
మహానందిలో భక్తుల కిటకట
కార్తీక మాసం కావడంతో శైవ క్షేత్రాలన్నీ కిటకిటలాడాయి. కార్తీక సోమవారం సందర్భంగా మహానంది పుణ్యక్షేత్రం భక్తులతో పోటెత్తింది. కర్నూలు జిల్లా మహానందిలో వెలిసిన మహానందీశ్వరుడిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడంతో.. ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.