తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | Heavy rush at Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Oct 25 2015 10:31 AM | Updated on Sep 3 2017 11:28 AM

తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఏడుకొండలవాడి దర్శనానికి భక్తులు భారీగా బారులు తీరి ఉన్నారు.

తిరుమల : తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఏడుకొండలవాడి దర్శనానికి భక్తులు భారీగా బారులు తీరి ఉన్నారు. ప్రస్తుతం భక్తులతో కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండిపోయాయి. క్యూ కాంప్లెక్స్ ఎదుట కిలోమీటర్ మేర భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటలు, కాలినడక భక్తులకు 9 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 85,013 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement