తిరుమల : తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఏడుకొండలవాడి దర్శనానికి భక్తులు భారీగా బారులు తీరి ఉన్నారు. ప్రస్తుతం భక్తులతో కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయాయి. క్యూ కాంప్లెక్స్ ఎదుట కిలోమీటర్ మేర భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటలు, కాలినడక భక్తులకు 9 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 85,013 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు.