు రాజకీయ పలుకుబడితో మా భూములు ఖాళీ చేయాలని మమ్మల్ని బెదిరిస్తున్నారు. మాకు న్యాయం చేయాలని కలెక్టరేట్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకునే వాళ్లే లేరు. ఆదివాసీలమైన మేం ఎక్కడికి పోవాలి? – చీడిపల్లి దేముడమ్మ, జెడ్ జోగుంపేట, రావికమతం మండలం, అనకాపల్లి జిల్లా దొంగ రికార్డులతో బెదిరిస్తున్నారు సర్వే నంబర్ 49లో ఉన్న నా విలువైన భూమిని కాజేయడానికి ఊళ్లో కేటుగాళ్లు నా పేరుతో ఉన్న పత్రాలను మార్ఫింగ్ చేసి దొంగ రికార్డులు సృష్టించారు. వాటి ద్వారా నా భూమిని కాజేయడానికి ప్రయత్నిస్తున్నారు. కలెక్టరేట్కు వచ్చి మొరపెట్టుకుంటే రెవెన్యూ వాళ్లు నా ఫైలును పక్కనపెట్టి కాలయాపన చేస్తున్నారు. కళ్ల ముందే నా భూమి చేజారిపోతోంది. – టి.గిరిజమ్మ, ఒడ్డుపల్లి, శ్రీరంగరాజపురం మండలం, చిత్తూరు జిల్లా ఆన్లైన్లో నా పేరు మారిపోయింది నా భర్త ఆర్మీలో దేశ సరిహద్దుల్లో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆర్మీ కోటా కింద 2022లో బురుజుపల్లిలో ఆయనకు ఐదు ఎకరాల భూమి కేటాయించారు. ఆయన చనిపోవడంతో ఆ భూమిని నా పేరుపైకి మార్పించుకున్నా. ఎవరో ఏదో చేయడంతో ఇప్పుడు మళ్లీ నా భర్త పేరే ఆన్లైన్లో కనిపిస్తోంది. ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. ఈ వయసులో తిరగలేక చచ్చిపోతున్నా. – కె.సరస్వతి, జవాన్ చిన్న రామయ్య భార్య, బురుజుపల్లి, గుర్రంకొండ మండలం, అన్నమయ్య జిల్లాకూటమి నేతల బెదిరింపులు..గుండెపోటుతో దళిత రైతు మృతి బుచ్చెయ్యపేట: కూటమి నేతలు భూమిని లాక్కుంటారన్న భయంతో తీవ్రవేదనకు గురైన అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలంలోని రాజాం గ్రామానికి చెందిన దళిత రైతు నందికొళ్ల నూకరాజు(36) గుండెపోటుతో మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే... నూకరాజు తండ్రి సాంబయ్య 40 ఏళ్లుగా తైపురంలో ఐదు ఎకరాల డి–పట్టా భూమిని సాగు చేసేవాడు. ఆయన మరణం తరువాత నూకరాజు సాగు చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ భూమిని 22ఎలో పెట్టి హోల్డ్లో ఉంచింది. ఇటీవల తైపురానికి చెందిన కూటమి నేతలు నూకరాజు భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ కలెక్టర్, టీడీపీ ఎమ్మెల్యే కలిదిండి సూర్యనాగ సన్యాసిరాజుకు ఫిర్యాదు చేశారు. దీంతో మండల రెవెన్యూ అధికారులు పలుసార్లు ఆ భూమిని సర్వే చేశారు. నూకరాజు అడ్డుకుని తన తండ్రి పేరుపై ఉన్న డి–పట్టా రికార్డులను చూపించాడు. రెండు రోజుల కిందట ఎమ్మెల్యే రాజు చోడవరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కూటమి నేతలు మళ్లీ నూకరాజు భూమిపై ఫిర్యాదు చేశారు. దీంతో నూకరాజు తన భూమిని కూటమి నేతలు లాక్కుంటారని ఆందోళన చెందాడు. తమ గతేంటని భార్య భవానీతో శుక్రవారం రాత్రి చెబుతూ బాధపడ్డాడు. అనంతరం గుండెపోటుకు గురై మృతిచెందాడు. కూటమి నేతల ఫిర్యాదుల వల్లే నూకరాజు మృతిచెందాడని ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. జెడ్పీటీసీ సభ్యుడు దొండా రాంబాబు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మరిసా శ్రావణ్ తదితరులు నూకరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. నూకరాజు కుటుంబానికి అన్యాయం చేయాలని చూస్తే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. నూకరాజు మృతదేహానికి శనివారం రాజాంలో అంత్యక్రియలు నిర్వహించారు. మాటలు కబ్జాలపై.. చేతలు కబ్జాలతోకబ్జాలు అరికట్టడానికి గుజరాత్ తరహా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చామని ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు, టీడీపీ శ్రేణులే ఆచరణలో కబ్జాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విశాఖపట్నం జిల్లాలో విలువైన ప్రభుత్వ భూములను 22ఎ జాబితా నుంచి తొలగించి, అధికార పార్టీకి చెందిన ప్రైవేట్ వ్యక్తులకు బదలాయిస్తూ.. ఆ గుట్టు బయట పడడంతో చివరి నిమిషంలో ఆగిపోయారు. విశాఖ, తిరుపతి, అన్నమయ్య సహా పలు జిల్లాల్లో టీడీపీ నేతలు ఖాళీ భూములను కబ్జా చేసినట్లు రోజుకో ఘటన వెలుగు చూస్తోంది.కళ్లెదుటే భూ ఆక్రమణవైఎస్సార్ కడప జిల్లా పెద్దముడియం మండలం పెద్దపసుపులకు చెందిన ఈమె పేరు వెంకట లక్ష్మమ్మ. సర్వే నంబర్లు 1,470, 1,471లో ఈమెకు 3.32 ఎకరాల పట్టా భూమి ఉంది. అందులో ఎకరంన్నర భూమిని ఊళ్లో పెత్తందార్లు ఆక్రమించారు. తిరిగి ఈ భూమిని దక్కించుకోవడానికి ఆమె ఎన్నో ఏళ్లు పోరాడాల్సి వచ్చింది. ఎట్టకేలకు కోర్టు ద్వారా సాధించుకున్నారు. అయితే కోర్టు ఆదేశాలున్నప్పటికీ, రెవెన్యూ వాళ్లు ఈ భూమిని 1బీ రికార్డుల్లో చేర్చి, ఆన్లైన్ చేయడం లేదు. ఫలితంగా తన భూమి దక్కడం లేదని ఆమె కన్నీటి పర్యంతమవుతున్నారు.78 ఏళ్ల నాటి భూమిని నకిలీ పత్రాలతో అమ్మేశారు ఇతని పేరు చంద్రాయుడు. వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు. ఇతని తాత బాలయ్య.. సర్వే నంబర్ 676/2లో 0.68 సెంట్ల స్థలాన్ని 1948లోనే కొన్నారు. 78 ఏళ్లుగా ఈ భూమి వీరి స్వాధీనంలోనే ఉంది. అందులో మూడు సెంట్లు జాతీయ రహదారి విస్తరణలోకి వెళ్తే ప్రభుత్వం వీరికి రూ.23,287 పరిహారం కూడా ఇచ్చింది. అంత పక్కా రికార్డు ఉన్న ఈ భూమిని కబ్జాదారులు నకిలీ పత్రాలు సృష్టించి వేరే వాళ్లకు అమ్మేశారు. సబ్ రిజిస్ట్రార్ దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేశారు. రికార్డులన్నీ పట్టుకుని పీజీఆర్ఎస్ మెట్లు ఎక్కినా తనకు సమాధానం చెప్పేవారే లేరని చంద్రాయుడు వాపోతున్నారు. -
మామిళ్లపల్లిలో మహిళా రైతులపై దాడి.. ఎన్హెచ్ఆర్సీ సీరియస్
సాక్షి, ఢిల్లీ: గుంటూరు మామిళ్లపల్లిలో మహిళా రైతులపై దాడి ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయ్యింది. ఎన్హెచ్ఆర్సీ, జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించాయి. ఏపీ డీజీపీ, గుంటూరు ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, పొన్నూరు రూరల్ సీఐ కృష్ణయ్య, పొన్నూరు రూరల్ ఎస్సై శ్రీహరి, చేబ్రోలు ఎస్సై వీరనారాయణ, తెనాలి సీఐ రాములు నాయక్, పొన్నూరు అర్బన్ వీరనాయక్పై చర్యలు తీసుకోవాలని కమిషన్కు నేతలు ఫిర్యాదు చేశారు.వైఎస్సార్సీపీ పొన్నూరు ఇంఛార్జ్ అంబటి మురళీకృష్ణ, ఎంపీ తనూజ రాణి నేతృత్వంలో మామిళ్లపల్లి మహిళ రైతులు.. మహిళా కమిషన్ను కలిసి ఫిర్యాదు చేశారు. మహిళల పరువుకు భంగం కలిగించేలా పోలీసులు ప్రవర్తించారని అంశాలు తమ దృష్టికి వచ్చాయని... మహిళల గౌరవం, పరువు భంగం కలిగించడానికి తీవ్రంగా పరిగణిస్తున్నామని మహిళా కమిషన్ పేర్కొంది. -
సాగు లక్ష్యం సాధ్యమేనా?
సాక్షి, హైదరాబాద్: వానాకాలం (ఖరీఫ్) సీజన్ పంటలకు వ్యవసాయ శాఖ భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 134.66 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేస్తూ...పంటల వారీగా విస్తీర్ణ లక్ష్యాలను ఖరారు చేసింది. ఇందులో వరి 69 లక్షల ఎకరాలు, పత్తి 48 లక్షల ఎకరాల్లో సాగవుతాయని భావిస్తోంది. మొక్కజొన్న, కందులు, సోయాబీన్, పెసలు, మినుములు, జొన్నలు, సజ్జలు, నూనెగింజల పంటలన్నీ కలిపి కేవలం 17.66 లక్షల ఎకరాల్లో సాగు కావొచ్చని అంచనా వేసింది. దీనికి అనుగుణంగా అవసరమైన విత్తనాలతోపాటు యూరియా, ఇతర ఎరువులను కూడా సిద్ధం చేస్తోంది. అయితే వ్యవసాయశాఖ లెక్కలకు భిన్నంగా వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నా యని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరోవైపు ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో వ్యవసాయశాఖ నిర్దేశించిన లక్ష్య మేరుకు సాగు సాధ్యమవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వరి, పత్తి సాగుకే రైతుల మొగ్గు రైతులు ఇప్పటికీ వరి, పత్తి పంటలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి, వరిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుండడంతో రైతులు ఆ పంటల వైపే మొగ్గు చూపుతున్నాయి. మొత్తం సాగు విస్తీర్ణంలో దాదాపు 90 శాతం వరి, పత్తి పంటలకే రైతులు మొగ్గు చూపుతారని వ్యవసాయశాఖ చెబుతోంది. అయితే వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోతే మొదటి ప్రభావం కూడా వరి, పత్తిపైనే పడుతుంది. గత ఏడాది 132 లక్షల ఎకరాల్లో.. గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలో మొత్తం 1.32 కోట్ల ఎకరాలకు పైగా వివిధ రకాల పంటలు సాగయ్యాయి. అందులో వరి 67.04 లక్షల ఎకరాలు, పత్తి 45.85 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 6.41 లక్షల ఎకరాలు, కందులు 4.92 లక్షల ఎకరాలు, సోయాబీన్ 3.62 లక్షల ఎకరాలు ఉన్నాయి. మొత్తంగా సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే 100 శాతానికి పైగా సాగు నమోదైంది. గత ఏడాది మంచి వర్షాలు, చెరువులు–ప్రాజెక్టుల్లో సమృద్ధిగా నీటి నిల్వలు ఉండటం వల్ల రైతులు ధైర్యంగా సాగు చేపట్టగలిగారు. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. వేసవి ప్రారంభం నుంచే నీటి లభ్యతపై ఆందోళన నెలకొంది. ప్రాజెక్టుల్లో తగ్గిన నీటి నిల్వలు రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రస్తుతం ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేవు. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, లోయర్ మానేరు, కడెం వంటి ప్రాజెక్టుల్లో నిల్వలు తగ్గుముఖం పట్టాయి. కాళేశ్వరం పరిధిలోనూ నీటి లభ్యతపై రైతుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. వానలు ఆలస్యమైతే దుక్కులు దున్నడం నుంచి నాట్ల వరకు మొత్తం వ్యవసాయ కార్యాచరణ ప్రభావితమయ్యే ప్రమాదముందని అధికారులు చెబుతున్నారు. నీటి అవసరం అధికంగా ఉండే వరి సాగుపై దీని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు సకాలంలో రాష్ట్రంలోకి ప్రవేశించి, సాధారణ వర్షాలు కురిస్తేనే వ్యవసాయశాఖ నిర్దేశించిన 134 లక్షల ఎకరాల సాగు లక్ష్యం చేరుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే వర్షాభావ పరిస్థితులు, నీటి కొరత కారణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు. అందుకే ఈసారి ఖరీఫ్ భవితవ్యం పూర్తిగా వరుణుడి కరుణపైనే ఆధారపడి ఉందని వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర రైతాంగం ఇప్పుడు వానల రాక కోసం ఎదురు చూస్తోంది. -
కష్టాల్లో కౌలు రైతు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ రంగంలో కీలక భూమిక పోషిస్తున్న కౌలు రైతులు ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. క్షేత్ర స్థాయిలో సాగు చేస్తున్నది కౌలు రైతులే అయినా, ప్రభుత్వ పథకాలు, మద్దతు వ్యవస్థలు కేవలం పట్టాదారులకే పరిమితం కావడం వల్ల వీరు దారుణమైన ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నారు. తెలంగాణలో వ్యవ సాయాన్ని ప్రధానంగా కౌలు రైతులే నడిపిస్తున్నా, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, పంట కొనుగోళ్లు, ప్రకృతి విపత్తు పరిహారం వంటి కీలక మద్దతు వ్యవస్థలకు వారు దూరమవుతున్నారు.కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలంగాణ కౌలు రైతుల సర్వే–2026’లో 22 జిల్లాల్లోని 57 గ్రామాలకు చెందిన 1,816 మంది కౌలు రైతులను ఇంటర్వ్యూ చేశారు. సర్వే ప్రసిద్ధ ఆర్థికవేత్త ప్రొఫెసర్ డి.నర్సింహారెడ్డి నేతృత్వంలో సాగింది. మంగళవారం అధ్యయన నివేదికను జస్టిస్ సుదర్శన్రెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి, జస్టిస్ చంద్రకుమార్ తదితరుల సమక్షంలో హైదరాబాద్లో విడుదల చేశారు. పెరిగిన కౌలు ధరలు.. తగ్గిన నికర ఆదాయం తెలంగాణలో కౌలు ధరలు అనూహ్యంగా పెరిగాయి. గరిష్టంగా ఎకరాకు రూ.53,000 వరకు వసూలు చేస్తున్నారని సర్వేలో తేలింది. 2022లో సగటున 5 ఎకరాలుగా ఉన్న కౌలు భూమి, ఇప్పుడు 6.7 ఎకరాలకు పెరిగింది. చిన్న కౌలు రైతులు లాభసాటి వ్యవసాయం కోసం ఎక్కువ భూమిని కౌలుకు తీసుకోవాల్సి వస్తుండగా, ఉన్న తక్కువ నికర ఆదాయం వారిని అప్పుల ఊబిలోకి నెడుతోంది. వ్యవసాయంలో లాభాలు తగ్గుతున్నా కౌలు రేట్లు మాత్రం భారీగా పెరిగాయి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలంటే ఎక్కువ భూమి సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని సర్వే పేర్కొంది. ఓటీపీలతో యూరియా కొనుగోలు, పంట అమ్మకాల అవస్థలు యాసంగి సీజన్లో ప్రవేశపెట్టిన యాప్ ఆధారిత యూరియా పంపిణీ విధానం కౌలు రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగించినట్టు అధ్యయనం తేల్చింది. ⇒ భూ యజమాని ఓటీపీ తప్పనిసరి కావడంతో సర్వేలో పాల్గొన్న 1,816 మందిలో కేవలం 412 మంది (22.8 శాతం) మాత్రమే సబ్సిడీ యూరియాను పొందగలిగారు. వారిలో కూడా కేవలం 40 మంది మాత్రమే తమ పేర్లపై యూరియా తీసుకున్నారు. మిగతావారు భూ యజమానుల వివరాలపై ఆధారపడాల్సి వచి్చంది. సబ్సిడీ అందని రైతులు బహిరంగ మార్కెట్లో ఒక్కో సంచికి రూ.500 వరకు చెల్లించి కొనుగోలు చేసినట్టు సర్వే తెలిపింది. ⇒ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంట విక్రయానికి పట్టాదారు పాస్బుక్, ఆధార్ లింకేజీ, ఓటీపీ వంటి నిబంధనలు ఉండటంతో కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పత్తి రైతుల్లో కేవలం 6.7 శాతం మంది మాత్రమే తమ పేర్లతో సీసీఐకి విక్రయించగలిగారు. ⇒ వరి విషయంలో ఖరీఫ్లో 20 శాతం, యాసంగిలో 17.2 శాతం మంది మాత్రమే తమ పేరుతో విక్రయించినట్టు సర్వే వెల్లడించింది. మిగతా వారు ఇతరుల పేర్లతో విక్రయించి కమీషన్లు చెల్లించాల్సి వస్తోందని పేర్కొంది. ప్రకృతి విపత్తు పరిహారం కూడా అందని ద్రాక్షే గత మూడు సంవత్సరాల్లో వరదలు, అకాల వర్షాలు, వడగళ్ల వానలతో 85.2 శాతం మంది కౌలు రైతులు పంట నష్టాన్ని చవిచూశారు. అయితే బాధితుల్లో కేవలం 11 మందికి మాత్రమే, అంటే 0.7 శాతం మందికి మాత్రమే పరిహారం నేరుగా వారి ఖాతాల్లో జమైంది. కొన్ని సందర్భాల్లో భూ యజమానులు పరిహారం తీసుకొని కౌలు రైతులకు ఇవ్వలేదని సర్వే గుర్తించింది. పంట రుణాలు భూయజమానులకు మాత్రమే అందుబాటులో ఉండటంతో కౌలు రైతులు పూర్తిగా ప్రైవేట్ అప్పులపైనే ఆధారపడుతున్నారు. 24 నుంచి 36 శాతం వరకు వడ్డీతో అప్పులు తీసుకుంటున్నట్టు రైతులు తెలిపారు. ఒక్కో రైతుపై రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ప్రైవేట్ అప్పుల భారం ఉన్నట్టు సర్వే వెల్లడించింది. రుణమాఫీ పథకాల ప్రయోజనాలు కూడా వీరికి అందడం లేదని పేర్కొంది. ఎంఎస్పీ కంటే తక్కువ ధరలకు అమ్మకాలు ప్రభుత్వ కొనుగోళ్లలో అవకాశాలు లేకపోవడంతో కౌలు రైతులు బహిరంగ మార్కెట్లో కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కంటే తక్కువకు పంటలు అమ్ముకోవాల్సి వస్తోందని సర్వే తెలిపింది. దీంతో 5 ఎకరాల కౌలు రైతుకు పత్తిలో రూ.64,400, వరిలో రూ.40,350, మొక్కజొన్నలో రూ.87,800, సోయాబీన్లో రూ.53,120 వరకు నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా వేసింది. ఎరువుల సబ్సిడీ, పంట కొనుగోలు, విపత్తు పరిహారం, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా కౌలు రైతుల ఖాతాల్లోకి చేరేలా వ్యవస్థను రూపొందించాలని కోరింది. ‘కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభించాలి’ హిమాయత్నగర్ : కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని పలువురు వక్తలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నివేదిక విడుదల చేసిన అనంతరం వారు మాట్లాడారు. కౌలు రైతులకు వెంటనే గుర్తింపు కార్డులు జారీ చేసి అన్ని ప్రభుత్వ పథకాలను నేరుగా అందించాలన్నారు. జస్టిస్ సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ 2011 లైసెన్స్డ్ కల్టివేటర్స్ చట్టాన్ని అమలు చేసి కౌలు రైతులకు గుర్తింపు కల్పించాలని చెప్పారు. సీఎం, వ్యవసాయ, రెవెన్యూ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని రైతు కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డిని కోరారు. దీనికి స్పందించిన కోదండరెడ్డి కౌలు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. -
ఉండవల్లి సీఆర్డీఏ గ్రామసభలో గందరగోళం
గుంటూరు: రాజధానికి భూములు ఇచ్చే లేదంటూ ఉండవల్లి రైతులు తెగేసి చెప్పారు. తమ భూములు లాక్కోవద్దని, తాము భూములు ఇవ్వమంటూ స్పష్టం చేశారు. భూసేకరణ నుంచి ఉండవల్లిని మినహాయించాలని రైతులు కోరారు. ఈ మేరకు ఉండవల్లిలో నిర్వహించిన సీఆర్డీఏ గ్రామసభలో రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని రాజధాని పరిసర ప్రాంతాల్లో వినిపిస్తున్నమాట ఇదే. అంతకుముందు కూడా ఇదే జరిగింది. గత నెలలో గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కూరగల్లులో సీఆర్డీఏ గ్రామసభ నిర్వహించగా అక్కడ కూడా అధికారులకు చుక్కెదురైంది. ఈ గ్రామ సభకు హాజరైన రైతులు.. సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భార్గవ్ను నిలదీశారు. మాకే ఎందుకిలా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు ఇచ్చే ప్రాధాన్యత తమకు ఇవ్వడం లేదన్నారు. తమకు డెవలప్ చేయని ప్లాట్లు ఇస్తున్నారని, అభివృద్ధి చేసిన ప్లాట్లు ఎందుకు ఇవ్వడం లేదని రైతులు నిలదీశారు. లోన్ కోసం బ్యాంకులకు వెళ్తే అవి పనికిరావని చెబుతున్నారని, తమకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. తాము భూములు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. -
రేపు వర్షం వస్తుంది !
వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతికత రోజురోజుకు పెరుగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వంతో పాటు అధికారులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా అన్నదాతలకు వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారం ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) ఆధారిత ‘తెలంగాణ వాతావరణ సమాచారం’ కార్యక్రమాన్ని తాజాగా ప్రారంభించారు. వాతావరణ శాఖ సహకారంతో తొలిదశలో రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ జాబితాలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, రాజన్న సిరిసిల్లా, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, కుమురం భీం, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి.నేరుగా వాట్సాప్కు...వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారాన్ని నేరుగా రైతుల సెల్ఫోన్ వాట్సాప్కు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) ఆధారిత సలహాలను చేరవేస్తారు. ఏఐ, డిజిటల్ సాంకేతిక డేటాల అనుసంధానంతో శాటిలైట్ ఆధారిత వాతావరణ అంచనాలతో రూపొందించిన సమాచారం అందుతుంది. ఈ కార్యక్రమం అమలుకు డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్(డీఐఎల్), ఇండియా ఎవిడెన్స్ యాక్షన్ సంస్థలతో వ్యవసాయ శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.విత్తనాలు, ఎరువులపై కూడా..వర్షాలు, ఉష్ణోగ్రతలు, వడగాలులే కాక రాబోయే వాతావరణ మార్పుల ముందస్తు అంచనాలను రైతులకు అందించనున్నారు. ఇవికాక వాతావరణం, వర్షాపాతం ఆధారంగా ఏ సమయంలో ఏ విత్తనాలు వేయాలి, ఎరువులు వాడాలి, పంటలను ఎలా రక్షించుకోవాలనే అంశంపై నిపుణుల సలహాలు కూడా ఇందులో ఉంటాయి. తాజా వాతావరణ పరిస్థితులతో పాటు సలహాల కోసం స్థానిక వ్యవసాయ అధికారులను కూడా సంప్రదించవచ్చు. దీంతో పాటు ఎప్పటికప్పుడు ఐఎండీ సూచనలను తెలుసుకోవడానికి Met centre Hyderabad& IMD ఈ ను సందర్శించే అవకాశం కల్పించారు. రాబోయే ఎల్నినో వంటి క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు తట్టుకుని పంట నష్టాలను తగ్గించుకునేలా రైతులకు ఈ ఏఐ ఆధారిత వ్యవస్థ కచ్చితమైన సమాచారాన్ని అందించనుంది.ఖమ్మంలో జిల్లాలో 3.58 లక్షల మందికి..రైతు భరోసా పోర్టల్ ఆధారంగా 17 జిల్లాలకు చెందిన 15 లక్షల మందికి తొలిదశలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తద్వారా ఖమ్మం జిల్లాలో రైతు భరోసా సాయం అందుతున్న 3,58,753 మంది రైతుల సెల్ఫోన్ నంబర్లను అనుసంధానం చేశారు. ఆయా రైతులకు ఎప్పటికప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితులపై ఏఐ ఆధారిత వాతావరణ వివరాలు అందుతున్నాయి. అయితే, ఇందులో నమోదుకాని రైతులు వ్యవసాయ శాఖ, వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించే అవకాశాన్ని కల్పించారు.రైతులకు ప్రయోజనంఏఐ ఆధారిత ముందస్తు వాతావరణ సమాచారం, పంటల నిర్వహణపై సలహాలు రైతులకు ఉపయోగపడతాయి. ప్రస్తుతం అందరి చేతుల్లో సెల్ఫోన్ ఉంటున్నందున వాట్సాప్కు వాతావరణం, పంటల సాగుపై సలహాలు అందుతాయి. ఈ సమాచారం ఆధారంగా రైతులు సాగులో ముందుకు సాగే అవకాశం ఉంటుంది.– ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి -
వరి కొయ్యలే ఊపిరాపె
మిరుదొడ్డి(దుబ్బాక): పచ్చని పొలాల్లో సిరుల రాశులను తీయాల్సిన రైతులకు వరి కొయ్యలు మృత్యుపాషాల్లా మారుతున్నాయి. అవగాహన రాహిత్యంతో కాలుస్తున్న వరి కొయ్యలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. వాటిని కాల్చే క్రమంలో వచ్చే పొగ ఊపిరిని ఆపేస్తున్నాయి. ఎగసి పడే మంటలు రైతుల ప్రాణాలను తీస్తున్నాయి. వరి కొయ్యలను కాల్చే క్రమంలో పచ్చని చెట్లు, వ్యవసాయ సామగ్రి దగ్ధమవుతుండగా, మూగజీవాలు సైతం మృత్యువాత పడుతున్నాయి. వారం రోజుల్లో మిరుదొడ్డి, అందె, దుబ్బాక మండలం ఎనగుర్తిలో వరి కొయ్యలను కాల్చే క్రమంలో ముగ్గురు రైతులు బలయ్యారు. సిరులు పండాల్సిన పంట పొలాల్లో రైతుల శవాల కమురు ముసురుకుంటోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వరి కొయ్యలను కాల్చడం వల్ల సంభవిస్తున్న ప్రాణ, ఆస్తి నష్టాలపై పెద్ద ఎత్తున అవగాహన కలి్పంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
సర్కార్ మాటలు నమ్మం.. ఏకతాటిపైకి రైతులు
-
జగన్ ను కలిసిన రైతులపై ఎల్లో మీడియా ట్రోలింగ్
-
విష ప్రచారం చేయడం దుర్మార్గం.. మేం రైతులం కాదా?... సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఉండవల్లి రైతుల ఆందోళన
-
విష ప్రచారం దుర్మార్గం.. మేం రైతులం కాదా
తాడేపల్లి రూరల్: రాజధాని ముఖ ద్వారమైన ఉండవల్లి రైతులపై సీడ్ యాక్సెస్ రోడ్డు విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, తామంతా నిజమైన రైతులమేనని ఆదివారం వారు తమ పట్టాదారు పాస్ పుస్తకాలు చేత పట్టుకుని సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ శ్రేణులు దుష్ప్రచారం చేస్తున్న విధంగా తాము దోషులం, దుండగులం కాదని నినదించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. రాజధాని ముఖ ద్వారమైన ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో పంట పొలాలకు రాజధాని ప్రకటించకముందే కోట్ల రూపాయల విలువ ఉందని చెప్పారు. తుళ్లూరులో రూ.5 లక్షలు ఉంటే ఉండవల్లిలో అప్పట్లోనే ఎకరం రూ.కోట్లు పలికిందని తెలిపారు. ‘అక్కడ 2 ఎకరాల నుండి 10 ఎకరాలున్న రైతులు ఎక్కువ మంది ఉంటే, ఈ ప్రాంతంలో 10 సెంట్ల నుంచి 25 సెంట్ల వరకు ఉన్న రైతులు ఎక్కువగా ఉన్నారు. వారికి కౌలు సంవత్సరానికి రూ.లక్షల్లో వస్తుంది. మాకు వేలల్లో కూడా రాదు. ఆ కౌలుతో మేము ఎలా బతకాలి? రాజధాని ప్రకటించినప్పటి నుంచి మేము ఆందోళన చేస్తూనే ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి వచ్చినప్పటి నుంచి రాజధానిలో నివాసముండే కొంత మంది టీడీపీ నాయకులు మాపై దుష్ప్రచారం చేయిస్తున్నారు. టీడీపీ సెంట్రల్ కార్యాలయం నుంచే ఈ కుట్ర అమలవుతోంది. ఫలితంగా 150 పైచిలుకు యూట్యూబ్ చానల్స్లో మాలో ప్రతి ఒక్కరి గురించి వేర్వేరుగా మాటల్లో చెప్పడానికి వీలులేని విధంగా విష ప్రచారం చేస్తున్నారు. కులం పేరుతో దూషిస్తున్నారు. ఇలా దుర్మార్గంగా దుష్ప్రచారం చేయడం చాలా బాధేస్తోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు ఇంకా ఏమన్నారంటే.. దుష్ప్రచారం చేయడం సరికాదుఉండవల్లిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మించడానికి 99 శాతం మంది రైతులు కులాలు, మతాలతో సంబంధం లేకుండా భూములను అందజేశాం. 20–25 సెంట్లు ఉన్న రైతులకు ఇదే జీవనాధారం కాబట్టి లాండ్ పూలింగ్ నుంచి, ఇతర అంశాల నుంచి మినహాయించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. దీన్ని వేరేవిధంగా స్క్రోలింగ్ చేయడం, ప్రచారం చేయడం సబబు కాదు. తుళ్లూరులో 2015కు ముందు ఎకరం రూ.5 లక్షలు ఉంటే, ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో రూ.4 కోట్లు ఉండేది. 2014కు ముందు ఉండవల్లి, పెనుమాకలో ఎకరం భూమి అమ్మి తుళ్లూరులో 10–20 ఎకరాలు కొనొచ్చు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కళ్యాణ్ అన్నయ్య, సినీ హీరో చిరంజీవి 2010కి ముందు ఇక్కడ ఎంతకు పొలం కొన్నారో విచారించండి. అప్పుడు మేము అడిగేది న్యాయమా.. కాదా.. అని మీకే తెలుస్తుంది. కిరణ్ కుమార్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉండవల్లి గుహల ముందు టౌన్ ప్లానింగ్ అభివృద్ధికి 400 ఎకరాల పొలం తీసుకునేందుకు యత్నించారు. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడును హైదరాబాద్ వెళ్లి కలసి మా సమస్య విన్నవించుకున్నాం. నాలుగు పంటలు పండే భూములు ఎలా తీసుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇక్కడ 20–25 సెంట్ల పొలాల్లో రెండు మూడు పంటలను ఒకేసారి పండిస్తున్నాం. తుళ్లూరు.. ఆ చుట్టు పక్కల వర్షం పడితేనే పంటలు పండుతాయి. వారికి ఆ భూములు ఇవ్వడం వల్ల ఎటువంటి నష్టం లేదు. మాకు మా కుటుంబాలకు ఈ భూములే జీవనాధారం. మా భూములను మాకు వదిలేయండి..మేము అభివృద్ధికి అడ్డంటూ టీడీపీ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. మా సమస్యలను విన్నవించుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి నారా లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్కు ప్రయత్నించినా ఇవ్వలేదు. మా భూములను రక్షించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలను కలిశాము. ఇందులో భాగంగానే వైఎస్ జగన్ను కలసి మా గోడు వెళ్లబోసుకున్నాం. ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకోండి. మా భూములను మాకు వదిలేయండి. భూ సమీకరణ/భూ సేకరణ నుంచి ఉండవల్లిని మినహాయించండి. లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తాం’ అని రైతులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నేతలు ఈశ్వర్రెడ్డి, ఈశ్వరరావు, ఉండవల్లి అశ్వనికుమార్, భాస్కరరావు, మున్నంగి శ్రీధర్రెడ్డి, గుంటక నరేష్రెడ్డి, చందు చిన్న బసవయ్య, గోపాలం ప్రభాకరరావు, అశోక్రెడ్డి, గుర్రాల శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ కళ్లం సంజీవరెడ్డి, ఈశ్వరయ్య, తెన్నేరు కోటేశ్వరరావు, తెన్నేరు నాగభూషణం, సందు సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
వీళ్ల మాటలు నమ్మొద్దు
తాడేపల్లి రూరల్: ‘రాజధాని గ్రామాల్లో భూములు ఇవ్వని రైతులను ప్రభుత్వం బుజ్జగింపులు, వేధింపులతో లోబరుచుకుంటోంది. తొలుత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేతలు, అధికారులను మన దగ్గరకు పంపించి బుజ్జగిస్తుంది. ఓ అధికారి మనకు ఇచ్చిన హామీలను నెరవేర్చే లోపే ఆయన స్థానంలో మరో అధికారి వస్తారు. నాకు తెలియదని చెబుతారు. ఇలాంటివి చూస్తూనే ఉన్నాం. అందుకని రైతులందరం ఒకేతాటిపై నిలిచి పోరాటం చేద్దాం’ అని రైతు, ప్రముఖ వైద్యుడు డాక్టర్ కన్నారావు నాయుడు అన్నారు.ఈ నెల 9వ తేదీన మంగళవారం జరిగే గ్రామసభ సన్నాహాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఉండవల్లిలో రైతులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గ్రామ సభలో ఏం మాట్లాడాలి.. అధికారుల ప్రశ్నలకు ఏవిధమైన సమాధానాలు చెప్పాలి.. ఎలాంటి అభ్యంతరాలు తెలపాలనే విషయమై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు ఈశ్వర్రెడ్డి, మున్నంగి శ్రీధర్రెడ్డిలు మాట్లాడారు.అనంతరం డాక్టర్ కన్నారావు నాయుడు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి వచ్చిన తర్వాత రాజకీయాలతో సంబంధం లేని తనలాంటి వ్యక్తులను కూడా సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నోటికి వచ్చినట్లు అసభ్యంగా పోస్టులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏమన్నారంటే.. రిజిస్ట్రేషన్ వ్యాల్యూ తగ్గిస్తారు.. ‘అధికారులు మన భూములు తీసుకునేందుకు మొదట బుజ్జగించారు. కొంతమంది రైతులు వారికి సహకరించారు. అయినా వారికి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. పంట పండించే రైతుకు రాజకీయ నాయకుల, అధికారుల రాజకీయం తెలియదు. మనపై ప్రేమ ఉన్నట్లు రాజధానిలో ఎక్కడా లేని విధంగా భూముల రేట్లు పెంచి మన భూములు తీసుకుంటారు. ఇక్కడే అసలు రాజకీయం ఉంది. కొన్న భూమిని అతి తక్కువ వ్యాల్యూతో రిజిస్ట్రేషన్ చేయిస్తారు. దీంతో గ్రామంలోని రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది.మనందరం మన భూమిని అమ్ముకోవడంలో రిజిస్ట్రేషన్ వ్యాల్యూ తగ్గిస్తే గ్రామాన్ని నాశం చేసినట్లే. 1995 నుంచే మన భూములకు ఎక్కువ విలువ ఉంది. తాడేపల్లి భూముల కన్నా మన భూముల రేట్లే ఎక్కువ. ప్రభుత్వం ఎన్ని కుతంత్రాలు చేసినా న్యాయస్థానాల్లో మనకు న్యాయం లభిస్తుంది. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం గ్రామంలో సామాజిక సర్వే జరపాల్సి ఉంది. దాన్ని సైతం క్రాస్ చేసి.. అధికారులు వివిధ ప్రాజెక్టుల కింద భూ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చారు. అన్నింటిపై ఒకేసారి గ్రామసభ నిర్వహించకూడదు. కానీ, అధికారులు విడివిడిగా జరిపినట్లు రాసుకుంటారు.వీటన్నింటిని మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. మన భూమి అంగుళం కూడా పోకుండా పోరాటం నిర్వహిస్తే మన ఊరు సస్యశ్యామలంగా ఉంటుంది’ అని కన్నారావు నాయుడు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో రైతులు దంటు బాలాజీరెడ్డి, పల్లపోలు అశోక్రెడ్డి, ఉప్పు రవి, కళ్లం సాంబిరెడ్డి, శిగిరిశెట్టి రత్నబాబు, శింగంశెట్టి రాంబాబు, పెన్నేరు కోటేశ్వరరావు, గుర్రాల గోపాలరావు, పెన్నేరు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రైతును రాజును చేస్తా!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘వడ్లు ఒక్కటే కాదు.. కొత్తిమీర, పాలకూర, కూరగాయలు, పండ్లు పండించండి. కొనుగోలు చేయిస్తా. దండగ అనుకున్న వ్యవసాయాన్ని పండుగ చేస్తా.. రైతును రాజు చేస్తా’అని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం కోహెడలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ సహా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ భవనాల సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. వచ్చే డిసెంబర్ నుంచే ఈ మార్కెట్లో క్రయవిక్రయాలు మొదలు పెడతామని, రెండేళ్లలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. గ్రీన్ చానల్ ద్వారా నిధులు మంజూరు చేయించుకోవాల్సిన బాధ్యత సంబంధిత మంత్రి, స్థానిక శాసన సభ్యుడిదేనని చెప్పారు. రేవంత్ ఇంకా ఏమన్నారంటే.. పండుగ అని నిరూపిస్తా.. ‘గతంలో నగరానికి ఎవరొచ్చినా.. వారికి అవసరమైన పాలు, పండ్లు, కూరగాయలు రంగారెడ్డి జిల్లా రైతాంగమే అందించేది. ఎటు చూసినా ద్రాక్ష తోటలే దర్శనమిచ్చేవి. ప్రస్తుతం పరిస్థితి మారింది. ఓఆర్ఆర్, ఎయిర్పోర్టు వచ్చింది. భూముల విలువ పెరిగింది. ఎకరాలు, గజాల్లోకి మారాయి. కాయగూరలు, పండ్ల తోటలు కనుమరుగయ్యాయి. మోదీ ప్రభుత్వంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. గ్రేటర్ జిల్లాల్లో 1.30 కోట్ల మంది జనాభా నివసిస్తోంది. నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో.. అంతే వేగంగా పండ్లు, కూరగాయల పంటలు తగ్గిపోయాయి. రైతాంగం మళ్లీ పంటలు పండించాలి. పాలు, పండ్లు అందించాలి. వ్యవసాయం దండగ కాదు.. పండుగ అని నిరూపించాల్సిన అవసరం వచ్చింది. పంట ఉత్పత్తులు మార్కెట్కు తీసుకొచ్చి విదేశాలకు అమ్ముకోవాలి. అక్కడికి వెళ్తే శ్మశానానికి వెళ్లినట్లే ఉంటుంది రంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందితే.. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వానికి 60 శాతం ఆదాయం ఈ జిల్లా నుంచే సమకూరుతోంది. నిత్యం రూ.కోట్ల విలువ చేసే ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవు. అక్కడికి వెళ్తే.. శ్మశానానికి పోయినట్లుగా ఉంటుంది. ప్రభుత్వానికి ఏటా రూ.17 వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఆఫీసుల్లో కనీసం కూర్చోడానికి కుర్చీ, తాగేందుకు నీళ్లు లేవు. ‘కస్టమర్ ఈజ్ అవర్ గాడ్’అన్నారు.. అలాంటి వారిని ఇలా నిలబెట్టడం ఎంతవరకు సమంజసం. ఓఆర్ఆర్కు ఆనుకుని 12 క్లస్టర్లుగా విభజించి, అత్యాధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్ సబ్రిజిస్ట్రార్ ఆఫీసులను నిర్మించుకుంటున్నాం. ఎవరి మెడలైనా వంచుతా... ‘కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డి తమాషాలు చేస్తున్నారు. చేతకాకపోతే దిగిపో అంటున్నరు. నేను అల్లాటప్పాగా రాలేదు. కష్టపడి, తొక్కుకుంటూ వచ్చా. కార్యకర్తలు కష్టపడితే వచ్చా. అవసరమైతే ఫాంహౌస్లో కేడీతోనైనా..ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడతా. ఎవరి మెడలైనా వంచుతా. 12 ఏళ్లు అయింది. ముందు మోదీని గద్దె దిగమనండి. రాహుల్గాం«దీతో ధాన్యం కొనుగోలు చేయిస్తా. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేయిస్తా, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్రోడ్డుకు నిధులు తెస్తా. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను అభివృద్ధి చేస్తా. మాటలతోపాటు చేతలు కూడా వచ్చు. ఈ నెల 15తో 75 లక్షల మెట్రిక్ ధాన్యం సేకరణ పూర్తవుతుంది. ఆ తర్వాత కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ సంగతి చెబుతా. మక్కలు ఎలా కొనుగోలు చేయరో తేలుస్తా. పొలిమేర్లు కూడా దాటలేరు. కేంద్రంలో మీ ప్రభుత్వం ఉందని, భయపెడితే.. భయపడే వాడిని కాదు. గుండు, అరగుండు మాట్లాడే మాటలన్నీ చూస్తున్నా. కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకొని, మన అవసరాలు వారికి వివరించి అవసరమైన నిధులు తెస్తా. దిక్కుమాలిన సలహాలు మాకొద్దు ప్రాజెక్టులు ఎలా కట్టాలో, లిఫ్ట్లో ఎలా కట్టాలో? మాకు హరీశ్రావు సలహా ఇస్తున్నాడు. తాటి చెట్టులా పెరిగాడు. మీ వద్ద నేర్చుకోవాల్సిన అవసరం లేదు. దిక్కుమాలిన సలహాలు మాకొద్దు. కేసీఆర్ కుర్చీ వేసుకుని పాలమూరు ఎత్తిపోతల కడతానని చెప్పి.. మందేసుకుని ఫాం హౌసులో కూర్చున్నాడు. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. అభివృద్ధే కాదు.. సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ఇప్పటికే నాలుగున్నర లక్షల ఇళ్లు ఇచ్చాం. కొత్తగా గ్రామీణ ప్రాంతాల్లో మరో రెండున్నర లక్షల ఇళ్లు, హైదరాబాద్లో లక్ష ఇళ్లు నిర్మించుకోబోతున్నాం. ఆడబిడ్డలకు రూ.60 వేల కోట్లు బ్యాంకు రుణాలు ఇచ్చాం. త్వరలోనే ఖాళీలను భర్తీ చేసుకోబోతున్నాం. ఆనాడు మీరు వి«ధ్వంసం చేస్తే.. మేను వికాసం వైపు నడిపిస్తున్నాం. మీ అసూయ, పగ, ద్వేషం మాపై చూపండి కానీ తెలంగాణ ప్రజలపై కాదు. కష్టాలు, నిధుల కొరత ఉంది. రూ. 8.11 లక్షల కోట్ల అప్పు ఉంది. అయినా ధైర్యం కోల్పోలేదు. వయసు చిన్నదైనా బాధ్యత పెద్దది. రోజుకు 18 గం టలు కష్టపడి ఈ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా. సమస్యలను చూసి పారిపోయే వాడిని కాదు. వాళ్లను పట్టించుకోవాల్సి అవసరం లేదు.. అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసుకున్నప్పుడే గుర్తింపు వస్తుంది. అడ్డం పడినా.. ఏడుపు వినేది లేదు. చేపట్టిన ఫ్యూచర్సిటీ, గ్రీన్ఫీల్డ్ రోడ్డు, మార్కెట్ను నిర్మించుకునేదే. కడుపులో మంట ఉన్నవాళ్లకు అజీర్తి ఉంటుంది. వాళ్లను పట్టించుకోవాల్సి అవసరం లేదు. వరి వేస్తే ఉరి అని చెప్పిన వాళ్లకు 1.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసి రైతుల సత్తా చూపాం. ఏ ఊరిలో వడ్లు పండించినా కాళేశ్వరం నీళ్లే అని చెప్పారు. కానీ ఇప్పుడు లేదు. రూ.లక్ష కోట్లు కోట్లు గోదావరిలో కలిపినోళ్లను..అదే గోదావరిలో కలపాల్సిన అవసరం ఉంది. అడ్డుకుంటే..అడ్రస్ లేకుండా చేస్తా.. అంతర్జాతీయ విమానాశ్రయం లాగే.. పండ్ల మార్కెట్ కూడా జిల్లాకు గుర్తింపు తెస్తుంది. కందుకూరులో పండే టమాటా ఎంతో రుచిగా ఉంటుంది. రైతుల పంటకు గిట్టుబాటు కోసం అక్కడ ఓ సాస్ కంపెనీ పెట్టబోతున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో కాలుష్య కారక ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని భావిస్తే.. మేము దాన్ని గ్రీన్ ఫార్మా ఫ్యూచర్సిటీగా మార్చుతున్నాం. మేము రైతు సంక్షేమం కోసం మార్కెట్లు, అనేక పరిశ్రమలు, ప్రాజెక్టులు, తెస్తుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ అడ్డుకుంటోంది. ఇలాగే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేస్తాం. షెడ్డుకు పోయిన కారును అడ్రస్ లేకుండా చేస్తాం’అని సీఎం హెచ్చరించారు. చివరగా ‘ఔర్ ఏక్ బార్.. కాంగ్రెస్ సర్కార్’నినాదంతో సీఎం తన ప్రసంగాన్ని ముగించారు. కాగా, రైతులు, వారికి మద్దతుగా నిలిచిన స్థానిక బీజేæపీ, బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్రెడ్డి పర్యటనలో అలజడి సృష్టించే ప్రమాదం ఉందని అనుమానించిన పోలీసులు వారిని ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి సాయంత్రం 5 గంటలకే శంకుస్థాపనకు హాజరు కావాల్సి ఉండగా, స్థానికంగా ఉన్న ఉద్రిక్తపరిస్థితులు, అకస్మాత్తు వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. -
‘డిస్కమ్’పై డౌట్స్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన రైతు డిస్కమ్పై సవాలక్ష అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని నివృత్తి చేయకుండా అనుమతి ఇవ్వడం ఎలా సాధ్యమని విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) భావిస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లువెత్తిన విమర్శలను ఈఆర్సీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది. ఆర్థిక, నిర్వహణతో పాటు డిస్కమ్ల మధ్య సమన్వయం ఎలా చేస్తారో స్పష్టత ఇవ్వాలని కోరింది. దీనిపై డిస్కమ్ అధికారులు కూడా సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. అధికారులే సరైన వివరణ ఇవ్వకపోతే లైసెన్స్ ఎలా ఇవ్వాలో అర్థమవ్వక ఈఆర్సీ తలపట్టుకుంది. తక్కువ సిబ్బందితో క్షేత్రస్థాయిలో ఇబ్బందులురాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఉచిత విద్యుత్తో పాటు మరికొన్ని కనెక్షన్ల కోసం రైతు డిస్కమ్ ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ను కొత్త డిస్కమ్కు సీఎండీగా నియమించింది. ఇప్పటికే రాష్ట్రంలో రెండు డిస్కమ్లున్నాయి. వీటి పరిధిలోనే ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల నిర్వహణ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 29,05,779 వ్యవసాయ పంపు సెట్లు, 489 భారీ లిఫ్టు పథకాలు, 99 హైదరాబాద్ మెట్రో కనెక్షన్లు, 1,132 మిషన్ భగీరథ కనెక్షన్లు, 639 తాగునీటి కనెక్షన్లను రెండు డిస్కమ్ల నుంచి తప్పించి మూడో డిస్కమ్ పరిధిలోకి తెస్తారు.అంటే మొత్తంగా 29,08,138 కనెక్షన్లు రైతు డిస్కమ్ పరిధిలోకి వస్తాయి. అనధికారికంగా ఉండే రైతు కనెక్షన్లు కలుపుకుంటే మొత్తంగా 30 లక్షల వరకూ ఉండే వీలుంది. ఇన్ని కనెక్షన్లకు కలిపి కేవలం 2 వేల మంది సిబ్బంది మాత్రమే నియమించారు. వీళ్ళలో వెయ్యి మంది విద్యుత్ కార్యాలయాల్లో పాలన విభాగంలో పనిచేస్తారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది వెయ్యి మాత్రమే.వీళ్ళలో చాలా వరకూ మండల కేంద్రాల్లో ఉంటారు. రైతు ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయినా, సాంకేతిక సమస్యలు వచ్చినా సిబ్బంది చేరుకోవడానికి సుదీర్ఘ సమయం పట్టే వీలుంది. మండలంలో ప్రతీ గ్రామానికి పరిమిత సంఖ్యలో ఉండే సిబ్బంది వెళ్ళడం కష్టమే. సిబ్బందితో త్వరగా పనులు చేయించుకోవడానికి రైతులు భారీగా ముడుపులు ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తే వీలుందని పలువురు అభ్యంతరాలు లేవనెత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో నిర్వహణ ఎలా అనే దానిపై అధికారులు సరైన వివరణ ఇవ్వలేకపోతున్నారు.ఆర్థిక పరిస్థితీ అయోమయంగత ఏడాది డిసెంబర్ 18 నాటికి ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న మొండి బకాయిలు రూ. 48,398 కోట్లు. ఈ మొత్తంలో రూ. 25,950 కోట్లు మూడో డిస్కమ్కు బదిలీ చేస్తున్నారు. అంటే డిస్కమ్ అప్పులతో పుడుతుంది. రైతు విద్యుత్ ఫీడర్ల వద్ద స్మార్ట్ మీటర్లు బిగిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో భాగంగా 5,22,479 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు స్మార్ట్ మీటర్లు బిగించాలి. ఒక్క స్మార్ట్ మీటరుకు రూ. 25 వేలు వెచ్చించాలి. మొత్తంగా రూ.1,306 కోట్లు ఖర్చు పెట్టాలి. మూడవ డిస్కమ్కు 35,218 (42%) మిలియన్ యూనిట్లు వినియోగం అవుతుందని అంచనా వేశారు.ఈ డిస్కం నుంచి ఎలాంటి ఆదాయం వచ్చే అవకాశం లేదు. వ్యయం మాత్రం పెరుగుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,95,58,748 కనెక్షన్లు ఉండగా అందులో 1,05,58,748 కనెక్షన్లకు సబ్సిడీ ఇస్తున్నారు. సుమారు రు.4000 కోట్ల వరకు సబ్సిడీ వస్తుంది. ఇప్పటికే విద్యుత్ పంపిణీ సంస్థలు వార్షిక ఆదాయ, వ్యయ నివేదిక (ఏఆర్ఆర్)లో రూ.14,000 కోట్లు లోటు చూపుతున్నారు. మూడో డిస్కమ్ను ఆర్థికంగా గట్టెక్కించడంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఈఆర్సీ కోరుతోంది. దీంతో పాటు పలు సందేహాలను కూడా నివృత్తి చేయాలని కోరింది. -
ఎరువు.. ధరల దరువు
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సాగు సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు ఎరువుల ధరల రూపంలో భారీ షాక్ తగిలింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి పదార్థాల ధరల పెరుగుదల నేపథ్యంలో కాంప్లెక్స్ ఎరువుల గరిష్ట చిల్లర ధరలను (ఎంఆర్పీ) ఎరువుల కంపెనీలు భారీగా పెంచాయి.రాష్ట్రంలో ఈ నెల నుంచే ప్రారంభమయ్యే వానాకాలం సీజన్లో వరి, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ తదితర పంటలు సాగు చేసే రైతులపై అదనపు భారం పడనుంది. ఈ పంటల్లో ప్రారంభ దశలోనే కాంప్లెక్స్ ఎరువుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే విత్తనాలు, కూలీల వేతనాలు, పురుగు మందుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఎరువుల ధరల పెంపు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అయితే యూరియా, డీఏపీ ధరలను కేంద్రం పెంచకపోవడం కొంత ఊరట. దిగుమతి భారం కావడంతో...దేశంలో ఫాస్ఫేటిక్, పొటాషిక్ ఎరువుల తయారీకి అవసరమైన ముడి పదార్థాల్లో అధిక భాగం దిగుమతులపైనే ఆధారపడి ఉంది. పశ్చిమాసియా ప్రాంతంలో భౌగోళిక ఉద్రిక్తతలు పెరగడంతో రవాణా వ్యయాలు, దిగుమతి ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఈ ప్రభావం కాంప్లెక్స్ ఎరువుల ధరలపై ప్రత్యక్షంగా పడింది. దీంతో సాగులో వినియోగించే కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచారు. కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ భారీగా పెంచింది.ఎరువుల వ్యాపార వర్గాలు, వ్యవసాయశాఖ సమాచారం ప్రకారం 20:20:0:13, 10:26:26, 17:17:17 వంటి కాంప్లెక్స్ ఎరువుల ధరలను బస్తాకు రూ.100 నుంచి రూ.500 వరకు పెంచారు. ముఖ్యంగా ఫాస్ఫేటిక్, పొటాషిక్ ఎరువుల తయారీకి అవసరమైన రాక్ ఫాస్ఫేట్, ఫాస్ఫారిక్ యాసిడ్, అమోనియా, పొటాష్ వంటి ముడి పదార్థాలను భారత్ పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటోంది. పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఈ ముడి పదార్థాల ధరలు, రవాణా ఖర్చులు పెరగడంతో కంపెనీలు ఎంఆర్పీలను సవరించినట్టు తెలుస్తోంది.యూరియా ధర పెంచకపోవడం ఊరటే రైతులు అత్యధికంగా వినియోగించే యూరియా, డీఏపీ ధరలు యథాతథంగా ఉన్నాయి. యూరియా బస్తా రూ.266.50, డీఏపీ బస్తా రూ.1,350కే లభిస్తోంది. భారీ సబ్సిడీ కారణంగా ఈ ధరలను ప్రస్తుతం పెంచకుండా కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం భారీ సబ్సిడీ భారం భరిస్తుండటంతో ఈ రెండు ఎరువుల ధరలను ప్రస్తుతం పెంచలేదు. దీంతో రైతులకు కొంత మేర ఊరట లభించినా, కాంప్లెక్స్ ఎరువుల ధరల పెరుగుదల మొత్తం సాగు వ్యయాన్ని పెంచనుంది. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం తెలంగాణలో ఖరీఫ్ సీజన్లో లక్షల టన్నుల కాంప్లెక్స్ ఎరువులు వినియోగిస్తారు.ఈ నేపథ్యంలో ధరల పెంపు ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా రైతులపై పడే అవకాశం ఉంది. కాంప్లెక్స్ ఎరువులపై పడిన భారం కార ణంగా ఖరీఫ్ సాగు ఖర్చులు పెరగడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. 20:20:0:13 బస్తాపై రూ.500 పెరిగితే వరి ఎకరానికి 3 బస్తాలు వాడితే రూ.1,500 అదనపు భారం కానుంది.పత్తి ఎకరానికి 3 బస్తాలు వాడితే రూ.1,500 అదనంగా భరించాల్సి వస్తుంది. అయితే రాష్ట్రంలో వరి, పత్తి, సోయాబీన్, మొక్క జొన్న, కూరగాయల పంటలకు కాంప్లెక్స్ ఎరువులతో పాటు యూరియాను కూడా అధికంగానే వినియోగించడం పరిపాటిగా మారింది. -
రాక్షస పాలనపై రణభేరి
సాక్షి, అమరావతి/సాక్షిప్రతినిధి కర్నూలు/సాక్షి,నెట్వర్క్: చంద్రబాబు రెండేళ్ల రాక్షసపాలనపై వైఎస్సార్సీపీ సమరభేరి మోగించింది. సర్కారు వైఫల్యాలపై గళమెత్తి గర్జించింది. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో గురువారం నుంచి 12 తేదీ వరకు మహోద్యమానికి శ్రీకారం చుట్టింది. తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. దగాకోరు సర్కారుకు వ్యతిరేకంగా కదంతొక్కింది. పోలీసు ఆంక్షలు, అణచివేతలను ధిక్కరించి రణన్నినాదం మోగించింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచి వెన్నుపోటే తన నైజమని బాబు మరోమారు నిరూపించుకున్నారని నిప్పులు చెరిగింది. పిల్లనిచ్చిన మామ నందమూరి తారకరామారావు నుంచి నేడు రాష్ట్ర ప్రజల వరకు అందరూ బాబు బాధితులేనని, ఈ దుష్ట పాలన రాష్ట్రానికి హానికరమని దుయ్యబట్టింది. ‘చంద్రబాబు రెండేళ్ల పాలనలో ప్రజలను వెన్నుపోటు పొడవడం మినహా చేసింది ఏమీ లేదు. సూపర్సిక్స్ హామీల్లోని ఆడబిడ్డనిధి, నిరుద్యోగ భృతిని గాలికొదిలేశారు. వలంటీర్లకు రూ.10వేల వేతనం ఇస్తామని చెప్పి దగా చేశారు. దగాకోరు బాబు నుంచి ప్రజలను కాపాడేందుకు అలుపెరగని పోరాటం చేస్తాం. మహోద్యమానికి ఉద్యుక్తులమవుతాం. నారాసురుడిని గద్దె దించే వరకు విశ్రమించం’’ అంటూ వైఎస్సార్సీపీ నేతలు ప్రతినబూనారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా రాష్ట్రవ్యాప్తంగా సాగిన ఈ ఆందోళన కార్యక్రమాల్లో ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లో ఎగిసిన ఆగ్రహజ్వాలలుగుంటూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు నిరసనలు చేపట్టారు. గుంటూరు గుజ్జనగుండ్ల, చుట్టుగుంట సెంటర్లలో టీడీపీ మేనిఫెస్టో ప్రతులు దహనం చేశారు. వైఎస్సార్సీపీ నేతలను రెచ్చగొట్టేందుకు టీడీపీ నేతలు వైఎస్ జగన్కు వ్యతిరేకంగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్నవైఎస్సార్సీపీ శిబిరం వద్దకు వచ్చి రెచ్చగొట్టే నినాదాలుచేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం పేరేచర్లలో వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అయినా పోలీసుల అడ్డంకులను అధిగమించి నేతలు ప్రదర్శనను జయప్రదం చేశారు. పల్నాడు జిల్లాలో నరసరావుపేట, రొంపిచర్లలో నిరసన కార్యక్రమం జరిగింది. పెదకూరపాడులో సూపర్సిక్స్ హామీల ప్రతులను దహనం చేశారు. వినుకొండలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై సీఐ ప్రభాకర్రావు జులుం ప్రదర్శించారు. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. మాచర్ల, సత్తెనపల్లి, గురజాలల్లో వైఎస్సార్సీపీ నేతలు నిరసనలు చేపట్టారు. అనంతపురం అంబేడ్కర్ సర్కిల్లో వైఎస్సార్సీపీ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఉమ్మడి అనంతపురం వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు సాగాయి. కర్నూలు జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. నంద్యాల కల్లూరులోని చెన్నమ్మ సర్కిల్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. శ్రీశైలంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. టీడీపీ మేనిఫెస్టో ప్రతులను, ప్రజలకు ఇచ్చిన హామీల బాండ్లను దహనం చేశారు. గుంటూరులో ర్యాలీగా వస్తున్న మాజీ మంత్రి అంబటి, ప్రజలు పోలీసులు అడ్డుకున్నా...శ్రీకాకుళం జిల్లాలో నిరసన ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. పోలీసులు అడుగడుగునా అడ్డుకునే యత్నం చేసినా వైఎస్సార్సీపీ నేతలు వెనుకడుగు వేయలేదు. పలాస నియోజకవర్గం మందసలో మానవహారం నిర్వహించారు. నరసన్నపేటలో మానవహారం చేపట్టి టీడీపీ మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. తిరుపతి, వెంకటగిరి, సూళ్లూరుపేటల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. రైల్వేకోడూరు, శ్రీకాళహస్తి, సత్యవేడు, చంద్రగిరి నియోజకవర్గాల్లోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో మండుటెండనూ లెక్క చేయకుండా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కారక్రమాలు చేపట్టారు. టీడీపీ మేనిఫెస్టో, సూపర్సిక్స్ హామీల బాండ్ ప్రతులను దహనం చేశారు. విశాఖలోని అక్కయ్యపాలెం హైవేపై మానవహారం నిర్వహించేందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో వైఎస్సార్సీపీ నేతలు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. పెందుర్తి, గాజువాకలో మానవహారం నిర్వహించి ఫ్లకార్డులు ప్రదర్శించి టీడీపీ మేనిఫెస్టోలను దహనం చేశారు. ఏలూరు, నూజివీడు, పోలవరంల్లో నిరసనలు చేపట్టారు. చిత్తూరు జిల్లాలో నిరసనలు జరిగాయి. వైఎస్సార్సీపీ నేతలు టీడీపీ మేనిఫెస్టో ప్రతులను దహనం చేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. నగరి, కార్వేటినగరం, పూతలపట్టు, బంగారుపాళ్యంలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బాపట్ల జిల్లా వేమూరు, రేపల్లెల్లో చంద్రబాబు దిష్టి»ొమ్మను వైఎస్సార్సీపీ నేతలు దహనం చేశారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో నిరసన ప్రదర్శనలు దిగ్విజయంగా సాగాయి. రాజమహేంద్రవరం, కాకినాడ జిల్లాల వ్యాప్తంగా నిరసనలు చేసి టీడీపీ మేనిఫెస్టోలు దహనం చేశారు. వైఎస్సార్ కడప జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు కదంతొక్కారు. అల్లూరి జిల్లా పాడేరులో భారీ ర్యాలీ నిర్వహించారు.ఉమ్మడి విజయనగరం జిల్లావ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు హోరెత్తాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగానూ నిరసనల ప్రదర్శనలు జరిగాయి. కొన్నిచోట్ల టీడీపీ మేనిఫెస్టో ప్రతులను వైఎస్సార్సీపీ నేతలు చించివేశారు. కొన్ని చొట్ల దహనం చేశారు. ఈ దహనం కార్యక్రమాలను పోలీసులు అడ్డుకున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి. -
మా భూములు మావి కాదా అన్నా.... వ్యవసాయం తప్ప.. కంట తడి పెడుతున్న రైతులు
-
బాబుకు బిగ్ షాక్.! మావిగన్ కి జై కొడుతున్న రాజధాని రైతులు
-
జగన్ ముందు బాబు చిట్టా విప్పిన రైతు.. బలవంతంగా భూములు లాక్కుంటున్నారు..!
-
అమరావతి రైతులకు అండగా ఉంటాం... వైఎస్సార్సీపీ తరఫున లీగల్ ప్యానెల్ ఏర్పాటు... రాజధాని గ్రామాల రైతులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా
-
అమరావతి రైతులకు అండగా ఉంటాం
సాక్షి, అమరావతి: ‘రైతులను సంతోష పెట్టే విధంగా ఉండాలన్నదే మా అభిమతం.. ముందు నుంచి మా వైఖరి అదే.. మీకు అన్ని విధాలా అండగా ఉంటాం’ అని రాజధాని అమరావతి ప్రాంత రైతులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. రైతుల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడం దారుణమని, బాధితుల తరఫున న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. వారికి బాసటగా నిలిచారు. రైతుల భూములను లాక్కోవడానికి దౌర్జన్యం చేస్తున్న వారందరి పని పడతామని, తప్పు చేస్తున్న ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, ఎర్రపాలెం, కురగల్లు గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. భూ సమీకరణ పేరుతో ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు, బెదిరింపులను వైఎస్ జగన్కు వివరించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి కష్టాలు, బాధలు విన్న వైఎస్ జగన్, రైతులకు అండగా ఉంటామని ప్రకటించారు. పార్టీ తరఫున న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏం అన్నారంటే..అందుకే మావిగన్ ప్రతిపాదన‘‘ఇప్పటికే 50 వేల ఎకరాలు తీసుకున్నారు. ఇంకా 50 వేల ఎకరాలు అవసరం ఏముంది? అందుకే ‘మావిగన్’ ప్రతిపాదించాం. ఇప్పటికే గన్నవరంలో విమానాశ్రయం ఉంది. దానికి దగ్గర్లోనే మరో ఎయిర్పోర్టుకు అనుమతి ఇవ్వరు. మావిగన్లో పోర్టు కూడా ఉంది. అది మచిలీపట్నంలో ఉంది. చంద్రబాబు తీరుతో మరో 30 ఏళ్ల తర్వాత కూడా మనకు రాజధాని కనిపించదు. ఎందుకంటే పనులు జరగవు. కారణం అక్కడ కనీస మౌలిక వసతుల కల్పన కోసం ఎకరానికి రూ.2 కోట్లు కావాలని 12 ఏళ్ల క్రితమే బ్యాంకులకు నివేదిక ఇచ్చారు. నిజానికి ఇప్పటికి ఆ రేటు పెరిగింది. ఈ లెక్కన రోడ్లు, డ్రైనేజీ, నీరు, కరెంటు వీటిన్నింటికే ఎన్నేళ్లు ఎన్ని కోట్లు ఖర్చు చేయాలి?చంద్రబాబు ఉద్దేశం రియల్ ఎస్టేట్ వ్యాపారం మాది రైతు పక్షపాత ప్రభుత్వం. రైతులను సంతోష పెట్టే విధంగా ఉండాలనేదే మా అభిమతం. ముందు నుంచి మాది అదే వైఖరి. కొండవీటి వాగుపై ఎత్తిపోతల పథకం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఇక్కడ రైతులకు నష్టం కలగకూడదనే మావిగన్ను ప్రతిపాదించాం. ఆ ప్రాంతంలో ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్లు, పోర్టు, మెడికల్ కాలేజీలు ఉన్నాయి. కానీ, ఈ ప్రభుత్వం మాత్రం జీరో నుంచి కడతామని అమరావతిపై వెనక్కు తగ్గడం లేదు. అక్కడ నిరంతరం పనులు.. నిరంతరం కమీషన్లు.. అదే ప్రభుత్వ లక్ష్యం. ఇంకా రియల్ ఎస్టేట్ వ్యాపారం.. అదే చంద్రబాబు ఉద్దేశం. రాజధాని పనుల్లో భారీగా అవినీతి జరుగుతోంది. అవసరం అయితే భూములు వెనక్కుఅమరావతి రైతులు ఏం కావాలంటే అది చేస్తాం. బలవంతంగా భూ సేకరణ అనేది ఉండదు. అవసరం అయితే భూములు వెనక్కు ఇస్తాం. ఇప్పుడు మీ పోరాటంలో మా పార్టీ న్యాయ విభాగం కూడా పాలు పంచుకుంటుంది. మా లీగల్ టీమ్ మీకు అన్ని విధాలుగా సహాయ, సహకారిగా ఉంటుంది. పార్టీ తరఫున లీగల్ ప్యానెల్ ఏర్పాటు చేస్తాం. మీ తరఫున గట్టిగా పోరాడతాం. మనం ఇప్పుడు చేయగలిగింది న్యాయ పోరాటం మాత్రమే. మూడేళ్ల తర్వాత దేవుడి దయ వల్ల మన ప్రభుత్వం ఏర్పడితే, మీకు పూర్తి న్యాయం చేస్తాం. అవకాశం ఉంటే భూములు కూడా తిరిగి ఇస్తాం.దౌర్జన్యం చేసే వారికి శిక్ష తప్పదుముఖ్యమంత్రిగా చేయకూడని పని చంద్రబాబు చేస్తున్నారు. రైతులు భూమి ఇవ్వకపోతే కక్షగట్టడం దారుణం. ప్లాట్లు కేటాయించి రిజిస్ట్రేషన్ చేయడం, కాలువ తవ్వడం, రోడ్లు వేయడం, తోడిన నీరు పంపింగ్ చేయడం, దగ్గర్లో రిజర్వాయర్లు ఉంటే గండి కొట్టి, నీరు పారేలా చేయడం దారుణం. ఇప్పుడు పలు రకాలుగా దౌర్జన్యం చేస్తున్న వారందరికీ శిక్ష పడేలా చేస్తాం. మీకు న్యాయం చేస్తాం. ఇప్పుడు తప్పు చేస్తున్న ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించేలా చేస్తాం. మీ తరఫున పోరాడేందుకు లీగల్ కమిటీ వేయడం ద్వారా అమరావతి రైతులకు న్యాయం చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తాం’’ అని వైఎస్ జగన్ అమరావతి రైతులకు భరోసా ఇచ్చారు. -
రాష్ట్రం 'పంట' పండాలి
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ భూమి నైసర్గిక స్వరూపం అన్ని రకాల పంటలు పండించడానికి అనుకూల క్షేత్రం. రైతులు కొన్ని పంటలకే పరిమితం కాకుండా అన్ని రకాల పంటలు, కూరగాయలు, పండ్లు పండించి తెలంగాణ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పాలి..’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. దేశంలోనే కాదు.. ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది తన స్వప్నమని చెప్పారు. మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘2025–26లో 236.87 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. రెండున్నరేళ్లలో ధాన్యం కొనుగోళ్లకు రూ.82,840 కోట్లు ఖర్చు చేశాం. యాసంగిలో 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా 63.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.11,903 కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. 10 వేల మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేశాం. దేశంలో యాసంగిలో సేకరించిన మొత్తం ధాన్యంలో తెలంగాణ వాటా 60% కావడం గర్వకారణం. యాసంగిలో 16 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 4 లక్షల ఎకరాల్లో జొన్న సాగుతో రైతులు చరిత్ర సృష్టించారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం..’అని సీఎం చెప్పారు. రూ.60 వేల కోట్ల భూములు స్వాధీనం ‘రాష్ట్రంలో ప్రజలు రాచరిక ఆలోచనలు, నియంతృత్వ పోకడలను ఓడించి ప్రజా ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఆదరాభిమానాలు చూపడం మాకు ఎనలేని శక్తిని ఇచ్చింది. మేం పాలకులుగా కాకుండా సేవకులుగా బాధ్యత నిర్వర్తిస్తున్నాం. క్యూర్ ఏరియాలో ప్రభుత్వ భూములు, చెరువుల్లో కబ్జాలను తొలగించడం ద్వారా రూ.60 వేల కోట్ల విలువైన 1,045 ఎకరాలకు పైగా భూములను హైడ్రా స్వాదీనం చేసుకుంది. మెట్రో రైలు కొనుగోలు చేసి ప్రజల ఆస్తిగా మార్చాం. ఫేజ్–1 కింద మూసీ ప్రక్షాళన ప్రారంభించాం. 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం. శంషాబాద్ను బుల్లెట్ రైలు కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. త్వరలో వరంగల్, ఆదిలాబాద్లో విమానాశ్రయాల ఏర్పాటు పనులు ప్రారంభిస్తాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడానికి రూ.లక్ష కోట్ల జీరో వడ్డీ రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే రూ.60 వేల కోట్ల రుణాలను పంపిణీ చేశాం. రుణ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాం. కొత్తగా ఇందిరా మహిళా శక్తి సూపర్ బజార్లు, లాజిస్టిక్ హబ్లు, గోదాములు, రైస్ మిల్లులు ఏర్పాటుకు మహిళలు సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు 8 వేల స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశాం..’అని ముఖ్యమంత్రి తెలిపారు. మహారాష్ట్ర సీఎంకు ఏడాదిగా లేఖలు.. ‘జలయజ్ఞం ప్రాజెక్టులు, 2014–15 తర్వాత చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. గత ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లను పునరుద్ధరణ మొదలు పెట్టాం. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును పునరుద్ధరించి తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మించడానికి మహారాష్ట్ర సమ్మతి కోరేందుకు ఆ రాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ కోసం గతేడాదిగా లేఖలు రాస్తున్నా. ఈ నెలలోనే టీజీపీఎస్సీ ద్వారా ఇంజనీరింగ్ శాఖలు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, అటవీ, విద్యా శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ల జారీ నిరంతరం జరుగుతుంది. విద్యా రంగంలో సంస్కరణలు సర్కారీ విద్యలో సంస్కరణలతో కేంద్రం విడుదల చేసిన ఫెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో తెలంగాణ మంచి స్థానాన్ని పొందింది. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు 65 ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా పునర్ వ్యవస్థీకరించాం. స్కిల్స్ యూనివర్సిటీలో 1,190 మంది విద్యార్థులు కోర్సులు పూర్తి చేయగా, 838 మంది మైక్రోసాఫ్ట్, ఫ్లిప్కార్ట్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, ఏఐజీ హాస్పిటల్స్, అపోలో హాస్పిటల్స్ వంటి ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు పొందారు. ఈ ఏడాది మరో 2,769 బడుల్లో ప్రీ ప్రైమరీ విద్య ప్రవేశపెట్టబోతున్నాం. ఈ ఏడాది అన్ని ప్రభుత్వ బడులు, కళాశాలల్లో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రవేశపెట్టడడంతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కాలేజీలకు విస్తరిస్తున్నాం..’అని రేవంత్ వెల్లడించారు. గ్రేహౌండ్స్కు గ్యాలెంటరీ అవార్డులు విధి నిర్వహణలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన పోలీసు అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గ్యాలెంటరీ అవార్డులు ప్రదానం చేశారు. విద్యారంగంలో ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులకూ పురస్కారాలు అందజేశారు. పురస్కారాలు అందుకున్న వారిలో గ్రేహౌండ్స్ విభాగం ఆర్ఐ టి.మహేశ్, ఎస్ఐ షేక్ నాగుల్ మీరా, హెచ్సీ కె.ఆదినారాయణ, ఏఆర్ఎస్ఐ కె.అశోక్, పీసీలు ఆర్.సునీల్కుమార్, ఎం.కళ్యాణ్కుమార్, జి.శ్రీధర్, సీహెచ్ రవీంద్రబాబు, రాథోడ్ రమేశ్, కె.సందీప్కుమార్, ఎం.కార్తీక్, వి.మధు, సీహెచ్ సంపత్, ఎస్ఐబీ ఏఆర్ఎస్ టి.మహేందర్ రావు, ఇంటిలిజెన్స్ హెచ్సీ బి.శివకుమార్, పంజాగుట్ట ట్రాఫిక్ పీసీ బండికింది శ్రవణ్కుమార్ ఉన్నారు. 2018 మార్చి 2న ఛత్తీస్గఢ్ బీజాపూర్లోని పూజారి కాంకేర్లో నక్సల్స్తో జరిగిన ఎదురుకాల్పుల్లో అమరుడైన బి.సుశీల్కుమార్ తరఫున అతడి సతీమణి బి.సుష్మకుగ్యాలెంటరీ పురస్కారాన్ని సీఎం అందజేశారు. కాగా కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కె.విజయ్కుమార్, సిద్దిపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.గోవర్ధన్, మహబూబ్నగర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కౌసర్ జహాన్, హనుమకొండలోని గట్ల నార్సింగాపూర్ మాధ్యమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్.వెంకటేశ్వర్లు, రంగారెడ్డి జిల్లా మణికొండ జెడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి.నిరంజన్ ఉత్తమ సేవా పురస్కారాలు అందుకున్నారు. సీఎం ప్రసంగానికి ఎండ దెబ్బ! రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తొలుత గన్పార్క్ అమరవీరుల స్థూపం వద్ద సీఎం నివాళులు అర్పించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్లో జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఎండ తీవ్రతను ప్రస్తావించిన సీఎం.. తన ప్రసంగాన్ని పూర్తిగా చదవకుండా ముగిస్తున్నట్టు ప్రకటించారు. రాతపూర్వకంగా ఇచి్చన పూర్తి ప్రసంగాన్ని పరిగణనలోకి తీసుకోవాలని మీడియాకు సూచించారు. 13 నెలల్లోనే 1.2 లక్షల ఇళ్లు‘రూ. 22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభించి 13 నెలల్లోనే లక్షా 20 వేల ఇళ్లను పూర్తి చేశాం. సెప్టెంబర్ 17 నాటికి మిగతా 2 లక్షల ఇళ్లూ పూర్తి చేస్తాం. రెండో విడతగా క్యూర్ పరిధిలో లక్ష, మిగిలిన ప్రాంతాల్లో 2.5 లక్షలు కలిపి మొత్తం 3.5 లక్షల ఇళ్లు మంజూరు చేశాం. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లనూ రెండో విడతలో పూర్తి చేయాలని నిర్ణయించాం. 15.12 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేసి 3.38 కోట్ల మందికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం. స్కిల్డ్ వర్కర్లకు 25.9 శాతం, అన్ స్కిల్డ్ వర్కర్లకు 34.95 శాతం కనీస వేతనాలు పెంచాం. తెలంగాణ పోరాట యోధులను గుర్తించడానికి కమిటీని నియమించాం. త్వరలో ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అమలు చేయనున్నాం. రాష్ట్రాన్ని 2034 నాటికి ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ డాక్యుమెంట్ ప్రకటించాం. మీ అందరి సహకారం, ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటాం. ఈ ఆర్థికాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి..’అని సీఎం పిలుపునిచ్చారు. -
LIVE : అమరావతి రైతులతో వైఎస్ జగన్..
-
భయపడకండి మీకు నేనున్నా... అమరావతి రైతులకు జగన్ హామీ
-
అమరావతి రైతులతో YS జగన్ భేటీ
-
అధైర్యపడొద్దు.. అండగా ఉంటా: అమరావతి రైతులతో వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అమరావతి ప్రాంత రైతులకు అండగా ఉంటామని, కూటమి ప్రభుత్వ ఆగడాలను అడ్డుకుంటామని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. భూములు ఇవ్వని రైతుల్ని కూటమి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు గురి చేస్తోందంటూ అమరావతి రైతులు మంగళవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్రం కార్యాలయంలో వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో వైఎస్ జగన్.. అమరావతి రైతులకు ధైర్యం ఛెప్పారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోంది..: రైతులుఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. భూములు ఇవ్వని వారిని ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది. భూ సేకరణకు నోటిఫికేషన్లు ఇచ్చి దౌర్జన్యం చేస్తోంది. భూములు ఇవ్వని రైతుల పొలాల్లో దారుణాలకు పాల్పడుతున్నారు. డెవలప్మెంట్ పనులు పేరు చెప్పి మా పొలాలను ధ్వంసం చేస్తోంది. దేవాలయ భూముల్లో ఇప్పుడు ప్లాట్లు ఇస్తామంటున్నారు. దేవాలయ భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దేవాలయ భూముల రక్షణ విషయంలో మీరు తోడుగా ఉండాలి. ఇప్పుడు కడుతున్న స్టీల్ బ్రిడ్జి పూర్తిగా కుంగిపోయింది. ఈ గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ అవసరమే లేదు.కరకట్ట రోడ్డు విస్తరించుకుంటే సరిపోతుంది.దీనివల్ల ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది, రైతులకు ఇబ్బంది లేకుండా పోతుంది. ఉండవల్లికి సంబంధించి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరుగలేదు.బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు.మా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై గట్టిగా గళం వినిపించాలి’ అని కోరారు.రైతుల్ని బలవంత పెట్టడం సరికాదు: వైఎస్ జగన్అనంతరం, వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తాం. రైతులను బలవంతం పెట్టడం మంచిదికాదు. రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు. రైతులకు సంతోష పెట్టేలా ఏదైనా జరగాలి. వారిని కష్ట పెట్టేలా చేయకూడదు. మొదటి తీసుకున్న 50వేల ఎకరాలకే దిక్కులేదు. ఇప్పుడు మళ్లీ 50వేల ఎకరాలు అంటున్నారు. అందుకే ప్రత్యామ్నాయంగా మావిగన్ను సూచించాం. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఉంది. అది ఉండి కూడా మరొక ఎయిర్పోర్టు అంటున్నారు. ఇప్పుడ అక్కడ పనులు కూడా జరుగుతున్నాయి. వచ్చే కొద్ది నెలల్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.మచిలీపట్నంలో పోర్టు కూడా వచ్చింది. మన హయాంలో మొదలుపెట్టాం, నిధుల కొరతలేకుండా చూశాం. జాతీయ రహదారులు ఉన్నాయి, రైల్వే స్టేషన్లు ఉన్నాయి.కాని ఇవేమీ చంద్రబాబుకు పట్టదు. భవిష్యత్తులో కూడా రాజధాని అనేది లేకుండా చేస్తున్నారు.కనీస మౌలిక సదుపాయాల కల్పనకే ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు చేయాలి. జీవితమంతా రోడ్లు వేయడానికి, జీవితమంతా డ్రైనేజీ తవ్వడానికి, జీవితమంతా నీళ్లు ఇవ్వడానికి, జీవితమంతా కరెంటు ఇవ్వడానికే ఖర్చుపెట్టాలి.దాదాపు రెండు లక్షల కోట్లు దీనికోసమే ఖర్చు చేయాలి.రాజధానిలో భారీగా అవినీతి జరుగుతోంది. ఏది చూసినా స్కామే కనిపిస్తోంది. రాజధాని పేరుతో స్కాములు మీద స్కాములు చేస్తున్నారు. మావిగన్ను గ్రోత్ కారిడర్గా ప్రకటిస్తే చాలు వెంటనే అభివృద్ధి. 110 కి.మీ. అటు ఇటూ గ్రోత్ కారిడర్కు అటు ఇటూ.. ఈ డబ్బు పెడితే మొత్తం కారిడర్ అభివృద్ధి చెందుతుంది’ అని వ్యాఖ్యానించారు. -
చంద్రబాబుకి షాకిచ్చిన రాజధాని రైతులు
సాక్షి, తాడేపల్లి: అమరావతి రాజధాని భూముల అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో వేడి రాజేసింది. భూసేకరణను వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డిని కలిసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ సమయంలోనే ఉన్నపళంగా ఆ గ్రామాల్లో సీఆర్డీఏ గ్రామసభ నిర్వహించడం తీవ్ర దుమారం రేపింది. ఇది “కుట్ర రాజకీయాలే”నని చెబుతూ.. చంద్రబాబు సర్కార్కు రైతులు షాకిచ్చారు. గ్రామసభల్ని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజధాని ప్రాంత రైతులు మరోసారి తమ సమస్యలతో రోడ్డెక్కారు. పెనుమాక, ఉండవల్లి ప్రాంత రైతులు తమ భూములపై కొనసాగుతున్న వివాదాలు, నోటిఫికేషన్లు, నోటీసులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు తెలియకుండానే భూసేకరణ నోటిఫికేషన్లు జారీ చేశారని, భూములు ఇవ్వాల్సిందేంటూ అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.తమ సమస్యలను నేరుగా మాజీ సీఎం వైఎస్ జగన్కు చెప్పుకోవడానికి రైతులు సిద్ధమవుతున్న తరుణంలోనే హఠాత్తుగా పెనుమాకలో సీఆర్డీఏ అధికారులు గ్రామసభ నిర్వహించడం మరింత చర్చనీయాంశంగా మారింది. “రాజధానికి భూమి ఇవ్వాలి” అనే పేరుతో సమావేశాలు పెట్టి తమపై ఒత్తిడి తెస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జగన్తో సమావేశం ఉన్న రోజే గ్రామసభ నిర్వహించడాన్ని రైతులు అనుమానాస్పదంగా చూస్తున్నారు. తమ గొంతు నొక్కే ప్రయత్నంగా ఇది మారిందని, ప్రభుత్వ వైఖరి వేధింపులుగా ఉందని వారు మండిపడుతున్నారు. అంతేకాదు.. గ్రామసభకు టీడీపీ నేతలను పిలవడంపైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రైతుల నిలదీతతో అధికారులు నీళ్లు నమిలారు. ఆపై చేసేది లేక టీడీపీ నేతలు, అధికారులు గ్రామసభ నిర్వహించకుండానే వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ అంశంలో న్యాయం చేయాలని కోరుతూ రైతులు వైఎస్ జగన్ను కలవబోతున్నారు. మరోవైపు భూసేకరణ ప్రక్రియలో భాగంగా నోటీసులు ఇచ్చారని అధికారులు చెబుతున్నప్పటికీ, రైతులు మాత్రం “తొలి విడతలోనే భూములు ఇచ్చాం… మళ్లీ భూములు ఎలా ఇవ్వాలి?” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు లేకపోతే ఎలా బతికేదని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య తమ బాధలను నేరుగా జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు రైతులు ముందుకు రావడం, మరోవైపు అదే సమయంలో గ్రామసభ నిర్వహణకు ముందుకు రావడం.. ఆ సభను రైతులు బహిష్కరించడం.. రాజధాని రాజకీయాల్లో కొత్త దుమారానికి దారి తీసింది. -
ఉచిత విద్యుత్ ఎత్తేయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతాంగానికి 24 గంటలూ నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుందని, ఆ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎత్తేసేది లేదని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ఆలోచన తమకు లేదని తేల్చిచెప్పారు. అసలు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలన్న నిబంధన కేంద్రం ఎప్పుడూ పెట్టలేదని చెప్పిన రేవంత్.. ఉచిత విద్యుత్, స్మార్ట్ మీటర్ల విషయంలో బీఆర్ఎస్కు సవాల్ చేశారు. ఉచిత విద్యుత్ ఎత్తేసినా, వ్యవసాయానికి మీటర్లు పెట్టినా వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని, తాము అలా చేయకపోతే బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంటుందా అని వ్యాఖ్యానించారు. శనివారం రేవంత్రెడ్డి విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘మేం అధికారంలోకి వచ్చేసరికి తెలంగాణలోని డిస్కంలు కుప్పకూలే పరిస్థితిలో ఉన్నాయి. డిస్కంలకు ఇప్పుడు రూ.69,745 కోట్ల అప్పులున్నాయి. అవి బాగుచేయలేనంతగా నిర్వీర్యమయ్యాయి. ఉచిత విద్యుత్ కింద రైతులకిచ్చే కరెంటుకు ఒక్క రూపాయి కూడా గత ప్రభుత్వం డిస్కంలకు చెల్లించలేదు. దీంతో డిస్కంలు అప్పులు చేసి బొగ్గు, విద్యుత్ కొనుగోలు చేసుకోవాల్సి వచ్చేది. ఉద్యోగుల నిర్లక్ష్యం, నిర్వహణా లోపాల కారణంగా ఇతర అవసరాలకు వినియోగించిన విద్యుత్ను కూడా ఉచిత విద్యుత్ లెక్కలో రాసేవాళ్లు. వాళ్లు కనీసం ఎప్పుడు ఎంత కరెంటు తీసుకోవాలనే అంచనాలు కూడా వేయలేదు. మేం అధికారంలోకి వచ్చాక డిస్కంలను దారిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే రైతులతో పాటు ప్రభుత్వం గంపగుత్తగా కరెంటును వినియోగించుకునే కేటగిరీని కలిపి ప్రత్యేకంగా రైతు డిస్కం ఏర్పాటు చేశాం. దీనిద్వారా ఎంత విద్యుత్ తీసుకున్నామో, ఎంత సరఫరా చేశామో, నిర్వహణ నష్టాలు ఎంతో, బిల్లులు ఎంత వస్తున్నాయో కచ్చితంగా లెక్క తేలుతుంది. తెలంగాణ రైతాంగం రాత్రిపూట పెద్దగా వ్యవసాయానికి విద్యుత్ వాడదు కాబట్టి ధర తక్కువ ఉన్నప్పుడు కొనుగోలు చేసి ఆ డిస్కం ద్వారా రైతులకు విద్యుత్ ఇస్తాం. అసలు మాకు ఉచిత విద్యుత్ ఎత్తేయాలనే ఆలోచనే లేదు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు కూడా పెట్టబోం. అలా పెట్టేది ఉంటే వచ్చే ఎన్నికల్లో మేం పోటీ చేయబోం. ఒకవేళ మేం పెట్టకపోయినా, ఉచిత విద్యుత్ ఎత్తేయకపోయినా బీఆర్ఎస్ పోటీ చేయకుండా ఉంటుందా? బీఆర్ఎస్ నా సవాల్ను స్వీకరించాలి. అప్పుడే స్మార్ట్ మీటర్లు పెట్టారు అసలు స్మార్ట్ మీటర్ల విషయంలో కేంద్రంతో ఒప్పందం చేసుకుంది బీఆర్ఎస్సే. 2017, జూన్ 30న అజయ్మిశ్రా, రఘుమారెడ్డి, గోపాలరావు అనే అధికారులు ఈ ఒప్పందంపై సంతకాలు పెట్టారు. 2017–18లో 29,632 స్మార్ట్ మీటర్లు కూడా పెట్టారు. కేంద్రం ఏ రోజూ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని అడగలేదు. అసలు అలాంటి నిబంధనే లేదు. నోరు తెరిస్తే కేసీఆర్ చెప్పేది అబద్ధాలే. రైతుల కోసం తామేదో యుద్ధం చేసినట్టు అప్పట్లో చెప్పుకుని రైతుల దగ్గర మార్కులు కొట్టేయాలని అలాంటి మాటలు చెప్పారు. రైతులు ఆయన కంటే తెలివైన వారు కాబట్టి కర్రు కాల్చి వాత పెట్టారు. మోదీ నా చుట్టమేమీ కాదు. ఆ పథకంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు చేరాయి. ఏపీ కూడా చేరింది. నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా రాష్ట్రమంతటా స్మార్ట్ మీటర్లు పెట్టినా వ్యవసాయానికి మాత్రం పెట్టలేదు. తీగల మీద బట్టలు ఆరేయాలని కేసీఆర్ అన్నప్పుడే 1999 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసింది. కాంగ్రెస్సే. నాణ్యమైన విద్యుత్ ఇచ్చి రైతుల ఆత్మగౌరవం పెంచడానికి తెచ్చిన పారదర్శక విధానమే రైతు డిస్కం. సీఆర్పీసీ, ఐపీసీల్లో శిక్షలు వేసేందుకు నిబంధనలు లేవా? మరి ఎస్సీ, ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్, హెచ్ఆర్సీ, మైనార్టీ కమిషన్లు ఎందుకు ఏర్పాటు చేశారు. బీసీ కమిషన్ను ఎందుకు అడుగుతున్నారు. తమ వర్గాలకు కమిషన్ ఉంటే న్యాయం జరుగుతుందనే కదా. ఆ తరహాలోనిదే రైతు డిస్కం కూడా. మోదీకి కిషన్రెడ్డి చెప్పాలి కదా? బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి కేసుల్లో సీబీఐ విచారణను రాష్ట్ర ప్రభుత్వం కోరిన తర్వాత కూడా కేంద్రం ఎందుకు స్పందించడం లేదు. కనీసం సీబీఐ వాళ్లు ఆపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. తుమ్మిడిహెట్టిపై చర్చిద్దామంటే మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఈ విషయాలను మోదీ దగ్గర కిషన్రెడ్డి చెప్పాలి కదా? అంతర్రాష్ట్ర జలవివాదాలు రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని మోదీ చెబుతున్నారు కదా? వచ్చే నెల1న ఆదిలాబాద్కు వెళ్తున్నా. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా దారిలోకి రాడో చూస్తా. పోలవరం ముంపు కింద ఏడు మండలాలు ఏపీకి ఇచ్చిన మోదీ తెలంగాణ కోసం వెయ్యి ఎకరాల భూమి ఇవ్వలేడా? సోయి తప్పిన మాటలు ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు విషయంలో బీఆర్ఎస్ సోయి తప్పిన మాటలు మాట్లాడుతోంది. పువ్వాడ అజయ్ ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పుడు కేసీఆర్ ఏం చేశాడు? కమ్మ సంఘానికి భూమి ఇవ్వలేదా? భీమవరంలో కేటీఆర్ పోటీ చేస్తానని చెప్పి బీఆర్ఎస్ ఏపీకి తోట చంద్రశేఖర్ను అధ్యక్షుడిని చేయలేదా? ఆయనకు కూకట్పల్లిలో 30 ఎకరాల భూమి ఇవ్వలేదా? హక్కుల కోసం పోరాటం ఎలా చేయాలో, చరిత్రలో కొందరిని ఎలా గౌరవించాలో నాకు తెలుసు. అసలు తారక రామారావు అనే పేరు మార్చుకోవాలి కదా? ఆ పేరుతో ఎంతకాలం బతుకుతారు? ప్రధానికి కనపడడం లేదా? గ్లోబరీనా అనే సంస్థ కేటీఆర్ బినామీ. ఆ సంస్థ వల్లనే తెలంగాణలో పరీక్ష పేపర్లు లీకయ్యాయి. విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు సీబీఎస్ఈ వ్యవస్థను కూడా గ్లోబరీనా కుప్పకూల్చింది. హరీశ్, కేటీఆర్ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడరు. ప్రధాని మోదీకి ఎందుకు కనపడడం లేదు? బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే కదా? రెండు పెద్ద కేసుల్లో ఆధారాలతో కేంద్రానికి ఇచ్చాం. ఆ కుటుంబాన్ని అరెస్టు చేస్తారో లేదో మోదీ, కిషన్రెడ్డిలే చెప్పాలి. జుట్టు వారి చేతిలో పెట్టాం. రాష్ట్రంలో జనగణన, ఎస్ఐఆర్లు నడుస్తున్నాయి. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలకు తొందరేముంది? ఆర్థిక వెసులుబాటును బట్టి రైతు భరోసా చెల్లిస్తాం. మహిళా సమాఖ్యలతో గోదాములు ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు, దళారులతో పనిలేకుండా ఓ ప్రణాళిక రూపొందిస్తున్నాం. గోదాములు, రైస్మిల్లులను మహిళా సమాఖ్యలతో ఏర్పాటు చేయిస్తాం. బ్యాంకు లింకేజీతో రుణాలు ఇప్పిస్తాం. వారినే యజమానులను చేస్తాం. దీనికి గొప్ప ప్రణాళిక మా దగ్గర ఉంది. ఇప్పటికే పెట్రోల్ బంకులిచ్చాం. సోలార్పవర్ ప్లాంట్లు ఇచ్చాం. ఆదానీ, అంబానీలకు మా ఆడబిడ్డలే పోటీ అనే రీతిలో వారి సాధికారతకు కట్టుబడి ఉన్నాం. అసెంబ్లీలో చెప్పాం.. మళ్లీ చెబుదాం రాష్ట్రం అప్పుల పాలవుతుందనే వాదనలో వాస్తవం లేదు. మేం యేటా రూ.70–75వేల కోట్లు అప్పులు తెస్తే రూ.90వేల కోట్ల వరకు పాత అప్పులు కడుతున్నాం. అన్ని లెక్కలు అసెంబ్లీలో చెప్పాం. మళ్లీ అసెంబ్లీలో అన్ని విషయాలు చెప్తాం. మేం తెచ్చిన అప్పులే కాదు కట్టిన అప్పులు కూడా చూడాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎంత మోసం చేసినా భరించాం. ఇప్పుడు అంతా తెలంగాణ వాళ్లమే కదా? ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? ఆ కుటుంబం డీఎన్ఏనే అబద్ధాల డీఎన్ఏ. వాళ్ల మూలుగతో సహా మారిస్తేనే వారి వైఖరి మారుతుంది. అలా చేస్తే వాళ్లు ఉండరు. ఫ్యామిలీ మొత్తం అబద్ధాలమీదనే బతుకుతుంది. బ్లాక్ మెయిల్ చేసి బతుకుతుంది. చివరకు క్రషర్ల వాళ్లని కూడా పొడుగాయన బెదిరించాడు. నెలకు రూ.50 లక్షలు ఇస్తే క్రషర్ల గురించి మాట్లాడబోనని ఓ ఎమ్మెల్సీ ద్వారా బ్లాక్మెయిల్ చేశాడు. మూడడుగుల ఆయన, ఆరడుగులాయన చెత్త మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు. హరీశ్.. ఓ బబుల్ షూటర్ అసలు ఆరడుగులాయన ఫ్యూచర్ ఏంటో ఆయనకే తెలియదు. ఆయన ఎందులో ఉంటాడో కూడా తెలియదు. గుండెల మీద చేయి వేసి కేసీఆర్ మీద ఒట్టేసి హరీశ్రావు బీఆర్ఎస్లోనే ఉంటాడేమో చెప్పమనండి. 2008లో వైఎస్సార్ దగ్గరకు పోలేదా? హరీశ్రావు మాటలను ఎవరూ సీరియస్గా తీసుకోవద్దు. ఆయన ట్రబుల్షూటర్ కాదు.. బబుల్ షూటర్. వచ్చే ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ నుంచే పోటీ చేస్తాడన్న నమ్మకం నాకు లేదు. ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడనే సమాచారం నాకుంది. కానీ నేను చెప్పదల్చుకోలేదు. ఓవైపు పార్టీ సమావేశం జరుగుతుంటే ఢిల్లీ వెళ్లాడు. మీడియా పట్టుకుంటే అడ్వొకేట్ను కలిసేందుకు వెళ్లానని ఫొటోలు పెట్టాడు. తీర్పు రిజర్వ్ అయిన కేసులో అడ్వొకేట్ దగ్గరకెళ్లి ఆయన మాట్లాడేదేముంటుంది? కేంద్రంలో పెద్ద మంత్రి అవుతాడేమో నాది, పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. నేను పీసీసీ అధ్యక్షుడిగా, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాం. ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా, నేను ముఖ్యమంత్రిగా ప్రతి ఎన్నికల్లో గెలుస్తూనే ఉన్నాం. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, ఉప ఎన్నికలు గెలిచాం. 2029లో కూడా మా కాంబినేషన్లోనే ఎన్నికల్లో గెలుస్తాం. మహేశ్గౌడ్ నాకు మంచి మిత్రుడు కూడా. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆయన పెద్ద కేంద్రమంత్రి కూడా అయ్యే అవకాశముంది. మాది సక్సెస్ఫుల్ కాంబినేషన్. మా పనితీరును ఫలితాలే చెబుతున్నాయి. నేను 2034 వరకు ఇక్కడే ఉంటా. రాష్ట్ర ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతిననీయను. అన్నింటినీ కొలిక్కి తెస్తా. రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్ ఎకానమీగా రూపుదిద్దేందుకు అన్ని వ్యవస్థలను చక్కదిద్దే ప్రయత్నం చేస్తా’ అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. వడ్లు కొనంది ఎవరు?అసలు ధాన్యం కొనుగోలు చేయంది ఎవరు? కేంద్రం కాదా? వరి వేస్తే ఉరి అన్నది బీఆర్ఎస్ కాదా? మేము వడ్లే కాదు మక్కలు కూడా కొంటున్నాం. మక్కలకు మద్దతు ధర ప్రకటించిన వారు ఒక్క గింజయినా కొన్నారా? మేం పండిన ప్రతి ధాన్యం గింజ కొంటున్నాం. పండిన పంటలో పంజాబ్ (86%), ఛత్తీస్గఢ్ (67%), హరియాణా (65%), ఒడిశా (52%) తరహాలో తెలంగాణ పంటఎందుకు కొనరు? తెలంగాణలో పండిన దాంట్లో 38 శాతమే కొంటారా? మేం వచ్చే నెల 15 లోపు ధాన్యమంతా కొంటాం. ఆ తర్వాత కిషన్రెడ్డి, మోదీ సంగతి చెబుతాం. వడ్లు కొనకపోతే బీజేపీ వాళ్ల ఇళ్ల ముందు తీసుకెళ్లి పోస్తాం. బస్సులో వెళ్లి రైతు యాత్ర చేస్తున్న వారి ఇళ్ల వద్దకు ట్రాక్టర్లు తీసుకెళతాం. ఇప్పటికే 60లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. 20 లక్షల టన్నుల మక్కలు కొంటాం. ఈ స్థాయిలో ఏ రోజైనా, ఏ ప్రభుత్వమైనా కొనుగోలు చేసిందా? అకాల వర్షం వల్ల రైతులకు కొంత నష్టం కలిగింది. రైతు దుఃఖంలో ఉన్నప్పుడు వారి దగ్గరకు వెళ్లి సెల్ఫీ లు దిగి సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటున్నారు. అది కూడా ఒక బతుకేనా?. -
ఖరీఫ్లోనూ కర్షకుడికి కష్టాలే!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతతో ఖరీఫ్లో సాగుపై అన్నదాతల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. జూన్ 1వ తేదీ వస్తున్నా విత్తనాలు, ఎరువుల సరఫరాలో ప్రభుత్వం విఫలమైంది. అదునుకు వేరుశనగ విత్తనమే కాదు.. కనీసం పచ్చిరొట్ట విత్తనం కూడా సరఫరా చేయలేక చేతులెత్తేస్తోంది. ఎరువులను యాప్ ద్వారా పంపిణీ చేసేందుకు సిద్ధపడడంతో ఈసారి కూడా యూరియా, డీఏపీ కోసం యూరియా, డీఏపీ కోసం రైతులకు అగచాట్లు తప్పేటట్టు కన్పించడం లేదు. సీజన్కు ముందుగా పెట్టుబడి సాయం లేదు. ఇన్పుట్సబ్సిడీ ఎలాగూ లేదు. ఉచిత పంటల బీమా అసలే లేదు. కనీసం స్వచ్ఛంద పంటల బీమాను కూడా రైతులకు దూరం చేశారు. ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వర్షాధార ప్రాంతాల్లోనే కాదు, సాగునీటి వనరులున్న ప్రాంతాల్లోనూ రైతులు ఖరీఫ్ సాగుకు ముందుకెళ్లలేకపోతున్నారు.అదునుకు విత్తనమేది?ఖరీఫ్లో రాష్ట్రంలో సాధారణ విస్తీర్ణం 77.12 లక్షల ఎకరాలు కాగా, ఖరీఫ్–2026లో 81.50 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా 37.85 లక్షల ఎకరాల్లో వరి, 9.89 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 12.87 లక్షల ఎకరాల్లో ప్రత్తి, 8 లక్షల ఎకరాల్లో అపరాలు, తదితర పంటల సాగును లక్ష్యంగా పెట్టారు. ఈసారి ముందస్తుగా సాగునీటి విడుదలకు షెడ్యూల్ ప్రకటించామని చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది.కోతల వేళ వైపరీత్యాల బారిన పడకుండా పంటలను కాపాడుకోవచ్చంటూ మే 4 నుంచి పెన్నా డెల్టాకు, జూన్ 1 నుంచి గోదావరి డెల్టాకు జూలై 1 నుంచి కృష్ణా డెల్టా ఆయకట్టుకు, అలాగే, మిగిలిన ఆయకట్టులకు సాగునీటి షెడ్యూల్ను విడుదల చేసింది. కానీ అందుకు తగినట్టుగా విత్తన సరఫరా చేయలేకపోతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏటా రెండు సీజన్లు కలిపి కనీసం 400 కోట్లతో సబ్సిడీ విత్తనాన్ని సరఫరా చేసేవారు. గడిచిన రెండేళ్లుగా సబ్సిడీ విత్తన పంపిణీలో చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా కోతలు పెడుతుండడంతో రైతులు అదునుకు సబ్సిడీ విత్తనం దొరక్క దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.బకాయిలతో ముందుకురాని కంపెనీలు2026–27 వ్యవసాయ సీజన్లో ఖరీఫ్లో రూ.179 కోట్లతో 4.82 లక్షల క్వింటాళ్ల విత్తనం సరఫరా చేయాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారులు ప్రతిపాదించారు. 2.20 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 1.62 లక్షల క్వింటాళ్ల వరి, 92 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాల సరఫరాకు టెండర్లు ఖరారయ్యాయి.అయితే గడిచిన రెండేళ్లకు చెందిన రూ.187 కోట్ల విత్తన సబ్సిడీ బకాయిల చెల్లింపులో చంద్రబాబు ప్రభుత్వ ఎగవేత ధోరణికి నిరసనగా విత్తన సరఫరాకు కంపెనీలు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఏపీ సీడ్స్ వద్ద అందుబాటులో ఉన్న పచ్చిరొట్ట విత్తనాలను అరకొరగా పొజిషన్ చేయగా, వేరుశనగ ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో చెప్పలేని దుస్థితి. దీంతో రాయలసీమ రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఎల్నినో పరిస్థితులున్నప్పటికీ సీమ జిల్లాల్లో ప్రస్తుతం ఆశాజనకంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో అదునుకు విత్తనం సరఫరా చేసి ఉంటే రైతులకు ఎంతగానో మేలు జరిగేది. కానీ ప్రభుత్వం ఆ దిశగా అడుగు వేయలేదు.అందని పెట్టుబడి సాయం.. అటకెక్కిన పంటల బీమాఅధికారంలోకి రాగానే ప్రతీ రైతుకు రూ.20వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తామన్న చంద్రబాబు తొలి ఏడాది నిస్సిగ్గుగా రూ.10,716 కోట్లు ఎగ్గొట్టారు. రెండో ఏడాది ఏడు లక్షల మందికి కోత పెట్టి రూ.14వేలతో సరిపెట్టారు. ఈ ఏడాది అయినా సీజన్కు ముందుగా పెట్టుబడి సాయం అందిస్తారేమో అని ఆశపడిన రైతులకు నిరాశే ఎదురైంది. కానీ మరో రెండ్రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నా పెట్టుబడి సాయం ఊసెత్తడం లేదు.రెండేళ్లుగా పైసా పెట్టుబడి సాయం అందించకపోవడంతో కౌలు రైతులుగగ్గోలు పెడుతున్నారు. 2024 జూన్లో కంపెనీలకు చెల్లించాల్సిన ప్రీమియం బకాయిలు ఎగ్గొట్టడంతో 2023–24 సీజన్కు సంబంధించి దాదాపు రూ.1385 కోట్ల బీమా పరిహారం రైతులకు అందలేదు. 2024–25, 2025–26 వ్యవసాయ సీజన్లలో ప్రభుత్వం బీమా ప్రీమియం బకాయిలు రూ.1095.11 కోట్లు ఎగ్గొట్టడంతో కంపెనీలు ఏపీని బ్లాక్లిస్ట్లో పెట్టేశాయి. మరోవైపు కరువు బకాయిలు రూ.327 కోట్లతో పాటు 2024–25 సీజన్లో రూ.650 కోట్లకుపైగా పంట నష్టపరిహారం నేటికీ జమ చేయలేదు. రూ.500 కోట్ల మేర సున్నా వడ్డీ రాయితీ రెండేళ్లుగా చెల్లించకుండా చంద్రబాబు ప్రభుత్వం ఎగనామం పెట్టింది. దీంతో ఖరీఫ్ సాగు వేళ రైతుల చేతిలో చిల్లిగవ్వ లేక అప్పుల కోసం తిప్పలు పడుతున్నారు.యాప్ ద్వారా ఎరువులు.. ఆందోళనలో రైతులుఎరువుల కొరతేమీ లేదంటూ పదేపదే ప్రకటనలు ఇస్తున్న టీడీపీ ప్రభుత్వం ఈసారి యాప్ ద్వారా పంపిణీ అంటూ మెలిక పెట్టి, ఆంక్షలు విధిస్తుండడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు 2025–26 వ్యవసాయ సీజన్కు సంబంధించి జాతీయ స్థాయిలో 39.054 మిలియన్ టన్నుల ఎరువులు అవసరం కాగా, ప్రస్తుతం 20.012 మిలియన్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. దీంతో ఈ సారి రాష్ట్రానికి జరిపిన కేటాయింపుల మేరకు ఎరువులు సరఫరా జరిగే అవకాశాల్లేవని తెలుస్తోంది.రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్కు 18.09 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, ప్రస్తుతం 8.20 లక్షల టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నాయంటున్నారు. రాష్ట్రంలో యూరియా ఏ స్థాయిలో దారిమళ్లుతోందో రెండేళ్లుగా చూస్తూనే ఉన్నాం. ఎలాంటి పంటలు సాగులేని ఏప్రిల్, మే నెలల్లో ఇప్పటికే 2 లక్షల టన్నుల ఎరువుల అమ్మకాలు జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 75 వేల టన్నుల యూరియా, 30 వేల టన్నుల డీఏపీ అమ్మకాలు జరిగాయంటే ఏ స్థాయిలో పక్కదారి పడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చంద్రబాబు ప్రభుత్వం మొక్కుబడి సమీక్షలతో సరిపెడుతుందే తప్ప వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించలేకపోతోందన్న విమర్శలు విన్పిస్తున్నాయి.⇒ రాష్ట్రంలో ఖరీఫ్లో సాధారణ విస్తీర్ణం: 77.12 లక్షల ఎకరాలు⇒ ఖరీఫ్ 2026 సాగు లక్ష్యం: 81.50 లక్షల ఎకరాలు⇒ వరి: 37.85 లక్షల ఎకరాలు⇒ వేరుశనగ: 9.89 లక్షల ఎకరాలు⇒ పత్తి: 12.87 లక్షల ఎకరాలు⇒ అపరాలు తదితర పంటలు: 8 లక్షల ఎకరాలు -
ప్రభుత్వమే ఆ పొలాలకు నష్టపరిహారం ఇవ్వాలి: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నం కొత్తపూడి గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. రైతుల అనుమతి లేకుండా పోర్ట్ పేరుతో విద్యుత్ టవర్ల ఏర్పాటుకు అధికారులు మార్కింగ్ చేశారు. ఇవాళ(మే 28, గురువారం) వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని.. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘1994-95లో కొత్తపూడి గ్రామంలోని దళిత, పేద కుటుంబాలకు ప్రభుత్వం పట్టాల రూపంలో భూమి ఇచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆ పట్టాలన్నింటినీ ఫ్రీ హోల్డ్ గా మార్పు చేశారు. పోర్టు అవసరాల కోసం ఆ పొలాల్లో హెవీ విద్యుత్ లైన్ టవర్లను వేయడానికి అధికారులు మార్కింగ్ చేశారు. రైతులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేశారు. హై ఓల్టేజ్ విద్యుత్ లైన్ల వల్ల తమ భూమికి విలువ లేకుండా పోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు’’ అని పేర్ని నాని పేర్కొన్నారు.‘‘విద్యుత్ లైన్ టవర్లు వేయాలనుకుంటే ఈ పొలాలన్నింటినీ పూర్తిగా కొనుగోలు చేసి నష్టపరిహారం ఇవ్వాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అసైన్డ్ భూములను సేకరించినా రైతులకు సంతోషకరమైన పద్ధతిలోనే పరిహారాన్ని అందించాం. కొత్తపూడి గ్రామ రైతులకు కూడా ప్రభుత్వం పరిహారం చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభించాలి’’ అని పేర్ని నాని డిమాండ్ చేశారు. -
క‘న్నీటి’పాలు
సాక్షి, హైదరాబాద్: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునే సమయానికి ప్రకృతి మరో సారి కన్నెర్రజేసింది. మంగళవారం రాత్రి రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షం రైతుల కష్టాన్ని నీటిలో కలిపేసింది. పలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలకు ఆశగా తీసుకొచ్చిన ధాన్యం, మొక్కజొన్న వర్షానికి తడిసిముద్దవగా.. కొన్నిచోట్ల నీటి ప్రవాహంలో ధాన్యం రాశులు కొట్టుకుపోయాయి. తమ పంట కళ్లముందే తడిసిపోతుండటంతో రైతులు నిస్సహాయంగా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, నాగర్కర్నూల్, యాదాద్రి భువనగిరి, మెదక్, మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అకాల వర్షం తీవ్ర ప్రభావం చూపింది. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి నిల్వ ఉంచిన ధాన్యం బస్తాల్లోకి నీరు చేరడంతో రైతులు మళ్లీ వాటిని ఎండబెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. కొన్నిచోట్ల రైతులు రాత్రివేళ కుటుంబ సభ్యులతో కలిసి ధాన్యం నిల్వలు తడవకుండా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాంట్రాక్ట్ లారీలు సమయానికి రాకపోవడంతో ధాన్యం బస్తాలు కేంద్రాల్లోనే పేరుకుపోయాయి. వర్షం మొదలవగానే రైతులు పరుగులు తీస్తూ బస్తాలపై ప్లాస్టిక్ కవర్లు కప్పినా ప్రయోజనం లేకపోయింది. కొన్ని కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు లేక రైతులు రాత్రంతా వానలోనే ధాన్యానికి కాపలా కాశారు. మొక్కజొన్న రైతుల పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. వారాల తరబడి మొక్కజొన్నను కొనుగోలు చేయకుండా మార్కెట్ యార్డులు, పీఏసీఎస్లలోనే నిల్వ ఉంచుతుండటంతో... తడిసిన మొక్కజొన్న మొలకెత్తే పరిస్థితి తలెత్తింది. కొనుగోళ్లలో జాప్యం, గన్నీ సంచుల కొరత, లారీల లేమి కారణంగానే ఈ నష్టం జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. కాగా అకాల వర్షంతో పలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవడంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందించారు. కొనుగోళ్లలో వేగం పెంచాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అకాల వర్షానికి తడిసిన వడ్లను పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేస్తుందని, ఆందోళన చెందొద్దని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు. జిల్లాల వారీగా పరిస్థితి ఇదీ... ⇒ మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసిపోయాయి. ‘వారం రోజులుగా లారీలు వస్తాయని చెబుతున్నారు.. ఇప్పటికీ రాలేదు. ఒక్క వానతో మా కష్టం అంతా పోయింది’ అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నశంకరంపేట మండలంలోని శాలిపేట, సూరారం కొనుగోలు కేంద్రాల్లో కూడా రోజుల తరబడి లారీలు రాకపోవడంతో ధాన్యం ఎండకు ఎండి, వానకు తడిసే పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల తడిసిన మొక్కజొన్న మొలకెత్తే పరిస్థితి ఏర్పడింది. మెదక్, హవేలీ ఘనాపూర్, పాపన్నపేట, కుల్చారం, కౌడిపల్లి, చిలిపిచేడ్, రామాయంపేట, చేగుంట మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం వర్షానికి పూర్తిగా తడిసిపోయింది. నిజాంపేట మండలంలో కల్లాలు లేక రైతులు రహదారులపైనే ధాన్యం ఆరబోసుకున్నారు. వర్షం రావడంతో రోడ్లపై ఉన్న వడ్ల కుప్పలు పూర్తిగా తడిసిపోయాయి. ⇒ కామారెడ్డి జిల్లా రాజంపేట ప్రాంతంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. సదాశివనగర్ మండలం మల్లుపేట, ఎల్లారెడ్డి పరిసరాల్లో కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం తడిచిపోయింది. ⇒ జగిత్యాల జిల్లా ధర్మపురి మార్కెట్ యార్డులో వర్షం కారణంగా ధాన్యం, మక్కలు తడిశాయి. ⇒ పెద్దపల్లి, మంథని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న వడ్ల కుప్పలు, బస్తాలు పూర్తిగా తడిచిపోయాయి. బలమైన గాలులకు టార్పాలిన్లు ఎగిరిపోవడంతో వర్షపు నీరు ధాన్యంలోకి చేరింది. ⇒ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. రాత్రివేళ రైతులు ప్లాస్టిక్ షీట్లు కప్పి కాపాడేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ⇒ మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలో పంటలను కాపాడేందుకు వెళ్లిన నలుగురు రైతులు గోడ కూలి మృతి చెందిన ఘటన అకాల వర్షాల తీవ్రతను ప్రతిబింబిస్తోంది. ⇒ రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో సరిపడా టార్పాలిన్లు, హమాలీలు, లారీలు లేకపోవడం వల్లే ధాన్యం ఎక్కువ రోజులు కేంద్రాల్లోనే నిల్వ ఉండిపోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అచ్చంపేట మార్కెట్కు వడ్లు తీసుకొచ్చి చాలా రోజులైనా కాంటా వేయలేదు. కుప్పలుగా పోసిన ధాన్యం మంగళవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి తడిసింది. నిద్రిస్తున్న సమయంలో భారీ వర్షం రావడంతో ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. కనీసం తడిసిన వడ్లను వెంటనే కొనాలి. –రషీదా, మల్లెల తీర్థం, నాగర్ కర్నూల్ జిల్లా చివరి గింజ వరకూ కొంటాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్రెడ్డి స్పష్టం చేశారు. రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, చివరి గింజ వరకు కొనుగోలు చేయడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితిపై ఉత్తమ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, కలెక్టర్లు, పోలీస్, రవాణా శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ఇప్పటికే తడిసిన 9,214 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించినట్లు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వేగంగా మిల్లులకు తరలించేందుకు ఇసుక రవాణా లారీలను కూడా వినియోగిస్తున్నామని చెప్పారు. రైతులకు ఇప్పటికే రూ.10,097 కోట్ల చెల్లింపులు జరిగాయని, దీనివల్ల 8.15 లక్షల మంది రైతులు లబ్ధి పొందినట్లు పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యంలో 44.67 లక్షల మెట్రిక్ టన్నులు సాధారణ రకాలు కాగా, 12.33 లక్షల మెట్రిక్ టన్నులు సన్న ధాన్యమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ చేపడుతున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ తగిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. -
53 వేల ఎకరాల్లో కట్టుకోండి మేమైతే భూములు ఇవ్వము
-
రూ.50 వేల వరకు రైతులకు రుణమాఫీ
సాక్షి, చెన్నై: తమిళనాడులో రైతులకు రూ. 50 వేల వరకు రుణాలు మాఫీ చేస్తూ సీఎం విజయ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం సీఎం విజయ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి వినోద్, సహకార శాఖ మంత్రి వి. గాం«దీరాజ్, ఆరి్థక శాఖ మంత్రి ఎన్.మరియ విల్సన్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, ఆర్బీఐ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని 01.05.2025 నుంచి 28.02.2026 వరకు సహకార బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణా లను మాఫీ చేయాలని సీఎం ఆదేశించారు. రూ.50 వేల వరకు పూర్తిగా రుణాలు మాఫీ చేస్తూ సంతకం చేశారు. అలాగే రూ. 50001 నుంచి లక్ష వరకు శ్లాబ్ల వారీగా విభజించి రూ.20వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు చొప్పున రుణాలు మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 14,22,555 మంది రైతులు లబ్ధి పొందనున్నారని ప్రభుత్వం ప్రకటించింది. రోజుకు 5 షోలకు అనుమతితమిళ చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు విజయ్ను కలిసి థియేటర్లలో రోజుకు 5 ఆటలు ప్రదర్శించుకునేలా అనుమతి ఇవ్వాలని గత వారం కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం విజయ్ 1957 తమిళనాడు థియేటర్ల నియంత్రణ చట్టం నిబంధనలను సవరిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇకపై తమిళనాడు వ్యాప్తంగా అన్ని థియేటర్లలో కొత్తగా విడుదలయ్యే తమిళ సినిమాలు విడుదలైన రోజు నుంచి వారం రోజుల పాటు రోజుకు ఐదు ఆటలు, స్థానిక పండగ రోజులు, ప్రభుత్వ సెలవుదినాలు, శని,ఆదివారాల్లో కూడా రోజుకు ఐదు ఆటలు ప్రదర్శించడానికి అనుమతి ఇచ్చారు. -
రైతు గోస పట్టదా?
సాక్షి, హైదరాబాద్/కుల్కచర్ల/గజ్వేల్: కాంగ్రెస్ పార్టీకి రైతుల గోస పట్టడం లేదని, పండించిన పంటను అమ్ముకోలేని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో సోమవారం ‘రైతుగోస– బీజేపీ భరోసా’కార్యక్రమాన్ని ప్రారంభించి, మార్కెట్ యార్డులోని రైతులతో మాట్లాడారు. ఆ తర్వాత సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డును కూడా సందర్శించి రైతులతో మాట్లాడారు. వరంగల్లో ఇచ్చిన డిక్లరేషన్ను కాంగ్రెస్ ఏనాడో మర్చిపోయిందన్నారు. రియల్ఎస్టేట్ దందా తప్ప క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఎలా జరుగుతుందో సీఎంకు తెలియదన్నారు. ఇప్పటివరకు ఆయా జిల్లాల వారీగా ఎంతమేర ధాన్యం సేకరించారో శ్వేతపత్రం విడుదల చేయాలని రాంచందర్రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.45 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 45 లక్షల టన్నులు సేకరించామని సీఎం పేర్కొంటున్నారని తెలిపారు. ఈ లెక్కన కూడా 30 శాతం మించలేదని మండిపడ్డారు.బీజేపీ శాసనసభాపక్షనేత మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి కాకుండానే, వారంలో కేంద్రాలను మూసేయాలని ప్రభుత్వం భావిస్తున్నదని మండిపడ్డారు. అలా చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. మెదక్ ఎంపీ రఘునందన్రావు మాట్లాడుతూ బీజేపీ బస్సు యాత్ర వస్తుందని తెలిసి...కలెక్టర్ ఆదివారం గజ్వేల్ మార్కెట్ యార్డుకు ఆగమేఘాల మీద చేరుకొని లారీలు , గన్నీ బ్యాగులు తెప్పించే ప్రయత్నం చేశారని చెప్పారు. ఇదే ప్రయత్నం నిరంతరంగా ఎందుకు సాగటం లేదని ప్రశ్నించారు. పార్టీ కార్యాలయం నుంచి ఐక్యత చాటుతూ... పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలనకు ఐక్యతను చాటుతూ ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు బస్సులో బయలుదేరారు. ఈ బస్సు యాత్రలో ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎం.రఘునందన్రావు, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, రామారావు పటేల్, పైడి రాకేశ్రెడ్డి, ధన్పాల్ సూర్యానారాయణగుప్తా, డా.పాల్వాయి హరీశ్బాబు, ఎమ్మెల్సీలు ఏవీఎన్రెడ్డి, డా.సి.చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమురయ్య, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. మంగళ, బుధవారాల్లో ఉమ్మడి నల్లగొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల తీరును బీజేపీ ప్రతినిధి బృందం సమీక్షించనుంది. -
రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం మద్దతు ధరలు ప్రకటిస్తున్నప్పటికీ పంటలను మాత్రం పూర్తిస్థాయిలో కొనడం లేదని అన్నారు. సోమవారం సచివాలయంలో సీపీఎం రాష్ట్ర నాయకులు.. ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ నేతృత్వంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పండిన పంటలో 30 శాతం కూడా సేకరించడం లేదని విమర్శించారు. పంట కొనుగోళ్ల విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించాలని వారికి సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు కొనసాగిస్తోందన్నారు. సన్న వడ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తూ కొనుగోలు చేస్తున్నామని, మొక్కజొన్నను కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. కొనుగోళ్లపై నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నామని సీఎం చెప్పారు. బెంగాల్ ఎన్నికల కారణంగా హమాలీల కొరత ఏర్పడిందని, ఎండ తీవ్రత వల్ల మధ్యాహ్న సమయంలో పనులు మందగిస్తున్నాయని పేర్కొన్నారు. మూసీ నిర్వాసితులకు అక్కడే ఇళ్లు..: కాగా, మూసీ నిర్వాసితులకు స్థానికంగానే ఇళ్లు మంజూరు చేస్తామని సీపీఎం నేతలకు సీఎం హామీ ఇచ్చారు. మూసీ అంశంపై బీఆర్ఎస్, బీజేపీ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. మూసీని అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని, ఈ ప్రాజెక్ట్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. మూసీ కాలుష్యం కారణంగా నల్లగొండ జిల్లా ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని సీఎం తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన బ్రేక్ఫాస్ట్, భోజనం అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని, ఆరుట్ల స్కూల్ను ఒకసారి సందర్శించాలని సీపీఎం నాయకులను సీఎం ఆహ్వానించారు. ఈ భేటీలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కనీస వేతనాల సవరణ చట్టాన్ని తీసుకువచ్చినందుకు సీపీఎం నాయకులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. -
హక్కుల సాధనకు రాజకీయ, న్యాయ పోరాటం
తాడేపల్లి రూరల్: డిమాండ్లు పరిష్కరించకుండానే రాజధానికి భూములు సేకరించడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తమ హక్కులను పూర్తిగా హరిస్తోందని భావిస్తున్న రైతులు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు రాజకీయ, న్యాయ పోరాటాలు తప్పనిసరని భావిస్తున్నారు. రాజధాని ముఖద్వారమైన ఉండవల్లిలో రైతులందరూ ఆదివారం రాత్రి తాజాగా సమావేశమయ్యారు. అధికారులతో జరిగిన సమావేశాల్లో భరోసా లభించట్లేదని ఆవేదన వెలిబుచ్చారు. గ్రామ సభల్లో పాల్గొని తమ సమస్యలు విన్నవించుకుని అటు తర్వాత బాయ్కాట్ చేయాలని పలువురు రైతులు పిలుపునిచ్చారు. రైతులను బెదిరించడానికి కేసులు పెడతారని, ఆస్తులు ధ్వంసం చేస్తారని, అన్నింటికీ సంసిద్ధంగా ఉండాలని కూడా రైతులు నిర్ణయించుకున్నారు. ప్రముఖ వైద్యులు కన్నారావు నాయుడు, రైతు సంఘం నాయకులు ఈశ్వర్రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కళ్లం సంజీవరెడ్డి తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు.. తీవ్ర నిరసనకు సంసిద్ధం గ్రామసభ నిర్వహించేందుకు 15 రోజుల ముందే ప్రతి ఒక్క రైతుకు నోటీసు అందజేయాలి. 29వ తేదీ గ్రామసభ అని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరికీ అధికారికంగా నోటీస్ ఇవ్వలేదు. ఉండవల్లిలో 1,100 ఎకరాలు ఉంటే అందులో బడా బాబులు, వ్యాపార వేత్తలు 230 ఎకరాలు మాత్రమే ల్యాండ్ పూలింగ్కు భూములు ఇచ్చారు. 870 ఎకరాలు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు ఆ భూములకు భూసేకరణకు నోటీసులు ఇచ్చారు. అధికారులు ఉండవల్లిలో అంగుళం భూమి కూడా వదిలిపెట్టమని స్పష్టం చేశారు. 870 ఎకరాల్లో సుమారు 1,500 మంది రైతులు ఉన్నారు. గ్రామ సభకు ప్రతి కుటుంబం నుంచి అందరూ వస్తే వేలాదిమంది అవుతారు. తద్వారా ప్రభుత్వానికి, అధికారులకు తీవ్ర నిరసన తెలియజేయాలి. విభజించి.. పాలించుచంద్రబాబు సర్కార్ వైఖరిపై ధ్వజం ఉండవల్లిలో వెయ్యిమంది రైతులకు దేవాలయ భూముల్లో ప్లాట్లు కేటాయిస్తామని కొంతమంది రైతులను మభ్యపెడుతున్నారు. అక్కడ ఉన్నది 200 ప్లాట్లు అయితే వెయ్యిమందికి ఎలా ఇస్తారో రైతులు ఆలోచించుకోవాలి. విభజించి పాలించాలనే సిద్ధాంతాన్ని రాజధాని రైతులకు వర్తింపజేయాలని ప్రభుత్వం, కొంతమంది నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. దానిని మనం తిప్పి కొట్టాలి. ఉండవల్లిలో అధికారిక రిజి్రస్టేషన్ వ్యాల్యూ ప్రకారం చూసినా ఎకరం రూ.5 కోట్లకు క్రయ విక్రయాలు జరిగాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒక గ్రామంలో ఎక్కువగా ఎంత మొత్తంలో రిజి్రస్టేషన్ జరిగితే దాని ప్రకారం అవార్డు ప్రకటించాల్సి ఉంది. ఈ లెక్కన ఒకవేళ ప్రభుత్వం బలవంతంగా భూసేకరణకు వెళినా, రైతులకు సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా న్యాయం జరగాలి. రాజధాని ప్రాంతంలోని ఒక గ్రామంలో రైతులకు 2018లో ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. ఆ రైతులకు మొత్తం రూ.9 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. భూములు ఇచ్చిన రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి ఇది అద్దం పడుతోంది. గూగుల్ మ్యాప్లో ప్లాట్లు చూపిస్తున్నారు ఇటీవల ఒక గ్రామంలో జరిగిన సభలో గూగుల్ మ్యాప్లో ప్లాట్లు చూపించారు. ఆ ప్లాట్లు ఎక్కడున్నాయో రైతులకు ఎలా తెలుస్తుంది? తమకు ప్లాట్లు కేటాయించడంలో, అభివృద్ధి చేయడంలో ఎటువంటి న్యాయం జరగలేదంటూ సీఆర్డీఏ అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన ప్లాట్ల పత్రాలతో బ్యాంకు లోన్కు వెళితే బ్యాంకు అధికారులు తిరస్కరిస్తున్నారు. వ్యవసాయం లేక, ఇచ్చే అరకొర కౌలు చాలక, పిల్లల చదువులు, పెళ్లిళ్లు వాయిదాలు పడుతున్నాయి. ఇప్పటికే బడా సంస్థలకు భూములు కేటాయించారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఎందుకు ప్లాట్లు కేటాయించడం లేదని ప్రశి్నంచడంతో అధికారులు మధ్యలోనే సమావేశం ముగించి వెళ్లిపోయిన పరిస్థితులు నెలకొంటున్నాయి.కొన్ని గ్రామాల్లో సభలను వాయిదా వేస్తున్నారు. సీఆర్డీఏ కమిషనర్ ఉండవల్లి భూములు గతంలోనే చాలా విలువైనవి అంటూ మాట్లాడుతూనే ప్రతి అంగుళం భూమిని భూ సేకరణ కింద తీసుకుంటామని చెబుతున్నారు. అధికారులు నామమాత్రంగా సమావేశాలు నిర్వహించి మినిట్స్బుక్లో రాసుకుంటున్నారు తప్ప.. రైతులకు ఎటువంటి ప్రయోజనాలు లభించడం లేదు. ఈ సమావేశంలో మున్నంగి వీరశ్రీధర్రెడ్డి, మున్నంగి అంజిరెడ్డి, దండమూడి సాంబశివరావు, గోపాలం ప్రభాకరరావు, దంటు బాలాజీ, దాసరి నాగేశ్వరరావు, ఆళ్ళ వాసు, గాదె నాగరాజు, బుర్రముక్కు పద్మారెడ్డి, కోటేశ్వరరావు, అశోక్రెడ్డి, సందు చినబసవయ్య, సింగంశెట్టి మనోహర్, గోపాలం ప్రభాకర్, ఉండవల్లి అశ్వని, కొప్పోలు శంకరరావు, తమ్మా శ్రీనివాస్రెడ్డి, జొన్న శ్రీను, గోపాలం వాసు, మోదుగుల శ్రీను, జొన్న శివశంకర్, పాల కోటేశ్వరరావు, పెద్దిశెట్టి వీరాస్వామి, గుంటక నరేష్రెడ్డి తదితర రైతులు, నేతలు పాల్గొన్నారు. -
చంద్రబాబూ.. అంత ఫ్రస్టేషన్ ఎందుకు?: వైఎస్ జగన్
తాడేపల్లి: చంద్రబాబు అణచివేత చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, నియంతలా మారిన చంద్రబాబు పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతు నులుముతున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? అంటూ వైఎస్ జగన్ నిలదీశారు. ఈ మేరకు మామిళ్లపల్లె ఘటనలపై కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరును వైఎస్ జగన్ ’ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. ‘గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లెలో కాపు సామాజికవర్గానికి చెందిన రైతుల పరామర్శకు వెళ్తున్న మా పార్టీ నేతలు జోగి రమేష్, జూపూడి ప్రభాకర్, వరికూటి అశోక్బాబు, పీట నాగ మోహన్ కృష్ణ, అంబటి మురళి తదితర నాయకులు, కార్యకర్తలపై పోలీసుల దాడి అత్యంత హేయం. జరుగుతున్న అన్యాయాన్ని బయటి ప్రపంచానికి చూపిస్తూ, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న మా నాయకులపై పైశాచికంగా వ్యవహరించి, అరెస్టులు చేసిన విధానం అత్యంత దారుణంగా ఉంది. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఎలా ఖూనీ చేస్తున్నాడో కళ్లకు కట్టినట్టు తెలుస్తోంది. శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళితే చంద్రబాబుకు ఎందుకు బీపీ వస్తోంది? అంత ఫ్రస్టేషన్ ఎందుకు చూపిస్తున్నారు? మొక్కజొన్న కనీస ధర రూ.2,400 అయితే ఈ ఏడాది రూ.1,400- రూ.1,600లు కూడా రాలేదు. తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో గ్రామంలో కొంతమంది కాపు సామాజిక వర్గానికి చెందిన రైతులు తమ మొక్కజొన్న పంటను, తమకు సంబంధించిన రైతు గోడౌన్లో నిల్వచేసుకుంటే, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తన అనుచరులతో దాడులు చేయించడమే కాకుండా, ఆ రైతులపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ కేసులు ఎందుకు పెట్టించారు? కనీస మద్దతు ధర రూ.2,400కు కొనుగోలు చేయకపోయినా, దీన్ని ఎవ్వరూ ప్రశ్నించకూడదా?, రైతులకు సంఘీభావంగా మామిళ్లపల్లె ఎవరు వెళ్తున్నా వారిపై పోలీసులతో దాడులు చేయించి, అరెస్టులు చేస్తారా?మరోవైపు మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న గౌరవప్రదమైన వ్యక్తులపై కూడా కేసులు పెట్టించి బెదిరింపులకు దిగుతారా? తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్సీ, నిత్యం ప్రజా గొంతుకై నిలిచే ప్రొ. నాగేశ్వర్ గారిపై మీరు దగ్గరుండి కేసులు పెట్టించడం దారుణం కాదా? ఆయన అన్ని పార్టీలమీదా విమర్శలు, అన్ని వార్తాంశాలమీద విశ్లేషణలు చేస్తారు కదా? ఆయన నిజం మాట్లాడితే కేసులా? ప్రశ్నిస్తే అరెస్టులా? విమర్శిస్తే వేధింపులా? రాష్ట్రాన్ని జంగిల్రాజ్ చేశారు చంద్రబాబూ.చంద్రబాబు అణచివేత చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. నియంతలా మారిన చంద్రబాబు పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతు నులుముతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లెలో… pic.twitter.com/t1FH8uUsDv— YS Jagan Mohan Reddy (@ysjagan) May 24, 2026 మీరు దాడులు చేసి, ప్రతిపక్షం గొంతు నొక్కి, పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ ఎంతకాలం పాలిస్తారు? అధికార మదంతో విర్రవీగుతున్న ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి… ప్రజలు ఎల్లకాలం సహించరు. ప్రజల కోసం నిలబడటం మా బాధ్యత. మీ అక్రమాలు, మీ అణచివేతలు, మీ కక్షసాధింపులపై మా పోరాటం ఆగదు. ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ గళం విప్పుతూ ఉంటుంది, ఎప్పటికీ ప్రజలకు అండగా ఉంటుంది’ అని స్సష్టం చేశారు. -
వైఎస్సార్సీపీ పోరాటానికి దిగొచ్చిన ప్రభుత్వం
సాక్షి గుంటూరు: వైఎస్సార్సీపీ నేతల పోరాటంతో కూటమి ప్రభుత్వం దిగొచ్చింది. మామిళ్లపల్లిలో సీజ్ చేసిన గోడౌన్ను అధికారులు తెరిచారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల ప్రోద్భలంతో అధికారులు గోడౌన్ సీజ్ చేశారు. దీంతో దానిని తెరవాలంటూ అక్కడి రైతులు ఆందోళనకు దిగారు. రైతుల పోరాటానికి వైఎస్సార్సీపీ నేతలు అండగా నిలిచారు. ఎన్ని దాడులు చేసినా, అట్రాసిటీ కేసులు పెట్టినా వెనక్కి తగ్గకుండా పోరాటం చేశారు. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వం దిగొచ్చి గోడౌన్ తెరిచింది. గోడౌన్ మెుక్కజోన్న రైతులదేనని అధికారులు తేల్చారు. మొక్కజొన్న రైతులపై దాడి, అక్రమ కేసులపై వైఎస్సార్సీపీ పోరాటానికి సిద్ధమైంది. ఈ నెల 13వ తేదీన రైతులకు అండగా ఉండేందుకు చలో చలో మామిళ్లపల్లి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ శ్రేణులకు ఎన్నో అడ్డంకులు సృష్టించింది కూటమి ప్రభుత్వం. పోలీసుల్ని అడ్డం పెట్టుకుని మరీ దౌర్జన్య కాండకు దిగింది. అయినప్పటికీ వైఎస్సార్సీపీ వెనక్కి తగ్గకపోవడంతో కూటమి ప్రభుత్వం దిగొచ్చి సీజ్ చేసిన గోడౌన్ను తెరిచింది. -
22ఏ భూములపై బాబు దొంగాట
సాక్షి, అమరావతి: చంపేయాలనే కసితో ఒక వ్యక్తిపై దాడి చేసి, ఆ తర్వాత ఏమీ తెలియనట్లు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లి తానే బతికించానని చెప్పుకోవడాన్ని ఏమంటారు? రాష్ట్రంలో 22ఏ జాబితా భూముల విషయంలో ఇప్పుడు చంద్రబాబు సర్కారుది అచ్చు ఇదే తంతు. ఇన్నాళ్లూ ఈ భూములన్నింటినీ వివాదంలో పెట్టి.. ఇప్పుడు తానే విముక్తి కల్పిస్తున్నట్లు డబ్బా కొట్టుకుంటూ మరోమారు క్రెడిట్ చోరీకి బరితెగించారు. ఈ క్రమంలో భూముల వ్యవహారంలో చంద్రబాబుది అత్యంత నీచమైన రాజకీయ క్రీడ అని ఆ రంగానికి చెందిన నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే కక్షపూరితంగా 20 లక్షల ఎకరాలను 22ఏ జాబితాలో పెట్టి.. పేద, మధ్యతరగతి రైతుల ఉసురు పోసుకున్నారు. జగన్ హయాంలో అక్రమాలు జరిగాయనే నెపం వేసి రెండేళ్లు ఆ భూముల రిజిస్ట్రేషన్లు జరక్కుండా వివాదంలో పెట్టారు. అనేక విచారణల తర్వాత అక్రమాలు లేవని తేలడంతో ఇప్పుడు ఆ భూములను 22ఏ జాబితా నుంచి తొలగించడానికి ఆదేశాలు ఇచ్చారు. పైగా తానే ఆ భూములకు విముక్తి కల్పిస్తున్నట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటుండటం విస్తుగొలుపుతోంది. 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు 6 లక్షల ఎకరాలకుపైగా భూములను 22ఏ జాబితాలో పెట్టారు. నాలుగవసారి ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకోవడమే తప్ప ఆయన హయాంలో భూముల సమస్యలు పరిష్కారం కాకపోగా, ఇంకా ఎక్కువయ్యాయి. రాష్ట్రంలో 22ఏ భూముల వ్యవహారాన్ని అత్యంత క్లిష్టమైన సమస్యగా మార్చింది చంద్రబాబే. చుక్కల భూములు, షరతులుగల పట్టా భూములు, ఈనాం భూములే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. చివరికి పేద రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం హక్కులు కల్పించిన ఫ్రీహోల్డ్ భూములపైనా ఆయనది అదే తీరు. చుక్కల భూములను చిక్కుల్లో పెట్టింది బాబే 2016లో 4.10 లక్షల ఎకరాల చుక్కల భూములను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 22ఏ జాబితాలో పెట్టింది. అంతకు ముందు ఆ భూముల రికార్డులు పక్కాగా లేకపోయినా, అవి రైతుల అనుభవంలోనే ఉండడంతో రిజిస్ట్రేషన్లు జరిగేవి. వాటిని సక్రమం చేసే పేరుతో ఏకంగా లక్షల మంది రైతులను నట్టేట ముంచి రిజిస్ట్రేషన్లు జరక్కుండా చేశారు. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యపై ఫోకస్ పెట్టి.. 15 జిల్లాల్లో 2.06 లక్షల ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగించారు. ఇందుకోసం 1.81 లక్షల సర్వే నంబర్లను పలుమార్లు రీ వెరిఫికేషన్ చేయించారు. దీంతో ఆ రైతులకు హక్కులు వచ్చాయి. అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. 2024లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాగానే వాటిని 22ఏ(నిషేధిత) జాబితాలో పెట్టించారు.షరతుల పట్టా భూములకూ అన్యాయమేషరతులు గల పట్టా భూముల విషయంలోనూ చంద్రబాబుది అదే తీరు. రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల ఎకరాలుండగా, కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోనే 33 వేల ఎకరాలను 2016లో ఆయన ప్రభుత్వం 22ఏ జాబితాలో పెట్టేసింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రిజిస్ట్రేషన్లు జరుగుతున్న భూముల్ని ఒక్క ఆదేశంతో వివాదాస్పదం చేసేశారు. 2023లో వైఎస్ జగన్ వాటిని 22ఎ జాబితా నుంచి తొలగిస్తే, 2024 జూన్లో మళ్లీ వాటిని చంద్రబాబు 22ఏ జాబితాలో పెట్టించడంతో ఆ రైతులు నెత్తీనోరూ బాదుకున్నారు. ఇంతా చేసి ఇటీవలే తన హయాంలోనే ఆ రైతులకు మేలు చేస్తున్నట్లు చెప్పుకుంటూ ఆ భూములను 22ఏ జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఈనాం భూముల విషయంలో సైతం అదే తీరు. గత జగన్ ప్రభుత్వం 1.39 లక్షల ఎకరాల సర్వీస్ ఈనాం రైతులకు కల్పించిన ఫ్రీ హోల్డ్ హక్కులను కేవలం రాజకీయ కక్షతో 22 నెలల పాటు 22ఏ జాబితాలో పెట్టారు. ఇప్పుడు అవే భూములకు తమ ప్రభుత్వం విముక్తి కల్పిస్తున్నట్లు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. 2024 ఆగస్టులో ఆ భూముల్ని నిర్దాక్షిణ్యంగా 22ఏ జాబితాలో పెట్టింది చంద్రబాబే.ఫ్రీ హోల్డ్ భూములపైనా అదే తంతురాష్ట్రంలో ఎన్నడూ లేని రీతిలో గత ప్రభుత్వం 20 సంవత్సరాలు దాటిన అసైన్డ్ భూములపై పేద రైతులకు యాజమాన్య హక్కులు (ఫ్రీ హోల్డ్) కల్పించింది. 27.40 లక్షల ఎకరాలకు చెందిన 15.20 లక్షల మంది అసైన్డ్ రైతులకు సంపూర్ణంగా హక్కులు కల్పించడంతో వారు ప్రైవేటు భూముల తరహాలో తమ భూములకు హక్కుదారులయ్యారు. ఎన్నికలు జరిగే సమయానికి 13.59 లక్షల ఎకరాలకుపైగా అసైన్డ్ భూములను గత ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ చేసి రైతులను యజమానులను చేసింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆ భూములన్నింటినీ 22ఏ జాబితాలో పెట్టేశారు. అనేక వెరిఫికేషన్లు, విచారణలు చేసి అక్రమాలేవీ లేవని తేలడంతో వాటిని ఇప్పుడు తీరిగ్గా 22ఏ జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించారు. అయితే చేసిన తప్పును ఒప్పుకోకుండా ఈ భూములకు హక్కులిచ్చింది తానేనని ప్రచారం చేసుకోవడంపై రైతులు మండిపడుతున్నారు. పేదలకు వారి భూములపై హక్కులు ఇవ్వకూడదనే రీతిలో రెండేళ్లపాటు ఆ భూములపై ఆంక్షలు విధించి, దాన్ని అక్రమంగా అభివర్ణించి.. ఇప్పుడు ప్లేటు ఫిరాయించడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమని రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. అసైన్డ్ ఇళ్ల స్థలాల పైనా అదే తీరు రాష్ట్రంలో అసైన్డ్ ఇళ్ల స్థలాల కేటాయింపు పూర్తయి పదేళ్లు దాటితే వాటిపై లబ్ధిదారులకు హక్కులు కల్పించాలని 2023లో అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించి అమల్లోకి తెచ్చింది. 20 ఏళ్లు దాటిన అసైన్డ్ వ్యవసాయ భూములు, పదేళ్లు దాటిన అసైన్డ్ ఇళ్ల స్థలాలను పొందిన పేదలకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు 2023లో అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది. దాని ప్రకారమే 27 లక్షల ఎకరాల అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు లభించగా.. వాటిలో 13.59 లక్షల ఎకరాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే ఫ్రీ హోల్డ్ చేశారు. అదే సమయంలో పదేళ్లు దాటిన అసైన్డ్ ఇళ్ల స్థలాలనూ ఫ్రీ హోల్డ్ చేసేందుకు ఆదేశాలిచ్చారు. రిజిస్ట్రేషన్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, రిజిస్ట్రేషన్ల శాఖకు నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇచ్చింది. దీని ప్రకారం అనేక చోట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక.. మొత్తం ఫ్రీ హోల్డ్ భూములను అక్రమాలు జరిగాయన్న ఆరోపణతో మళ్లీ 22ఏ జాబితాలో పెట్టేసింది. ఇన్నాళ్లు నానా ఇబ్బందులు పెట్టి.. చివరికి అక్రమాలేవీ జరగలేదని తేలడంతో చేసేదేమీ లేక ఇప్పుడు తాజాగా ఆ చట్టాన్ని అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఫ్రీ హోల్డ్ అయిన వ్యవసాయ భూములు, పదేళ్లు దాటిన అసైన్డ్ ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేయాలని తాజాగా మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు. ఇన్నాళ్లు రిజిస్ట్రేషన్ జరగకుండా అడ్డుకుని ఇప్పుడు ఆ ఘనత తనదేనని నిస్సిగ్గుగా చెప్పుకోవడం చంద్రబాబుకే చెల్లింది. -
దళిత రైతుల భూములపై టీడీపీ నేతల కన్ను
తిరుపతి: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కుర్ర కాలువలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దళిత రైతుల భూములపై టీడీపీ నేతలు కన్నేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కుర్ర కాలువ గ్రామంలో దళిత రైతులు సుబ్రహ్మణ్యానికి చెందిన 3.39 ఎకరాల భూమిపై టిడిపి నేతల దౌర్జన్యం చేశారు. సొంత భూమిలో నీటి బోరు వేసుకుంటుంటే టిడిపి నేత మోహన్ నాయుడు అడ్డుకున్నారు. దౌర్జన్యంగా బోర్వెల్ లారీని వెనక్కు పంపించేశారు. దాంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వంలో దళితుల భూములకు రక్షణ లేకుండా పోయిందని బాధిత సుబ్రహ్మణ్యం ఆరోపించారు. పంటలను కాపాడుకునేందుకు సూత్రాలు తెచ్చి బోరు వేస్తుంటే అడ్డుకున్నారని సుబ్రహ్మణ్యం భార్య ఆవేదన వ్యక్తం చేశారు. -
గాలివాన బీభత్సం
కడప అగ్రికల్చర్/కోవెలకుంట్ల(నంద్యాలజిల్లా/బోబ్బిలి/అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈ అకాల వర్షానికి ఉద్యాన రైతులు నిండా మునిగారు. అరటి, నిమ్మ, బొప్పాయి, మిరప పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తోటల్లో పక్వానికి వచ్చిన మామిడి కాయలు రాలిపోయాయి. ఫలితంగా రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వైఎస్సార్ కడప జిల్లా లింగాల, పులివెందుల, వేముల, వేంపల్లి, ఎర్రగుంట్ల మండలాల్లో గాలివానకు 665.60 హెక్టార్లలో అరటి, నిమ్మ, బొప్పాయి, మిరప పంటలు దెబ్బతిన్నాయి.రూ.2.31 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్టు జిల్లా ఉద్యానశాఖ అధికారి సతీష్ తెలిపారు. అన్నమయ్య జిల్లాలో మామిడి, నిమ్మ, మిరప పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. తమలపాకుల తోటలు నేలమట్టమయ్యాయి. ⇒ నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం సంజామల మండలంలో దాదాపు 80 విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర ఆటంకం కలిగింది. ముదిగేడు గ్రామంలో రైస్మిల్లు గోడ కూలి 40 జీవాలు మృతిచెందాయి. ⇒ విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం గాలివానకు విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ⇒ ఉమ్మడి అనంతపురం జిల్లాలో అరటి, బొప్పాయి, దానిమ్మ, మామిడి, టమాట పంటలు దెబ్బతిన్నాయి. 25 మండలాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిని రూ.8కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అలాగే విద్యుత్ సంస్థకు రూ.25 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. -
ఎందుకూ పనికిరాని ప్లాట్లు మాకెందుకిచ్చారు..?
కూరగల్లు: పెట్టుబడిదారులకు ఇచ్చే ప్రాధాన్యత భూములిచ్చిన తమకు ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇచ్చిన ప్లాట్లు అభివృద్ది చేయకుండానే ఇచ్చారని, లోన్ కోసం బ్యాంకులకు వెళ్తే అవి ఎందుకు పనికిరావని వారు తిరస్కరిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం(మే 22వ తేదీ) గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కూరగల్లులో సీఆర్డీఏ గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభకు హాజరైన రైతులు.. సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భార్గవ్ను నిలదీశారు. మాకే ఎందుకిలా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు ఇచ్చే ప్రాధాన్యత తమకు ఇవ్వడం లేదన్నారు. తమకు డెవలప్ చేయని ప్లాట్లు ఇస్తున్నారని, అభివృద్ధి చేసిన ప్లాట్లు ఎందుకు ఇవ్వడం లేదని రైతులు నిలదీశారు. లోన్ కోసం బ్యాంకులకు వెళ్తే అవి పనికిరావని చెబుతున్నారని, తమకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. -
కాంటా తంటా..తాలు మోసాలు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలోని 28 జిల్లాల పరిధిలో కొనుగోలు కేంద్రాలకు ఇప్పటివరకు 54,53,622 మెట్రిక్ టన్నుల (ఎంటీ) ధాన్యం వచ్చింది. అందులో ఈ నెల 18వ తేదీ వరకు 39,74,335 ఎంటీల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయినా మరో 14,79,287 ఎంటీల ధాన్యం కేంద్రాల్లోనే ఉంది. ఇక కొనుగోలు చేసిన ధాన్యంలోనూ 2,87,540 ఎంటీల ధాన్యం మిల్లులకు పంపకుండా కేంద్రాల్లోనే ఉంచారు. అంటే అధికారిక లెక్కల ప్రకారమే 17,66,827 ఎంటీల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉండిపోయింది. ఇక 36,86,795 ఎంటీల ధాన్యం మిల్లులకు వెళ్లినా, అందులో 6,00,143 ఎంటీల ధాన్యాన్ని మిల్లర్లు దింపుకోలేదు. మొత్తంగా ఇలా 23.66 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. కొనుగోళ్లు ప్రారంభమై నెలన్నర దాటిపోయింది. మే నెలాఖరుకల్లా కొనుగోళ్లు చివరి దశకు చేరుకోవాల్సి ఉంది. అయినా 43.38 శాతం ధాన్యానికి సంబంధించిన రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. కొనుగోళ్ల వ్యవహారంలో అధికారులు విఫలం కావడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లారీలు రాక మండుటెండలో.. రాష్ట్ర వ్యాప్తంగా యాసంగిలో 60 లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగు చేయగా, 151 ఎల్ఎంటీల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అందులో దాదాపు 40 శాతం మిల్లర్లు నేరుగా కొను గోలు చేసినా, మిగతా 60 శాతం కొనుగోలు కేంద్రాల ద్వారానే కొనాలి. కానీ అందులో కొనుగోలు చేసింది 65 శాతం లోపే. ఇక 8,575 కొనుగోలు కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు ట్రక్కులు, ట్రాక్టర్లు, లారీలు కలిపి 11500 రవాణా వాహనాలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ క్షేత్ర స్థాయిలో అందులో సగం కూడా కనిపించడం లేదు. రాష్ట్ర స్థాయి లో లారీలను సమకూర్చుతామంటూ టెండర్లలో పాల్గొన్న కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. తమ వద్ద అందుబాటులో ఉన్నాయని పేర్నొ న్న లారీల్లో సగం కూడా ధాన్యం రవాణాకు సమకూర్చకపోవడంతో రైతులకు తంటాలు తప్పడం లేదు. ఈ విషయంలో అధికార యంత్రాంగం వారికే వంత పాడుతోందనే ఆరోపణలున్నాయి. లారీలు రాకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు ఆగిపోతుండగా, మరికొన్ని జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాలకు రోజు విడిచి రోజు కూడా లారీలు రావడం లేదు. దీంతో రైతులు మండుటెండలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అకాల వర్షాల భయంతో ఏదోలా అమ్ముకొని ఇంటికి వెళదామంటే సకాలంలో లారీలు రాకపోవడంతో రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. తాలు పేరుతో అడ్డగోలు దోపిడీ మరోవైపు కొనుగోలు కేంద్రంలోనే తాలు పేరుతో కిలో, రెండు కిలోలు అదనంగా దోపిడీ చేస్తుండగా, మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని దింపుకునేందుకు తాలు పేరుతో కొర్రీలు పెడుతూ నాలుగైదు కిలోలు కోత పెడుతున్నారు. మొత్తం మీద కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. ధాన్యం తూకం వేసినందుకు హమాలీలకు కమీషన్ ఇవ్వాల్సి వస్తుండగా, లారీల వారు కూడా రైతులనుంచి బస్తాకు రూ.3 చొప్పున వసూలు చేస్తున్నారు. అలా డబ్బులు ఇస్తేనే కొనుగోలు కేంద్రానికి లారీలను పంపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద కష్టపడి ధాన్యం పండించిన రైతులు ఆ ధాన్యం అమ్ముకోవడానికి సైతం నానా కష్టాలూ పడుతూ, నష్టపోవాల్సిన పరిస్థితులు ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అడ్డగోలుగా ధాన్యం దోపిడీ నల్లగొండ జిల్లాలోని ఓ కొనుగోలు కేంద్రంలో రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని బస్తాకు 40 కిలోల 700 గ్రాముల చొప్పున తూకం వేయాల్సి ఉన్నా, దానిని 42.5 కిలోల చొప్పున తూకం వేసి ఒక్కో బస్తాకు కిలో 800 గ్రాములు దోచుకున్నారు. ఒక లారీలో 1057 బస్తాలు వేస్తే దానిపై 19 క్వింటాళ్లు కోత పెట్టా రు.ఆ ధాన్యం బస్తాలను మిల్లుకు పంపించగా, సదరు మిల్లర్.. బస్తాకు 40 కిలోల 700 గ్రాముల చొప్పున లెక్కించి 1,038 బస్తాలుగానే పరిగణనలోకి తీసున్నాడు. అంటే ఇక్కడ 19 బస్తాలకు కోత పెట్టారు. అంటే మిల్లులో దాదాపు 7.7 క్వింటాళ్లు కోత పెట్టారు. ఇలా ఒక్క లారీపైనే ఇటు కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, అటు మిల్లర్లు కలిసి 26.7 క్వింటాళ్ల వరకు కోత పెట్టి, ఆ రైతుల నుంచి ఏకంగా రూ.63 వేలు దోచుకున్నారు. లారీలు ఎప్పుడొస్తాయో..ధాన్యం మార్కెట్కు తెచ్చి నెల అవుతోంది. ఇంతవరకు తరలించలేదు. లారీలు రాలేదు. ధాన్యాన్ని మిల్లులకు తరలించకపోవడంతో పట్టాలు కప్పి కాపలా ఉండాల్సి వస్తోంది. అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. – బోడ హెమ్లా, బిస్రాజుపల్లి తండా, తిరుమలాయపాలెం, ఖమ్మం కోతకు ఒప్పుకుంటేనే అన్లోడ్నేను పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి విక్రయించా. 437 బస్తాలు తూకం వేసి మిల్లుకు పంపించారు. మిల్లర్ క్వింటాలుకు 14 కిలో ల తరుగు అడిగాడు. అడిగినంత తరుగుకు ఒప్పుకుంటేనే బస్తాలు దింపుకుంటాననడంతో ఏం చేయలేక అంగీకరించా. ఇదేం దోపిడీయో అధికారులు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. – ఏనుగు చిన్న బాల్రెడ్డి, మైలారం, ధర్పల్లి, నిజామాబాద్ లారీకి రూ.5 వేలు ఇవ్వాలంటధాన్యం ఆరబెట్టి మంగపేట ఎఫ్ఎస్సీఎస్ సెంటర్లో బస్తాలు నింపి కాంటా కోసం సిద్ధంగా ఉంచా. ఇప్పటికి 29 రోజులు కావస్తున్నా నేటికీ కాంటా పెట్టలేదు. లారీకి రూ.5 వేలు ఇస్తే కాంటా పెడతామని చెపుతున్నారు. – జక్కం నాగేశ్వర్రావు, బోరునర్సాపురం, ములుగు -
'సంక్షోభాలు' నేర్పుతున్న గుణపాఠాలు
వర్షాల అనిశ్చితి, ఎరువుల దిగుమతి ఆధారితం, భూమి క్షీణత, అధిక నీటి పంటలపై మోజు – ఈ నాలుగు కలిసి భారత వ్యవసాయాన్ని సున్నితమైన స్థితిలోకి నెట్టాయి. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఈ సమస్య తీవ్రంగా వున్నది. 2026లో ఎల్నీనో ముప్పు, పశ్చి మాసియా ఉద్రిక్తతల వల్ల పెరుగుతున్న ఎరువుల ఖర్చులు రైతాంగానికి తాత్కా లిక ఇబ్బందే కాక, వ్యవసాయం చేసే పద్ధతులలో పూర్తి మార్పు అత్యవసరమని సూచిస్తున్నాయి.చిన్న మార్పులే పెను సవాళ్లువాతావరణ మార్పులు ఒక్కసారిగా కనపడవు. కొంచెం ఎక్కువ ఎండలు, ఆలస్యంగా వచ్చే వర్షాలు, పంట మధ్యలో పొడి విరామాలు – మొదట ఇవి చిన్న మార్పుల్లా కనిపిస్తాయి కానీ కొన్ని సంక్షోభాలు సమాజాన్ని తన జీవన విధానాన్ని, ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా ఆహార ఉత్పత్తి విధానాన్ని తిరిగి ఆలోచించేలా చేస్తాయి. కోవిడ్ మహమ్మారి తర్వాత ఆరోగ్యం, పోషకాహారం, స్థానిక ఆహార వ్యవస్థలు, ప్రకృతి ఆధారిత జీవన విధానాలపై కొత్త చర్చ ప్రారంభమైనట్లే, ఇప్పుడు వ్యవసాయ రంగం కూడా అలాంటి మరో మలుపు దగ్గర నిలిచింది.భారత వాతావరణ విభాగం ఈ ఏడాది దక్షిణ–పడమటి రుతుపవన వర్షపాతం దీర్ఘకాల సగటు కంటే తక్కువగా, 92 శాతం స్థాయిలో ఉండొచ్చని అంచనా వేసింది. అంతర్జాతీయ వాతావరణ అంచనాలు కూడా జూన్ నుంచి ఆగస్టు మధ్య ఎల్నీనో పరిస్థితులు బలపడే అవకాశాన్ని సూచిస్తున్నాయి. ఇదే సమయంలో, గ్యాస్, అమ్మోనియా, సల్ఫర్, డీఏపీ, యూరియా వంటి ఎరువుల సరఫరాపై అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఒత్తిడి పెంచు తున్నాయి. ఎల్నీనో భారత రుతుపవనాలను బలహీన పరుస్తుంది. వర్షాలు వచ్చినా వాటి పంపిణీ అసమానంగా ఉంటుంది. ఖరీఫ్ కాలంలో విత్తన దశలో ఆలస్యం, పుష్ప దశలో తేమ కొరత, చివరికి దిగుబడి తగ్గుదల – ఇవి రైతు ముందుకు వచ్చే ప్రధాన ప్రమా దాలు. రాయలసీమ, తెలంగాణ, విదర్భ, మరాఠ్వాడా వంటి వర్షాధార ప్రాంతాలు మరింత సున్నితంగా ఉంటాయి.ప్రమాదమా? మార్పునకు అవకాశమా?ఎరువుల విషయంలోనూ పరిస్థితి అంతే ఆందోళనకరంగా ఉంది. భారతదేశం యూరియా, డీఏపీ, మిశ్రమ ఎరువులు, అలాగే వాటి తయారీకి అవసరమైన సహజ వాయువు, అమ్మోనియా, సల్ఫర్ వంటి ఇన్ పుట్లలో గణనీయంగా దిగుమతులపై ఆధారపడు తోంది. అంతర్జాతీయ మార్కెట్లో చిన్న మార్పే భారత రైతుకు పెద్ద భారం కావడం మన వ్యవసాయ విధానం స్వయం సమృద్ధి నుంచి ఎంత బాహ్య ఆధారంగా మారిందో చూపిస్తోంది. తెలంగాణలో ఎరువులు సగటున హెక్టారుకు 280–297 కిలోలు వాడితే, ఆంధ్ర ప్రదేశ్లో 230–240 కిలోలు వాడుతున్నారు. జాతీయ సగటు హెక్టారుకు 130 కిలోలు మాత్రమే. దీనికి ప్రధాన కారణాలు: వరి తర్వాత వరే వేయటం, పప్పుధాన్యాల విస్తీర్ణం తగ్గిపోవటం, భూమిలో సేంద్రియ పదార్థం కూడా తగ్గిపోవటం. కనీసం 1.0 నుంచి 1.5 ఉండాల్సిన స్థితి నుంచి ఇది 0.3 శాతం కంటే తక్కువకు పడిపోయింది. దీని వలన తేమను పట్టి ఉంచే గుణం, సమతుల్యమైన పోషకాలు అందించలేని పరిస్థితులలో మన భూములు వున్నాయి. దీనికి తోడు, ఎక్కువ సార్లు దున్ని, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు వాడటం వలన, సంవత్సరం అంతా భూమి కప్పి ఉంచే పరిస్థితి లేకపోవటం వలన, మట్టి కొట్టుకు పోవటం, 5–6 అంగు ళాల కింద నెల గట్టి పడిపోవటం జరిగి నీరు కానీ, వేర్లు కానీ లోపలి వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో మనం ఎల్ నీనో ప్రభావాన్నీ, రసాయనిక ఎరువులు అందక పోవటాన్నీ చూడాలి. ఈ సంక్షోభాన్ని కేవలం ప్రమాదంగా మాత్రమే చూడనక్కర లేదు. ఇది మార్పునకు అవకాశం కూడా. దశాబ్దాలుగా ప్రభుత్వ కొనుగోలు విధానాలు, బోనస్లు, సబ్సిడీలు, సాగునీటి ప్రాధాన్యం– అన్నీ కలిసి వరి వంటి అధిక నీరు అవసరమయ్యే పంటలను ప్రోత్సహించాయి. తెలంగాణలో గత 15 ఏళ్లలో వారి విస్తీర్ణం 250% పైగా పెరిగింది. అనిశ్చిత వర్షపాతం, ఖరీదైన ఎరువుల కాలంలో అదే పంట నమూనాను యథాతథంగా కొనసాగించడం ఆర్థికంగా, పర్యావరణపరంగా ప్రమాదకరం.సుస్థిర మార్గమే శరణ్యంవరి విస్తీర్ణాన్ని ఒక్కసారిగా కాదుగానీ క్రమంగా తగ్గిస్తూ, చిరుధాన్యాలు, పప్పుధాన్యాల వైపు సాగును మళ్లించాలి. జొన్న, సజ్జ, రాగి, కొర్రల వంటి చిరుధాన్యాలు తక్కువ నీటితో పెరుగు తాయి, పొడి పరిస్థితుల్లో కూడా నిలబడగలవు. కంది, పెసర, మినుము, శనగ వంటి పప్పుధాన్యాలు నేలలో సహజంగా నత్రజని నిల్వ చేయడంలో సహాయపడతాయి. దీంతో రసాయన ఎరువుల అవసరం తగ్గుతుంది. రైతు ఖర్చు తగ్గి, కుటుంబాల పోషకాహార భద్రత మెరుగుపడుతుంది. ఈ మార్పు రైతు ఒంటరిగా చేయలేడు. విధానాలు మారాలి. వరికి లభించే కొనుగోలు హామీలు, ప్రోత్సా హక ధరలు, బోనస్లు, ఇన్ పుట్ సబ్సిడీలు – వాటిలో కొంత భాగాన్ని పొడి భూమి పంటల వైపు మళ్లించాలి. రైతు మార్పు చేయ డానికి మార్కెట్ హామీ, నిల్వ సదుపాయం, ప్రాసెసింగ్ వ్యవస్థ, విలువ ఆధారిత విక్రయం, స్థానిక కొనుగోలు మద్దతు అన్నీ కలిసి రావాలి. పంటల వైవిధ్యం గురించి మాట్లాడటం సరిపోదు; దానికి తగిన ప్రోత్సాహక వ్యవస్థను ప్రభుత్వం నిర్మించాలి.నేల ఆరోగ్య పునర్నిర్మాణం అత్యవసరం. ఏళ్లుగా అధిక రసాయన ఎరువుల వాడకం, పంట అవశేషాల దహనం, సేంద్రియ పదార్థాల నిర్లక్ష్యం వల్ల నేలలో సేంద్రీయ కర్బనం తగ్గిపోయింది. సేంద్రీయ పదార్థం తగ్గిన నేల నీటిని నిల్వ ఉంచుకోలేకపోతుంది. కొద్దిరోజుల పొడి వాతావరణానికే పంట ఒత్తిడికి గురవుతుంది. ఎరువు వేసినా పూర్తిగా ఉపయోగ పడదు. నేల బలహీనమైతే వాతా వరణ షాక్కు వ్యవసాయం మరింత సులభంగా దెబ్బతింటుంది. అందుకే నేలలో సేంద్రీయ పదార్థాన్ని పెంచడం వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ఒక రక్షణ కవచంలా భావించాలి. మల్చింగ్ వల్ల వేసవిలో నేలనుండి నీటి ఆవిరి పోవడం తగ్గుతుంది. కవర్ క్రాప్స్ నేలను ఎండకు నేరుగా గురి కాకుండా కాపాడతాయి. సన్ హెంప్, ధైన్చా వంటి పచ్చి రొట్ట పంటలు నేలను సహజంగా సారవంతం చేస్తాయి. ఇవి పాత పద్ధతులు మాత్రమే కావు; భవి ష్యత్తు వ్యవసాయానికి అవసరమైన తెలివైన వ్యూహాలు. తక్కువ ఖర్చుతో, తక్కువ ప్రమాదంతో, ఆరోగ్యకరమైన నేలతో, స్థిరమైన నీటి వినియోగంతో, పోషకాహార భద్రతతో సాగు చేసే విధానాల వైపు మళ్లాల్సిన సమయం వచ్చింది. ఎల్నీనో, ఎరువుల సంక్షో భాలు వ్యవసాయాన్ని స్థిరమైన మార్గంలోకి నడిపించే అవకాశం కావచ్చు. మార్పు వస్తుందా లేదా అనేది ప్రశ్న కాదు. ఆ మార్పుకు మనం సిద్ధమవుతామా లేదా అనేదే అసలు ప్రశ్న.డా‘‘ జి.వి.రామాంజనేయులువ్యాసకర్త వ్యవసాయ శాస్త్రవేత్త,‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
ధాన్యం కొనుగోళ్లపై వాస్తవాలు..విమర్శలు గుప్పించిన ఉత్తమ్
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ విడుదల చేసిన రైతుల సంక్షేమంపై లేఖలో ధాన్యం కొనుగోళ్ల సమయంలో పది మంది రైతులు మృతి చెందారని చేసిన ఆరోపణలను ఆయన పూర్తిగా కొట్టిపారేశారు. ‘ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకు ఒక్క రైతు కూడా చనిపోలేదు’ అని స్పష్టం చేశారు.రికార్డు స్థాయి కొనుగోళ్లుఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి నమోదైంది. ఇది దేశ చరిత్రలోనే అత్యధిక దిగుబడి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ఆయన పేర్కొన్నారు. 2025-26 రబీ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం 8,575 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. ఇప్పటి వరకు 5429 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్రాలకు చేరగా, ప్రభుత్వం 46.21 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. రైతులకు ఇప్పటి వరకు 7,841 కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగాయి. మొత్తం 6.3 లక్షల మంది రైతులు ఈ ప్రక్రియలో లాభం పొందారు. ధాన్యం తరలింపుకు 13,000 వాహనాలు, నిల్వకు 18.3 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచారు.బీఆర్ఎస్ పాలనపై ఆరోపణలుఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, మిల్లర్లతో లాలూచీ, చెల్లింపుల ఆలస్యం జరిగిందని ఆరోపించారు. మెడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల పరిస్థితి వారి అవినీతి పాలనకు అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ప్రతి ప్రాజెక్టుపై శాస్త్రీయ పరిశోధనలు జరుపుతూ, నీటి వనరులను రైతుల భవిష్యత్ కోసం వినియోగించే విధానాన్ని అమలు చేస్తోందని ఆయన తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర, సాగునీటి సరఫరా పై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. -
మేము భూములు ఇవ్వం.. మా ఊరికి రావొద్దు చంద్రబాబుకు ఉండవల్లి రైతుల హెచ్చరిక
-
మద‘గజం’ సర్కారు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఉండవల్లిలో భూ సేకరణకు భూములు ఇవ్వని రైతులపై ప్రభుత్వం కక్షసాధిస్తోంది. మదగజంలా జనావాసాలపై పడుతోంది. ఉండవల్లి నుంచి అమరావతి వెళ్లే రహదారిలో రోడ్డుకు ఇరువైపులా జనావాసాల మధ్య ఉన్న వందలాది రైతుల భూములనూ భూ సేకరణ కింద తీసుకుంటామంటూ ప్రభుత్వం, సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇవ్వడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉండవల్లిలో 280 మంది రైతులకు నోటీసులు ఇచ్చారు. మరికొందరికి ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. భూసేకరణ ప్రకటన కూడా ఊరుపేరు లేని పత్రికలతోపాటు, ఇక్కడ దొరకని ఆంగ్ల దినపత్రికల్లో ఇచ్చారు. ఇంటికి నోటీసు వచ్చే వరకూ ఈ సమాచారం తెలియనీయకుండా సీఆర్డీఏ అధికారులు జాగ్రత్త పడ్డారు. రాజధానిని ప్రకటించినప్పటి నుంచి భూసమీకరణకు ఈ ప్రాంత ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. గత 12 ఏళ్లుగా భూములు ఇవ్వకపోవడంతో ఇప్పుడు కక్ష సాధింపుగానే తమకు భూసేకరణ నోటీసులు ఇచ్చారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గజాల్లోకి మార్చిన ఇళ్లస్థలాలు, ఇళ్లకూ భూసేకరణ నోటీసులు ఇచ్చారు. గజం రూ.70వేలు పలికే భూములు లాక్కునేందుకు బాబు సర్కారు పన్నాగం పన్నింది. బహిరంగంగా మాట్లాడితే ఇబ్బందులపాలే... అమరావతి రోడ్డులో ఉండవల్లి సెంటర్ నుంచి వెళ్లే దారిలో కుడివైపున ఉండవల్లి దేవాలయం భూముల వద్ద ఉండవల్లి లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద నుంచి ఐదు ఎకరాల్లో అనుమతులతో ఇళ్లు నిరి్మంచుకున్నారు. గుంటూరు చానల్ నుంచి సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఇళ్లు ఏర్పాటు చేసుకున్నారు. మధ్యలో మరొక 10 ఎకరాలు 30 మంది నుంచి 40 మంది రైతుల చేతిలో ఉంది. ఎడమచేతి వైపు పంటపొలాల్లో గతంలో బహుళ అంతస్తులు నిర్మించారు. వాటి పక్కన ఉన్న కొన్ని పొలాలను గజాల్లోకి మార్చుకున్నారు. వాటినీ భూసేకరణలో పెట్టడంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతోంది. బహిరంగంగా మాట్లాడితే ఇబ్బందుల పాలు చేస్తున్నారంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉండవల్లి గుహల ఎదురుగా 2014కు ముందు వెంచర్ వేశారు. ఆ వెంచర్లో సుమారు 50 మంది రెండు నుంచి మూడు సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. ఇప్పుడు అక్కడ కూడా భూములు తీసుకునేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అదే ప్రాంతంలో గతంలోనే ఇళ్లు కట్టుకున్న వారు తమను గ్రామ కంఠంలో కలపాలంటూ అర్జీలు పెట్టుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. ప్రస్తుతం ఆ భూములకూ నోటిఫికేషన్ ఇచ్చారు. పెనుమాక గ్రామంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వెనుక పంట పొలాల్లో నివాసాలు ఉన్నాయి. పక్కనే ఆ గ్రామానికి చెందిన రైతు పొలం ఉంది. అదే రైతుకు కొండవీటి రిజర్వాయర్ ఏర్పాటుచేసే దగ్గర మరో ఎకరం ఉంది. ‘ఆ ఎకరం పూలింగ్కు ఇస్తాను, ఈ భూమిని వదిలేయండి’ అని రైతు అధికారులను వేడుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. కొండవీటి వాగు వెడల్పు, మరికొన్ని రోడ్ల నిర్మాణం కోసం కొన్ని నివాసాలు తొలగించాల్సి వస్తోంది. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇప్పటికే సీడ్ యాక్సెస్ రోడ్డుకు భూములు ఇచి్చన వారికి ప్లాట్లు ఇవ్వలేదు, ఇళ్లు కూడా తొలగిస్తే ఎలాగంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విలువైన భూములు తమవారికి కట్టబెట్టేందుకే బాబు సర్కారు ఈ దురాగతానికి పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. భూమి ఇవ్వాలని బెదిరిస్తున్నారుఇప్పటికే ఆరు ఎకరాల భూమిని అభివృద్ధి కోసం తీసుకున్నారు. మళ్లీ భూమి ఇవ్వాలని బెదిరిస్తున్నారు. మా భూములు రిజిస్ట్రేషన్ చేయడం లేదు. ల్యాండ్ పూలింగ్కు ఇస్తామని ఎన్ఓసీ తెచ్చుకోవాలట. ఇదెక్కడి అన్యాయం. – ఎం.ఉమామహేశ్వరరెడ్డి, రైతు, ఉండవల్లిప్రభుత్వం విధానాన్ని మార్చుకోవాలి ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోవాలి. క్షేత్రస్థాయిలో వాస్తవికతను అర్థం చేసుకోవాలి. నాకు కేవలం 1.60 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు మొత్తం ఇచ్చేయమంటున్నారు. ఇప్పటికే అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాను. మళ్లీ ఇదొక సమస్యగా మారింది. – పి.వెంకటరెడ్డి, రైతు, ఉండవల్లి పోరాటానికి సిద్ధం చంద్రబాబు ప్రభుత్వం బెదిరిస్తే అదిరేదిలేదు. న్యాయబద్ధంగా ఎంతటి పోరాటానికైనా సిద్ధమే. మా నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేశ్ ఏమీ పట్టించుకోవడం లేదు. అభివృద్ధి పేరుతో టీడీపీ సర్కారు మమ్మల్ని దారుణంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తోంది. న్యాయ పోరాటం చేస్తాం. – దశరథరామిరెడ్డి, రైతు, ఉండవల్లి -
పంట పీకి పందిరి!
శ్రీగిరి విజయ్కుమార్రెడ్డి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో గడిచిన పుష్కరకాలంగా పంటల సాగులో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. కూరగాయలు సహా సంప్రదాయ పంటలు తగ్గిపోతుంటే వాటి స్థానాన్ని వరి, పత్తి ఆక్రమించాయి. గతంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బీరకాయ, బెండకాయ, వంకాయ, గోరుచిక్కుడు తదితర కాయగూరలను రైతులు విరివిగా సాగు చేసేవారు. వీటితో పాటు సంప్రదాయ పంటలైన సజ్జ, జొన్న, ఉలువలతో పాటు నూనెగింజల సాగు కూడా ఎక్కువగానే ఉండేది. అయితే రానురానూ ఆయా పంటల విస్తీర్ణం గణనీయంగా పడిపోతూ, వరి, పత్తి సాగు బాగా పెరుగుతోంది. ఒకింత విస్మయం కలిగించినా..ఇందుకు ప్రధాన కారణం.. కోతులు కావడం గమనార్హం. వానరాల బెడదతో రైతులు ఆయా పంటలు సాగు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. ఆహార కొరత కారణంగా అడవుల్లో ఉండాల్సిన కోతులు ఊళ్లలో తిష్ట వేస్తున్నాయి. పొలాలపై దాడులు చేస్తూ ఆహార పంటలను నాశనం చేస్తున్నాయి. అక్కడక్కడా రైతులపై దాడులు చేస్తున్న ఘటనలూ నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో కూరగాయలు, సజ్జ, జొన్న, మొక్కజొన్న వంటివి సాగు చేయాలంటేనే భయపడుతున్నారు. వేసిన పంటలు చేతికి రాక నష్టపోతున్న రైతులు కూరగాయల సాగు నుంచి క్రమంగా తప్పుకుంటున్నారు. ఇప్పుడు వరి ధాన్యాన్ని కూడా వానర గుంపులు ఆగమాగం చేస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి మెదక్, నల్లగొండ, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో వానరాల సమస్య ఎక్కువగా ఉంది. పంటంతా ఆగమాగం కోతుల గుంపులు కాయగూరలు, పండ్ల తోటలపై దాడులు చేస్తూ తిన్నంత తిని, మిగిలిన పంటను నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు ఎక్కువగా వరి, పత్తి పంట వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా 2014–15లో రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం 2.53 లక్షల ఎకరాలు ఉండగా, 2023–24 నాటికి అది సగానికి పైగా తగ్గి 1.12 లక్షల ఎకరాలకు పడిపోయింది. గత దశాబ్దంలో కూరగాయల సాగు వృద్ధిరేటు మైనస్ 8.4 శాతంగా నమోదు కావడం గమనార్హం. ఎన్ఐఎన్¯Œ, ఐసీఎంఆర్ సిఫారసుల మేరకు రాష్ట్రానికి సంవత్సరానికి 81.49 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరమవుతాయని అంచనా వేయగా, ప్రస్తుతం ఉత్పత్తి కేవలం 11.17 లక్షల మెట్రిక్ టన్నులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అంటే రాష్ట్ర అవసరాల్లో సుమారు 16 శాతం మాత్రమే సొంతంగా సమకూరుతున్నాయన్న మాట. ముఖ్యంగా టమాటా, ఉల్లిపాయ, బెండ, పచ్చిమిర్చి, వంకాయ సాగు గణనీయంగా తగ్గిపోయింది. దీంతో అన్ని రకాల కూరగాయలతో పాటు ఆలుగడ్డ, క్యారెట్, క్యాబేజీ, కాలీఫ్లవర్, కొత్తిమీర వంటి పంటలను మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఒక జత.. పదేళ్లలో వంద! అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం, సరిపడా ఆహారం దొరకకపోవడం వల్ల కోతుల గుంపులు మైదాన ప్రాంతాల్లోకి వచ్చి, ఆపై ఊళ్లలో తిష్ట వేస్తున్నాయి. 25 ఏళ్ల వరకు జీవించే కోతులకు కాయగూరలు, పండ్లు, ఊళ్లలో ఆహార వ్యర్థాల రూపంలో మెరుగైన ఆహారం దొరుకుతుండటంతో పునరుత్పత్తి పెరగడంతో పాటు మరణాల రేటు తగ్గిపోయింది. సహజంగా ఒక వానరం మూడేళ్ల వయసు నుండి పునరుత్పత్తి ప్రారంభిస్తే.. ఒక జంట పిల్లలు, తిరిగి వాటి పిల్లలు, వాటి పిల్లలు ఇలా కలుపుతూ పోతే పదేళ్లలో 70 నుండి 100 కోతుల వరకు పెరిగే అవకాశం ఉందని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో అత్యధికంగా బానెట్ మకాక్ (జటి) రకం కోతులు పంటపొలాలు, ఊళ్లపై దాడి చేస్తున్నాయి. ఈ రకం కోతులు కొత్త పరిసరాలకు సులభంగా అలవాటు పడుతున్నాయి. నిర్మల్ ప్రయోగం ఫెయిల్..! పంటలతో పాటు జనావాసాలకు నష్టం చేస్తున్న కోతుల నియంత్రణ కోసం హిమాచల్ప్రదేశ్లో చేసిన ప్రయోగాన్ని తెలంగాణలో అమలు చేసినా సరైన ఫలితం కనిపించలేదని నిపుణులు చెబుతున్నారు. హిమాచల్ తరహాలో నిర్మల్–గండిరామన్న హరితవనంలో 2020లో ‘మంకీ రిహాబిలిటేషన్ సెంటర్’ను ప్రారంభించి, రోజూ 10–15 కోతులకు వ్యాసెక్టమీ, ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేస్తున్నారు. కానీ కోతులను పట్టుకోవడం, నిర్మల్కు తరలించడం పంచాయతీలకు ఆర్థిక భారంగా మారడంతో కుటుంబ నియంత్రణ కార్యక్రమం పెద్దగా సక్సెస్ కాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాగు పెరగాలంటే ఏం చేయాలి.. ⇒ కోతుల నివారణకు ప్రతి జిల్లా కేంద్రంలో నిర్మల్ తరహా కుటుంబ నియంత్రణ కేంద్రం ప్రారంభించాలి. కోతులను పట్టేందుకు పంచాయతీలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలి. కూరగాయలు, పండ్ల తోటలు, ఇతర ఉద్యాన పంటలకు పూర్తి సబ్సిడీతో సోలార్ ఫెన్సింగ్ పంపిణీ చేయాలి. ⇒ క్లస్టర్ వారీగా ఏ ప్రాంతానికి ఏ కూరగాయలు అనుకూలమో గుర్తించి, వాటినే సాగు చేసేలా రైతులకు మార్గనిర్దేశం చేయాలి. పెట్టుబడి వ్యయం, కూలీల కొరత నివారణకు అవసరమైన యంత్ర సామగ్రిని అందుబాటులోకి తీసుకువచ్చి రైతులకు సబ్సిడీపై అందించాలి. ⇒ పంజాబ్ తరహాలో వరికి బదులు ఇతర పంటలు సాగు చేసే రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి. హిమాచల్ తరహాలో 75 శాతం సబ్సిడీపై సోలార్ ఫెన్సింగ్, కర్ణాటక, మహారాష్ట్ర తరహాలో మార్కెట్ యార్డుల్లో కూరగాయలకు ప్రత్యేక స్థల కేటాయింపులు చేయాలి. సమగ్ర కార్యాచరణ అవసరం రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గిపోవడం ఆందోళనకరం. రాష్ట్రాన్ని కూరగాయల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు సమగ్ర కార్యాచరణ అవసరం. ముఖ్యంగా కోతుల నియంత్రణ కోసం పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు మేము ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. – డాక్టర్ రాజిరెడ్డి, వీసీ, హార్టికల్చర్ యూనివర్సిటీ కూరగాయల కనగర్తి.. ఇప్పుడొక చరిత్రే.. రాజన్న సిరిసిల్ల జిల్లా కనగర్తి ఒకప్పుడు కూరగాయలకు ఎంతో ప్రసిద్ధి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ‘కూరగాయల కనగర్తి’గా పేరొందింది. ఇరవైకి పైగా తీగజాతి కూరగాయలు, ఊరందరికీ పనులు, రైతులకు జేబునిండా డబ్బులు, కడుపునిండా పౌష్టికాహారం.. ఇలా కళకళలాడిన గ్రామంలో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు 50 మంది రైతులు కూరగాయలు సాగు చేస్తే ఇప్పుడు కేవలం 10 మందే సాగు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా అంతటికీ అన్ని రకాల కూరగాయలు అమ్మిన స్థితి నుండి ఇప్పుడు ఇదే ఊరిలో సిరిసిల్ల నుంచి వచ్చే కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. దీనంతటికీ కారణం.. కనగర్తి పంట పొలాలతో పాటు ఊరంతా వానరాలతో నిండిపోవడమే. కనగర్తి అంతా కోతుల గుంపులే కోతులతో ఊరంతా నిండిపోయింది. పంటలు, ఇళ్లు నాశనం అవుతున్నాయి. మా ఒక్క కనగర్తే కాదు.. అన్ని ఊళ్లలో ఇదే పరిస్థితి. అందుకే కోతుల నియంత్రణకు తక్షణ కార్యాచరణ ప్రారంభించాలి. మళ్లీ కూరగాయల సాగు పెరగాలంటే సోలార్ ఫెన్సింగ్తో పాటు ఇతర సదుపాయాలు కల్పించాలి. – స్వామిదాస్, కనగర్తి సర్పంచ్ -
రైతు వ్యతిరేక ప్రభుత్వం రాజ్యమేలుతోంది
నూజివీడు: రైతు బాధలను పట్టించుకోని రైతు వ్యతిరేక ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యమేలుతోందని.. మామిడి, మొక్కజొన్న రైతులను గాలికి వదిలేశారని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మండిపడ్డారు. ఏలూరు జిల్లా నూజివీడులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో మామిడి, మొక్కజొన్న రైతుల సమస్యలపై ఆదివారం సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పేర్ని నాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయని దుర్మార్గ ప్రభుత్వం ఉండటం రైతుల దౌర్భాగ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాల్కు రూ.2,400ల మద్దతు ధర ప్రకటిస్తే దళారులు కేవలం రూ.1,700లకే కొనుగోలు చేస్తున్నారని.. ఫలితంగా రైతులు రూ.700 నష్టపోతున్నారని చెప్పారు. రైతుల బాధలు, వారు సాగుచేసే పంటల గురించి తెలియని మంత్రి ఈ రాష్ట్రానికి వ్యవసాయ మంత్రిగా ఉన్నాడని.. పైగా, పంటలే సాగుచేయని సింగపూర్ దేశానికి వెళ్లి శిక్షణపొంది వచ్చారని ఎద్దేవా చేశారు. పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే.. మామిడికి రాజకీయ ‘మంగు’.. ప్రసిద్ధి చెందిన నూజివీడు మామిడికి గడ్డుకాలం రావడం ప్రభుత్వ వైఫల్యమే. ఇక్కడి మామిడికి రాజకీయ మంగు పట్టింది. ఇంకా మూడేళ్లు దీనిని భరించక తప్పదు. గతేడాది చిత్తూరులో మామిడి రైతులకు కిలోకు రూ.4లు ఇచ్చినప్పుడు నూజివీడు రైతులకు ఎందుకివ్వలేదు? మామిడి, మొక్కజొన్న రైతులకు జరుగుతున్న అన్యాయంపై టీడీపీ నాయకులు మంత్రిని ఎందుకు నిలదీయడంలేదు? ఇక్కడి మంత్రి ఒళ్లంతా ఆముదం పూసుకుంటున్నాడు. వైఎస్ జగన్ను తిట్టడానికి ఉన్న ఆసక్తి నియోజకవర్గ రైతులకు మేలు చేద్దామనిలేదు.మన దేశం నుంచి యూరప్ దేశాలకు వెళ్లే పల్ప్పై ఆ దేశాలు షుగర్ సెస్ వేస్తుండగా.. దానిని తొలగించేలా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చిత్తూరు జిల్లాలోని ఫ్యాక్టరీల యజమానులు కేంద్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదు. దీనివల్ల మామిడిని కొనుగోలు చేయడానికి ఫ్యాక్టరీలు ముందుకు రావడంలేదు. రైతులను పట్టించుకోని వ్యవసాయ మంత్రి ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేయడం ఎందుకు? అలాగే, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు? ఈ నియోజకవర్గానికి చెందిన మంత్రికి ఏమాత్రం సత్తా ఉన్నా రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకోవాలి. రాబోయేది జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే. రైతులకు మంచి రోజులు వస్తాయి. మామిడి చెట్లను ఎవరూ నరకొద్దు.దోచుకోవడం, దాచుకోవడమే సర్కారు పని: జోగి రమేష్మాజీమంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడమే అజెండాగా ప్రభుత్వం పనిచేస్తోందని, రైతుల బాధలు పట్టించుకునే స్థితిలో ప్రభుత్వంలేదని మండిపడ్డారు. మామిడి, మొక్కజొన్న, ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందన్నారు. రైతులను, మహిళలను, విద్యార్థులను ఆదుకోలేని అసమర్థ ప్రభుత్వం ఉండటం ప్రజల దురదృష్టకరమని విమర్శించారు.మేకా ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ.. నూజివీడు మామిడి కనుమరుగయ్యేలా ఉందని, ప్రభుత్వాలు పట్టించుకుని మామిడి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి మొక్కజొన్న రైతులకూ చేయూతనివ్వాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్కుమార్, చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజు, జెడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ను కలిసిన మామిళ్లపల్లి రైతులు
సాక్షి,తాడేపల్లి: రైతులపై దాడి చేసి, తిరిగి వారిపైనే అట్రాసిటీ కేసులు పెట్టడం దుర్మార్గపు చర్య అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు.పొన్నూరు మండలం మామిళ్లపల్లి రైతులు పండించిన మొక్కజొన్న పంటను వారి షెడ్డులో దాచుకుంటే, దానిపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనుచరులు దాడి చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన రైతులపై కూడా దాడులు జరిపారు. ఈ దాడిలో మామిళ్లపల్లి రైతులు గాయపడ్డారు. తర్వాత తిరిగి వారిపైనే అట్రాసిటీ కేసులు పెట్టారు. టీడీపీ గూండాల దాడి ఘటనను బాధిత రైతులు వైఎస్ జగన్కు వివరించారు. ‘దాడి చేసి తిరిగి మా పైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు’అని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదుగురు మహిళా రైతులపై కూడా అట్రాసిటీ కేసులు పెట్టారని వాపోయారు. ఈ సందర్భంగా బాధిత రైతులకు వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. ‘రైతుల గోడౌన్పై దాడి దుర్మార్గపు చర్య. తిరిగి బాధిత రైతులపైనే అట్రాసిటీ కేసులు పెడతారా?. బాధిత రైతులకు అండగా ఉంటా. లీగల్ సెల్ ద్వారా అవసరమైన న్యాయపోరాటం చేద్దాం’ అని హామీ ఇచ్చారు. -
ఫుల్ ఫ్రస్టేషన్ లో అడ్డంగా దొరికిపోయిన దూళిపాళ్ల నరేంద్ర
-
ఆరు నూరైనా భూములిచ్చేదే లేదు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: చంద్రబాబు కూటమి ప్రభుత్వం రాజధాని పేరుతో సాగిస్తున్న భూ దందాకు సహకరించే ప్రసక్తి లేదని అమరావతి ప్రాంత రైతులు తేల్చి చెబుతున్నారు. రాజధాని కోసం అవసరమైనంత భూమిని తొలి దశలోనే సమీకరణ కింద తీసుకున్నప్పటికీ, మళ్లీ రెండో దశలో బలవంతపు సమీకరణకు పూనుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సమీకరణకు ఒప్పుకోకపోతే భూసేకరణ చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తుండటంపై మండిపడుతున్నారు. అసలు మొదటి దశలో ఇచ్చిన భూమి ఎందుకు సరిపోదని నిలదీస్తున్నారు. విజయవాడ నగరానికి ఆనుకుని ఉండే ఉండవల్లి, పెనుమాక తదితర గ్రామాల్లో భూముల ధరలు మొదటి నుంచి ఎక్కువే. 2014కు ముందే అక్కడ ఎకరం రూ.2–3 కోట్లు పలికేది. అదే సమయంలో ఇదే రాజధాని ప్రాంతంలోని మరికొన్ని గ్రామాల్లో ఎకరం ధర రూ.లక్షల్లోనే ఉండేది. ప్రభుత్వ భూములు తీసుకోవడానికి అన్ని చోట్లా ఒకే ప్యాకేజి ప్రకటించడం అత్యధిక శాతం రైతులకు నచ్చలేదు. అయితే కొండవీటి వాగు వరద నివారణ, సీడ్ యాక్సిస్ రోడ్డు వంటి వాటికి రైతులు ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. రాజధాని వస్తుందని నమ్మి సమీకరణకు భూములు ఇచ్చేశారు. ఆ సమయంలో అవసరమైన మేరకే భూములు తీసుకుంటామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చి బఫర్జోన్ ఏర్పాటు పేరుతో మిగిలిన భూములు కూడా తీసుకోవడానికి రైతులకు నోటీసులు ఇస్తోంది. పూలింగ్కు ఇవ్వని భూముల్లో కూడా లేఅవుట్లు వేశారు. ఇప్పుడు వాటిని భూసేకరణ కింద పెట్టారు. గ్రామస్తులకు కనీస సమాచారం ఇవ్వకుండానే, వారిని సంప్రదించకుండానే నోటీసులు ఇస్తున్నారు. రైతుల గోడు వినడానికి సీఆర్డీఏ కమిషనర్, మంత్రి నారాయణ ఏమాత్రం ఇష్టపడటం లేదు. రైతులు కూటమి పార్టీల నేతలతో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ అపాయింట్మెంట్ కోసం విఫలయత్నం చేశారు. ఈ ప్రాంతంలో ఏ ప్రాజెక్టులు వస్తున్నాయి.. ఎంత భూమి అవసరం.. ఏ రైతుకు ఎంత భూమి పోతుందన్న వివరాలు ఇవ్వకుండానే బలవంతంగా భూములు లాక్కొవడానికి ప్రభుత్వం ప్రయతి్నస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. భూసేకరణకు సంబంధించి ఆంగ్ల దినపత్రికలకు, సర్క్యులేషన్ లేని పత్రికలకు ప్రకటనలు ఇవ్వడంతో అధికారులు నోటీసులు ఇచ్చేవరకు ఎవరికీ సమాచారం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ నెల 20న భూసేకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనకు రైతులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు అవసరానికి మించి ప్రభుత్వానికి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తమ వైఖరిని స్పష్టం చేస్తున్నారు. మాకు ఎప్పుడు లబ్ధి కలుగుతుంది? నాకు ఎకరం 40 సెంట్లు ఉంది. ఆ మొత్తం భూమి సేకరణ కోసం నోటీసులు ఇచ్చారు. నాకు రెండేళ్ల కిందట బైపాస్ ఆపరేషన్ జరిగింది. రోజు విడిచి రోజు డయాలసిస్ చేయించుకోవాలి. గతంలో పూలింగ్ సమయంలో విద్య, వైద్యం బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ఇప్పుడు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ తీరు వల్ల మాకు ఎప్పటికి లబ్ధి కలుగుతుంది? మేం భూములు ఇస్తే ఎక్కడికి వెళ్లి వైద్యం చేయించుకోవాలి? మేం రాజధానికి వ్యతిరేకం కాదు. మా బ్రతుకులు పణంగా పెట్టి భూములు ఇవ్వలేమని చెబుతున్నాం. – పద్మారెడ్డి, రైతు, ఉండవల్లిఇది చాలా అన్యాయం ప్రభుత్వం చెబుతున్న రాజధానిలో ప్రస్తుతం ఒక్కో ప్రాంతంలో ఒక్కో ధర ఉంది. విజయవాడకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ ధర ఉంది. పైగా కమర్షియల్ ఏరియా కావడం వల్ల వ్యాపారాలు బాగుంటాయి. అందువల్ల ప్రభుత్వం ఇచ్చే ప్లాట్ల వల్ల రైతులకు నష్టం వస్తుంది. విజయవాడకు పక్కనే ఉన్న మాకూ ఒకే పద్ధతి, ఎక్కడో దూరంగా ఉన్న వారికి కూడా అదే పద్ధతా? ఈ విషయమై గతంలో మేము కోర్టులో వేసినప్పుడు స్టే వచ్చింది. తర్వాత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబునాయుడు వచ్చిన తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్డుకు భూమి ఇవ్వండని మొదలుపెట్టి ఇప్పుడు అన్ని భూములు కావాలంటున్నారు. మాతో మాట్లాడకుండానే మాకు నోటీసులు ఇస్తుండటంపై అందరం సమావేశమయ్యాం. రైతు కుటుంబం నుంచి వచ్చానని చెప్పే చంద్రబాబునాయుడు ఏటా మూడు పంటలు పండే పొలాలను అవసరానికి మించి తీసుకోవడం అన్యాయం. – ఈశ్వరరెడ్డి, రాజధాని రైతు సంఘం అధ్యక్షుడుప్రాణం పోయినా భూమి ఇవ్వం మాది ఉండవల్లి. 248 సర్వే నెంబర్లో మా కుటుంబానికి ఐదు ఎకరాల భూమి ఉంది. ఇది చంద్రబాబు నాయుడు నివాసానికి తూర్పు పక్కన ఎదురుగా ఉన్న భూమి. దీన్ని 1960లో మా తాత కొనుక్కున్నాడు. అప్పటి నుంచి మేము సాగు చేస్తున్నాం. ఇప్పుడు ఈ భూమి తీసుకుంటామంటున్నారు. బదులుగా మాకు వర్షం పడితే నాలుగు అడుగులు నీళ్లు నిలిచే మాలపల్లి చర్చి వద్ద ప్లాటు ఇస్తామంటున్నారు. బంగారం లాంటి మా భూమిని తీసుకుని ఎక్కడో గుంటలో ఇస్తామంటే ఎలా? రేపు నేను భూమి ఇచ్చినా నాకు ప్లాట్ ఎప్పుడు ఇస్తారో తెలీదు. ఇప్పటిదాకా ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లలో ఏ ఒక్క రైతు అయినా ఇల్లు కట్టుకున్నాడా? కమర్షియల్ ప్లాట్స్ అంటున్నారు. అక్కడ జనం ఉంటే కదా మా వ్యాపారాలు సాగడానికి? మా బతుకుల్ని కొట్టబాకండి. రాజధాని రాకముందే ఈ ప్రాంతం అంతా రెసిడెన్షియల్ జోన్లో ఉంది. మేం రాజధానికి వ్యతిరేకం కాదు. అయితే ప్రాణాలు పోయినా మా భూములు ఇవ్వం. – రఘునాథ్, రైతు, ఉండవల్లిఇలాగైతే నా అప్పు తీరేదెలా? ఉండవల్లిలో నాకు ఎకరం భూమి ఉంది. ఆ భూమిలో నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డు వేస్తున్నారు. ఆ రోడ్డు కోసం నా భూమిని తీసుకుని ప్లాట్ ఇస్తామంటున్నారు. ఎక్కడ ఇస్తారో మాత్రం చెప్పడం లేదు. ఇప్పటి వరకు రైతులకు ఇచ్చిన ప్లాట్లు ఏవీ డెవలప్ కాలేదు. గతంలో గజం రూ.70 వేల నుంచి 80 వేలకు వెళ్లింది. ఇప్పుడు మళ్లీ రూ.20 వేలకు పడిపోయింది. ఇప్పుడు అది కూడా కొనేవారు లేరు. రోడ్డుకు ఎంత కావాలో అంత ఇస్తామని.. మిగిలిన భూమి అమ్ముకోవడానికి అనుమతి అడిగితే స్పందించడం లేదు. మా అమ్మాయికి ఎనిమిదేళ్ల క్రితం అప్పు చేసి పెళ్లి చేశా. ఆ అప్పు ఇంత వరకూ తీరలేదు. ఇప్పుడు పొలం అమ్ముకోవడానికి కూడా లేకుండా పోయింది. – బుర్రా శ్రీనివాసరావు, రైతు, ఉండవల్లికోర్టును ఆశ్రయిస్తాం మావి విలువగల భూములు. చిన్న సన్నకారు రైతులం అని చెప్పాం. రాజధానికి సహకరించాలన్న ఉద్దేశంతో రోడ్లకు, వాగుకు సహకారం అందించాం. ఇంతటితో ఆగాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మిగతా భూమిని వదిలేస్తే మేమే అభివృద్ధి చేసుకుంటాం. ఇంకో పది సంవత్సరాల తర్వాత అయినా మా భూములను ల్యాండ్ పూలింగ్కు ఇవ్వలేం. ఎందుకంటే మీరు ఇచ్చే గజాలు మాకు చాలవు. మాకు ఇక్కడ ఏ ప్రాజెక్టులూ లేవు. మా గోడు వినిపించుకోకుండా భూసేకరణకు పూనుకుంటే కోర్టును ఆశ్రయిస్తాం. – నరేష్రెడ్డి, రైతు,ఉండవల్లి -
కాంటా వేయరు 'లోడ్ ఎత్తరు'!
సూర్యాపేట జిల్లా అర్వపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభమై నెలరోజులు దాటింది. ఇప్పటివరకు ఈ కేంద్రం ద్వారా 14 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మరో 600 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి బస్తాల్లో నింపి కుట్టిపెట్టారు. కానీ ఐదు రోజులుగా లారీలు రాకపోవడంతో ఆ ధాన్యం అక్కడే అలాగే ఉంది. ఈ కేంద్రంలో 15 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉంది. కానీ లారీలు రాక కొనుగోలు చేసిన ధాన్యం ఎగుమతి కాకపోవడంతో రెండు రోజులుగా కొనుగోళ్లు కూడా నిలిచిపోయాయి.సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల ఆశలు అడియాసలవుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను సకాలంలో అమ్ముకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు తెరిచామని, భారీగా ధాన్యం సేకరిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని రైతులు వాపోతున్నారు. ధాన్యం కొనుగోళ్లు మొదలై నెల దాటినా కొనుగోళ్లు ఊపందుకోవడం లేదని, కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ధాన్యం తీసుకోవడం లేదని చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లిన ధాన్యాన్ని కాంటా వేయడం, కాంటా వేసిన ధాన్యాన్ని లారీలకు ఎత్తడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణా సౌకర్యం సరిగా లేదని, హమాలీల కొరత తీవ్రంగా ఉందని తెలుస్తోంది. రైతుల ఆందోళనకు తగినట్టుగానే రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డులు, పీఏసీఎస్లు ధాన్యం రాశులతో నిండిపోయి కన్పిస్తున్నాయి. అకాల వర్షాలు కురుస్తుండటంతో, తమ పంట ఎక్కడ తడిసి ముద్దవుతుందోనని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మంచిర్యాల, పెద్దపల్లి, మహబూబాబాద్ వంటి చాలా జిల్లాల్లో రాశులు పోసిన ధాన్యం తడిచిపోయిన ఘటనలు వెలుగు చూశాయి. ధాన్యం తడవకుండా తగిన సంఖ్యలో టార్పాలిన్లు సరఫరా చేయడంలో పౌరసరఫరాల సంస్థ విఫలమవుతోందనే విమర్శలు విన్పిస్తున్నాయి. మక్కలు, జొన్నల కొనుగోళ్ల పరిస్థితీ ఇదేనని రైతులు వాపోతున్నారు. లక్ష్యంలో మూడో వంతే..! ఈ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 8,500 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, కొన్ని జిల్లాల్లోని మండలాల్లో పేరుకు కొనుగోలు కేంద్రాలే తప్ప, అక్కడ కొనుగోళ్లు సాగడం లేదు. ఇప్పటివరకు కేవలం 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. అంటే లక్ష్యంలో మూడో వంతు మాత్రమే పూర్తయ్యిందన్నమాట. జూన్ నెల సమీపిస్తుండటంతో ఖరీఫ్ పనులు మొదలయ్యే సమయం ఆసన్నమైనా, ఇంకా రబీ పంట కొనుగోళ్లే పూర్తి కాకపోవడం గమనార్హం. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పోసి 15 రోజులకు పైగా రైతులు నిరీక్షిస్తున్న పరిస్థితి చాలా జిల్లాల్లో ఉంది. మంగళవారంముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆదేశాలు జారీ చేసినా.. క్షేత్రస్థాయిలో యంత్రాంగం ఇంకా కదిలిన దాఖలాలు కన్పించడం లేదు. అన్నీ సమస్యలే.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా వేయడమే ఒక ప్రహసనమైతే, వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడం మరో పెద్ద యుద్ధంలా మారింది. లారీలు రాక రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఒకవేళ మిల్లుకు ధాన్యం చేరినా, అక్కడ మిల్లర్లు పెట్టే ఆంక్షలతో రైతులు బిక్క ముఖం వేస్తున్నారు. తరుగు, తాలు, తేమ శాతం పేరుతో యధావిధిగానే కోతలు విధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్దపల్లి, నల్లగొండ, సిద్దిపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేయగానే రైతుతో లావాదేవీలు ముగియాల్సి ఉండగా, మిల్లులకు వెళ్లిన తరువాత తాలు, నల్లబడ్డ ధాన్యం పేరుతో తరుగు పేరిట నాలుగైదు కిలోల ధాన్యాన్ని తరుగుగా తీసే విధానం ఇంకా కొనసాగుతోందని పెద్దపల్లి జిల్లా జూలపల్లికి చెందిన మల్లయ్య అనే రైతు తెలిపారు. ధాన్యం ఎత్తుకోవడానికి, దించుకోవడానికి సవాలక్ష సాకులు చెబుతూ లారీలను రోజుల తరబడి నిలిపివేస్తున్నారని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మక్కల సేకరణలో మార్క్ఫెడ్ విఫలం! వరి రైతుల పరిస్థితి ఇలా ఉంటే, మొక్కజొన్న (మక్కలు) పండించిన రైతుల గోస వర్ణనాతీతం. రాష్ట్రంలో రబీలో పెరిగిన మక్కజొన్న సాగు నేపథ్యంలో ఈసారి సుమారు 15 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించి, ఆ బాధ్యతను మార్క్ఫెడ్కు అప్పగించింది. అయితే మక్కల కొనుగోళ్లలో మార్క్ఫెడ్ అపసోపాలు పడుతోంది. ఒక్కసారిగా భారీ ఎత్తున మార్కెట్కు వచ్చిన మక్కలను కొనుగోలు చేయలేక అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొన్నటివరకు మార్క్ఫెడ్ ఎండీగా ఉన్న శ్రీనివాస్రెడ్డిని ఇటీవలే తప్పించిన ప్రభుత్వం ఐఏఎస్ అధికారి వికాస్రాజ్ను నియమించింది. అయితే కొన్ని జిల్లాల్లో పాతుకుపోయిన మార్క్ఫెడ్ మేనేజర్లు కొనుగోళ్లు చేయలేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆఫీసుల్లో కూర్చొని అవినీతి కార్యకలాపాలు సాగించేందుకు అలవాటు పడిన అధికారులు మక్కల కొనుగోళ్లు చేయలేకపోతున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. మక్కలు కొనడానికి కనీసం గోనె సంచులు సమకూర్చుకోలేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా చెబుతున్నారు. మార్క్ఫెడ్ అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 2.97 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం కాగా, అతికష్టంమ్మీద 1.83 కోట్లు మాత్రమే సమకూర్చుకోగలిగారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం 8.56 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారు. చాలా చోట్ల సంచులు లేక కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. నాగర్కర్నూలు, ఖమ్మం, మహబూబాబాద్, సంగారెడ్డి, కొత్తగూడెం ప్రాంతాల్లో కొనుగోళ్ల కోసం రైతులు మార్కెట్ యార్డులు, పీఏసీఎస్లలో ఆందోళనలు చేసే పరిస్థితి నెలకొంది. తగిన సంఖ్యలో గోదాములు లేకపోవడం కూడా సమస్యగా మారింది. ప్రైవేటుకు అమ్ముకుంటున్నాను.. 70 క్వింటాళ్ల మక్కలు రూ.1,750 చొప్పున ప్రైవేటుగా అమ్ముకున్నా. ఇంకా 50 కింటాళ్లు ఉన్నాయి. వాటిని కూడా ప్రైవేట్గానే అమ్ముతా. ప్రభుత్వానికి అమ్మాలంటే చాలారోజుల సమయం పడుతుంది. ఇంటిదగ్గర గొర్లు, పశువులు ఉన్నాయి. వాటి వెంబడి వెళ్లేవారు ఎవరూ లేరు. అందుకే ప్రైవేటుకు అమ్ముకుంటున్నా. – మల్లేష్, దేశీటికాల, నాగర్ కర్నూల్. మొక్కజొన్న ఎప్పుడు కొంటారో చెప్పడం లేదు.. నేను నాగర్కర్నూల్ మార్కెట్యార్డ్కు మొక్కజొన్న పంటను తీసుకొచ్చి నెల రోజులు దాటింది. సుమారు 200 క్వింటాళ్ల పంటను అమ్ముకునేందుకు రోజూ మార్కెట్ యార్డుకు వస్తున్నాను. కానీ ఫలితం లేదు. కనీసం ఎప్పుడు కొనుగోలు చేస్తారో కూడా అధికారులు చెప్పడం లేదు. – సిక్కొండ రాములు, మంతటి, నాగర్ కర్నూల్ మండలం -
నిన్ను నమ్మం బాబూ!
-
కలెక్టర్లపైనా చర్యలకు వెనుకాడం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను మిషన్ మోడ్లో పనిచేసి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కొనుగోళ్ల తీరును పరిశీలించాలని సూచించారు. సమస్య తీవ్రతను గుర్తించి జిల్లా కలెక్టర్లు సరైన చర్యలు తీసుకోవాలని, ప్రతి అధికారి జవాబుదారీతనంతో వ్యవహరించాలని చెప్పారు. కలెక్టర్లు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని, ఏ సమస్య వచ్చినా కలెక్టర్లు బాధ్యత తీసుకుని పరిష్కరించాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే కలెక్టర్లపై చర్యలకూ ప్రభుత్వం వెనకాడదని హెచ్చరించారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ, పురోగతిపై జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో తలెత్తిన ఇబ్బందులు, సమస్యలపై రేవంత్ ఆరా తీశారు. ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలి ‘గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూసుకోవాలి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలి. రవాణా శాఖ కమిషనర్ ధాన్యం తరలింపునకు అవసరమైన వాహనాలు అందుబాటులో ఉండేలా చూడాలి. ఒప్పందం మేరకు సరిపడా లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులకూ వెనకాడొద్దు. అవసరమైతే స్థానికంగా ట్రాక్టర్లు, ఇతర వాహనాలను వినియోగించాలి. మొక్కజొన్న పంట ఎక్కువగా వచ్చే జిల్లాల కలెక్టర్లు కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడా రైతులకు ఇబ్బందులు కలగకూడదు. ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు సీఎస్కు నివేదికలు పంపాలి. రైతుబజార్లు, ఫంక్షన్ హాళ్లను వాడుకోండి సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు మిల్లుల్లో స్థలం సరిపోవడం లేదని అంటున్నారు. చాలా ప్రాంతాల్లో గోదాముల సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటి ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలి. రైతుబజార్లు, ఫంక్షన్ హాళ్లను తీసుకుని ధాన్యాన్ని అక్కడికి తరలించాలి. తర్వాత పరిస్థితిని బట్టి గోడౌన్లకు తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి..’అని సీఎం ఆదేశించారు. అకాల వర్షాల నష్టాన్ని తగ్గించేందుకు ప్రత్యేక వ్యవస్థ ‘అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం దిశగా కలెక్టర్లు ప్రణాళికలు సిద్ధం చేయాలి. కల్లాల వద్ద ధాన్యం తడవకుండా ఉండేందుకు అవసరమైన టార్పాలిన్లను రైతులకు అందుబాటులో ఉంచాలి. వాతావరణ శాఖ సూచనల ఆధారంగా ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేసేందుకు మండల స్థాయిలో ఒక అధికారిని నియమించాలి. వాతావరణ సూచనలను రైతులకు చేరవేసేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి మిల్లు వద్ద ఒక అధికారి ఉండాల ప్రతి ఐకేపీ సెంటర్కు ఒక అధికారిని నియమించి కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు తలెత్తకుండా చూడాలి. ప్రతి రైస్ మిల్లు దగ్గర ఒక బాధ్యతాయుతమైన అధికారిని నియమించి పర్యవేక్షించాలి. ధాన్యం లోడింగ్లో జాప్యం జరగకుండా స్థానికంగా ఉన్న హమాలీలను గుర్తించి వారితో పని చేయించుకోవాలి. ధాన్యం లోడ్ చేసిన వెంటనే రైతులకు రశీదు ఇవ్వాలి. అలా చేస్తే తాలు, తరుగు పేరుతో అక్రమాలు జరగకుండా చూడొచ్చు..’అని ముఖ్యమంత్రి అన్నారు. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి: మంత్రి ఉత్తమ్ ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో జిల్లాల్లో ఎక్కడ సమస్యలున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. ధాన్యం సేకరణ విషయంలో ఎలాంటి సహకారం అందించేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. పొరుగు రాష్ట్రాల ధాన్యంతో సమస్యలు: మంత్రి తుమ్మల సరిహద్దు రాష్ట్రాల రైతులు కొంతమంది ధాన్యాన్ని తెలంగాణలో కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారని, దీంతో కొన్నిచోట్ల సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. అలా ధాన్యం రాకుండా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నెలాఖరులోగా ధాన్యం సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్కుమార్, వాకిటి శ్రీహరి, సీఎస్ రామకృష్ణారావు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రైతులకేమో చెరువుల్లో ఇస్తూ.. సన్నిహితులకేమో మంచి ప్లాట్లా?
-
సమీకరణకు భూములివ్వం
తాడేపల్లి రూరల్ : చంద్రబాబు ప్రభుత్వం తమకు తీరని ద్రోహం చేస్తోందని రాజధాని ప్రాంత రైతులు మండిపడ్డారు. రెండో విడత భూ సమీకరణ కోసం రైతుల మధ్య చిచ్చు పెడుతోందని, వర్గాలుగా విడదీసి పబ్బం గడుపుకోవాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరితో తొలుత భూములు తీసుకుని, అందరూ ఇవ్వాల్సిందేనని దౌర్జన్యం చేస్తోందని నిప్పులు చెరిగారు. ప్రభుత్వం తీరు ఎంత మాత్రం సబబు కాదని, అందుకే తామంతా ఒకతాటిపైకి వచ్చి భూ సమీకరణను వ్యతిరేకిస్తున్నామని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో అందరం కలిసికట్టుగా భూసమీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.ప్రభుత్వం బలవంతపు భూ సమీకరణ చేస్తున్న క్రమంలో ఆదివారం రాజధాని ప్రాంత రైతులు ఉండవల్లిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులు ఈశ్వరరెడ్డి, జొన్నా శ్రీనివాసరావు, గంటు బాలాజీ, పెద్దిశెట్టి వీరస్వామి, శ్రీనివాసరావు, అంజిరెడ్డి, శ్రీధర్రెడ్డి, నాగరాజు, శివకోటేశ్వరరావు, అశోక్రెడ్డి తదితరులు మాట్లాడారు. ‘మా తాత ముత్తాతల నుంచి ఈ భూములను నమ్ముకుని జీవనం సాగిస్తున్నాం. ప్రస్తుత ప్రభుత్వం రైతులను వర్గాల వారీగా విడదీసి, తన స్వార్థ ప్రయోజనాల కోసం మన మధ్య విభేదాలు సృష్టిస్తోంది. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా రైతు రైతే. రైతుకు నష్టం జరిగే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తే పోరాటం చేసి సాధించుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇదే ప్రాంతంలో 2015–2019 మధ్య రైతులకు ఇబ్బందులు ఎదురైనప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించి విజయం సాధించాం’ అన్నారు. అవసరానికి మించి భూమి ఎందుకు?మరోసారి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం అవసరాలకు మించి భూమిని రైతుల దగ్గర నుండి తీసుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు ముమ్మరం చేసిందని రైతులు తెలిపారు. ఇందులో భాగంగా విడతల వారీగా భూ సమీకరణకు నోటీసులు ఇస్తోందన్నారు. అన్ని ప్రాంతాల్లో ఒకేసారి ఈ ప్రక్రియ ప్రారంభిస్తే ఇబ్బంది అని, విడతల వారీగా ఈ ప్రక్రియ చేపట్టిందన్నారు. ‘రాజధానికి రైతులు ఎవరూ వ్యతిరేకం కాదు. అవసరమైన మేర భూములు తీసుకుంటే రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు. రాజకీయ నాయకులు కాంట్రాక్టర్ల పేరుతో వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. వారు దోపిడీ చేసిన దాంట్లో పాతిక వంతు ఖర్చు పెట్టినా ప్రభుత్వ అవసరాలను అవసరమైన భూమిని రైతుల దగ్గర నుండి నేరుగా కొనుగోలు చేయొచ్చు.కనీసం సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి కూడా ప్రభుత్వం ఆ ప్రయత్నాలు చేయలేదు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలోనూ వైఫల్యం చెందింది. ఇలాంటప్పుడు రైతులు ప్రభుత్వాన్ని ఎలా నమ్మాలో ఆలోచించాలి. ఇప్పటికే ఈ ప్రాంతంలో పలువురు రైతులు తమ భూములను వారి ఆడపిల్లకు కట్నాలుగా ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీరుతో వారంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకోసమైనా మనం స్పందించాలి. ఈ నెల 20వ తేదీన ఉండవల్లిలో నిర్వహించే సభకు ప్రతి ఒక్కరు హాజరై భూ సమీకరణకు వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను చెప్పాలి. ఆ తర్వాత ఆ అభిప్రాయాలను అర్జీల రూపంలో అధికారులకు, ప్రభుత్వానికి అందజేద్దాం’ అని రైతులు తీర్మానించారు. తమ పోరాటానికి సీపీఎం, వైఎస్సార్సీపీ, ఇతర పార్టీల మద్దతు కోరుతూ ముందుకు వెళదామని రైతులు నిర్ణయించారు. -
మార్క్ఫెడ్లో మక్కతిక
సాక్షి, హైదరాబాద్: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేనప్పుడు మద్దతు ధరకు కొనుగోలు చేసి ఆదుకునే మార్క్ఫెడ్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. గత ఖరీఫ్ సీజన్లో మార్క్ఫెడ్ కొనుగోలు చేసిన 3.97 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను విక్రయించేందుకు పిలిచిన టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. రైతుల నుంచి రూ. 2,400కు క్వింటాలు చొప్పున కొనుగోలు చేసిన 3.97 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను రూ. 1,400 నుంచి రూ. 1,500లోపు అంటే దాదాపు రూ. 1000 నష్టానికి బల్క్గా విక్రయించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. పౌల్ట్రీ రైతులు రూ. 1,600కు క్వింటాలు చొప్పున కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చినా గోదాములవారీగా చిన్న వ్యాపారులు రూ. 1,600 నుంచి రూ. 1,700లోపు మక్కలు కొనేందుకు సిద్ధపడినా ఆ టెండర్లను రద్దు చేసి మరీ బల్క్ టెండర్ల ద్వారా బడా సంస్థలకు కట్టబెట్టేందుకు టెండర్లు పిలిచారు. ఈ టెండర్లలో పాల్గొన్న ఐదు బడా కంపెనీలు కనీస మద్దతు ధరకన్నా రూ. 1,000 వరకు తక్కువకు కోట్ చేసినట్లు సమాచారం. నేడో, రేపో ఆయా సంస్థలకు టెండర్లు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతుండగా, ప్రభుత్వానికి ఉప్పందినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి హఠాత్తుగా మార్క్ఫెడ్ ఎండీ వి. శ్రీనివాస్రెడ్డిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారి రాహుల్ రాజ్ను మార్క్ఫెడ్ ఎండీగా నియమించింది. రూ. 950 కోట్ల విలువకు కొనుగోలు చేసి .... రాష్ట్రంలో ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున మొక్కజొన్న సాగవుతోంది. అందులో భాగంగానే గత ఖరీఫ్లో దాదాపు 9 లక్షల ఎకరాల్లో సాగు చేయగా భారీ ఎత్తున మక్కలు మార్కెట్కు వచ్చాయి. మార్కెట్లో అప్పట్లో ధర రూ. 2,000 కూడా లేకపోవడంతో ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసింది. క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ. 2,400 చొప్పున 3.97 లక్షల మెట్రిక్ టన్నులను రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఇందుకోసం రైతులకు దాదాపు రూ. 950 కోట్ల వరకు వెచ్చించిన మార్క్ఫెడ్... రవాణా, గోనె సంచులు, గోదాముల్లో నిల్వ కోసం భారీగానే వెచ్చించింది. కొనుగోలు చేసిన మక్కలను విక్రయించే విషయంలో మార్క్ఫెడ్లో పలు అక్రమాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. మార్కెట్లో ధర లేదనే కారణంగా విక్రయించే విషయంలో మీనమేషాలు లెక్కించిన అధికారులు.. మార్చిలో గోదాములవారీగా టెండర్లను ఆహా్వనించారు. దాదాపు 200 గోదాముల్లో మక్కలను నిల్వ చేయగా గోదాములవారీగా పిలిచిన టెండర్లలో పాల్గొన్న చిన్న వ్యాపారులు రూ. 1,600 నుంచి రూ. 1,700 వరకు వెచ్చించి మక్కలు కొనేందుకు ముందుకొచ్చారు. కానీ అధికారులు హఠాత్తుగా ఆ టెండర్లను రద్దు చేశారు. వెంటనే పౌల్ట్రీ వ్యాపారుల ప్రతినిధులు మార్క్ఫెడ్ అధికారులను సంప్రదించి క్వింటాలుకు రూ. 1,600 చొప్పున మక్కలను కొంటామని, పౌల్ట్రీ దానా కోసం ఇతరుల నుంచి కొనే బదులు మార్క్ఫెడ్ నుంచే తీసుకొంటామని ముందుకొచ్చారు. అయితే అందుకు అధికారులు ఒప్పుకోకుండా బల్క్ టెండర్లు పిలిచారు. రూ. 100 కోట్లపైన టర్నోవర్ నిబంధనతో... బల్క్ టెండర్ల ద్వారా ఒకేసారి మక్కలను విక్రయించి గోదాములను ఖాళీ చేస్తామని చెప్పిన మార్క్ఫెడ్ అధికారులు.. ఈ మేరకు గత నెలలో మళ్లీ టెండర్లు పిలిచారు. ఇందుకోసం రూ. 100 కోట్లపైన టర్నోవర్ కలిగిన సంస్థలే పాల్గొనాలనే నిబంధన విధించారు. దీంతో కేంద్రీయ బండార్, నాకాఫ్, వి–కేర్, మంచుకొండ ఆగ్రో ఇండస్ట్రీస్, అమరావతి కంపెనీలు ముందుకొచ్చాయి. 2022–23 రబీలో మిల్లర్లు మాయం చేసిన రూ. 7,000 కోట్ల విలువైన ధాన్యాన్ని మిల్లర్ల నుంచి రాబట్టేందుకు 2023లో పిలిచిన టెండర్లలో పాల్గొన్న కంపెనీలే ఈ మక్కల బల్క్ టెండర్లలో పాల్గొనడం గమనార్హం. అయితే ధాన్యం రికవరీకి బదులు డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఈ కంపెనీలు సగంలోనే చేతులెత్తేశాయి. ఈ కంపెనీలే తిరిగి మక్కల టెండర్లలో పాల్గొని క్వింటాలుకు రూ. 1,400 నుంచి రూ. 1,500 చొప్పున కొనేందుకు బిడ్లు వేసినట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో మార్క్ఫెడ్లో జరుగుతున్న మక్కల టెండర్ల దందా గురించి సర్కార్కు ఫిర్యాదులు అందడంతో ప్రాథమిక విచారణ జరిపినట్లు తెలియవచ్చింది. అందులో భాగంగానే ఆకస్మాత్తుగా మార్క్ఫెడ్ ఎండీ వి. శ్రీనివాస్రెడ్డిపై బదిలీ వేటు వేసింది. ఈ నేపథ్యంలో మక్కల టెండర్ల కథ మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. -
మేము భూములు ఇవ్వకపోయినా బెదిరించి లాక్కుంటున్నారు..
-
మంత్రిగారి వియ్యంకుడి దందా.. ధాన్యం దోపిడీకి ‘పట్టాభి’షేకం
‘‘గుంటూరు జిల్లాలో వ్యవసాయాధికారుల అంచనాల ప్రకారం ఖరీఫ్లో 4 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. ఇప్పటికే 21 మిల్లులకు సీఎంఆర్ ఇచ్చాం. ఇందులో తొమ్మిది మిల్లులు బ్యాంకు గ్యారంటీలు కట్టలేదు. అందుకే, ధాన్యం కొనుగోళ్లలో స్థానిక మిల్లుల సామర్థ్యం సరిపోదు. పెద్దాపురానికి చెందిన పట్టాభి ఆగ్రోస్ ఇండస్ట్రీస్ బల్్కగా సీఎంఆర్ ధాన్యాన్ని తరలించేందుకు విజ్ఞప్తి చేసింది.ఇందులో 50శాతం రవాణా ఖర్చులు ఆ సంస్థే భరిస్తుంది’’ అంటూ గుంటూరు పౌరసరఫరాల సంస్థ అధికారి జిల్లా జేసీని తప్పుడు లెక్కలతో మోసగిస్తూ ఇచ్చిన నివేదిక ఇది. దీనిని నమ్మిన జేసీ ధాన్యం అంతర్జిల్లా రవాణాకు అనుమతించారు. విచిత్రం ఏమంటే.. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్లో కొనుగోలు చేసింది కేవలం 91వేల టన్నులు మాత్రమే! ఇందులో పట్టాభి మిల్లులకు తరలించింది దాదాపు 22వేల టన్నులు. ఇక్కడ పథకం ప్రకారమే అంతరజిల్లా రవాణాకు అనుమతిచ్చి పట్టాభిని రంగంలోకి దింపి ధాన్యం కొనుగోళ్లలో దోచిపెట్టారనేది స్పష్టంగా తెలుస్తోంది.సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ధాన్యం కొనుగోళ్లలో భారీగా మద్దతు ధర దోపిడీ సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధరలను అమలు చేయడంలో చంద్రబాబు సర్కారు ఘోరంగా విఫలమైంది. కూటమి అనుకూల మిల్లర్లు, దళారుల సిండికేట్ చేతిలో ధాన్యాన్ని పెట్టి రైతుల నోటిలో మట్టికొడుతున్నారు. సీజన్లతో సంబంధం లేకుండా సిండికేట్ చెప్పిన ధరకే రైతులు ధాన్యాన్ని తెగనమ్ముకోవాల్సిన దుస్థితి. కాదంటే.. రైతుకు ధాన్యం పట్టుబడికి గోనె సంచులు అందవు.. రవాణాకు వాహనాలు రావు.. అసలు ప్రభుత్వ సిబ్బంది అటువైపు కన్నెత్తి చూడరు. అదే దళారీ చెప్పిన రేటుకు ఓకే అంటే మాత్రం క్షణాల్లో ధాన్యం మిల్లుకు చేరిపోతుంది. గడిచిన ఖరీఫ్లోనూ.. ప్రస్తుత రబీలోనే ఇదే సీన్ రిపీట్ అవుతోంది.ఇక్కడ 75కిలోల బస్తా ధాన్యం ఏ–గ్రేడ్కు రూ.1791, సాధారణ రకానికి రూ.1,777 చెల్లించాల్సిన ప్రభుత్వం.. రైతులను గాలికొదిలేయడంతో దళారులకు బస్తా రూ.1,100 నుంచి రూ.1,300కు విక్రయించుకోక తప్పనిస్థితి రైతులది. ఈ లెక్కన చూస్తే ఒక టన్నుకు ఏకంగా రూ.6,500 నుంచి రూ.9,300 వరకు నష్టపోతున్నారు. ఇక్కడ విచిత్రం ఏమంటే.. రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసిన దళారులు, సిండికేట్ మిల్లర్లు.. అదే ధాన్యాన్ని రైతు పేరుతో పూర్తి మద్దతు ధరకు ప్రభుత్వానికి విక్రయించి సొమ్ము చేసుకోవడం విస్తుగొలుపుతోంది. గడిచిన ఖరీఫ్లో ప్రభుత్వం రూ.11వేల కోట్ల విలువైన 49లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. ఇందులో మొత్తం దళారులే రాజ్యమేలడంతో దాదాపు రూ.3,100 కోట్ల నుంచి రూ.4,500 కోట్ల మద్దతు ధరను కొట్టేసినట్టు స్పష్టమవుతోంది. పట్టాభికే ‘పట్టం’!ఓ మంత్రి వియ్యంకుడికి చెందిన పెద్దాపురంలోని పట్టాభి ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కేంద్రంగా ధాన్యం సిండికేట్ దందా నడుస్తోంది. ప్రభుత్వంలోని కీలక పదవిలో ఉన్న మంత్రికి వియ్యంకుడు కావడం, పౌరసరఫరాల శాఖ మంత్రి సొంత సామాజికవర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు ఉండటంతో పట్టాభి ఇండస్ట్రీస్ గడిచిన ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో ఏకఛత్రాధిపత్యం సాగించింది. ఎన్నడూ సీఎంఆర్ వైపు కన్నెత్తి చూడని పట్టాభి ఇండస్ట్రీస్ ఖరీఫ్లో మాత్రం ధాన్యం సేకరించింది. దీనివెనుక భారీ దోపిడీ జరిగినట్టు స్పష్టమవుతోంది.పెద్దాపురంలో ఉన్న పట్టాభి ఇండస్ట్రీస్కు అనుబంధ సిండికేట్గా ఏర్పడిన ఐదారు మిల్లులు ఏకంగా 300 కిలోమీటర్లు దాటి బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఏకంగా రూ.230 కోట్ల విలువైన లక్ష టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైల్వే వేగన్ల ద్వారా తరలించడం గమనార్హం. స్థానికంగా మిల్లర్లకు సామర్థ్యం లేదనే సాకుతో అంతర్జిల్లా ధాన్యం కొనుగోళ్లకు పౌరసరఫరాల సంస్థ తెరదీసింది.పైగా పట్టాభి ఆగ్రో ఇండస్ట్రీస్ స్వయంగా వచ్చి తాము సీఎంఆర్ ఇస్తే ధాన్యాన్ని సొంత ఖర్చులతో అంతర్ జిల్లాకు తరలిస్తామని లేఖ ఇచ్చిన వెంటనే ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం కొసమెరుపు. వాస్తవానికి స్థానికంగా మిల్లులు లేని ఏజెన్సీ ప్రాంతాల నుంచి/విపత్కర పరిస్థితుల్లో ధాన్యం వేగంగా తరలించేందుకు మాత్రమే అంతర్జిల్లా రవాణా చేస్తారు. ఇలా ఏటా ఖరీఫ్లో 60వేల టన్నుల వరకు మాత్రమే అంతర్ జిల్లా రవాణా ఉంటే.. గడిచిన ఖరీఫ్లో మాత్రం ఏకంగా 2 లక్షల టన్నులు తరలిపోవడం గమనార్హం. రబీలో సంచులు ఎందుకు లేవు?ఖరీఫ్ గాయం మానకముందే రబీ ధాన్యం కొనుగోళ్లలో రైతులకు అవస్థలు తప్పడం లేదు. చంద్రబాబు హయాంలో సంపూర్ణ మద్దతు ధర చూడలేమన్న నైరాశ్యానికి వచ్చేశారు. పంట కోసి 20 రోజులైనా కొనుగోలు చేయకపోవడంతో ఆవేదనతో రైతులు రోడ్లపైకి వస్తున్న దుస్థితి. పంట ఒబ్బిడి చేసుకునేందుకు కనీసం ప్రభుత్వం గోనె సంచులు కూడా అందించట్లేదు. దళారుల మాట కాదని రైతు సేవా కేంద్రాల సిబ్బంది ముందుకు వెళ్లలేని పరిస్థితి. గత్యంతరం లేక కోసిన పంటను కోసినట్టు రూ.1,100తో అమ్ముకుని రైతుల నష్టాలపాలవుతున్నారు. పైగా ఇటీవల అకాల వర్షాలకు పంట తడవడంతో ముక్క విరుగుడు సమస్య రైతులను నిలువునా ముంచేస్తోంది. పట్టాభి సిండికేట్ మిల్లులకు లక్ష టన్నులు!చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం గడిచిన ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో అంతర్జిల్లా రవాణా పేరిట భారీ దోపిడీకి తెరదీసింది. ముందస్తు ప్రణాళిలో భాగంగా పట్టాభి సిండికేట్ రైతుల నుంచి ధాన్యాన్ని కారుచౌకగా కొట్టేసింది. మొత్తం 213 మిల్లులకు రూ.468 కోట్ల విలువైన రెండు లక్షల టన్నుల అంతర్జిల్లా ధాన్యం తరలిస్తే అందులో ఒక్క పట్టాభి అనుబంధ సిండికేట్ ఐదారు మిల్లులకే ఏకంగా లక్ష టన్నుల ధాన్యం చేరడం విస్తుగొలుపుతోంది. మద్దతు ధర 75కిలోల బస్తాకు రూ.1,777 ఉంటే రైతుల చేతిలో రూ.1,100 పెట్టి ధాన్యం దోచేసింది.ఇలా కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఏకంగా లక్ష టన్నులపైగా ధాన్యాన్ని సేకరించి ఆ తర్వాత పథకం ప్రకారం స్థానిక మిల్లులకు ఎక్కువ సీఎంఆర్ సామర్థ్యం లేదనే సాకుతో పెద్దాపురం మిల్లులకు తరలించింది. ఇది మిల్లర్ల అసోసియేషన్లో భారీ గందరగోళానికి తెరదీయడం గమనార్హం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పట్టాభి సిండికేట్కు లబ్ధి చేకూర్చేందుకు కుయుక్తులు పన్నింది.ఇందులో భాగంగానే బియ్యం అక్రమ రవాణా పేరుతో కాకినాడ పోర్టులో హడావుడి చేసి బొక్కబోర్లా పడింది. పైగా ఎక్స్పోర్ట్స్ వ్యాపారాన్ని సీజ్ ద షిప్ పేరుతో తీవ్రంగా దెబ్బతీసింది. ఫలితంగా చాలా మంది బియ్యం వ్యాపారులు బహిరంగ మార్కెట్లో ధాన్యం కొనడం మానేశారు. ఇదే అదునుగా పట్టాభి భారీ సిండికేట్ అవతారమెత్తి మొత్తం ధాన్యాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని స్థానిక మార్కెట్ను కబ్జా చేసింది. పైగా ఎక్స్పోర్ట్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని సీఎంఆర్ ద్వారా రెట్టింపు చేసుకోవటం గమనార్హం. -
కలగర రైతు భరోసా కేంద్రం వద్ద ఉద్రిక్తత
కలగర(ఎన్టీఆర్ జిల్లా): రైతుల కష్టాన్ని ఎంపీ కేశినేని చిన్ని అనుచరులు దోచుకుంటున్నారని ఆరోపిస్తూ రైతులు ఎదురుతిరిగారు. విస్సన్నపేడ మండలం కలగరలో రైతు భరోసా కేంద్రంగా చిన్ని వర్గీయులు దందా నడిపిస్తున్నారని రైతులు ఆందోళన బాట పట్టారు. దళారుల పేరుతో దోచుకుంటున్నారని రైతులు ఎదురుతిరిగారు. అక్కడ రైతులు ఆందోళనకు దిగడంతో కలగర రైతు భరోసా కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో ఎంపీ చిన్నిపై గుర్రుగా ఉన్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అక్కడకు చేరుకున్నారు. ఎంపీ వర్గం దోపిడీపై కొలికపూడి మండిపడ్డారు. ఎంపీ వర్గం వ్యక్తులకు సహకరిస్తున్న ఎమ్మార్వోపై ధ్వజమెత్తారు. దళారులకు ఎమ్మార్వో కొమ్ము కాస్తున్నారంటూ విమర్శించారు. ఉదయం నుంచి రైతుల ఆందోళన చేస్తుంటే మీకు పట్టదా అంటూ ఎమ్మార్వో తీరును తప్పుబట్టారు. ఎమ్మార్వోతో పాటు ఎంపీ వర్గంపై కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురు పెద్ద రైతులత కోసం చిన్న రైతుల పొట్టకొడుతున్నారని ఆరోపించారు. ఎమ్మార్వోతో పాటు ఓ నలుగురు రైతులు దోచుకుంటున్నారని, దొంగలను ఎమ్మార్వో కాపాడుతున్నారన్నారు. ఎమ్మార్వోను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు కొలికపూడి. -
దళారుల జేబులు నింపడానికి మా పొట్టకొడుతున్నారు..
-
అన్నదాతలకు విత్తన కష్టం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్నదాతలకు విత్తన భరోసా కరువైంది. నాన్ సబ్సిడీ విత్తన పంపిణీకి తొలి ఏడాదిలోనే మంగళం పాడేసిన చంద్రబాబు సర్కారు సబ్సిడీ విత్తన పంపిణీలోనూ చేతులెత్తేస్తోంది. సబ్సిడీలో అడ్డగోలుగా కోతలుపెడుతున్న ప్రభుత్వం అదునుకు విత్తన సరఫరా చేయకుండా రైతులను ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించేలా చేస్తోంది. ఫలితంగా నాసిరకం విత్తనాల బారినపడి రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు.మరోవైపు విత్తన సరఫరాదారులకు రెండేళ్లుగా బకాయిలు చెల్లించకపోవడం, గ్రామీణ విత్తనోత్పత్తి పథకాన్ని మొక్కుబడి తంతుగా మార్చడంతో సబ్సిడీ విత్తన పంపిణీ అగమ్యగోచరంగా తయారైంది. సబ్సిడీ విత్తన సరఫరా బాధ్యత నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుటిల యత్నాలకు ఒడిగడుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సబ్సిడీలో అడ్డగోలు కోత ముందస్తు ఖరీఫ్కు వెళ్తేనే.. పంటల్ని వైపరీత్యాల బారిన పడకుండా కాపాడుకోవచ్చని అధికారులు చెబుతుండగా.. ప్రభుత్వం అదునులో విత్తనం సరఫరా చేయలేకపోతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో 2024–25 ఖరీఫ్లో 6.63 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని అందుబాటులో ఉంచగా.. రూ.268 కోట్ల సబ్సిడీతో 5.94 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని పంపిణీ చేసింది. రబీ 2023–24 సీజన్లో జగన్ సర్కారు రూ.131.36 కోట్ల సబ్సిడీతో 3.27 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సరఫరా చేస్తే రబీ 2024–25 సీజన్లో చంద్రబాబు సర్కార్ కేవలం రూ.51.92 కోట్ల సబ్సిడీతో 1.94 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని మాత్రమే సరఫరా చేసింది.ఖరీఫ్–2025లో 6.32 లక్షల క్వింటాళ్ల విత్తనం అవసరమని అంచనా వేయగా.. కేవలం రూ.163 కోట్ల సబ్సిడీతో 4.23 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సరఫరా చేయగలిగారు. రబీ–2025–26 సీజన్లో సబ్సిడీలో మరింత కోత పెట్టడంతో కేవలం రూ.40 కోట్ల సబ్సిడీతో 1.35 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సరఫరా చేశారు. అదునుకు అందని విత్తనం రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 77.87 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది 87 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ప్రధానంగా 39 లక్షల ఎకరాల్లో వరి, 14 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 9.50 లక్షల ఎకరాల్లో అపరాలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏటా మార్చిలో పంటల వారీగా నిర్దేశించిన సాగు లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాల వారీగా విత్తనాల కోసం ఇండెంట్ సేకరిస్తారు. గ్రామీణ విత్తనోత్పత్తి పథకంలో ఉత్పత్తయ్యే విత్తనాన్ని దృష్టిలో పెట్టుకుని మిగిలిన విత్తనాలకు టెండర్లు పిలుస్తారు. సేకరించిన విత్తనాలను తొలుత ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్లలో సర్టీఫై చేసి సీజన్కు ముందుగానే రైతు సేవా కేంద్రా(పూర్వపు ఆర్బీకే)ల్లో అందుబాటులో ఉంచేవారు.ఏటా ఏప్రిల్లో పచ్చి రొట్ట విత్తనాలు, మే 15న వేరుశనగ, జూన్ 1 నుంచి వరి, జూన్ 15 నుంచి ఇతర విత్తనాలు పంపిణీ చేపడతారు. కానీ.. గడిచిన రెండేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం సకాలంలో టెండర్లు ఖరారు చేయకపోవడం, అదునుకు విత్తనాలను అందుబాటులో ఉంచలేకపోవడం వంటి కారణాలలో రైతుల్లో అత్యధికులు ప్రైవేటు విత్తన వ్యాపారులను ఆశ్రయించి అధిక ధరలకు కొనుగోలు చేశారు. అవి నాసిరకం కావడంతో పంటలు దెబ్బతిని, ఆశించిన దిగుబడులు రాక నష్టపోయారు. ఖరీఫ్లో పచ్చిరొట్ట, వేరుశనగ, రబీలో పప్పు శనగ విత్తనాలు దొరక్క రైతులు పడరాని పాట్లు పడ్డారు. ఖరారు కాని వేరుశనగ టెండర్లు రానున్న ఖరీఫ్–2026 సీజన్లో విత్తన సబ్సిడీని రూ.179 కోట్లకు పరిమితం చేయడంతో 4.82 లక్షల క్వింటాళ్ల విత్తనం అందుబాటులో ఉంచాలని యోచిస్తున్నారు. ఆరి్థక శాఖ విత్తనాలకు సబ్సిడీ అవసరమా అనే ధోరణితో ఉండటంతో అధికారులు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఖరీఫ్లో ఏటా దాదాపు లక్ష క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉంచగా.. 2019–24 మధ్య ఐదేళ్లలో ఏటా సగటున 80 వేల క్వింటాళ్లకు తక్కువ కాకుండా రైతులకు సరఫరా చేశారు. అలాంటిది ఖరీఫ్–2025లో అతికష్టంపై 58 వేల క్వింటాళ్లు మాత్రమే సరఫరా చేశారు.ప్రస్తుత ఖరీఫ్–2026లో 90 వేల టన్నులు అవసరమని జిల్లాల నుంచి ఇండెంట్ రాగా, అందులో కనీసం 50% కూడా పచ్చిరొట్ట విత్తనాలను సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. దాదాపు నెల రోజులు ఆలస్యంగా టెండర్లు ఖరారైనప్పటికీ నేటికీ పూర్తిస్థాయిలో ఆర్ఎస్కేల్లో పచ్చి రొట్ట విత్తనాలు అందుబాటులో లేవు. ఈ సీజన్లో ఏటా 3.80 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు సరఫరా చేయగా.. ఇప్పుడు అడ్డగోలు కోతలతో విత్తన సరఫరాను కుదించేస్తున్నారు. ఖరీఫ్–2025లో అతికష్టంపై 1.93 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాన్ని సరఫరా చేయగా.. ఈ ఏడాది 2.40 లక్షల క్వింటాళ్ల విత్తనం కోసం టెండర్లు పిలిచారు.సీమలో వేరుశనగ కనుమరుగువేరుశనగ విత్తన సరఫరాలో ప్రభుత్వం కోత పెట్టడం రాయలసీమ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఉమ్మడి అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో వేరుశనగ అధికంగా సాగవుతుంది. వైఎస్సార్సీపీ హయాంలో ఏటా సగటున 16 లక్షల నుంచి 18.50 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగయ్యేది. గడచిన రెండేళ్లలో సాధారణ సాగులో 50 శాతం కూడా దాటని పరిస్థితి నెలకొంది. 2024 ఖరీఫ్లో 14.80 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించగా.. 6.25 లక్షల ఎకరాల్లోనే సాగైంది. ఖరీఫ్–2025లో కేవలం 4 లక్షల ఎకరాల్లోనే సాగైంది. వర్షాభావ పరిస్థితులకు తోడు చంద్రబాబు సర్కారు నిర్వాకమే సాగు తగ్గిపోవడానికి కారణమని రైతులు చెబుతున్నారు. సకాలంలో విత్తనాల సరఫరా లేకపోవడంతో బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయలేక, వాతావరణం అనుకూలించక వేరుశనగ సాగుకు సీమ రైతులు దూరమయ్యారు. -
ఏమయ్యా చంద్రబాబు.. అకాల వర్షం వస్తే రైతుల పరిస్థితి ఏంటి?
-
లైవ్ లో రేవంత్ పరువు తీసిన కేటీఆర్
-
పత్తి దిగుబడి పెంపుకోసం రూ.5,659 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో పత్తి పంట దిగుబడి పెంపుకోసం ఐదేళ్లపాటు అమలయ్యే మిషన్కు రూ.5,695.22 కోట్లు కేటాయించనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనపై కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రధాని మోది సారథ్యంలో భేటీ అయిన కేబినెట్ 2026–27 నుంచి 2030–31 కాలంలో అమలయ్యే ‘మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ’కింద ఈ మొత్తం వెచి్చంచాలని నిర్ణయించింది. దేశంలో పండే పత్తిలో నాణ్యత తగ్గడంతోపాటు దిగబడి క్రమంగా తగ్గిపోతుండటం వంటి సమస్యల పరిష్కారానికి ఈ నిధులను వెచి్చస్తారంది. వ్యాధులు, చీడపీడలను తట్టుకునే, అధిక దిగుబడులనిచ్చే వంగడాలను అభివృద్ధి పర్చడం, ప్రస్తుతమున్న సాంకేతికతను మరింత విస్తృతం చేయడం ఈ మిషన్ లక్ష్యాలని ప్రభుత్వం తెలిపింది. దీనితో దేశంలోని 32 లక్షల మందికి లబ్ధి కలుగనుందని పేర్కొంది.చెరకు కనీస ధర పెంపు అక్టోబర్ నుంచి మొదలయ్యే 2026–27 సీజన్కుగాను చెరకు కనీస ధరను పెంచాలని కేంద్రం నిర్ణయించింది. న్యాయమైన, లాభదాయక ధర (ఎఫ్ఆర్పీ)ని క్వింటాలుకు రూ.10 చొప్పున రూ.365కి పెంచేందుకు మంగళవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలిపారు. తాజాగా ఆమోదించిన ఎఫ్ఆర్పీ 2025–26 సీజన్ ధర క్వింటాల్కు రూ.355 కంటే 2.81 శాతం ఎక్కువని ఆయన వివరించారు. మిల్లులకు చెరకు సరఫరా చేసే రైతులకు రక్షణగా 10.25 శాతం రికవరీ రేటు ఆధారంగానే క్వింటాలకు ధర రూ.365 ఉంటుందని తెలిపారు. ఇది ప్రస్తుత 2025–26 సీజన్ ధర రూ.355 కంటే 2.81 శాతం అధికమని చెప్పారు. ఒకవేళ రికవరీ రేటు 10.25 శాతం కంటే ప్రతి 0.1 శాతం పెరిగితే, క్వింటాల్కు అదనంగా రూ.3.56 చెల్లిస్తారన్నారు. 9.5 శాతం కంటే తక్కువ రికవరీ ఉన్న మిల్లులకు చెరకు సరఫరా చేసే రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు, వారికి ఎటువంటి కోత విధించకుండా క్వింటాల్కు రూ. 338.30 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పేర్కొన్నారు. 2026– 27లో చెరకు ఉత్పత్తి వ్యయం క్వింటాలుకు రూ.182 చొప్పున ఉంటుందన్న అంచనా ప్రాతిపదికన ఎఫ్ఆర్పీ100.5 శాతంగా నిర్ణయించామని చెప్పారు. దీనివల్ల రైతులకు అదనంగా రూ.లక్ష కోట్ల మేర లాభం చేకూరనుందని వివరించారు. -
మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం
సాక్షి, మంచిర్యాల: జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రెండు వేర్వేరు ఘటనల్లో.. ఈదురుగాలులకు గోడలు కూలి ముగ్గురు రైతులు మరణించారు. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు కాగా.. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. లక్సెట్టిపేటలో గత రాత్రి ఘోరం చోటు చేసుకుంది. ఈదురుగాలులు, అకాల వర్షం నుండి పంటను కాపాడుకునేందుకు కొందరు రైతులు కొత్తూరు కొనుగోలు కేంద్రం వద్దకు పరుగులు తీశారు. ఆపై అక్కడే ఉన్న గోడ వద్ద నిల్చున్నారు. ఇంతలో గాలి ధాటికి గోడ మొత్తంగా కుప్పకూలిపోయింది. దండేపల్లి మండలం ముత్యంపేటకు చెందిన నిల్కి లచ్చన్న (55) , గుండారపు వెంకటేశ్ (24) అక్కడికక్కడే మరణించారు. గాయపడిన మరో ఐదుగురిని చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అందులో తనుగుల నాగరాజు, సీదుల హరీష్ ఈ ఇద్దరి పరిస్థితి విషమించడంతో కరీంనగర్కు తరలించారు. మరోవైపు.. గంపలపల్లి కొనుగోలు కేంద్రం వద్ద కూడా విషాదం చోటు చేసుకుంది. రైతులపై ఈదురు గాలుల ధాటికి ఒక్కసారిగా రేకుల షెడ్డు కూలింది. ఈ ఘటనలో తనుగుల అభిరాం (22) మృతి చెందాడు. గాయపడిన మరో ఇద్దరిని కరీంనగర్కు తరలించారు. అకాల వర్షాలు, ఈదురు గాలులతో జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ప్రధాన రాహదారులపై రాకపోకలు స్తంభించాయి. దీంతో పోలీసులు స్థానికుల సాయంతో చెట్లను తొలగిస్తున్నారు. మరో మూడు రోజులపాటు ఇదే తరహా వాతావరణం ఉండొచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. -
రెండో విడత భూ సమీకరణపై భగ్గుమన్న రైతులు
తాడికొండ: అమరావతి రాజధానిలో రెండో విడత భూ సమీకరణపై రైతులు భగ్గుమన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పెదపరిమి యూనిట్–2లో సీఆర్డీఏ అధికారులు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో భాగంగా రైతులతో మంగళవారం గ్రామసభ నిర్వహించారు. నమ్మిన రైతులను నట్టేట ముంచిన ఈ ప్రభుత్వాన్ని ఎలా నమ్మాలని నిలదీశారు. గతంలో భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను 12 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు అభివృద్ధి చేసి ఇవ్వలేదని, రెండో విడతలో భూములిచ్చే రైతులకు మూడు నెలల్లో ప్లాట్లు ఎలా ఇస్తారని మండిపడ్డారు. తొలి విడతలో భూములిచ్చిన రైతులు పడినట్టు తాము ఇబ్బందులు పడలేమని తేల్చిచెప్పారు. పదేళ్ల క్రితం రైతులకు ఇచ్చినట్టుగానే 1,200 గజాలు ఇస్తే ఎలా సరిపోతుందని నిలదీశారు.తమకు 1,500 గజాల స్థలం, అప్పులు తీర్చుకునేందుకు రుణమాఫీ కింద రూ.3 లక్షలు ఇవ్వాలని స్పష్టం చేశారు. పక్కనే ఉన్న వెంకటపాలెం రైతులకు 1,450 గజాలు, మంగళగిరిలో అప్రూవల్ ప్లాట్లకు 1,800 గజాలు ఇస్తున్నప్పుడు తమకు 1,200 గజాలు ఇవ్వడం న్యాయమేనా అని మండిపడ్డారు. తమ భూములు ఇవ్వాలంటే స్పష్టమైన హామీ, సమయ పాలనతో కూడిన అగ్రిమెంట్ చేస్తేనే ఆలోచిస్తామని తేల్చి చెప్పారు. బలవంతంగా తమ భూములు తీసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్పై అనుమానాలను నివృత్తి చేయాలన్నారు. గ్రామ కంఠాల పేరుతో కొంతమందికి దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు అలవెన్సులు ఇచ్చినప్పుడు భూములు త్యాగం చేసిన తమకు తాము కోరుకున్న విధంగా ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నల వర్షం కురిపించారు.తొలి దశలో భూములిచ్చిన రైతులకు న్యాయం చేసిన తరువాతే తమ భూముల జోలికి రావాలని, మరికొందరు రైతులు అభిప్రాయం వ్యక్తం చేయగా.. అసలు భూములిచ్చేది లేదని మరికొందరు స్పష్టం చేశారు. రైతుల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని సీఆర్డీఏ అధికారులు తెలిపారు. గ్రామస్తులకు, మీడియాకు ముందస్తు సమాచారం లేకుండా గుట్టుచప్పుడు కాకుండా గ్రామ సభలు నిర్వహించడంపై పలువురు రైతులు మండిపడ్డారు. గ్రామసభలు జరిగే రైతులకు మాత్రం ముందురోజు సమాచారం ఇస్తుండటంతో రైతులంతా హాజరు కాలేని పరిస్థితి నెలకొంటోంది. కనీసం రెండు రోజుల ముందైనా సమాచారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. -
చి‘వరి’కి కష్టాలే!
సాక్షి, అమరావతి/నెట్వర్క్: మారుతున్న వాతావరణ పరిస్థితులు అన్నదాతల గుండెల్లో గుబులు రేపుతోంది. ఓ వైపు తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల రాయలసీమలో వరి పంట ఎండిపోతుంటే.. మరోవైపు విరుచుకుపడుతున్న అకాల వర్షాలు, ఈదురు గాలులకు కోత దశలో ఉన్న వరి చేలు నేలకొరిగి రైతుల ఆశలను చిదిమేస్తున్నాయి. మొక్కజొన్న రైతులను నిలువునా ముంచిన చంద్రబాబు ప్రభుత్వం వరి రైతులను కూడా నిలువునా దగా చేస్తోంది. వరి ధాన్యానికి మద్దతు ధర దక్కక రైతులంతా లబోదిబోమంటున్నారు. కనీసం గోనె సంచులను కూడా పూర్తి స్థాయిలో సమకూర్చలేని దుస్థితి నెలకొంది. అకాల వర్షాల బారినపడి తడిసి ముద్దవుతున్న వరిని చూసి రైతులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. రైతుల పుట్టి ముంచిన ప్రభుత్వంరబీలో దాదాపు 23 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. ప్రస్తుతం ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. గోదావరి, కృష్ణా జిల్లాలో 70 శాతానికి పైగా పూర్తయ్యాయి. ధాన్యాన్ని ఆరబెట్టడంతో చాలావరకు పంట కళ్లాల్లోనే ఉండిపోయింది. ఈ దశలో మారిన వాతావరణ పరిస్థితులు రైతుల గుండెల్లో గుబులు రేపుతోంది. కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో కళ్లాల్లో ఉన్న ధాన్యపు రాశులు రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు తడిసి ముద్దయ్యాయి. ఈదురుగాలుల కారణంగా ధాన్యంపై కప్పిన పట్టాలు ఎగిరిపోవడంతో ధాన్యమంతా తడిసిపోయింది. ఈ దశలో యుద్ధప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం చేతులెత్తేస్తోంది. కళ్లాల్లో ఉన్న ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమైతే ముక్క విరుగుడు సమస్య తలెత్తుతుందని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పెరిగిన సాగు విస్తీర్ణాన్ని బట్టి ఈ ఏడాది 65 లక్షల టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 25 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించింది. ఇప్పటివరకు 13 లక్షల టన్నులు మాత్రమే సేకరించింది.వేధిస్తున్న సంచుల కొరత.. దక్కని మద్దతు ధరధాన్యం సేకరణ కోసం 3.16 కోట్ల సంచులు సిద్దంగా ఉంచామని ప్రభుత్వం గొప్పలు చెబుతుండగా.. క్షేత్రస్థాయిలో సంచుల కొరత రైతులను వేధిస్తోంది. 40 కేజీల ఖాళీ గోతం రూ.18 వెచ్చించి రైతులు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే 20–30 శాతం మంది రైతులు సొంతంగానే సంచులు కొనుగోలు చేశారు. అంతేకాకుండా ధాన్యాన్ని సంచుల్లో నింపి తూకం వేసినందుకు ఒక్కొక్క బస్తాకు రూ.9 చొప్పున, బస్తాలను మిల్లులకు తరలించేందుకు ట్రాక్టర్కు టన్నుకు రూ.800 చొప్పున రైతులే చెల్లిస్తున్నారు. వాహనాల వెయిటింగ్ చార్జీలు సైతం రోజుకు రూ.1,000 చొప్పున భరిస్తున్నారు. సొంత ఖర్చుతో సంచుల్లో నింపిన ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించేందుకు ప్రభుత్వం సకాలంలో వాహనాలు సమకూర్చడం లేదు. ఫలితంగా బస్తాల్లో నింపిన ధాన్యం సైతం కళ్లాల్లోనే తడిసిపోతోంది. వ్యయ ప్రయాసలకోర్చి కొందరు రైతులు మిల్లులకు ధాన్యాన్ని తరలిస్తే క్వింటాకు 5నుంచి 8 కేజీల చొప్పున తరుగు కింద తీసుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. 1,635 కేంద్రాలు ఏర్పాటు చేశామని, 16వేల వాహనాలు సమకూర్చామని చెబుతున్నప్పటికీ పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు తెరుచుకోలేదు. డిమాండ్ మేరకు వాహనాలు అందుబాటులో లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. పుట్టికి రూ.3 వేలు నష్టపోయిన రైతులుఖరీఫ్ ఆలస్యంగా సాగయ్యే నెల్లూరు జిల్లాలో ధాన్యం రైతులు నిలువు దోపిడికీ గురయ్యారు. పుట్టి (850 కేజీల)కి కనీస మద్దతు ధర ప్రకారం ఫైన్ రకానికి రూ.20,136, సూపర్ ఫైన్ రకానికి రూ.20,380 చొప్పున చెల్లించాల్సి ఉండగా.. రైతులకు కేవలం రూ,17 వేల నుంచి రూ,18 వేల మధ్య దక్కింది. పైగా తరుగు పేరిట 48 కేజీలు అదనంగా తీసుకున్నారు. కొనుగోలు కేంద్రంలో అమ్ముకున్నా పుట్టికి రూ.20,300 చొప్పున చెల్లించినా కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) పేరిట అదనంగా 140 కేజీలు తీసుకున్నారు.కొనుగోలు కేంద్రంలో అమ్ముకున్నా, దళారులకు అమ్ముకున్నా పుట్టికి రూ.3 వేల వరకు నష్టపోయామని రైతులు చెబుతున్నారు. పైగా కూలీ, రవాణా చార్జీలు పైసా కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు. గోదావరి, కృష్ణా డెల్టాల పరిధిలోని రైతులూ నిలువునా దోపిడీకి గురవుతున్నారు. కనీస మద్దతు ధర కామన్ రకం క్వింటాకు రూ.2,369, గ్రేడ్–ఏ రకం రూ.2,389 కాగా.. 75 కేజీల బస్తాకు సాధారణ రకానికి రూ.1.725, గ్రేడ్–ఏ రకానికి రూ.1,777 చొప్పున దక్కాల్సి ఉంది. యంత్రాలతో కోసిన ధాన్యాన్ని రూ.1,250 నుంచి రూ.1,350 మించి కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ లెక్కన బస్తాకు రూ.427నుంచి రూ.527 వరకు నష్టపోతున్నా ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.గోతాలు ఇవ్వకపోగా తరుగు తీస్తున్నారుధాన్యం నింపేందుకు గోతాలు ఇవ్వకపోగా మిల్లుల దగ్గర క్వింటాకి ఐదు కేజీల చొప్పున తరుగు తీస్తున్నారు. గోతాలు లేక ధాన్యం రోజుల తరబడి కళ్లాల్లోనే ఉంచాము. ప్రభుత్వం గోతాలు ఇస్తుందనే నమ్మకం లేక ఒక్కొక్క గోతం రూ.18 చొప్పున కొనుగోలు చేసి ధాన్యం నింపి మిల్లులకు తరలించాం. రవాణా చార్జి టన్నుకు రూ.800, కాటా కూలీ గోతానికి రూ.9 చొప్పున అన్ని మేమే ఇచ్చాం. ఇలా అయితే రైతులకు మిగిలేది ఏమీ ఉండదు. – వి.నర్శిరెడ్డి, రైతు, టేకులపల్లి, ఎన్టీఆర్ జిల్లాసంచులు ఇవ్వడం లేదు తేమ తక్కువ రావడం లేదనే సాకుతో సంచులు ఇవ్వడం లేదు. ధాన్యం ఆరబెట్టుకుని తేమ తక్కువ రావడం కోసం రోజూ శాంపిల్ తీసుకుని రైతు సేవా కేంద్రాలు చుట్టూ తిరగడమే సరిపోతోంది. వాతావరణం చూస్తుంటే భయమేస్తోంది. సంచులు ఇచ్చారనుకుంటే.. ధాన్యం పట్టేందుకు జట్టు దొరకడం లేదు. ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేక కష్టపడి పండించిన పంట అమ్మేందుకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. గత సార్వాలో ట్రాన్స్పోర్టు చార్జీలు ఇప్పటివరకు ఇవ్వలేదు. – నల్లమిల్లి రామిరెడ్డి, రైతు, జుత్తిగ, పెనుమంట్ర మండలం, పశ్చిమ గోదావరిసంచులు నేనే కొనుక్కున్నానాలుగు ఎకరాల్లో వరి పండించాను. సంచులు ఇవ్వకపోవడంతో ధాన్యాన్ని వారం రోజులు కళ్లాంలోనే ఉంచేశాను. చేసేది లేక రూ.18 చొప్పున 250 సంచుల్ని కొని ధాన్యం నింపి మిల్లుకు తరలించాను. మిల్లు దగ్గర మూడు రోజులు పడిగాపులు పడిన తర్వాత క్వింటాకి 5 కేజీల చొప్పున తరుగు తీశారు. తరుగు డబ్బులను ముందు చెల్లిస్తేనే ధాన్యం దింపుకున్నారు. – శీలం కృష్ణారెడ్డి, రైతు, టేకులపల్లినెల రోజులైనా కొనడం లేదునెల రోజుల నుంచి సొసైటీల చుట్టూ తిరుగుతున్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సంచులు కూడా ఇవ్వడం లేదు. ఇచ్చే సంచులు ఎందుకు పనికిరావడం లేదు. క్వింటాకు 5 కేజీల కోత పెడుతున్నారు. అయినా ధాన్యం కొనుగోలు చేయడం లేదు. చాలా ఇబ్బందిపడుతున్నాం. – కోలా రామకృష్ణ, కోదాడఐదు కేజీలు కోత వేస్తున్నారుకోతలు కోసి నెల రోజులైంది. తేమ శాతం ఎక్కువ ఉందని ఆరబెట్టుకున్నాం. రోజూ రైతు సేవా కేంద్రం చుట్టూ తిరుగుతున్నా ఒక్క గోనె సంచి కూడా ఇవ్వలేదు. అడిగితే సీరియల్ ప్రకారం వస్తుంది కంగారుపడొద్దంటున్నారు. టీడీపీ వాళ్లకు చెందిన ధాన్యం తోలుతున్నారు. వాళ్ల దగ్గర ఒక్క కేజీ కూడా తరుగు తీసుకోలేదు. మా ధాన్యం తోలడం లేదు. ఎప్పుడు తోలుతారో కూడా చెప్పడం లేదు. సొంతంగా మిల్లుకు తోలాలంటే ఒక్కో కాటాకు రూ.7 వేల నుంచి రూ.8 వేల కిరాయి. పైగా క్వింటాకు 5 కేజీల తరుగు తీసుకుంటున్నారు. వాతావరణం గంటకో రకంగా మారిపోతోంది. వర్షం పడుతుంటే చాలు భయమేస్తోంది. ధాన్యం తడిసి ముద్దయితే ఎవరు కొంటారు. ఇదేనా కొనుగోలు చేసే తీరు – చిరసాని ప్రమీల, రైతు, వావిలాల, ఎన్టీఆర్ జిల్లా -
జగనే నయం.. రైతులను ఆదుకున్నారు
కడప (సెవెన్ రోడ్స్): ‘గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డే నయం. అన్నమయ్య డ్యామ్ తెగిపోయి తీవ్రంగా నష్టపోతే మా పక్క గ్రామమైన పులపత్తూరు రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకున్నారు. మేట వేసిన ఇసుకను తోలుకోవడానికి పర్మీషన్ ఇచ్చారు. టీడీపీ కూటమి ఏదో ఒరగబెడుతుందని నమ్మి ఓట్లువేస్తే.. రెండున్నర సంవత్సరాలైనా మా పొలంలో ఇసుక మేటలు తొలగించలేదు.కలెక్టరేట్కు తిరుగుతూనే ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు’ అంటూ వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట మండలం చింతలకోన గ్రామ రైతు, జనసేన కార్యకర్త కూటాలగారి వెంకటయ్య అధికారుల ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోమవారం కడప కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారుల తీరును ఎండగడుతూ బైఠాయించారు. పోలీసులు హుటాహుటిన వచ్చి కలెక్టర్ వచ్చాక తామే ఆయన వద్దకు తీసుకెళ్లి మాట్లాడిస్తామని నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. వెంకటయ్య వినలేదు. దీంతో పోలీసులు అతడిని బయటకు పంపించివేశారు. -
వ్యవసాయ యాంత్రీకరణలో కమీషన్ల దందా
సాక్షి, అమరావతి: వ్యవసాయ యాంత్రీకరణ పథకం చంద్రబాబు ప్రభుత్వంలో దోపిడీ పథకంగా మారిపోయింది. అధికారులతో కుమ్మక్కై ‘నీకింత.. నాకింత’ అంటూ పంచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వ పెద్దలు బేరసారాలు సాగిస్తున్నారు. తొలి ఏడాది మొక్కుబడి తంతుగా అమలు చేసిన ఈ పథకాన్ని రెండోఏడాది పూర్తిగా అటకెక్కించేశారు. 2025–26 ఆర్థిక సంవత్సరం ముగిసినా ఒక్కటంటే ఒక్క పరికరం పంపిణీ చేయలేదు. గతేడాది మంజూరైన కేంద్ర నిధులతోనే ఈ ఏడాది పథకం అమలు పేరిట పర్సంటేజ్లు దండుకుంటున్నారు. మరోవైపు సామర్థ్యం లేని చైనా పరికరాలను అధిక ధరలకు కోట్చేసి ఎడాపెడా దోచుకుంటున్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం(స్మామ్) కింద 2024–25లో రూ.343 కోట్ల కేంద్ర నిధులతో దాదాపు లక్షమందికి వ్యక్తిగత పరికరాలు, సీహెచ్సీ గ్రూపులకు వెయ్యి కిసాన్ డ్రోన్లు, క్లస్టర్ స్థాయిలో 100 కంబైన్డ్ హార్వెస్టర్లు ఇస్తామని ప్రకటించారు. ఆచరణకు వచ్చేసరికి రూ.129 కోట్లతో 25 వేల వ్యక్తిగత పరికరాలు, 875 డ్రోన్లు పంపిణీ చేశారు. కమీషన్ల కోసం అవసరం లేని పరికరాలను అంటగట్టారని రైతుల నుంచి విమర్శలు రాగా, టెండర్ నిబంధనలను తారుమారుచేసి అస్మదీయ కంపెనీలకు కిసాన్ డ్రోన్ల కాంట్రాక్టు కట్టబెట్టారంటూ అర్హతగల కంపెనీలు కోర్టులను ఆశ్రయించాయి. తొలి ఏడాది బిల్లుల చెల్లింపులో 15–20 శాతం కమీషన్ (రూ.25 కోట్లకుపైగా) అధికారులతో కలిసి అచ్చెన్న బృందం దండుకుందన్న ఆరోపణలు వచ్చాయి.కమీషన్ల కోసం చైనా ఉత్పత్తులకు పచ్చజెండా 2025–26 సీజన్లో రూ.240 కోట్లతో ఎఫ్పీవోలు, ఎస్హెచ్జీ గ్రూపులకు వెయ్యి, ఇంజనీరింగ్ పట్టభద్రులకు 75 కిసాన్ డ్రోన్లు, సీహెచ్సీలకు 164 హైకాస్ట్ మిషనరీ, 1,050 ట్రాక్టర్లతో పాటు 40 వేలకు పైగా వ్యక్తిగత పరికరాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కంపెనీల నుంచి పర్సంటేజ్లు వసూలు చేసి ఇవ్వాలంటూ ఒత్తిడి తెస్తున్నారంటూ ఆరోపించిన ఏపీ ఆగ్రోస్ జీఎం రాజమోహన్ను బదిలీచేసి విజిలెన్స్ నివేదికను తొక్కిపెట్టేశారు. నోడల్ ఏజెన్సీగా ఏపీ ఆగ్రోస్ను తప్పించి వ్యవసాయశాఖకు అప్పగించారు. తొలి ఏడాది పరికరాల పంపిణీకి ముందు కమీషన్లు దండుకోగా, రెండో ఏడాది ఎంపానల్మెంట్కు ముందుగానే కంపెనీలతో బేరసారాలు సాగించారు. డ్రోన్లతోపాటు వ్యక్తిగత పరికరాల విలువలో 20–25 శాతం ఇవ్వాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని, ఓ బినామీ డీలర్ ద్వారా కంపెనీల నుంచి కమీషన్ దండుకుంటున్నారని సమాచారం. ఈ పథకం కింద అనేక ఉత్పత్తులను చైనా నుంచి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా సరఫరా చేసేందుకు పచ్చజెండా ఊపారు. దేశీయ ఉత్పత్తులతో పోలిస్తే వీటి సామర్థ్యం, ధర తక్కువే అయినా.. భారతీయ ఉత్పత్తుల ధరలకే కోట్చేసిన కంపెనీలతో ఎంపానల్మెంట్ చేసుకున్నారు. వీటిలో ప్రధానంగా బ్యాటరీ స్ప్రేయర్లు, హైప్రెజర్ నాప్సాక్ స్ప్రేయర్లు, పవర్ వీడర్/రీపర్, బ్రష్ కట్టర్, హార్వెస్టర్, రోటో టిల్లర్, బేలర్లు, చాప్ కట్టర్లు వంటివి ఉన్నాయి. పవర్ వీడర్లు పూర్తిగా చైనా నుంచే వస్తున్నాయి. చైనాకు చెందిన పవర్ వీడర్ ఎమ్మార్పీ రూ.36 వేలు కాగా, స్మామ్లో రూ.57,500గా, రూ.18 వేలున్న బ్రష్కట్టర్ ధరను రూ.25 వేలుగా నిర్దేశించారు.పనితీరుతో పనిలేదురైతులకు పంపిణీ చేసే పరికరాల పనితీరును తప్పనిసరిగా పరీక్షించాల్సి ఉన్నా అలాంటిదేమీ జరగడం లేదు. మన హార్వెస్టర్ల ద్వారా వరికోతలు చేస్తే ధాన్యం నష్టం 1.5 శాతం నుంచి 2 శాతం ఉంటే.. చైనా హార్వెస్టర్ ఉపయోగిస్తే ఈ నష్టం 7.5 శాతం ఉంటుందని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నా చైనా పరికరాలకే మొగ్గుచూపుతున్నారు. రైతులు డిమాండ్ చేస్తున్నారనే సాకుతో సామర్థ్యం లేని పరికరాలను నేరుగా చైనా నుంచి డెలివరీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తగ్గిన జీఎస్టీ మేరకు కంపెనీలు కోట్చేసే ధరలు తగ్గాలి. కానీ అలా జరగడం లేదు. ఉదాహరణకు ఏపీ ఆగ్రోస్ ద్వారా ఇటీవల పిలిచిన టెండర్లో స్ప్రేయర్లకు 12 శాతం జీఎస్టీతో ఎల్1 కోట్చేసిన ధర రూ.23 వేలు. ఇదే స్ప్రేయర్లను నేడు 5 శాతం జీఎస్టీతో కలిపి కమిటీ ఆమోదించిన ధర రూ.26 వేలు. ఇలా అడ్డగోలుగా ధరలు పెంచడం వెనుక భారీ కుంభకోణం ఉంది. ఈసారి రూ.80 కోట్ల వరకు దండుకోవాలన్న లక్ష్యంతో ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. యాంత్రీకరణ పేరిట జరుగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటూ పలు దేశీయ కంపెనీలు ప్రధానితో పాటు కేంద్ర వ్యవసాయశాఖకు ఫిర్యాదు చేశాయి. కాగా, ఆన్లైన్లో పిలవాల్సిన టెండర్లను పూర్తిగా ఆఫ్లైన్లో పిలిచారు. ఇక్కడ పరీక్ష నివేదికలు, ధరల కొటేషన్లు, స్పెసిఫికేషన్లు వంటి పత్రాలను అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకునే వీలు కల్పించారు. అదే ఆన్లైన్లో పిలిస్తే ఒకసారి అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లను ఇష్టానుసారంగా మార్పులు చేర్పులు చేయడం సాధ్యం కాదు. తమకు పర్సంటేజ్లు భారీగా ఇచ్చే కంపెనీలకు మేలు చేసేందుకే ఈ విధంగా ఆఫ్లైన్లో టెండర్లు పిలిచారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. -
కూటమి ప్రభుత్వంలో అన్నదాతలకు కష్టాలు
గంపలగూడెం: చంద్రబాబు, కూటమి పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. శుక్రవారం ఆయన ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో పర్యటించి ధాన్యం కొనుగోలుపై రైతులను ఆరా తీశారు. స్థానిక మార్కెట్యార్డులో వారాల తరబడి మొక్కజొన్న, ధాన్యాన్ని ఆరబోసి కొనుగోలు కోసం ఎదురు చూస్తున్న రైతులతో మాట్లాడి చలించిపోయారు.అమ్మిరెడ్డిగూడెంలో పెద్ద ఎత్తున ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ తెలంగాణలో మొక్కజొన్న క్వింటా రూ. 2400 వరకు కొనుగోలు చేస్తుంటే, ఇక్కడ రైతులకు రూ.1500 కూడా దక్కడం లేదన్నారు. ధాన్యం ఎక్కడపడితే అక్కడ రాశులు పోసి కొనుగోలు కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలను పట్టించుకునే నాధుడు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి అధికారులు సైతం చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోందన్నారు.రైతుల ఇబ్బందులు పట్టవా?సాగు ఖర్చు పెరిగి, గిట్టుబాటు ధర లేక.. చివరికి పండిన పంటలు సైతం కొనేవారు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే మంత్రులు మాత్రం మలేసియా, సింగపూర్ ట్రిప్పులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు. ధాన్యం తరలించడానికి వాహనాలు లేవు, సంచులు లేవు, రైతే ఖర్చు భరించి తరలించాలని అధికారులు సూచనలు చేయడం చంద్రబాబు ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనం అన్నారు. గతంలో వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఆ మాటను నేడు నిజం చేస్తున్నారని ధ్వజమెత్తారు.రైతులు కన్నీరు పెడుతుంటే మంత్రి లోకేశ్ జాడ తెలియడం లేదని, మిగతా మంత్రులు మాట్లాడే ధైర్యం లేక మౌనం వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని అవినాష్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం స్పందించేంత వరకూ పోరాటాలు చేస్తామన్నారు. ఆయన వెంట తిరువూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త నల్లగట్ల స్వామిదాసు, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ఏలూరు శివాజీ, ఉపాధ్యక్షుడు అత్తనూరి వెంకట శివారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కావూరి వినయ్కుమార్, జెడ్పీటీసీ కోట శామ్యూల్, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. -
రైతులకు విత్తన విపత్తు
అనంతపురం అగ్రికల్చర్: జూన్ నుంచి ఖరీఫ్–2026 ప్రారంభం కానుంది. అంతలోపు అంటే మే నెలలోనే రైతులకు రాయితీతో విత్తనం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు ఏప్రిల్ రెండో వారం నుంచి విత్తన సేకరణ ప్రక్రియ మొదలు పెట్టాలి. కానీ నాలుగో వారం వచ్చినా విత్తనానికి సంబంధించి చడీ చప్పుడు కనిపించడం లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో ‘అనంత’ రైతులకు విత్తన విపత్తు తప్పేపరిస్థితి కానరావడం లేదు. గత ఏడాది ఇలా.. ఖరీఫ్–2025లో కూడా రైతులకు విత్తన వేరుశనగ సకాలంలో అందలేదు. దాదాపు నెల రోజులు ఆలస్యంగా అంటే జూన్ 5 నుంచి రాయితీ విత్తన పంపిణీ మొదలు పెట్టారు. గతేడాది మొదట లక్ష క్వింటాళ్ల వేరుశనగ అన్నారు. తర్వాత 50 వేల క్వింటాళ్లకు కొర్రీ వేశారు. పంపిణీ బాగా ఆలస్యం చేయడంతో రైతులకు ప్రయోజనం లేకుండా పోయింది. అలాగే రబీలో కూడా రాయితీ విత్తన పప్పుశనగ పంపిణీ పంట వేసుకున్న తర్వాత మొదలు పెట్టడంతో రైతులకు ఉపయోగం లేకుండా పోయింది.రాష్ట్ర క్యాబినెట్లో కీలకమంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ స్వంత నియోజకవర్గం ఉరవకొండ ప్రాంతంలోనే పప్పుశనగ సాగు అధికంగా ఉన్నా సకాలంలో విత్తనం ఇవ్వలేని దుస్థితి కల్పించారు. జిల్లాకు 14 వేల క్వింటాళ్లు కేటాయించినా చివరకు 2 వేల క్వింటాళ్లు మాత్రమే అందించి చేతులు దులుపుకున్నారు. అది కూడా 25 శాతం రాయితీ కల్పించడంతో రైతులకు ఏ మాత్రమూ ప్రయోజనం కలగలేదు. ఇలా చంద్రబాబు ప్రభుత్వం గత రెండేళ్ల ఖరీఫ్, రబీలో రాయితీ విత్తనం కంటితుడుపుగా ఇవ్వడంతో పంట సాగుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విత్తన సేకరణకు ససేమిరా.. ఏపీ సీడ్స్ ద్వారా గత ఖరీఫ్, రబీలో విత్తనం సరఫరా చేసిన ఏజెన్సీలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులు పూర్తి చేయలేదు. దీంతో ఈసారి విత్తన సేకరణకు ఏజెన్సీలు మొగ్గు చూపే పరిస్థితి కనిపించడం లేదు. గతేడాదికి సంబంధించి రూ.110 కోట్లు బకాయిలు చెల్లిస్తే కానీ తాము విత్తనం సమకూర్చలేమని ఇటీవల జేడీఏ దగ్గర మొరపెట్టుకున్నారు.కనీసం రైతుల నుంచి వసూలు చేసిన నాన్సబ్సిడీ సొమ్ము కూడా తమకు ఇవ్వకుండా వాడేసుకోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈసారి కూడా సకాలంలో రైతులకు విత్తనం అందడం కష్టంగానే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇలా జాప్యం చేయడం వల్ల జిల్లాలో రబీలో రైతులు పండించిన నాణ్యమైన వేరుశనగ వ్యాపారులు, దళారులు ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. ప్రభుత్వం మేల్కొనేలోపు చివరకు నాసిరకం, కల్తీ సరుకు అంటగట్టే పరిస్థితి ఉంటుందని రైతులు వాపోతున్నారు. జగన్ ప్రభుత్వంలో అవార్డులువైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు హయాంలో రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)ల ద్వారా ఖరీఫ్, రబీ మొదలు కాకమునుపే గ్రామ స్థాయిలో రైతులకు రాయితీ విత్తనాలు విజయవంతంగా అందించారు. ఫలితంగా ఏపీ సీడ్స్ రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు దక్కించుకుంది. 2021–22 అలాగే 2022–23 జాతీయ అవార్డులు తీసుకుంది. అలాగే 2022 ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు కూడా అందుకుంది. ఖరీఫ్, రబీలో రైతులకు అవసరమైన నాణ్యమైన అన్ని రకాల విత్తనాలు సకాలంలో అందించిన ఏపీ సీడ్స్ ఇప్పుడు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాయితీ తగ్గించడంతో పాటు విత్తన కేటాయింపులకు కూడా సగానికి సగం మేర కొర్రీలు వేసింది. దీంతో రైతులు ప్రభుత్వం ఇచ్చే రాయితీ విత్తనాన్ని నమ్ముకోలేక బయట ప్రాంతంలో స్వంతంగా సమకూర్చుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. -
గోనె సంచులు రాక.. గోదాములు లేక
సాక్షి, హైదరాబాద్: గత కొన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా మక్కలను విక్రయించడం పెద్ద సమస్యగా మారింది. కేంద్ర ప్రభుత్వం మక్కలకు కనీస మద్దతు ధర రూ.2,400 నిర్ణయించగా, బహిరంగ మార్కెట్లో రూ.1,700 మించి రావడం లేదని రైతాంగం ఆవేదన చెందుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల ఒత్తిళ్లు, రైతు సంఘాల విజ్ఞప్తుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మక్కల కొనుగోళ్ల బాధ్యతను మార్క్ఫెడ్కు అప్పగించింది. అయితే మార్క్ఫెడ్కు జిల్లాల్లో పూర్తి స్థాయి యంత్రాంగం లేకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, విక్రయించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్ –ప్యాక్స్) పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాల మేనేజర్లు ఇప్పుడు ప్యాక్స్ ద్వారా మక్కల కొనుగోళ్లు చేయించేందుకు ప్రయతి్నస్తున్నా, మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కొనుగోళ్లు సాగడం లేదు. రికార్డు స్థాయిలో సాగు రాష్ట్రంలో యాసంగిలో మక్కల సాధారణ సాగు వి స్తీర్ణం 4 లక్షల ఎకరాలుగా ఉంటే ఈసారి ఏకంగా 16.25 లక్షల ఎకరాల్లో సాగైంది. ఎకరానికి 26.50 క్వింటాళ్ల చొప్పున 43.20 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో రైతుల ప్రైవేటు విక్రయాలు, సొంత అవసరాలు పోగా 15 లక్షల మెట్రిక్ టన్ను ల మక్కలను విక్రయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున మొక్కజొన్న ఉత్పత్తి కావడంతో వాటిని ఎలా విక్రయించాలో తెలియని స్థితిలో మార్క్ఫెడ్ కొట్టుమిట్టాడుతోంది. అన్నీ సమస్యలే... మక్కల కొనుగోళ్లకు అవసరమైన గోనె సంచులను మార్క్ఫెడ్ ముందుగానే సమకూర్చుకోవాలి. ఒకసారి వాడిన (సెకండ్ హ్యాండ్) గోనె సంచులను మక్కల కొనుగోళ్లకు వినియోగిస్తారు. ఈ మేరకు ఇప్పటికే టెండర్లు పిలిచి, ఒక్కో గోనెసంచికి రూ.22 చొప్పున కాంట్రాక్టులు అప్పగించినా, కాంట్రాక్టర్లు సమయానికి గోనెసంచులు అందించడం లేదు. దీంతో భూపాలపల్లి, నాగర్కర్నూలు, మహబూబాబాద్, వరంగల్ వంటి చోట్ల రైతులే గన్నీ బ్యాగులను సమకూర్చుకొని మక్కలను విక్రయించేందుకు ప్యాక్స్ సెంటర్లకు వస్తున్నారు. ప్యాక్స్ నిర్వాహకులు కూడా గోనెసంచులతో వచ్చిన రైతుల మక్కలనే కాంటా వేస్తున్నారు. దీనిపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మార్క్ఫెడ్ ఎండీ శ్రీనివాస్రెడ్డి జిల్లా మేనేజర్లు, కాంట్రాక్టర్లు, గోనెసంచులు సమకూర్చే ప్రైవేట్ వ్యాపారులతో చర్చలు జరిపి అవసరమైన చోటకు గన్నీ బ్యాగులు సమకూర్చే ప్రయత్నం చేస్తున్నారు. మక్కలను సంచుల్లో నింపి, తూకం వేసి, లారీల్లో గోదాములకు తరలించేందుకు అవసరమైన హమాలీల సమస్య కూడా అన్ని జిల్లాల్లో ఎదుర్కొంటున్నారు. మరోవైపు సేకరించిన మక్కలను నిల్వ చేయడం ఇప్పుడు మార్క్ఫెడ్కు ప్రధాన సమస్యగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన గోదాములన్నీ ఇప్పటికే బియ్యం, ఇతర నిల్వలతో నిండి ఉన్నాయి. తాజాగా రబీ పంట మిల్లింగ్కు వస్తుండడంతో కొత్త బియ్యం నిల్వలకే గోదాములు సరిపోని పరిస్థితి ఉంది. పత్తి నిల్వకు సంబంధించిన గోడౌన్లు ఖాళీగా ఉన్నా, ఖరీఫ్లో సాగయ్యే పత్తి పంట సెపె్టంబర్ నాటికి మళ్లీ గోదాముల్లోకి వచ్చి చేరనుంది. దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లు అక్టోబర్లోగా మక్కల నిల్వలను ఖాళీ చేస్తామని హామీ ఇస్తే తప్ప గోదాములు ఇవ్వలేమని చెబుతున్నట్టు సమాచారం. 4 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు మక్కల కొనుగోళ్లకు ఇప్పటి వరకు 246 ప్యాక్స్ సెంటర్లను ఎంపిక చేశారు. 74వేలకు పైగా రైతుల నుంచి 4 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను సేకరించారు. నల్లగొండ, నారాయణపేట, భువనగిరి, మల్కాజిగిరి జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. నాగర్కర్నూలు, మహబూబాబాద్, భూపాలపల్లి వంటి చోట్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
‘ఢీ’జిల్.. రైతులకు తప్పని తిప్పలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు అసంబద్ధ విధానాల వల్ల మార్కెట్లో పంట ఉత్పత్తులకు ధర లేక గగ్గోలు పెడుతున్న రైతులను ఇప్పుడు ఇంధన సంక్షోభం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముమ్మరంగా సాగుతున్న ధాన్యం, మొక్కజొన్న మాసూళ్లతో పాటు కోతకొచ్చిన ఇతర పంటల పనులను డీజిల్ కొరత వేధిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఆక్సిజన్ సమస్యలు తలెత్తకుండా రొయ్యలు, చేపలను రక్షించుకునేందుకు డీజిల్ దొరక్క ఆక్వా రైతులూ పడరాని పాట్లుపడుతున్నారు. బంకుల్లో నాలుగు రోజులుగా నోస్టాక్ బోర్డులు కనిపిస్తుండడంతో కర్షకులు లబోదిబోమంటున్నారు. కోతల వేళ.. విలవిల.. రబీలో దాదాపు 68.92 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, అందులో 23 లక్షల ఎకరాల్లో వరి, మరో 23 లక్షల ఎకరాల్లో అపరాలు సాగయ్యాయి. 12.50 లక్షల ఎకరాల్లో మొక్క జొన్న, 2.50 లక్షల ఎకరాల్లో జొన్న, 3.50 లక్షల ఎకరాల్లో నూనెగింజలు సాగయ్యాయి. అపరాలు, నూనెగింజల పంటల కోతలు దాదాపు పూర్తయిపోయాయి. జొన్న కోతలూ దాదాపు 80 శాతం పూర్తి కాగా, మొక్కజొన్న 70 శాతం పూర్తయ్యాయి. వరి కోతలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. గోదావరి, కృష్ణా డెల్టా పరిధిలోని ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో వరి కోతలు జోరుగా సాగుతుండగా, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో మొక్కజొన్న కంకి వొలుపు పనులు జరుగుతున్నాయి. పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మిర్చి కోతలు, అపరాల (మినుము, పెసర) త్రషింగ్ పనులు తుది దశలో ఉన్నాయి. కోతల వేళ యంత్రాల వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా వరిలో కోతలు, నూర్పుళ్లు, రవాణాకు డీజిల్ అవసరం చాలా ఎక్కువ. డీజిల్ కొరత కారణంగా అద్దెకు తెచ్చి న కోత యంత్రాలు పొలాల్లోకి దిగలేని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి వరి కోతలకు హార్వెస్టర్లకు ఎకరాకు 10 నుంచి 16 లీటర్ల డీజిల్ అవసరం. అంటే రోజుకు సగటున 10 ఎకరాల్లో కోతలు పూర్తి చేయాలన్నా.. ఒక్కో హార్వస్టర్కు 100 నుంచి 160 లీటర్ల డీజిల్ కావాలి. ఇక కోసిన ధాన్యాన్ని తరలించడానికి ట్రాక్టర్లకు 10 ఎకరాలకు సుమారు 40 నుంచి 50 లీటర్ల డీజిల్ అవసరం. మొక్కజొన్న, అపరాల సాగులో ఉపయోగించే త్రషర్లకు 30 నుంచి 40 లీటర్ల డీజిల్ అవసరమని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న కొరత వల్ల బంకుల వద్ద 5 నుంచి 10 లీటర్లకు మించి ఇవ్వడం లేదు. ఆలస్యమైతే దిగుబడులపై తీవ్ర ప్రభావం కోతలు ఆలస్యమయ్యే కొద్ది ఆ ప్రభావం దిగుబడులపై పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం గింజలు నేలరాలి పోయి దిగుబడులు తగ్గిపోతాయని చెబుతున్నారు. రంగు మారడం, విరగడం జరుగుతుందని, అప్పుడు మద్దతు ధర మాట దేవుడెరుగు కనీసం పెట్టుబడి కూడా దక్కే అవకాశాలు ఉండవని కర్షకులు వాపోతున్నారు. అకాల వర్షాలు కురిస్తే ఇక పంటపై ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి దాపురిస్తుందని ఆవేదన చెందుతున్నారు. కూపన్లకూ ముప్పుతిప్పలు రైతుల వినతి మేరకు డీజిల్ సరఫరాలో రైతులు, ఆక్వా రైతులకు అధిక ప్రాధాన్యమివ్వాలని, డిమాండ్ను బట్టి వారికి కూపన్ల ద్వారా సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ కూపన్ల కోసం రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. రాజకీయ సిఫార్సులు ఉంటేనే కూపన్లు ఇస్తున్నారనే వాదన వినిపిస్తోంది. వ్యవసాయ, రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయ లోపం వలన కూపన్ల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో అడ్వాన్స్లు తీసుకున్న కోత యంత్రాల నిర్వాహకులు సైతం డీజిల్ కొరత వల్ల చేతులెత్తేస్తున్నారు. పైగా కోతలకు ఎకరాకు రూ.2800 నుంచి రూ.3వేలు వసూలు చేసే యంత్ర నిర్వాహకులు ప్రస్తుతం రూ.3వేల నుంచి రూ.4వేల మధ్య డిమాండ్ చేçస్తుండడం రైతులకు భారంగా మారింది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వీకే రాయపురం బంకు వద్ద డీజిల్ కోసం రైతులు ఆందోళన చేశారు. బంకు సిబ్బందితో ఘర్షణకు దిగారు. దీంతో అధికారులు బంకులో డీజిల్ సరఫరా నిలిపివేసి వరి యంత్రాలకు ఒక్కోదానికి 70 లీటర్ల డీజిల్ కూపన్లు ఇస్తామని దండోరా వేయించారు. అయితే ట్రాక్టర్లకు కూపన్లు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు.ఆక్వా రైతులకు ’ ప్రాణవాయువు’ సంక్షోభం ఆక్వా రైతులకు డీజిల్ కేవలం ఇంధనం కాదు.. అది చేపలు, రొయ్యల ప్రాణవాయువుకు ఆధారం. రాత్రి వేళల్లో ఏరియేటర్లు నిరంతరం పనిచేయాలి. విద్యుత్లో వోల్టేజ్ సమస్యలు ఉన్నప్పుడు డీజిల్ జనరేటర్లే దిక్కు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేళ ఏరియేటర్లు ఏమాత్రం ఆగినా ఒకటి రెండు గంటల్లోనే రొయ్యలన్నీ తేలిపోతాయి. మాస్ మోరా్టలిటీ (మూకుమ్మడి మరణాలు) దెబ్బకు రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారు.ప్రస్తుతం ఒక్కో చెరువుకు ఆక్వా రైతులు గరిష్టంగా రూ.10 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం రోజుకు 4వేల టన్నుల చేపలు కృష్ణా, గోదావరి జిల్లాల నుంచి తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు రవాణా అవుతున్నాయి. డీజిల్ సంక్షోభంతో ఆక్సిజన్ అందక రొయ్యలు, చేపలు చనిపోతే ఆర్థికంగా చితికిపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, రాజకీయ జోక్యం లేకుండా రైతులు, ఆక్వా రైతులకు డిమాండ్ మేరకు డీజిల్ సరఫరా చేయాలని రైతులు, రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
పరిహారం అడిగితే.. ఊరు దిగ్బంధం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అభివృద్ధి ముసుగులో చంద్రబాబు ప్రభుత్వం రైతులపై దమనకాండను కొనసాగిస్తోంది. అన్నదాతల నోట్లో మట్టి కొడుతోంది. న్యాయం కోసం అర్థించిన నోళ్లను అధికారంతో నొక్కేయాలని ప్రయత్నిస్తోంది. తమ భూములు తీసుకున్నందుకు పరిహారం కావాలని అడిగితే, తమ ఊరినే దిగ్బంధించారని విశాఖజిల్లా ఆనందపురం మండలం తర్లువాడ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి భూమినే నమ్ముకుని బతుకుతున్న వందలాదిమంది తర్లువాడ డీ–పట్టా, జిరాయితీ రైతుల ఉసురు పోసుకుంటూ మంగళవారం ‘గూగుల్ డేటా సెంటర్’ శంకుస్థాపనకు ప్రభుత్వం సిద్ధమవుతోందని కన్నీరు పెట్టుకున్నారు. మెరుగైన పరిహారం ఇస్తామని హామీ ఇచ్చిన సర్కారు.. నమ్మిన రైతుల్ని నట్టేట ముంచేస్తూ.. ఒక్కపైసా కూడా ఇవ్వకుండా వారి భూములను బలవంతంగా లాక్కుంది. కనీస నష్టపరిహారం ఊసే ఎత్తకుండా, పోలీసుల పహారాలో భూసేకరణ చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే అరెస్టులతో ప్రభుత్వం నిర్బంధ కాండను కొనసాగిస్తోంది. శంకుస్థాపనకు చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో.. తర్లువాడని ఖాకీలు నిర్బంధిస్తూ.. 144 సెక్షన్ విధించారు. రైతులకు అండగా నిలబడేందుకు వస్తున్న ప్రజా సంఘాల నేతలను ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టులు చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఏళ్ల తరబడి రెక్కలు ముక్కలు చేసుకుని సాగు చేసుకుంటున్న భూమిని అప్పనంగా లాక్కోవడమే కాకుండా, పరిహారం అడిగితే అక్రమ కేసులు బనాయించడంపై నిరసన వ్యక్తమవుతోంది. కప్పదాటు హామీలుఆనందపురం మండలం తర్లువాడలో కొందరు రైతులకు నామమాత్రపు పరిహారం ఇచ్చిన సర్కార్, దశాబ్దాలుగా డీ పట్టా భూముల్ని సాగు చేసుకుంటున్న 520 మంది రైతులకు మాత్రం పైసా పరిహారం ఇవ్వకుండా భూములను లాక్కుంది. అలాగే 12 ఎకరాల జిరాయితీ భూములను సాగుచేసుకుంటున్న మరో 6 కుటుంబాలకు కూడా మొండిచేయి చూపింది. గూగుల్ వచ్చిన తొలి నాళ్లలో రైతులందరికీ తగిన పరిహారం ఇస్తామంటూ చంద్రబాబు తరఫున భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, అధికారులు ప్రజలకు నమ్మబలికారు. ఇప్పుడు ఆ మాటను గాలికి వదిలేశారు. 2013 భూ సేకరణ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. జిరాయితీ భూములు ఉన్న వారికి నిబంధనల ప్రకారం రెండున్నర రెట్లు పరిహారం ఇవ్వాలి. అదేవిధంగా.. ఒక్కొక్క ఎకరం డీ పట్టా భూములున్న 520 మంది రైతులకు 5 సెంట్లు భూమి, రూ.5 లక్షలు ఇస్తామని స్థానిక ఎమ్మెల్యే గంటా హామీ ఇచ్చారు. ఆ తర్వాత లేదు లేదు... 3 సెంట్లు ఇస్తామని ప్రభుత్వం మరో హామీ ఇచ్చింది. ఆ రెండింటినీ చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కేసి... ఇప్పుడు బలవంతపు భూ సేకరణకు ఉపక్రమించింది. పరిహారం అడిగితే బెదిరిస్తున్నారుమా కుటుంబంలోని ముగ్గురికి 60 ఏళ్ల క్రితమే తర్లువాడలో 4.64 ఎకరాల పట్టా భూమి ఉంది. దాని చుట్టూ 1.61 ఎకరాల బంజరు భూమి మా ఆధీనంలోనే ఉంది. ఇటీవల బంజరు భూమిలో చెట్లను తొలగించి రోడ్డు వేశారు. బంజరు భూములకు పరిహారం అడుగుతున్నాం. జిరాయితీ భూములను కూడా డి. పట్టా భూముల తరహాలోనే ప్రభుత్వానికి ఇచ్చేయమని తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారు. లేదంటే న్యాయస్థానం ద్వారా స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నారు. మేము జిరాయితీ భూములకు అదే విలువ గల భూమి అడుగుతున్నాం. ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళనగా ఉంది.– బి.వెంకటేశ్వరరావు, తర్లువాడ రైతుభూమి పూజ చేసినా.. ఆందోళన కొనసాగిస్తాంబంజరు భూములు అభివృద్ధి ప«థకంలో భాగంగా 2001 లో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ బలహీన వర్గాల మహిళలకు ఎకరం వంతున భూమి ఇస్తే అందులో మొక్కలు వేసుకున్నాం. సాగు ఫలాలు దశాబ్దాలుగా అనుభవిస్తున్నాం. ఈ భూములు కావాలని ప్రభుత్వం అడిగింది. తొలుత..భూములకు ప్రతిఫలంగా 3 సెంట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించి ఇప్పుడు ఇవ్వడం లేదు. మాకు పరిహారం కావాలని ఆందోళన చేస్తుంటే.. నిరసనలు తెలపకూడదంటూ మా ఊరిని నిర్భంధంలోకి తీసుకున్నారు. గూగుల్కు భూమి పూజ జరిగిన తర్వాత కూడా.. రైతులందరం కలిసి ఆందోళనలను కొనసాగిస్తాం.– బాలి సూరమ్మ, తర్లువాడ -
చంద్రబాబూ.. డబ్బా కొట్టడం ఆపు: కాకాణి
సాక్షి, నెల్లూరు: కూటమి ప్రభుత్వానికి అన్నదాతలను ఆదుకోవాలన్న విచక్షణ లేదంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పంటకు గిట్టుబాటు ధర లేదని.. దళారీల బారిన పడి నష్టపోతున్న రైతులు.. ఆత్మహత్యలకు పాల్పడతున్నారు. చంద్రబాబు తాను ఏదో బిజినెస్ రీఫార్మర్ అంటూ డబ్బా కొట్టుకోవడం తప్ప మరేమిలేదు’’ అంటూ కాకాణి ధ్వజమెత్తారు.‘‘మొంథా తుపాను నష్టపరిహారం నేటికి దిక్కు లేదు. రెండేళ్లలో లక్షల మంది రైతులు కనీస ధర లేక తీవ్ర నష్టాన్ని చవిచూశారు. కేంద్రానికి లేఖ రాసి, ముసలి కన్నీరు కారుస్తున్నాడు. రైతాంగ పరిస్థితి పక్కన పెట్టి అమరావతి బాకా ఊదుతున్నారు. పొగాకు, మిర్చి, పత్తి ఇలా అన్ని రకాల రైతులు నష్టపోయారు. మొక్కజొన్న వేసి లాభం పొందండి అని ప్రభుత్వం దండోరా వేసింది. నేడు మొక్కజొన్న వేసిన రైతులకు పెట్టుబడి కూడా చేతికి రావడం లేదు. కూరగాయలు, టమోటా రైతుల పరిస్థితి సైతం దీనస్థితిలో వున్నారు..బతుకు తెరువు కోసం వ్యవసాయాన్ని వదిలి కూలీ పని చేసుకునే దుస్థితి ఏర్పడింది. వరి పంటకు సంబంధించి కొనుగోలు కేంద్రాలు లేవు. గోతాలు లేవు. కేవలం మాటలు చెప్పి మోసం చేశారు. రైతులు వ్యవసాయం మానేస్తే మేలు.. వ్యవసాయం అంటే దండగా అనే వ్యక్తి చంద్రబాబు. అదే వైఎస్ జగన్ హయాంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు. గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధరపై పూర్తి అధ్యయనం జరిపి ఆదుకునేవాళ్లం. ప్రతి ఏడాది 3 వేల కోట్ల నిధులు రైతాంగానికి కేటాయించిన చరిత్ర జగన్ది. నేడు కనీసం ఉచిత పంట బీమా చేసిన పాపాన పోలేదుజ. వైఎస్ జగన్ హయాంలో ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఆదుకోవడం జరిగింది. సున్నా వడ్డి రుణాల సంగతే రైతులు మరిచిపోవాలసిన పరిస్థితి నేడు ఏర్పడింది’’ అని కాకాణి గోవర్ధన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రైతు కథ.. కన్నీటి వ్యధ.. కర్షకుల కష్టం దళారుల పాలు
ఆరుగాలం శ్రమించి అన్నదాత చిందించిన చెమటకు ఫలితం దక్కడం లేదు. పండించిన పంటకు మద్దతు ధర లేనే లేదు. చేతికొచ్చిన పంటను అమ్ముకునే దారే కనిపించడం లేదు. తొలి పంట వైపరీత్యాలతో దెబ్బతింటే.. రెండో పంటకు మద్దతు ధర దక్కక, కొనేవారు లేక రైతులు నష్టపోతున్నారు. మద్దతు ధర కల్పించడంలో బాబు ప్రభుత్వం చేతులెత్తేయడంతో అప్పులతో సాగు చేసి పండించిన పంటను అయినకాడకి తెగనమ్ముకుంటూ ఆర్థికంగా కుదేలవుతున్నారు. ఏ పల్లెకు వెళ్లినా రాసులు పోసిన పంటలు దర్శనమిస్తున్నాయి. కొనేవారు లేక, మద్దతు ధర దక్కక, కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేక అన్నదాతలు గుండెలవిసేలా రోదిస్తున్నారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని సుమారు 30కి పైగా పల్లెల్లో ‘సాక్షి’ క్షేత్ర స్థాయి పరిశీలనలో అన్నదాతల వెతలు వర్ణనాతీతం. ఏ పల్లెకు వెళ్లినా రైతుల ఆక్రందనలే.. ఏ రైతును కదిపినా కన్నీటి గాధలే. కళ్లెదుట పంటకు మద్దతు ధర దక్కక పోవడంతో చమర్చిన కళ్లతో దుఃఖాన్ని పంటి కింద అదిమి పెట్టుకొని రైతన్నలు మౌనంగా రోదిస్తున్న తీరు గుండెలను పిండేస్తోంది. పెట్టుబడులు పెరిగిపోయాయి రెండెకరాల్లో కౌలుకు చేస్తున్నా. ఎకరాకు రూ.20 వేలు కౌలుకు చెల్లించాను. రబీలో మొక్క జొన్న సాగుకు ఎకరాకు రూ.50 వేలు పెట్టుబడి పెట్టాను. 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కోతకు రూ.4 వేలు తీసుకుంటున్నారు. పంటను తోలేందుకు ట్రాక్టర్కు రూ.1,000 డిమాండ్ చేస్తున్నారు. పెట్టుబడులు ఏటా పెరిగిపోతున్నాయి. ధర మాత్రం పెరగడం లేదు. మార్కెట్లో చూస్తే రూ.1,650కి మించి కొనడం లేదు. ఎకరాకు రూ.15 వేలకు పైగా నష్టపోతున్నా. – తాళ్లూరి ఇసాక్, గణపవరం, పల్నాడు జిల్లా ఈ రైతు పేరు లగడపాటి వీరాంజనేయులు. బాపట్ల జిల్లా పర్చూరుకు చెందిన ఈయన రబీలో కౌలుకు తీసుకున్న 30 ఎకరాల్లో శనగ, 10 ఎకరాల్లో తెల్లజొన్న వేశాడు. ఎకరాకు రూ.15 వేల చొప్పున రూ.6 లక్షలు కౌలుకే చెల్లించాడు. రెండు పంటలకు రూ.15 లక్షల వరకు రూ.2కు వడ్డీకి తెచ్చి సాగు చేశాడు. తెల్లజొన్న 25 క్వింటాళ్ల దిగుబడి వస్తే, శనగ 8 క్వింటాళ్లకు మించి రాలేదు. తెల్లజొన్న రూ.1,600కు అమ్ముకున్నాడు. శనగకు క్వింటాకు రూ.4,900కు మించి ధర లేదు. ‘అతి కష్టమ్మీద 40 క్వింటాళ్ల శనగను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో అమ్ముకున్నా రెండు నెలలైనా పైసా జమ కాలేదు. గతేడాది నల్లబర్లి పొగాకు సాగుతో రూ.10 లక్షలు నష్టపోతే ఈసారి మరో రూ.15 లక్షలకు పైగా నష్టపోతున్నా’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.ఈ రైతు పేరు శివ వెంకటరెడ్డి. గుంటూరు జిల్లా చుండూరు మండలం చిన్న పరిమి గ్రామానికి చెందిన ఈయన 10 ఎకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేశాడు. ఎకరాకు రూ.32 వేలు కౌలు చెల్లించాడు. అదునుకు యూరియా దొరకక బ్లాకులో బస్తా రూ.350–450 మధ్య కొనుగోలు చేశాడు. పంటను కాపాడుకునేందుకు మోటార్లతో ఐదుసార్లు నీళ్లు పెట్టాల్సి వచ్చింది. ఇలా ఎకరాకు రూ.50 వేల చొప్పున అప్పులు చేసి పెట్టుబడి పెట్టాడు. తీరా పంట చేతికొచ్చేసరికి క్వింటా రూ.1,600కు మించి కొనడం లేదని, ఈ ధరకు అమ్ముకుంటే కనీసం పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని వాపోయాడు. వైఎస్ జగన్ హయాంలో ఇదే మొక్కజొన్నను రూ.2,650కు అమ్ముకున్నానని, పచ్చి వడ్లకు రూ.2,200 ధర దక్కిందని చెప్పాడు. జగన్ ప్రభుత్వంలో మంచి ధరలు లభించాయని, ఇప్పుడు రైతుల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.ఈ రైతు పేరు వేటు వెంకటేశ్వరరెడ్డి. బాపట్ల జిల్లా తెనాలి మండలం ఐతానగరానికి చెందిన ఈయనకు సెంటు భూమి కూడా లేదు. వ్యవసాయంపై మక్కువతో 40 ఎకరాలు కౌలుకు తీసుకొని తొలి పంట వరి వేశాడు. ఎకరాకు రూ.35 వేల వరకు పెట్టుబడి పెడితే అకాల వర్షాలకు 30 బస్తాలకు మించి దిగుబడి రాలేదు. దాంట్లో సగం కౌలుకే ఇవ్వాల్సి వచ్చింది. మిగిలిన ధాన్యం బస్తా (75 కేజీలు) రూ.1,350 చొప్పున అమ్ముకున్నాడు. రబీలో ఎకరాకు రూ.25 వేల పెట్టుబడితో జొన్న సాగు చేశాడు. మోంథా తుపానుకు మూడొంతులు పంట పోతే రెండోసారి విత్తగా ఎకరాకు 18 క్వింటాళ్ల దిగుబడులొచ్చాయి. తీరా మార్కెట్కు తెస్తే కొనేవారు లేరు. ‘రెండు పంటలకు రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. ఇప్పటి వరకు రూ.5 లక్షలే చేతికొచ్చింది. ఈ సీజన్లో రూ.7 లక్షలకు పైగా నష్టపోయాను’ అని ఈ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ రైతు పేరు నల్లమోతు సత్యనారాయణ. పల్నాడు జిల్లా నాదెళ్ల గ్రామానికి చెందిన ఈయన తనకున్న 3.5 ఎకరాల్లో మొక్కజొన్న, 1.60 ఎకరాల్లో బొప్పాయి పంటలు సాగు చేశాడు. ఎకరాకు మొక్కజొన్నకు రూ.50 వేలు, బొప్పాయికి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టాడు. మొక్కజొన్న ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి రాగా, క్వింటా రూ.1,600కు అమ్ముకోగా, బొప్పాయి పంటకు నాందేడ్ తెగులు సోకడంతో నాణ్యత తగ్గింది. ‘ఎకరాకు 10 టన్నులకు మించి దిగుబడులు రావడం లేదు. మార్కెట్లో కిలో రూ.10కి మించి కొనేవారు లేరు. తెగులు సోకిందంటే కిలో రూ.5కే అడుగుతున్నారు. కనీసం కిలోకు రూ.15–16 ధర వస్తే కానీ గిట్టుబాటు కాదు. గతేడాది 10 ఎకరాల్లో వంగ తోట వేసి నష్టపోయాను. ఈసారి మొక్కజొన్న, బొప్పాయి వేసి తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాను. ఏం చేయాలో పాలుపోవడం లేద’ని కన్నీటి పర్యంతమయ్యాడు. పల్నాడు జిల్లా నాదెళ్లలో తెగుళ్ల బారిన పడిన బొప్పాయి పంట (పంపాన వర ప్రసాదరావు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల నుంచి సాక్షి ప్రతినిధి) : రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి చందాన తయారైంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో రైతులు గతేడాది సాగు చేసిన నల్ల బర్లీ పొగాకుతో తీవ్ర నష్టాలను మూట గట్టుకున్నారు. ఇప్పటికీ వందలాది మంది రైతుల ఇళ్లల్లో పొగాకు బేళ్లు బేలచూపులు చూస్తూనే ఉన్నాయి. మిర్చి, పత్తి పంటలకు గిట్టుబాటు ధర దక్కక ఒక్కో రైతు రూ.5–10 లక్షల వరకు నష్టపోయారు. నల్లబర్లి పొగాకు సాగు చేయొద్దు.. లాభసాటిగా ఉన్న మొక్కజొన్న, శనగ సాగు చేయండని ప్రభుత్వం ఊరూ వాడ ప్రచారం చేసింది. మరొక వైపు గతేడాది నష్టపోయిన మిర్చి, పత్తి రైతులు సైతం ఈసారి జొన్న, మొక్కజొన్న, శనగ, కంది సాగు వైపు మళ్లారు. బాపట్ల లంక గ్రామాలతో పాటు పల్నాడు జిల్లాలో సాగు చేసే టమాటా, ఉల్లి, బెండ, వంగ, గోరుచిక్కుడు, దోసకాయలు, బంగాళదుంప తదితర కూరగాయల పంటలకు కూడా గిట్టుబాటు ధర లేక దళారులకు అప్పనంగా ఇవ్వలేక రైతులు మౌనంగా రోదిస్తున్నారు. పల్నాడు జిల్లా అమీన్సాహెబ్ పాలెంలో మిర్చిని ఆరబోస్తున్న రైతులు తీపిని పంచాల్సిన పుచ్చకాయ, కర్బూజ తోటలు రైతులకు కన్నీటి చేదును మిగిలిస్తున్నాయి. రెండేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొందని.. ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కలేదని రైతులు బాహాటంగానే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రకృతి ప్రకోపం వల్లనో, మార్కెట్ వైఫల్యం వల్లనో నష్టపోవడం లేదని.. ముమ్మాటికీ పాలకులు చేస్తున్న నమ్మక ద్రోహం వల్లే నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లి, టమాటా వంటి పంటలకైతే కనీసం కోత ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేక పొలాల్లోనే వదిలేస్తున్నామని తెనాలికి చెందిన ఎం.భాస్కరరావు అనే కౌలు రైతు వాపోయారు. అరటి, బొప్పాయి పంటలు కొనే వారు లేక తోటల్లోనే పక్వానికి వచ్చి రాలిపోతున్నాయని కన్నీటి పర్యంతమవుతున్నారు. మొంథా తుపాను వల్ల నష్టపోతే పైసా పరిహారం కూడా ఇవ్వలేదని అయ్యారుపేటకు చెందిన పొపూరి బాబూరావు ఆవేదన వ్యక్తం చేశారు. పంటను అమ్మగా వచ్చిన అరకొర ఆదాయం కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదని మరో కౌలు రైతు కుసుమర్తి ముసలయ్య కన్నీరు పెట్టుకున్నారు. వ్యాపారులు సిండికేట్గా మారి జలగల్లా పీలుస్తుంటే ప్రభుత్వం కళ్లున్నా చూడలేని కబోదిలా తయారైందని మండిపడుతున్నారు. మార్కెట్ యార్డులు వెలవెలఎప్పుడూ కళకళలాడే మార్కెట్ యార్డులు కొనుగోళ్లు లేక నిశ్శబ్దానికి వేదికలవుతున్నాయి. జొన్న, మొక్కజొన్న సాగు చేస్తే కొనేవారు లేక చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక హమాలీలుగా పని చేయాల్సి వస్తోందని ఐతానగర్కు చెందిన శనవం గోపిరెడ్డి వాపోయారు. పేరుకు శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా మూణ్ణాళ్ల ముచ్చటగా మూసేశారని, క్వింటాకు రూ.4,800కే దళారులకు తెగనమ్ముకుంటున్నామని రైతులు చెబుతున్నారు. కొద్ది మంది రైతులు మాత్రమే కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకుంటున్నారని చెప్పారు. మరొక వైపు మొక్కజొన్న రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. మద్దతు ధర రూ.2,400 కాగా, మార్కెట్లో రూ.1,400 నుంచి రూ.1,650 మధ్య పలుకుతోంది. అది కూడా వ్యాపారుల కాళ్లా వేళ్లా పడితే కానీ కొనడం లేదంటున్నారు. జొన్న రైతుల పరిస్థితీ అంతే.. మద్దతు ధర క్వింటా రూ.3,749 కాగా, మార్కెట్లో రూ.1,600–1,850 మధ్య దక్కుతోంది. దాచుకునేందుకు డబ్బుల్లేక సన్న, చిన్నకారు రైతులు ఈ ధరకే అమ్ముకుని నష్టపోతున్నారు. కాస్త ఆర్థిక స్థోమత ఉన్న వారైతే గోదాముల్లో నిల్వ చేసుకుంటున్నారు.ఇలాంటి ప్రభుత్వం ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే⇒ వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏనాడూ మద్దతు ధర కోసం ఇబ్బంది పడలేదని రైతులు ముక్త కంఠంతో చెప్పారు. ఏదైనా సందర్భంగా మార్కెట్లో కాస్త ధర తగ్గితే చాలు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకునేదని గుర్తు చేస్తున్నారు. రెండేళ్లుగా ఆ పరిస్థితి మచ్చుకైనా కన్పించడం లేదని వాపోతున్నారు.. చంద్రబాబు ప్రభుత్వంలో ధరల స్థిరీకరణ నిధి ఉందో లేదో కూడా అర్థం కావడం లేదని వాపోయారు. ⇒ తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లలో ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్క జొన్న కొనుగోళ్లకు శ్రీకారం చుడితే.. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కేంద్రానికి లేఖలు రాస్తూ కాలయాపన చేస్తోంది. పైగా కేంద్రం ఆర్థిక చేయూత ఇవ్వకపోతే మొక్కజొన్నే కాదు ఏ పంటనూ కొనుగోలు చేయలేమని తెగేసి చెబుతుండటాన్ని రైతులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇలాంటి ప్రభుత్వం ఉన్నా ఊడినా ఒకటేనని మండిపడుతున్నారు. ⇒ స్వామినాథన్ కమిషన్ సిఫార్సు మేరకు రైతులకు లాభసాటి ధరలు దక్కేలా చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. కనీసం కేంద్రం ప్రకటించిన మద్దతు ధర లభించేలా చేయడంలో విఫలమవుతోంది. ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పథకం, పంట నష్టపరిహారం వంటి పథకాలు అందక పోవడం వంటి కారణాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల రెండేళ్లలో రూ.25 వేల కోట్ల సంపదను రైతులు నష్టపోయారు.గతంలో బస్తా రూ.2 వేలు పలికేది ఐదెకరాల్లో గోరు చిక్కుడు సాగు చేశా. రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. 60 బస్తాలు (బస్తాకు 10 కేజీలు) దిగుబడులొచ్చాయి. మార్కెట్కు పోతే 10 కేజీల బస్తా రూ.240కు మించి కొనడం లేదు. గతంలో రూ.2 వేల వరకు ధర పలికేది. ఈసారి తీవ్రంగా నష్టపోతున్నా. – ఎరుపల్లి శ్రీనివాసరావు, విఠంరాజుపల్లె, పల్నాడు జిల్లాబాండ్ ఇచ్చినా..ఇబ్బందులే..ఐదెకరాల్లో వర్జీనియా పొగాకు సాగు చేశాను. ఐటీసీ బాండ్ కూడా ఇచ్చింది. రూ.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. తీరా పంట చేతికొచ్చేసరికి గోదాములు ఖాళీగా లేవంటూ రేపురా మాపురా అంటూ తిప్పుతున్నారు. కొనే సమయానికి నాణ్యత లేదంటున్నారు. ధర తగ్గించేస్తున్నారు. గతేడాది నల్లబర్లి సాగు చేసి నష్టపోయాం. ఈసారి వర్జీనియా సాగు చేసి ఇబ్బంది పడుతున్నాం. – మందుల నాగరాజు, విఠంరాజుపల్లె, పల్నాడు జిల్లాఅప్పులోళ్లకు జమ చేశారు ఎకరం సొంత పొలం ఉంది. మరో ఎకరన్నర కౌలుకు తీసుకుని తెల్లజొన్న పంట వేశాను. ఎకరాకు రూ.30 వేలు చొప్పున రూ.75 వేల వరకు రూ.2 వడ్డీకి అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాను. ఎకరాకు 40 టిక్కీలు (టిక్కీ 60 కేజీలు) చొప్పున 24 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కనీస మద్దతు ధర రూ.3,749 మాట దేవుడెరుగు.. కనీసం మార్కెట్లో కొనేవారు లేరు. అప్పులోళ్లు వడ్డీల కోసం ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. చేసేది లేక క్వింటా రూ.1,850కు ఓ వ్యాపారికి తెగనమ్ముకున్నా. చేతికి రూ.44 వేలు రావడంతో దాన్ని అప్పులోళ్లకు జమ చేశాను. ఇంకా కౌలుకు చెల్లించాల్సి ఉంది. ఇంటికి పైసా కూడా తీసుకెళ్లలేదు. – పాటిపండ్ల వీరయ్య, ఐతానగరం, బాపట్ల జిల్లారెండు పంటల్లోనూ నష్టాలే..ఎనిమిది ఎకరాల్లో టమాటా వేశా. ఎకరాకు రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టాను. మరో 4 ఎకరాల్లో గుమ్మడి సాగు చేశాను. రూ.60 వేల వరకు పెట్టుబడి పెట్టాను. గుమ్మడి నాలుగు టన్నులొచ్చింది. టన్ను రూ.8400 ధర పలికింది టమాటా 4 వేల బాక్సులొస్తే.. బాక్స్ (25 కేజీలు) రూ.80–110 లోపే తెగనమ్ముకోవాల్సి వచ్చింది. నా చేను సమీపంలోనే మార్కెట్లో టమాటా కిలో రూ.40 తక్కువకు అమ్మడం లేదు. నాకు మాత్రం కిలో రూ.3–4 మధ్య దక్కింది. – కళ్లం అనిల్కుమార్ రెడ్డి, సాహెబ్పాలెం, పల్నాడు జిల్లాగోరుచిక్కుడుకూ ధర లేదు..కౌలుకు తీసుకున్న 10 ఎకరాల్లో గోరుచిక్కుడు, ఐదెకరాల్లో పెసలు సాగు చేశాను. వర్షాలు ఎక్కువగా పడడంతో గోరుచిక్కుడు పంట దెబ్బతింది. ఎకరాకు రూ.30 వేల చొప్పున పెట్టుబడులు పెట్టాను. గోరుచిక్కుడు 10 కేజీల బస్తా రూ.150 పలికింది. పెసలుకు పెట్టుబడి కూడా దక్కలేదు. – భవనం కోటిరెడ్డి, విఠంరాజుపల్లె, పల్నాడు జిల్లారెండు పంటల్లోనూ నష్టాలే..ఎనిమిది ఎకరాల్లో టమాటా వేశా. ఎకరాకు రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టాను. మరో 4 ఎకరాల్లో గుమ్మడి సాగు చేశాను. రూ.60 వేల వరకు పెట్టుబడి పెట్టాను. గుమ్మడి నాలుగు టన్నులొచ్చింది. టన్ను రూ.8400 ధర పలికింది టమాటా 4 వేల బాక్సులొస్తే.. బాక్స్ (25 కేజీలు) రూ.80–110 లోపే తెగనమ్ముకోవాల్సి వచ్చింది. నా చేను సమీపంలోనే మార్కెట్లో టమాటా కిలో రూ.40 తక్కువకు అమ్మడం లేదు. నాకు మాత్రం కిలో రూ.3–4 మధ్య దక్కింది. – కళ్లం అనిల్కుమార్ రెడ్డి, సాహెబ్పాలెం, పల్నాడు జిల్లాగోరుచిక్కుడుకూ ధర లేదు..కౌలుకు తీసుకున్న 10 ఎకరాల్లో గోరుచిక్కుడు, ఐదెకరాల్లో పెసలు సాగు చేశాను. వర్షాలు ఎక్కువగా పడడంతో గోరుచిక్కుడు పంట దెబ్బతింది. ఎకరాకు రూ.30 వేల చొప్పున పెట్టుబడులు పెట్టాను. గోరుచిక్కుడు 10 కేజీల బస్తా రూ.150 పలికింది. పెసలుకు పెట్టుబడి కూడా దక్కలేదు. – భవనం కోటిరెడ్డి, విఠంరాజుపల్లె, పల్నాడు జిల్లాఆ ఐదేళ్లూ... అన్నదాతకు భరోసావైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. ధర లేని ప్రతీసారీ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఆ పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారు. వాటి ధరలు పెరిగేందుకు కృషి చేశారు. ఇలా ఐదేళ్లలో 6.20 లక్షల మంది రైతుల నుంచి రూ.7,796.47 కోట్ల విలువైన 21.73 లక్షల టన్నుల పంట ఉత్పత్తులు కొనుగోలు చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1,789 కోట్ల విలువైన పత్తిని కొనుగోలు చేశారు. కేంద్రం నుంచి అనుమతి ఇవ్వకపోయినా 2019–20లో 4,17,268 టన్నులు, 2020–21లో 3,06,713 టన్నులు, 2022–23లో 73,302 టన్నుల మొక్కజొన్నను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారు. చివరకు ఎన్నికల వేళ రబీ 2023–24 సీజన్లో ఓ దశలో జొన్న ధర పతనమవుతుందని తెలియగానే కేంద్రం నుంచి అనుమతులు రాకున్నా మార్క్ఫెడ్ ద్వారా రూ.38.60 కోట్ల విలువైన 12,136 టన్నులు కొనుగోలు చేసి తమది రైతు ప్రభుత్వమని వైఎస్ జగన్ నిరూపించారు. -
రైతు భరోసా సగమే… మిగిలిన డబ్బులు ఎప్పుడో?
వికారాబాద్: రైతుల ఎదురు చూపులు ఫలించి ఎట్టకేలకు సాగు సాయం డబ్బులు ఖాతాల్లో జమ కాగా, ఆ సంతోషం సగం వద్దే ఆగిపోయింది. గడిచిన యాసంగి సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం డబ్బులు ఖాతాల్లో జమవడం ప్రారంభమై నెల గడుస్తున్నా ప్రక్రియ పూర్తికాలేదు. ఇప్పటి వరకు కేవలం అరవై శాతం భూమికే సాగు సాయం అందింది. మరో నలభై శాతం భూమికి సంబంధించిన రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. తొలి విడతగా ప్రతీ రైతుకు ఎకరానికి డబ్బులు జమ చేసిన ప్రభుత్వం, మూడు రోజుల క్రితం రెండెకరాలలోపు వారందరికీ నగదు వేసింది. రెండు విడతల్లో కలిపి రెండెకరాల వరకు 2,82,509 మంది రైతులకు రూ.231.82 కోట్ల నిధులు జమయ్యాయి. మిగిలిన వారికి ఎప్పుడో? జిల్లాలో మొత్తం రైతు భరోసాకు అర్హులైన రైతులు 3,27,561 మంది ఉండగా, వీరు 6,45,145 ఎకరాల వ్యవసాయ భూమి కలిగి ఉన్నారు. ఇందులో ఒక్కో రైతుకు రెండెకరాల వరకు డబ్బులు అందాయి. మరో 2.8 లక్షల మందికి రూ.155.25 కో ట్లు జమ కావాల్సి ఉంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో మూడు నెలలైనా ప్రక్రియ పూర్తయ్యే అవకాశం లేదు. అప్పటికీ ఖరీఫ్ పంటల సాగు కూ డా పూర్తవుతుందని కర్షకులు ఆవేదన వ్యక్తంచేస్తు న్నారు. ఇదిలా ఉండగా అర్హులైన వారందరికీ చెల్లించాల్సిన మొత్తంపై బిల్లులు పూర్తి చేసిన వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే ట్రెజరీకి పంపించారు. ముంచుకొస్తున్న ఖరీఫ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో ఈ పథకాన్ని అమలు చేయగా ప్రస్తుత గవర్నమెంట్ దీన్ని రైతు భరోసాగా మార్చింది. సర్కారు ఏదైనా పంటలు సాగు చేసే సమయంలో రైతులకు సాయం అందడం లేదు. ఖరీఫ్ సమీపిస్తున్నా రబీ డబ్బులే రాలేదు.. ఖరీఫ్ సాయం అందే సరికి ఇంకెంత కాలం పడుతుందోనని విమర్శిస్తున్నారు. -
తెచ్చిన అప్పు అంతా ఏం చేస్తున్నారు?: లేళ్ల అప్పిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: రైతులు కష్టాల్లో ఉంటే మంత్రులు సింగపూర్లో షికార్లు చేస్తారా? అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతుల కోసం ఖర్చు చేయటానికి డబ్బులు లేవు గానీ.. షికార్లకు డబ్బులుంటాయా? అంటూ నిలదీశారు. చంద్రబాబు హయాంలో ఏ రైతూ బాగుపడింది లేదు. వ్యవసాయం దండగ అని తన ‘మనసులో మాట’ పుస్తకంలో రాసుకున్న వ్యక్తి చంద్రబాబు. అందుకే ఇప్పుడు మళ్లీ ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేకపోయినా పట్టించుకోవటం లేదు’’ అంటూ అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.మామిడి, ధాన్యం, పత్తి, మిర్చి, ఉల్లి, టమోటా, మొక్కజొన్న.. ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధరల్లేదు. అయినా చంద్రబాబు అధికారులతో ఒక్ సమీక్ష సమావేశం కూడా ఎందుకు నిర్వహించలేదు?. అసలు రాష్ట్రంలో వ్యవసాయ శాఖ పని చేస్తుందా?. రైతులను ఆదుకోవడానికి డబ్బుల్లేవంటారా?. లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఏం చేస్తున్నారు?. చంద్రబాబు రైతు వ్యతిరేకి. మిగతా రాష్ట్రాల్లో రైతులను అందుకునేందుకు అక్కడి ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. కానీ చంద్రబాబుకు మాత్రం ఆ స్పృహ ఎందుకు లేదు?’’ అంటూ అప్పిరెడ్డి ప్రశ్నించారు.‘‘ప్రపంచానికి పాఠాలు నేర్పానని చంద్రబాబు డబ్బా కొట్టుకుంటారు. మరి అలాంటి వ్యక్తి తన మంత్రులకు సింగపూర్లో ట్రైనింగ్ ఇస్తారట. రైతుల కోసం డబ్బుల్లేవంటూ మంత్రుల విహార యాత్రలకు మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారా?. రైతు సమస్యల పరిష్కారానికి ఒక్క సమీక్ష సమావేశాన్నైనా చంద్రబాబు ఏర్పాటు చేశారా?. రైతులకు మేలు చేసింది వైఎస్సార్ కుటుంబమే. ఉచిత విద్యుత్ నుంచి రైతు భరోసా కేంద్రాల వరకు వైఎస్సార్, వైఎస్ జగన్ మాత్రమే చేశారు. చంద్రబాబు ఏనాడూ ఏ రైతుకూ మేలు చేయలేదు. రైతుల కన్నీళ్లలో ఈ ప్రభుత్వం కొట్టుకుపోతుంది’’ అని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. -
మా భూముల జోలికొస్తే పోరాటమే
తాడేపల్లి రూరల్: అమరావతి ముఖ ద్వారమైన గుంటూరు జిల్లా ఉండవల్లిలో పంట పొలాలను తీసుకునేందుకు ప్రభుత్వం ఈ నెల 16న భూ సేకరణ కింద నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ రైతులంతా ఆదివారం సమావేశమయ్యారు. ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లాలని, వేర్వేరుగా పోరాటం చేస్తే ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని, గతంలో భూ సమీకరణకు ఏవిధంగా పోరాడామో ఇప్పుడూ అదేవిధంగా పోరాటానికి సిద్ధం కావాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఒకవేళ ప్రభుత్వం దిగొచ్చి భూ సేకరణ నోటిఫికేషన్ వెనక్కి తీసుకుంటే... చర్చించి ఏ విధంగా అభివృద్ధి చేస్తారో, రైతులకు ఎలా న్యాయం చేస్తారో అడగడానికి సిద్ధంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఉండవల్లిలోని పంట పొలాల్లో నుంచి వచ్చే సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూమిని ప్రభుత్వానికి భూ సమీకరణకు ఇచ్చేందుకు గతంలో కొంత మంది రైతులు 9.3 పత్రాలను అందజేశారు. ప్రస్తుతం రోడ్డు నిర్మాణానికి పోను మిగిలిన భూములకు కూడా భూ సేకరణ నోటిఫికేషన్ ఇస్తారని తెలియడంతో వారు తీవ్రంగా వ్యతిరేకిస్తూ అవసరమైతే కోర్టుల ద్వారా 9.3 పత్రాలను వెనక్కి తీసుకుంటామని తెలిపారు. ఉండవల్లిలో భూ సమీకరణకు భూములు ఇచ్చిన రైతులకు ఉండవల్లి రేగడ పొలాన ప్లాట్లు కేటాయించారు. ఆ ప్లాట్లకు సీడ్ యాక్సెస్ రోడ్కి, పాత జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ రోడ్ల నిర్మాణం చేపట్టే ఆలోచనలో ప్రభుత్వం, సీఆర్డీఏ ఉందని, మొట్టమొదటగా గుంటూరు చానల్ ఒడ్డున సీడ్ యాక్సెస్ నుంచి మాతాశ్రీ ఆశ్రమం వరకు 160 మీటర్ల రోడ్డు నిర్మాణానికి 34 ఎకరాల రైతులకు భూ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చారు. త్వరలోనే కొండవీటి వాగు ఎత్తిపోతల పథకానికి, కొండవీటి వాగు వెడల్పుకు, ఉండవల్లి – అమరావతి రోడ్డు నుంచి నాయుళ్ల రామమందిరం, రెడ్ల రామమందిరం మీదుగా ఉండవల్లి దళితవాడ వరకు... అక్కడి నుంచి నులకపేట ఫైరింగ్ స్టేషన్ మరోవైపు పెనుమాక నుంచి సొరంగం ఏర్పాటు చేసి ఉండవల్లి కరకట్ట వైపు కూడా రోడ్ల నిర్మాణానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వీటన్నింటికి విడివిడిగా భూ సేకరణకు, ఇళ్లను తొలగించేందుకు నోటిఫికేషన్ త్వరలో ఇస్తారని, మనందరం ఐక్యంగా పోరాటం చేసి ప్రభుత్వం చర్చలకు వచ్చేవిధంగా నిలబడాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం నాయకులు దొంతిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రైతులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. లేని పక్షంలో కలిసొచ్చే పార్టీలతో రైతులకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తామని హెచ్చరించారు. -
కూరగాయాలు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూరగాయ రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ఆరుగాలం శ్రమించి అప్పులతో సాగుచేసి పండించిన పంటను మార్కెట్కు తీసుకెళ్తే కన్నీళ్లే మిగులుతున్నాయి. మార్కెట్లో ఏ కూరగాయ ధర చూసినా కిలో రూ.40 తక్కువ లేదు. కానీ, అందులో పదో వంతు కూడా రైతుకు దక్కడంలేదు. ఎంతో కష్టపడి సాగుచేసిన పంటలు చేతికొచ్చే సమయానికి వాటి ధరలు తగ్గిపోవడం, రెక్కలు ముక్కలు చేసుకుని చేసిన కష్టం దళారీల పాలవుతుండడంతో చివరకు పెట్టుబడి కూడా చేతికి అందక రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. రైతు కష్టం దళారీల పాలు.. రాష్ట్రంలో ప్రధానంగా కృష్ణా, గోదావరి లంక గ్రామాలతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో బోర్ల కింద అధిక సంఖ్యలో రైతులు కూరగాయ పంటలను సాగుచేస్తున్నారు. రాయలసీమ (కర్నూలు, నంద్యాల, అనంతపురం) ఉల్లి సాగుకు పెట్టింది పేరు. కర్నూలు జిల్లా అయితే ఇక్కడ నిల్వ సౌకర్యాలు లేకపోవడంతో పంట కోసిన వెంటనే అయిన కాడికి తెగనమ్ముకోవాల్సిన దుస్థితి. ఇక చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో టమాటా రైతులు పండించిన పంటను రోడ్లపై పారబోస్తున్నారు. కోస్తాంధ్ర (ప్రకాశం, పల్నాడు, గుంటూరు)లో దోస, వంకాయ, బెండ సాగుతో రైతులు కుదేలవుతున్నారు. ప్రకాశం జిల్లాలో నీటి ఎద్దడిని తట్టుకుని, ట్యాంకర్లతో నీరుపోసి పండించిన దోసకాయను కిలో రూపాయికి కూడా కొనేవారు కనిపించడంలేదు. కోస్తా – ఉత్తరాంధ్రలో కాకర, బీర వంటి తీగజాతి పంటలకు పందిరి పెట్టుబడి ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఉల్లి, టమాటా రైతుల పరిస్థితి దారుణం.. ముఖ్యంగా.. ఉల్లి రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున పంట మార్కెట్లోకి రావడంతో ఎగుమతుల్లేక ఉల్లి పంటను కొనేవారు కరువయ్యారు. నాణ్యమైన ఉల్లికి సైతం క్వింటా రూ.300–రూ.400కు మించి ధర దక్కడంలేదు. కూరగాయల రైతుల పరిస్థితి కూడా ఇంతే. రెండునెలల కిందట కిలో టమాట రూ.50 వరకు పలకగా.. నేడు రూ.3–4 కు దిగజారింది. వాటిని కోయడానికి కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో వందలాది మంది రైతులు టమాటా పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు ఏటా 30 శాతం చొప్పున పెరుగుతున్నా, ప్రభుత్వం మాత్రం సబ్సిడీలు ఏమాత్రం పెంచలేదు. పైగా.. రెండేళ్లుగా రైతులకు సబ్సిడీ విడుదల చేస్తున్న దాఖలాల్లేవు. మరోవైపు కూలీల రేట్లు (మగ కూలీ రూ.600, ఆడ కూలీ రూ.400), డీజిల్ ధరలు, విత్తన ధరలు తడిసిమోపడవుతున్నాయి. ఏ కూరగాయ ధర చూసినా గుండె గుబులే.. ఏ కూరగాయ ధర చూసినా రైతు గుండెలు బాదుకుంటున్నాడు. దోసకాయల బస్తా ధర మూడు నెలల కిందట రూ.రెండున్నర వేలు ఉండగా, ప్రస్తుతం రూ.రెండు వందలకు కూడా కొనేవారు లేరు. క్యాబేజీ నెల క్రితం కిలో రూ.40లకు పైగా ఉండగా నేడు కిలో రూ.4–6కు పడిపోయింది. బెండ, వంకాయలు కిలో రూ.8–10.. కాకర, పెద్ద చిక్కుళ్లు కిలో రూ.15–20లు మాత్రమే పలుకుతున్నాయి. తక్కువ వ్యవధిలో పంట చేతికొస్తోందని, సాగుకు నీరులేకపోయినా రూ.లక్షలు వెచి్చంచి బోర్లు వేసి కూరగాయల పంటలు సాగుచేస్తే చివరికి పెట్టుబడి కూడా రాక నష్టాలపాలై అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. పత్తా లేని ప్రభుత్వం.. ఇక ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ‘ధర స్థిరీకరణ నిధి’ ఎక్కడా అమలుకాకపోవడంతో దళారుల చేతిలో రైతులు నిలువు దోపిడీకి గురవు తున్నారు. ధరలు పతనమైనప్పుడు ప్రభుత్వం మార్కెట్లోకి వచ్చి కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. టమాటా, ఉల్లి వంటి పంటలను కొనేవారులేక చేలల్లో, రోడ్లపక్క పంటను పారబోస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. దళారీలు, వ్యాపారులు సిండికేట్గా మారి రైతును దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఉల్లి, టమాటా వంటి పంటలకు గిట్టుబాటు ధర కలి్పంచకపోతే, వచ్చే ఏడాది సాగుచేసే వారు కరువయ్యే ప్రమాదం ఉంది.కూరగాయల సాగుతో తీవ్ర నష్టాలు మూడెకరాల్లో టమోటా సాగుచేశా. ధర లేకపోవడంతో తీసేశా. ప్రస్తుతం నాలుగెకరాల్లో ఉల్లి పంట, ఎకరాలో వంకాయ, రెండెకరాల్లో బెండ సాగుచేశా. ఉల్లి కొనేవారు లేరు. కూరగాయలకు మార్కెట్లో కనీస ధరలేక ఆర్థికంగా నష్టపోతున్నా. టమోటా ఎకరాకు రూ.60 వేల చొప్పున రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టి నష్టపోయా. ఎకరాకు రూ.లక్ష చొప్పున నాలుగెకరాల్లో ఉల్లి పెట్టుబడి నష్టపోయా. బెండ ఎకరాలో రూ.40వేలు.. వంకాయ ఎకరాకు రూ.60 వేల వరకు పెట్టుబడి పెట్టా. కానీ, ఏ ఒక్క పంటకూ పెట్టుబడి దక్కలేదు. – ఆంజనేయులు, ప్యాలకుర్తి గ్రామం, కోడుమూరు మండలం, కర్నూలు జిల్లా -
చంద్రబాబు సర్కారుకు అమరావతి రైతుల అల్టిమేటం
సాక్షి,అమరావతి: చంద్రబాబు సర్కారుకు అమరావతి రైతులు అల్టిమేటం జారీ చేశారు. తమ భూములకు సరైన పరిహారం చెల్లించకపోతే ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని తెలిపారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంపై రైతులు ఆందోళన బాట పట్టారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండల రైతులు పుల్లడిగుంట హైవే వద్ద భూములు కోల్పోతున్నామని ఆందోళన చేపట్టారు. సజావుగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్ 2017లో సరిగా ఉండగా.. 2025-26 మ్యాప్ అలైన్మెంట్లో మార్పులు జరిగాయని రైతులు ఆరోపిస్తున్నారు. రోడ్డుకు మలుపు తిప్పడం వల్ల తమ భూములు ప్రభావితమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాల్లో కూడా 140 మీటర్ల వెడల్పు రోడ్లు లేవని రైతులు వాదిస్తున్నారు. తమ భూములకు సరైన పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు. -
విజేతలు రైతమ్మలు..
మహిళా రైతులకు వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యాన్ని సమర్థవంతంగా, సుస్థిరంగా పెంపొందించే పద్ధతులపై అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఆర్ఆర్ఐ) పరిశోధకుల బృందం అధ్యయనం నిర్వహించింది. ఫ్రాంటియర్స్ ఇన్ సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్స్ పత్రికలో ఇటీవల ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం, మన మహిళా రైతులు నిజమైన వాతావరణ మార్పులను తట్టుకునే శక్తియుక్తులను పెంపొందించుకోవాలంటే వారికి ఏవో కొన్ని సాంకేతికతలను ఉన్నత స్థాయి నుంచి అందించటం ఒక్కటే సరిపోదు. వారికి సాంకేతిక, సామాజిక, సంస్థాగత మద్దతును వ్యూహాత్మకంగా సమన్వయం చేసి అందించాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనంలో తేలింది. భారత దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో విభిన్న కేస్ స్టడీలను ఐఆర్ఆర్ఐ విశ్లేషించి ఈ విషయాన్ని నిర్థారించింది. ఆ వివరాలు చూద్దాం...వాతావరణ సంక్షోభం దక్షిణాసియా దేశాల్లో వ్యవసాయం చేసే కోట్లాది మంది మహిళలను కూడా ప్రభావితం చేస్తోంది. వ్యవసాయ రంగంలో అహరహం శ్రమించటంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, మహిళా రైతులు అడుగడుగునా ‘లింగ–వివక్ష’ను ఎదుర్కొంటున్నారు. వారు అధిగమించాల్సిన సామాజిక అడ్డంకులను పరిగణనలోకి తీసుకోకుండా, వారికి కొత్త సాంకేతికతతో కూడిన పనిముట్లను అందించటం వల్ల ప్రయోజనం ఉండటం లేదని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఆర్ఆర్ఐ) పరిశోధకుల బృందం నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. ఫ్రాంటియర్స్ ఇన్ సస్టయినబుల్ ఫుడ్ సిస్టమ్స్ పత్రికలో ఇటీవల ప్రచురించిన కొత్త అధ్యయనం ప్రకారం.. వాతావరణ మార్పులను తట్టుకునేందుకు నిజంగా ఉపయోగపడే సామర్థ్యాలను మనం పెంపొందించుకోవాలంటే, విడివిడి సాంకేతికతలను అందించడం ఆపి, అనేక ఆవిష్కరణలను కలిపి గంపగుత్తగా అందించడం ప్రారంభించాలి. ఎక్కడో ఉండే నిపుణులు తమకు తోచినట్లు సిద్ధం చేసిన సాంకేతికతను రైతుకు బదిలీ చేసే సాంప్రదాయ అధికార కేంద్రీకృత వ్యవసాయ విస్తరణ నమూనా మహిళా రైతుల విషయంలో విఫలమవుతోందని ఈ పరిశోధన తేల్చింది. దానికి బదులుగా, సామాజిక పరిస్థితులు, అవసరాల ఆధారిత సాంకేతిక విధానాన్ని అమలు చెయ్యాలని సూచించింది. అంటే, విత్తనం లేదా ట్రాక్టర్ కేవలం మహిళా రైతులకు, పురుష రైతులకు ఒకేలా ఉపయోగపడే ఒక తటస్థ సాంకేతికత కాదని గుర్తించడం.. సామాజిక సంబంధాలు, సాంస్కృతిక నియమాలు, ఆ సమాజంలోని సంస్థాగత అధికార స్థితిగతులపై దాని విజయం ఆధారపడి ఉంటుందని గుర్తించటం అవసరమని అధ్యయనం పేర్కొంది. ఈ భావనను నిరూపించడానికి అధ్యయనంలో భాగంగా ఐఆర్ఆర్ఐ పరిశోధకులు భారతదేశవ్యాప్తంగా నాలుగు విభిన్న కేస్ స్టడీలను విశ్లేషించారు. సాంకేతిక, సామాజిక, సంస్థాగత మద్దతును వ్యూహాత్మకంగా సమన్వయం చేయడం ద్వారా మహిళా రైతులు వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం వైపు సమర్థవంతంగా, సుస్థిరంగా ఎలా మారగలరో ఈ అధ్యయనం వెల్లడించింది. విజ్ఞాన శాస్త్రం, భూ హక్కులపై అవగాహనతో చౌడుపై పోరాటంగుజరాత్లోని భావనగర్ ఉప్పునీటి చిత్తడి నేలల్లో పర్యావరణ ఒత్తిళ్లు, సామాజిక అసమానతలు విడదీయరానివని ఉత్థాన్ అనే సంస్థ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్ ట్రస్ట్ నిర్వహించిన ఒక అధ్యయనం ద్వారా) గుర్తించింది. ఈ ప్రాంతంలోని మహిళలు నేల లవణీయతతోను, చట్టపరమైన భూమి హక్కుల లేమితో కూడా పోరాడుతున్నారు. భూమి హక్కులు లేకపోవడంతో వారు ప్రభుత్వ రుణాలను లేదా దీర్ఘకాలిక వ్యవసాయ వనరులను సులభంగా పొందలేకపోతున్నారు. ఉత్థాన్ రూపొందించిన నూతన ఆవిష్కరణల ప్యాకేజీ ప్రత్యేకమైనది. ఇది నేల పరీక్ష, సేంద్రియ ఎరువులు వంటి సుస్థిర వ్యవసాయ పద్ధతులను, సామాజిక–చట్టపరమైన సాధికారతతో జత చేసింది. బ్లాక్–స్థాయి రెవెన్యూ కార్యాలయాల్లో పనులు చక్కబెట్టేందుకు తోడ్పడే ‘కృషి సఖు’లు (మహిళా సామాజిక రిసోర్స్ పర్సన్లు), పారాలీగల్ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. పారాలీగల్ కార్యకర్తలు భూమి రిజిస్ట్రేషన్కు సంబంధించిన చిక్కుముడులను అధిగమించడంలో మహిళా రైతులకు సహాయపడ్డారు. కృషి సఖులు ప్రామాణిక పంటల సాగు పద్ధతులన్నిటినీ బోధించారు. ఈ విధానం ఒక ‘సోదరభావాన్ని‘ సృష్టించింది. దీనిలో మహిళలు తమ తోటివారి నుంచి నేర్చుకున్నారు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని మాత్రమే కాదు, వారిపై వారి భర్తలకున్న విశ్వసనీయతను గణనీయంగా పెంచింది.ఆవాల కోసం అనుభవజ్ఞానాన్ని, మార్కెట్లను నిర్మించటంఉత్తర ప్రదేశ్లోని ఉత్తర మైదాన ప్రాంతాల్లో గ్రామీణ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (జీఎఫ్ఐ) నీటి ఒత్తిడిని తట్టుకునే, పోషకాలు అధికంగా కలిగి ఉండే ‘పూసా మస్టర్డ్ 30’ అనే బయోఫోర్టిఫైడ్ ఆవాలు రకాన్ని ప్రవేశపెట్టింది. అయితే, ఒక మహిళ తన పంటను సరసమైన ధరకు అమ్ముకోవడానికి మార్గం లేనప్పుడు, కేవలం మెరుగైన విత్తనాన్ని అందించడం నిరుపయోగమని పరిశోధకులు పేర్కొన్నారు. జీఎఫ్ఐ ఈ లోపాన్ని అధిగమించే ప్రయత్నం చేసింది. ఈ విత్తనాలతో పాటు ఇతర ఆవిష్కరణల ప్యాకేజీని కలిపి అందించటంపై దృష్టి సారించింది. వారు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్పీఓలు), స్వయం సహాయక బృందాల(ఎస్హెచ్జీల) ద్వారా మార్కెట్ అనుసంధానాలతోపాటు సాంకేతిక శిక్షణ ఇప్పించారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి అవగాహన పర్యటనలను నిర్వహించడం ద్వారా, వారు శాస్త్రీయ నైపుణ్యాన్ని రైతులు అందరికీ అందుబాటులోకి తెచ్చారు. తద్వారా మహిళా రైతులు నిపుణులతో నేరుగా సంభాషించడానికి వీలు కలిగింది. ఈ మార్కెట్ అనుసంధానాలను కొనసాగించడంలో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ.. ఎఫ్పీఓలు, ఎస్హెచ్జీల ద్వారా ఏర్పడిన సామూహిక భాగస్వామ్యం మహిళా రైతులకు బలాన్నిచ్చింది. మహిళలు తమ ఇళ్లలో, సమాజాలలో తమ అభిప్రాయాలను మరింత స్పష్టంగా వ్యక్తపరచడానికి ఈ సాధికారత సహాయపడింది.ముందడుగు ఎలా?మహిళా రైతుల సాధికారత కృషిలో సజావుగా ముందుకు సాగాలంటే మనం తప్పక చేయవలసినవి ఇవేనని ఐఆర్ఆర్ఐ పరిశోధకులు నొక్కి చెబుతున్నారు: ఎంత సమయం?: అమల్లోకి తెచ్చే సేంద్రియ వ్యవసాయం వంటి నూతన వ్యవసాయ సాంకేతికతలు ఒక మహిళా రైతు వెచ్చించే సమయాన్ని, శ్రమను ఎలా ప్రభావితం చేస్తాయో క్రమపద్ధతిలో అంచనా వేయాలి. అందరికీ భాగస్వామ్యం: ఇంటి బాధ్యతలను పునఃపంపిణీ చేయడానికి పురుషులను భాగస్వాములను చేసే లింగ పరివర్తన విధానాలను అవలంబించాలి. వ్యవస్థకు మద్దతు: భూమి హక్కులు, మార్కెట్ అందుబాటు, స్వయం సహాయక బృందాలు వంటి సామూహిక వేదికలలో సాంకేతికత వేరూనుకునేలా చెయ్యాలి. సాంకేతిక, సంస్థాగత అంశాలతో సామాజిక అంశాలను అనుసంధానించడం ద్వారా, తదుపరి తరం వాతావరణ అనుకూల వ్యవసాయానికి సంబంధించిన ఆధునిక సాధనాలు కేవలం ఒక షెడ్డుకే పరిమితం కాకుండా, ప్రపంచ ఆహార భద్రతకు వెన్నెముక అయిన మహిళలకు వాస్తవంగా సాధికారత కల్పించేలా నిర్థారణగా చెయ్యొచ్చు. పరిశోధకులు చెప్పినట్లుగా, ‘వ్యవస్థాగత ఏర్పాట్లు (సంస్థలు, పంపిణీ యంత్రాంగాలు, ప్రోత్సాహకాలు), సామాజిక సంబంధాలు (నియమాలు, గుర్తింపులు, శ్రమ పంపిణీ, సామాజిక అభ్యసనం) ఏకకాలంలో రూపాంతరం చెందినప్పుడు మాత్రమే సుస్థిరమైన ఆవిష్కరణ ఆవిర్భవిస్తుంది’. తోటివారి నుంచి నేర్చుకోవటం ఐఆర్ఆర్ఐ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనంలో వెల్లడైన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, తోటి వారి నుంచి నేర్చుకోవడం ఎంత ప్రభావవంతంగా ఉందో తేలింది. అన్ని సందర్భాల్లోనూ, తమలాంటి వారు విజయం సాధించడాన్ని చూసినప్పుడు రైతులు ఆ కొత్త సాంకేతికతలను స్వీకరించడానికి ఎక్కువ మొగ్గు చూపారు. గుజరాత్లో తమ భార్యలైన మహిళా రైతులు అమలు చేసిన ప్రత్యేక సాగు పద్ధతుల వల్ల కలిగిన స్పష్టమైన ఫలితాలను కళ్లారా చూసిన పురుషులు, తొలుత సందేహాలు లేవనెత్తినా, చివరికి వారికి మద్దతుగా నిలిచారు. ఒకప్పుడు తాను పాల్గొనే సమావేశాలను పట్టించుకోని తన భర్త, చివరికి ఆమెతో ‘ఇంటి పనుల గురించి చింతించకు.. నీ సమావేశంపై దృష్టి పెట్టు’ అని చెప్పినట్లు ఒక మహిళా రైతు సంబరంగా గుర్తుచేసుకుంది. నమ్మకాన్ని పెంపొందించటం, సామూహిక కార్యాచరణ, నాయకత్వ శిక్షణ వంటి సామాజిక మద్దతు వల్లనే ఈ సాంకేతికతలు వేళ్లూనుకోవడానికి దోహదపడింది. భవిష్యత్తు వైపు చూస్తూ...వాతావరణ మార్పులను దీటుగా తట్టుకొని నిలిచే ‘క్లైమేట్ స్మార్ట్’ వ్యవసాయం నిజంగా ‘స్మార్ట్’గా ఉండాలంటే, దానిని స్థానిక సమాజంతో కలిసి ఏమేమి చెయ్యాల్లో ప్రణాళికను రూపొందించాల్సి ఉంటుందని ఈ అధ్యయనం నిర్ధారించింది. దీనికి కేవలం సాంకేతికతను బదిలీ చేసి చేతులు దులుపుకోవటం నుండి, మహిళల అనుభవాలను పరిగణనలోకి తీసుకునే సహాయక వ్యవస్థలను జోడించడం వైపు మార్పు రావటం అవసరం.విభిన్న పంటల సాగు నిర్ణయాలుమహారాష్ట్రలోని ధరాశివ్ కరువు ప్రాంతంలో స్వయం శిక్షణ ప్రయోగ (ఎస్ఎస్పీ) స్వచ్ఛంద సంస్థ మహిళల నేతృత్వంలో వాతావరణ మార్పులను ఎదుర్కొని నిలిచే వ్యవసాయ నమూనా పద్ధతులను అమలు చేయించింది. ఈ ప్రాజెక్ట్ విప్లవాత్మకమైనది. ఎందుకంటే ఇది అధిక పెట్టుబడి అవసరమయ్యే వాణిజ్య పంటల నుంచి రైతుల దృష్టిని ఉద్దేశపూర్వకంగా మళ్లించింది. తక్కువ నీటి వినియోగానికి సంబంధించి స్థానికంగా అమల్లో ఉన్న పద్ధతులను ఉపయోగించి చిరుధాన్యాలు, కూరగాయల వంటి వైవిధ్యభరితమైన ఆహార పంటల వైపు మళ్లించింది. మహిళా రైతులకు రైతుగా ఉండాల్సిన మౌలిక గుర్తింపు సమస్యను పరిష్కరించేందుకు ఈ సంస్థ కృషి చేసింది. మహిళలను వ్యవసాయ నిర్ణయాలు తీసుకునే ప్రాథమిక నిర్ణయాధికారులుగా, ఆవిష్కర్తలుగా నిలబెట్టింది. కేవలం కూలీలుగా మిగిలిపోయిన వారిని వ్యవసాయంలో తమకు నచ్చిన నిర్ణయాలు తీసుకునే మహిళా రైతు నాయకులుగా మారడానికి సహాయపడింది. నాయకత్వ శిక్షణ ఇచ్చారు. సూక్ష్మ పెట్టుబడుల కోసం కమ్యూనిటీ రిసైలియన్స్ ఫండ్ ఏర్పాటు జరిగాయి. రైతులు –స్థానిక ప్రభుత్వ అధికారుల మధ్య సమాచార మార్పిడిని సులభతరం చేసేందుకు మహిళా కృషి సంవాద్ సహాయకుల(కేఎస్ఎస్ల)ను నియమించారు. ఫలితాలు స్పష్టంగా కనిపించాయి. మహిళలు ఆహార పంటల ఉత్పాదకతలో 10–15% పెరుగుదల సాధించారు. దీనితో పాటు మహిళా రైతు కుటుంబాల నెలవారీ పొదుపు బాగా పెరిగింది. ఇది ఇంట్లో వారి మధ్య సంబంధాలను మార్చివేసింది. పురుషులు తమ భార్యలను తమతో పాటు సమాన భాగస్వాములుగా గుర్తించటం ప్రారంభించారు.సమ్మిళిత శిక్షణా విధానంపశ్చిమ బెంగాల్లోని తూర్పు గంగా మైదాన ప్రాంతంలో పనిచేసే సత్మిలే సతీష్ క్లబ్ ఓ పాతాగర్ (ఎస్ఎస్సీఓపీ) స్వచ్ఛంద సంస్థ ప్రకృతికి అనుగుణమైన వ్యవసాయం అమలులో ఎదురవుతున్న సాంకేతిక అడ్డంకులపై దృష్టి సారించింది. సుస్థిర వ్యవసాయం, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ వ్యవస్థ సాంద్రతీకరణ (ఎస్ఆర్ఎఫ్ఎస్ఐ) ప్రాజెక్ట్ను చేపట్టింది. దుక్కి చెయ్యకుండా వ్యవసాయం చెయ్యటం, యంత్రంతో వరి నాట్లు, బహుళ పంటల విత్తనాలను విత్తే పరికరాలను వాడటం వంటి అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలను ప్రవేశపెట్టింది. ఈ ప్రాజెక్ట్ ప్రారంభంలో మహిళా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్కువ దృష్టి పెట్టినప్పటికీ, దీనిలోని ఆడా మగా తేగా లేకుండా రైతులందరికీ శిక్షణ ఇచ్చే సమ్మిళిత శిక్షణా విధానం ఉపయోగపడింది. సాధారణంగా పురుషుల ఆధిపత్యం ఉండే భారీ యంత్రాలు వంటి రంగాలలోకి మహిళా రైతులు ప్రవేశించడానికి వీలు కల్పించింది. రైతులు తాము కొనుగోలు చేయలేని ఖరీదైన పరికరాలను అద్దెకు తీసుకునేందుకు వీలు కల్పించే కస్టమ్–హైరింగ్ కేంద్రాల వ్యాపార కార్యకలాపాలపై, ఎరువులను సమర్థవంతంగా వాడటం, నీటిపారుదలలో మెళకువలపై శిక్షణ ఇచ్చారు. పురుషులు ఎక్కువగా దృష్టి సారించే ఇటువంటి సాంకేతికతలలో మహిళలకు శిక్షణ ఇచ్చినప్పుడు, వారు సమాజంలో ఆదర్శప్రాయులుగా గుర్తింపు పొందారు. ఈ మహిళల్లో 80% కంటే ఎక్కువ మంది ఏయే రకాల పంటలు సాగు చెయ్యాలనే నిర్ణయాలలో తమ ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పారు.ఏవో కొన్ని సాంకేతికతలను పై నుంచి అందించటం ఒక్కటే సరిపోదువారితో కలిసి పనిచేస్తూ వారికి అవసరమైన నైపుణ్యాలను అందించాలిసాంకేతిక, సామాజిక, సంస్థాగత మద్దతును సమన్వయంతో అందిస్తే అద్భుత ఫలితాలు వస్తాయి∙4 రాష్ట్రాల్లో అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఆర్ఆర్ఐ) జరిపిన అధ్యయనంలో వెల్లడిపొంచి ఉన్న ప్రమాదాలుమహిళా రైతుల సాధికారతలో ఈ విజయాలు సాధించినప్పటికీ, రకరకాల వ్యవసాయ సాంకేతికతలతో కూడిన ప్యాకేజీలను అమలు చేసిన విధానంలో ఐఆర్ఆర్ఐ పరిశోధకులు అనేక లోపాలను గుర్తించారు. ఈ ప్యాకేజీల ఏర్పాటు ఉద్దేశపూర్వకంగా కాకుండా తాత్కాలికంగా జరిగింది. సంస్థలు మొదట సాంకేతికతపై దృష్టి సారించాయి. అక్కడి రైతుల్లో సామాజిక మద్దతు పొందటాన్ని రెండో ప్రాధాన్యత గల ఆలోచనగా పరిగణించాయి. చదవండి: జీవన ఎరువులతో సేద్యానికి జీవంవేతనం లేని సంరక్షణ పనుల భారం ఒక ప్రధాన ఆందోళన. మహిళా సాధికారత లక్ష్యంగా చేపట్టిన 60 శాతం ప్రాజెక్టుల వల్ల మహిళా రైతులకు కొత్త బాధ్యతలను జోడించడం ద్వారా వాస్తవానికి వారి పని–జీవిత సమతుల్యతను మరింత దిగజార్చాయని ఈ అధ్యయనంలో తేలింది. ఉదాహరణకు.. గుజరాత్లో కనిపించే సేంద్రియ వ్యవసాయం వాతావరణానికి అనుకూలమైనదే అయినప్పటికీ, జీవన ఎరువులు, వర్మీకంపోస్ట్ తయారీకి అధిక శ్రమ అవసరం. అప్పటికే ఇంటి పనులు, పిల్లల సంరక్షణ చూసుకుంటున్న మహిళలపై ఈ ఎరువుల తయారీ పనులు మరింత భారాన్ని మోపుతుంది. అంతేకాకుండా, అంతర్లీనంగా ఉన్న పురుషాధికార నిర్మాణాలను పరిష్కరించకుండా, మహిళా రైతులకు పనులు పెంచే ఉపరితల ప్రయత్నాల వల్ల వారిని మరింత కృంగదీయటానికి దారితీసే ప్రమాదాన్ని ఈ అధ్యయనం ఎత్తి చూపింది. అనేక సందర్భాల్లో (ఎస్ఎస్పీ మినహా) పురుషులతో సంప్రదింపులు కొరవడ్డాయి. భర్తలు, కమ్యూనిటీ నాయకులు ఈ సంభాషణలో పాలుపంచుకోకపోతే, మహిళలు ఇంటా బయటా వారి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి రావచ్చు లేదా ఇంటి పనులు చేసుకుంటూ ఇంట్లోనే ఉండిపోవడం వల్ల శిక్షణలో పాల్గొనలేకపోవచ్చు.– పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
బహిరంగ సభలో బిగ్ షాక్ అచ్చెన్నాయుడుకి నిరసన సెగ..
-
నకిలీ విత్తు.. రైతు చిత్తు
సాక్షి, అమరావతి/ఏ.కొండూరు: రాష్ట్రంలో నకిలీ, నాసి విత్తన మాఫియా రాజ్యమేలుతోంది. నాసి, నకిలీ విత్తనాల బారినపడి వేలాదిమంది రైతులు రూ.కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. గత 22 నెలల్లో వరుసగా మిరప, పత్తి, ఉల్లి, టమాటా, వరి రైతులు ఈ నకిలీ విత్తన ఉచ్చులోపడి నష్టపోగా, తాజాగా ప్రస్తుత రబీ సీజన్లో మొక్కజొన్న రైతులు ప్రైవేటు కంపెనీల నకిలీ విత్తన కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. మరోవైపు మార్కెట్లో ధరల్లేక తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలాంటి ఘటనల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో విత్తనచట్టం అక్రమార్కులకు చుట్టం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత విత్తనచట్టం అక్రమార్కులకు చుట్టంగా మారిపోయింది. జిల్లాస్థాయి టాస్్కఫోర్స్ కమిటీలు చేవలేని కమిటీలుగా మారిపోయాయి. విత్తన కంపెనీల నుంచి నెలవారీ మామూళ్లకు అలవాటుపడిన విజిలెన్స్ అధికారులు చూసీచూడనట్టుగా వదిలేస్తున్నారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో మొక్కుబడి తంతుగా తనిఖీలు నిర్వహిస్తున్నారే తప్ప తీసుకుంటున్న చర్యలు లేవు. రెండేళ్లలో నకిలీ విత్తనాల వల్ల దాదాపు 3 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, సుమారు 35 వేలమంది రైతులు రూ.వెయ్యికోట్లకుపైగా పెట్టుబడి, ఉత్పత్తి నష్టాలను చవిచూసినట్టుగా అంచనా వేస్తున్నారు. ఈ నష్టపోయిన రైతుల్లో పదిశాతం మందికి కూడా పరిహారం అందిన దాఖలాల్లేవు. బిల్లులున్న వారికి సైతం అరకొరగానే పరిహారం ఇస్తున్నా.. ఇదేమిటని ప్రశ్నించేవారు లేరు. ఇలా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరఫున పరిహారం అన్నమాటే లేదు. రాష్ట్ర రైతులను ముంచేస్తున్న నకిలీ విత్తనాల్లో 90 శాతం హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్న కంపెనీలకు చెందినవే కావడంతో నేరుగా చర్యలు తీసుకునే పరిస్థితి కనిపించడంలేదు. మరోవైపు పంట దెబ్బతిన్న తర్వాత విత్తన నమూనాలను ల్యాబ్లకు పంపితే రిపోర్టు వచ్చేసరికి సీజన్ ముగిసిపోతోంది. ఈలోగా ఏజెంట్లు పత్తా లేకుండా పోతున్నారు. గింజ కట్టక..కండె నిలవక కర్నూలు, అనంతపురం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పత్తి రైతులు, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో ఉల్లి, టమాటా రైతులు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో వరి రైతులు నకిలీ విత్తనాలతో నష్టపోయారు. తాజాగా ప్రస్తుత రబీ సీజన్లో ఎన్టీఆర్, మార్కాపురం, పార్వతీపురం మన్యం, వైఎస్సార్ కడప జిల్లాల్లో వందలాది ఎకరాల్లో మొక్కజొన్న రైతులు నకిలీ విత్తనాలతో లక్షల రూపాయలు పెట్టుబడిని కోల్పోయారు. మార్కాపురం, పెద్దారవీడు మండలాల్లో వైడిపాడు, బొందలపాడు, చట్లమిట్ల, పోతంపల్లి, రాజంపల్లి, మద్దలకట్ట మొక్కజొన్న రైతులు పంట చేతికివచ్చే సమయానికి నకిలీ విత్తనాలతో నష్టపోయామంటూ పోలీసులను ఆశ్రయించారు. ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలంలో రామచంద్రపురం, కోమటికుంట తదితర గ్రామాల్లో నకిలీ విత్తనాల వల్ల నష్టపోయామంటూ వందలమంది రైతులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వైఎస్సార్ కడప జిల్లా సిద్ధవటం మండలం వెంకటాయపల్లె గ్రామంతో పాటు పార్వతీపురం మన్యం కొమరాడ మండలం దలైపేట, తల్లికోట గ్రామాల్లో సైతం నకిలీ విత్తనాల వల్ల వందలాది ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతిందని రైతులు అధికారులకు మొరపెట్టుకున్నారు. ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు పెట్టుబడులు పెట్టామని, తీరా పంట దిగుబడి వచ్చిన తర్వాత పరిశీలిస్తే కండెలకు అసలు గింజలే రాలేదని ఆవేదన చెందుతున్నారు. ఎకరాకు సగటున 50 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని కంపెనీలు చెప్పగా.. కనీసం 10–20 క్వింటాళ్లకు మించి రాలేదని తెలిపారు. కలెక్టర్లకు, వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధిత రైతులు తెలిపారు. ప్రైవేటు విత్తన కంపెనీలపై ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.6 లక్షలకు పైగా పెట్టుబడి కోల్పోయాం నేను, మా బంధువులు కలిసి 12 ఎకరాల్లో టాటా ఎంఎం 9375 హైబ్రీడ్ విత్తనం 10 ప్యాకెట్లు కొనుగోలు చేసి సాగుచేశాం. ఎకరాకు 50 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశ చూపడంతో ప్యాకెట్ రూ.1,950 చొప్పున కొనుగోలు చేశాం. ఎకరాకు కౌలుతో కలిపి రూ.60 వేల పెట్టుబడి పెట్టాం. తీరా పంట చేతికొచ్చే సమయంలో ఒక్క కండెకు కూడా గింజ రాలేదు. తీవ్రంగా నష్టపోయాం. మేమంతా కౌలురైతులమే. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – బండి వెంకటేశ్వరరావు, కోమటికుంట, ఎన్టీఆర్ జిల్లా ఎకరాకు రూ.లక్ష పరిహారం ఇవ్వాలి టాటా కంపెనీకి చెందిన హైబ్రీడ్ మొక్కజొన్న నాసిరకం విత్తనం వల్ల ఎన్టీఆర్ జిల్లాలోని పలు గ్రామాల్లో పెద్దసంఖ్యలో రైతులు నష్టపోయారు. ఎకరాకు 50 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులను నమ్మించి విత్తనాలను విక్రయించారు. ఎకరాకు కనీసం 10–20 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పైగా గింజ కట్టిన కండెలు సైతం నాణ్యత లేకుండా ఉన్నాయి. దీంతో పెట్టుబడితోపాటు ఉత్పత్తి కూడా నష్టపోయాం. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని కంపెనీలద్వారా ఎకరాకు రూ.లక్ష చొప్పున పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. – పి.జమలయ్య, ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలురైతు సంఘం -
బతుకులతో బాబు చధరంగం
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు మోసాలపై మొక్కజొన్న రైతులు కన్నెర్రచేశారు. బూటకపు మాటలు నమ్మి మోసపోయామంటూ రోడ్డెక్కారు. తమ బతుకులతో చంద్రబాబు చదరంగమాడుతున్నారంటూ మండిపడ్డారు. కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్చేశారు. విజయవాడలోని ఏపీ మార్క్ఫెడ్ కార్యాలయాన్ని మంగళవారం మొక్కజొన్న రైతులు ముట్టడించారు. కార్యాలయం ఎదుటే రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. పొగాకు వేయొద్దన్నారని.. మొక్కజొన్న వేశామని తీరా పంట చేతికొచ్చే సమయానికి ధర లేదని, కొనేవారూ లేక తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖల పేరిట కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరకు పంటను కొనాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా రైతులను మభ్యపెట్టే యత్నం చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బాబు అధికారంలోకి వచ్చాక రెండేళ్లుగా ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కడం లేదని వాపోయారు మొక్కజొన్న రైతులు క్వింటాకు రూ.800 నుంచి రూ.1000 చొప్పున ఎకరాకు రూ.25 నుంచి రూ.30వేల వరకు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి.కృష్ణయ్య మాట్లాడుతూ బాబు పాలనలో ఉల్లి మొదలు టమాటా వరకు రైతులందరూ తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.చంద్రబాబు ఎన్నికల ముందు అలవికాని హామీలు ఇచ్చారని, ఆయన మాటలు నమ్మి రైతులు నిండా మునిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ధరల స్థిరీకరణ నిధి ఉన్నట్టా? లేనట్టా అని ప్రశ్నించారు. కనీసం రూ.3వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి మద్దతు ధర దక్కని పంటలను కొనాలని డిమాండ్ చేశారు. దళారుల మాటున కూటమి నేతలే రైతులను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోతే, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆందోళనలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ప్రభాకర్ రెడ్డి, ఏపీæ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు, పలు జిల్లాల రైతు సంఘం నేతలు పాల్గొన్నారు. అనంతరం మార్క్ఫెడ్ జీఎంకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.రూ.1.25 లక్షలు నష్టపోతున్నా ఐదెకరాల్లో మినుము, ఐదెకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల మినుము దిగుబడి రావాల్సి ఉండగా, 3 క్వింటాళ్లకు మించి రాలేదు. మొక్కజొన్న మాత్రం 30 నుంచి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వచి్చంది. మినుము మద్దతు ధర రూ.8,575 కాగా, మార్కెట్లో రూ.7వేలకు మించి కొనేవారు లేరు. క్వింటాకు రూ.1600కుపైగా నష్టపోయాను. మొక్కజొన్న మద్దతు ధర రూ.2400 కాగా, మార్కెట్లో రూ.1500–రూ.1700 మధ్య పలుకుతోంది. దీంతో ఐదెకరాలకు రూ.1.25 లక్షలు నష్టపోతున్నా. – ఎ.రాజశేఖర్, లింగాల, నంద్యాల జిల్లాపెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు ఐదెకరాల్లో మొక్కజొన్న వేశా. ఎకరాకు రూ.50వేలు పెట్టుబడి పెట్టా. ఎకరాకు 30–35 క్వింటాళ్ల మధ్య దిగుబడులొచ్చాయి. మార్కెట్లో క్వింటా రూ.1600 నుంచి రూ.1700 మధ్య కొంటున్నారు. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. – మద్దిరెడ్డి వెంకటరెడ్డి, అనుమల్లంక, గంపలగూడెం, ఎన్టీఆర్ జిల్లా -
ఎరువుల ముందస్తు కొనుగోళ్లపై అప్రమత్తత
రాష్ట్రంలోని సాగు భూముల్లో దుక్కులు దున్నకముందే ఎరువుల విక్రయశాలల వద్ద రైతుల సందడి పెరిగింది. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో ఉండే డిమాండ్ ఈసారి మార్చిలోనే రికార్డు స్థాయికి చేరింది. భవిష్యత్తులో ఎరువుల కొరత ఏర్పడవచ్చనే ఆందోళనతో అన్నదాతలు భారీగా నిల్వలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ గణంకాల ప్రకారం.. మార్చి 23 నాటికే దేశవ్యాప్తంగా ఎరువుల విక్రయాలు అంచనాలను మించిపోవడం గమనార్హం.గణాంకాలు ఏం చెబుతున్నాయి?ఎరువుమార్చి అంచనా డిమాండ్ (లక్షల టన్నుల్లో)మార్చి 23 నాటికే జరిగిన విక్రయాలుయూరియా14.9620.21డీఏపీ2.434.78కాంప్లెక్స్ ఎరువులు7.057.22ఎంఓపీ1.801.58 గత ఏడాది (2025) మార్చి నెల మొత్తం మీద జరిగిన యూరియా విక్రయాలు 16.2 లక్షల టన్నులు కాగా, ఈ ఏడాది మార్చి 23 నాటికే అది 20 లక్షల టన్నులు దాటడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కేవలం మార్చి 14 నుంచి 23 మధ్య పది రోజుల్లోనే సుమారు 13 లక్షల టన్నుల యూరియా అమ్ముడైంది.తెలుగు రాష్ట్రాల్లో నిల్వ ధోరణితెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో ఈ అసాధారణ డిమాండ్ కనిపిస్తోంది. జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే వరి సాగు కోసం రైతులు ముందస్తుగానే ఎరువులను నిల్వ చేసుకుంటున్నారు. ఏటా సీజన్ సమయంలో ఎదురవుతున్న కొరతను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందుగానే కొనుగోలు చేస్తున్నట్లు వ్యవసాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘ముఖ్యంగా తక్కువ ధర ఉండే ఎరువులు, గతంలో కొరత ఏర్పడిన వాటిపై రైతులు మక్కువ చూపుతున్నారు. జూన్ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అన్న భయంతోనే ఈ ముందస్తు నిల్వలు జరుగుతున్నాయి’ అని వ్యవసాయ శాస్త్రవేత్త ఏ.కె.సింగ్ అన్నారు.ప్రభుత్వ చర్యలు - క్షేత్రస్థాయి పరిశీలనఈ ఆకస్మిక విక్రయాల పెరుగుదలపై ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ దేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయని భరోసా ఇస్తోంది. అయితే, పెరిగిన విక్రయాల వెనుక ఉన్న అసలు కారణాలను తెలుసుకోవాలని అధికారులను ఆదేశించింది.స్టాక్ వెరిఫికేషన్క్షేత్రస్థాయిలో ఎరువుల నిల్వలపై భౌతిక తనిఖీలు చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. నిజంగా రైతులే కొంటున్నారా? లేక వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడానికి రికార్డుల్లో విక్రయాలు చూపి నిల్వ చేస్తున్నారా? అనే కోణంలో విచారణ జరపాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో కొంతమేరకు మొక్కజొన్న, చెరకు పంటల కోసం విక్రయాలు పెరిగినట్లు అధికారులు గుర్తించారు.ఇదీ చదవండి: అత్తమామల పోషణ కోడలి బాధ్యత కాదు: హైకోర్టు -
కనీసం పెట్టుబడులు కూడా రావడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి
-
దిగజారిన వేరుశనగ ధర
సాక్షి, అమరావతి: వేరుశనగ పంట చేతికొచ్చేవేళ పతనమైన ధరలను చూసి రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం నుంచి అనుమతుల్లేవనే సాకుతో కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు కూడా ముందుకు రావడం లేదు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వేరుశనగ ప్ర«ధానంగా ఖరీఫ్ పంట. ఖరీఫ్లో దాదాపు 10 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. ఈ ఏడాది రబీ సీజన్లో 2.27 లక్షల ఎకరాల్లో రైతులు సాగుచేశారు. ఎకరాకు రూ.45 వేలు పెట్టుబడి అవుతోంది. ఎకరాకు 25–30 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి 15–20 క్వింటాళ్లకు మించటంలేదు. ఓ వైపు దిగుబడి తగ్గి ఆవేదన చెందుతున్న రైతులకు పతనమైన ధరలు అశనిపాతంగా మారాయి. క్వింటా వేరుశనగకు కనీస మద్దతు ధర రూ.7,263 కాగా వ్యాపారులు రైతుల వద్ద రూ.3 వేల నుంచి రూ.4 వేల మధ్య కొంటున్నారు. 45 రోజుల కిందట రూ.5,500 వరకు కొన్న వ్యాపారులు, దళారులు ఇప్పుడు బస్తాకు రూ.1,500 నుంచి రూ.2,500 వరకు తగ్గించేశారు. దీంతో రైతులకు ఏంచేయాలో దిక్కుతోచడంలేదు. నాణ్యత లేదనే వంకలతో కోతలుకాయల నాణ్యత బాగున్నా వ్యాపారుల వద్ద కమీషన్ల కోసం దళారులు నాణ్యత అంతంత మాత్రమే అంటూ రైతులను బెదరగొడుతున్నారు. డిమాండ్ ఉన్న సమయంలో నాణ్యత పట్టింపులేని దళారులు, వ్యాపారులు ప్రస్తుతం నాణ్యత, పర్సంటేజీల పేరుతో అడ్డగోలుగా కోతలు పెడుతూ రైతులను నిండా ముంచుతున్నారు. వ్యాపారులు, దళారులు కళ్లాల వద్దకు రాశుల్లో వందగ్రాముల కాయలు తీసుకుని విత్తనాలు తీస్తారు. ఆ విత్తనాలను తూకం వేసి నాణ్యత పర్సంటేజ్ నిర్ధారించి ధర నిర్ణయిస్తారు. కాయలు నాణ్యతగా ఉన్నప్పటికీ ఏదో ఒక వంక చెప్పి ధరలో కోత పెడుతున్నారు.పెట్టుబడులకు తెచ్చిన అప్పులు తీర్చుకునేందుకు, ఇతరత్రా అవసరాల రీత్యా వ్యాపారులు, దళారులు చెప్పిన ధరకే అమ్ముకోక తప్పడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే తమకీ దుస్థితి వచ్చేది కాదని పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నాఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు ప్రభుత్వం నుంచి తమకు ఆదేశాలు లేవని మార్క్ఫెడ్ అధికారులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని పేర్కొంటున్నారు.నిమ్మకు నీరెత్తినట్టుగా సర్కారు తీరు రాష్ట్రంలో వేరుశనగ రైతులు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. కనీసం కొనుగోలు కేంద్రాలు తెరవాలన్న ఆలోచన కూడా చేయడం లేదు. పంటలకు మార్కెట్లో ధరల్లేనప్పుడల్లా ప్రభుత్వం కేంద్రానికి లేఖలతో కాలయాపన చేస్తోంది. ఇప్పటికైనా నాఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి వేరుశనగను కనీస మద్దతు ధరకు కొనాలి.– పి.జమలయ్య, ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలు రైతుల సంఘం -
ఇదేమన్నా తొక్కుడు బిళ్ళ అనుకున్నావా.. అమరావతి రైతులతో ఆటలా..
-
‘కళ్లు ఆర్పకుండా చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నారు’
సాక్షి,అమరావతి: రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాటు ఎందుకు ఇవ్వలేదని జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల్ని అచ్చెన్నాయుడు నిందించడం ఏంటి?. టీడీపీకి ఓట్లు వేయకపోతే రాష్ట్ర ప్రజలు తప్పు చేసినట్లా?. ఓట్లు వేయకపోతే ప్రజలను నిందిస్తారా?. ప్రభుత్వం తప్పులు చేస్తున్నా ప్రజలు చూస్తూ ఊరుకోవాలా?. అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాటు ఎందుకు ఇవ్వలేదు. చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా?. కళ్లు ఆర్పకుండా చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నారు’అని దుయ్యబట్టారు. -
డెవర్లే... రైతులుగా...
కేరళ కోజికోడ్లోని ఆటోడ్రైవర్లకు ఇంట్లో భోజనం చేసే అవకాశం లేకపోవడంతో రెస్టారెంట్లలో తినేవారు. ఖర్చు కళ్లు తిరిగేలా ఉండేది. ఇలా అయితే కుదరదనుకొని డ్రైవర్లందరూ కలిసి ఒక చోట సొంతంగా వంటలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ ప్రయోగం సూపర్ హిట్ అయింది.డబ్బు ఆదాతోపాటు ఆరోగ్యం కూడా!ఇప్పుడు ఈ డ్రైవర్లు సేంద్రియ వ్యవసాయం ద్వారా రైతులుగా మారి మరోసారి సంతోషాన్ని సొంతం చేసుకున్నారు. భూస్వామి కోలకట్టిల్ బీజు దగ్గర భూమి లీజు తీసుకొని రైతుగా తొలి అడుగు వేశారు. ‘డ్రైవింగ్ చేసినంత సులభం కాదు... వ్యవసాయం అంటే’.... ఇలాంటి వెక్కిరింపులు ఎన్నో వినిపించినా వారు వెనక్కి తగ్గలేదు.తమ జీవనోపాధిని పణంగా పెట్టి బీడు నేలలోకి పాదం మోపారు.తెల్లవారుజామున తొలి వెలుగుతోనే పొలం పనులకు శ్రీకారం చుట్టేవారు. ఆ తరువాత డ్రైవర్గా రోడ్డు మీదికి వెళతారు. మళ్లీ సాయంత్రం ఇష్టంగా పొలంలోకి వస్తారు. రోజంతా ట్రాఫిక్ పొగల మధ్య ఉండే వారికి పచ్చటి పొలాల మధ్య ఉండడం ఇష్టం. ఒక్క ముక్కలో చెప్పాలంటే...డ్రైవర్గా ఉన్నప్పుడు తప్ప మిగిలిన సమయమంతా పొలంలోనే ఉంటారు. తమ రెక్కల కష్టంతో పాలకూర, పప్పుధాన్యాలు, బెండకాయ, గుమ్మడికాయ, దోసకాయ వంటి పలు రకాల పంటలతో పచ్చని కూరగాయల తోటను సృష్టించారు. పంట సాగు చేయడానికి అవసరమైన డబ్బులను తామే సమకూర్చుకున్నారు. అత్యున్నత శ్రేణి విత్తనాలు, సహజ ఎరువులతో పంట పండించారు. అకాల వర్షాలు కురిసినప్పటికీ వారి కష్టానికి ప్రతిఫలం దక్కింది. చేనులో కోసిన కూరగాయలను ఇంటి అవసరాలకు ఉపయోగించడంతోపాటు, మార్కెట్ ధరకు వాటిని అమ్ముకున్నారు. ‘డ్రైవర్గా మాకు లైసెన్స్ ఉంది. ఇక రైతుగా మా లైసెన్స్... మేము పడే కష్టం’ అంటున్నాడు చంద్రశేఖరన్. ‘రోజంతా హారన్లు మోగించే మేము మొక్కలకు నీరు పోయడం పని కాదు. ప్రశాంతత’ అంటున్నాడు అబ్దుల్ రహీం. ‘జాతీయ రహదారిపై దొరకని విలువైన నిశ్శబ్దం ఇక్కడ దొరుకుతుంది’ అంటున్నాడు మహేష్ అనే రైతు. తాజా విషయానికి వస్తే... ఈ డ్రైవర్ రైతులు పెద్ద పంటలపై దృష్టి పెట్టారు. భవిష్యత్ కాలంలో వారు పూర్తిస్థాయి రైతులుగా మారినా ఆశ్చర్యం లేదు! ‘డ్రైవింగ్ చేసినంత సులభం కాదు... వ్యవసాయం అంటే’.... ఇలాంటి వెక్కిరింపులు ఎన్నో వినిపించినా వారు వెనక్కి తగ్గలేదు. -
ఆంధ్రప్రదేశ్లో డైవర్షన్ డ్రామా.. రాజధాని, ప్రజా సమస్యలపై నుంచి దృష్టి మళ్లించడానికే కూటమి సర్కారు పన్నాగం...
-
బాబు సర్కారు డైవర్షన్ డ్రామా!
సాక్షి, అమరావతి: రాజధానిలో రైతుల సమస్యలు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. వాటి నుంచి తప్పించుకునేందుకు మరోసారి సరికొత్త డ్రామాకు తెరలేపింది. ఎన్నెన్నో సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కుతంత్రానికి పాల్పడుతోంది. గతంలో ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక దాదాపు రెండేళ్ల తర్వాత రాజధానికి చట్టబద్ధత అంశం గుర్తుకొచ్చినట్లు నటిస్తోంది. ప్రజా సమస్యలన్నింటినీ పక్కదారి పట్టించేలా అమరావతికి చట్టబద్ధత పేరుతో చట్టవిరుద్ధ తీర్మానం చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు, మేధావులు ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. శాసన మండలిని హాజరు పరచకుండా అసెంబ్లీలో మాత్రమే తీర్మానం చేయడాన్ని ఇందుకు నిదర్శనంగా ఎత్తి చూపుతున్నారు. ‘రాజధాని పేరుతో సాగుతున్న అవినీతిపై చర్చ జరగాలి.. ఇప్పటిదాకా ఎలా దోచుకున్నారో, ఎలా దోచుకోబోతున్నారో చర్చ జరగాలి.. ఏ రైతుకు ఎక్కడ ఏ ప్లాటు ఇచ్చారో చర్చ జరగాలి.. ఇప్పటికీ ప్లాట్లు ఇవ్వకుండా మోసం చేయడంపై చర్చ జరగాలి.. సమస్యల పరిష్కారం కోసం రాజధాని రైతులు సీఆర్డీఏ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండటంపై చర్చ జరగాలి.. ఏడేళ్లు మీరే అధికారంలో ఉన్నా భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇవ్వక పోవడంపై చర్చ జరగాలి.. రెండవ, మూడవ విడత భూ సేకరణ యత్నాలపై చర్చ జరగాలి.. రాజధాని పేరుతో ఎంత అప్పు చేశారో.. భవిష్యత్తులో ఇంకా ఎంత అప్పు తెస్తారో చర్చ జరగాలి.. ఆ అప్పుల్లోంచి ఎంత దోచుకున్నారో.. దోచుకోబోతున్నారో కూడా చర్చ జరగాలి.. సూపర్ సిక్స్ హామీలపై, కాంట్రాక్టుల్లో కమీషన్లపైనా చర్చ జరగాలి.. రైతులు, విద్యార్థి, ఉద్యోగ వర్గాల సమస్యలపై చర్చ జరగాలి’ అని ప్రజలు, మేధావులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇన్ని సమస్యలను గాలికొదిలేసి ఒక్క జగన్ను తిట్టడానికే అసెంబ్లీ సమావేశమా? అని నిలదీస్తున్నారు. అన్ని రంగాల్లోనూ ప్రభుత్వం తన వైఫల్యం నుంచి తప్పించుకునేందుకే ఈ ఎత్తుగడ అంటూ మండిపడుతున్నారు. ఇది చట్ట ధిక్కరణేఅమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన తీర్మానం చట్టాన్ని ధిక్కరిస్తున్నట్లుగా ఉందని రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒకవైపు చట్టాలు, రాజ్యాంగం గురించి గొప్పగా చెబుతూనే వాటికి తిలోదకాలు ఇచ్చేలా తీర్మానం చేయడాన్ని ఎత్తి చూపుతున్నారు. రాష్ట్ర శాసన వ్యవస్థలో శాసనసభ, శాసన మండలి భాగంగా ఉంటే, కేవలం శాసనసభలో మాత్రమే ఈ తీర్మానం ఎలా చేస్తారనే ప్రశ్నకు ప్రభుత్వం వైపు నుంచి సమాధానం కరువైంది. సాధారణంగా ఈ రెండు సభలు ఎప్పుడూ సమాంతరంగా జరుగుతాయి. ప్రత్యేక సెషన్ పేరుతో కేవలం అసెంబ్లీని మాత్రమే నిర్వహించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని నిపుణులు చెబుతున్నారు. ఒక సభలో మెజారిటీ ఉండి, రెండవ సభలో లేనప్పుడు.. రెండవ సభను కావాలనే హాజరు పరచకపోవడం చట్టసభల సమగ్రతను దెబ్బ తీయడమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా ఒక అంశానికి పూర్తి స్థాయి చట్టబద్ధత రావాలంటే.. అది బిల్లు రూపంలో ఉభయ సభల ఆమోదం పొందాల్సి ఉంటుంది. తీర్మానం అయినా ఉభయ సభలు చేస్తేనే దానికి నైతికత ఉంటుంది. కేవలం ఒక సభ మాత్రమే తీర్మానం చేస్తే, అది ఆ సభలోని అధికార పార్టీ రాజకీయ తీర్మానంగానే మిగిలి పోతుందనే వాదన వినిపిస్తోంది. చంద్రబాబు ఇప్పుడు అమరావతి చట్టబద్ధత కోసం అంటూ చేసిన తీర్మానం రాజకీయ తీర్మానంగానే మిగిలిపోయింది. శాసన మండలిని బైపాస్ చేస్తూ చేసిన ఈ తీర్మానం ఒక రాజకీయ గిమ్మిక్కే తప్ప అందరి ఆమోదంతో చేసింది ఎలా అవుతుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.అమరావతి కుంభకోణాలు బయట పడతాయని భయం రాజధాని అమరావతి ముసుగులో జరుగుతున్న వేల కోట్ల రూపాయల అవినీతిని వైఎస్సార్సీపీ సభ్యులు ప్రశ్నిస్తారనే భయంతోనే చంద్రబాబు శనివారం కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించలేదని స్పష్టమవుతోంది. రాజధాని ముసుగులో 2014–19లోనే ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి, వేల ఎకరాల భూములను తను, తన బినామీల గుప్పిట్లో పెట్టుకున్నారు. కాంట్రాక్టుల ముసుగులో అప్పట్లోనే వేల కోట్ల రూపాయలు దండుకున్నారు. ఇప్పుడు ఆ భూములకు రేట్లు పెరిగేలా హంగామా చేయడం, నిర్మాణాల పేరుతో రెట్టింపు అంచనాలతో భారీగా కమీషన్లు తీసుకోవడం, ఇందుకోసం భారీగా అప్పులు తెస్తున్న ఉదంతాలన్నీ చర్చకు వస్తాయనే కౌన్సిల్ సమావేశం జరపకుండా కేవలం అసెంబ్లీ సమావేశం మాత్రమే పెట్టి తీర్మానం చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్పై బురదజల్లడానికి పోటాపోటీ ఈ తీర్మానంపై శాసనసభలో జరిగిన చర్చ ఆద్యంతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యంగానే సాగింది. ఆయనపై బురదజల్లి లబ్ధి పొందడానికి చంద్రబాబు, లోకేశ్ ప్రయత్నించగా.. వారిని బుట్టలో వేసుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీ పడి జగన్పై తిట్ల వర్షం కురిపించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మరీ బరితెగించి జగన్పై నోరు పారేసుకోవడం చూసి అధికార పార్టీ నాయకులే ఆశ్చర్యపోయారు. 2019 ఎన్నికల్లో జగన్కు ఓట్లేసి ప్రజలు తప్పు చేశారంటూ ప్రజాభిప్రాయాన్ని సైతం గౌరవించకుండా వారినీ ఆడిపోసుకోవడం చూస్తే అధికార గర్వం అచ్చెన్నాయుడి తలకు ఏ స్థాయిలో ఎక్కిందో అర్థమవుతోందని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాసనసభలో ఆయన ఇంత అడ్డగోలు భాష మాట్లాడడం వెనుక మంత్రి పదవిని రక్షించుకునే ఆరాటం ఉందని టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు. ఆయన మంత్రి పదవి ఊడిపోయేలా ఉండడంతో ఎలాగైనా లోకేశ్ను ప్రసన్నం చేసుకునేందుకు జగన్పై చెలరేగిపోయినట్లు ఎమ్మెల్యేలు చర్చించుకోవడం గమనార్హం. తిన్నింటి వాసాలు లెక్కపెట్టామన్న వసంత, యార్లగడ్డవంగలపూడి అనిత, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, రెడ్డప్పగారి మాధవిరెడ్డి తదితరులు జగన్ను తిట్టడానికి పోటీ పడ్డారు. వసంత కృష్ణప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావులు తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు తమ ప్రసంగాల ద్వారా చాటారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉంటూనే చంద్రబాబుకు మద్దతుగా వాదన వినిపించామని నిస్సిగ్గుగా వారిద్దరూ సభలో చెప్పుకోవడం విశేషం. అప్పట్లో తాను అమెరికా వెళ్లినప్పుడు కూడా అమరావతిని స్వాగతిస్తూ పచ్చ పత్రికకు ప్రకటన ఇచ్చినట్లు యార్లగడ్డ సభలో చూపించారు. సభలో ఆద్యంతం చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్, ఇతర నేతలంతా వైఎస్ జగన్ అమరావతికి వ్యతిరేకం అన్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఆయన ఎప్పుడూ అమరావతిని వ్యతిరేకించలేదన్న విషయాన్ని దాచిపెట్టి, కేవలం ఆయనపై అభాండాలు మోపుతూ.. విమర్శలు, ఆరోపణలు చేస్తూ ఒకరి భుజాలు ఒకరు తడుముకుని బల్లలు చరుచుకున్నారు. స్పీకర్ స్థానంలో తటస్థంగా ఉండాల్సిన చింతకాయల అయ్యన్న పాత్రుడు రాజకీయ ప్రసంగం చేసి సభ ఔన్నత్యాన్ని మరోసారి దెబ్బతీశారు. ఆ 11 మంది ఈసారి కూడా సభకు రాలేదని వైఎస్సార్సీపీపై రాజకీయ విమర్శ చేశారు. పనిలో పనిగా చంద్రబాబును పొగుడుతూ స్వామి భక్తిని చాటుకున్నారు.రాజధాని రైతులను మాయ చేసేందుకే..తమ భూములు తీసుకుని 12 ఏళ్లు దాటినా, ఇంత వరకు ప్లాట్లు ఇవ్వకుండా కార్పొరేట్ కంపెనీలకు మాత్రం వందల ఎకరాలు కట్టబెడుతుండడంపై రాజధాని రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో తీసుకున్న భూముల సంగతి ఇంకా తేల్చకుండానే ఇప్పుడు రెండవ విడత భూ సమీకరణ చేస్తుండడం, మూడవ విడతకు సిద్ధమవుతుండడంపై రాజధాని ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. గ్రామ సభల్లో రైతుల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అధికారులు నీళ్లు నములుతున్నారు. ఈ నేపథ్యంలో రాజధానికి చట్టబద్ధత అంటూ రాజధాని రైతులను మాయ చేసేందుకు ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసిందని ఉన్నత స్థాయి ఉద్యోగ వర్గాల సమాచారం. మరోవైపు ఎన్నికల్లో సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉద్యోగుల్లోనూ అంతకంతకూ ఆందోళన పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో వారిని మభ్య పెట్టేందుకు, వారి దృష్టి మళ్లించేందుకు చట్టబద్ధ తీర్మానం పేరుతో చంద్రబాబు హడావుడి చేస్తున్నారని ఇట్టే తెలుస్తోంది. -
రైతుకు రూ.15 కోట్ల పరిహారం: హెలికాప్టర్, థాయ్లాండ్ ట్రిప్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం జేవార్లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించారు. ఇది ఉత్తర ప్రదేశ్కు ఒక ప్రధాన మౌలిక సదుపాయాల మైలురాయిగా నిలిచింది. అయితే దీనికి సంబంధించి సేకరించిన భూములకు భారీగా పరిహారం అందినట్టు తెలుస్తోంది. తద్వారాఉత్తరప్రదేశ్ రైతుల జీవితాలు రాత్రికి రాత్రే మారిపోయాయని పలు నివేదిల సమాచారం'ది ఇండియన్ ఎక్స్ప్రెస్' కథనం ప్రకారం నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భూసేకరణలో భాగంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని ఒక రైతుకు దాదాపు రూ.15 కోట్ల పరిహారం అందింది. ఈ భారీ సొమ్ముతో ఆయన ఏకంగా ఒక హెలికాప్టర్ను కొనుగోలు చేయడమే కాకుండా, విహారయాత్ర కోసం థాయ్లాండ్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడట.ఈ విమానాశ్రయ ప్రాజెక్టు వల్ల గ్రామీణ ముఖచిత్రం మారుతోందట. ఆ ప్రాంతంలోని అనేక కుటుంబాల ఆర్థిక స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి. వారి ఆశలు, ఆకాంక్షలు ఎలా నెరవేరుతున్నాయి ఈ కథనం పేర్కొంది. ఉదాహరణకు ఈ క్రింది వివరాలు చూద్దాం.శివమ్ ప్రజాపతి : బన్వారీ బాస్ గ్రామానికి చెందిన ఈ యువకుడు శివమ్ ప్రజాపతి (26) ఇప్పుడు ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ మరియు సోలార్ ప్లాంట్కు లేబర్ను సరఫరా చేసే సబ్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నారు. పెరిగిన ఆదాయంతో తన స్నేహితులతో కలిసి థాయ్లాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు తనకు ఇది ఊహకందని విషయం అని ఆయన చెబుతున్నారు.అజయ్ బేనివాల్: కిశోర్పూర్ గ్రామానికి చెందిన అజయ్ ఒకప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవాడు ఇప్పుడు విమానాశ్రయ పనులకు వచ్చే కూలీలు తమ హెల్మెట్లు, తాళాలు భద్రపరుచుకునే చిన్న సర్వీస్ సెంటర్ను నడుపుతూ నెలకు రూ.60వేలు సంపాదిస్తున్నాడు.(ఆలయంలో ప్రీ-వెడ్డింగ్ షూట్ వివాదం : కెమెరామెన్లపై దాడి)56 ఏళ్ల నానక్ చంద్ : వలస కూలీలకు అద్దెకు ఇవ్వడం కోసం తన ఇంట్లో ఆరు అదనపు గదులను నిర్మించాడు. ఒకప్పుడు మంచి ఆదాయం వచ్చినా, ప్రస్తుతం విమానాశ్రయ నిర్మాణం చివరి దశకు చేరుకోవడంతో కూలీల సంఖ్య తగ్గి గదులు ఖాళీగా ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు.సోషల్ మీడియాలో చర్చఅయితే దీనిపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రాజకీయ నాయకులకు, బడాబాబులకు హెలికాప్టర్ ఒక స్టేటస్ సింబల్. కానీ రైతు కూడా అదే అనుభవించాలని అనుకుంటున్నాడా అని ఒక యూజర్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని ముల్షీ ప్రాంత విషయాన్ని గుర్తు చేస్తూ.. గతంలో ఇలాగే పరిహారం వచ్చిన వారు విలాసవంత మైన కార్లు కొని, ఆ తరువాత కొన్నేళ్లకే పెట్రోల్ పోయించుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డారు. పరిహారం సొమ్మును తెలివిగా పెట్టుబడి పెట్టకపోతే భవిష్యత్తులో కష్టాలు తప్పవని మరో యూజర్ హెచ్చరించారు.ఇదీ చదవండి: యువతి కారుణ్య మరణం, చివరి కోరిక తెలిస్తే కన్నీళ్లాగవు -
ఓటేసి తప్పు చేశాం... చంద్రబాబుపై తిరగబడుతున్న సొంత నియోజకవర్గ ప్రజలు
-
రైతుకు ప్రత్యామ్నాయ భూమి రాజ్యాంగ హక్కు
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టుల కింద భూమి కోల్పోయిన రైతులకు ప్రత్యామ్నాయ భూమి కేటాయించడం రాజ్యాంగ హక్కు అని హైకోర్టు నొక్కి చెప్పింది. పరిహారం చెల్లించే విషయంలో సర్కార్ నిర్లక్ష్యాన్ని తప్పుబట్టింది. బాధితురాలైన ఓ వృద్ధ మహిళను పదేళ్లపాటు కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల వాదనలు స్వార్థపూరితంగా ఉన్నాయని, విశ్వసనీయత ఎంతమాత్రం లేదని స్పష్టం చేసింది. ఆస్తి హక్కు చట్టబద్ధమైందని, ఆర్టీకల్ 300ఏ ప్రకారం రాజ్యాంగ హక్కని పేర్కొంది.తప్పనిసరి పునరావాస ప్రయోజనం కోసం పిటిషనర్ను ఇరవై ఏళ్లు వేచి ఉండేలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని.. ఇది సర్కార్ తన బాధ్యతను విస్మరించడమేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇన్నేళ్లు పిటిషనర్ పడిన మానసిక వేదన, బాధకు ఎవరు మూల్యం చెల్లిస్తారని ప్రశ్నించింది. ప్రత్యామ్నాయ భూమిని కేటాయించి, భౌతికంగా అందజేయకుంటే అది రైతు జీవనోపాధిని దెబ్బతీసినట్లేనని తేల్చి చెప్పింది. మహిళా రైతుకు రెండెకరాల భూమికి బదులుగా ప్రత్యామ్నాయ భూమిని కేటాయించాలని, డాక్యుమెంటేషన్ పూర్తి చేసి భూమిని భౌతికంగా అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇరవై ఏళ్లుగా భూమి కోల్పోవడం ద్వారా నష్టపోయిన వ్యవసాయ ఆదాయానికి పరిహారంగా రూ.10 లక్షలు, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ.25 వేలు చెల్లించాలని తీర్పునిచ్చింది. ఇరవై ఏళ్ల క్రితం ఇల్లు, పొలం కోల్పోయి.. ప్రస్తుతం నిజామాబాద్లో నివసిస్తున్న దంతకళ చిన్నక్క.. శ్రీరాంసాగర్ నిర్మాణ సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్ గ్రామంలోని తన ఇల్లు, పొలాన్ని కోల్పోయారు. 2006లో ప్రభుత్వం సమీప గ్రామంలో ప్రత్యామ్నాయ భూమి కేటాయించి పట్టా జారీ చేసినా భౌతికంగా స్వా«దీనం చేయలేదు. భూమి కోసం చిన్నక్క అధికారుల చుట్టూ పదేళ్ల పాటు తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో విధిలేక 2016లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది.ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. పునరావాస, పునఃస్థాపన పథకం కింద భూమి అప్పగింత ప్రయత్నాలు సాగుతున్నాయని, అంతర్గత కార్యాలయాల నుంచి సమాచార జాప్యం కారణంగా అప్పగింత ఆలస్యమవుతోందన్న జీపీ వాదనలను తిరస్కరించారు. అధికారుల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం, నిరుపేద మహిళా రైతు ఏం చేయలేరన్న వైఖరిని పరిగణనలోకి తీసుకున్న తర్వాత రాజ్యాంగంలోని ఆర్టీకల్ 226 కింద తమ అసాధారణ అధికార పరిధిని వినియోగించుకోవడానికి ఇది సముచితమైన కేసు అని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. సర్కారు తీరు దిగ్భ్రాంతికి గురి చేసింది: న్యాయమూర్తి రైతుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం సహించరానిదని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి తీవ్ర ఆక్షేపణీయమన్నారు. సర్కారు తీరు న్యాయస్థానాన్ని ది్రగ్బాంతికి గురి చేసిందని చెప్పారు. అధికారంతో పౌరులను వారి జీవనోపాధి నుంచి దూరం చేయలేరని చెప్పారు. ఉత్తర్వుల కాపీ అందిన నాటి నుంచి నాలుగు నెలల్లో ప్రత్యామ్నాయ సాగు భూమిని భౌతికంగా అందజేయాలని సూచించారు. హద్దులు నిర్ణయించి, పట్టాదారు పాస్బుక్, హక్కు పత్రాన్ని అందివ్వాలని ఆదేశించారు. ఏటా రెండెకరాలకు రూ.50 వేలు చొప్పున 20 ఏళ్లకు రూ.10 లక్షల నష్టపరిహారం 16 వారాల లోగా చెల్లించాలంటూ తీర్పునిచ్చారు. -
వంటింట్లో 'వార్'!
సాక్షి, అమరావతి: ధరల నియంత్రణలో చంద్రబాబు సర్కార్ వైఫల్యం సామాన్యుడి వంటింట్లో సెగలు పుట్టిస్తోంది. నిత్యావసరాల ధరలు అంతకంతకూ భగ్గుమంటూ జనం నడ్డి విరుస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ముఖ్యంగా వంట నూనెల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే దిక్కులు చూస్తోంది. గత 22 నెలలుగా నూనె రేట్లు కాక రేపుతున్నాయి. ప్రతి నెలా భారీగా పెరగడమేగానీ స్వల్పంగా కూడా దిగొచ్చిన దాఖలాలు లేవు. ఇప్పటికే ధరల బాదుడుతో అల్లాడుతుండగా గ్యాస్ సంక్షోభం పేదల జీవనాన్ని మరింత దిగజార్చింది. చంద్రబాబు సర్కారు పీఠం ఎక్కిన తర్వాత గ్యాస్ రేట్లు రెండు సార్లు పెరగడంతో జనంపై ఏకంగా రూ.110 భారం పడింది. గ్యాస్ కోసం 10–15 రోజులు ఎదురు చూసినా రాకపోవడంతో మండుటెండల్లో వినియోగదారులు ఏజెన్సీలకు క్యూ కట్టాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు వరదలు, అకాల వర్షాలు, కరువు దెబ్బకు పంటలు దెబ్బ తిన్నాయి. రైతులకు ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదు. మార్కెట్లో చూస్తే నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. రోజువారీ పనులు లేక.. చేతిలో చిల్లి గవ్వలేక.. భగ్గుమంటున్న నిత్యావసరాల ధరలతో పేదలు విలవిల్లాడుతుంటే చంద్రబాబు సర్కారు వేడుక చూస్తోంది. 60 శాతానికిపైగా పెరిగిన నూనెల ధరలు.. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే ఏపీలో వంట నూనెల ధరలు సెగ పుట్టిస్తున్నాయి. గత 22 నెలలుగా పామాయిల్, సన్ఫ్లవర్, వేరుశనగ నూనె రేట్లు పైకి ఎగబాకుతూనే ఉన్నాయి. పది రోజుల క్రితం సన్ఫ్లవర్, పామాయిల్ రేట్లు లీటరుకు రూ.15–25 వరకు పెరిగాయి. గతంలో ఉక్రెయిన్ యుద్ధ సమయంలో పెరిగిన నూనె రేట్లు.. చంద్రబాబు హయాంలో సాధారణ పరిస్థితుల్లోనూ ఆకాశాన్ని తాకుతుండటం గృహిణులను కన్నీళ్లు పెట్టిస్తోంది. 2024 ఏప్రిల్లో లీటర్ వేరుశనగ నూనె రూ.167.87 కాగా ఇప్పుడు రూ.210–22 ఉంది. గతంలో పామాయిల్ రూ.89–91 ఉంటే ఇప్పుడు రూ.131–140 ఉంది. సన్ఫ్లవర్ గతంలో రూ.112 ఉంటే ఇప్పుడు రూ.180–190కి కొనుగోలు చేయాల్సిన దుస్థితి. పామాయిల్ ఏకంగా 60 శాతం, సన్ఫ్లవర్ 63–70 శాతం, వేరుశనగ నూనెపై 70 శాతం రేట్లు పెరిగాయి. వీటితోపాటు ఆవనూనె, సోయా, వనస్పతి రేట్లు కూడా దిగి రావట్లేదు. ఫలితంగా మధ్య తరగతి కుటుంబాలు వంటలను కుదించుకుంటున్న పరిస్థితి. గ్యాస్ కొరతకు తోడు నూనె రేట్లకు భయపడి ఒంటి పూట వంటలు వండుకోవడం గమనార్హం. ఉడకని పప్పులు.. తగ్గని రేట్లు.. వంట నూనెలకు తోడు పప్పు దినుసుల రేట్లు పేదింటి కుటుంబాలకు పెను భారంగా మారుతున్నాయి. జాతీయ సగటుతో పోల్చినా, తెలంగాణతో చూసినా ఏపీలోనే రేట్లు అధికంగా ఉంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కిలో కందిపప్పు రూ.120–150, గోధుమ పిండి రూ.71–100, మినçప్పప్పు రూ.146–150 పైగా పలుకుతోంది. పెసలు సైతం కిలో రూ.160, వేరుశనగ గుళ్లు రూ.188–200, శనగపప్పు రూ.128కి తగ్గట్లేదు. నిత్యం కూరలు, తాలింపుల్లో తప్పనిసరిగా వినియోగించే దినుసుల్లో ఎండు మిర్చి రూ.200–390, పసుపు రూ.380, వెల్లుల్లి రూ.219–250, అల్లం రూ.109–150, కారం రూ.500(ప్రీమియం), సాధారణం రూ.200కిపైగా, ఇంగువ 100 గ్రాములు రూ.200 వరకు ఉంది. పండించిన రైతులకు గిట్టుబాటు ధర లేదు గానీ మార్కెట్లో కొనుగోలుదారులు కూరగాయలను ముట్టుకుంటే మండుతున్నాయి. టమాటా రైతుకి కిలో రూ.3 మాత్రమే దక్కుతుంటే మార్కెట్లో రూ.20–25 చొప్పున వినియోగదారులు కొనాల్సి వస్తోంది. అరటి సైతం రైతుకు కిలో రూ.5 మాత్రమే దక్కుతుంటే బయట డజను రూ.100 పలుకుతోంది. వేసవిలో పండ్లలో అధికంగా తీసుకునే కర్బూజా రైతుల నుంచి కిలో రూ.3–4 చొప్పున కొంటుంటే బయట కాయ ఏకంగా రూ.20–30 ఉంటోంది.చివరికి కరివేపాకు సైతం కిలో రూ.180 పలుకుతోంది. పచ్చి మిర్చి రూ.79, క్యాప్సికం రూ.75, కూరమామిడి రూ.100కు తక్కువ లేదు. ఇవన్నీ పండించిన రైతులకు పదో పరకో దక్కుతుంటే పచ్చ సిండికేట్ మార్కెట్లో వినియోగదారుల జేబులను గుల్ల చేస్తోంది. బియ్యం.. బాబోయ్! అన్నపూర్ణగా పిలుచుకునే ఆంధ్రప్రదేశ్లో బియ్యం రేట్ల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. వరి పండించే రైతులకు 75 కిలోల బస్తాకు రూ.1,100–1,500 మాత్రమే దక్కుతుంటే మార్కెట్లో వినియోగదారుడు 26 కిలోల బస్తా రూ.1,600 పెట్టి కొనాల్సి వస్తోంది. పది రోజుల క్రితంతో పోలిస్తే బస్తాకు రూ.300 దాకా రేట్లు పెంచారు. బాస్మతి బియ్యం సైతం కిలో రూ.80 నుంచి రూ.110–150కి పెరిగాయి. దావత్ బియ్యం అయితే కిలో రూ.230కిపైగా ఉంది. వాస్తవానికి గత నెలలోనే మిల్లర్లు, బియ్యం సిండికేట్ సన్నరకాల బియ్యంపై రేట్లు పెంచారు. క్వింటాకు ఏకంగా రూ.400పైనే బాదారు. హోల్సేల్ నుంచి మార్కెట్లోకి వచ్చే సరికి కర్నూలు సోనా 26 కిలోల బస్తా రకాన్ని బట్టి రూ.1,599, రూ.1699కిపైగా ఉంటోంది. ఇష్టానుసారం బియ్యం రేట్లను పెంచేస్తుంటే చంద్రబాబు సర్కార్ కనీసం కన్నెత్తి కూడా చూడట్లేదు. కోడి మాంసం కిలో రూ.420 రాష్ట్రంలో పౌల్ట్రీ రంగంలో దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంద్రబాబు పుణ్యమా అంటూ గుడ్డు రేటు భారీగా పతనమై పౌల్ట్రీ రైతులను ముంచేసింది. మరోవైపు కోడి మాంసం రేటు రూ.400–420కి ఎగబాకి వినియోగదారులకు షాకిచ్చింది. చివరికి కోడి మాంసాన్ని ప్యాకింగ్ చేసే ప్లాస్టిక్ కవర్లు, పెళ్లిళ్లలో వేసే విస్తరులు, గ్లాసుల రేట్లకు కూడా రెక్కలు రావడం చంద్రబాబు సర్కార్ అసమర్థతకు నిదర్శనంగా నిలుస్తోంది. కర్రీ పాయింట్లో కూరల ధరలు రూ.5–10 వరకు పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో వంట చేసుకోలేక.. బయట కొనుక్కొని తినలేక సగటు జీవి నిత్యం నరకం అనుభవించాల్సి వస్తోంది.రేషన్లో కందిపప్పు కట్.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసరాల రేట్లు అమాంతం పెరుగుతుంటే.. పేదలకు ఇచ్చే రేషన్ మాత్రం కుంచించుకుపోతోంది. జాతీయ ఆహార భద్రత చట్టానికి చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడుస్తూ రేషన్ వ్యవస్థను దిగజార్చింది. గత ప్రభుత్వంలో నాణ్యమైన సార్టెక్స్ బియ్యాన్ని ఎండీయూ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సమర్థంగా అందిస్తే చంద్రబాబు సర్కార్ కక్షపూరితంగా ఆ వ్యవస్థనే రద్దు చేసింది. బియ్యం నాణ్యతకు తిలోదకాలిచ్చి అక్రమ రవాణాకు గేట్లు తెరిచింది. ఫలితంగా పేదలు తినాల్సిన బియ్యం వారి ఇళ్లకు చేరకుండా దొడ్డిదారిన పోర్టుల ద్వారా విదేశాలకు తరలిపోతోంది. ఇక మార్కెట్లో కందిపప్పు రేటు అందనంత ఎత్తులో ఉంటే చౌక దుకాణాల ద్వారా ఇవ్వకుండా మంగళం పాడేసింది. గోధుమ పిండిని సైతం అర్ధంతరంగా నిలిపివేసింది. కిలో రూ.20 చొప్పున జిల్లా కేంద్రాల్లో పంపిణీ చేస్తామని ప్రకటించి చేతులు ఎత్తేసింది.పౌష్టికాహారంలో భాగంగా ఇవ్వాల్సిన రాగులు, జొన్నల పంపిణీని సైతం గాడి తప్పించింది. సబ్సిడీపై ఇచ్చే నూనెలను సైతం ఎత్తేసింది. ఎన్నికల ప్రచారంలో రేషన్ దుకాణాల ద్వారా ఏకంగా 18 రకాల నిత్యావసరాలను ఇస్తామని నమ్మబలికి దారుణంగా మోసం చేసింది. రేషన్లో కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం, అరకొర పంచదార మినహా చంద్రబాబు సర్కారు పేదలకు ఒరగబెట్టిందేమీ లేదు. గ్యాస్ కోసం క్యూ కట్టి..ప్రజలకు బూటకపు కబుర్లు చెప్పి మోసం చేయడంలో తాను దిట్ట అని చంద్రబాబు రుజువు చేసుకున్నారు. ఒకవైపు గ్యాస్ సంక్షోభం ముంచుకొస్తుంటే ఏపీలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని ప్రకటనలు గుప్పించి చేతులు దులుపుకొన్నారు. కూటమి సర్కారు వచ్చాక వంట గ్యాస్ రూ.110 పెరిగింది. కమర్షియల్ గ్యాస్పై తాజాగా రూ.115 చొప్పున పెంచడంతో పాటు ఆంక్షలు విధించడంతో హోటల్ రంగం కుదేలైంది. వాస్తవానికి గృహ వినియోగ గ్యాస్ విషయంలో పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల పాటు గ్యాస్ బుకింగ్ వ్యవధిగా నిర్ణయించారు. అయితే పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారులు బుకింగ్ కోసం ప్రయత్నిస్తే 35 రోజుల తర్వాతే బుకింగ్లు చేసుకోవాలని మెసేజ్లు వస్తున్నాయి. గ్యాస్ బుక్ చేసుకున్న 10–15 రోజుల తర్వాత కూడా ఏజెన్సీలు డెలివరీ చేయలేకపోతున్నాయి. సాధారణ రోజుల్లో వచ్చే స్టాకు కంటే ఇప్పుడు 20 శాతం తగ్గించి ఇస్తుండటం, పెండింగ్ డెలివరీలు పెరిగిపోవడంతో ఏజెన్సీలు చేతులు ఎత్తేస్తున్నాయి. ఇదే అదనుగా చంద్రబాబు అనుకూల ఏజెన్సీలు దొడ్డిదారిన గ్యాస్ను బ్లాక్మార్కెట్కు తరలిస్తూ దండుకుంటున్నాయి. సామాన్య ప్రజలు మాత్రం సిలిండర్లతో మండుటెండలో క్యూలలో నిల్చోవాల్సిన దుస్థితి దాపురించింది. -
సమస్యలు పరిష్కరించాలంటూ రాజధాని రైతుల ధర్నా
తాడికొండ: రాజధానిలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రైతులు, రైతు కూలీలు సోమవారం తుళ్లూరు మండలం రాయపూడిలో ధర్నా చేశారు. సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భార్గవ తేజకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజధాని రైతులకు, పేదలకు ఇచ్చే వార్షిక కౌలు, పెన్షన్లను మరో పదేళ్ల పాటు పొడిగించాలని, పేదలకు ఇచ్చే పెన్షన్ను రూ.10 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు. ధర్నాలో సీఐటీయూ, రాజధాని అభివృద్ధి వేదిక నేతలు వై.నేతాజీ, ఎం.రవి, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
రైతు నోటమాట లేదు
సాక్షి, అమరావతి: బహిరంగ మార్కెట్లో ప్రాంతాన్ని బట్టి.. నాణ్యతను బట్టి కిలో టమాటా రూ.30 నుంచి రూ.60 పలుకుతోంది. టమాటా సాస్ ధర కిలో రూ.120 పైమాటే. కానీ.. వాటిని పండించే రైతులకు కిలోకు రూపాయి నుంచి రూ.3 మాత్రమే దక్కుతోంది. ఇంటిల్లిపాదీ రెక్కలు ముక్కలు చేసుకుని సాగుచేస్తే కనీసం కూలీ ఖర్చులు కూడా మిగలడం లేదు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ధర లేక టమాటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నా చంద్రబాబు ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది.ధర లేక దిగాలురాష్ట్రంలో 1.55 లక్షల ఎకరాల్లో టమాటా సాగవుతోంది. అత్యధికంగా చిత్తూరులో 85 వేలు, అనంతపురంలో 48 వేలు, కర్నూలులో 8 వేల ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో 17 వేల ఎకరాల్లో టమాటా పండిస్తున్నారు. ఎకరాకు 14 టన్నుల చొప్పున ఏటా రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా. రాయలసీమలోని 3 జిల్లాల నుంచే 20.36 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయి. నిత్యం చిత్తూరు మార్కెట్కు 300–400 టన్నులు, అనంతపురం మార్కెట్కు 80–100 టన్నులు, కర్నూలు మార్కెట్కు 80–150 టన్నుల చొప్పున వస్తుంటాయి.చిత్తూరు జిల్లా ప్యాపిలి మార్కెట్లో కిలోకు సగటున రూ.1.40 నుంచి రూ.3 దక్కుతుంటే.. ఉరవకొండ మార్కెట్లో కిలో రూ.2–3కు మించి లభించడం లేదు. అనంతపురం జిల్లా కక్కలపల్లి మార్కెట్లో కిలోకు రూ.3–7, పలమనేరు మార్కెట్లో కిలోకు రూ.3–7, మదనపల్లి మార్కెట్లో కిలోకు రూ.7 వరకు దక్కుతోందని రైతులు చెబుతున్నారు. మార్కెట్ ధరతో పోలిస్తే రైతులకు పదోవంతు కూడా దక్కడం లేదు.గతేడాది కిలో రూ.8కి కొంటామని గతేడాది కూడా ఇదే రీతిలో కిలో రూపాయికి కూడా కొనేవారు లేక టమాటా రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారు. అప్పట్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా విక్రయిస్తామని ప్రకటించి చేతులెత్తేసింది. ఇదిగో కొంటాం.. అదిగో కొంటామని కాలయాపన చేసింది. చివరకు ఎప్పుడు కొంటారని రైతులు నిలదీస్తే ‘నో ప్రాఫిట్.. నో లాస్’ పద్ధతిన రైతుల నుంచి కొనుగోలు చేస్తామే తప్ప.. కిలో రూ.8కు కొనేందుకు డబ్బులు లేవని మార్కెటింగ్ శాఖ చేతులెత్తేసింది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి పునరావృతమైంది. టమాటా రైతుల దుస్థితిపై కనీసం స్పందించకుండా ఈ టమాటా థర్డ్ క్వాలిటీ అంటూ అధికారులు మాట దాటవేస్తున్నారు.ఐదేళ్లపాటు టమాటా రైతుకు అండగా..గత వైఎస్ జగన్ ప్రభుత్వం టమాటా రైతులకు అన్నివిధాలా అండగా నిలిచింది. మార్కెట్లో ధరలేని ప్రతిసారి మార్కెట్లో జోక్యం చేసుకుని వ్యాపారులతో పోటీపడి మద్దతు ధరకు కొనుగోలు చేసేది. డిమాండ్కు తగిన సరఫరా లేక మార్కెట్లో ధరలు చుక్కలనంటుతున్నప్పుడు కూడా ఇదే రీతిలో మార్కెట్లో జోక్యం చేసుకుని రైతుల నుంచి గరిష్టంగా కిలో రూ.107కు కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా సబ్సిడీపై కిలో రూ.50కే సరఫరా చేసింది. ఇలా రైతులకు అండగా నిలవడంతోపాటు ఇటు వినియోగదారులపై భారం పడకుండా చేసింది. గడచిన ఐదేళ్లలో రికార్డు స్థాయిలో రూ.18.02 కోట్లు ఖర్చు చేసి రైతుల నుంచి 8,459.56 టన్నుల టమాటాను మద్దతు ధరకు కొనుగోలు చేసి వారికి అండగా నిలిచింది.కిలోకు రూ.2 ఇస్తున్నారురెండెకరాల్లో టమాటా వేశాను. ఎకరాకు రూ.70 వేలకు పైగా పెట్టుబడి పెట్టాను. రోజు విడిచి రోజు 2 నెలలుగా మార్కెట్కి రోజుకు టన్ను టమాటా తీసుకొస్తున్నా. కేజీ రూ.3 కంటే తక్కువే పలుకుతోంది. ఈ రోజు కిలోకు రూ.2 ఇస్తున్నారు. గతేడాది ఇలాగే ధరలేక నష్టపోయాం. ఈసారి కూడా ధర లేక నష్టపోతున్నాం. ఉరవకొండ మార్కెట్కు వచ్చే రైతులందరిదీ ఇదే పరిస్థితి. – ఎ.రామాంజనేయులు, షేక్షానిపల్లి, అనంతపురం -
రైతే రాజు కావాలి: సీఎం రేవంత్
సాక్షి, సిద్దిపేట: ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం సుభిక్షంగా ఉండదని తాను బలంగా నమ్ముతానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. రాష్ట్రాన్ని ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నా రైతుల విషయంలో వెనుకంజ వేయకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రైతును రాజు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. రైతుభరోసా కింద 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందించేందుకు రూ.9 వేల కోట్లను ప్రభుత్వం సమకూర్చిందని తెలిపారు. తొలి విడత పెట్టుబడి సాయం కింద సీఎం నిధులు విడుదల చేశారు.ఆదివారం సెలవు కావడంతో సోమవారంఅన్నదాతల ఖాతాల్లో జమవుతాయని చెప్పారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో పామాయిల్ ఫ్యాక్టరీని ఆయన ప్రారంభించారు. ఫ్యాక్టరీని రైతులకు అంకితమిచ్చారు. అలాగే రూ 475.72 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రైతు మహోత్సవాలలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. పంట మార్పిడిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.. ‘రాష్ట్రంలో 2.58 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి తెలంగాణ దేశంలోనే నంబర్ వన్గా నిలిచింది. అయితే రైతుల ఆదాయం పెరగాలంటే వరి పండించడం ఒక్కటే పరిష్కారం కాదు. ప్రతి రైతు కారు కొనుక్కునేలా ఆదాయం పెరగాలి. బంగారు తెలంగాణ అంటే ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందడమే. రాష్ట్రంలో పంటల విధానంలో మరిన్ని మార్పులు రావాలి. పంట మార్పిడితోనే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. అందుకు అనుగుణంగా రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. తృణధాన్యాలు (మిల్లెట్స్), ఆకు కూరలు, పామాయిల్ సాగుపై రైతులు దృష్టి పెట్టాలి. రైతులకు మంచి ధర వచ్చేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం. 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ పండించినా కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సిద్దిపేటలో నిర్మించిన ఫ్యాక్టరీ కొడంగల్లోనూ నిర్మించాలని మంత్రి తుమ్మలకు విజ్ఞప్తి చేస్తున్నా. నాకు వ్యవసాయం చేయడం తెలుసు. చీడపీడలకు ఏ మందు వేయాలో కూడా తెలుసు..’ అని సీఎం చెప్పారు. అంకాపూర్ రైతులను ఆదర్శంగా తీసుకోవాలి ‘నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ రైతులను ఆదర్శంగా తీసుకుని 12,728 గ్రామాల్లోని రైతులంతా ముందుకెళ్లాలి. ప్రభుత్వం కూడా పంటలను ఎగుమతి చేసే దిశగా కృషి చేస్తోంది. రైతుల కోసం ఇప్పటివరకు రూ.1.40 లక్షల కోట్లు ఖర్చు చేశాం. గతంలో 114 నెలల్లో కేసీఆర్ సగటున ఒక్కో నెలకు రూ2,535 కోట్లు ఖర్చు చేస్తే 28 నెలల కాలంలో ప్రజా ప్రభుత్వం సగటున నెలకు రూ 5,,500 కోట్లను రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేసింది. తాజాగా రైతు భరోసా తొలి విడత విడుదల చేశాం. 20 రోజుల తర్వాత రెండో విడతలో రూ.2,650 కోట్లు, మూడో విడతలో రూ.2,760 కోట్లు విడుదల చేస్తాం. యూరియా కొరత వచ్చేలా ఉంది.. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల రాబోయే రోజుల్లో మనకు యూరియా కొరత వచ్చేలా ఉంది. రామగుండం ఫ్యాక్టరీ యూరియా అంతా మనకే దక్కేలా, ప్రధాని మోదీని కలిసి మన రాష్ట్రానికి ఎక్కువ యూరియా తెచ్చుకునేందుకు బీజేపీ ఎంపీలు సహకరించాలి. సిద్దిపేటలో కాంగ్రెస్ గెలిస్తే మంత్రి పదవి వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలోనూ కాంగ్రెస్ గెలవాలి. ఇక్కడి నుంచి గెలిచిన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తాం. 1984 నుంచి 2029 వరకు ఒకే కుటుంబానికి చెందిన వారినే ఎమ్మెల్యేను చేశారు. మార్చి చూడండి మంచి జరుగుతుంది. పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్లకు అప్పగిస్తున్నా..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రత్యర్థి పార్టీ నియోజకవర్గమనే వివక్ష ఉండదు.. ‘ప్రజలకు ఇచ్చే నిధుల విషయంలో వివక్ష చూపను. ప్రత్యర్థి పార్టీ నేతల గురించి ఆలోచిస్తే ప్రజలకు అన్యాయం జరుగుతుంది. గత పాలకులు ఈ విధంగా విపక్ష నేతల నియోజకవర్గాల పట్ల వివక్ష చూపించారు. కానీ నేను నేతలతో వ్యతిరేకిస్తాను గానీ, ప్రజల పట్ల వివక్ష చూపను. సిద్దిపేటకు కూడా నిధులు భారీగా ఇచ్చా. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుతో రాజకీయాంగా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ ఆ నియోజకవర్గాల ప్రజల అభివృద్ధి కోసం కూడా పని చేస్తాం. వివక్ష చూపే వ్యక్తినయితే.. ఆయిల్పామ్ ఫ్యాక్టరీని కొడంగల్కే తీసుకెళ్లేవాడిని. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ కూడా పాల్గొని తన నియోజక వర్గం పరిధిలో ఉన్న సమస్యలను నా దృష్టికి తెచ్చారు..’ అని రేవంత్ చెప్పారు. ‘ప్రైవేట్ పాఠశాలల మోజులకు పోకండి.. ఆర్థికంగా నష్టపోకండి.. ప్రైవేట్ పాఠశాల కంటే నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలల ద్వారా అందిస్తున్నాం. అందుకే ఆ శాఖ నాదగ్గరే ఉంచుకున్నా..’ అని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. రైతుల కళ్లల్లో ఆనందమే లక్ష్యం: మంత్రి తుమ్మల సిద్దిపేటజోన్/నంగునూరు(సిద్దిపేట): రైతు సంక్షేమ ప«థకాలను అమలు చేసి వారి కళ్లల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. రానున్న మూడేళ్లలో దేశంలోనే అత్యధికంగా ఆయిల్పామ్ సాగు చేసే రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో సాగు చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారని, అవసరమైతే ప్రత్యేకంగా నిధుల మంజూరుకు సీఎం సిద్ధంగా ఉన్నట్లు మంత్రి వివేక్ తెలిపారు. ప్రకృతి పరంగా రైతుకు ఎలాంటి ఇబ్బందులు కలిగించని ఆయిల్పామ్ సాగుతో బోలెడు ఆదాయం పొందవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు పంట మార్పిడిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందనిమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో పారదర్శకంగా ఉందని, పారీ్టలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ పథకం అమలు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీనీ కచి్చతంగా అమలు చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి రైతు పక్షపాతిగా దూరదృష్టితో పని చేస్తున్నారన్నారు. -
‘జీడి’ రైతుకు కొత్త ఆదాయం
సాధారణంగా జీడి తోటలంటే కేవలం జీడిపిక్కల కోసమేననే భావన రైతుల్లో బలంగా ఉంది. కానీ, ఆ పిక్కకు అనుబంధంగా ఉండే ‘జీడిపండు’ రైతు ఆర్థిక స్థితిగతులను మార్చేయగల అద్భుత శక్తి అని వ్యవసాయ రంగ నిపుణులు నొక్కి చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఏటా లక్షలాది టన్నుల జీడిపండు వృథాగా నేలపాలవుతోందని, దీన్ని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పుత్తూరులోని ఐకార్-జీడి పరిశోధన డైరెక్టరేట్ (డీసీఆర్) నిర్వహించిన పరిశ్రమల ముఖాముఖి సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది.గణాంకాలు ఇలా..డీసీఆర్ డైరెక్టర్ జె.దినకర అడిగా సమర్పించిన వివరాల ప్రకారం, దేశంలో జీడిపండు వినియోగం అత్యల్పంగా ఉంది. భారతదేశంలో ఏటా సుమారు 60 లక్షల టన్నుల జీడిపండు ఉత్పత్తి అవుతోంది. ఇందులో కేవలం 1 శాతం మాత్రమే విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి వాడుతున్నారు. ఒక హెక్టారు జీడి తోటలో సగటున 1 టన్ను జీడిపిక్కలు లభిస్తే ఏకంగా 8 టన్నుల జీడిపండు లభిస్తుంది. అంటే మనం ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తున్న పిక్కల కంటే 8 రెట్లు ఎక్కువగా పండ్లు అందుబాటులో ఉన్నప్పటికీ సరైన అవగాహన, సాంకేతికత లేక వాటిని వృథా చేస్తున్నాం. జీడిపండు నుంచి రసం తీసిన తర్వాత మిగిలే పిప్పితోనూ ఆదాయం పొందే మార్గాలను శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు.కర్ణాటక వెటర్నరీ, యానిమల్ అండ్ ఫిషరీస్ సైన్సెస్ యూనివర్సిటీ సహకారంతో జీడిపండు పిప్పి పొడితో చేపల మేతను తయారు చేసే సాంకేతికతను డీసీఆర్ అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే స్వచ్ఛమైన జీడిపండు రసం, పాశ్చరైజ్డ్ జ్యూస్, లిక్విడ్ స్వీటెనర్, జీడిపండు పిప్పి టీ వంటి వినూత్న ఉత్పత్తుల సాంకేతికతను డైరెక్టరేట్ సిద్ధం చేసింది.బ్రెజిల్ ఆదర్శంబ్రెజిల్ వంటి దేశాల్లో జీడిపండును అత్యధికంగా వినియోగించుకుంటున్నారని నిపుణులు పేర్కొన్నారు. భారతదేశంలో చిన్న స్థాయిలోనైనా ఈ ప్రయత్నం మొదలుపెడితే భవిష్యత్తులో ఇది పెద్ద పరిశ్రమగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రభుత్వ సంస్థలు తాము అభివృద్ధి చేసిన సాంకేతికతను బదిలీ చేసేటప్పుడు వసూలు చేసే రాయల్టీలు స్టార్టప్లను నిరుత్సాహపరిచేలా ఉండకూడదు. నామమాత్రపు ధరలకే సాంకేతికతను అందిస్తే యువత ఈ రంగంలోకి వస్తారు’ అని చెబుతున్నారు.కేవలం జీడిపిక్కల అమ్మకానికే పరిమితం కాకుండా జీడిపండును కూడా ఒక వాణిజ్య పంటగా గుర్తిస్తే రైతులకు ఇది బోనస్ ఆదాయం అవుతుంది. ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందించి ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇది కొత్త ఊపిరి పోయడం ఖాయం.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
సాగుకు ముందస్తు భరోసా
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు దెబ్బతింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలిచేందుకు రంగంలోకి దిగింది. రానున్న ఖరీఫ్-2026 సీజన్ను దృష్టిలో ఉంచుకుని ఎరువుల కొరత రాకుండా ఉండేందుకు దేశీయ ఉత్పత్తిని పెంచడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి దిగుమతులను వేగవంతం చేస్తూ బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది.యూరియా ఉత్పత్తికి ప్రాధాన్యతదేశీయంగా యూరియా ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం గ్యాస్ సరఫరాలో కీలక మార్పులు చేసింది. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) కొరత కారణంగా పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేయలేకపోతున్న ప్లాంట్లకు ఊరటనిస్తూ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది.ఎల్పీజీ(వంటగ్యాస్) అవసరాల తర్వాత గ్యాస్ సరఫరాలో ఎరువుల ప్లాంట్లకు రెండో ప్రాధాన్యత కల్పించారు. స్పాట్ మార్కెట్ నుంచి బిడ్డింగ్ ద్వారా అదనంగా 7.31 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ పర్ డే(ఎంఎంఎస్సీఎండీ) గ్యాస్ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరింది. దీనివల్ల ప్లాంట్లకు అందుతున్న గ్యాస్ సరఫరా 32 ఎంఎంఎస్సీఎండీ నుంచి 39.31 ఎంఎంఎస్సీఎండీకి (23 శాతం) పెరుగుతుంది. అమోనియాను విడిగా విక్రయించవద్దని దాన్ని పూర్తిగా యూరియా తయారీకే ఉపయోగించాలని కంపెనీలకు ఆదేశాలు జారీ అయ్యాయి.ప్రస్తుతం ప్లాంట్లకు అవసరమైన గ్యాస్లో 62 శాతం మాత్రమే అందుతుండగా కొత్త ఒప్పందంతో అది 76 శాతానికి చేరనుంది. దీనివల్ల దేశీయ యూరియా ఉత్పత్తి రోజుకు 54,500 టన్నుల నుంచి 67,000 టన్నులకు పెరుగుతుందని అంచనా.ఖరీఫ్ 2026.. అందుబాటులో భారీ నిల్వలుజూన్ 1న నైరుతి రుతుపవనాల రాకతో ప్రారంభమయ్యే ఖరీఫ్ సీజన్ కోసం ఇప్పటికే సరిపడా నిల్వలను సిద్ధం చేసినట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం దేశంలో ఎరువుల నిల్వలు మెరుగ్గా ఉన్నాయన్నారు.మార్చి 19 నాటికి ఎరువుల నిల్వల వివరాలు (లక్షల టన్నుల్లో)ఎరువు రకంప్రస్తుత నిల్వలు (2026)గతేడాది నిల్వలు (2025)యూరియా61.1455.22డీఏపీ24.2411.85కాంప్లెక్స్57.2134.44ఎస్ఎస్పీ24.823.15ఎంఓపీ12.6514.13 వ్యూహాత్మక అడుగులుయుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ రష్యా, బెలారస్, మొరాకో, కెనడా వంటి దేశాలు ఎరువుల సరఫరాకు ముందుకొచ్చాయి. అయితే, ప్రభుత్వం ప్రస్తుతం దేశీయంగా యూరియా ఉత్పత్తిపైనే దృష్టి కేంద్రీకరించింది. రాబోయే 1-2 వారాల్లో అంతర్జాతీయ పరిస్థితులు కుదుటపడితే అవసరానికి అనుగుణంగా దిగుమతులపై తుది నిర్ణయం తీసుకోనుంది.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
ఖరీఫ్ ముంగిట్లో యాసంగికి ‘భరోసా’!
కామారెడ్డి క్రైం: ఓ వైపు యాసంగి పంటలు కోతకు వస్తున్నాయి. మరో నెల గడిస్తే ఖరీఫ్ సీజన్కు రైతులు సమాయత్తం అవుతారు. ఈ పరిస్థితుల్లో ఎట్టకేలకు యాసంగి రైతు భరోసా విడుదలపై స్పష్టత వచ్చింది. మొదటి విడతలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులకు ఈనెల 22 న పెట్టుబడి సాయం అందించనున్నారు. సకాలంలో అందకపోయినా పంటల సాగులో చేసిన అప్పులు, ఇతర అవసరాలకు ఆసరాగా ఉండనుండడంతో రైతులు కాస్త ఊరట చెందుతున్నారు.జిల్లాలో 3,32,611 మంది రైతులు..జిల్లాలో గత యాసంగి లెక్కల ప్రకారం మొత్తం 3,32,611 మంది రైతులున్నారు. ఇందులో ఎకరంలోపు భూమి కలిగిన రైతులు 1,30,671 మంది, 1 నుంచి 2 ఎకరాల మధ్య ఉన్నవారు 81,796 మంది, 2నుంచి 3 ఎకరాలు కలిగిన రైతులు 48,945 మంది, 3 నుంచి 4 ఎకరాలున్నవారు 26,734 మంది, 4 నుంచి 5 ఎకరాలు కలిగిన రైతులు 15,800 మంది ఉన్నారు. 5 నుంచి 10 ఎకరాల మధ్య భూమి ఉన్నవారు 11,265 మంది, 10 ఎకరాలకుపైగా భూమి కలిగిన వారు 1,493 మంది ఉన్నారు. అందరికీ రైతు భరోసా నిధులు జమ చేయాలంటే రూ.316.53 కోట్లు అవసరం.ఈనెల 25 వరకు కొత్త దరఖాస్తులకు అవకాశంజిల్లాలో గతేడాదికంటే ఈసారి రైతుల సంఖ్య 12 వేలు పెరిగింది. వారికి కూడా పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అవకాశం కలి్పంచింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకల్లా రిజి్రస్టేషన్లు, ఆన్లైన్ రికార్డుల ప్రక్రియ పూర్తయిన భూములకు దరఖాస్తు చేసకునే అవకాశం ఇచ్చారు. బ్యాంక్ అకౌంట్ వివరాల్లో మార్పులు, గతంలో సాంకేతిక కారణాల (డీబీటీ ఫెయిల్యూర్)తో రైతు భరోసా అందని వారు కూడా మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. అర్హులైన రైతులు ఈనెల 25 వరకు సంబంధిత వ్యవసాయ విస్తీర్ణ అధికారులను సంప్రదించి తమ దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు.స్పష్టత కరువు..యాసంగికి సంబంధించిన రైతు భరోసా కోసం రైతులు మూడు నెలలుగా ఎదురుచూస్తున్నారు. కొందరైతే పెట్టుబడి సాయంపై ఆశలు వదులుకున్నారు. ఆలస్యం జరిగినా యాసంగి పెట్టుబడి సాయం నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం మూడు రోజుల క్రితం ప్రకటించింది. ఈనెల 22 న మొదటి విడతలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులకు నిధులను విడుదల చేస్తామని, 20 రోజుల తర్వాత రెండో విడత, ఏప్రిల్ చివరలో మూడో విడత నిధులు విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. అయితే రెండు, మూడు విడతలలో ఎన్ని ఎకరాలలోపు రైతులకు ఎప్పుడు రైతు భరోసా ఇస్తారన్న దానిపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ పరిషత్ ఎన్నికల కోడ్ వస్తే నిధులు జమ చేయడం కొనసాగిస్తారా, ఆపేస్తారా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. దీంతో అందరికీ పెట్టుబడి సాయం అందుతుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు యాసంగి సాయమే ఇంత ఆలస్యంగా ఇస్తుండడంతో వానాకాలంలో రైతుభరోసా ఇస్తారో లేదోనన్న చర్చ రైతుల్లో నడుస్తోంది. -
క్వారీ కాలుష్యంతో అవస్థలు పంటలు బుగ్గిపాలు .. రైతుల ఆందోళన
-
తెలంగాణ రైతులకు శుభవార్త
హైదరాబాద్: తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ నెల 22వ తేదీన రైతు భరోసా మొదటి విడత నిధుల విడుదల చేయనుంది. సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో నిధులు విడుదల చేయనున్నారు సీఎం రేవంత్రెడ్డి. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నిధుల్ని మొత్తం మూడు విడతల్లో విడుదల చేయనున్నారు . తొలి విడతగా రూ. 3, 590 కోట్ల నిధులు విడుదల చేయనుండగా, రెండో విడతగా రూ. 2, 650 కోట్ల నిధులు విడుదల చేయనున్నారు. ఈ నెల 22వ తేదీన తొలి విడత, ఆపై 20 రోజుల తర్వాత రెండో విడత నిధులు విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. మొత్తం మూడు విడతల్లో రూ. 9 వేల కోట్ల నిధులను విడుదల చేయనున్నారు.డైలమాకు తెర..!గత యాసంగిలో రైతు భరోసా పెట్టుబడి సాయం ముందుగానే రైతుల ఖాతాల్లో ఎకరానికి 6 వేల చొప్పున జమ చేసిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుత యాసంగిలో రైతు భరోసా ఇంకా రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తమైంది. చెందుతున్నారు. ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో జమ చేస్తుందో చేయదో అన్న ఆందోళనలో ఉన్న సమయంలో ప్రభుత్వం శుభవార్త చెప్పడంతో రైతుల డైలమాకు తెరపడింది.ప్రస్తుత యాసంగి సీజన్ జిల్లా వ్యాప్తంగా 5,16,327 ఎకరాల్లో వరితో పాటు వివిధ పంటలు సాగయ్యాయి. వరి సుమారు 5 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. పెట్టుబడుల సమయంలో రైతుభరోసా అందక రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది. పొలాలు దున్నకం, విత్తనాలు, ఎరువుల కొనుగోలు, వరి నాట్ల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెట్టుబడి కోసం అధిక వడ్డీకి అప్పులు తీసుకుని యాసంగి సాగును పూర్తి చేశారు. రైతు భరోసా వస్తుందనే ఆశతో అప్పులు చేసి పెట్టుబడి పెట్టారు. తాజాగా రైతు భరోసా నిధులపై ప్రభుత్వ ప్రకటనతో రైతులకు ఊరట లభించింది. -
7 లక్షల మంది రైతులకు బిగ్ షాక్.. వ్యవసాయానికి బాబు ఉరి
-
రైతులతో చంద్రబాబు కూటమి ప్రభుత్వం తొండాట.. పేరుకే అన్నదాత సుఖీభవ, ఆచరణలో అంతా మోసం
-
వ్యవ‘సాయానికి’ ఉరి!
రైతులకు అన్నీ కష్టాలే.. ఐదేళ్లుగా నేను ఎకరా భూమిలో కౌలు సాగు చేస్తున్నాను. రెండేళ్లుగా పెట్టుబడి సాయం అందట్లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతు భరోసా సాయం అందింది. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్నీ కష్టాలే మిగిలాయి. చాలా సార్లు దరఖాస్తు చేసుకున్నాను. ఈ ఏడాదిలో ఈ విడతలోనైనా వస్తుందేమో అని ఆశతో ఎదురు చూశాను. కానీ నా ఆశ నిరాశగానే మారింది. నష్టాలే తప్ప లాభం లేదు. భవిష్యత్తులో కౌలుకు చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. – పినిశెట్టి అచ్చెంనాయుడు, కేజేపురం, మాడుగుల మండలం, ఉమ్మడి విశాఖ జిల్లాసాక్షి, అమరావతి: అన్నదాతా సుఖీభవ.. అంటూ చంద్రబాబు ప్రభుత్వం రైతన్నలను నిలువునా మోసగిస్తోంది. ‘అధికారంలోకి రాగానే కేంద్రం ఇచ్చే దాంతో సంబంధం లేకుండా ప్రతీ రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తాం’ అంటూ సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీకి తూట్లు పొడుస్తోంది. తొలి ఏడాది నిస్సిగ్గుగా రూ.20 వేలు ఎగ్గొట్టింది. రెండో ఏడాది అరకొర సాయంతో చేతులు దులుపుకుంటోంది. భూ యజమానులకు రెండు విడతల్లో రూ.5 వేల చొప్పున రూ.10 వేలు అందించిన ప్రభుత్వం.. మూడో విడతగా శుక్రవారం మరో రూ.4 వేలు జమ చేయబోతున్నట్టు ప్రకటించింది. భూ యజమానులకు రెండేళ్లలో రూ.40 వేలకు గాను రూ.26 వేలు ఎగ్గొట్టడమే కాకుండా, కౌలు రైతులకైతే పైసా సాయం చేయకుండా పూర్తిగా మొండి చేయి చూపిస్తూ ఏకంగా రూ.6,400 కోట్లు ఎగ్గొట్టింది. రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలు రైతులుండగా.. 2024–25లో 9.25 లక్షల మందికి, 2025–26లో 8.24 లక్షల మందికి మాత్రమే సీసీఆర్సీలు (కౌలు రైతు గుర్తింపు కార్డులు) జారీ చేశారు. ఈ లెక్కన చూసినా తొలి ఏడాది 9.25 లక్షల మందికి రూ.20 వేల చొప్పున రూ.1,850 కోట్లు, రెండో ఏడాది 8.24 లక్షల మందికి రూ.1,648 కోట్లు జమ చేయాల్సి ఉండగా, అది కూడా చేయలేదు. మొత్తంగా అన్నదాతలకు రూ.21,273.28 కోట్లు ఎగ్గొట్టింది. మరో వైపు ఐదేళ్ల పాటు పైసా భారం లేకుండా అండగా నిలిచిన ఉచిత పంటల బీమా పథకాన్ని అటకెక్కించి.. సున్నా వడ్డీకి చాప చుట్టేసి.. ఇన్పుట్ సబ్సిడీకి ఎగనామం పెట్టింది. విత్తు నుంచి విఫణి వరకు గ్రామ స్థాయిలో రైతులను చేయి పట్టి నడిపించిన రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసింది. మరో వైపు గత రెండేళ్లలో ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కకపోయినా ఆదుకున్న పాపాన పోలేదు. అయినా సరే నిస్సిగ్గుగా తామేదో రైతులను ఉద్దరిస్తున్నట్టు అన్నదాత సుఖీభవ వారోత్సవాల పేరిట సంబరాలు నిర్వహిస్తున్నట్టు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించడం పట్ల రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 7 లక్షల మందికి ఎగనామంసూపర్ సిక్స్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున రెండేళ్లలో రూ.40 వేల పెట్టుబడి సాయం అందించాలి. 2023–24లో అర్హత పొందిన 53,58,366 మందికి రూ.20 వేల చొప్పున ఏటా రూ.10,716.73 కోట్లు జమ చేయాలి. కానీ 2024–25 తొలి బడ్జెట్లో ఈ పథకానికి రూ.1,000 కోట్లు కేటాయించినా పైసా ఖర్చు చేయలేదు. అదిగో ఇదిగో అంటూ తొలి ఏడాది నిస్సిగ్గుగా ఎగ్గొట్టేసింది. పాత బకాయిలతో కలిపి 2025–26 బడ్జెట్లో రూ.21,433.46 కోట్లు కేటాయింపులు జరపాల్సి ఉండగా, కేవలం రూ.6,300 కోట్లతో సరిపెట్టింది. గతంలో వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందుగానే పెట్టుబడి సాయం అందించి వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలిచేది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తొలి ఏడాది ఎగ్గొట్టి, రెండో ఏడాది తనకు నచ్చినప్పుడు రూ.5 వేల చొప్పున 2 విడతల్లో రూ.10 వేలు జమ చేసింది. వాస్తవానికి 2023–24 అర్హుల జాబితా ప్రకారం 53.58 లక్షల మందికి జమ చేయాల్సి ఉండగా, పలు సాకులతో 46.85 లక్షల మందికి కుదించింది. అంటే దాదాపు 7 లక్షల మందికి కోత పెట్టింది. మరో వైపు భూ యజమానులతో పాటు తొలి ఏడాది కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం ఎగ్గొట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. రెండో ఏడాది వాస్తవ సాగుదారులకు పంగనామాలు పెట్టింది. రైతు కూలీలు, కౌలు రైతులను ఆదుకుంటామని ఎన్నికల సమయంలో కృష్ణాజిల్లా పామర్రు, ఉయ్యూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ఇచ్చిన హామీ మూడో విడతలోనూ కోతలే⇒ నిజానికి ఏటా భూ యజమానులతో పాటు కౌలుదారుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2019–20లో 46.69 లక్షల మందికి లబ్ధి చేకూర్చగా, 2023–24కు వచ్చేసరికి లబ్ధిదారుల సంఖ్య 53.58 లక్షలకు పెరిగింది. ఇలా ఐదేళ్లలో ఈ పథకం కింద రూ.34,288.17 కోట్ల లబ్ధి చేకూరింది. ఆ లెక్కన గడిచిన రెండేళ్లలో లబ్ధిదారుల సంఖ్య పెరగాల్సింది పోయి తగ్గిపోయింది. ⇒ ఆరు దశల వడపోత అనంతరం లబ్ధిదారుల సంఖ్య 46.86 లక్షలకు కుదించారు. పైగా వీరిలో 1.16 లక్షల మంది అటవీ సాగుదారులున్నారు. ఆ లెక్కన వెబ్ల్యాండ్ డేటా ప్రకారం తొలి రెండు విడతల్లో లబ్ధి పొందిన భూ యజమానుల సంఖ్య కేవలం 45.70 లక్షల మంది మాత్రమే. ⇒ చనిపోయిన రైతుల స్థానంలో గతంలో వారి వారసులకు పెట్టుబడిసాయం అందించేవారు. కానీ, నేడు ఆ పరిస్థితి లేదు. తొలి విడతలో తామిస్తామన్న రూ.20 వేల చొప్పున రూ.10,716.73 కోట్లు ఎగ్గొట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. రెండో ఏడాది 46.86 లక్షల మందికి రూ.ఐదు వేల చొప్పున రెండు విడతల్లో రూ.4,685.84 కోట్లు జమ చేసింది. కాగా పీఎం కిసాన్ కింద కేంద్రం జమ చేసే సొమ్ములను కూడా తమ ఖాతాలో వేసుకొని అసెంబ్లీ సాక్షిగా రూ.6,309.44 కోట్లు జమ చేశామని నిస్సిగ్గుగా ప్రకటించుకుంది.⇒ జగన్ హయాంలో అర్హత ఉండీ లబ్ధి పొందని వారు ఎవరైనా ఉంటే వెతికి వెతికి సాయం అందించేవారు. కానీ నేడు అన్నదాత సుఖీభవ తమకు జమ కాలేదంటూ వేలాది మంది గ్రీవెన్స్లో ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. శుక్రవారం నుంచి మూడో విడత పంపిణీ కార్యక్రమంలో రూ.4 వేల చొప్పున రూ.1,874.34 కోట్లు జమ చేయబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సాయంతో కలిపి 2025–26 సీజన్లో రూ.6,560.18 కోట్లు జమ చేసినట్టవుతుంది. వాస్తవానికి రెండేళ్లలో ఒక్కో రైతుకు రూ.40 వేల చొప్పున రూ.21,433.46 కోట్లు జమ చేయాల్సి ఉండగా, ఏకంగా రూ.14,873.28 కోట్లు నిస్సిగ్గుగా ఎగ్గొట్టింది.సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ప్రతి రైతుకూ ఏడాదికి రూ. 20 వేల ఆర్థిక సాయం అందిస్తామంటూ తెలుగుదేశం కరపత్రిక ఈనాడులో చంద్రబాబు ఇచ్చిన ప్రకటన , తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో వ్యవసాయరంగానికి ఇచ్చిన హామీలు కౌలు రైతులకు రూ.6,400 కోట్లు ఎగనామం⇒ భూ యజమానులతో పాటు సామాజిక వర్గాలకు అతీతంగా వాస్తవ సాగుదారులైన కౌలు రైతులతో పాటు దేవదాయ, ధర్మాదాయ భూ సాగుదారులందరికీ ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కో ఊరూవాడ విస్తృతంగా ప్రచారం చేసింది. ఆచరణకు వచ్చేసరికి తొలి ఏడాది భూ యజమానులతో పాటు కౌలు రైతులకు ఎగ్గొట్టారు. ⇒ రెండో ఏడాది తొలివిడత సాయం పంపిణీ వేళ.. ఖరీఫ్–2025 సీజన్లో పంట నమోదు (ఈ క్రాప్) ప్రామాణికంగా కౌలు రైతుల డేటా ధ్రువీకరణ చేపట్టి, ఆ తర్వాత అర్హత పొందిన వారికి రెండు విడతలు కలిపి జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రెండో విడత సాయం పంపిణీ సమయంలో కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ పూర్తి కావచ్చిందని, త్వరలోనే జమ చేస్తామంటూ వారిని మభ్యపెట్టారు. ⇒ కనీసం చివరి విడతలోనైనా తమకు ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇస్తుందేమోనని రాష్ట్రంలోని కౌలు రైతులందరూ ఆశగా ఎదురు చూశారు. కానీ వారి ఆశలను ఆడియాశలు చేస్తూ వారి నోట్లో మట్టికొట్టారు. దేవదాయ భూ సాగుదారులనూ మోసం చేశారు. సీసీఆర్సీలతో సంబంధం లేకుండా కౌలు సాగుదారులందరికీ పథకాన్ని వర్తింప చేయాలంటే రెండేళ్లలో రూ.6,400 కోట్లు జమ చేయాలి. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నిండా ముంచారు. అటకెక్కిన ఉచిత పంటల బీమా⇒ గత ప్రభుత్వ హయాంలో సాగైన ప్రతీ పంటను ఈ క్రాప్లో నమోదు చేసేవారు. ఈ క్రాప్ నమోదే ప్రామాణికంగా ఉచిత పంటల బీమా పరిహారంతో పాటు వైపరీత్యాల్లో పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించేవారు. కానీ నేడు ఈ క్రాప్ నిర్వీర్యమైపోయింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమాను అటకెక్కించారు. స్వచ్ఛంద నమోదు బీమా అంటూ రైతుల నోట్లో మట్టికొట్టారు. ⇒ 2023–24 వ్యవసాయ సీజన్కు సంబంధించి రైతుల వాటాతో పాటు ప్రభుత్వ వాటా ప్రీమియం మొత్తం రూ.930 కోట్లు జూన్ 2024లో జమ చేయాల్సి ఉండగా, అదే సమయంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చెల్లించకుండా ఎగ్గొట్టింది. ఫలితంగా 2023–24 సీజన్కు సంబంధించి రూ.1,324 కోట్ల బీమా పరిహారం రైతులకు అందకుండా మోకాలొడ్డింది. ⇒ ఖరీఫ్ 2024 సీజన్లో రైతుల వాటాతో పాటు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.834.44 కోట్లతో పాటు రబీ 2024–25, ఖరీఫ్–2025 సీజన్లలో ప్రభుత్వం తమ వాటా కింద చెల్లించాల్సిన రూ.260.67 కోట్లు ఎగ్గొట్టడంతో రబీ 2025–26 సీజన్లో ఏపీని కంపెనీలు బ్లాక్ లిస్ట్లో పెట్టేశాయి. ఇలా గడిచిన మూడు సీజన్లలో రూ.3,500 కోట్లకుపైగా బీమా పరిహారం రైతులకు అందకుండా దగా చేసింది.⇒ దాదాపు 12 లక్షల మంది రైతులకు రెండేళ్లలో రూ.500 కోట్ల సున్నా వడ్డీ రాయితీని ఎగ్గొట్టారు. వరుస వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న దాదాపు ఆరున్నర లక్షల మందికి రూ.1,000 కోట్లకు పైగా పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) ఇవ్వకుండా ఎగనామం పెట్టారు.రెండేళ్లలో రూ.500 కోట్ల సున్నా వడ్డీ రాయితీకి ఎగనామంఏ ఒక్క పంటకూ దక్కని మద్దతు ధర⇒ మద్దతు ధర దక్కని సమయంలో మార్కెట్లో జోక్యం చేసుకొని రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు ఉద్దేశించిన ధరల స్థిరీకరణ నిధిని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తేసింది. ధాన్యం మొదలు పత్తి, మిరప, పొగాకు, టమాటా, ఉల్లి, మినుము, పెసలు, కంది, శనగ, జొన్న, మొక్కజొన్న, సజ్జ ఇలా ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కకపోయినా ఆదుకోలేదు.ధరల స్థిరీకరణ నిధికి మంగళం⇒ వైఎస్ జగన్ హయాంలో రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు. తద్వారా ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్లో జోక్యం చేసుకుని, వ్యాపారుల మధ్య పోటీ పెంచి రైతులకు మద్దతు ధర కల్పించే వారు. ఇలా ఐదేళ్లలో 6.20 లక్షల మంది రైతుల నుంచి రూ.7,577 కోట్ల మేర పంట ఉత్పత్తులు కొనుగోలు చేశారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు.అప్పుల ఊబిలో రైతులు⇒ చంద్రబాబు సర్కార్ నిర్వాకంతో 21 నెలల్లో రూ.35 వేల కోట్లకుపైగా రైతులు నష్టపోయారు. ఫలితంగా అప్పుల ఊబిలో కూరుకుపోయి పెద్ద సంఖ్యలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2024–25లో దాదాపు 150 మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడగా, 2025–26లో 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్ర పోలీస్ శాఖే అధికారికంగా వెల్లడించింది. రైతులను చేయి పట్టుకుని నడిపించిన ఆర్బీకేలు నిర్వీర్యంఇది నమ్మించి మోసం చేయడమే నాలుగు ఎకరాల ఆలయ మాన్యం భూమిని కౌలుకు సాగు చేస్తున్నాను. డ్రిప్ సహాయంతో వేరుశనగ, టమాటా పంట వేశాను. పంట దిగుబడి రాక, పెట్టుబడులు తలకు మించిన భారమై రెండేళ్లుగా రూ.10 లక్షల వరకు అప్పులయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్క పైసా కూడా సహాయం అందించలేదు. మొదటి ఏడాది ఆశలు వదులుకున్నాం.ఈ ఏడాది అయినా నగదు జమ చేస్తుందని ఆశించిన మాకు ప్రభుత్వం మొండిచేయి చూపింది. కౌలు రైతులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక పోయారు. ఇది నమ్మించి మోసం చేయడమే. – కురుబ రాము, కోనాపురం, ఉరవకొండ మండలం, అనంతపురం జిల్లా కౌలు రైతులను గుర్తించాలి కూటమి ప్రభుత్వం వచ్చాక కౌలు రైతుల ఊసే లేకుండా పోయింది. మొదటి ఏడాది అన్నదాత సుఖీభవకు ఎగనామం పెట్టారు. రెండో ఏడాది గడుస్తున్నా కౌలు రైతు గురించి పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. ప్రస్తుతం రబీ సీజన్లో సైతం 1.5 ఎకరాల్లో మినుము పంట సాగు చేశా. ఎకరాకు నాలుగు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. అధిక వర్షాలతో పంట సరిగా చేతికందక అప్పులపాలయ్యా. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కౌలు రైతులను గుర్తించి అన్నదాత సుఖీభవ మంజూరు చేయాలి. – సుబ్బరాయుడు, మీరాపురం, కమలాపురం మండలం, వైఎస్సార్ కడప జిల్లాకౌలు రైతులకు మొండిచేయి ప్రతి ఏడాది మూడెకరాల పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాను. ప్రస్తుత ప్రభుత్వంలో కౌలు రైతుల్లో కొందరికే గుర్తింపు కార్డులు ఇచ్చారు. చాలా మందికి ఇవ్వలేదు. గుర్తింపు కార్డులు ఇచ్చిన వారికి కూడా పెట్టుబడి సాయం కింద అందజేసే అన్నదాత సుఖీభవ వర్తింప చేయక పోవడం అన్యాయం. నాలాంటి కౌలు రైతులకు ఒక్క సంక్షేమ పథకం కూడా అందడం లేదు. గత ప్రభుత్వంలో కౌలు రైతులకు సైతం రైతు భరోసా ద్వారా ఆర్థిక సాయం అందజేశారు. – పట్టాభయ్య, యానాదివెట్టు, వరదయ్యపాళెం మండలం, తిరుపతి జిల్లా ధరలేక తెగనమ్ముకున్నా నాకు రెండు ఎకరాల సొంత భూమి ఉంది. ఏటా రెండు కార్లు వరి పండిస్తున్నాను. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ధాన్యానికి గిట్టుబాటు ధర లభించేది. అప్పట్లో పుట్టి (850 కేజీలు) రూ.22 వేలకు అమ్ముకున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024, 2025లో వేసిన ఎడగారుకు గిట్టుబాటు ధర లభించక పుట్టి రూ.14 వేలు చొప్పున తెగనమ్ముకున్నాను. పుట్టికి రూ.8 వేలు చొప్పున 5 పుట్లకు ఏటా రూ.40 వేలు నష్టపోయాను. రెండేళ్లల్లో నాలుగు పంటలకు రూ.1.60 లక్షలు నష్టపోయాను. రైతులకు గిట్టుబాటు ధర కలి్పంచలేని ఈ ప్రభుత్వాలు ఎందుకు? మేనిఫెస్టోలో ఏం చెప్పారు? అధికారంలోకి వచ్చాక ఏం చేస్తున్నారు?– గుడిపాటి ప్రభాకర్నాయుడు, యనమదల, చేజర్ల మండలం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మద్దతు ధర అడియాశే చంద్రబాబు కూటమి పాలనలో రైతులకు ఒరిగిందేమీ లేదు. వేలకు వేలు పెట్టుబడులు పెట్టి పంట చేతికొచ్చాక దళారులు, మిల్లర్లు దోచేశారు. గత ఖరీఫ్ సీజన్లో మూడెకరాల్లో వరి సాగు చేశాను. వరిలో తేమ శాతం సాకుగా చూపి 75 కిలోలు బస్తాకు రూ.300పైగా దోచేశారు. అండగా నిలవాల్సిన ప్రభుత్వం, అధికారుల్లో చలనం లేదు. రైతు పక్షాన నిలబడలేదు. పండించిన పంటకు మద్దతు ధర దక్కకపోగా దళారులు, మిల్లర్లు మిలాకత్ అయ్యి రైతులను అడ్డంగా దోచుకున్నారు. ఆఖరికి రవాణా వాహనాలు కూడా మేమే చూసుకోవాల్సి వచ్చింది. పేరుకేమో రైతు సంక్షేమ ప్రభుత్వం. వాస్తవంలో మాత్రం రైతు గోడు పట్టించుకోవటం లేదు. – కొండవీటి వెంకట సుబ్బారావు, మంతెన, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా చాలా అన్యాయం నేను నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని సాగుచేస్తున్నాను. కానీ నాకు అన్నదాత సుఖీభవ పథకం రాలేదు. ఇదేమని ప్రశ్నిస్తుంటే అధికారులు సమాధానం చెప్పడం లేదు. కౌలు రైతులకు సైతం అన్నదాత సుఖీభవ పథకం అందిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. కానీ ఇప్పుడు మాకు వర్తించలేదు. వైఎస్సార్సీపీ హయాంలో రైతు భరోసా వచ్చేది. ఇప్పుడు ఆగిపోయింది. అసలు కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇస్తారా.. ఇవ్వరా తేల్చి చెప్పండి. – అమర లింగడు, కాగువాడ గ్రామం, పాతపట్నం మండలం, శ్రీకాకుళం జిల్లా వడ్డీకి అప్పుతెచ్చి పంటల సాగు నేను రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి, అపరాల పంటలు సాగు చేస్తున్నాం. జగన్ ప్రభుత్వంలో వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందేది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి సాయం అందలేదు. అన్నదాత సుఖీభవ పథకం సాయం కోసం సచివాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. – దివిలి శ్రీను, తోడుగెడ్డ, మెంటాడ మండలం, విజయనగరం జిల్లా రెండేళ్లుగా ఇన్పుట్ సబ్సిడీ ఊసే లేదు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గరగా రెండేళ్లవుతోంది. ఇప్పటి వరకు రైతులకు అందాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఊసే లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ సమయానికి అందేది. – అనుసూరి గోవిందు, ఉండూరు, రామచంద్రపురం మండలం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మొత్తంగా రూ.40 వేలు జమ చేయాలిపీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద ఇస్తామన్న రూ.20 వేల పెట్టుబడి సాయం కౌలు రైతులకు తొలి ఏడాది ఎలాగూ ఎగ్గొట్టారు. రెండో ఏడాది అయినా ఇస్తారనుకుంటే దగా చేశారు. కనీసం మూడో విడతతో కలిపి అయినా ఇస్తారనుకుంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా లేదు. గతేడాది ఎగ్గొట్టిన బకాయిలతో పాటు మొత్తంగా రూ.40 వేలు జమ చేయాలి. – వై.రాధాకృష్ణ, ఎం.హరిబాబు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఏపీ కౌలు రైతుల సంఘంఇతని పేరు పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కలవకూరు గ్రామం. ఇతనికి నాలుగు ఎకరాల పొలం ఉంది. కొంత వరి పంట, మరి కొంత మొక్కజొన్న సాగు చేస్తుంటాడు. ప్రకృతి వైపరీత్యాల వల్ల వేసిన పంట నష్టపోయి దిగుబడులు పూర్తిగా తగ్గిపోయాయి. ఎకరాకు 25 బస్తాలు వరి ధాన్యం దిగుబడి వచ్చింది. కొనుగోలు చేసిన నాథుడే లేదు. కూటమి ప్రభుత్వం క్వింటా రూ.1,800కు కొనుగోలు చేస్తుందని చెప్పిందే కానీ ఆ ధరతో కొనలేదు. దీంతో చివరకు రూ.1300కే దళారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. మొక్కజొన్న దిగుబడులు అంతంత మాత్రంగానే వచ్చాయి. మద్దతు ధర క్వింటా రూ.2,300తో ప్రభుత్వం కొనలేదు. దళారులకు రూ.1600కే అమ్ముకున్నాడు. దాంతో అప్పుల పాలయ్యాడు. వర్షాలకు పంట దెబ్బతిన్నా నష్ట పరిహారం ఇంత వరకు అందలేదు. ఇతని పేరు శేఖర్రెడ్డి. నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పి.లింగాపురం గ్రామం. 2025ృ26 ఖరీఫ్ సీజన్లో ఎనిమిది ఎకరాల్లో మొక్కజొన్న, నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. ప్రస్తుతం రబీ సీజన్కు ఎనిమిది ఎకరాల్లో మొక్కజొన్న, 13ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేశాడు. ఖరీఫ్లో నాలుగు ఎకరాల్లో సాగుచేసిన పత్తిపంటకు రూ.6 వేల ప్రీమియం చెల్లించి పంటల బీమా చేయించాడు. 2025 ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో కురిసిన అధిక వర్షాలతో పత్తిపంట దెబ్బతిని దిగుబడి ఎకరాకు మూడు క్వింటాళ్లే వచ్చింది. పత్తిపంట దెబ్బతిన్న విషయాన్ని రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సిబ్బందికి తెలపటంతో పంట ఫొటోలు తీసుకొని వెళ్లి ప్రభుత్వానికి పంపించారు. ఇప్పటిదాకా ఒక్కరూపాయి కూడా బీమా డబ్బులు మంజూరు చేయలేదు. జగన్ పాలనలో పైసా ప్రీమియం చెల్లించకపోయినా రూ.50 వేల వరకు పంటనష్ట పరిహారం మంజూరైంది.ఇతని పేరు తామరపల్లి ముసలయ్య. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం అర్జునుడుపాలెం శివారు పెద్దిరెడ్డిపాలెం స్వగ్రామం. 4 ఎకరాలు కౌలుకు తీసుకుని పంట సాగు చేస్తున్నాడు. ఏటా పంట సాగు ఖర్చు రూ.లక్ష వరకు అవుతోంది. గత ప్రభుత్వంలో ఏటా పెట్టుబడి సాయం అందేది. ఈ ప్రభుత్వం వచ్చాక మరింతగా పెట్టుబడి సాయం అందుతుందని ఎదురు చూశాడు. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది అయినా ఇస్తారనుకుంటే రూపాయి కూడా ఇవ్వలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు మూడో విడతలో అయినా సాయం అందుతుందని ఎంతగానో ఆశలు పెట్టుకున్నా, నిరాశే ఎదురైందని నిట్టూరుస్తున్నాడు. ఇలాంటప్పుడు కౌలు రైతుగా గుర్తింపు కార్డు ఇచ్చినా ఏం ఉపయోగం? అని ప్రశ్నిస్తున్నాడు. -
రైతులకు సంవత్సరానికి 20,000 ఇస్తాను: చంద్రబాబు వ్యాఖ్యలు
-
చి‘వరి’ ఆశలు!
మునుగోడు/ముస్తాబాద్/వీర్నపల్లి(సిరిసిల్ల): యాసంగి సీజన్ ఆరంభంలో పుష్కలంగా నీరు పోసిన బోర్లు.. ఇప్పుడు పంట చేతికి వచ్చే సమయంలో భూగర్భ జలాలు పడిపోవడంతో రైతులు వేల రూపాయలు ఖర్చు చేసి.. ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించి పొలాలకు పెడుతున్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామంలో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో బోర్లు వట్టిపోతున్నాయి. గ్రామంలో దాదాపు 50 మందికి పైగా రైతులు ట్యాంకర్లతో నీటిని తెప్పించి పొలాలకు పెడుతున్నారు. ఒక్కొక్క ట్యాంకర్ నీటికి రూ.వెయ్యి నుంచి రూ.1500 తీసుకుంటున్నారు. ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించుకునే స్థోమత లేని రైతులు వరి పంటను అలాగే వదిలేస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఎండుతున్న వరిపంటను పలువురు రైతులు పశువులకు మేతగా వదిలి పెడుతున్నారు.ముస్తాబాద్ మండలం సేవాలాల్తండాలో నక్కవాగు పరీవాహక ప్రాంతంలో బోరుబావుల కింద వెయ్యి ఎకరాలలో వరి పంట సాగు చేస్తున్నారు. ఎండలతో నక్కవాగు ప్రవాహం అడుగంటగా సమీపంలోని పొలాలు ఎండిపోయాయి. సేవాలాల్తండాకు చెందిన లకావత్ రవినాయక్ అతని సోదరులు కలిసి నాలుగు ఎకరాలలో వరిపంట సాగు చేయగా.. నీళ్లు లేక ఎండిపోయాయి. దీంతో వారు రూ.1.20 లక్షల వరకు నష్టపోయారు. -
రైతన్నపై రుణపాశం!
సాక్షి, న్యూఢిల్లీ, సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కకపోవడం.. ఏ దశలోనూ చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోకపోవడంతో మోసపోయిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రుణ బకాయిల్లో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉండటం రాష్ట్రంలో సాగు రంగం దుస్థితి, రైతన్నల కడగండ్లకు నిదర్శనంగా నిలుస్తోంది. పెట్టుబడి సాయం అందకపోవడం.. ఎరువుల కోసం నరకయాతన.. ఉచిత పంటల బీమా అటకెక్కడం.. ఇన్పుట్ సబ్సిడీ ఎగిరిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 20 నెలలుగా పెద్ద ఎత్తున రైతుల బలవన్మరణాలు కలవరపరుస్తున్నాయి. పార్లమెంట్ సాక్షిగా ఇదే విషయం మరోసారి స్పష్టమైంది. దేశవ్యాప్తంగా రైతుల వ్యవసాయ రుణ బకాయిల్లో ఏపీ రెండో స్థానంలో ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభకు వెల్లడించారు. 55 శాతం రైతు కుటుంబాలకు రుణ సదుపాయంగతేడాది డిసెంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్ రైతుల వ్యవసాయ రుణ బకాయిలు రూ.3,75,254.59 కోట్లు కాగా ఇందులో పంట రుణ బకాయిలు రూ.2,01,744.41 కోట్లు, వ్యవసాయ టర్మ్ రుణాలు రూ.1,73,510.18 కోట్లుగా ఉన్నాయి. గత డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా రైతుల వ్యవసాయ రుణ బకాయిలు రూ.31,34,807.42 కోట్లుగా ఉన్నట్లు వెల్లడైంది. ఇందులో పంట రుణ బకాయిలు రూ.16,34,219.07 కోట్లు, వ్యవసాయ టర్మ్ రుణాలు రూ.15,00,588.35 కోట్లు ఉన్నాయి. నేషనల్ రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వే నివేదిక ప్రకారం దేశంలో 55 శాతం వ్యవసాయ కుటుంబాలు క్రెడిట్ సౌకర్యాన్ని పొందుతున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. బ్యాంకులకు ప్రాధాన్యతా రంగ రుణ లక్ష్యాలను నిర్దేశించడంతోపాటు కిసాన్ క్రెడిట్ కార్డ్, పీఎం కిసాన్, పీఎం ఫసల్ బీమా యోజన, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన లాంటి పథకాలతో రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు పంకజ్ చౌదరి చెప్పారు. ఇక తెలంగాణలో వ్యవసాయ రుణ బకాయిలు మొత్తం రూ.1,75,960.56 కోట్లుగా ఉన్నాయి. ఇందులో పంట రుణాలు రూ. 95,167.98 కోట్లు, టర్మ్ రుణాలు రూ. 80,792.58 కోట్లుగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. కాగా రూ.5,06,290.45 కోట్ల వ్యవసాయ రుణ బకాయిలతో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది.అన్నదాతల నోట్లో మట్టి..చంద్రబాబు పాలనలో గత 20 నెలల్లో రాష్ట్రంలో రైతన్నలు అన్ని విధాలుగా మోసపోయారు. తామ అధికారంలోకి వస్తే కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాతా సుఖీభవ కింద ప్రతీ రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని ఇచ్చిన హామీని తొలి ఏడాది నిస్సిగ్గుగా ఎగ్గొట్టారు. ఏటా రూ.20 వేల చొప్పున రెండేళ్లలో రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.30 వేలు ఎగ్గొట్టి రూ.10 వేలతో సరిపెట్టారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉండగా 6,72,428 మందికి పూర్తిగా ఎగనామం పెట్టారు. రెండేళ్లలో రూ.21,433.46 కోట్లు పెట్టుబడి సాయంగా అందించాల్సి ఉండగా కేవలం రూ.4,685.84 కోట్లు విదిల్చారు. రైతులకు మొత్తం రూ.16,748 కోట్లు సాయాన్ని ఎగ్గొట్టారు.ఉచిత పంటల బీమాను అటకెక్కించి.. ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టిచంద్రబాబు అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమాను అటకెక్కించారు. స్వచ్ఛంద నమోదు బీమా అంటూ రైతుల నోట్లో మట్టికొట్టారు. 2023–24 వ్యవసాయ సీజన్కు సంబంధించి రైతుల వాటాతో పాటు ప్రభుత్వ వాటా ప్రీమియం మొత్తం రూ.930 కోట్లు 2024 జూన్లో జమ చేయాల్సి ఉండగా, అదే సమయంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చెల్లించకుండా ఎగ్గొట్టింది. ఫలితంగా రూ.1,324 కోట్ల బీమా పరిహారం రైతులకు అందకుండా మోకాలొడ్డారు. 2024 ఖరీఫ్ సీజన్లో రైతుల వాటాతో పాటు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.834.44 కోట్లతో పాటు రబీ 2024–25, ఖరీఫ్–2025 సీజన్లలో ప్రభుత్వం తమ వాటా కింద చెల్లించాల్సిన రూ.260.67 కోట్లు ఎగ్గొట్టడంతో రబీ 2025–26 సీజన్లో ఏపీని కంపెనీలు బ్లాక్ లిస్ట్లో పెట్టేశాయి. ఇలా రూ.3,500 కోట్లకుపైగా బీమా పరిహారం రైతులకు అందకుండా చంద్రబాబు సర్కారు దగా చేసింది. మరోవైపు దాదాపు 12 లక్షల మందికి రూ.500 కోట్ల మేర సున్నా వడ్డీ రాయితీ సొమ్మును ఎగ్గొట్టారు. వరుస వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న దాదాపు ఆరున్నర లక్షల మందికి రూ.వెయ్యి కోట్లకు పైగా పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) ఇవ్వకుండా ఎగనామం పెట్టారు.దక్కని ‘మద్దతు’... ఆత్మహత్యలు..మద్దతు ధర దక్కని సమయంలో మార్కెట్లో జోక్యం చేసుకొని రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు ఉద్దేశించిన ధరల స్థిరీకరణ నిధిని చంద్రబాబు ఎత్తేశారు. ధాన్యం మొదలు పత్తి, మిరప, ఉల్లి, చీనీ, పొగాకు, టమాటా, పసుపు, పెసర, మినుము, కంది.. ఇలా ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కక అల్లాడుతున్నా ఆదుకున్న దాఖలాలు లేవు. రైతులకు పైసా సాయం చేసిన పాపాన పోలేదు. పెరిగిన పెట్టుబడి ఖర్చులకు తోడు వరుస వైపరీత్యాలతో సాగు, దిగుబడులు తగ్గిపోయి భారీగా నష్టం వాటిల్లింది. గత 20 నెలల్లో దిగుబడులు తగ్గిపోవడం, మద్దతు ధర కోల్పోయి దాదాపు రూ.35 వేల కోట్లకుపైగా రైతులు నష్టపోయారు. మరోవైపు రైతు ఆత్మహత్యలు కలవరపరుస్తున్నాయి. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది దాదాపు 150 మందికి పైగా చనిపోగా 2025–26లో 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్యలకు ఒడిగట్టినట్లు రాష్ట్ర పోలీస్ శాఖే అధికారికంగా వెల్లడించడం రాష్ట్రంలో రైతన్నల దయనీయ పరిస్థితులకు అద్దం పడుతోంది. -
ఏపీ రైతులపై అత్యధిక అప్పుల భారం..
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రైతులు దేశంలోనే అత్యధిక అప్పుల భారాన్ని మోస్తున్నారు. 2025, డిసెంబర్ 31 నాటికి ఏపీలో రైతన్నల నెత్తిన 3,75,254 కోట్ల రూపాయల అప్పుల భారం పడింది. ఈ పరిస్థితిని కేంద్ర వ్యవసాయశాఖ పార్లమెంట్లో అధికారికంగా వెల్లడించింది. లోక్ సభలో లిఖిత పూర్వక ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. రైతుల పై 2,01,744 కోట్ల రూపాయల పంట రుణాల భారం ఉండగా, టర్మ్ లోన్ భారం 1,73,510 కోట్ల రూపాయలగా ఉంది. మొత్తం కలిపి రైతులపై 3,75,254 కోట్ల రూపాయల రుణ భారంగా మారింది. దేశంలో తమిళనాడు తర్వాత రుణభారం లో తల్లడిల్లుతున్నారు ఏపీ రైతులు.ఫలితంగా దేశంలోనే రైతుల రుణభారంలో రెండో స్థానంలో ఏపీ ఉంది. చంద్రబాబు నాయుడు పరిపాలనలో రైతులకు ఆదరణ కరువు అన్న దానికి ఇది సంకేతంగా నిలుస్తుంది. అరకొరగా రైతులకు వాగ్దానాలు అమలు చేస్తుండటంతో ఏపీ రైతులపై అప్పుల భారం తడిపి మోపడైంది. ఇక పక్క రాష్ట్రం తెలంగాణలో రైతులపై 1,75,960 కోట్ల రూపాయల అప్పుల భారం ఉంది. తెలంగాణలో రైతులపై క్రాప్ లోన్ 95,167 కోట్లు రూపాయలు, 80,792 కోట్ల రూపాయల టర్మ్ లోన్ గా ఉంది. -
నా భూమిని ఎలా తీసుకుంటారో నేను చూస్తా.. అమరావతి రైతు కౌంటర్
-
రైతు నెత్తిన పాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాల దిగుబడి పెంపు కోసం కొత్త పథకం తెరపైకి వచ్చింది. రూ.2వేల కోట్ల వ్యయ అంచనాలతో 2026–27 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకం అమలు చేయడం ద్వారా ప్రతి యేటా పెద్ద సంఖ్యలో ఆవులను రైతులకు సబ్సిడీపై ఇవ్వాలని పశుసంవర్థ్ధక శాఖ ప్రతిపాదించింది. ఈ పథకాన్ని సబ్సిడీపై అమలు చేయాలని, ఆవుల కొనుగోలు నుంచి పోషణ వరకు యూనిట్గా లెక్కించి అందులో సగం రైతు భరిస్తే మరో సగం ప్రభుత్వం భరించేలా ఆర్థిక అంచనాలను రూపొందించింది. పశుసంవర్థ్ధక శాఖ ప్రతిపాదనల ప్రకారం హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తారు. మూడు సంవత్సరాల కాలంలో ప్రతి ఏటా ప్రతి జిల్లాలో 830 మంది రైతులకు రెండు చొప్పున ఆవులను అందజేస్తారు. ఇందుకుగాను రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి 26,560 మంది చొప్పున మూడేళ్ల కాలంలో 79,680 మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఆవుల కొనుగోలు నుంచి పోషణ వరకు అన్ని ఖర్చులను లెక్కించి యూనిట్కు రూ.2,51,000 ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు పథకం అమలు కోసం ప్రతి యేటా రూ.667.98 కోట్లు ఖర్చవుతాయని, మూడేళ్ల కాలంలో రూ. 2,003 కోట్లు అవసరమవుతాయని ప్రతి పాదించారు. అయితే, యూనిట్ కాస్ట్లో సగం రైతులు భరించాల్సి ఉన్నందున రైతు చెల్లించే వాటా పోను రూ.1,000 కోట్ల ప్రభుత్వ నిధులతో 1.6లక్షల ఆవులను మూడేళ్ల కాలంలో రాష్ట్ర రైతాంగానికి అందించవచ్చని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ పథకం అమలు ద్వారా పాల ఉత్పత్తి లక్ష్యం మరింత చేరువవుతుందని అధికారులు చెబుతున్నారు. మరి, పశుసంవర్ధక శాఖ ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే...! -
రైతు భరోసా లేనట్టేనా?
మోర్తాడ్(బాల్కొండ): అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా అందిస్తోంది. అయితే, ప్రస్తుత యాసంగి సీజన్ పంటల సాగు మధ్య దశకు చేరుకున్నా పెట్టుబడి సాయంపై ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడకపోవడంపై రైతులు నిరాశ చెందుతున్నారు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో భరోసాపై నిర్ణయం తీసుకుంటారని రైతులు భావించారు. అయితే పెట్టుబడిసాయం విడుదలపై ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఈసారి రైతు భరోసా లేనట్లేనా అనే సందేహం రైతుల్లో వ్యక్తమవుతోంది.షెడ్యూల్ దాటినా..గడిచిన వానాకాలం సీజన్లో జిల్లాలోని 2,98,472 మంది రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.326.03 కోట్లు జమ చేశారు. యాసంగి సీజన్ కోసం షెడ్యూల్ ప్రకారం గతేడాది డిసెంబర్లోనే రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.6వేల చొప్పున సాయం సొమ్ము జమ చేయాల్సి ఉంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిధుల విడుదల ఆలస్యమైందని రైతులు భావించారు. ఎన్నికల తంతు ముగియడంతో పెట్టుబడి సాయం వస్తుందని నిరీక్షించినా నిరాశే మిగిలిందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి రైతు భరోసాకు నిధులు విడుదల చేస్తే ఊరట లభిస్తుందని అంటున్నారు. -
నోటమాట రావట్లే!
సాక్షి, మహబూబాబాద్: సాధారణ పంటలు వేస్తే అప్పుల పాలవుతున్నామని భావించిన రైతులు కూరగాయల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. టమాటా వేస్తే మంచి లాభాలు వస్తాయని భావించి సాగుచేసిన రైతులకు ఈ ఏడాది చేదు అనుభవం ఎదురైంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించడం, దిగుబడి పెరగడంతో అమాంతం ధర పతనమైది. దీంతో టమాటా పండించినా.. అప్పుల పాలయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్, నవంబర్లో వేసిన టమాటా తోటలకు వాతావరణం అనుకూలించింది. పెద్దగా చీడపీడలు ఆశించలేదు. రాష్ట్రంలోని వరంగల్, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 30 వేల ఎకరాల మేరకు టమాటా పంట సాగుచేశారు. ఇందుకుగాను గతం కన్నా ఎక్కువగా 2 లక్షల టన్నుల మేరకు దిగుబడి వచ్చినట్లు అంచనా.. దీనికి తోడు పక్కరాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో కూడా దిగుబడి ఎక్కువగా రావడంతో మార్కెట్ మందగించి ధర పతనమైంది. ధరలు పడిపోవడంతో తలపట్టుకున్న రైతులువానాకాలం పంటకు హోల్సేల్లో కేజీ రూ.25కు కొనేవారు. రిటైల్ ధర రూ.40 నుంచి రూ.50కి అమ్మేవారు. యాసంగి పంట రాగానే ధర పతనమైంది. 25 కిలోల పెట్టెను రూ. 100 నుంచి రూ.150కి అడుగుతున్నారు. వారాంతపు సంతల్లోకి ఆటోలు, ఇతర వాహనాల ద్వారా తీసుకొని వెళ్లే రైతులకు సాయంత్రం వరకు ఉండి అమ్ముకునేవారు. ఇప్పుడు ఎక్కువ మొత్తంలో టమాటా మార్కెట్లకు రావడంతో, అమ్ముడు పోనివాటిని సాయంత్రం వరకు చూసి ఉచితంగా పంపిణీ చేయడం, లేదా కోతులకు పోసి రావాల్సి వస్తోంది. ఇంటికి తీసుకొని వెళ్తే మళ్లీ రవాణా ఖర్చులు అవుతాయని, అందుకోసమే ఉచితంగా పంపిణీ చేస్తున్నామని కొందరు రైతులు చెబుతున్నారు.నిల్వ చేయకపోవడంతోనే.. ధాన్యం, ఇతర పంటలను విక్రయించే సందర్భంలో రైతులకు అనుకూల ధర లేకపోతే.. నిల్వ చేసుకొని ధర వచ్చిన తర్వాత అమ్ముతారు. కానీ టమాటా విషయంలో మాత్రం నిల్వ చేసే పరిస్థితి లేదు. ఇందుకు కావాల్సిన కోల్డ్ స్టోరేజీలు లేకపోవడంతో చెట్టుమీద పండిన టమాటా కోస్తే రెండు, మూడు రోజులకు మించి నిల్వ ఉండే పరిస్థితి ఉండదు. అందుకోసమే ధర ఎక్కువ..తక్కువ ఉన్నా..అమ్మడం తప్ప మరో మార్గం లేదు.ఈ ఫొటోలో కన్పిస్తున్న రైతు మహబూబాబాద్ మండలం గుండ్లబోడు తండాకు చెందిన ధరావత్ చంద్రు. తనకున్న ఎకరంలో టమాటా సాగుచేశాడు. నారు తెచ్చిన నాటినుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.50 వేల ఖర్చు వచ్చింది. ‘దిగుబడి బాగా ఉంది రూ.లక్ష మేరకు ఆదాయం వస్తుందని అనుకున్నా.. కానీ కిలో రూ.5కే అమ్మాల్సి వస్తోంది, దీంతో లాభమేమో కానీ పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు’అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పెట్టుబడి కూడా రావడం లేదునాకున్న చెలకలో ఎకరం మేర కూరగాయలు వేస్తా. కూరగాయల మీద ప్రతీ సంవత్సరం రూ.లక్ష మేరకు లాభం వచ్చేది. ఈ ఏడాది రూ. 30 గుంటల్లో టమాటా వేశా. ఖర్చు రూ.50 వేలు దాటింది. కానీ ఇప్పుడు లాభం కాదు.. కదా పెట్టుబడి కూడా రావడం లేదు. నిల్వ చేసేటట్లు ఉంటే బాగుండేది. – బానోత్ బాలు, రేగడి తండా, మహబూబాబాద్పెట్టె రూ. 100కే అడుగుతున్నారు20 గుంటల భూమిలో టమాటా సాగుచేశా. ఎక్కువమంది రైతులు ఈ ప్రాంతంలో టమాట పంటను సాగు చేయడం.. దిగుబడి ఎక్కువ రావడంతో ధర గణనీయంగా తగ్గింది. మార్కెట్లో కేజీ రెండు రూపాయల నుంచి నాలుగు రూపాయలకు కొనుగోలు చేస్తుండడంతో పెట్టుబడి మాట దేవుడెరుగు.. పంటను మార్కెట్కు తరలించినా రవాణా చార్జీలతోపాటు కోత కూలి కూడా రావడం లేదు. పెట్టె (25 కిలోలు) రూ.100కే అడుగుతున్నారు. – ధరావత్ నంద, చాప్లాతండా, డోర్నకల్ -
గిట్టుబాటు ధర లేక ఫ్రీగా పంచి పెట్టారు
-
రైతును పెళ్లాడే అమ్మాయిలకు రూ.10 లక్షలు..!
బనశంకరి(బెంగుళూరు): యువ రైతులను వివాహం చేసుకునే యువతులకు రూ.10 లక్షలు డిపాజిట్ చేయాలని, బడ్జెట్లో రైతులకు సాయం ప్రకటించాలని రైతు సంఘాలు సీఎం సిద్దరామయ్యను కోరాయి. మంగళవారం విధాసౌధలో రైతుసంఘాల నాయకులతో సీఎం బడ్జెట్ సన్నాహక సమావేశం జరిపారు. రైతు నేతలు మాట్లాడుతూ యువ రైతులకు పిల్లనిచ్చే వారు లేకపోవడం సామాజిక విషాదమన్నారు. కాబట్టి యువ రైతులను పెళ్లాడే వధువుకు ప్రభుత్వం కనీసం రూ.10 లక్షలు డిపాజిట్ చేయాలన్నారు. రైతులకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించడానికి రూ.20 వేల కోట్లతో ప్రత్యేక నిధి కేటాయించాలన్నారు. రైతుల భూముల సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. కిసాన్ సమ్మాన్ పథకాన్ని మళ్లీ అమలు చేసి రైతులకు ఆర్థిక సాయం చేయాలన్నారు. చెరువులను అభివృద్ధి చేయాలి, రుణ సదుపాయం పెంచాలి, నాణ్యమైన విత్తనాలు, ఎరువులనే విక్రయించేలా సర్కారు చర్యలు తీసుకోవాలన్నారు. -
యూరియా..‘ప్రైవేట్’ దయ!
సాక్షి, అమరావతి: ఖరీఫ్లోనే కాదు.. రబీలోనూ అన్నదాతలకు ఇక్కట్లు తప్పడం లేదు. రబీ సీజన్ చివరి దశకు చేరుకున్నా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పాస్ పుస్తకాలు, చెప్పులు, క్యూలైన్లలో బారులు తీరుతున్నాయి. వచ్చిన యూరియా వచ్చినట్లుగా దొడ్డి దారిన మిక్సింగ్ ప్లాంట్లకు తరలిపోవడంతో రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. చంద్రబాబు సర్కారు నిర్వాకాలతో బ్లాక్ మార్కెట్లో యూరియా బస్తా రూ.350 నుంచి రూ.600 చొప్పున కొనాల్సిన అగత్యం ఏర్పడింది. మరోవైపు ఎన్నడూ లేని విధంగా ఒకే సీజన్లో కాంప్లెక్స్ ఎరువుల ధరలు రెండుసార్లు పెరగడం రైతులకు పెనుభారంగా మారింది. ఇప్పటికే కూలీల కొరతతో పెట్టుబడి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.అన్నదాతా సుఖీభవ కింద రెండేళ్లలో ఒక్కో రైతుకు రూ.40 వేలు చొప్పున ఇవ్వాల్సి ఉండగా.. రూ.30 వేలు ఎగ్గొట్టిన చంద్రబాబు సర్కారు రూ.పది వేలు మాత్రమే విదిల్చింది. ఏడు లక్షల మందికి ఎగనామం పెట్టింది. కౌలు రైతులకైతే రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. సున్నా వడ్డీకి చాప చుట్టేశారు. ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టారు. ఉచిత పంటల బీమాను ఎత్తివేయడంతో బీమా పరిహారానికి రైతులు దూరమయ్యారు. ఇక 20 నెలలుగా ధాన్యం సహా ఏ ఒక్క పంటకూ మద్దతు ధరలు దక్కడం లేదు. చంద్రబాబు అధికారంలోకి రాగానే నాన్ సబ్సిడీ విత్తనాల పంపిణీని ఎత్తివేశారు. సబ్సిడీ విత్తనాల సరఫరాలో అడ్డగోలుగా కోత పెట్టారు. కనీసం యూరియా కూడా అదునుకు అందించకుండా రైతులు అధికంగా వినియోగిస్తున్నారంటూ తమ వైఫల్యాన్ని వారిపై గెంటేస్తున్నారు. పక్కదారి.. రబీ సీజన్లో వరి, జొన్న, మొక్కజొన్న పంటలకు యూరియా ఎక్కువగా వినియోగిస్తారు. రైతులకు అందాల్సిన యూరియా పక్కదారి పడుతోంది. ఒకవైపు యూరియా కోసం రైతులు అల్లాడుతుండగా.. మరోవైపు లక్షల టన్నుల విక్రయాలు పూర్తైనట్లు ప్రభుత్వం ప్రకటించడం విస్మయం కలిగిస్తోంది. అంటే ఆ యూరియా అంతా రైతుల పొలాలకు బదులుగా ప్రైవేట్ వ్యాపారుల ఆధీనంలోని బ్లాక్ మార్కెట్కు చేరిపోయినట్లు స్పష్టమవుతోంది. సీజన్లో 9.38 లక్షల టన్నుల యూరియా అవసరమని అంచనా వేయగా ఇప్పటికే 6.27 లక్షల టన్నులు విక్రయించినట్లు ప్రభుత్వం చెబుతోంది.కానీ క్షేత్రస్థాయిలో రైతులు ఒక్కకట్ట కోసం పడరాని పాట్లు పడుతుండటం గమనార్హం. సీజన్ చివరి దశకు చేరుకున్నప్పటికీ యూరియా దొరకని పరిస్థితి కొనసాగుతూనే ఉంది. నంద్యాల జిల్లాలో బయట మార్కెట్లో బస్తా రూ.500 పెట్టి కొన్నామని జొన్న, మొక్క జొన్న రైతులు చెబుతుండగా.. నెల్లూరు జిల్లాలో రూ.450 నుంచి రూ.500 వరకు చెల్లించినట్లు వరి సాగుదారులు వాపోతున్నారు. సొసైటీలు, ఆర్ఎస్కేల వద్ద రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా టీడీపీ నేతల సిఫారసు ఉంటేగానీ కరుణించడం లేదు. విత్తగానే లక్షల టన్నుల విక్రయాలా? రాష్ట్రంలో లక్షలాది టన్నుల యూరియా దారి మళ్లిపోయిందని సాగు గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. నెలలవారీగా సాగు, అమ్మకాలు పరిశీలిస్తే ఏ స్థాయిలో యూరియా పక్కదారి పట్టిందో వెల్లడవుతుంది. రబీ సీజన్ ఏటా అక్టోబర్లో ప్రారంభమై ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. పంటలకు ఆరంభంలోనే యూరియా పెద్దగా అవసరం ఉండదు. పంటలు వేయడమే ఆలస్యం.. లక్షల టన్నుల యూరియా విక్రయాలు జరిగిపోవడం దారి మళ్లించారనేందుకు నిదర్శనంగా నిలుస్తోందని రైతులు పేర్కొంటున్నారు. ⇒ అక్టోబర్లో 1.42 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా.. కేవలం 22 వేల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. 6,500 ఎకరాల్లో జొన్న సాగైంది. ఒక్క ఎకరాలో కూడా మొక్కజొన్న సాగవలేదు. అయినా సరే అక్టోబర్లో ఏకంగా 1.12 లక్షల టన్నుల యూరియా అమ్మకాలు జరిగినట్లు ప్రభుత్వం చెబుతోంది. ⇒ నవంబర్లో 7.42 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా.. 1.20 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. 82 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 57 వేల ఎకరాల్లో జొన్న సాగైంది. నవంబర్లో మరో 1.14 లక్షల టన్నుల యూరియా విక్రయాలు జరిగాయి. ⇒ డిసెంబర్లో మరో 21.12 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 6.07 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు. 4.15 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 68 వేల ఎకరాల్లో జొన్న సాగైంది. కానీ డిసెంబర్లో ఏకంగా 1.67 లక్షల టన్నుల యూరియా విక్రయాలు జరిగాయి. ⇒ జనవరిలో 15.70 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా... 8.7 లక్షల ఎకరాల్లో వరి, 2.07 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 55 వేల ఎకరాల్లో జొన్న పంటలు సాగయ్యాయి. జనవరిలో ఏకంగా 2.24 లక్షల టన్నుల యూరియా అమ్మకాలు జరిగాయి. ఫిబ్రవరిలో మరో 1.77 లక్షల టన్నులు, మార్చిలో 1.28 లక్షల టన్నుల యూరియా అమ్మకాలు జరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మిక్సింగ్ ప్లాంట్లకు మళ్లుతున్న యూరియాయూరియా సహా ఎరువుల్లో సింహభాగం ఆర్ఎస్కేలు, పీఏసీఎస్లను కాదని ప్రైవేట్ వ్యాపారులకే కేటాయిస్తున్నారు. పట్టుమని పది శాతం ఆర్ఎస్కేలకు కూడా సరఫరా చేయడం లేదు. దీనివల్ల యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిపోతోంది. పెద్ద ఎత్తున యూరియా దారి మళ్లుతున్నట్టు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి గతంలో స్వయంగా పేర్కొనడం గమనార్హం. సారా, బీర్ల తయారీతో పాటు రంగుల కంపెనీలు, వారి్న‹Ù, ప్లైవుడ్, యాడ్ – బ్లూ ద్రావణం, పశువుల దాణా, కోళ్లు, చేపలు, రొయ్యల మేత తయారీ, కల్తీ పాల తయారీలో విచ్చలవిడిగా వాడుతున్నట్లు ఆరోపణలున్నాయి. మూతపడిన మిక్సింగ్ ప్లాంట్లు ఇటీవల పెద్దఎత్తున తెరుచుకుంటున్నాయి. విజిలెన్స్ దాడులు మొక్కుబడిగా మారాయి. ‘కాంప్లెక్స్’ ధరల మోత ఒకవైపు యూరియా దొరకక అల్లాడుతుండగా మరోవైపు మిశ్రమ (కాంప్లెక్స్) ఎరువుల ధరల మోత మోగుతోంది. సీజన్ ప్రారంభంలోనే బస్తాకు రూ.100 నుంచి రూ.500 వరకు పెంచేసిన కంపెనీలు తాజాగా మరోసారి రూ.50 నుంచి రూ.250 మేర పెంచేశాయి. సూక్ష్మసేద్యంలో వినియోగించే ప్రత్యేక ఎరువుల (వాటర్ సాల్యుబల్ ఫెర్టిలైజర్స్) ధరలను సీజన్ ఆరంభంలోనే 25–50 శాతం మేర పెంచాయి. ఎకరాకు రూ.1,200 నుంచి రూ.1,500 వరకు అదనంగా భారం పడుతోందని రైతులు వాపోతున్నారు. పెరిగిన ఎరువుల ధరలు, కూలీలు ఖర్చులు, యంత్రాల అద్దెలన్నీ కలిపితే వరికి రూ.6 వేలు, మొక్కజొన్నకు రూ.8 వేల వరకు ఈ ఏడాది పెట్టుబడి ఖర్చులు పెరిగాయి. అదనంగా రూ.13 వేల భారంనంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం లింగాపురానికి చెందిన ఎర్రం కృష్ణారెడ్డి రబీలో 20 ఎకరాల్లో వరి సాగు చేశాడు. ఎన్నిసార్లు తిరిగినా సొసైటీలో, రైతు సేవా కేంద్రాల్లో ఒక్క కట్ట కూడా యూరియా దొరకకపోవడంతో ప్రైవేట్ డీలర్ల వద్ద కొన్నాడు. ఎమ్మార్పీ ప్రకారం బస్తా యూరియా ధర రూ.266 కాగా గత్యంతరం లేని పరిస్థితుల్లో పంటను కాపాడుకోవడానికి రూ.495 చొప్పున 58 బస్తాలు కొనుగోలు చేశాడు. దీంతో రూ.13 వేలకు పైగా అదనంగా భారం పడిందని ‘సాక్షి’ ఎదుట రైతు వాపోయాడు. యూరియాతో పాటు బలవంతంగా అంటగట్టిన కాంప్లెక్స్ ఎరువుల కోసం మరో రూ.5 వేల వరకు ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పాడు. గత ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా గ్రామంలోనే కావాల్సినంత యూరియా ఇచ్చేవారని, ఐదేళ్లలో ఏ రోజూ ఎరువుల కోసం ఊరు దాటాల్సిన పరిస్థితి రాలేదని గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు ఖరీఫ్లో మొదలైన అగచాట్లు రబీలోనూ వెంటాడుతున్నాయని, ఇలాగైతే వ్యవసాయం చేసేదెలా? అంటూ నిర్వేదం వ్యక్తం చేశాడు.ఎన్నిసార్లు వెళ్లినా ‘నో స్టాక్’ రబీలో 4 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. ఎరువుల ధరలు విపరీతంగా పెరిగి వ్యవసాయం భారంగా మారింది. సరిపడా యూరియా లభ్యం కావడం లేదు. రైతు సేవా కేంద్రాలలో అధికార పార్టీకి చెందిన వారికే అమ్ముతున్నారు. ప్రస్తుతం వరి పంటకు మూడో కోటా యూరియా వేయాలి. ఎన్నిసార్లు వెళ్లినా నో స్టాక్ అంటున్నారు. చేసేది లేక బహిరంగ మార్కెట్లో బస్తా రూ.400 పెట్టి కొన్నా. కాంప్లెక్స్ ఎరువులు 20 నుంచి 30 శాతం ధరలు పెంచేశారు. ఇలా అయితే వ్యవసాయం ఎలా చేయాలో అర్ధం కావడం లేదు. – ఏలూరు శ్రీధర్ రెడ్డి మనుబోలు నెల్లూరు జిల్లా, రూ.3వేలకుపైగా అదనపు భారం ఐదెకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. ఇప్పటి వరకు రూ.1.15 లక్షలు పెట్టుబడి పెట్టా. ప్రస్తుతం పంట కంకి దశలో ఉంది. మంచి దిగుబడి రావాలంటే యూరియా చాలా అవసరం. రైతు సేవా కేంద్రం సిబ్బంది స్టాక్ లేదు అంటున్నారు. బయట బస్తా రూ.350–400 పెట్టి దాదాపు 25 బస్తాల యూరియా కొన్నా. రూ.3 వేలకు పైగా అదనపు భారం పడింది. ఖరీఫ్లోనూ ఇలాగే ఇబ్బందిపడ్డాం. – జి.డి.వీరదాస్, బ్రహ్మసముద్రం, అనంతపురం జిల్లారాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు లేకనే..అదునుకు రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. కృష్ణా,. గోదావరి డెల్టాలో ధాన్యం, మొక్కజొన్న, మినుము తదితర పంటలకు ప్రస్తుతం యూరియా ఎంతో అవసరం. ఎనీ్టఆర్, నెల్లూరు, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం తదితర జిల్లాలలో యూరియా కొరత ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. – వి.కృష్ణయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘంఉత్పత్తి వ్యయం పెరిగిపోయింది.. అదునుకు యూరియా దొరక్క రబీలో రైతులు చాలా ఇబ్బందిపడ్డారు. రూ.267కు లభించాల్సిన బస్తా బ్లాకులో రూ.400 నుంచి రూ.600కు కొనుక్కోవల్సి వస్తోంది. కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడం, పెరిగిన కూలీ ఖర్చులు, యంత్రాల అద్దెల కారణంగా ఉత్పత్తి వ్యయం పెరిగిపోయింది. పంటలను మద్దతు ధరకు కొనే వారు లేక రైతులు నష్టానికి అమ్ముకుంటున్నారు. రైతు సంక్షేమం పేరిట ప్రకటనలకు పరిమితమవుతున్న చంద్రబాబు ప్రభుత్వం వారిని ఆదుకోవడంలో విఫలమవుతోంది. – ఎంవీఎస్ నాగిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్ -
వరుసగా మూడో బడ్జెట్లోనూ అన్నదాతకు మొండిచెయ్యే
సాక్షి, అమరావతి: పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాతా సుఖీభవ కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తానని చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి. ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు. కనీసం అన్నదాతకు యూరియా అందించలేని అన్యాయమైన పాలన ఇది. ఉచిత పంటల బీమా అటకెక్కింది.. ఇన్పుట్ సబ్సిడీ ఊసేలేదు.. సున్నా వడ్డీకి సున్నా చుట్టింది. మొత్తంగా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిన చంద్రబాబు సర్కార్ ఈ మూడో బడ్జెట్లోనూ రైతుకు మొండిచెయ్యి చూపింది. రాష్ట్రంలో గత 20 నెలలుగా అన్ని విధాలుగా నష్టపోయి తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న రైతులను ఆదుకునే దిశగా వ్యవసాయ రంగంలో తగిన కేటాయింపులు జరపడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. అరకొర కేటాయింపులతో రైతులకు పంగనామాలు పెట్టింది. 3.32 లక్షల కోట్ల బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ.12,152 కోట్లు, అనుబంధ శాఖలకు రూ.3,589 కోట్లు మాత్రమే కేటాయింపులు జరిపారు. అంటే మొత్తం బడ్జెట్లో 4.74 శాతానికి మించలేదు. పైగా అసెంబ్లీ సాక్షిగా గతేడాది 46.86 లక్షల మంది రైతులకు రూ.6,309 కోట్ల పెట్టుబడి సాయం అందజేశామని.. జోన్, నాన్ జోన్తో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ యూనిట్ రూ.1.50 చొప్పున విద్యుత్ సరఫరా చేస్తున్నామంటూ పచ్చి అబద్ధాలు చెప్పు కొచ్చారు. మరో వైపు కొత్తగా రూ.లక్ష కోట్లతో రాయలసీమ, ప్రకాశం జిల్లాలను హార్టికల్చర్ హబ్గా తీర్చి దిద్దుతున్నామని, ఇందులో రూ.30 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చెబుతూ.. ఉద్యాన శాఖకు మాత్రం రూ.1,123.86 కోట్లకు మించి కేటాయింపులు జరపక పోవడం విస్మయానికి గురి చేస్తోంది.పంటల బీమాకు మంగళం పాడేందుకేఐదేళ్ల పాటు రైతులపై పైసా భారం పడకుండా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని అటకెక్కించేసిన చంద్రబాబు ప్రభుత్వం.. స్వచ్ఛంద నమోదు బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. 2024–25 బడ్జెట్లో పైసా కేటాయించలేదు. 2025–26లో రూ.1,023 కోట్లు కేటాయించినా పైసా ఖర్చు చేయలేదు. రెండేళ్లుగా ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సిన రూ.2,419.44 కోట్ల ప్రీమియం ఎగ్గొట్టడంతో ప్రస్తుత రబీ సీజన్ నుంచి కంపెనీలు ఏపీని బ్లాక్ లిస్ట్లో పెట్టేశాయి. ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతులకు రావాల్సిన రూ.3,500 కోట్లకుపైగా బీమా పరిహారం అందకుండా పోయింది. దీంతో ఈ ఏడాది ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తారని రైతులు ఆశపడ్డారు. కనీసం ఈ ప్రీమియం బకాయిలతో పాటు రానున్న వ్యవసాయ సీజన్కు తగిన నిధులు కేటాయిస్తారని భావించారు. కానీ ఇందుకు విరుద్ధంగా ఈ పథకానికి కేటాయింపులు గతేడాదితో పోలిస్తే నాలుగో వంతుకు తగ్గించి, రూ.250 కోట్లతో సరిపెట్టారు. గతేడాది అరటి, మిరప, పొగాకు బొప్పాయి, మామిడి, చీనీ, టమాట, ఉల్లి వంటి పంటలకు గిట్టుబాటు ధర దక్కలేదు. అయినప్పటికీ మార్కెట్లో జోక్యం చేసుకొని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి ఆదుకున్న దాఖలాలు లేవు.ఈ హామీలన్నీ అటకెక్కినట్టేనా?⇒ రాయితీపై సోలార్ పంప్ సెట్ల ఏర్పాటు మాటేంటి? ⇒ గుర్తింపు కార్డులు అందజేసిన కౌలు రైతులకు అన్ని సంక్షేమ పథకాలు ఎప్పుడు అందిస్తారు? ⇒ రైతు కూలీలకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు.. తద్వారా వారికి రాయితీలు, సంక్షేమ పథకాలు ఎప్పుడిస్తారు? ⇒ దళారుల దోపిడీని అరికట్టడానికి ఏపీఎంసీ యాక్టును పటిష్టంగా ఎప్పుడు అమలు చేస్తారు? ⇒ పాడి రైతులకు పశుగ్రాసం సాగు కోసం బంజరు భూములు కేటాయింపు ఎంత వరకొచ్చింది? ⇒ పశువుల కొనుగోళ్లు, దాణా, మందుల కొనుగోళ్లపై సబ్సిడీలు ఏమయ్యాయి? ⇒ పశువులకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఎప్పుడు కల్పిస్తారు? ⇒ ఆక్వా రైతులకు జోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా అందరికీ యూనిట్ రూ.1.50కే విద్యుత్ సరఫరా సంగతేంటి? ⇒ వీటిలో ఏ ఒక్క హామీ అమలు కోసం ఈ బడ్జెట్లో ఒక్క రూపాయి అయినా కేటాయించారా? ధరల స్థిరీకరణ నిధికి రూ.500 కోట్లేనా?‘ధరల స్థిరీకరణ నిధి కింద గతేడాది రూ.300 కోట్లు కేటాయించాం. ఈ ఏడాది దాన్ని రూ.500 కోట్లకు పెంచాం’ అని ప్రభుత్వం గొప్పగా చెప్పుకోవడం రైతులను ఆగ్రహానికి గురిచేస్తోంది. మరోవైపు నాన్ సబ్సిడీ విత్తనాలకు మంగళం పాడేశారు. సబ్సిడీ విత్తనానికి కోత పెట్టారు. గతేడాది రూ.182 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పిన ప్రభుత్వం ఈ ఏడాది రూ.240 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పుకొచ్చింది. వాస్తవానికి మార్కెట్లో విత్తన ధరలు భారీగా పెరిగాయి. ఈ కేటాయింపులు ఏమాత్రం సరిపోవని రైతులు చెబుతున్నారు. రెండేళ్లుగా సున్నా వడ్డీ రాయితీ పథకం కింద పైసా చెల్లించలేదు. ఈ ఏడాది రూ.250 కోట్లు కేటాయించడం పట్ల రైతులు మండిపడుతున్నారు. రెండేళ్లుగా కట్ట యూరియా కోసం రైతులు ఏవిధంగా ఇబ్బందుల పాలయ్యారో అందరూ ప్రత్యక్షంగా చూశారు. బఫర్ స్టాక్ కోసం రూ.200 కోట్లు ఖర్చు చేస్తామంటూ గొప్పగా ప్రకటించిన ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం కేవలం రూ.40 కోట్లకు పరిమితం చేసింది. 20 నెలల్లో ప్రకృతి వైపరీత్యాల్లో దెబ్బతిన్న రైతులకు రూ.1,100 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలుండగా, ఆ ఊసెత్తకుండా రూ.310 కోట్ల పెట్టుబడి రాయితీ ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరం. పట్టు, మార్కెటింగ్, పశు సంవర్థక, మత్స్య శాఖల కేటాయింపులు పూర్తిగా సిబ్బంది జీత భత్యాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సరిపడా తప్ప కొత్తగా ఒక్క పథకాన్ని ప్రకటించలేదు. ఒక్క రూపాయి అదనంగా కేటాయింపులు జరపలేదు. -
యూరియా కోసం రైతులు ఆందోళన
శ్రీకాకుళం: యూరియా కోసం సచివాలయం వద్ద రైతులు ఆందోళనకు దిగిన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. గ్రామానికి వచ్చిన యూరియా టీడీపీ నేతలు తీసుకుని అక్రమంగా తరలిస్తున్నారంటూ గార మండలం వమరవల్లి పంచాయతిలోని రైతులు ఆందోళన బాట పట్టారు. యూరియాను అందరికి సమానంగా అందజేయాలని కోరుతూ గ్రామ సచివాలయం ఎదుట రైతులు బైఠాయించార. యూరియాను అక్రమంగా తరలిస్తూ తమకు అందకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.‘రైతులు కాని వారికి యూరియా ఇస్తున్నారు. టీడీపీ నాయకురాలు భవాని చెప్పిన వారికి మాత్రమే యూరియా ఇస్తున్నారు. అధికారులు కూడా టిడిపి నాయకులు చెప్పిన వారికే యూరియా ఇవ్వడం దారుణం. పాస్ బుక్ ప్రకారం యూరియా ఇమ్మని అడిగితే ఇవ్వడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కమీషన్ ఇవ్వకపోతే.. మీ బియ్యం ఉడకవ్!
సాక్షి టాస్క్ఫోర్స్: రైస్ మిల్లర్లకు ఊహించని రీతిలో కష్టం వచ్చి పడింది. తప్పించుకోవడానికి వీల్లేకుండా ప్రభుత్వంలో కీలక మంత్రులు ఇద్దరు ఫిక్స్ చేసేశారు. చెప్పినట్లు చేయాల్సిందేనని, లేదంటే తిప్పలు తప్పవని మధ్యవర్తి ద్వారా హుకుం జారీ చేశారు. ఏదైనా కిరికిరి చేస్తే నష్టపోయేది మీరేనంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో ఏం చేయాలో తోచక వారు అడిగింది అడిగినట్లు ముట్టజెప్పుతున్నారు. సీజనల్గా రైతుల నుంచి సేకరించే ధాన్యాన్ని ప్రభుత్వం రైస్ మిల్లులకు పంపి (సీఎంఆర్– కస్టమ్ మిల్లెడ్ రైస్), బియ్యంగా మార్చి తీసుకుని.. పౌర సరఫరాల శాఖ ద్వారా పేదలకు పంపిణీ చేస్తుంది. ఈ క్రమంలో రైస్ మిల్లర్లు క్వింటాకు రూ.16 చొప్పున మామూళ్లు ఇచ్చేలా రేట్ ఫిక్స్ చేసింది. గతేడాది బిల్లులు మంజూరు కోసం ముడుపులు మెక్కిన అమాత్యుడు ఈసారి మరో అడుగు ముందుకేసి సీఎంఆర్ అనుమతి పొందిన మిల్లర్లపై పడి కోట్లు దండుకోవడానికి బరితెగించారు. కేబినెట్లో మరో కీలక మంత్రి కూడా ఇతనితో జత కలిశారు. ఇద్దరూ కూడబలుక్కుని.. కీలక మంత్రి వియ్యంకుడి ద్వారా ఈ మొత్తం వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా చక్కబెడుతున్నారు. ఈ దందాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 2,280 మిల్లులపై ఒత్తిడి ప్రభుత్వం సీఎంఆర్ ద్వారా 51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం (సీఎంఆర్) సేకరించాలనే లక్ష్యం పెట్టుకుంది. అయితే కోట్ల రూపాయల కమీషన్ దండుకోవాలనే లక్ష్యంతో పాలక పెద్దలు గత సీజన్ కంటే ఈసారి 16 లక్షల మెట్రిక్ టన్నులు అదనపు లక్ష్యాన్ని నిర్దేశించారని సమాచారం. ప్రతి ఏటా సీఎంఆర్ లక్ష్యం అధిగమించిన మిల్లర్లకు తర్వాతి ఏడాది ప్రాధాన్యతనిస్తూ కోటా పెంచుతుంటారు. ఈ కేటాయింపు ప్రక్రియ ఏ జిల్లాకు ఆ జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ చేపడుతుంటుంది. మిల్లింగ్ చేసే ధాన్యం పరిమాణాన్ని బట్టి బ్యాంక్ గ్యారెంటీ ఇస్తారు. అనంతరం మిల్లర్లకు ధాన్యం కేటాయిస్తారు. ఇలా సీఎంఆర్ ద్వారా సేకరించిన బియ్యాన్ని ప్రభుత్వం ప్రజా పంపిణీకి కేటాయిస్తుంది. ఈ మేరకు ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి, మిల్లర్ల మధ్య మూడు నెలల కాలానికి ఒప్పందం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 2,280 మిల్లుల్లో దాదాపు చిన్న తరహా మిల్లులన్నీ మూడు నెలలపాటు సీఎంఆర్పైనే నడుస్తున్నాయి. మిగిలిన తొమ్మిది నెలలు దాదాపు ఖాళీగానే ఉంటాయి. అదనపు ఆదాయం వస్తుందనుకుంటే.. గతేడాది కంటే ఈ ఏడాది 16 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా ప్రభుత్వం సేకరించేందుకు లక్ష్యాలు నిర్దేశించడంతో మిల్లర్లు అదనపు ఆదాయం వస్తుందని ఆశపడ్డారు. సీఎంఆర్ అదనపు కోటాతో ఈ ఏడాది అదనంగా పని దొరుకుతుందని పడ్డ సంబరం కాస్తా ఒక మంత్రి దోపిడీ ప్లాన్తో తల్లకిందులైంది. సీఎంఆర్కు అనుమతి పొందిన మిల్లర్లు మంత్రికి ముడుపులు మూటగట్టి ఇవ్వాలని అసోసియేషన్ల ద్వారా ఆదేశాలు రావడంతో వారంతా లబోదిబోమంటున్నారు. సీఎంఆర్ ద్వారా మిల్లింగ్ చేసే ప్రతి క్వింటా బియ్యానికి రూ.16 వంతున కమీషన్ను ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. కస్టమ్ మిల్లింగ్ ద్వారా సేకరిస్తోన్న 51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంపై రూ.80 కోట్లు ముడుపులు (కొందరికి మినహాయింపు ఇవ్వడం వల్ల.. లేదంటే మరింత పెరుగుతుంది) ముట్ట చెప్పేందుకు వసూళ్ల పర్వానికి తెరతీశారు. ఇప్పటికే 60–70 శాతం మిల్లుల నుంచి వసూలు చేసేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మిగిలిన వారు ఈ నెలాఖరు లోపు చెల్లించాలంటూ ఆయా జిల్లాల్లో అసోసియేషన్ల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చాయని మిల్లర్లు గగ్గోలు పెడుతున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ మంత్రి వియ్యంకుడా.. మజాకా! ⇒ రాష్ట్ర వ్యాప్తంగా సీఎంఆర్ అనుమతించిన మిల్లుల నుంచి ముడుపులు మెక్కడానికి స్కెచ్ వేసిన అమాత్యుడు.. తన దందా సవ్యంగా సాగేందుకు సహచర కీలక మంత్రిని కలుపుకున్నారు. ఈ కీలక మంత్రి వియ్యంకుడిది బియ్యం వ్యాపారంలో అందె వేసిన చెయ్యి. దేశ, విదేశాలకు బియ్యం ఎగుమతుల్లో అపార అనుభవం గడించారు. సొంతంగా మిల్లులు కూడా ఉన్నాయి. ఇతన్ని అడ్డుగా పెట్టుకుని కమీషన్ల దందా నడుపుతున్నారు. ⇒ ఈ క్రమంలో సదరు మంత్రి వియ్యంకుడి మిల్లుతో పాటు అతని సహచరుడైన మరో బడా ఎక్స్పోర్టర్ మిల్లులకు కమీషన్లో మినహాయింపు ఇవ్వడం అసోసియేషన్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి వియ్యంకుడైన గోదావరి జిల్లాలకు చెందిన బడా ఎక్స్పోర్టర్కు, మరో బడా ఎక్స్పోర్టర్ తోడై కమీషన్ల బాగోతాన్ని చక్కబెడుతున్నారు. ఇందుకు కమీషన్లో మినహాయింపుతో పాటు తొలిసారి సీఎంఆర్ కోటా దక్కించుకున్నారు. ⇒ వాస్తవానికి మిల్లర్లకు జిల్లా స్థాయిలోనే మిల్లర్ల అసోసియేషన్ సీఎంఆర్ కోటా కేటాయిస్తుంటుంది. అటువంటిది అసోసియేషన్ ప్రమేయం లేకుండానే ఈ రెండు బడా రైస్ ఎక్స్పోర్ట్ కంపెనీలు నేరుగా ఉన్నత స్థాయిలో తమ పలుకుబడి ఉపయోగించి సీఎంఆర్ అనుమతి తెచ్చుకున్నాయి. ప్రకృతి వైపరీత్యాలప్పుడు నష్టపోయిన రైతుల నుంచి బస్తా ధాన్యం కొనుగోలు చేసిన చరిత్ర లేని ఈ కంపెనీలకు ప్రభుత్వం పెద్ద పీట వేయడం చర్చనీయాంశమైంది. ⇒ సీఎంఆర్కు ఏ జిల్లాలో పండించిన ధాన్యాన్ని ఆ జిల్లాలోనే అనుమతిస్తారు. కానీ మంత్రి వియ్యంకుడు కావడంతో నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి పొరుగున కృష్ణా జిల్లా నుంచి ప్రత్యేక అనుమతి ఇచ్చారని సమాచారం. మంత్రి వియ్యంకుడికి 65 వేల టన్నులు, మరో బడా రైస్ ఎక్స్పోర్టర్కు 25 వేల టన్నులు సీఎంఆర్కు అనుమతించారు. ఇది ఆ జిల్లా మొత్తం సీఎంఆర్లో మూడింట (మూడు లక్షల టన్నులు) ఒక వంతు కావడం గమనార్హం. సారూ.. ‘సీజ్ ద కమీషన్స్’ అనండి ఏడాది క్రితం పేదల బియ్యం ఆఫ్రికా దేశాలకు తరలి పోతున్నాయని ‘సీజ్ ద షిప్’ అంటూ హడావిడి చేసిన ఉప ముఖ్యమంత్రి ఇప్పుడేం చేస్తున్నారని ఈ సందర్భంగా మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. ప్రజా పంపిణీ కోసం సేకరిస్తోన్న సీఎంఆర్లో ఇంతలా బరితెగించి కమీషన్లు వసూలు చేస్తుండటం మీ దృష్టికి రాలేదా అని నిలదీస్తున్నారు. ఈ విషయమై ఆయన స్పందించకపోతే, ఈ దందాలో ఆయనకూ వాటా ఉన్నట్లేనని భావించాల్సి వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే ‘సీజ్ ద కమీషన్స్’ అంటూ ఈ కమీషన్లకు బ్రేక్ వేయాలని కోరుతున్నారు.సీజన్ మొదట్లోనే స్కెచ్.. ఇప్పుడు అమలు⇒ సీఎంఆర్ విధానంలో అమాత్యునికి కమీషన్ విషయమై సీజన్ ప్రారంభంలోనే రాష్ట్ర అసోసియేషన్ సమావేశంలో చర్చించారు. నాటి సమావేశంలో పలువురు ప్రతినిధులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఈ విషయమై మిల్లర్లు రోడ్డెక్కితే అల్లరై బియ్యం సేకరణకు ఆదిలోనే ప్రతిబంధకం ఎదురవుతుందని అప్పట్లో మిన్నకుండిపోయారు. ⇒ సీఎంఆర్ కేటాయింపు ప్రకారం 51 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యంలో ఇప్పటికే 48 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తి అయింది. ఈ నేపథ్యంలో కమీషన్ వసూలుకు ఇదే తరుణమని స్కెచ్ వేశారు. క్వింటాల్కు రూ.16 వంతున కమీషన్ చెల్లించాల్సిందేనంటూ అసోసియేషన్ ద్వారా మిల్లర్లపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ⇒ సీఎంఆర్ చివర్లో ఉన్న తరుణంలో అడిగినంత కమీషన్ ఇచ్చుకోక తప్పని పరిస్థితుల్లో మిల్లర్లు వెనక్కు పోయేది ఉండదు. అదే ధైర్యంతో గత పక్షం రోజులుగా కమీషన్ల వసూళ్ల దందాను మరింత ముమ్మరం చేశారు. కమీషన్ ఇవ్వకుంటే సీఎంఆర్ బిల్లుల్లో కోతలు తప్పవని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. క్వింటాకు ప్రభుత్వం ఇచ్చేది రూ.10. సంచులు, నూకలు, తౌడు వంటి వాటిపై కొంత ఆదాయం వచ్చే మాట నిజమైనా, ఏకంగా రూ.16 కమీషన్ చెల్లించాలనడం భావ్యం కాదని మిల్లర్లు వాపోతున్నారు. ఇంత కమీషన్ ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. ఏడాదిలో తొమ్మిది నెలలు మూతేసుకుని కూర్చుంటున్న మిల్లులకు సీఎంఆర్తో మూడు నెలలు పని దొరుకుతుందనుకుంటుంటే మెడపై కత్తిపెట్టి కమీషన్ వసూలు చేయడం దారుణం అని, ఇదేం మంచి ప్రభుత్వం? అని మిల్లర్లు నిలదీస్తున్నారు. ⇒ కమీషన్ ఇచ్చుకోలేమని ఎదురు తిరుగుతున్న మిల్లర్లకు సీఎంఆర్ బిల్లులు ఎలా మంజూరు అవుతాయో చూస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇలా మంత్రుల కోసం కమీషన్లు వసూలు చేసిన దాఖలాలు లేవని చెబుతున్నారు. కాగా, ఇప్పటికే 90 శాతం వసూళ్లు పూర్తయ్యాయని సమాచారం. ప్రభుత్వ ముఖ్య నేతలకు బాగా తెలిసిన వారికి కమీషన్లో కొంత మినహాయింపు ఇచి్చనట్లు తెలిసింది. -
మౌంట్ కాఫీ... సరికొత్త స్ఫూర్తి
సాధారణంగా గిరిజన రైతులు తాము పండించిన పంటను దళారులకు అమ్ముకుని తక్కువ ధరతో సరిపెట్టుకుంటారు. కానీ మండలంలోని బడిమెల గ్రామానికి చెందిన ఆ ఎనిమిది మంది రైతులు అలా ఆలోచించలేదు. తమ చెమట చుక్కల విలువను తామే నిర్ణయించుకోవాలనుకున్నారు. మౌంట్ అరకు గిరిజన్ సొసైటీని స్థాపించి రూ.కోటి టర్నోవర్తో అరకు కాఫీ సువాసనలను వ్యాపార సామ్రాజ్యంగా మార్చారు. చదువులేకపోయినా ప్రభుత్వ సాయం, ఆధునిక సాంకేతికతను ఉపయోగించి పక్కా మార్కెటింగ్ వ్యూహంతో ఆదాయం పొందుతూ సాటి రైతులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. డుంబ్రిగుడ: ఉన్నత లక్ష్యానికి ఆలోచన తోడైతే విజయం వరిస్తుందని అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలంలోని బడిమెల గ్రామానికి చెందిన ఎనిమిది మంది రైతులు నిరూపించారు. అరకు కాఫీని పండించే రైతుకు, దాన్ని తాగే వినియోగదారుడికి మధ్య ఉండే ’మిడిల్ మెన్’ వ్యవస్థను తొలగించి, తామే మౌంట్ అరకు గిరిజన్ సొసైటీ పేరుతో ఒక బ్రాండ్గా ఎదుగుతున్నారు. వనరులు మనవే, శ్రమ మనదే అయినప్పుడు.. లాభం కూడా మనకే దక్కాలన్న ఆశయం.. అరకు కాఫీ సువాసనలు ఇప్పుడు వారి జీవితాల్లో ఆర్థిక పరిమళాలను వెదజల్లుతున్నాయి. ఆలోచన నుంచి ఆవిర్భావం వరకు.. 2023లో ప్రారంభమైన ఈ ప్రస్థానం కేవలం రెండేళ్లలోనే రూ.కోటి టర్నోవర్కు చేరుకోవడం సామాన్య విషయం కాదు. ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుంటూనే, వ్యాపార మెళకువలపై పట్టు సాధిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. మౌలిక వసతులు.. పెట్టుబడి.. కేంద్ర కాఫీ బోర్డు (ఐసీడీపీ పథకం) సహకారంతో సుమారు రూ.30 లక్షలతో అత్యాధునిక యూనిట్లను వీరు ఏర్పాటు చేసుకున్నారు. కాఫీ నిల్వ కేంద్రం రూ.4.57 లక్షలు, కాఫీ శుద్ధి కేంద్రం రూ.8.23 లక్షలు, సోలార్ డ్రైయింగ్ యూనిట్లు రూ.8.25లక్షలతో నిర్మించుకున్నారు. ఈ మొత్తంలో కొంత రాయితీ రూపంలో లభించగా, మిగిలిన మొత్తాన్ని వ్యాపారం చేస్తూ తిరిగి చెల్లిస్తూ స్వయంసమృద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నారు. వ్యవస్థాగత మార్పుతో.. ఈ రైతుల విజయానికి ప్రధాన కారణం మార్కెట్ గమనాన్ని అర్థం చేసుకోవడం. సంప్రదాయకంగా గిరిజన సహకార సంస్థపై ఆధారపడకుండా, ’కొకోరో’ వంటి ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా వీరు రెండు ప్రయోజనాలు సాధించారు. జీసీసీలో ఉండే చెల్లింపుల జాప్యాన్ని నివారించారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా మెరుగైన ధర పొందుతున్నారు. సంస్థ 2025–26 లక్ష్యాల గణాంకాలు ఆశాజనకంగా ఉన్నాయి. అడ్వాన్స్ రూపంలో పొందిన మొత్తం రూ. 30 లక్షలు కాగా, 26 టన్నుల కాఫీ పండ్లను సేకరించారు. వార్షిక వ్యాపార టర్నోవర్ సుమారు రూ. కోటి సాధించారు. ఈ రైతులు కేవలం లాభాలకే పరిమితం కాకుండా, తమ గ్రామంలోని గిరిజన మహిళలకు ఉపాధి కలి్పస్తూ స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు.లాభాలు వస్తున్నాయి గ్రామంలో యూనిట్ ఏర్పాటుతో స్థానికంగా అనేక మంది గిరిజనులకు ఉపాధి అందిస్తున్నాం. దీని ద్వారా మాకు కూడా కొంత లాభం వస్తోంది. గతంలో జీసీసీ కొనుగోలు చేసేది కాఫీ అయితే మాకు ఆశించినంత డబ్బు వచ్చేది కాదు. ప్రస్తుతం కొక్కొరో కంపెనీకి అమ్మడం వల్ల లాభాలు బాగానే వస్తున్నాయి. – గొల్లోరి సీతారాం, చైర్మన్, అరకు మౌంట్ సొసైటీ, బడిమెలస్థానికంగా ఉపాధి స్థానికంగా యూనిట్ ఏర్పాటు చేయడం వల్ల మాలాంటి వారికి మూడు నెలలు ఉపాధి దొరుకుతోంది. కాఫీ పండ్లు ఆడించి వాటిని ఎండబెట్టి పప్పు చేసి బస్తాల్లో నింపుతున్నాం. నాతో పాటు మరో 30 మంది గిరిజనులకు పని దొరుకుతోంది.వీటితోపాటు వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబంతో సుఖంగా ఉంటున్నాం. – బురిడి మిట్టు, బడిమెల, అరమ పంచాయతీ -
కప్పం కడితేనే దుకాణాలకు అనుమతి
నరసరావుపేట రూరల్: ‘మేం అడిగినంత ఇస్తేనే దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి. మాకు తెలియకుండా ఏర్పాటు చేస్తే ధ్వంసం చేస్తాం’ అంటూ పల్నాడు జిల్లా కోటప్పకొండలోని రైతులను, దుకాణాదారులను నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు అనుచరులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే చదలవాడను బాధిత రైతులు కలిసి గోడును వెళ్లబోసుకోగా.. తన అనుచరులు చెప్పినట్టు చేయాలని ఆయన చెప్పడంతో రైతులు కోటప్పకొండలో ఆందోళనకు దిగారు. టీడీపీ, జనసేన జెండాలతో టెంట్ ఏర్పాటు చేసుకుని న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 15న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కోటప్పకొండలో నిర్వహించే తిరునాళ్లకు లక్షలాది మంది తరలివస్తారు. యాత్రికుల కోసం కొండ దిగువన జాతర జరిగే ప్రదేశంలో దుకాణాలు, వినోదం కోసం జెయింట్ వీల్ వంటివి తాత్కాలికంగా ఏర్పాటు చేస్తారు. తమ భూముల్లో దుకాణాలు పెట్టుకున్నందుకు వ్యాపారుల నుంచి రైతులు కొంత మొత్తాన్ని అద్దె దూరంలో తీసుకుంటారు. ఈ మొత్తంలోనే కొంత గ్రామ పంచాయతీకి పన్నుగా చెల్లించేవారు. అయితే.. రెండేళ్లుగా తిరునాళ్లలో నిర్వహించే దుకాణాలపై టీడీపీ నాయకుల కన్ను పడింది. ఎమ్మెల్యే అనుచరుడు, తెలుగు యువత నాయకుడు నాగూర్మీరా గత ఏడాది దుకాణాదారులు, జెయింట్ వీల్ నిర్వాహకుల నుంచి రూ.5 లక్షలు వసూలు చేశారు. ఈ ఏడాది కూడా రూ.5 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు. మంగళవారం రాత్రి జెయింట్ వీల్ నిర్వాహకులు సామగ్రితో కొండకు చేరుకోగా.. నాగూర్మీరా అనుచరులు అడ్డుకోవడంతో రైతులు నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ‘మా భూముల్లో దుకాణాలు ఏర్పాటు చేసుకుంటే మీకెందుకు డబ్బులివ్వాలి’ అని రైతులు నిలదీశారు. ‘మీకు దిక్కున్నచోట చెప్పుకోండి. మాకు డబ్బులు ఇవ్వాల్సిందే’ అని ఎమ్మెల్యే అనుచరులు హెచ్చరించారు. దీంతో రైతులంతా ఎమ్మెల్యే చదలవాడను కలిసి గోడు వెళ్లబోసుకోగా.. నాగూర్మీరా చెప్పినట్టే చేయాలని ఎమ్మెల్యే బదులిచ్చారు. దీంతో చేసేదిలేక రైతులంతా కోటప్పకొండకు చేరుకుని జాతర జరిగే స్థలంలో ఆందోళనకు దిగారు. టీడీపీ, జనసేన జెండాలతో టెంట్ ఏర్పాటు చేసుకుని న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. ‘మేమంతా టీడీపీ, జనసేన అభిమానులమే. టీడీపీ కూటమి విజయం కోసం కృషి చేసిన మాకే ఇలా అన్యాయం చేస్తే ఎలా’ అని ప్రశి్నంచారు. -
రైతులపై ఎలుగుబంటి దాడి
బోథ్: తెలంగాణ సరిహద్దులోని మహారాష్ట్రకు చెందిన ఒక గ్రామంలో తొమ్మిది మంది రైతులపై ఎలుగుబంటి దాడి చేయడం కలకలం రేపింది. ఇందులో ఒక రైతు మృతి చెందగా.. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. రాష్ట్ర సరిహద్దులోని బోథ్ మండలం నిగిని గ్రామానికి ఏడు కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలోని కిన్వట్ తాలూకా దయాళ్ ధనోరా గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలివి. గ్రామానికి చెందిన దత్త బలిరామ్ జాదవ్ (55) మంగళవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో మొక్కజొన్న చేనుకు నీరు పెట్టడానికి వెళ్లాడు. ఈ క్రమంలో చేను వద్ద ఉన్న ఎలుగుబంటి ఒక్కసారిగా అతనిపై దాడి చేయగా కేకలు వేశాడు. అక్కడే ఉన్న పలువురు రైతులు అక్కడికి చేరుకున్నారు. అతన్ని కాపాడే ప్రయత్నం చేయగా వారిపై దాడి చేసింది. ఈ ఘటనలో దత్త బలిరామ్ జాదవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన ఎనిమిది మందిలో రమేశ్ బలిరామ్ జాదవ్, శంకర్ తానాజీ జాదవ్, సుదర్శన్ దత్త పవార్, చంద్రసింగ్ శేషారావు రాథోడ్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో పరిస్థితి విషమంగా ఉన్న చంద్రసింగ్ను మెరుగైన వైద్యం కోసం ఔరంగాబాద్కు తరలించారు. వీరితో పాటు పండిట్ జైసింగ్ జాదవ్, వినోద్ శేషారావు రాథోడ్ , అరవింద్ శేషారావు జాదవ్, సంజయ్ దత్తా జాదవ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారికి శివినిలోని పీహెచ్సీలో చికిత్స అందించారు. -
రైతుల పాలిట పిడుగుపాటు
షేక్స్పియర్ నాటకంలోలాగా, ఎవరి మాటలు నమ్మాలో ఎవరివి నమ్మకూడదో తెలియని సంకటం. ‘అమెరికన్ రైతులకు మేలు చేసే విధంగా’ ఇండియాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటున్నందుకు ట్రంప్కు అమెరికా వ్యవసాయ మంత్రి బ్రూక్ రోలిన్స్ కృతజ్ఞతలు తెలి పారు. సున్నిత అంశాలైన వ్యవసాయం, పాడి పరిశ్రమ రంగాలకు తగు రక్షణ కల్పి స్తూనే అమెరికాతో ‘చారిత్రక’ ఒప్పందం కుదుర్చుకుంటున్నందుకు మోదీని మన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసించారు. ఒప్పందంలోని వివరాలు పూర్తిగా వెల్లడైన తర్వాతనే, అది రెండు పెద్ద ప్రజాస్వామిక దేశాలకు ఉభయ తారకమైనదా లేక బెదిరింపు ధోరణితో మెడలు వంచి ఒప్పిస్తున్నదా అన్నది తేలుతుంది. కానీ, ఇంతవరకు బహిర్గతమైన వివరాలే రైతుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ముంచెత్తితే ప్రమాదమే!దేశంలో వ్యవసాయ రంగం ఇప్పటికే దయనీయ స్థితిలో ఉంది. ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కన్నా 30–40 శాతం తక్కువ ధరకు రైతులు తమ పంటలను అమ్ముకుంటున్నారు. ఈ స్థితిలో భారత మార్కెట్లోకి ద్వారాలు తెరిస్తే... హెచ్చు సబ్సిడీలు పొందు తున్న, చౌకైన అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడి మార్కెట్లను ముంచెత్తి, రైతుల జీవనోపాధిని దెబ్బతీసే ప్రమాదం ఉంది. వ్యవసాయ వనరుల నిర్వహణ (2020) సర్వే ప్రకారం, అమెరికన్ రైతులు ఏటా భారీ సబ్సిడీలు పొందుతున్నారు. అక్కడి రైతుకు ఏటా సగటున 66,314 డాలర్ల సబ్సిడీ లభిస్తున్నట్లు అంచనా. ఆ సబ్సిడీలు మార్కెట్లోని హెచ్చుతగ్గుల నుంచి అక్కడి రైతులకు రక్షణ కల్పిస్తున్నాయి. రైతులకు వాటిల్లుతున్న నష్టాలను భర్తీ చేసేందుకు ‘ఫార్మర్స్ బ్రిడ్జ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్’ (ఎఫ్బీయే) కింద ఎకరాకు వస్తు చెల్లింపుల కింద మొత్తం 12 బిలియన్ డాలర్లను సమకూర్చాలని అమెరికన్ ప్రభుత్వం భావిస్తోంది. ట్రంప్ ఆ పథ కాన్ని ‘ఒక పెద్ద అందమైన బిల్లు’గా అభివర్ణిస్తున్నారు. అయితే, అమెరికాలోకి ప్రవేశించే భారతీయ వస్తువులపై సుంకా లను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికన్ ఎగుమతులపై సుంకాలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. నాన్–ట్యారిఫ్ ప్రతిబంధకాలను తొలగిస్తున్నట్లు చెప్పారు. రైతుల నిరసన హెచ్చరికలురైతుల ప్రయోజనాలను జాగ్రత్తగా ‘సంరక్షించిన’ తర్వాతనే ఒప్పందం కుదిరిందని మన వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రయోజనాలకు భంగం వాటిల్లదనే హామీలు వెలువడుతున్నా ఇది రైతుల్లో సందిగ్ధాన్ని సృష్టిస్తోంది. అమెరికా దిగుమతులపై సుంకాలను సున్నా చేస్తే, ఆహార పదార్థాలు దేశంలోకి కుప్పతెప్పలుగా వచ్చిపడతాయని 2020–21లో న్యూఢిల్లీ చుట్టుపక్కల రైతుల ఆందోళనకు నేతృత్వం వహించిన సంయుక్త్ కిసాన్ మోర్చా హెచ్చరిస్తోంది. 2020–21 తరహాలోనే కొత్తగా నిరసనలకు దిగుతామని అది బెదిరిస్తోంది. భారతీయ రైతులు 2000–01 నుంచి 2024–25 మధ్య కాలంలో సమష్టిగా రూ. 111 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారని ‘ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్’ తన తాజా నివేదికలో అంచనా వేసింది. ‘‘అది రైతులకు అశని పాతమే కాదు, మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన అవుతుంది’’ అని హిమాచల్ ప్రదేశ్ ఆపిల్ పండ్ల తోటల పెంపకందారుల సంఘం అధ్యక్షుడు హరీశ్ చౌహాన్ అంటున్నారు.యూరోపియన్ యూనియన్, న్యూజిలాండ్లతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల ఆపిల్ పండ్లకు మార్కెట్ అసాధారణమైన రీతిలో అందుబాటులోకొచ్చింది. ఫలితంగా, పర్వత ప్రాంత రాష్ట్రాల్లో ఆపిల్ తోటల పెంపకం పరిశ్రమ క్రమంగా తుడిచిపెట్టుకుపోతుందేమోనని భయ సందేహాలు వ్యక్తమవు తున్నాయి. సుంకాలు ఏమీ లేకుండా అమెరికా ఆపిల్ పండ్లు దిగు మతి అయితే, మన దేశంలో ఆపిల్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని పోతుందని హరీశ్ హెచ్చరిస్తున్నారు. సుంకాలు లేకపోతే సమస్యే!పడిపోయిన ధరలతో పత్తి, సోయా, ఉల్లిపాయల రైతులు ఇప్ప టికే బిక్కుబిక్కుమంటున్నారు. సుంకాలు ఏమీ లేకుండా అవి దిగు మతి అయి, ధరలు మరింతగా పతనమైతే, వారు ఆ పంటలను వదిలేసి చేతులెత్తేయడం మినహా చేయగలిగింది లేదు. ఏడాదికి 500 బిలియన్ల విలువైన అమెరికన్ ఎగుమతుల గురించి ట్రంప్ మాట్లాడుతున్నారు. అందులో ఇంధనం, టెక్నాలజీ, బొగ్గు, వ్యవసాయం వంటి రంగాలవి కూడా ఉన్నాయి. అయితే, అది ఏడాదికి దాదాపు 100 బిలియన్ డాలర్ల చొప్పున ఐదేళ్ళ కాలానికి లెక్క చెప్పినదై ఉంటుందని కొందరు విశ్లేషకులు భావిస్తు న్నారు. అమెరికన్ ఎగుమతులన్నీ వ్యవసాయం, పాడి పరిశ్రమ, వాటి అనుబంధ రంగాల ఉత్పత్తులతోనే నిండి ఉంటాయని భావించడం కూడా సబబు కాదు. పత్తి, పప్పుధాన్యాలు, ఉల్లిపాయల వంటి వస్తువుల విషయంలో ఒక కోటా మేరకు మాత్రమే మార్కెట్ అందుబాటులో ఉంటుందని వార్తలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ, ఆహారాన్ని దిగుమతి చేసుకోవడం నిరుద్యోగాన్ని దిగుమతి చేసుకోవడం లాంటిదేనని అర్థం చేసుకోవాలి. గత ఏడాది సెప్టెంబర్–డిసెంబర్ మధ్య కాలంలో, పత్తి దిగుమతులపై 11 శాతం సుంకాన్ని తొలగించినపుడు చౌక ధరకు పత్తి బేళ్ళు అపారంగా వచ్చిపడ్డాయి. దేశంలో పత్తి ధరలు తగ్గాయి. అందుకు వస్త్ర పరిశ్రమవారు సంతోషించారు కానీ, రైతులు నష్ట పోయారు. మూడు నెలల్లో 30 లక్షల పత్తి బేళ్ళు దిగుమతి అయ్యాయి. పత్తి ధర క్వింటాల్కు రూ. 1,000–రూ.1,500 వరకు పడిపోయింది. అభివృద్ధి చెందుతున్న దేశాలపై బలవంతంగా రుద్దాలని ట్రంప్ చూస్తున్న నూతన వాణిజ్య వ్యవస్థ... ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు వ్యతిరేకమైనది. ట్రంప్ తన కొత్త వ్యవస్థకు ‘యూరో పియన్ యూనియన్ కూడా తలొగ్గేట్లు చేయాలని చూస్తున్నారు. వాణిజ్య సంస్థ 1995లో ఏర్పడినప్పటి నుంచి అమెరికా పప్పులు ఉడకడం లేదు. అది ఇపుడు ఎలాగైనా తన పంతం నెగ్గించు కోవాలని చూస్తోంది. ఒత్తిడికి లొంగిపోతున్న దేశాలతో, నూతన ప్రపంచ వ్యవస్థ ఆవిష్కృతమవుతోంది. ‘కండ గలవాడిదే రాజ్యం’ అన్న లోకోక్తి ఎంతకాలం కొనసాగుతుందో కాలమే చెప్పాలి. దేవీందర్ శర్మవ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులుఈ–మెయిల్: hunger55@gmail.com -
దేశంలోనే ఏపీ రైతులపై అతి ఎక్కువ అప్పుల భారం
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో రైతులు ఎంత అప్పుల భారంలో ఉన్నారో పార్లమెంట్ సాక్షిగా బయటపడింది. ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 10వ తేదీ) లోక్సభలో ఏపీలో రైతుల అప్పుల భారంపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చేసిన ప్రకటనే ఇందుకు ఉదాహరణ,. శివరాజ్సింగ్ లిఖిత పూర్వక సమాధానంలో ఏపీలోని రైతుల అప్పుల పరిస్థితి ఎలా ఉందనేది తేటతెల్లమైంది. ఇది దేశంలోనే ఏపీ రైతుల అతి ఎక్కువగా అప్పుల భారంగా శివరాజ్సింగ్ చేసిన ప్రకటన ద్వారా స్పష్టమైంది. జూలై 2018- జూన్ 2019 మధ్య ఏపీ రైతు కుటుంబం సగటు అప్పు రూ.2,35,554 రూపాయలుగా ఉన్నట్లు శివరాజ్ సింగ్ వెల్లడించారు. ఇది తెలంగాణ రైతుల సగటు అప్పుల భారం కంటే ఎక్కువగా నమోదైంది. తెలంగాణ రైతుల సగటు అప్పుల భారం రూ.1,52,113 ఉండగా, ఏపీ రైతుల సగటు అప్పుల భారం రూ.2,35,554 గా ఉంది. దేశవ్యాప్తంగా రైతు కుటుంబం సగటు అప్పుల భారం 74,121 రూపాయలు కాగా, ఏపీలో మాత్రం అత్యధికంగా ఉండటం గమనార్హం. -
అమరావతి రైతుల సమస్యలపై కలెక్టర్ని కలిసిన వల్లభనేని వంశీ
-
యూరియాపై బీఆర్ఎస్ బూటకపు ప్రచారం
సాక్షి, హైదరాబాద్: యూరియా విషయంలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం రైతాంగాన్ని రెచ్చగొట్టే దిగజారుడు ప్రచారం చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. రైతులు యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడుతున్నారని బీఆర్ఎస్ పదే పదే చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులను ఏ విధంగా ఇబ్బందులకు గురిచేశారో రాష్ట్ర రైతాంగానికి బాగా తెలుసని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల్లో వ్యవసాయ రంగానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నదీ కూడా రైతులు గమనిస్తున్నారని మంత్రి తెలిపారు.సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాల్లో యూరియా కోసం క్యూ లైన్లలో రైతులు నిలబడి ఇబ్బందులు పడిన ఘటనలు, క్యూ లైన్లలో రైతులు మరణించిన దుర్ఘటనలు కూడా బీఆర్ఎస్ నేతలు మర్చిపోయారని విమర్శించారు. వరి బోనస్ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు ఉందా అని ప్రశ్నిస్తూ, ‘వరి వేస్తే ఉరి’అన్న మాటలు గుర్తు చేశారు.గత వానాకాలంలో కేంద్రం నుంచి సకాలంలో ఎరువులు అందక రైతులు ఇబ్బంది పడితే, ఆ పరిస్థితిని రాజకీయ లబ్ధికి వాడుకున్నారని, అయినప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో రైతులు బీఆర్ఎస్కు తగిన గుణపాఠం చెప్పారన్నారు. పత్తి రైతుల కోసం కేంద్రం తీసుకొచ్చిన ‘కపాస్ కిసాన్ యాప్’విజయవంతమవడంతో అదే తరహాలో యూరియా యాప్ను అమలు చేస్తున్నామని తెలిపారు. యాప్ అమలులో ఉన్న జిల్లాల రైతులను అడిగి తెలుసుకోవాలని, అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని తుమ్మల స్పష్టం చేశారు.


