kurnool district
-
మల్లన్న భక్తులకు తప్పని నడక కష్టాలు
మహాశివరాత్రి పర్వదినం సమీపిస్తోంది. శ్రీశైలం (Srisailam) మల్లన్న దర్శనానికి భక్తులు కాలినడకన బయలుదేరేందుకు సిద్ధమవుతున్నారు. వందలు కాదు.. వేలు కాదు.. లక్షలాది మంది భక్తులు శ్రీశైల క్షేత్రాన్ని ఏటా దర్శించుకుంటున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది ఇప్పటికే శివ మాల ధరించిన భక్తులు తమ దీక్షా కాలాన్ని పూర్తి చేసుకుని నిష్టాగరిష్టులై స్వామి దర్శనానికి వేచి ఉన్నారు. ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు జరగనున్న శివరాత్రి (MahaShivratri) ఉత్సవాలకు ఏర్పాట్లు చేసిన దేవస్థానం, దేవదాయశాఖ అధికారులు పాదయాత్ర భక్తులను మాత్రం విస్మరించినట్లున్నారు. జంగిల్ క్లియరెన్స్, తాగు నీటి ఏర్పాట్లను మొదలే పెట్టకపోవడంతో పాదయాత్ర భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శివయ్యా.. నీ చెంతకు చేరే దారేదయ్యా అంటూ లోలోనే మదన పడుతున్నారు.శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్లాలనుకునే భక్తుల్లో చాలా మంది వెంకటాపురం మీదుగా ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటారు. ఆత్మకూరు నుంచి వెంకటాపురం మీదుగా శ్రీశైలానికి 45 కిలోమీటర్ల దూరం అవుతుంది. 41 రోజులు కఠోర దీక్షలో ఉంటూ, శివనామస్మరణ చేస్తూ, నేలపై నిద్రించి అనునిత్యం శివ నామాన్ని జపించే శివమాలధారులు చివరిగా ఆ శివయ్యను చేరుకునేక్రమంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 20 రోజులకు పైగా భక్తుల రద్దీ కొనసాగే ఈ ఈ 45 కిలోమీట్ల నడక దారిలో జంగిల్ క్లియరెన్స్ను ఇటు శ్రీశైలం దేవస్థానం గానీ.. అటు అటవీశాఖ అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. బొబ్బలెక్కిన కాళ్లకు... గుళక రాళ్లు మరింత అడ్డంకి వెంకటాపురం గ్రామం నుంచి కాస్త దూరం వెళ్లగానే నాగలూటి క్షేత్రం చేరుకుంటారు. ఈక్రమంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. చిన్న దారి, గుబురుగా పెరిగిన చెట్ట కొమ్మలు, రాలిపడిన ఆకుల కింద ముళ్లు భక్తులకు ఇబ్బందిగా మారనున్నాయి. అక్కడ వీరభద్రస్వామిని దర్శించుకుని ఎగువగట్టుకు వెళ్లేక్రమంలో ప్రతి ఐదు లేదా పది నిమిషాలకోసారి మల్లన్నా.. నీ దర్శనం ఎప్పుడంటూ నడవలేక ఆగిపోయే పరిస్థితులున్నాయి. అతికష్టమైనా మెట్లు ఎక్కే భక్తులకు. చెత్తచెదారం కాళ్లకు గుచ్చుకుంటే మాత్రం భరించలేదు. ఎలాగో కష్టపడి గట్టు దిగిన భక్తులకు పెచ్చెరువుకు చేరుకోవడం సులభమే. కానీ సాదులమఠం, సీతమ్మబావి, భీమునికొలను చేరే క్రమంలోనూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా భీముని కొలనులోయలో పడే ప్రమాదముందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అతి కష్టంపై ఒకరి చేయి మరొకరు పట్టుకుని మరో చేత్తో కొండ గట్టును పట్టుకుని ఒక్కొక్కరుగా ముందుకుసాగాల్సిన దుస్థితి ఉంది. భీముని కొలను దిగగానే కైలాస ద్వారానికి వెళ్లే మెట్ల మార్గం మరో ఛాలెంజ్. ఆ తర్వాత కైలాస ద్వారం నుంచి హఠటకేశ్వరం క్షేత్రం చేరే సమయంలోనూ దారి అస్తవ్యస్తంగా ఉంది. ఇలా 45 కిలోమీటర్ల ప్రయాణంలో భక్తుల పాదాలకు గుచ్చుకునే పదునైన కొండరాళ్లు తీవ్ర అంతరాయంగా మారుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి నడిచి రావడంతో అప్పటికే బొబ్బలెక్కిన కాళ్లకు వెదురుబొంగులు, పదునై ఎర్రరాళ్ల కొస వల్ల మరింత కష్టంగా మారుతున్నాయి. శ్రీశైలం దేవస్థానం, అటవీ శాఖ అధికారుల మధ్య సమన్వయం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 32 ఏళ్లకు పైగా శివమాలధారణ ప్రారంభమైనప్పటి నుంచి నడకమార్గం ఎప్పుడూ శుభ్రం చేయకపోవడమే అందుకు నిదర్శనం. శ్రీశైలం దేవస్థానం అధికారులు తూతూ మంత్రంగా నిధులిస్తుండటంతో ఫారెస్టు అధికారులు కూడా అంతే రీతిలో పనులు చేసి చేతులు దులుపేసుకుంటున్నారు. కేవలం నాగలూటి క్షేత్రం వద్ద ఉన్న రెండు కోనేరులను శుభ్రం చేయడం, నాగలూటి వరకు అక్కడక్కడా వెదురుబొంగులు తొలగించడం మినహా.. రహదారి విశాలంగా చేయడం కానీ, నడక దారి భక్తుల కాళ్లకు గుచ్చుకోకుండా రాళ్లను తొలగించడం కానీ చేసిన దాఖలు లేదు. కాగా తాము నిధులిస్తున్నా.. అటవీ శాఖ దేనికి ఖర్చు చేస్తుందో చెప్పడం లేదని దేవస్థానం అధికారులు ఆరోపిస్తున్నారు. దారి పొడవునా జంగిల్ క్లియరెన్స్ చేయాలి శ్రీశైలం క్షేత్రానికి వెంకటాపురం నుంచి పాదయాత్ర కొనసాగించే భక్తులకు ఇబ్బంది లేకుండా కనీసం దారిలో గుచ్చుకునే రాళ్లనైనా తొలగించేందుకు అటవీశాఖ, శ్రీశైలం దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలి. ఏటా భక్తుల కోసం నామమాత్రంగా కొన్ని పనులు చేసి చేతులు దులుపుకోవడం సరికాదు. తప్పనిసరిగా రహదారి వెంట ఇరువైపులా కంప చెట్లను, వెదురుబొంగులను, మొనదేలిన రాళ్లను తొలగించాలి. – విశ్వంభర మద్దుల రమణారెడ్డి, శివస్వామి, ఆత్మకూరు తాగు నీరు ఏర్పాటు చేయాలి యేటేటా శ్రీశైలం మహా క్షేత్రానికి లక్షలాదిగా తరలివెళ్లే శివస్వాములు, భక్తులకు తప్పనిసరిగా అధికారులు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి. ఇప్పటికే నాగలూటి చెంచుగూడెం, పెచ్చెరువు, నాగలూటి వీరభద్రస్వామి క్షేత్రం వద్ద బోర్లు చెడిపోయాయి. అధికారులు స్పందించి మరమ్మతులు చేయడమేగాకుండా ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక చోట తాగునీరు ఏర్పాటు చేయాలి. సాదుల మఠం, సీతమ్మబావి, భీమునికొలను వరకు భక్తులకు నీటి సౌకర్యం కల్పించాలి. – సంజీవరెడ్డి, శివస్వామి, సిద్ధపల్లి గ్రామం -
వైఎస్ జగన్ హయాంలోనే ప్రొడక్షన్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు
-
పట్టుకు పెట్టింది పేరు ఎమ్మిగనూరు
∙పి.ఎస్. శ్రీనివాసులు నాయుడు, కర్నూలుభారతీయ మహిళల వస్త్రధారణలో చీరకు ఉన్న ప్రత్యేకత ఎన్నటికీ వన్నె తరగనిది. భారత ఉపఖండానికి మాత్రమే పరిమితమైన చీర ఇప్పుడిప్పుడే పాశ్చాత్యులనూ ఆకట్టుకుంటోంది. కాలం తెచ్చిన మార్పుల్లో చీరకట్టు కొంత వెనుకబడింది. ఆధునిక జీవనశైలి ఆదరాబాదరాగా మారడంతో మగువలు సులువుగా ధరించడానికి వీలయ్యే సల్వార్ కమీజ్లు, జీన్స్, టీ షర్ట్స్ వంటి దుస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. అయినప్పటికీ పండుగలు, వేడుకలు, పెళ్లిళ్లు వంటి శుభకార్యాల వేళల్లో మాత్రం పట్టుచీరల రెపరెపలు నిండుగా కనువిందు చేస్తున్నాయి. పట్టుచీరల డిజైన్లలోను, వాటి జరీ అంచుల తీరుల్లోను కొత్త కొత్త ఫ్యాషన్లు పుట్టుకొస్తున్నాయి.దేశంలోని కొన్ని ప్రదేశాలు చేనేతకు చిరునామాలుగా తమ ప్రత్యేకతను ఇంకా నిలుపుకొంటూ వస్తున్నాయి. అలాంటి ప్రదేశాల్లో కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు ఒకటి. కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు చేనేతకు పెట్టింది పేరు. విజయనగర సామ్రాజ్యకాలం నుంచే ఇక్కడ నిపుణులైన నేతగాళ్లు ఉండేవాళ్లు. తర్వాతి కాలంలో వనపర్తి సంస్థానాధీశులు, హైదరాబాద్ నవాబులు ఇక్కడి చేనేత వస్త్రాలను బాగా ఆదరించేవారు. స్వాతంత్య్రానికి మునుపే, 1938లో ‘పద్మశ్రీ’ మాచాని సోమప్ప ఇక్కడ ఎమ్మిగనూరు చేనేతకారుల సహకార సంఘాన్ని ప్రారంభించారు. ఇక్కడి చేనేతకారులు మగ్గాల మీద చీరలతో పాటు రుమాళ్లు, తువ్వాళ్లు, పంచెలు, దుప్పట్లు, దోమతెరలు వంటివి కూడా నేస్తున్నారు. తొలినాళ్లలో నూలు వస్త్రాలను నేసే ఇక్కడి చేనేతకారులు, 1985 నుంచి పట్టుచీరల నేత కూడా ప్రారంభించారు. శుభకార్యాల్లో పట్టుచీరలకే ప్రాధాన్యంచీరల్లో రకరకాల ఫ్యాషన్లు వస్తున్నాయి. పండుగలు పబ్బాలు, వేడుకలు, శుభకార్యాలలో సందర్భానికి తగిన చీరలు ధరించడానికి మగువలు ఇష్టపడుతున్నారు. ఇటీవలికాలంలో డిజైనర్ శారీలు, వర్క్ శారీలు ఫ్యాషన్గా కొనసాగుతున్నాయి. అయినా, పెళ్లిళ్ల వంటి శుభకార్యాల్లో మాత్రం మహిళలు పట్టుచీరలకే ప్రాధాన్యమిస్తున్నారు. పట్టుచీరల తయారీకి మగ్గాలతో పాటు ఇటీవలి కాలంలో యంత్రాలను కూడా ఉపయోగిస్తున్నారు. అయితే, పూర్తిగా మగ్గంపై నేసిన చేనేత పట్టుచీరలకే గిరాకీ ఎక్కువగా ఉంటోంది. పట్టుచీరలతో పాటు సహజమైన రంగులతో నేసిన చేనేత నూలు చీరలను ధరించడానికి చాలామంది మహిళలు ఇష్టపడుతున్నారు. సాధారణ జరీ నుంచి వెండి జరీ వరకు రకరకాల జరీ అంచుల పట్టుచీరలను నేయడంలో ఎమ్మిగనూరు చేనేతకారులు చక్కని నైపుణ్యం కనబరుస్తున్నారు. తగ్గిన చీర పొడవుఇదివరకటి కాలంలో తొమ్మిది గజాల చీరలు, ఏడు గజాల చీరలు, ఆరు గజాల చీరలు విరివిగా వాడుకలో ఉండేవి. కాలక్రమంలో చీరల పొడవు బాగా తగ్గింది. ఇప్పడు చీరల పొడవు ఐదు మీటర్లకే పరిమితమైపోయింది. ఇక వెడల్పు సుమారు 1.2 నుంచి 1.5 మీటర్ల వరకు ఉంటోంది. మగ్గం మీద పట్టుచీర నేయడానికి ఎంతో ఓపిక, శ్రమ, నైపుణ్యం అవసరం. వీటి నేతకు రెండు రకాల మగ్గాలను వినియోగిస్తుం టారు– చిన్న మగ్గాలు, పెద్ద మగ్గాలు. చిన్న మగ్గం మీద చీర నేయడానికి కనీసం నాలుగు రోజులు పడుతుంది. వెయ్యి రూపాయల కూలి దొరుకుతుంది. పెద్దమగ్గంగా చెప్పుకొనే జాకాట్ మగ్గం మీద చీర నేయడానికి నెల రోజులు పడుతుంది. ఒక చీర నేసినందుకు పన్నెండువేల రూపాయల వరకు ప్రతిఫలం దొరుకుతుంది. ఇక్కడ తయారు చేసిన చీరలను మాస్టర్ వీవర్స్ గద్వాల్ చీరలు, ధర్మవరం పట్టుచీరలుగా బ్రాండింగ్ చేసి విక్రయిస్తున్నారు.⇒ కర్నూలు జిల్లాలో చేనేత కుటుంబాలు 4,000⇒ ఉమ్మడి జిల్లాలో మగ్గాలు 10,000⇒ కర్నూలు నగరంలో వస్త్ర దుకాణాలు 700⇒ పట్టుచీరల రకాలు 10⇒ నగరంలో పట్టుచీరల గరిష్ఠ ధర రూ. 50,000⇒ గద్వాల పట్టుచీరల గరిష్ఠ విలువ రూ.25,000 -
టీడీపీ, జనసేన బాహాబాహి
ఆదోని రూరల్: కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. తాజాగా గురువారం రాత్రి ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు బాహాబాహికి దిగారు. నియోజకవర్గంలోని డీలర్షిప్ల వాటాల విషయంలో టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు సబ్కలెక్టర్ కార్యాలయం వద్ద గుమిగూడారు.నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ మద్దతుదారులు నిర్వహిస్తున్న నిత్యావసర సరుకుల దుకాణాల డీలర్షిప్లను తొలగించి తమకు ఇవ్వాలని, ఈ విషయంపై తమ అధినేతలు జిల్లా కలెక్టర్, ఆ శాఖ మంత్రిని ఆదేశించారంటూ బాహాటంగానే చెప్పుకున్నారు. ఈ క్రమంలోనే పలానా డీలర్షిప్ తమకు కావాలంటే తమకు కావాలని రెండువర్గాల మధ్య మాటామాటా పెరిగి తోపులాట చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఆదోని టూటౌన్ పోలీసులు అక్కడకు వచ్చి రెండువర్గాలకు సర్ధిచెప్పి శాంతింపచేశారు. -
5 ఏళ్ల బాలుడి కిడ్నాప్
-
పల్లె టు దిల్లీ
‘ఇప్పుడు ఎందుకు లే...’ అని రాజీపడే వాళ్లు ఉన్నచోటే ఉండిపోతారు. ‘ఎప్పుడు అయితే ఏమిటి!’ అనుకుంటూ ఉత్సాహంగా కార్యక్షేత్రంలోకి దిగేవాళ్లు ఎప్పుడూ విజేతలే. అలాంటి ఒక విజేత పెబ్బటి హేమలత. పెద్ద చదువులు చదవకపోయినా... పెద్ద వ్యాపారవేత్త కావాలని కలలు కన్నది. హేమశ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్ (ఫిష్ ఆంధ్ర) తో తన కలను నిజం చేసుకుంది. అత్యుత్తమ వ్యాపారవేత్తగా రాష్ట్రపతి అవార్డ్కు ఎంపికైంది. స్థానిక వినియోగం పెంచాలన్న సంకల్పంతో వైఎస్ జగన్ ప్రభుత్వం డొమెస్టిక్ మార్కెటింగ్పై దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫిష్ ‘ఆంధ్ర స్టోర్స్’ను ప్రోత్సహించింది. రూ.3.25 లక్షల నుంచి రూ.50 లక్షల విలువైన యూనిట్లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఫిష్ ఆంధ్ర లాంజ్ (కంటైనర్ మోడల్) యూనిట్ కోసం హేమలత దరఖాస్తు చేసుకోగా 40 శాతం సబ్సిడీతో యూనిట్ మంజూరైంది. ఆరోజు మొక్కై మొలిచిన ‘హేమశ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్’ ఇప్పుడు చెట్టై ఎంతోమందికి నీడనిస్తోంది. ‘డొమెస్టిక్ మార్కెటింగ్’ విలువను జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది...కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పురపాలక సంఘం పరిధిలోని సోమప్ప నగర్కు చెందిన హేమలత సాధారణ గృహిణి. ఇంటి నాలుగు గోడలకే పరిమితం కావాలనుకోలేదు. ఎంటర్ప్రెన్యూర్గా రాణించాలనేది తన కల. స్నాక్స్ (తినుబండారాలు)తో వ్యాపారం మొదలుపెడితే బాగుంటుందని ఆలోచించింది. కొంత మంది మహిళలతో కలసి చక్కిలాలు తయారు చేయటం మొదలు పెట్టింది. వాటిని పట్టణంలోని చిన్నచిన్న మిఠాయి కొట్లకు సరఫరా చేసేది. క్రమంగా నలభై మంది మహిళలతో కలసి వ్యాపారాన్ని విస్తరించింది. పరోక్షంగా వంద మందికిపైగా ఉపాధి కల్పించింది. చకిలాలతోపాటు చెగోడిలు, నిప్పట్లు, బులెట్లు, మసాలా వడలు, స్వీట్స్ వంటి పదిరకాల స్నాక్స్ను తయారు చేసి ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, తెలంగాణ లోని ఐజ, గద్వాల వరకూ అంగళ్లకు సరఫరా చేస్తోంది. ప్రతి రోజు రూ.30 వేలకు పైగా స్నాక్స్ను తయారు చేయించి మార్కెట్ చేస్తోంది. తన దగ్గర పనిచేసే నలభై మంది మహిళలతో నాలుగు పొదుపు గ్రూపులు ఏర్పాటు చేసి వారి ఆర్థిక స్వావలంబనకు బాటలు వేసింది.ఎకో ఫ్రెండ్లీ నాన్ ఓవెన్ బ్యాగ్లు΄్లాస్టిక్ వినియోగానికి ప్రత్యామ్నాయం ఆలోచించిన హేమలత బ్యాంక్ల సహకారంతో రూ.50 లక్షలతో కాలుష్యరహిత నాన్ ఓవెన్ బ్యాగ్ల తయారీ యూనిట్నుప్రారంభించింది. పది మంది వర్కర్స్తో ఈ యూనిట్ను నడుపుతోంది. 10–14 ఇంచుల సైజ్ మొదలు 16–21 సైజు వరకూ వివిధ రకాల బ్యాగ్లను తయారు చేయిస్తోంది. వినియోగదారుల డిమాండ్ను బట్టి డి–కట్, డబ్లూ–కట్, బాక్స్టైప్, స్టిచ్చింగ్ బ్యాగ్లను తయారు చేయిస్తోంది. తమ దగ్గర తయారు చేసే నాన్ ఓవెన్ బ్యాగ్ల స్టిచ్చింగ్ పనిని పొదుపు సంఘాల్లో పనిచేసే మహిళా టైలర్లకు ఇస్తూ వారికి వేతనాలు చెల్లిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాలతోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లోని మాల్స్, స్టోర్స్కు సరఫరా చేస్తోంది. నాన్ ఓవెన్ బ్యాగ్ల తయారీ టర్నోవర్ ఏడాదికి రూ. కోటి దాటిపోయింది. కోవిడ్ సమయంలో మాస్క్లు, ఆస్పత్రి మెటీరియల్స్ను తయారు చేయించి ఎంతోమందికి ఉపాధి చూపింది.దక్షిణాదిలో నెంబర్వన్ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నప్పుడు స్వయం ఉపాధి రంగాలకు ప్రోత్సాహకాలందించేవారు. గత ప్రభుత్వ సహకారంతో ప్రధానమంత్రి మత్స్య సహకార యోజన (పీఎంఎంఎస్వై)తో హేమలత ఎమ్మిగనూరులో రూ.50 లక్షలతో ఫిష్ ఆంధ్ర (హేమ శ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్) ను ప్రారంభించింది. ఫిష్ ఆంధ్ర నిర్వహణ లో దక్షిణాదిలోనే ‘హేమశ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్’ ప్రథమ స్థానంలో నిలిచింది.కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని ఓ చిన్న గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన హేమలత ఎంతోమంది ఔత్సాహికులకు ‘ఐకానిక్ ఎంటర్ప్రెన్యూర్’గా స్ఫూర్తిని ఇస్తోంది.‘ఫిష్ ఆంధ్ర’కు రాష్ట్రపతి అవార్డు ఫిష్ ఆంధ్ర లాంజ్ (కంటైనర్ మోడల్) యూనిట్ కోసం హేమలత దరఖాస్తు చేసుకోగా 40 శాతం సబ్సిడీతో యూనిట్ మంజూరైంది. రూ.20 లక్షలు సబ్సిడీ రూపంలో వైఎస్ జగన్ ప్రభుత్వం సమకూర్చగా, రూ.7.5 లక్షలు హేమలత సమకూర్చుకుంది. మిగిలిన రూ.42.50 లక్షలను బ్యాంక్ రుణంగా ఇచ్చింది. ‘ఫిష్ ఆంధ్ర లాంజ్..హేమశ్రీ ఫ్యామిలీ రెస్టారెంట్’ తక్కువ కాలంలోనే విశేష ఆదరణ పొందింది. ఇరవై మందికిపైగా ఉపాధి కల్పిస్తున్న ఈ యూనిట్ ద్వారా రోజుకు రూ.40–50 వేల వరకు వ్యాపారం సాగించే స్థాయికి చేరుకుంది. చిక్కీల నుంచి రెస్టారెంట్ వరకు ఏటా రూ.కోటికి పైగా వ్యాపారం చేస్తూ వందమంది ప్రత్యక్షంగా, మరో యాభై మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలిచింది హేమలత. సూపర్ సక్సెస్ అయిన ఈ యూనిట్ను కేంద్ర బృందం పలుమార్లు సందర్శించి అత్యుత్తమ యూనిట్గా గుర్తించింది. హేమలత రాష్ట్రపతి అవార్డుకు ఎంపికైంది. గర్వంగా ఉందిరాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ నెల 26న అవార్డు అందుకోబోతున్నానన్న వార్త తెలిసినప్పటి నుంచి చాలా సంతోషంగా ఉంది. సుమారు వందమందికిపైగా మహిళలకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడం గర్వంగా ఉంది. పేదరిక నిర్మూలనకు, మహిళా ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వాలు అందిస్తున్నప్రోత్సాహం, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. చాలా పథకాలపై ప్రజలకు సరైన అవగాహన లేదు. ప్రభుత్వ పథకాలు, నిధులు నిరుపయోగంగా మారుతున్నాయి. – పెబ్బటి హేమలత– గోరుకల్లు హేమంత్ కుమార్, సాక్షి, ఎమ్మిగనూరు, – పంపాన వరప్రసాదరావు, సాక్షి, అమరావతి. -
పుట్టింటి గోవు.. ఆ ఇంటికి ఆదరువు
కుమార్తెకు పెళ్లిచేస్తే.. తోడుగా గోవును సాగనంపడం కొన్ని కుటుంబాల్లో ఆచారం. ఆస్తిపాస్తులు లేని గ్రామీణ పేదలు ఇలా గోవును కట్నంగా సమర్పించుకోవడం ఆనవాయితీ. ఆ నూతన వధూవరులిద్దరూ కట్నంగా వచ్చిన గోవును వరంగా భావించి.. దానిలోనే మహాలక్ష్మిని చూసుకున్నారు.పుట్టింటి కానుకతో మెట్టినింట కాసుల పంటగా మలుచుకున్నారు. ఆ గోవుతో ఏకంగా 150 ఆవుల పాడిని సృష్టించారు. నలుగురు పిల్లల పెళ్లిళ్లు మంద ఆదాయంతోనే కానిచ్చారు. కరువు సీమలో ఒక్క ఆవుతో కరువును జయించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది అయ్యమ్మ, వీరారెడ్డి కుటుంబం. – మంత్రాలయంఆ ఇంట అదే కామదేనువుకర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం మండలం ఎరిగేరి గ్రామానికి చెందిన మూకయ్య, బంగారమ్మ దంపతుల పెద్ద కుమార్తె అయ్యమ్మ. ఆమెకు 18వ ఏట కోసిగి గ్రామానికి చెందిన కామన్దొడ్డి వీరారెడ్డితో వివాహం నిశ్చయించారు. మూకయ్య స్థోమతకు తగ్గట్టు అయ్యమ్మకు కట్నంగా గోవును ఇవ్వాలని నిర్ణయించి సుమారు 30 ఏళ్ల క్రితం పెళ్లి బాజాలు మోగించారు. అప్పగింతల రోజున తండ్రి మూకయ్య ఓ పెయ్యి ఆవును అయ్యమ్మకు ఇచ్చి భర్తతో మెట్టినింటికి సాగనంపాడు. అయ్యమ్మ, వీరారెడ్డి అనుబంధం వరకట్నంగా వచ్చిన ఆవుతోనే మొదలైంది. గోవునే వరలక్ష్మిగా భావించి.. కూలీనాలి చేసుకుంటూ ఆ దంపతులిద్దరూ గోవును పెంచుకున్నారు. తొలి చూడిలోనే అది మరో పెయ్యి దూడకు జన్మనిచ్చింది. ఇలా ఏడాదికి రెండు ఆవుల చొప్పున జన్మించగా.. పుట్టిన ఆవుల సంతతిని విక్రయించకుండా కుటుంబ పోషణకు వనరుగా ఆ దంపతులు మలచుకున్నారు. కూలి పనులు మానేసి పశువులను పోషించుకుని కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూ వచ్చారు. ఇలా 30 ఏళ్లలో ఆవుల సంతతి 150కి పెరిగింది. వారింట అడుగుపెట్టిన గోవు సుమారు 16 ఏళ్ల క్రితం మరణించగా.. దాని సంతతి మాత్రం ఇప్పటికీ వృద్ధి చెందుతూనే ఉంది.వలసబాట పట్టకుండా..ఏటా వయసు మళ్లిన ఆవులు, దూడలను విక్రయిస్తూ అయ్యమ్మ, వీరారెడ్డి దంపతులు బాగానే కూడబెడుతున్నారు. ఏటా 10 టన్నులకు పైగా ఆవు పేడను సైతం రైతులకు విక్రయిస్తూ ఆదాయం గడిస్తున్నారు. ప్రస్తుతం ఈ దంపతుల వద్ద 50 గోవులు ఉన్నాయి. కోసిగి ప్రాంతం కరువుకు ప్రసిద్ధి. ఇక్కడ వ్యవసాయ పనులు ముగియగానే ప్రజలంతా ఇతర ప్రాంతాలకు వలసపోతుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి బతుకు బండి నడుపుకుంటారు. ఏటా ఎంత లేదన్నా 15 వేల కుటుంబాలకు పైగా ఇక్కడి నుంచి వలస వెళ్తారు. అయితే, అయ్యమ్మ కుటుంబం ఏ ఒక్కరోజు వలసబాట పట్టలేదు. పాడితో కరువును జయించడం ఎలాగో అయ్యమ్మ కుటుంబానికి చూస్తే బోధపడుతుంది.ఊపిరి ఉన్నంత వరకు వదలనుమా అయ్యకు మేం ఐదుగురు కూతుళ్లం. నేను పెద్ద కూతుర్ని. మా నాన్న ఓ ఆవును కట్నంగా ఇచ్చాడు. తోబుట్టువులు నలుగురికి ఒక్కో ఆవును కట్నంగా ఇచ్చాడు. నేను అదే ఆవుతోనే జీవితం ఆరంభించాను. ఊపిరి ఉన్నంతవరకు పాడి పోషణను వదలను. నేను తనువు చాలించినా పాడిని వదల పెట్టవద్దని నా పిల్లలకు చెబుతాను. గోవులు లేకుంటే మా బతుకు ఎలా ఉండేదో ఊహించలేను. – కామన్దొడ్డి అయ్యమ్మ, కోసిగిఎప్పుడూ ఇబ్బంది పడింది లేదుఅత్తమామలు ప్రేమతో ఆవును కట్నంగా ఇచ్చారు. దానిని మేం దైవంగా స్వీకరించాం. ఆవు పోషిస్తూ పాడిని పెంచాం. ఏనాడూ పాడి పోషణలో విసుగు చెందలేదు. ఇబ్బంది పడింది కూడా లేదు. ఇద్దరం పాడిని చూసుకుంటూ సంసారం కొనసాగించాం. మేం ఇప్పటివరకు కరువును చూడలేదు. ఇక్కడి నుంచి ఎంతోమంది వలసపోతున్నారు. మేం మాత్రం ఏ రోజూ వెళ్లలేదు. మా మామ మూకయ్య నేటికీ మా ఆదర్శ జీవనంపై ఆనందం వ్యక్తం చేస్తాడు. – కామన్దొడ్డి వీరారెడ్డి, కోసిగిపైసా అప్పు లేకుండా పెళ్లిళ్లుఅయ్యమ్మ, వీరారెడ్డి దంపతులకు రాముడు, ఈరయ్య, వీరభద్ర, మహేష్, కుమార్తె రామేశ్వరమ్మతో కలిపి ఐదుగురు సంతానం. పెద్ద కుమారుడు రాముడికి 20వ ఏట వివాహం జరిపించారు. ఆ పెళ్లికి రూ.30 వేలు ఖర్చు కాగా.. మందలో కొన్ని దూడలను విక్రయించి గట్టెక్కారు. రెండో కొడుకు ఈరయ్యకు 21వ ఏట వివాహం జరిపించగా.. రూ.50 వేలు ఖర్చయ్యింది. దీంతో కొన్ని ఆవులు, దూడలను విక్రయించారు. మూడో కొడుకు వీరభద్ర పెళ్లికి రూ.1.50 లక్షలు ఖర్చు కాగా.. అందుకు కూడా లేగ దూడలను అమ్మి శుభకార్యం జరిపించారు. నాలుగో కుమారుడు మహేష్కు రెండేళ్ల క్రితం వివాహం చేయగా.. రూ.3 లక్షలు ఖర్చయ్యింది. ఆ మొత్తాన్ని కూడా కొన్ని దూడల్ని విక్రయించి సొమ్ము సమకూర్చుకున్నారు. ఇక ఒక్కగానొక్క కూతురు రామేశ్వరమ్మకు సంబంధాలు వెతుకుతున్నారు. -
‘‘నేనే సీఎం.. నేనే డిప్యూటీ సీఎం’’
కర్నూలు, సాక్షి: కూటమి ప్రభుత్వంలో ఉండడం ఏమోగానీ.. అధికార మదంతో రోజుకొకరు వార్తల్లో నిలుస్తున్నారు. తాము ఏం చెబితే అదే శాసనం అనేలా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో అధికారులకు వార్నింగ్లు ఇస్తున్నారు. తాజాగా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆ తరహా దురుసు వ్యాఖ్యలే చేశారు.కూటమి నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ నేనే సీఎం.. నేనే డిప్యూటీ సీఎం. నేను చెబితే చంద్రబాబు చెప్పినట్టే. నేను చెబితే పవన్ కల్యాణ్ చెప్పినట్లే. ఎవరైతే ఇన్నాళ్లూ.. ఫీల్డ్ అసిస్టెంట్లు, మిడ్ డే మీల్స్ ఏజెన్సీలు, రేషన్ షాపులు కొనసాగిస్తున్నారో వాళ్లంతా ఉన్నపళంగా వదలేసి వెళ్లిపోవాలి. .. అధికారుల నుంచి ఎలాంటి లేఖలు తేవడాల్లాంటివి ఉండవు. వాళ్లంతా లబ్ధి చేకూర్చేవన్నింటిని విడిచిపోవాలి. నేను చెప్పిందే ఒక పెద్ద లెటర్. లేకుంటే లెక్క మరోలా ఉంటుంది’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు.. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేసిన కాసేపటికే ఆయన వర్గీయులు రెచ్చిపోయారు. ఐదు రేషన్ షాపులకు తాళాలు వేసి.. ‘ఇక నుంచి ఇవి మావే’ అంటూ ప్రకటన చేశారు. దీంతో రేషన్ డీలర్లు షాక్కు గురయ్యారు.‘‘ఎన్టీఆర్ హయాం నుంచి ఆ రేషన్ షాపులను తామే నడుపుకుంటున్నామని, ఇప్పుడు ఉన్నపళంగా లాగేసుకోవడం ఏంటని, తమ షాపులు లాకుంటే తాము రోడ్డున పడుతామంటూ’’ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అహం భావంతో ఎమ్మెల్యే పార్థసారథి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
సీఐ ఓవరాక్షన్.. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై దురుసు ప్రవర్తన
సాక్షి, కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల సాగునీటి సంఘం ఎన్నికల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై సీఐ నోరు పారేసుకున్నారు. ఎన్నిక జరుగుతున్న సచివాలయం దగ్గరికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి.. టీడీపీ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నీవు ఎవరు మాకు చెప్పడానికంటూ మాజీ ఎమ్మెల్యేపై సీఐ దురుసుగా వ్యవహరించారు. పోలీసులు, మాజీ ఎమ్మెల్యేకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సీఐ తీరుపై వైఎస్సార్సీపీ నాయకులు మండిపడుతున్నారు.ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలను కూటమి ప్రభుత్వం అంతా కుట్రమయం చేస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోటీలో ఎవరూ పాల్గొనకుండా బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతోంది. ఎన్నికలను రాజకీయాలకతీతంగా నిర్వహించాల్సి ఉండగా సంఘాల్లో కేవలం టీడీపీ మద్దతుదారులు ఉండాలనే లక్ష్యంతో అధికారులను రంగంలోకి దింపింది. అయితే ప్రభుత్వ తీరును నిరసిస్తూ సాగు నీటి సంఘాల ఎన్నికలను వైఎస్సార్సీపీ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.ఈ క్రమంలో ఎన్నికలు అంతా ఏకపక్షంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో 123 నీటి వినియోగదారుల అసోసియేషన్లు, 10 డిస్ట్రిబ్యూటరీ, 2 ప్రాజెక్టు కమిటీలు ఉన్నాయి. జిల్లాలో ప్రధానంగా తుంగభద్ర దిగువ కాలువ, గాజులదిన్నె ప్రాజెక్టు, కేసీ కెనాల్, హంద్రీనీవా సుజల స్రవంతి పథకం, చిన్న నీటిపారుదల శాఖ పరిధిలోని మేజర్ చెరువుల కింద భూములు ఉన్న ఆయకట్టుదారుల భాగస్వామ్యంతో నిర్వహించాల్సిన ఎన్నికలకు కూటమి పార్టీ నేతలు రాజకీయ రంగులద్దారు. -
జింక చర్మాల అక్రమ రవాణా
వజ్రకరూరు: అనంతపురం, కర్నూలు జిల్లాల్లో జింకలను వేటాడి చంపి..వాటి మాంసాన్ని విక్రయించడంతో పాటు చర్మాలను అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అనంతపురం జిల్లా వజ్రకరూరు పోలీసులు అరెస్టు చేసి 24 జింక చర్మాలు, రెండు కొమ్ములు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం వజ్రకరూరు పోలీస్స్టేషన్లో ఎస్ఐ నాగస్వామి..ఫారెస్ట్ సెక్షన్ అధికారి కరీముల్లా, బీట్ ఆఫీసర్ సతీష్తో కలసి కేసు వివరాలను వెల్లడించారు.గుంతకల్లుకి చెందిన షికారి దేవరాజు, షికారి గోవిందు, అనంతపురం నగరానికి చెందిన షికారి బాబు, షికారి బాలరాజు, గుంతకల్లు మండలం ఆచారమ్మ కొట్టాలకు చెందిన వడ్డే పెద్దఅంజి గుంతకల్లు, వజ్రకరూరు, ఆలూరు, చిప్పగిరి తదితర ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల్లో కత్తెరలు ఏర్పాటు చేసి జింకలను వేటాడేవారు. వాటి మాంసాన్ని విక్రయించి చర్మాలను కర్ణాటకలోని బళ్లారి, కంప్లి, హొస్పేట్ తదితర ప్రాంతాలకు అక్రమ రవాణా చేసేవారు.శనివారం సాయంత్రం 24 జింక చర్మాలు, రెండు కొమ్ములను సంచుల్లో వేసుకుని కర్ణాటక వైపు వెళుతున్నట్లు పోలీసులకు సమాచారం రాగా.. అటవీ శాఖ అధికారులతో కలసి వజ్రకరూరు మండలం కొనకొండ్ల సమీపంలోని బళ్లారి జాతీయ రహదారిలో వీరిని పట్టుకున్నారు. నిందితులను ఆదివారం అనంతపురంలోని మొబైల్కోర్టులో హాజరు పరచి రిమాండ్కు తరలించారు. -
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలపై ప్రజాగ్రహం
-
యురేనియం వార్.. కప్పట్రాళ్ల స్టేజి వద్ద ఉద్రిక్తత
కర్నూలు, సాక్షి: కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ల స్టేజి వద్ద ఉద్రిక్తత చోటచేసుకుంది. యురేనియం తవ్వకాలపై గ్రామస్తులు నిరసనకు దిగి రోడ్డుపై బైఠాయించారు. దీంతో బళ్లారి-కర్నూలు రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.నిరసన తెలుపుతున్న ప్రజలకు మద్దతుగా ఎమ్మెల్యే విరుపాక్షి ధర్నాలో పాల్గొన్నారు. మద్దతు పలికేందుకు వస్తున్న ఎమ్మెల్యేకు పోలీసులు అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా కూడా పోలీసుల అరెస్టు తప్పించుకుని కపట్రాళ్లకు ఎమ్మెల్యే విరుపాక్షి చేరుకున్నారు. ‘యురేనియం తవ్వకాలు వద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు, సీఎం డౌన్ డౌన్ అంటూ ఆయా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.చదవండి: రాష్ట్రంలో రెండో బయోస్పియర్ పార్క్! -
కొద్ది గంటల్లో పెళ్లి.. సినీ ఫక్కీలో పెళ్లి కూతురు జంప్
-
కర్రల సమరం.. జన సంద్రంగా దేవరగట్టు
సాక్షి, కర్నూలు: దేవరగట్టు జనసంద్రంగా మారింది. బన్ని ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు భారీగా వస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు మాళమల్లేశ్వర స్వామి కల్యాణం నిర్వహించనున్నారు. అనంతరం ఊరేగింపుతో బన్నీ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అర్ధరాత్రి ఉత్కంఠ భరితంగా కర్రల సమరం సాగనుంది. కర్ణాటక, తెలంగాణ నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. బన్ని ఉత్సవానికి 800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.‘బన్ని’ ఉత్సవం ప్రత్యేకత ఇదే..గట్టుపై కొలువైన మాత మాళమ్మ, మల్లేశ్వరుని కల్యాణోత్సవం అనంతరం ‘బన్ని’ ఉత్సవంగా జరిగే కార్యక్రమానికి ఎంతో ప్రత్యేకత ఉంది. దేవరగట్టు ఆలయ నిర్వాహణ బాధ్యత మోస్తున్న పరిసర గ్రామాలైన నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు భారీ సంఖ్యలో దేవరగట్టుకు చేరుకుంటారు. అక్కడ చెరువుకట్ట (డొళ్లిన బండే) వద్దకు చేరి కక్షలు, కార్పణ్యాలు లేకుండా కలిసికట్టుగా ఉత్సవాన్ని జరుపుకుందామని పాలబాస తీసుకుంటారు. అనంతరం గ్రామపెద్దలు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న కంట్రోల్ రూం వద్దకు వచ్చి కొండపై జరిగే కల్యాణోత్సవానికి వస్తున్నట్లు సూచనగా వారికి బండారాన్ని ఇచ్చి వెళ్తారు.అనంతరం బాణసంచా పేల్చి ఇనుప తొడుగులు తొడిగిన రింగు కర్రలు, అగ్గి కాగడాలు చేతపట్టి డోలు, మేళతాళాలతో కాడప్ప మఠంలో అప్పటికే అక్కడ ఉంచిన మల్లేశ్వరుని ఉత్సవ విగ్రహాన్ని కొండపైకి తీసుకెళ్తారు. ఆలయంలో ఉన్న మాళమ్మ ఉత్సవ విగ్రహంతో వేదపండితుల భక్తులు జయ జయ ధ్వానాల మధ్య అర్ధరాత్రి వేళ కల్యాణోత్సవం జరిపిస్తారు.అనంతరం ఉత్సవమూర్తులను తీసుకుని జైత్రయాత్రను సాగించడానికి కొండ దిగే వేళ కర్రలు గాలిలోకి లేస్తాయి. దివిటీలు భగ్గుమంటాయి. ఈ సమయంలో కర్రలు భక్తుల తలలకు తగిలి గాయపడతారు. నిట్రవట్టి, బిలేహాల్, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి, అరికెర, అరికెరతాండా, కురుకుంద, లింగంపల్లి తదితర గ్రామాల భక్తులు కల్యాణోత్సవం అనంతరం జరిగే ఈ మొగలాయిలో పాల్గొంటారు. మొగలాయిలో భక్తులు చేతుల్లో ఉన్న కర్రలు తగిలి చాలా మంది గాయపడతారు.ఈ సమయంలోనే చాలా మందిపై దివిటీలు మీద పడటం, భక్తుల తోపులాటలో కిందపడటంతో తీవ్రంగా గాయపడి గతంలో కొందరు మృత్యవాత పడ్డారు. ఉత్సవాల్లో గాయపడిన భక్తులకు స్వామివారికి చల్లే పసుపు (బండారం) అంటిస్తారు. అనంతరం జైత్రయాత్ర స్వామి వారి ఊరేగింపుతో ముల్లబండ, పాదాలగట్టు, రక్షపడికి చేరుకుంటుంది. ఉత్సవ వివరాలు ఇలా..12న శనివారం రాత్రి మాంగల్యధారణ–కల్యాణోత్సవం (బన్ని), అనంతరం జైత్రయాత్ర మొదలై రక్షపడి (రక్త తర్పణం చేయుట) మీదుగా శమీ వృక్షం చేరుతుంది 13న ఉదయం నెరణికి గ్రామ ఆలయ పూజారి భవిష్యవాణి (కార్ణీకం) వినిపిస్తాడు 14న నెరణికి గ్రామ పురోహితుల చేత స్వామి వారికి పంచామృతం, రథోత్సవం15న గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడోత్సవం, సాయంత్రం వసంతోత్సవం, కంకణ విసర్జన 16న మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి -
రైలుకింద పడి ప్రేమజంట ఆత్మహత్య
మద్దికెర: ప్రేమించుకుని, కలిసి జీవించాలనుకున్న ఓ జంట... ఇంట్లో పెద్దలను ఒప్పించే ధైర్యం లేక రైలు కిందపడి అర్ధాంతరంగా తనువు చాలించిన ఘటన కర్నూలు జిల్లా, మద్దికెర రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలివీ.. మధ్యప్రదేశ్కు చెందిన ప్రతాప్సింగ్, ఉమ 20 ఏళ్ల క్రితం అనంతపురం జిల్లా గుంతకల్లుకు చేరుకొని పానీపూరి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె. కుమార్తె మీనూ(18) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రతాప్సింగ్ మధ్యప్రదేశ్కే చెందిన కుల్దీప్ పరిహార్ (23) అనే యువకుడిని పనిలో పెట్టుకున్నాడు. మీనూ, పరిహార్ ఇద్దరూ ప్రేమించుకోవడం, విషయం ఇంట్లో తెలియడంతో పరిహార్ను పనిలో నుంచి తొలగించారు. గుంతకల్లులోనే ఆ యువకుడు మరోచోట పానీపూరి బండి పెట్టుకొని సొంతగా వ్యాపారం ప్రారంభించాడు. ఇటు అమ్మాయితో ప్రేమను కొనసాగించాడు. విషయం ఇంట్లో వారికి తెలిసి మరోసారి గట్టిగా మందలించడంతో భయంతో ఇద్దరూ ఇంట్లో నుంచి పారిపోయి మద్దికెరకు చేరుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న నోట్బుక్లో తమ చావుకు ఎవరూ కారణం కాదని, తామే చనిపోతున్నామని హిందీలో రాసి సంతకాలు చేశారు. ఆ తర్వాత రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
రైతు పొలంలో ‘వజ్రం’ పండింది
సాక్షి, కర్నూలు: జిల్లాలో భారీ వర్షాలు పడటంతో వజ్రాల వేట మళ్లీ మొదలైంది. తుగ్గలి మండలం జొన్నగిరిలో వజ్రాలు బయటపడుతున్నాయి. పొలం పనులకు వెళ్లిన రైతుకు వజ్రం దొరికింది. 12 లక్షల రూపాయల నగదు, 5 తులాల బంగారం ఇచ్చి ఓ వజ్రాల వ్యాపారి కొనుగోలు చేశారు. కొందరు వ్యాపారులు ఏజెంట్లను నియమించుకొని ప్రతి ఏటా కోట్లాది రూపాయల్ని సంపాదిస్తున్నారు. రైతులు, కూలీలకు దొరికే వజ్రాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి.. వారు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారన సమాచారం.సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు..కాగా, కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు ఉన్నాయనే విషయాన్ని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) గుర్తించింది. కర్నూలు జిల్లా తుగ్గలి, మద్దికెర మండలాల్లోని తుగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి, కొత్తపల్లి, పెరవలి, అగ్రహారం, హంప, యడవలి, మద్దికెరతోపాటు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని గంజికుంట, తట్రకల్లు, రాగులపాడు, పొట్టిపాడు, కమలపాడు, గూళపాళ్యం, ఎన్ఎంపీ తండా గ్రామాల్లో తరచూ వజ్రాలు లభ్యమవుతున్నాయి. ఈ ప్రాంతంలోని భూమి పొరల్లో కింబర్లైట్ పైప్లైన్ ఉందని గనులు భూగర్భ శాఖ నిర్ధారించింది.వజ్రాలు ఎలా లభ్యమవుతాయంటే..మన దేశంలో డైమండ్ మైనింగ్ మధ్యప్రదేశ్లోని పన్నాలో ఉంది. అక్కడ భూమిలోని రాళ్లను తవ్వితీసి వజ్రాల తయారీ ప్రక్రియ చేపడతారు. వజ్రకరూర్, తుగ్గలి, జొన్నగిరి ప్రాంతాల్లోని భూగర్భంలో 150 మీటర్ల లోతున వజ్రాలు ఉంటాయి. భూమిలో వాతావరణ మార్పులు జరిగినప్పుడు అవి బయటకు వస్తాయి. ఆ తర్వాత వెదరింగ్ (వికోశీకరణ) వల్ల అంటే ఎండకు ఎండి, వర్షానికి తడిసి పగిలిపోతాయి. వర్షాలు, వరదలు వచ్చినపుడు ఆ రాళ్ల ముక్కలు పొలాల్లో అక్కడక్కడా దొరుకుతుంటాయి. వాగులు, వంకల ద్వారా కూడా వజ్రాలు నీటిలో కొట్టుకుని ఇతర ప్రాంతాలకు చేరతాయి. అలా చెల్లాచెదురైన వజ్రాలే ఇప్పుడు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో లభిస్తున్నాయి. -
కర్నూలు : మంత్రాలయంలో వైభవంగా రాఘవేంద్రుడి మహారథోత్సవం (ఫొటోలు)
-
‘లోకేష్, అనితా.. నిజాలు తెలుసుకొని మాట్లాడండి’
కర్నూలు, సాక్షి : నిజాలు తెలుసుకోకుండా మంత్రులు నారా లోకేష్, అనితా అసత్య ఆరోపణలు చేస్తున్నారని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి మండిపడ్డారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ హత్య రాజకీయాలు చేయలేదు. టీడీపీ పార్టీ నేతల వర్గా విబేధాలుతోనే ఈ హత్య జరిగింది. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే కేయి శ్యాం బాబు, మంత్రి బురద జల్లే ప్రయత్నం చేశారు. మంత్రి నారా లోకేష్ ఇలాంటి ఆరోపణలు మానుకోవాలి. హోసూరులో జరిగిన హత్యను తప్పు పుట్టించేందుకు ప్రయత్నాలు చేశారు. హోసూరు గ్రామంలో జరిగిన ఘటనలో వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు. అయినా మా పార్టీ నాయకులను టార్గెట్ చేసుకొని దాడులు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి చేసిన శిలాఫలకాన్ని టీడీపీ నేతలు ధ్వంసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు. -
కర్నూలులో భగ్గుమన్నకూటమి నేతల విబేధాలు
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా కూటమి నాయకుల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు బహిరంగంగా విమర్శలు గుప్పించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పార్థసారథికి వార్నింగ్ ఇచ్చారు. ‘అభివృద్ధిపై ఎమ్మెల్యే పార్థసారథి అసెంబ్లీలో అబద్దాలు చెప్పారు. ఆయన గెలవక ముందు ఒకటి.. గెలిచిన తరువాత మరొక్క మాట మాట్లాడుతూన్నారు. టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఓట్లు వేస్తేనే గెలిచి.. ప్రస్తుతం అదే టీడీపీ కార్యకర్తలను మరిచారు. ఈ క్రమంలో ప్రభుత్వ కార్యక్రమాలకు టీడీపీని దూరంగా ఉంచడం పద్ధతి కాదు. ఇలాగే కొనసాగితే త్వరలో నిర్ణయాలు వేరుగా ఉంటాయి. టీడీపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు సమన్వయంతో పని చేస్తాను’ అని అన్నారు.ఆదోని కూటమి నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మీనాక్షి నాయుడు ఆరోపణలపై బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి స్పందించారు. ‘ఆదోని టీడీపీలో 5 వర్గాలు ఉన్నాయి. బీజేపీలో కాని జనసేనలో కాని వర్గాలు లేవు. అందరిని సమన్యాయం చేసుకుంటూ పోతున్నాను. మీనాక్షినాయుడు తన మాటే వినాలని చెబుతున్నారు. నేను ఎమ్మెల్యేని అబద్ధాలు మాట్లాడే అవసరం నాకు లేదు. ఏది మాట్లాడినా అన్ ద రికార్డు.. ఆఫ్ ద రికార్డ్కి తావే లేదు. టీడీపీ పార్టీలో ఐదు వర్గాలు ఉన్నాయి. ఎవరిని పట్టించుకోకూడదు తన మాటే నడవాలి అనడం మీనాక్షి నాయుడుది ఒంటెద్దు పోకడ. ఐదు వర్గాలని కలుపుకోకుండా తెలుగుదేశం పార్టీ వాళ్లని అన్యాయం చేసింది మీనాక్షి నాయుడే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు’అని అన్నారు. -
మనోడే.. పోస్టింగ్ ఇచ్చేయండి
కర్నూలు: రకరకాల సిఫారసులు, భారీ పైరవీలతో కర్నూలు రేంజ్ పరిధిలో పలువురు ఇన్స్పెక్టర్లు పోస్టింగులు దక్కించుకున్నారు. వన్సైడ్గా పనిచేస్తామని చెప్పడమే కాకుండా పోస్టుకు తగినట్లుగా సమర్పించుకున్న వారికి కుర్చీలు దక్కాయన్న చర్చ జరుగుతోంది. కర్నూలు రేంజ్ పరిధిలో 35 మంది ఇన్స్పెక్టర్లకు స్థానచలనం కల్పిస్తూ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో 13 మందికి, నంద్యాల జిల్లాలో 9 మందికి కలిపి 22 మంది ఇన్స్పెక్టర్లకు స్థానచలనం కలిగింది.రెడ్బుక్ స్క్రీనింగ్తో సీఐల జాబితా విడుదలఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరికి వారు తమ సీఐల జాబితాను రెడీ చేసి పోలీసు శాఖ ఉన్నతాధికారులకు సమర్పించారు. అన్ని అర్హతలు పరిశీలించి వారం రోజుల క్రితమే జాబితా పోలీస్ హెడ్ క్వార్టర్కు చేరింది. అయితే తీవ్ర ప్రతిష్టంభన తర్వాత రెడ్ బుక్ స్క్రీనింగ్తో జాబితా విడుదలైనట్లు కొంతమంది పోలీసు అధికారులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. గత టీడీపీ ప్రభుత్వంతో సంబంధాలు ఉన్న వారికి ప్రజాప్రతినిధుల లేఖలు చాలా వరకు పనిచేశాయి. సమర్థులైన పోలీసు అధికారులు స్టేషన్లో ఉంటే శాంతిభద్రతల పరిరక్షణ సవ్యంగా సాగుతుందన్న విషయం పోలీసు ఉన్నతాధికారులకు తెలియనిదేమీ కాదు. అయితే అధికార పార్టీ అనుకూల సామాజిక వర్గానికి చెందిన కొందరు గ్రూపుగా ఏర్పడి రేంజ్ పరిధిలో పోస్టింగుల వ్యవహారంలో చక్రం తిప్పారనే చర్చ జరుగుతోంది. కర్నూలు పరిధిలో ఆరు పోలీస్ స్టేషన్లు ఉండగా కర్నూలు టూటౌన్కు సీసీఎస్లో ఉన్న జి.వి.నాగరాజరావును నియమించి అక్కడున్న సీఐ ఇంతియాజ్ బాషాను వీఆర్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అలాగే కర్నూలు ఎస్హెచ్ఆర్సీలో పనిచేస్తున్న బి.రామకృష్ణ కడప వన్టౌన్కు బదిలీ అయ్యారు. -
చదువుల తల్లికి ఎంత కష్టం
సాక్షి, కర్నూలు జిల్లా: చదువుకోవాలని ఆశ ఉన్నా.. అందుకు కుటుంబ పరిస్థితులు సహకరించడం లేదు. దీంతో ఆ బాలిక వారంలో నాలుగు రోజులు పనికి వెళ్తోంది. మూడు రోజులు బడికి వెళ్తూ శ్రద్ధగా చదువుకుంటోంది. గోనెగండ్ల మండలం చిన్నమరివీడు గ్రామానికి చెందిన బోయ సింధు.. గ్రామంలోని ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు బోయ పార్వతి, బోయ గోవిందులకు ఇల్లు తప్ప ఏమీ లేదు. వీరు రోజూ కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. ఇల్లు గడవడం కష్టంగా ఉండటంతో వీరికి తోడుగా సింధు పొలం పనులకు వెళ్తోంది. తాము చాలా పేదరికంలో ఉన్నామని, బతుకు దెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినప్పుడు బిడ్డపై బెంగగా ఉంటుందని బోయ పార్వతి, గోవిందు తెలిపారు. బిడ్డ చదువుకు ఇబ్బంది లేకుండా అధికారులు కేజీబీవీలో సీటు ఇప్పించాలని వీరు కోరుతున్నారు. -
ఆగని టీడీపీ విధ్వంసాలు
సాక్షి నెట్వర్క్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు విధ్వంస చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. శని, ఆదివారాల్లో కూడా ఇష్టారీతిన వ్యవహరించారు. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి విగ్రహాలను ధ్వంçÜం చేశారు. వీఆర్వో కుటుంబంపై దాడిచేశారు. » పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలోని గ్రామ సచివాలయం వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం చేతిని శనివారం రాత్రి విరగ్గొట్టారు. విగ్రహం ధ్వంసంపై వైఎస్సార్సీపీ నాయకులు, వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు ముప్పాళ్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడినవారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ నాయకుడు కానాల పుల్లారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు గోగుల అంజిబాబు, నేతలు చిమటా శ్రీనివాసరావు, తిరుమలశెట్టి అయ్యప్ప, షేక్ దమ్మాలపాటి బుజ్జి, గంటా శ్రీనివాసరావు, షేక్ మస్తాన్వలి, ఇందూరి వెంకటరెడ్డి, మహంకాళిరావు, జయరావు, బి.రాజు కోరారు. » ఏలూరు జిల్లా దెందులూరులోని లైబ్రరీ సెంటర్లో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం చేతుల్ని విరగ్గొట్టారు. ఈ విధ్వంసంపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. » కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం ఇనగండ్ల గ్రామ వీఆర్వో తిరుపాల్, ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ నాయకులు దాడిచేశారు. వీఆర్వో కథనం మేరకు.. మండలంలోని తిమ్మందొడ్డి గ్రామ ఎస్సీ కాలనీలో వీఆర్వో తిరుపాల్ తన కుటుంబంతో నివాసముంటున్నారు. అదే గ్రామంలో బీసీ వర్గానికి చెందిన టీడీపీ నాయకులు వీఆర్వో కుటుంబసభ్యుల్ని కులం పేరుతో దూషించి, కించపరిచారు. ఈ విషయం తెలుసుకున్న తిరుపాల్ భార్య దేవమ్మ తిట్టిన వారిని ప్రశి్నంచడంతో ‘ఎస్సీ కులానికి చెందినదానవు, నీవు మా ఇళ్ల దగ్గరకు వస్తావా..’ అంటూ మరోసారి దూషించారు. అంతటితో ఆగకుండా ఇంటిమీదకు వెళ్లి తిరుపాల్, దేవమ్మ దంపతులపైన, వారి కుమారుడు జానుపైన దాడిచేశారు. తమపై టీడీపీకి చెందిన పెద్దశేషన్న కుమారుడు హరి, ముత్యాలు కుమారులు వెంకన్న, గిడ్డయ్య, గౌరన్న కుమారుడు హరి దాడిచేసినట్లు వీఆర్వో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబానికి రక్షణ కలి్పంచి, దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వీఆర్వో కోరారు. ఈ విషయమై ఎస్.ఐ. తిమ్మరెడ్డి మాట్లాడుతూ ఈ ఘటనపై తనకు సమాచారం వచి్చందని, విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
టీడీపీ అరాచకం.. వైఎస్సార్సీపీ దళిత మహిళా కార్యకర్త హత్య
సాక్షి, కర్నూలు జిల్లా: అధికార మదంతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. కర్నూలు జిల్లాలో టీడీపీ అరాచకాలు ఆగడం లేదు. ఆదోని మండలం నాగనాతన హల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్త గుండమ్మను హత్య చేశారు. దళిత మహిళ గుండమ్మ పొలంలో పని చేసుకుంటుండగా టీడీపీ నేత రాగప్పరెడ్డి... ట్రాక్టర్తో ఢీకొట్టి హత్య చేశారు. పొలం విషయంలో టీడీపీ నేతలు ఘర్షణకు దిగారు. దళిత మహిళ గుండమ్మను హత్యచేసి పరారయ్యారు.పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు ఆగడాలు మితిమీరి పోతున్నాయి. టీడీపీ నేతల వేధింపులకు ఉపాధిహామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ బలయ్యారు. ఉద్యోగానికి రాజీనామా చేయాలని టీడీపీ నేతలు బెదిరింపులకు దిగారు. నెల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ ఆనంద్ను టీడీపీ నేతలు వేధిస్తుండగా, ఫిల్డ్ అసిస్టెంట్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
కొనసాగుతున్న విధ్వంసకాండ
కృష్ణగిరి/నాగలాపురం/నల్లజర్ల/జలదంకి: టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆగడాలు మితిమీరిపోయాయి. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజు నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూనే ఉన్నారు. వైఎస్సార్ విగ్రహాలను, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన శిలాఫలకాలను పనిగట్టుకుని పగులగొడుతున్నారు. శనివారం రాత్రి కర్నూలు జిల్లా కృష్ణగిరిలోని బస్టాండ్లో ఉన్న వైఎస్సార్ విగ్రహంతోపాటు రైతు భరోసా కేంద్రం శిలాఫలకాన్ని కొందరు దుండగలు ధ్వంసం చేశారు. విగ్రహం తల, చెయ్యి తొలగించారు. ఆదివారం ఉదయం దీన్ని చూసిన స్థానికులు నాయకులకు సమాచారం ఇచ్చారు.ఈ విధ్వంసానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని ఎంపీపీ డాక్టర్ కంగాటి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నాయకులు కటారుకొండ మాధవరావు, శివ, వెంకటేశ్వర్లు, ఎరుకలచెర్వు ప్రహ్లాద, వెంకటరాముడు, అమకతాడు బాలు, మాధవస్వామి, కృష్ణగిరి జయరామిరెడ్డి, హుసేన్సాహెబ్, బాలమద్ది తదితరులు ఈ చర్యను ఖండించారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలంలోని గోవర్ధనగిరి గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉన్న వైఎస్సార్సీపీ శిలాఫలకాన్ని శనివారం రాత్రి టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. వీటి ప్రారంభోత్సవ సమయంలో ఈ శిలాఫలకాలను ఏర్పాటు చేశారు.ఈ ఘటనతో గ్రామంలో అలజడి రేగింది. టీడీపీ కార్యకర్తలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారంటూ స్థానికులు ధ్వజమెత్తారు. దీనిపై గోవర్థనగిరి వైఎస్సార్సీపీ సచివాలయ కన్వీనర్ మునిశేఖర్ పిచ్చాటూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం తెలికిచెర్ల సచివాలయం–1 పరిధిలోని సచివాలయం, రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి నవరత్న పథకాలు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోతో ఉన్న శిలాఫలకాలను ధ్వంసం చేశారు. 26 రోజులుగా సాగుతున్న దాడులు, దాష్టీకాలు చూస్తూంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేక ఆటవిక పాలనలో ఉన్నామా అని సందేహం కలుగుతోందని గ్రామ సర్పంచ్ బండి చిట్టి, ఉప సర్పంచ్ నక్కా పండు ధ్వజమెత్తారు. ఈ ఘటనలపై మానవ హక్కుల కమిషన్ తక్షణమే స్పందించి, తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శిలాఫలకంపై పేర్లు తొలగింపు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలం కొత్తపాళెంలో 2023లో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం, నూతన విద్యుత్ లైన్ల ఏర్పాటు, పంచాయతీ భవనం రీ మోడలింగ్ తదితర పనులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం దాదాపు రూ.20 లక్షలతో చేపట్టింది. ఇందుకు సంబంధించిన శిలాఫలకంలో స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులతో పాటు ఎంపీ, ఎమ్మెల్యేల పేర్లను ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేశారు.ఆదివారం గ్రామంలోని టీడీపీ నాయకులు ఈ శిలాఫలకంలో అప్పటి ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలతో పాటు వారికి నచ్చని పేర్లను పచ్చ పెయింట్తో తుడి చేశారు. శిలాఫలకం దిమ్మెలకు కూడా పచ్చ పెయింటింగ్ వేశారు. పంచాయతీ భవనం గోడపై సీబీఎన్ అని రాశారు. గతంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి పేరు మాత్రం తొలగించలేదు. ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ నేతలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
జొన్నగిరిలో రూ.1.75 లక్షల వజ్రం లభ్యం
తుగ్గలి: కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో పేదలను వజ్రాలు వరిస్తున్నాయి. జొన్నగిరిలో పొలాల్లోకి వెళ్లిన ఓ వ్యక్తికి మంగళవారం వజ్రం లభ్యమైనట్లు సమాచారం. ఈ వజ్రాన్ని రూ.1.75 లక్షలు, జత కమ్మలు ఇచ్చి ఓ వజ్రాల వ్యాపారి కొనుగోలు చేసినట్లు తెలిసింది. -
Kurnool Diamond: కర్నూలు జిల్లాలో రైతుకు దొరికిన వజ్రం
కర్నూలు: తొలకరి చినుకులు పడగానే కర్నూలు జిల్లా మద్దికెర, తుగ్గలి మండలాల్లో వజ్రాల వేట మొదలవుతోంది. దూర ప్రాంతాల నుంచి జనం వచ్చి ఇక్కడ వజ్రాలు వెతుకుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. రైతులు తమ పొలాలు సాగు చేసేటప్పుడు కూడా వజ్రాలు లభ్యమవుతుంటాయి. శనివారం మద్దికెర మండలం హంప గ్రామంలో ఓ రైతు పొలం పనులు చేస్తుండగా రూ.5లక్షలు విలువైన వజ్రం దొరికింది. అలాగే మదనంతపురం గ్రామానికి చెందిన మరో రైతుకు రూ.15 లక్షలు విలువైన వజ్రం లభించింది. ఈ రెండు వజ్రాలను పెరవలి గ్రామానికి చెందిన వ్యాపారులు కొనుగోలు చేసినట్లు సమాచారం. -
ప్రైవేట్ బస్సు బోల్తా.. ఇద్దరు బాలికల మృతి
కోడుమూరు రూరల్: డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ ప్రైవేట్ ఏసీ స్లీపర్ బస్సు బోల్తా పడింది. ఇద్దరు బాలికలు మృతిచెందారు. మరో 21మంది గాయపడ్డారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు... ఆదోనిలోని బిస్మిల్లా ట్రావెల్స్కు చెందిన ఏసీ స్లీపర్ బస్సు బుధవారం రాత్రి ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి ఆదోనికి బయలుదేరింది. కోడుమూరు వద్ద లారీని ఓవర్టేక్ చేసేందుకు డ్రైవర్ అతివేగంగా వెళ్లే క్రమంలో బస్సు బోల్తా పడింది. బస్సులో చిక్కుకుపోయిన ప్రయాణికులు తమను రక్షించాలని హాహాకారాలు చేశారు.కోడుమూరు సీఐ మన్సురుద్దీన్, ఎస్ఐ బాలనరసింహులు తమ సిబ్బందితో వచ్చి స్థానికుల సాయంతో బస్సు అద్దాలను పగులగొట్టి గాయపడినవారిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో మైదుకూరుకు చెందిన వెంకటేశ్వర్లు కుమార్తె ధనలక్ష్మి (13), సురేష్ కుమార్తె గోవర్దనీ(9) మరణించారు. వరుసకు అక్కాచెల్లెళ్లు అయిన వీరిద్దరూ తమ మేనత్త కృష్ణవేణితో కలిసి ఆదోనికి బస్సులో వెళుతూ గాఢ నిద్రలోనే కన్నుమూశారు. హైదరాబాద్, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరులకు చెందిన కృష్ణవేణి, పుష్పావతి, మౌనిక, అశోక్, భారతి, గౌస్మొహిద్దీన్, పినిశెట్టి లక్ష్మి, వెంకటరెడ్డితోపాటు మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.బోయ శకుంతల, శివరాముడు, లక్ష్మి, గణేష్, అశోక్కుమార్లతోపాటు మరో ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని పోలీసులు 108 అంబులెన్స్లలో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 29మంది ప్రయాణికులు, డ్రైవర్, ఇద్దరు క్లీనర్లు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్, క్లీనర్లు పరారైనట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, కర్నూలు డీఎస్పీ విజయశేఖర్లు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. -
వాన పడింది..వజ్రాల వేట షురూ..
-
అవినీతి శ్రీశైలం కొండంత
శ్రీశైలం మల్లన్న సాక్షిగా... కర్నూలు జిల్లాకు చెందిన ఈ టీడీపీ నేత నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చేశారు. నైతికంగా దిగజారిపోయాక నాకేంటి సిగ్గన్నట్టు అవినీతికి తెగించేశారు. పాలు తాగి రొమ్ము తన్నేసిన ఈ నేత చంద్రబాబు 23 సంఖ్యలో భాగస్వామి. 2014లో వైఎస్సార్సీపీ నుంచి గెలిచి, నమ్మిన పారీ్టకి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీ పంచన చేరిపోయారు. తన నియోజకవర్గాన్ని అవినీతికి అడ్డాగా మార్చేశారు. రోడ్లు, డ్రైన్లు, ఎర్రమట్టి తవ్వకాలు, నీరు–చెట్టు, చెరువులు, కుంటల్లో పూడికతీత పనులు... ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీశైలం కొండంత. తన మాట వినని వారిపై దాడులు, బెదిరింపులకు పాల్పడడం అతనికి అతి సాధారణం. సాక్షి, టాస్క్ఫోర్స్: తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నన్నాళ్లూ ఈ నేత ఇంట్లో సిరుల వర్షం కురిసింది. ప్రధానంగా నీరు– చెట్టు పనులు ఈ నేతకు కల్పతరువులా మారాయి. ప్రతి పనికి 10 నుంచి 15 శాతం కమీషన్లు చెల్లిస్తేనే పనులు మంజూరు అయ్యేవి. నీరు–చెట్టు పనులకు మండలానికి రూ.50 కోట్లు మంజూరయ్యేవి. ఆత్మకూరు, బండి ఆత్మకూరు, మహానంది, వెలుగోడు మండలాల్లో ఈ పనులు చేయాలంటే ఈ నేతకు కప్పం కట్టాల్సిందే. నియోజకవర్గంలో చీమ చిటుక్కుమన్నా సార్ గారికి నచ్చదు. ఇతన్ని కాదని అధికారులు ముందుకు వచ్చే వారు కాదు. ఒక్క నీరు–చెట్టు పనుల్లోనే దాదాపు రూ.30 కోట్ల మేర దండుకున్నారు. నాసిరకం పనులు...ఆత్మకూరు మండలంలో ఈ అవినీతి తారస్థాయికి చేరింది. కురుకుంద, ముష్టపల్లి, సిద్ధపల్లి, కృష్ణాపురం తదితర గ్రామాల్లో దాదాపు రూ.60 కోట్లకు పైగా పనులు జరిగాయి. రైతుల పచ్చని పొలాల్లో పంటలను ధ్వంసం చేసి రహదారులు ఏర్పాటు చేశారు. సిద్ధపల్లి గ్రామంలో సాగులో ఉన్న వరి, మిరప, ఆముదాలు లాంటి పంటలను ప్రొక్లెయిన్లతో ధ్వంసం చేసి మట్టి రోడ్లు నిరి్మంచారు. కళ్ల ముందర చేతికి వచి్చన పంటలను నాశనం చేయొద్దని రైతులు అధికార పార్టీ నాయకుల కాళ్లు పట్టుకుని బతిమాలినా ఏమాత్రం చలించలేదు. కురుకుంద గ్రామంలో చెరువు పూడిక తీత పనుల్లో అనుమతికి మించి మట్టిని కొల్లగొట్టి రూ.10 లక్షల బిల్లులు మంజూరు చేయించుకున్నారు. అదే చెరువులో మరోసారి పూడిక తీసి మరికొన్ని లక్షలు దండుకున్నారు. 👉 వెలుగోడు మండలంలో ఈ మాజీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు ఒకరు రూ.10 లక్షల పనికి లక్షకు రూ.15 వేల చొప్పున కమీషన్ వసూలు చేశారు. పంట పొలాలకు వెళ్లే రహదారులు, పంట కాల్వల్లో పూడిక తీత పనులు, మట్టి రోడ్ల మరమ్మతులు, తెలుగు గంగ పరిధిలో రాస్తా పనులు, కేసీ కెనాల్ పరిధిలో చేపట్టిన ప్రతి పనిలోనూ కమీషన్లు దండారు. 👉 బండి ఆత్మకూరు మండలంలో రూ.50 కోట్లకు పైగా పనులు మంజూరు అయ్యాయి. కేసీ కెనాల్, కుందు ఆయకట్టు రోడ్ల అభివృద్ధి పేరుతో నిధులు మంజూరు చేయించుకొని దాదాపు 20 నుంచి 30 శాతం కమీషన్లు వసూలు చేశారు. కుందు నది వెడల్పు 50 మీటర్లు ఉంటే మొత్తం పూడిక తీసినట్లు కొలతలు వేసి బిల్లులు స్వాహా చేశారు. మద్దిలేరు, పోతుల వాగు, సంకలవాగు, అభివృద్ధి పనులు కూడా తూతూ మంత్రంగా చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. 👉 మహానంది మండలంలో సీసీ రోడ్లు, ఎర్రమట్టి తవ్వకాలతో ప్రభుత్వ ఖజానాను గుల్ల చేశారు. రహదారులు, చెరువులు, కుంటల పూడికతీతకు రూ.11.62 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులు చేసిన స్థానిక టీడీపీ నాయకులు తమ నేతకు 15 నుంచి 20 శాతం ముడుపులు చెల్లించారు. గాజులపల్లి అంకిరెడ్డి చెరువులో ఎర్రమట్టి తరలింపులో స్థానిక ఎమ్మెల్యే 60 శాతం, అప్పటి జిల్లా మంత్రిగా ఉన్న నేత 40 శాతం మేర డబ్బులు పంచుకున్నట్లు సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేశారు. అన్ని అర్హతలున్నా రెండు నెలల మొత్తం ముందుగా ఇస్తేనే పింఛను మంజూరు చేస్తామని జన్మభూమి కమిటీ సభ్యులు బహిరంగంగానే వసూలు చేశారు. ఆదరణ పథకం కింద కుల వృత్తి దారులకు సబ్సిడీపై ప్రభుత్వం ఇచ్చే వాషింగ్ మిషన్లు, ఇతర పరికరాలపై కూడా కమీషన్లు వసూలు చేశారు. నాటి పరిస్థితి తలుచుకుంటేనే భయమేస్తుందని నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటారు. క్రిమినల్ కేసులు ఆత్మకూరు, వెలుగోడు, నంద్యాల పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులున్నాయి. బెదిరింపులు, దాడులు తదితర నేరాలపై ఐపీసీ 504, 506 సెక్షన్ 155(3), ఐపీసీ 143, 341, 149, 324, 506, 34, సీఆర్పీసీ 151 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. -
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
-
సర్కారు చేయూత.. చదువుల తల్లి కల సాకారం
ఆదోని రూరల్/ఆస్పరి: చదువుల్లో అత్యుత్తమంగా రాణిస్తున్న ఆ బాలికను పేదరికంతో తల్లిదండ్రులు చదువు మానిపించారు. ఆ చదువుల తల్లి పదో తరగతిలో 537 మార్కులు సాధించినా.. ఉన్నత చదువులు చదవాలనే ఆశ ఉన్నా.. ఆ ర్థిక పరిస్థితుల రీత్యా చదువుకు దూరమైంది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ ఆమెకు వరమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సాయిప్రసాదరెడ్డి గతేడాది జూన్లో బాలిక ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో తాను చదువుకుంటానంటూ బాలిక ఆయనకు మొరపెట్టుకోవడంతో ఎమ్మెల్యే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన ప్రత్యేక చొరవ తీసుకున్నారు. బాలికను కర్నూలు జిల్లా ఆస్పరి కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)లో చేర్పించారు. అడుగడుగునా ప్రభుత్వ ప్రోత్సాహం అందించడంతో తాజాగా విడుదలైన మొదటి ఏడాది ఇంటర్ ఫలితాల్లో బైపీసీ విభాగంలో 440 మార్కులకు 421 మార్కులు సాధించి ఆ బాలిక టాపర్గా నిలిచింది. ‘కార్పొరేట్ కళాశాలల్లో చదివితేనే ఎక్కువ మార్కులు’ అనే అపోహను తుడిచిపెట్టేసి ప్రభుత్వ విద్యాసంస్థలో చదివి అత్యుత్తమ మార్కులను సొంతం చేసుకుంది. వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఐపీఎస్ సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది చదువుల తల్లి నిర్మల. కూలి పనుల నుంచి కాలేజీకి పంపిన ప్రభుత్వం కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామానికి చెందిన నిరుపేద దంపతులు హనుమంతమ్మ, శీనప్ప దంపతులకు నలుగురు ఆడపిల్లలు. ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపించారు. నాలుగో కుమార్తె నిర్మలను స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివించారు. పదో తరగతిలో 600కి 537 మార్కులు సాధించి నిర్మల సత్తా చాటింది. అయితే నిరుపేద కుటుంబం కావడంతో ఉన్నత చదువులు చదివించేందుకు నిర్మల తల్లిదండ్రులకు ఆ ర్థిక స్థోమత సరిపోలేదు. దీంతో ఆమెను చదువు మానిపించి తమతోపాటే కూలిపనులకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన.. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఆదోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి, అధికారులు ఆమె ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో ఇంటిలోనే ఉన్న నిర్మల ‘సార్ నేను చదుకుంటాను. నాకు సీటు ఇప్పించండి. మా అమ్మానాన్నలు పేదవాళ్లు. డబ్బులు పెట్టి చదివించలేని పరిస్థితి’ అని వేడుకుంది. చలించిపోయిన ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి వెంటనే ఆమెను కాలేజీలో చేర్పించాలని అప్పటి ఎంపీడీవో గీతావాణి, తహసీల్దార్ వెంకటలక్షి్మని ఆదేశించారు. మరోవైపు నిర్మలపై ‘సాక్షి’లో కథనం రావడంతో కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన నిర్మలను తన కార్యాలయానికి పిలిపించారు. నిర్మల ఉన్నత చదువులకు ప్రభుత్వం సాయం అందిస్తుందని చెప్పి ఆమెను ఆస్పరి కేజీబీవీలో చేర్పించారు. ప్రభుత్వం అండగా నిలవడంతో రూపాయి కూడా ఫీజు కట్టకుండానే నిర్మల చదువుకుంది. అంతేకాకుండా ఆమెకు మెటీరియల్, పుస్తకాలను కూడా కలెక్టర్ అందించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఓవైపు చదువుల్లోనే కాకుండా మరోవైపు ఆటల్లోనూ నిర్మల రాణిస్తోంది. గతేడాది కబడ్డీ పోటీల్లో రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికైంది. ఈ క్రమంలో నిర్మలను జిల్లా కలెక్టర్ సృజన ప్రత్యేకంగా అభినందించారు. ఐపీఎస్ కావాలన్నదే నా జీవిత ఆశయం ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ సృజన నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. కలెక్టర్ మాటలను ఎప్పటికీ మర్చిపోలేను. నా చదువుకు మేడమ్ అన్నివిధాల సహకరిస్తున్నారు. ఐపీఎస్ కావాలన్నదే నా లక్ష్యం. – నిర్మల, విద్యా ర్థిని చాలా గర్వంగా ఉంది.. నిర్మల ఎంతో క్రమశిక్షణతో ఉంటుంది.. పాఠ్యాంశాలపై ఆసక్తి చూపుతోంది. స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ రూపకల్పన చేసిన పంచతంత్ర ప్రోగ్రామ్ ద్వారా డైలీ, వీక్లీ, గ్రాండ్ టెస్ట్లు నిర్వహిస్తున్నాం. నిరంతర మూల్యాంకనంతోపాటు విద్యార్థుల సందేహలను నివృత్తి చేస్తున్నాం. ఈ టెస్ట్ల్లో నిర్మల మంచి మార్కులు తెచ్చుకుంది. ఆమె సాధిస్తున్న విజయాల పట్ల ఎంతో గర్వంగా ఉంది. – శారున్ స్మైలీ, ప్రిన్సిపాల్, కేజీబీవీ, ఆస్పరి, కర్నూలు జిల్లా -
కర్నూలు జిల్లాలో టీడీపీ కూటమికి భారీ షాక్
సాక్షి, పల్నాడు జిల్లా: మాటపై నిలబడే నాయకుని నాయకత్వంలో పని చేయడానికి వైఎస్సార్సీపీలో చేరేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు. కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని సీఎం పార్టీలో చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో టీడీపీ కూటమికి భారీ షాక్ తగిలింది. టీడీపీ, బీజేపీని వదిలి ఆ పార్టీల కీలక నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. పల్నాడు జిల్లా ధూళిపాళ్ల నైట్ స్టే పాయింట్ వద్ద ఆలూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ మసాల పద్మజ, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్రెడ్డి. తెలుగుదేశం పార్టీ కీలక నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి, బీజేపీకి చెందిన మాజీ మేయర్, ఆలూరు నియోజకవర్గ నేత కురువ శశికళ, ఆంధ్రప్రదేశ్ కురవ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణమోహన్, తదితరులు వైఎస్సార్సీపీలోకి చేరారు. అందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సీఎం జగన్ ఆహ్వానించారు. -
కర్నూలు : హోరాహోరీగా పిడకల సమరం (ఫొటోలు)
-
ప్రజలంతా సీఎం జగన్ వెంటే ఉన్నారు: సిద్ధార్థ్ రెడ్డి
-
సేవలు తొలగి.. వేదన మిగిలి!
మంచానికే పరిమితమైన ఈ వృద్ధురాలి పేరు కురువ లింగమ్మ. పెద్దకడబూరు మండలం మేకడోణ గ్రామానికి చెందిన ఈమె కుమారుడి వద్ద ఉంటోంది. వ్యవసాయ పనులు చేసుకునే కుమారుడు.. పింఛన్ డబ్బులతో ఈమెకు వైద్యం చేయిస్తున్నాడు. ప్రతి నెలా ఒకటో తేదీన వలంటీర్ వచ్చి పింఛన్ ఇస్తుండటంతో తమకు ఎలాంటి కష్టాలు ఉండేవి కాదని చెబుతున్నాడు. ప్రస్తుతం సచివాలయానికి వెళ్లాలంటే పనులు మానుకోవాలని, అక్కడ పింఛన్ తీసుకోవడానికి ఎన్ని రోజులు తిరగాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చంద్రబాబుకు ముసలోళ్ల ఉసురు తప్పదని కన్నీటి పర్యంతమయ్యాడు.కర్నూలు(అగ్రికల్చర్): పింఛన్ల పంపిణీ, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలులో గ్రామ, వార్డు వలంటీర్లను దూరం చేయడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. పింఛన్ల పంపిణీలో వలంటీర్లను పక్కన పెట్టడం... సచివాలయాలకే వెళ్లి పింఛన్ పొందాల్సి రావడంతో అవ్వాతాతలు, దివ్యాంగులను తీవ్ర వేదనకు గురి చేస్తోంది. మళ్లీ టీడీపీ హయాంలో పరిస్థితులే ఉత్పన్నం అవుతుండాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 20 వేల మందికిపైగా వలంటీర్లు ఉన్నారు. మొదటి నుంచి వారిపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్కల్యాణ్ విషయం చిమ్ముతున్నారు. వీరిని పింఛన్ల పంపిణీకి దూరం చేయడంపై అంతటా ఆగ్రహం వ్యక్తమవుతోంది. 43–44 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో సచివాలయాలకు వెళ్లి వృద్ధులు, దివ్యాంగులు పింఛన్ ఎలా తీసుకుంటారనే ప్రశ్న ఉదయిస్తోంది. ఎన్నికల ముందే పింఛన్దారులకు ఇన్ని కష్టాలు తెచ్చిపెడితే... పొరపాటున టీడీపీ ప్రభుత్వం వస్తే మన పరిస్థితి ఏమిటి చాలా మంది ప్రశి్నస్తున్నారు. కరోనా సమయంలో స్వచ్ఛంద సేవలు.. రెండేళ్ల పాటు కరోనా రక్కసి జిల్లాను ఉక్కిరిబిక్కిరి చేసింది. లాక్డౌన్, కర్ఫ్యూతో కరోనా సమయంలో పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. అంతటి తీవ్రమైన పరిస్థితుల్లో వలంటీర్లు స్వచ్ఛంద సేవలు అందించారు. కోవిడ్ టెస్ట్లు చేయించడం, పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్లకు తరలించడం, నెగిటివ్ వచ్చిన వారిని ఇళ్లలోనే ఉంచడం చేశారు. కరోనా సమయంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం ఇచ్చిన రూ.వెయ్యి ఆర్థిక సాయాన్ని అందించారు. సరుకులు, రైస్, మాస్్కలు కూడా పంపిణీ చేశారు. ఇంటింటికి తిరిగి అనుమానాస్పదులను గుర్తించి కోవిడ్ పరీక్షలు నిర్వహించడంలో ప్రధాన భూమిక పోషించారు. వలంటీర్ల నిస్వార్థ సేవ కార్యక్రమాలతో కరోనా నుంచి గట్టెక్కామనే అభిప్రాయం ఎవరూ కాదనలేని నిజం. అవినీతికి తావులేకుండా పథకాల అమలు టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు ప్రజల రక్తమాంసాలను పీల్చి వేశాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెచ్చిన వలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఎక్కడా అవినీతి, అక్రమాలకు తావు లేకుండా, రాజకీయాలు, కులమతాలకు అతీతంగా వలంటీర్లు సంక్షేమ పథకాలు అమలు చేశారు. పథకాల కోసం ప్రజలు సచివాలయాల చుట్టూ తిరుగలేదు. మండల స్థాయి కార్యాలయాలకు వెళ్లలేదు.. కానీ అర్హత కలిగిన వారందరికీ పథకాలు అమలయ్యాయి. ఇందుకు వలంటీర్లే కారణం. వలంటీర్ వ్యవస్థతో అన్ని వర్గాల ప్రజలకు మంచి జరుగుతుండటం, తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుండటం చంద్రబాబు, అతని అనుయాయులు తట్టుకోలేక ఎన్నికల సమయంలో వారి సేవలను ప్రజలకు దూరం చేశారు. ఉసురు తగులుతుంది ‘మంచి చేయరు... మంచి చేసే వారిని సహించరు.. మీ హయాంలో అంతంతమాత్రం చెల్లించే పింఛన్ పొందడం కోసం ఎన్నో కష్టాలు పడ్డాం.. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తర్వాత పింఛన్ కష్టాలను మరచిపోయాం. మళ్లీ మీ కారణంగా కష్టాలు చుట్టుముడుతున్నాయి’ అని పింఛన్దారులు వాపోతున్నారు. తమ ఉసురు తగులుతుందని వృద్ధులు, దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఉన్న బాలిక పేరు గీత. మానసిక స్థితి సరిగా లేని దివ్యాంగురాలు. కౌతాళానికి చెందిన బాలికకు తండ్రి ఈరన్న సపర్యలు చేస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ ఈ బాలికకు వలంటీర్ వచ్చి పింఛన్ ఇచ్చేవారు. ఈ డబ్బుతో ఈరన్న మందులు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం పింఛన్ కోసం సచివాలయాల వద్దకు వెళ్లాలని చెప్పడంతో ఈరన్న ఆవేదన వ్యక్తం చేసున్నాడు. తన కుమార్తె నడవలేదని, ఎత్తుకుపోవాలని, అక్కడ పింఛన్ తీసుకోవడానికి ఎన్నికష్టాలు పడాలో అని ఆందోళన చెందుతున్నాడు. –కౌతాళం కుమార్తెను పట్టుకుని నడిపిస్తున్న ఈమె పేరు లక్ష్మి. కోసిగి కడపాళెం వీధిలో నివాసం ఉంటున్నారు. ఈమె కుమార్తె రామచంద్రమ్మకు కళ్లు కనిపించవు. మాటలు రావు, కూర్చోలేదు, నడవలేదు. ఎప్పుడూ మంచానికే పరిమితమై ఉంటుంది. పట్టుకుని నడిపిస్తే అయిదు అడుగులు వేస్తోంది. అంతలో ఏడ్చేస్తుంది. నరాలు బలహీనంగా ఉండడంతో బయోమెట్రిక్ ద్వారా పింఛన్ తీసుకోవడానికి చేతి వేళ్లు పడవు. ఈ దివ్యాంగురాలికి ఆర్బీఎస్ ద్వారా ప్రతి నెలా వలంటీర్ ఇంటికి వెళ్లి రూ.3వేలు పింఛన్ అందజేస్తున్నారు. ఈ నెల పింఛన్ ఎలా తీసుకోవాలని తల్లి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేన్తున్నారు. – కోసిగిభయపడుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన వలంటీరు వ్యవస్థను చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎన్నికల సమయంలో మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వలంటీరుగా ఎప్పటిలాగే ప్రజలకు సేవలు అందిస్తాం. – అనిల్, చెరుకులపాడు స్వచ్ఛందంగా సేవలు అందించాం ప్రభుత్వం మాకు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కలి్పంచింది. మాకు కేటాయించిన కుటుంబాలకు స్వచ్ఛందంగా సేవలు అదించాం. ప్రభుత్వ పథకాలను అందించి అవసరమైన సేవలను చేశాం. ఎన్నికల సమయంలో మమ్మల్ని దూరం పెట్టాలని చూస్తున్నారు. అందుకే మేమే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాం. – ప్రేమ్కుమార్, చెరుకులపాడు రాజీనామాతో బుద్ధి చెబుతాం మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారికి మా రాజీనామాలతో బుద్ధి చెబుతాం. ఐదేళ్లు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కలి్పంచిన ముఖ్యమంత్రి జగనన్నకు రుణపడి ఉంటాం. ప్రజలకు సేవలు అందించడంలో చాలా తృప్తిని పొందాం. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశంతో మనో ధైర్యం పెరిగింది. – వీరయ్య ఆచారి, కొసనాపల్లి బాధ కలిగించింది నాలుగున్నరేళ్ల పాటు నిస్వార్థంగా సేవలు అందించాం. ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు చేశాం. రాజకీయాలు, కులమతాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను లబి్ధదారులకు అందించాం. మాపై టీడీపీ, జనసేన నేతలు ఎప్పుడూ విషం చిమ్ముతూనే ఉన్నారు. ఎన్నో అభాండాలు వేశారు. చివరికి సంక్షేమ పథకాల అమలుకు దూరం చేయడం బాధ కలిగించింది. వలంటీర్ల సేవలను గుర్తించకుండా బురద చల్లడం దారుణం.– విజయ్ రాజ్కుమార్, లక్ష్మీనగర్, కర్నూలు -
సేవలు తొలగి.. వేదన మిగిలి!
మంచానికే పరిమితమైన ఈ వృద్ధురాలి పేరు కురువ లింగమ్మ. పెద్దకడబూరు మండలం మేకడోణ గ్రామానికి చెందిన ఈమె కుమారుడి వద్ద ఉంటోంది. వ్యవసాయ పనులు చేసుకునే కుమారుడు.. పింఛన్ డబ్బులతో ఈమెకు వైద్యం చేయిస్తున్నాడు. ప్రతి నెలా ఒకటో తేదీన వలంటీర్ వచ్చి పింఛన్ ఇస్తుండటంతో తమకు ఎలాంటి కష్టాలు ఉండేవి కాదని చెబుతున్నాడు. ప్రస్తుతం సచివాలయానికి వెళ్లాలంటే పనులు మానుకోవాలని, అక్కడ పింఛన్ తీసుకోవడానికి ఎన్ని రోజులు తిరగాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చంద్రబాబుకు ముసలోళ్ల ఉసురు తప్పదని కన్నీటి పర్యంతమయ్యాడు. కర్నూలు(అగ్రికల్చర్): పింఛన్ల పంపిణీ, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలులో గ్రామ, వార్డు వలంటీర్లను దూరం చేయడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. పింఛన్ల పంపిణీలో వలంటీర్లను పక్కన పెట్టడం... సచివాలయాలకే వెళ్లి పింఛన్ పొందాల్సి రావడంతో అవ్వాతాతలు, దివ్యాంగులను తీవ్ర వేదనకు గురి చేస్తోంది. మళ్లీ టీడీపీ హయాంలో పరిస్థితులే ఉత్పన్నం అవుతుండాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 20 వేల మందికిపైగా వలంటీర్లు ఉన్నారు. మొదటి నుంచి వారిపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్కల్యాణ్ విషయం చిమ్ముతున్నారు. వీరిని పింఛన్ల పంపిణీకి దూరం చేయడంపై అంతటా ఆగ్రహం వ్యక్తమవుతోంది. 43–44 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో సచివాలయాలకు వెళ్లి వృద్ధులు, దివ్యాంగులు పింఛన్ ఎలా తీసుకుంటారనే ప్రశ్న ఉదయిస్తోంది. ఎన్నికల ముందే పింఛన్దారులకు ఇన్ని కష్టాలు తెచ్చిపెడితే... పొరపాటున టీడీపీ ప్రభుత్వం వస్తే మన పరిస్థితి ఏమిటి చాలా మంది ప్రశి్నస్తున్నారు. కరోనా సమయంలో స్వచ్ఛంద సేవలు.. రెండేళ్ల పాటు కరోనా రక్కసి జిల్లాను ఉక్కిరిబిక్కిరి చేసింది. లాక్డౌన్, కర్ఫ్యూతో కరోనా సమయంలో పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. అంతటి తీవ్రమైన పరిస్థితుల్లో వలంటీర్లు స్వచ్ఛంద సేవలు అందించారు. కోవిడ్ టెస్ట్లు చేయించడం, పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్లకు తరలించడం, నెగిటివ్ వచ్చిన వారిని ఇళ్లలోనే ఉంచడం చేశారు. కరోనా సమయంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం ఇచ్చిన రూ.వెయ్యి ఆర్థిక సాయాన్ని అందించారు. సరుకులు, రైస్, మాస్్కలు కూడా పంపిణీ చేశారు. ఇంటింటికి తిరిగి అనుమానాస్పదులను గుర్తించి కోవిడ్ పరీక్షలు నిర్వహించడంలో ప్రధాన భూమిక పోషించారు. వలంటీర్ల నిస్వార్థ సేవ కార్యక్రమాలతో కరోనా నుంచి గట్టెక్కామనే అభిప్రాయం ఎవరూ కాదనలేని నిజం. అవినీతికి తావులేకుండా పథకాల అమలు టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు ప్రజల రక్తమాంసాలను పీల్చి వేశాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెచ్చిన వలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఎక్కడా అవినీతి, అక్రమాలకు తావు లేకుండా, రాజకీయాలు, కులమతాలకు అతీతంగా వలంటీర్లు సంక్షేమ పథకాలు అమలు చేశారు. పథకాల కోసం ప్రజలు సచివాలయాల చుట్టూ తిరుగలేదు. మండల స్థాయి కార్యాలయాలకు వెళ్లలేదు.. కానీ అర్హత కలిగిన వారందరికీ పథకాలు అమలయ్యాయి. ఇందుకు వలంటీర్లే కారణం. వలంటీర్ వ్యవస్థతో అన్ని వర్గాల ప్రజలకు మంచి జరుగుతుండటం, తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుండటం చంద్రబాబు, అతని అనుయాయులు తట్టుకోలేక ఎన్నికల సమయంలో వారి సేవలను ప్రజలకు దూరం చేశారు. ఉసురు తగులుతుంది ‘మంచి చేయరు... మంచి చేసే వారిని సహించరు.. మీ హయాంలో అంతంతమాత్రం చెల్లించే పింఛన్ పొందడం కోసం ఎన్నో కష్టాలు పడ్డాం.. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తర్వాత పింఛన్ కష్టాలను మరచిపోయాం. మళ్లీ మీ కారణంగా కష్టాలు చుట్టుముడుతున్నాయి’ అని పింఛన్దారులు వాపోతున్నారు. తమ ఉసురు తగులుతుందని వృద్ధులు, దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఉన్న బాలిక పేరు గీత. మానసిక స్థితి సరిగా లేని దివ్యాంగురాలు. కౌతాళానికి చెందిన బాలికకు తండ్రి ఈరన్న సపర్యలు చేస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ ఈ బాలికకు వలంటీర్ వచ్చి పింఛన్ ఇచ్చేవారు. ఈ డబ్బుతో ఈరన్న మందులు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం పింఛన్ కోసం సచివాలయాల వద్దకు వెళ్లాలని చెప్పడంతో ఈరన్న ఆవేదన వ్యక్తం చేసున్నాడు. తన కుమార్తె నడవలేదని, ఎత్తుకుపోవాలని, అక్కడ పింఛన్ తీసుకోవడానికి ఎన్నికష్టాలు పడాలో అని ఆందోళన చెందుతున్నాడు. –కౌతాళం కుమార్తెను పట్టుకుని నడిపిస్తున్న ఈమె పేరు లక్ష్మి. కోసిగి కడపాళెం వీధిలో నివాసం ఉంటున్నారు. ఈమె కుమార్తె రామచంద్రమ్మకు కళ్లు కనిపించవు. మాటలు రావు, కూర్చోలేదు, నడవలేదు. ఎప్పుడూ మంచానికే పరిమితమై ఉంటుంది. పట్టుకుని నడిపిస్తే అయిదు అడుగులు వేస్తోంది. అంతలో ఏడ్చేస్తుంది. నరాలు బలహీనంగా ఉండడంతో బయోమెట్రిక్ ద్వారా పింఛన్ తీసుకోవడానికి చేతి వేళ్లు పడవు. ఈ దివ్యాంగురాలికి ఆర్బీఎస్ ద్వారా ప్రతి నెలా వలంటీర్ ఇంటికి వెళ్లి రూ.3వేలు పింఛన్ అందజేస్తున్నారు. ఈ నెల పింఛన్ ఎలా తీసుకోవాలని తల్లి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేన్తున్నారు. – కోసిగి భయపడుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన వలంటీరు వ్యవస్థను చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎన్నికల సమయంలో మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వలంటీరుగా ఎప్పటిలాగే ప్రజలకు సేవలు అందిస్తాం. – అనిల్, చెరుకులపాడు స్వచ్ఛందంగా సేవలు అందించాం ప్రభుత్వం మాకు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కలి్పంచింది. మాకు కేటాయించిన కుటుంబాలకు స్వచ్ఛందంగా సేవలు అదించాం. ప్రభుత్వ పథకాలను అందించి అవసరమైన సేవలను చేశాం. ఎన్నికల సమయంలో మమ్మల్ని దూరం పెట్టాలని చూస్తున్నారు. అందుకే మేమే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాం. – ప్రేమ్కుమార్, చెరుకులపాడు రాజీనామాతో బుద్ధి చెబుతాం మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారికి మా రాజీనామాలతో బుద్ధి చెబుతాం. ఐదేళ్లు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కలి్పంచిన ముఖ్యమంత్రి జగనన్నకు రుణపడి ఉంటాం. ప్రజలకు సేవలు అందించడంలో చాలా తృప్తిని పొందాం. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశంతో మనో ధైర్యం పెరిగింది. – వీరయ్య ఆచారి, కొసనాపల్లి బాధ కలిగించింది నాలుగున్నరేళ్ల పాటు నిస్వార్థంగా సేవలు అందించాం. ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు చేశాం. రాజకీయాలు, కులమతాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను లబి్ధదారులకు అందించాం. మాపై టీడీపీ, జనసేన నేతలు ఎప్పుడూ విషం చిమ్ముతూనే ఉన్నారు. ఎన్నో అభాండాలు వేశారు. చివరికి సంక్షేమ పథకాల అమలుకు దూరం చేయడం బాధ కలిగించింది. వలంటీర్ల సేవలను గుర్తించకుండా బురద చల్లడం దారుణం. – విజయ్ రాజ్కుమార్, లక్ష్మీనగర్, కర్నూలు -
ఓటుతోనే ప్రజల తలరాత మారుతుందన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రాష్ట్రంలో మార్పును కొనసాగించేందుకు ఓటు వేయాలని పిలుపు.. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి, రాతనలో ప్రజలతో ముఖాముఖి...ఇంకా ఇతర అప్డేట్స్
-
కదం తొక్కిన స్టార్ క్యాంపెయినర్లు
4 వ రోజు స్టార్ క్యాంపెయినర్లతోసీఎం వైఎస్ జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా నాలుగో రోజైన శనివారం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటించిన సీఎం వైఎస్ జగన్ పలు ఫొటోలను ట్వీట్ చేశారు. ‘నాలుగో రోజు మేమంతా సిద్ధం యాత్రలో నా స్టార్ క్యాంపెయినర్లతో..’ అంటూ పేదలతో మమేకమైన ఫొటోలను ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఈ ఫొటోలు అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. – సాక్షి, అమరావతి (మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డనైన నాకు అండగా నిలవండి. మీరే నా స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు రావాలి. జరిగిన మంచిని ఇంటింటా వివరించాలి’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపునకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. గత ఐదేళ్ల పాలనలో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన ప్రజలందరూ స్టార్ క్యాంపెయినర్లుగా మారి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో కదం తొక్కుతున్నారు. నాలుగో రోజు శనివారం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొనసాగిన బస్సు యాత్రలోని సన్నివేశాలే ఇందుకు నిదర్శనం. యాత్రలో ఆద్యంతం ప్రజల నుంచి ఘన స్వాగతం లభించడంతో పాటు, మండుటెండను సైతం లెక్క చేయకుండా ముసలిముతక, మహిళలు, యువత.. ఇలా అన్ని వర్గాల వారు బ్రహ్మరథం పట్టారు. శనివారం ఉదయం కర్నూలు జిల్లా రాతన వద్ద బస శిబిరంలో పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం, కళ్యాణదుర్గం, కర్నూలు జిల్లా ముఖ్యనేతలు సీఎం జగన్ను కలిశారు. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు. అనంతరం 10.30 గంటల ప్రాంతంలో శిబిరం నుంచి యాత్రను ప్రారంభించారు. రాతన గ్రామంలో భారీ గజమాలతో, ఆనందోత్సాహాలతో సీఎంకు స్వాగతం పలికారు. ఊరంతా∙రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున బారులు తీరి వైఎసార్సీపీ ప్రభుత్వానికి తమ మద్దతు తెలియజేశారు. అనంతరం ఇదే జిల్లా తుగ్గలికి చేరుకున్న సీఎం జగన్ గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. గ్రామంలో గడిచిన ఐదేళ్లలో అన్ని వర్గాల వారికి ప్రభుత్వం చేసిన మంచిని సీఎం వివరించారు. అనంతరం పలువురు గ్రామస్తులతో మాట్లాడారు. జాతీయ రహదారి పొడవునా జనమే జనం గుత్తి పట్టణంలో రోడ్షో తర్వాత బెంగళూరు జాతీయ రహదారి(ఎన్హెచ్44)పై మిడుతూరు, పామిడి, కల్లూరు, గార్లదిన్నె మీదుగా సీఎం అనంతపురం చేరుకున్నారు. గుత్తి నుంచి అనంతపురం వరకూ జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న గుత్తి, పామిడి, గార్లదిన్నె, రాప్తాడు మండలాల గ్రామాల్లోని ప్రజలు రోడ్డు మీదకు చేరుకున్నారు. దీంతో ప్రతి పాయింట్ వద్ద సీఎం జగన్ బస్సు ఆపి ప్రజలకు అభివాదం చేశారు. పామిడిలో వేల మంది జనం జాతీయ రహదారి మీదకు చేరుకుని సీఎం జగన్కు తమ మద్దతు తెలియజేశారు. శింగనమల నియోజకవర్గ ప్రజలు కల్లూరులో సీఎం జగన్కు ఘన స్వాగతం పలికారు. అనంతపురం పట్టణంలోని రాజీవ్కాలనీ, తపోవనం ప్రజలు, నాయకులు అతిపెద్ద గజమాలలతో సీఎం జగన్కు ఘన స్వాగతం పలికారు. షెడ్యూల్ ప్రకారం రాత్రి 7 గంటలకు అనంతపురం చేరుకోవాల్సి ఉండగా 9 గంటలు దాటాక చేరుకున్నారు. ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున జనాలు కదిలి వచ్చి రోడ్లపై బారులు తీరడంతో ఉదయం నుంచే నిర్దేశించిన షెడ్యూల్ కంటే చాలా ఆలస్యంగా యాత్ర కొనసాగింది. అయినపటగ్పటికీ ప్రజలు ఏ మాత్రం విసిగి పోకుండా అభిమాన నేతను కలవడానికి ఓపికతో వేచిచూశారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అవినీతికి తావులేకుండా సంక్షేమ ఫలాలను తమ దరిచేర్చడంతో పాటు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, వైఎస్సార్ పెన్షన్ కానుక వంటి వివిధ విప్లవాత్మక పథకాలను అమలు చేస్తూ తమకు అండగా నిలిచిన సీఎం జగన్ను చూసి ప్రజలు ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. అనంతపురంలో రోడ్షో అనంతరం రాప్తాడు, ఎస్కేయూ మీదుగా శ్రీసత్యసాయి జిల్లా సంజీవపురం వరకు యాత్ర చేరుకుంది. రాత్రి 10.30 గంటలకు రాప్తాడు చేరుకుంది. అప్పటికే రోడ్డుపై ఉన్న వేల మంది జనాలు జై జగన్ నినాదాలతో సీఎంపై అభిమానాన్ని చాటుకున్నారు. కర్నూలు జిల్లాలోని పత్తికొండ, అనంతపురం జిల్లా గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, అనంతపురం, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగింది. నాలుగోరోజుబస్సు యాత్రకు అపూర్వ స్పందన కర్నూలు (సెంట్రల్)/తుగ్గలి: ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు అభిమానం పోటెత్తింది. పల్లె పల్లెలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మహిళలు, వృద్ధులు, యువతీ యువకులు, ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకుల నుంచి అపూర్వ స్పందన లభించింది. అడుగడుగునా పూల స్వాగతంతో అభిమానం చాటుకున్నారు. భారీ క్రేన్లతో గజమాలలు వేసి ఉప్పొంగిపోయారు. నాలుగో రోజు బస్సు యాత్ర పత్తికొండ నుంచి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. ఉదయం 10.32 గంటలకు సీఎం వైఎస్ జగన్ రాత్రి బస చేసిన శిబిరం నుంచి యాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం 2.25 గంటలకు అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లె పొలిమేర్లలోకి చేరుకోవడంతో కర్నూలు జిల్లాలో యాత్ర ముగిసింది. తుగ్గలిలో ఏర్పాటు చేసిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ ప్రజల సమస్యలు విన్నారు. సలహాలు స్వీకరించారు. బస్సు యాత్ర సాగిందిలా.. ♦ ఉదయం 10 గంటలకు అనంతపురం జిల్లా కల్యాణదుర్గం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఉమా మహేశ్వర నాయుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పితాని బాలకృష్ణ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సానబోయిన మల్లికార్జున్తోపాటు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి సీఎం వైఎస్ జగన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ♦ ఉదయం 10.32 గంటలకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర నాలుగో రోజు పత్తికొండలో ప్రారంభం. ♦ 10.50 గంటలకు రాతనలో అపూర్వ స్పందన. భారీ క్రేన్ ద్వారా సీఎంకు గజమాల వేసి పూల బాట పరిచారు. ♦ 11.20 గంటలకు మాజీ ఎమ్మెల్యే, దివంగత తమ్మారెడ్డి కుటుంబాన్ని సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. తమ్మారెడ్డి పెద్ద కుమారుడు ప్రతాపరెడ్డి, సోదరుని కుమారుడు ప్రహ్లాదరెడ్డి చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. ఇటీవల కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకున్న తమ్మారెడ్డి చిన్న కుమారుడు శ్రీనివాసరెడ్డి, కోడళ్లు రంగమ్మ, విజయలక్ష్మి, అరుణమ్మలను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులు రమణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, మోహన్రెడ్డి, చంద్రశేఖరరెడ్డితో మాట్లాడారు. ♦ 11.46 గంటలకు తుగ్గలి సమీపంలో ప్రజలతో ముఖాముఖి. ♦ మధ్యాహ్నం 1.29 గంటలకు గిరిగెట్లలో ప్రజల ఘన స్వాగతం. ♦ 1.49 గంటలకు జొన్నగిరిలో పూల వర్షం. తమ గ్రామ సమీపంలోని చెరువును హెచ్ఎన్ఎస్ఎస్ నీటితో నింపాలని విన్నపం. ♦ 2 గంటలకు ఎర్రగుడిలో సీఎం జగన్ కాన్వాయ్పై పూల వర్షం. ♦ 2.25 గంటలకు అనంతపురం జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశం. ♦ రాత్రి 11 గంటలకు బస శిబిరానికి చేరుకున్న సీఎం జగన్ గుత్తిలో జన సునామీ తుగ్గలిలో ముఖాముఖి అనంతరం తిరిగి బస్సు యాత్ర ప్రారంభమై జొన్నగిరి, ఎర్రగుడి మీదుగా అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. మిట్ట మధ్యాహ్నం భానుడి ప్రతాపాన్ని ఏ మాత్రం లెక్క చేయకుండా రోడ్లపై బారులు తీరి తమ అభిమాన నాయకుడికి ప్రజలు సంఘీభావం తెలిపారు. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోకి ప్రవేశించిన యాత్ర బసినేపల్లి, గుత్తి ఆర్ఎస్ల మీదుగా గుత్తి పట్టణానికి చేరుకుంది. బసినేపల్లి నుంచి గుత్తి పట్టణం వరకూ ఇసుకేస్తే రాలనంతగా జనం యాత్రలో మమేకం అయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే శనివారం సాయంత్రం గుత్తి పట్టణం జన సునామీని తలపించింది. అశేషమైన జనం కదలి రావడంతో సీఎం జగన్ రోడ్ షో కాన్వాయ్ ముందుకు చాలా నెమ్మదిగా కదిలింది. గుత్తి రైల్వే బ్రిడ్జ్ నుంచి ఎన్హెచ్ 44 మధ్య 7 కి.మీ దూరం రెండు గంటలకు పైగానే రోడ్షో కొనసాగింది. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ ముందుకు సాగారు. -
టీడీపీ అధినేత చంద్రబాబు మోసాలను తిప్పికొట్టడానికి రాష్ట్ర ప్రజలే స్టార్ క్యాంపెయినర్లుగా పని చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు... ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం బహిరంగ సభలో ప్రసంగం...ఇంకా ఇతర అప్డేట్స్
-
లక్షల గళాల గర్జన
మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : పెత్తందార్లపై పోరుకు తామంతా సిద్ధమంటూ ఎమ్మిగనూరు వేదికగా లక్షలాది గొంతుకలు సింహగర్జన చేశాయి. పొత్తులు.. జిత్తులు.. మోసాలు.. కుట్రలను ఎదుర్కొని పేదల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు నేను సిద్ధం.. మీరంతా సిద్ధమా? అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుఇవ్వడంతో లక్షల మంది పిడికిళ్లు బిగించి మేమంతా సిద్ధమంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. చంద్రబాబు లాంటి మోసగాళ్ల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి నేను సిద్ధం... మీరంతా సిద్ధమైతే సెల్ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేయాలని సీఎం జగన్ కోరడంతో ఒక్కసారిగా లక్షల మంది సెల్ఫోన్లలో టార్చ్ లైట్ వెలిగించడంతో సభా ప్రాంగణం ఆకాశంలో చుక్కలను తలపించింది. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీ గ్రౌండ్లో నిర్వహించిన సభలో కనిపించిన దృశ్యాలివీ.. సార్వత్రిక ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీ సునామీ సృష్టించడం ఖాయమని ఎమ్మిగనూరు సభ మరోసారి చాటిచెప్పిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో బలంగా నాటుకుపోయిన విశ్వాసానికి ఇది ప్రతీకగా నిలిచిందని అభివర్ణిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర మూడో రోజుకు చేరుకుంది. కర్నూలు జిల్లాలో బస్సుయాత్ర జైత్రయాత్రను తలపించింది. గురువారం పెంచికలపాడు వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో సీఎం జగన్ రాత్రి బస చేశారు. శుక్రవారం ఉదయం కర్నూలు సిటీ, పాణ్యం, కోడుమూరు సహా పలు నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్సీపీ నేతలు సీఎం వైఎస్ జగన్ను కలిశారు. ఎన్నికల్లో విజయానికి చేపట్టాల్సిన చర్యలపై వారికి సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఉదయం 10.30 గంటలకు బస్సు యాత్రను ప్రారంభించి రామచంద్రాపురం మీదుగా కోడుమూరుకు చేరుకున్న సీఎం జగన్కు భారీ గజమాలతో అభిమానులు ఘనస్వాగతం పలికారు. కోడుమూరులో సీఎం జగన్ రోడ్ షోకు జనం బ్రహ్మరథం పట్టారు. రోడ్ షో సాగుతున్నంత దూరం బస్సు ముందు చిన్నారులు కోలాటమాడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా వేలాది మంది బారులుతీరి సీఎం జగన్పై బంతి పూలవర్షం కురిపించారు. చేనేత కార్మికులు చీరను, మగ్గాన్ని బహూకరించి సీఎం జగన్కు మద్దతు పలికారు. బుడగ జంగం సామాజికవర్గ ప్రజలు సీఎం జగన్ను కలిసిసంఘీభావం తెలిపారు. కురుబ సామాజికవర్గానికి చెందినవారు సీఎం జగన్కు మేకను బహూకరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కోడుమూరు నుంచి హంద్రీ కైరవాడి చేరుకునే సమయానికి ఎండ తీవ్రత పెరిగింది. ఎండను లెక్క చేయకుండా అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, చిన్నారులు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి సీఎం జగన్పై పూలవర్షం కురిపిస్తూ వైఎస్సార్సీపీని గెలిపించేందుకు మేమంతా సిద్ధమంటూ... నినదించారు. గోనెగండ్లలోనూ సీఎం జగన్ బస్సు యాత్రకు జనం నీరాజనాలు పలికారు. అనంతరం సీఎం జగన్ భోజన విరామం తీసుకున్నారు. ఎమ్మిగనూరులో జన సునామీ.. భోజన విరామం అనంతరం రాళ్లదొడ్డి నుంచి బయలుదేరిన సీఎం జగన్ బస్సు యాత్రకు ఎర్రకోటలో జనం బ్రహ్మరథం పట్టారు. సీఎం జగన్ బస్సుపై బంతిపూలవర్షం కురిపించారు. షెడ్యూలు ప్రకారం బస్సు యాత్ర ఎమ్మిగనూరుకు మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకోవాల్సి ఉండగా, ప్రజలు అడుగడుగునా నీరాజనాలుపలకడంతో రెండుగంటలు ఆలస్యంగా 5.30 గంటలకు చేరుకుంది. సీఎం జగన్ ఎమ్మిగనూరుకు చేరుకునేసరికి కర్నూలు జిల్లా నలుమూల నుంచి లక్షల సంఖ్యలో జనవాహిని తరలిరావడంతో జనసంద్రాన్ని తలపించింది. ఉదయం 11 గంటల నుంచి ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి మొదలైన జనప్రవాహం సాయంత్రం 4.30 గంటలకు సునామీని తలపించింది. 30 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. పక్కనే పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పార్కు, ఇరువైపులా రోడ్లు జనంతో కిక్కిరిసిపోయాయి. ఎమ్మిగనూరు చరిత్రలో సీఎం జగన్ సభ సువర్ణాక్షరాలతో లిఖించేలా నిలిచిపోతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. జననేత కోసం నిరీక్షణ.. ఎమ్మిగనూరు సభ రాత్రి 7.20 గంటలకు ముగిసింది. అనంతరం బస్సుయాత్ర హనుమాపురం చేరుకుంది. సీఎం జగన్ను చూసేందుకు అవ్వతాతలు, మహిళలు, చిన్నారులు భారీ ఎత్తున రోడ్డుకు ఇరువైపులా నిలబడ్డారు. సీఎం జగన్ రాగానే బంతిపూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. హనుమాపురం నుంచి ఆస్పరి చేరుకునే సరికి రాత్రి 8.30 గంటలైంది. బస్సు యాత్ర అక్కడికి చేరుకోగానే హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. జన నీరాజనాల మధ్య చిన్నహుల్తి, పత్తికొండ బైపాస్ మీదుగా రాతన వద్ద ఏర్పాటు చేసిన బస శిబిరానికి రాత్రి 9.47 గంటలకు సీఎం జగన్ చేరుకున్నారు. కర్నూలు జిల్లాలో కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ నియోజక వర్గాల్లో సాగిన బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్ అయ్యింది. బస్సు యాత్ర శనివారం నాలుగో రోజు ఉదయం కర్నూలు జిల్లా పత్తికొండ బైపాస్ నుంచి ప్రారంభమై మధ్యాహ్నం అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఉప్పొంగిన భావోద్వేగం ఐదేళ్ల పాలనలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేయడంతోపాటు విద్య, వైద్యం, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో సంస్కరణలు తెచ్చి పేదరికాన్ని రూపుమాపడం, రాష్ట్రం రూపురేఖలు మార్చేందుకు చేపట్టిన చర్యలను వివరిస్తూ సీఎం జగన్ ప్రసంగించారు. 2014 ఎన్నికల్లో ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్, తన ఫొటోతోపాటు సంతకం చేసిన లేఖను ఇంటింటికీ పంపిన చంద్రబాబు రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు డిపాజిట్ చేస్తానని, ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేలు నిరుద్యోభృతిగా ఇస్తానని, చేనేత, పవర్లూమ్స్ రుణాలు మాఫీ చేస్తానని, అర్హులందరికీ మూడు సెంట్ల భూమి ఇచ్చి పక్కా ఇళ్లు కట్టిస్తాననే ముఖ్యమైన హామీలతోపాటు 650 హామీలిచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చకుండా వంచించటాన్ని ప్రస్తావించినప్పుడు లక్షల మంది ప్రజలు ఔనంటూ.. చేతులు ఎత్తి ఏకీభవించారు. ఇప్పుడు మళ్లీ అదే పొత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలతో సూపర్ సిక్స్ అంటూ మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు వస్తున్నారని, వాటిని ఎదుర్కొని పేదల భవిష్యత్తును మరింతగా గొప్ప మార్చేందుకు వైఎస్సార్సీపీని గెలిపిచేందుకు సిద్ధమా? అంటూ సీఎం జగన్ ఇచ్చిన పిలుపుతో మేమంతా సిద్ధమే.. అంటూ లక్షల గొంతుకలు ప్రతిస్పందించాయి. శింగనమలలో ఎస్సీ (మాదిగ) సామాజికవర్గానికి చెందిన టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులకు వైఎస్సార్సీపీ టికెట్ ఇస్తే చంద్రబాబు ఎద్దేవా చేసి తన పెత్తందారీ పోకడలను రుజువు చేసుకున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. పేదవాడు పైకి ఎదిగితే ఎందుకంత మంట? అని నిలదీశారు. మడకశిరలో ఈర లక్కప్ప అనే ఉపాధి కూలీకి టికెట్ ఇచ్చామని, దాన్ని కూడా ఎద్దేవా చేస్తావా బాబూ? అని ప్రశ్నించారు. ‘‘నా...’’ అంటూ అక్కున చేర్చుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 200 శాసనసభ, లోక్సభ స్థానాల్లో వంద సీట్లు ఇచ్చామని గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ పేదల పార్టీ కాబట్టే సగం సీట్లు ఇచ్చామన్నారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని అవహేళన చేయడంతోపాటు తోకలు కత్తిరిస్తానంటూ బీసీల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి, మైనార్టీలను అణగదొక్కిన చంద్రబాబు తోకను కత్తిరించేలా తీర్పు ఇవ్వాలని సీఎం జగన్ పిలుపునిచ్చి నప్పుడు మేమంతా సిద్ధమే అంటూ లక్షల గొంతుకలు నినదించాయి. -
పల్లెల్లో అపూర్వ ఆదరణ
కర్నూలు (సెంట్రల్): మేమంతా సిద్ధం బస్సు యాత్రకు కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో అపూర్వ ఆదరణ లభించింది. సీఎం జగన్ రాక కోసం ఉదయం నుంచి రాత్రి వరకు పల్లెలు ఎదురు చూశాయి. మూడో రోజు బస్సు యాత్ర కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో దాదాపు 108 కిలోమీటర్ల మేర సాగింది. శుక్రవారం ఉదయం 10.35 గంటలకు కోడుమూరు నియోజకవర్గం గూడూరు మండలం పెంచికలపాడులో రాత్రి బస చేసిన శిబిరం నుంచి ప్రారంభమైన బస్సుయాత్ర పత్తికొండ మండలం రాతన వరకు కొనసాగింది. మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర పూర్తిగా రాత్రి వేళ సాగినా ప్రజలు వైఎస్ జగన్ రాక కోసం నిరీక్షించారు. తమ అభిమాన నేతను చూసేందుకు పెద్దల నుంచిపిల్లల వరకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మూడో రోజు యాత్ర సైడ్లైట్స్ ♦ ఉదయం 9.30 గంటలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్, ఎమ్మెల్యేలు హఫీజ్ఖాన్, డాక్టర్ జె.సుధాకర్, కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మణిగాంధీ, ఎస్వీ మోహన్రెడ్డి సీఎం వైఎస్ జగన్ను పెంచికలపాడు శిబిరంలో కలిశారు. ♦ 10.35 గంటలకు పెంచికలపాడులోని రాత్రి బస శిబిరం నుంచి సీఎం వైఎస్ జగన్ బయటకు వచ్చి బస్సు ఎక్కారు. అక్కడ భారీగా వేచి ఉన్న ప్రజలకు అభివాదం చేశారు. ♦ 11.35 గంటలకు సీఎం జగన్ కోడుమూరు పట్టణానికి చేరుకున్నారు. అక్కడ వేలాది మంది ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు షోలో ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం ముందుకు సాగారు. ♦ 11.38 గంటలకు సీఎంకు కోడుమూరులో చేనేతలు మగ్గం, నేసిన చీరను బహూకరించారు. గొర్రెల పెంపకందారులు గొర్రె పిల్లలను అందించి తమ అభిమానం చాటుకున్నారు. ♦ 11.45 గంటలకు కోడుమూరులో బుడగ జంగాలు తమకు ఎస్సీ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరగా, వచ్చే ప్రభుత్వంలో ప్రాధాన్యతగా తీసుకుంటామని సీఎ జగన్ హామీ ఇచ్చారు. ♦ 12.20 గంటలకు కోడుమూరు మండలం వర్కూరుకు బస్సు యాత్ర చేరుకుంది. ♦మధ్యాహ్నం 1.15 గంటలకు సీఎం బస్సుయాత్ర ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగొండ్ల మండలం వేముగోడుకు చేరుకోగా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుకా ఘన స్వాగతం పలికారు. ♦ 1.59 గంటలకు సీఎం జగన్ బస్సు యాత్ర గోనెగండ్ల చేరుకోగా, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. కాన్వాయ్పై పూల వర్షం కురిపించారు. ♦ 2.30 గంటలకు సీఎం జగన్ భోజన విరామం కోసం గోనెగండ్ల మండలం రాళ్లదొడ్డిలో ఏర్పాటు చేసిన శిబిరానికి చేరుకున్నారు. ♦ సాయంత్రం 4 గంటలకు గోనెగండ్ల మండల మాజీ ఎంపీపీ కేవీ కృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరగా, ఆయనకు సీఎం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ♦ భోజన విరామం అనంతరం సాయంత్రం 4.30గంటలకు బస్సు యాత్ర ప్రారంభమైంది. ♦ సాయంత్రం 5.45 గంటలకు ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం జగన్ చేరుకున్నారు. ♦ రాత్రి 7.14 గంటలకు బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు మండలంలోని హనుమాపురం గ్రామానికి సీఎం జగన్ చేరుకోగా ప్రజలు ఘన స్వాగతం పలికారు. ♦ 7.25 గంటలకు ఎమ్మిగనూరు మండలం అరెకల్కు, అక్కడి నుంచి 8.15 గంటలకు ఆదోని క్రాస్ చేరుకున్న సీఎం వైఎస్ జగన్కు ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ♦ 8.20 గంటలకు ఆదోని నియోజకవర్గం విరుపాపురం చేరుకున్నారు. ♦ 9 గంటలకు ఆలూరు నియోజవకర్గం బిణిగేరి మీదుగా ఆస్పరి చేరుకున్నారు. ♦ 9.30 గంటలకు చిన్నహుల్తి మీదుగా పత్తికొండ బైసాస్ చేరుకోగా నేతలు అపూర్వ స్వాగతం పలికారు. ♦ రాత్రి 9.47 గంటల సమయంలో పత్తికొండ మండలం రాతన సమీపంలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకున్నారు. నేడు తుగ్గలిలో ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి 4వ రోజు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో బస్సు యాత్ర సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నాలుగో రోజైన శనివారం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొనసాగనుంది. బస్సు యాత్ర నాలుగో రోజు షెడ్యూల్ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శుక్రవారం రాత్రి వెల్లడించారు. పత్తికొండలో రాత్రి బస చేసిన ప్రదేశం నుంచి సీఎం జగన్ శనివారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. రాతన మీదుగా తుగ్గలి చేరుకుని ఉదయం 10 గంటలకు గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జొన్నగిరి, గుత్తి మీదుగా ప్రయాణించి.. గుత్తి శివారులో ముఖ్యమంత్రి భోజన విరామం తీసుకుంటారు. అక్కడి నుంచి 3 గంటలకు బయలుదేరి పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్, ఆకుతోటపల్లి మీదుగా సంజీవపురం శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకుంటారు. -
కోడుమూరు Day-3 : నీతోనే జనం.. నీదేగా జయం (ఫొటోలు)
-
పేదల తలరాతలు మార్చే ఎన్నికలివి : సీఎం వైఎస్ జగన్
సాక్షి, నంద్యాల : వైఎస్సార్సీపీ 58నెలల పాలనలో గ్రామాల రూపురేఖలు సమూలంగా మారిపోయాయని, ఈ ఎన్నికలు పేదల తలరాతలను మార్చే ఎన్నికలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ‘ఇవాళ మన ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు మారాయి. సర్కారు స్కూళ్లలో డిజిటల్ బోధన వచ్చింది. విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేశాం. వైఎస్సార్ ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి గ్రామాన్ని జల్లెడ పడుతూ పేదవాడికి ఆరోగ్య పరీక్షలతోపాటు మందులు కావాలన్నా ఇంటి వద్దకే తెచ్చి ఇస్తున్నాం’ అని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలను అందజేస్తున్నామన్నారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఆళ్లగడ్డలోని రాత్రి బస ప్రాంతం నుంచి గురువారం ఉదయం మొదలైంది. అక్కడి నుంచి సీఎం జగన్ ఉదయం 11 గంటల సమయంలో ఎర్రగుంట్ల గ్రామానికి చేరుకుని రైతులు, వివిధ వర్గాల ప్రజలను కలుసుకుని మాట్లాడారు. ప్రతి అక్కచెల్లెమ్మ తమ సొంత కాళ్లమీద నిలబడేలా రుణాలు, ప్రభుత్వ పరంగా తోడ్పాటు అందిస్తున్నాం. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ దిశ యాప్ తీసుకొచ్చాం. ఆపదలో ఉన్న అక్కచెల్లెమ్మలను నిమిషాల వ్యవధిలో ఆదుకుంటున్నాం. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేశామని గొప్పలు చెప్పుకునే వారు ఏ రోజూ కనీసం ఆలోచన చేయని విధంగా మీ బిడ్డ ఈ 58 నెలల వ్యవధిలో గొప్ప మార్పులు తెచ్చాడు. వ్యవస్థల్లో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులను గమనించండి. ఈ మార్పు కొనసాగడం ఎంత అవసరమో ఆలోచన చేయండి. దేవుడి దయవల్ల ఇంత మంచి చేయగలిగాం. వ్యవస్థను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు మీరు సలహాలు ఇవ్వవచ్చు. అందరికీ ఓ విన్నపం.. ఎన్నికల కోడ్ కారణంగా పథకాలకు ఆటంకం తలెత్తకుండా ఈ మధ్య కాలంలో ఈబీసీ నేస్తం, చేయూత బటన్లు నొక్కాం. ఇది వరకు వారం రోజుల్లోనే ఖాతాల్లో డబ్బులు జమయ్యేవి. కోడ్ కారణంగా పది రోజులు అటు ఇటుగా పథకాల లబ్ధి నేరుగా మీ ఖాతాల్లోకి జమ అవుతుంది. దీని గురించి ఆందోళన చెందవద్దు. చిన్న పిల్లాడు చేసిన పనులు..మీరెందుకు చేయలేదు? నేను చాలా చిన్న పిల్లాడిని. మన ప్రభుత్వం కంటే ముందు మీరు చాలా ప్రభుత్వాలను చూశారు. నాకన్నా వయసులో పెద్దోళ్లు, ఎంతో అనుభవం ఉందని గొప్పలు చెప్పుకునే వారు ముఖ్యమంత్రులుగా పని చేశారు. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయాక నా కంటే ముందు 75 ఏళ్ల ముసలాయన పరిపాలన చేశారు. ఆయన ఏకంగా 14 ఏళ్లు పాలించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను వయసులో ఆయన కంటే చాలా చిన్నోడిని. నేను ఒకటే అడుగుతున్నా. ఇంత చిన్నోడు చేసిన పనులను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏనాడైనా చేశారా? మీరంతా దీనిపై ఆలోచన చేయాలి. ఈ రోజు ఏ రకంగా మన బతుకులు, జీవితాలు మారాయి? ఏ రకంగా వ్యవస్థల్లో మార్పులు తేగలిగాం? అనే విషయాలను అందరూ ఒక్కసారి గమనించాలని కోరుతున్నా. రైతన్నకు ప్రతి అడుగులో అండగా.. ప్రతి రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. రైతన్నల కోసమే ఆర్బీకేలు ఏర్పాటు చేశాం. ప్రతి ఎకరాను ఈ–క్రాప్ చేస్తున్నాం. ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నాం. గత పాలనలో బ్యాంకులలో పంట రుణాలు అందకుంటే ఇన్సూరెన్స్ ఎలా చేసుకోవాలో తెలియని దుస్థితి. అలాంటిది ఈ రోజు గ్రామంలోనే ఆర్బీకేలను తీసుకొచ్చి ఈ క్రాప్, ఉచిత పంటల బీమా, పంట నష్టపోతే సీజన్ ముగిసేలోపు ఇన్పుట్ సబ్సిడీ అందజేస్తున్నాం. రైతన్నకు పెట్టుబడి సాయంగా రూ.13,500 చొప్పున మీ బిడ్డ హయాంలోనే అందుతోంది. మీ కుటుంబంతో చర్చించండి.. గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారిని కూడా అడుగుతున్నా. ఓటు వేయలేదని వివక్ష చూపించలేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాల లబ్ధిని అందజేస్తున్నాం. ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. గ్రామాల్లో విలేజ్ క్లినిక్లు వచ్చాయి. విద్యార్థులకు డిజిటల్ బోధన అందిస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాం. ఒకవైపు ఇంగ్లిష్, మరోవైపు తెలుగు మీడియంతో ప్రచురించిన పుస్తకాలను పిల్లలకు అందజేస్తున్నాం. విద్యార్థులకు ట్యాబ్లు కూడా ఉచితంగా ఇస్తున్నాం. మీరంతా ఒక్కసారి ఇంటికి వెళ్లి ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వంలో సాకారమైన మార్పులను గమనించండి. ఇది కేవలం ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక కాదు. ఈ ఎన్నికలు పేదల తలరాతలను మార్చే ఎన్నికలు. అందరూ ఇంటికి వెళ్లాక ఒక్కసారి మీ భార్య, పిల్లలు, ఇంట్లో అవ్వాతాతలతో మాట్లాడండి. అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోండి. నేడు ఎమ్మిగనూరులో సీఎం జగన్ సభ సాక్షి, అమరావతి: మేమంతా సిద్ధం బస్సు యాత్ర మూడో రోజైన శుక్రవారం కర్నూలు జిల్లా పెంచికలపాడులో సీఎం వైఎస్ జగన్ రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి ప్రారంభం కానుంది. బస్సు యాత్ర శుక్రవారం షెడ్యూల్ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వెల్లడించారు. ఉదయం 9 గంటలకు సీఎం జగన్ పెంచికలపాడు నుంచి బయలుదేరి రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరవడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డికి చేరుకుంటారు. ఆ ప్రాంతంలో భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కడిమెట్ల మీదుగా ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ దగ్గరకు చేరుకొని మధ్యాహ్నం 3గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం అరెకల్, ఆదోని క్రాస్, విరుపాపురం, బెణిగేరి, ఆస్పరి, చిన్నహుల్తి, పత్తికొండ బైపాస్ మీదుగా కేజీఎన్ ఫంక్షన్ హాల్కు దగ్గరలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకుంటారు. ఒక్క ఊరికే రూ.49 కోట్ల ఉపకారం కేవలం ఒక్క ఎర్రగుంట్ల గ్రామానికే 58 నెలల వ్యవధిలో వివిధ పథకాల ద్వారా డీబీటీతో రూ.49 కోట్ల మేర లబ్ధి చేకూర్చగలిగాం. ఈ గ్రామంలోని రెండు సచివాలయాల పరిధిలో ఎన్ని ఇళ్లు ఉన్నాయి? ఎంత మంది లబ్ధిదారులున్నారు? ఎవరెవరికి ఏయే పథకాలు అందాయి? అనే విషయాలను కాసేపటి క్రితమే అడిగి తెలుసుకున్నా. గ్రామంలో 1,496 ఇళ్లు ఉండగా, 1,391 ఇళ్లకు ప్రభుత్వ పథకాల ద్వారా రూ.48,74,34,136 అందాయి. 93 శాతం మందికి ప్రభుత్వ పథకాలు అందాయి. ఒక్క ఈ ఊరులోనే వైఎస్సార్ పెన్షన్ కింద రూ.16.52 కోట్లు పంపిణీ చేశాం. వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.6.81 కోట్లు, అమ్మఒడితో 1,043 మంది తల్లులకు రూ.4.69 కోట్లు అందజేశాం. వైఎస్సార్ ఆసరా కింద రూ.3.88 కోట్లు, వైఎస్సార్ చేయూత కింద 492 మంది అక్కచెల్లెమ్మలకు రూ.2.96 కోట్లు, జగనన్న విద్యా దీవెన కింద 837 మందికి రూ.2.46 కోట్లు, హౌసింగ్ కింద రూ.2.75 కోట్లు, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.2.24 కోట్లు, ఇన్పుట్ సబ్సిడీతో రూ.1.13 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.కోటి, సున్నా వడ్డీ కింద రూ.86 లక్షలు, క్రాప్ ఇన్సూరెన్స్ కింద రూ.67 లక్షలు, జగనన్న తోడు కింద ఇచ్చిన రుణాలు రూ.41.30 లక్షలు, చేదోడు కింద రూ.40 లక్షలు, కాపు నేస్తం కింద రూ.31 లక్షలు, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద రూ.21.48 లక్షలు అందజేశాం. మీ బిడ్డ గత 58 నెలల వ్యవధిలో ఒక్క గ్రామానికే ఇంత మంచి చేశాడనే విషయాన్ని గమనించాలని కోరుతున్నా. వీటితోపాటు గోరుముద్ద, ఇళ్ల స్థలాలు, బియ్యం కార్డులు, విద్యా కానుక, సంపూర్ణ పోషణ కింద మరింత అదనంగా లబ్ధి చేకూర్చాం. ఎక్కడా ఎవరూ లంచం అడగడం లేదు. అర్హత ఉంటే చాలు పారదర్శకంగా ప్రయోజనాన్ని అందిస్తున్నాం. చివరిగా.. ఈ ముఖాముఖిలో వీలైనంత ఎక్కువ మందితో మాట్లాడించే ప్రయత్నం చేశాం. సమయాభావం వల్ల అందరికీ మాట్లాడే అవకాశం దొరకలేదు. మీ అందరికీ స్లిప్పులు ఇచ్చాం. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే అందులో రాసి బాక్సులో వేస్తే నా దగ్గరికి వస్తాయి. వ్యవస్థను ఇంకా బాగుపరిచే సూచనలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటాం. నవరత్నాలతో ప్రతి కుటుంబానికి మేలు ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలతో ప్రతి కుటుంబానికి మేలు జరిగింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని పనులను సీఎం జగన్ చేసి చూపించారు. తెలంగాణలో నాడు–నేడు కింద పాఠశాలలను అభివృద్ధి చేయాలని తలపెట్టి చేతులెత్తేశారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం సర్కారు బడుల రూపురేఖలు మార్చి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారు. – హుసేన్బాషా, ఎర్రగుంట్ల ఎన్నో పథకాలు అందించారు నాలాంటి వారికి అన్నగా, పిల్లలకు మేనమామలా, అవ్వాతాతలకు మనవడిగా ఎంతో మందికి కుమారుడిగా ముఖ్యమంత్రి జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను అందించారు. అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. మళ్లీ మీరే ముఖ్యమంత్రి కావాలని మేమంతా కోరుకుంటున్నాం. ఈ ఎన్నికల్లో 175కి 175 స్థానాలు సాధిస్తారు. – పుష్పలత, ఎర్రగుంట్ల రూ.5 లక్షలు బీమా వచ్చింది మా అత్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ప్రమాద బీమా కింద రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందింది. నాలుగుసార్లు అమ్మ ఒడి పథకం వర్తించింది. అర్హతే ప్రామాణికంగా ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలను వర్తింపజేస్తున్నారు. – పద్మావతి, గోవిందపల్లె స్కూళ్ల రూపురేఖలు మార్చారు ప్రభుత్వ పాఠశాలలను ముఖ్యమంత్రి జగన్ అన్ని విధాలుగా తీర్చిదిద్దారు. ఇంగ్లిష్ మీడియం విద్యను అందిస్తున్నారు. గతంలో మా పాఠశాలకు ప్రహరీ లేదు. మరుగుదొడ్లు అస్తవ్యస్తంగా ఉండేవి. నాడు–నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చేశారు. మరుగుదొడ్ల వసతి కల్పించారు. గోరుముద్ద ద్వారా చిక్కీలు, గుడ్లు, రాగిజావతో ఆరోగ్యకరమైన భోజనం అందిస్తున్నారు. – చర్విత, విద్యార్థిని, శిరివెళ్ల ఆదుకున్న సీఎంఆర్ఎఫ్.. నా కుమారుడికి చిన్న వయసులోనే గుండెకు రంధ్రం పడి పెద్ద ఆరోగ్య సమస్య తలెత్తింది. ఆపరేషన్కు రూ.6 లక్షలు ఖర్చవుతుందన్నారు. ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆపరేషన్ చేశారు. నా కుమారుడు బతికి బయటపడ్డాడంటే సీఎం జగన్ చలవే. ఆయనే మళ్లీ సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. – నాగరాజు దంపతులు, ఎర్రగుంట్ల పాదయాత్ర హామీలన్నీ నెరవేర్చారు చంద్రబాబు 600కిపైగా హామీలిచ్చి 2014లో అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు చేసిన పాపాన పోలేదు. మేనిఫెస్టోలోని ప్రతి హామీని అమలు చేసిన ఘనత ఒక్క వైఎస్ జగన్కు మాత్రమే దక్కుతుంది. మాకు మళ్లీ అధికారం ఇస్తే గ్రామాలను అభివృద్ధి చేస్తాం, పిల్లలకు మంచి బడులు కట్టిస్తాం, మంచి చదువులు చెప్పిస్తాం, మంచి వైద్యం అందుబాటులోకి తీసుకొస్తాం, మహిళలకు ఆర్థిక చేయూతనందిస్తామని చెబుతున్నాం. కానీ, ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయో ఒక్కసారి గమనించండి. ఒకరేమో తమ దగ్గర ఎర్ర పుస్తకంలో పేర్లు రాసుకున్నామని, అధికారంలోకి వస్తే వారి అంతు చూస్తానని బెదిరిస్తున్నారు. ఇంకొకరేమో తాము అధికారంలోకి వస్తే మీరంతా గుడుల్లో, బడుల్లో దాక్కోవాలంటూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. పగటి కలలు కనడం మానండి. వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. సీఎంగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేసేది జగనే. – గంగుల బిజేంద్రారెడ్డి, ఎమ్మెల్యే, ఆళ్లగడ్డ పేదల కోసం పెత్తందార్లతో యుద్ధం సీఎం జగన్ ప్రజలతో నేరుగా మాట్లాడటం ఈ రోజు ప్రారంభిస్తున్నది కాదు. నేను విన్నాను.. నేను ఉన్నాను.. అంటూ జనం కోసం నిలబడిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి మన జగనన్న. ఓదార్పు యాత్రలో, పాదయాత్రలో ప్రజల బాధలు విన్నారు. ప్రజా ప్రభుత్వం ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో ఈ ఐదేళ్లలో చేసి చూపారు. పేదల కోసం పెత్తందార్లతో యుద్ధం చేస్తున్నారు. ఈ రోజు అక్కచెల్లెమ్మల కళ్లల్లో కనిపిస్తున్న ఆనందం అలాగే ఉండాలంటే ఏం చేయాలో వినడానికి వచ్చారు. సామాన్యుల జెండాను, అణగారిన వర్గాల అజెండాను మోసుకుంటూ, నడుచుకుంటూ వచ్చారు. కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి మనకు తగిన సమయం వచ్చింది. – వాసిరెడ్డి పద్మ, ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ రెండో రోజు యాత్ర సాగిందిలా.. మేమంతా సిద్ధం అంటూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర రెండో రోజు గురువారం ఉదయం ప్రారంభమైంది. ♦ రాత్రి బస చేసిన శిబిరం నుంచి ఉదయం 9.40 గంటలకు సీఎం జగన్ బయటకు వచ్చారు. ♦ 9.45 గంటలకు ఆళ్లగడ్డ నుంచి బయలుదేరి నల్లగట్ల, బత్తలూరు మీదుగా ఎర్రగుంట్ల గ్రామానికి చేరుకున్నారు. ♦ 11.10 గంటలకు ఎర్రగుంట్ల గ్రామంలో వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖిలో పాల్గొని ప్రసంగించారు. ♦ 12.50 గంటలకు సభ నుంచి బయటకు వచ్చి వెంకటాపురం, శిరివెళ్ల మెట్ట మీదుగా దీబగుంట్ల గ్రామానికి చేరుకున్నారు. ♦ మధ్యాహ్నం 2 గంటలకు దీబగుంట్ల వద్ద ఎమ్మెల్యే శిల్పా రవి పుష్పగుచ్చాలు అందజేసి నంద్యాల నియోజకవర్గంలోకి స్వాగతం పలికారు. ♦ 2.40 గంటలకు చాబోలు వద్ద భోజన విరామం కోసం ఆగారు. ♦ సాయంత్రం 4.40 గంటలకు చాబోలు నుంచి రైతు నగరం క్రాస్ మీదుగా బొమ్మలసత్రం ఫ్లై ఓవర్ మీదుగా ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన సభ వద్దకు 5.30 గంటలకు చేరుకున్నారు. ♦ 5.40 గంటల నుంచి 7.10 వరకు ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. ♦ 8.10 గంటలకు ఆర్జీఎం కాలేజీ వద్దకు చేరుకుని విద్యార్థులకు అభివాదం చేశారు. ♦ 9.40 గంటలకు పాణ్యం, సుగాలిమెట్ట, హుసేనాపురం, ఓర్వకల్లు మీదుగా నన్నూరు టోల్ప్లాజా వద్దకు చేరుకున్నారు. ♦ పెద్దటేకూరు, మార్కాపురం క్రాస్ మీదుగా రాత్రి 11.06 గంటలకు బస చేయనున్నపెంచికలపాడుకు చేరుకున్నారు. -
ప్రభం‘జనం’.. సీఎం జగన్ బస్సు యాత్రకు నీరాజనాలు
మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: జనం.. జగన్ కలిస్తే ప్రభంజనమేననే మరోసారి రుజువైంది. సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర రెండో రోజు జైత్రయాత్రలా కొనసాగింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ క్రాస్ వద్ద సీఎం జగన్ బస చేసిన శిబిరం వద్దకు గురువారం ఉదయం నుంచే వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సీఎంను కలిశారు. ప్రజల కేరింతల మధ్య రెండో రోజు బస్సు యాత్ర ఉదయం 9.30 గంటలకు మొదలైంది. ఆళ్లగడ్డ క్రాస్ నుంచి నల్లగట్ల వరకూ కిలోమీటర్ల కొద్దీ జనం బారులు తీరారు. సీఎం తమ వద్దకు చేరుకోగానే ఆయన ప్రయాణిస్తున్న బస్సుపై బంతిపూల వర్షం కురిపించారు. నల్లగట్ల వద్ద అంబులెన్స్కు దారి ఇచ్చిన జగన్.. శిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల సమీపంలో నూతన జంట వెంకటస్వామి, కావేరి దంపతులను ఆశీర్వదించారు. ఎర్రగుంట్ల గ్రామముఖ ద్వారంలో సీఎం జగన్ బస్సుపై బంతి పూలవర్షం కురిపిస్తూ హారతులు ఇస్తూ ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఎర్రగుంట్ల గ్రామ ప్రజలతో మమేకమై వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ప్రతి ఇంటికీ మంచి చేశారంటూ సీఎం జగన్పై ఎర్రగుంట్ల వాసులు ప్రశంసలు కురిపించారు. అనంతరం ఎర్రగుంట్ల నుంచి శిరివెళ్ల మండలం గోవిందపల్లి, చాబోలు మీదుగా బస్సు యాత్ర సాగింది. చాబోలులో భోజన విరామం తరువాత నంద్యాల నియోజకవర్గం నూనెపల్లికు చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్రకు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్రెడ్డి ఘనస్వాగతం పలికారు. నంద్యాలలో జనహోరు.. నంద్యాలలో గురువారం సాయంత్రం 4.30 గంటలకు గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో బహిరంగ సభ ప్రారంభమవుతుందని ప్రకటించినా ఉదయం 11 గంటల నుంచే జనప్రవాహం మొదలైంది. ఎండ వేడి పెరిగేకొద్దీ జనం పెరిగారు. 30 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సభాప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. ఆళ్లగడ్డ క్రాస్ నుంచి నూనెపల్లి వరకూ జనం అడుగడుగునా బ్రహ్మరథం పట్టడంతో గంట ఆలస్యంగా సాయంత్రం 5.30 గంటలకు సీఎం జగన్ చేరుకున్నారు. సభా వేదికపైకి సీఎం జగన్ చేరుకోగానే జనం హర్షద్వానాలు, కేరింతలతో సభా ప్రాంగణం హోరెత్తింది. సీఎం జగన్ ర్యాంప్ వాక్ చేస్తూ అభివాదం చేస్తున్నప్పుడు జనం జయహో జగన్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. సంక్షేమాభివద్ధి పథకాల ద్వారా చేసిన మంచి, రాష్ట్రం రూపురేఖలు మార్చేలా చేసిన అభివృద్ధిని వివరించడంతోపాటు 2014–19 మధ్య టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన మోసాలను సీఎం జగన్ ఎండగట్టారు. మళ్లీ ఇప్పుడు అదే కూటమితో చంద్రబాబు పోటీ చేస్తుండటాన్ని ప్రస్తావించినప్పుడు విశేష స్పందన లభించింది. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు.. రాష్ట్రం రూపురేఖలు మార్చేందుకు.. మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవడానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా అంటూ సీఎం జగన్ పిలుపునిచ్చినప్పుడు మేమంతా సిద్ధం అంటూ దిక్కులుపిక్కటిల్లేలా జనం నినదించారు. విద్యార్థుల ఉత్సాహం.. నంద్యాల సభ రాత్రి 7 గంటలకు ముగియగా అనంతరం బస్సు యాత్ర తిరిగి ప్రారంభమైంది. సీఎం జగన్ బస్సు యాత్ర కడప–కర్నూలు జాతీయ రహదారిపై నిర్వహించనున్నట్లు తెలియడంతో ఆర్జీఎం కాలేజీ విద్యార్థులు మధ్యాహ్నం నుంచే భారీగా తరలి వచ్చారు. రాత్రి 8.30 గంటలకు సీఎం జగన్ బస్సు చేరుకోగానే విద్యార్థులు హర్షధ్వానాలు చేయగా వారికి సీఎం జగన్ అభివాదం చేశారు. అక్కడి నుంచి బస్సు యాత్ర పాణ్యం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. సుగాలిమిట్ట వద్ద ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి సీఎం జగన్కు ఘనస్వాగతం పలికారు. హుస్సేనాపురం, ఓర్వకల్లుల్లో రాత్రి 9.30 గంటలైనా జనం రోడ్డుపైనే నిలబడ్డారు. నన్నూర్ వద్ద నారాయణ కాలేజీ విద్యార్థులను యాజమాన్యం నియంత్రించినా లెక్క చేయకుండా భారీ ఎత్తున రహదారిపైకి చేరుకుని బంతిపూల వర్షంతో స్వాగతం పలికారు. నన్నూర్ వద్ద బస్సు యాత్ర కర్నూలు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. కర్నూలు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇంతియాజ్ సార«ద్యంలో నేతలు అక్కడ సీఎం జగన్కు ఘనస్వాగతం పలికారు. పెద్దటేకూరు, చిన్నకొట్టాల, కె.మార్కాపురం క్రాస్, నాగలాపురం మీదుగా పెంచికలపాడు వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ రాత్రి 11.06 గంటలకు చేరుకున్నారు. -
శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం సీమలో హైకోర్టు!
కర్నూలు (సెంట్రల్): శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమకు న్యాయం చేసేందుకు అడుగులు ముందుకు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. 87 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ది సహేతుక న్యాయం చేసేందుకు డీ సెంట్రలైజేషన్ (పరిపాలనా వికేంద్రీకరణ) విధానానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. అందులో భాగంగానే రాయలసీమ ముఖద్వారమైన కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించామని, రాష్ట్ర న్యాయ సంస్థలన్నింటినీ కర్నూలులోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గురువారం కర్నూలు జిల్లాలో పర్యటన సందర్భంగా కల్లూరు మండలం లక్ష్మీపురం సమీపంలో జగన్నాథగట్టు వద్ద 150 ఎకరాల్లో రూ.1,011 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి సీఎం జగన్ భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య విశేష పూజలు జరిగాయి. లోకాయుక్త చైర్మన్ జస్టిస్ పి.లక్ష్మణ్రెడ్డి, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ మంథాత సీతారామమూర్తితో కలసి న్యాయ విశ్వ విద్యాలయం పైలాన్ను సీఎం ఆవిష్కరించారు. న్యాయ విశ్వ విద్యాలయం నమూనా ఫొటో ఎగ్జిబిషన్ను క్షుణ్నంగా పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ 87 ఏళ్ల క్రితం సహేతుక న్యాయం కోసం ఈ ప్రాంత ప్రజలు శ్రీబాగ్ ఒడంబడిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని, అప్పటి నుంచి అమలు కోసం నిరీక్షిస్తున్నారని గుర్తు చేశారు. లా యూనివర్సిటీకి సంబంధించిన శిలాఫలకం వద్ద సీఎం జగన్ 1937లో కుదిరిన శ్రీబాగ్ ఒప్పందం మేరకు ఆ రోజుల్లోనే హైకోర్టును ఇక్కడే నెలకొల్పుతారని భావించారని చెప్పారు. కర్నూలులో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో హైకోర్టు భవనాన్ని కూడా ఇక్కడే నెలకొల్పే సామర్థ్యాన్ని లా యూనివర్సిటీ సంతరించుకుంటుందనే ఆశాభావాన్ని సీఎం వ్యక్తం చేశారు. త్వరలోనే వర్సిటీ నిర్మాణ పనులను చేపట్టి వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కర్నూలుకు మరిన్ని న్యాయ సంస్థలు కర్నూలులో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయంతోపాటు మరిన్ని ప్రతిష్టాత్మక న్యాయ విభాగాలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్, ఏపీ లీగల్ మెట్రాలజీ కమిషన్, ఏపీ లేబర్ కమిషన్, ఏపీ వ్యాట్ అప్పిలేట్ ట్రిబ్యునల్, ఏపీ వక్ఫ్ బోర్డు ట్రిబ్యునళ్లను కర్నూలులోనే ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే కర్నూలులో ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలు పని చేస్తున్నాయని గుర్తు చేస్తూ రానున్న రోజుల్లో ఆయా కమిషన్లు, ట్రిబ్యునళ్లు, ఇతర న్యాయ సంస్థలన్నింటికీ జగన్నాథగట్టుపైనే భవన సముదాయాలను సమకూర్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాయలసీమ ప్రజల ఆకాంక్షకు ప్రతీకగా జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం నిలుస్తుందని, సీమ అభివృద్ధికి ఇది మచ్చు తునక లాంటిదని కలెక్టర్ సృజన పేర్కొన్నారు. తుంగభద్రలో కాలుష్య విముక్తికి రూ.131.84 కోట్లు కర్నూలు నగర పాలకసంస్థలో అమృత్ 2.0 పథకం కింద రూ.131.84 కోట్లతో నిర్మించనున్న మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేసి పైలాన్ను ఆవిష్కరించారు. రాంబొట్ల దేవాలయం, మామిదాలపాడు, మునగాలపాడు సమీపంలో మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా తుంగభద్ర నదికి మురుగునీరు, కాలుష్యం నుంచి విముక్తి లభించనుంది. కార్యక్రమంలో మంత్రి బుగ్గన, రాష్ట్ర ప్రభుత్వ న్యాయశాఖ కార్యదర్శి జి.సత్యప్రభాకర్, వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ జిల్లా చైర్మన్ కరణం కిశోర్కుమార్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య, జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్, జేసీ నారపురెడ్డి మౌర్య, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ విజయమనోహరి, జేసీఎస్ జిల్లా అధ్యక్షుడు తెర్నేకల్ సురేందర్రెడ్డి పాల్గొన్నారు. అది రాయలసీమ, కర్నూలు వాసుల కోరిక: సీఎం జగన్ శ్రీబాగ్ ఒడంబడికలో భాగంగా పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఇక్కడే (కర్నూలు) హైకోర్టు పెడతామని చెప్పారు. ఈమేరకు ఆ రోజుల్లోనే ఇక్కడకు రావాల్సింది. హైదరాబాద్ను రాజధానిగా చేసినందున అప్పటిదాకా రాజధానిగా ఉన్న కర్నూలు ఆ హోదాను కోల్పోతుండటంతో ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. ఆ రోజు చెప్పిన మాట మేరకు ఈరోజు మన అడుగులు ముందుకు పడుతున్నాయి. – సీఎం జగన్ కర్నూలు సమగ్ర నీటి సరఫరాకు రూ.115 కోట్లు కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో నీటి కొరతను అధిగమించేలా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప ముందడుగు వేసింది. రూ.115 కోట్లతో అమృత్ 2.0 పథకం ద్వారా సమగ్ర నీటి సరఫరాకు సంబంధించిన పైలాన్ను ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. ఈ పథకం ద్వారా జగన్నాథగట్టు వద్ద ట్రీట్మెంట్ ప్లాంట్, సర్వీసు రిజర్వాయర్, గ్రావిటీ మెయిన్స్ విభాగాల ద్వారా హంద్రీనీవా సుజల స్రవంతి నీటిని శుద్ధి చేసేందుకు ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. శుద్ధి అయిన నీటిని అక్కడి నుంచి కర్నూలు నగరానికి సరఫరా చేస్తారు. రోజుకు 50 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ ఫర్ డే) నీటిని శుద్ధి చేసేలా ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. అగ్రకుల పేదలను గుర్తించిన ఏకైక సీఎం జగన్ అగ్రకులాల్లోనూ పేదలు ఉంటారని గు ర్తించి మేలు చేస్తున్న ఏకైక సీఎం జగనే. గత ఎన్నికలకు ముందు నా భర్త మరణించగా వితంతు పింఛన్ అందలేదు. 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నాకు పింఛన్ మంజూరైంది. ఈబీసీ నేస్తం ద్వారా నాకు రూ.45 వేల మేర లబ్ధి చేకూరింది. టీడీపీ హయాంలో మా అమ్మకు వృద్ధాప్య పింఛన్ కోసం కాళ్లరిగేలా తిరిగాం. ఇప్పుడు ఇంటివద్దే వలంటీర్ వచ్చి పింఛన్ ఇస్తున్నారు. – పద్మావతి, ఈబీసీ నేస్తం లబ్ధిదారురాలు, బనగానపల్లె -
శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం అడుగులేస్తున్నాం..
-
కర్నూలులో తన్నుకున్న టీడీపీ నేతలు
కర్నూలు: కర్నూలులో టీడీపీ నేతలు తన్నుకున్నారు. ‘బీసీ జయహో’ సభలో బీభత్సం సృష్టించారు. ఈ సభలో మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి హల్చల్ చేశారు. ఎమ్మిగనూరు టికెట్ కోసం మాచాని సోమనాథ్ వర్గీయులు వాగ్వాదానికి దిగారు. ‘బీసీ జయహో’ సభలో బీసీని అవమానించారని మాచాని సోమనాథ్ అనుచరులు అసహనం వ్యక్తం చేశారు. -
ఇన్చార్జులపై ‘రూకలు’పోటు
సాక్షి ప్రతినిధి కర్నూలు: కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో టీడీపీ మసిబూసి మారేడు కాయ చేసి ప్రస్తుత ఇన్చార్జులను వంచించేందుకు యత్నిస్తోంది. ఇప్పటివరకు వారిచేత డబ్బులు ఖర్చుచేయించి ఇప్పుడు రోకలిపోటుకు సిద్ధమైంది. మంత్రా ల యం, ఎమ్మిగనూరు, ఆదోనిలో అభ్యర్థులను మార్చేందుకు యోచిస్తోంది. ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పుపై టీడీపీ జోన్–4 ఇన్చార్జ్ బీద రవిచంద్రయాదవ్ పలువురితో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుత ఇన్చార్జ్లు డైలమాలో పడ్డారు. ఎమ్మిగనూరు ఇన్చార్జ్గా మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయనను కాదని మాచాని సోమనాథ్ను బరిలోకి దించే యోచనలో టీడీపీ ఉంది. శనివారం కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి, సోమనాథ్ను కలిశారు. టికెట్ విషయం ప్రస్తావించారు. అయితే సమయం ఇవ్వాలని ఆలోచించి చెబుతా మని సోమనాథ్ చెప్పినట్లు తెలుస్తోంది. సోమనాథ్కు టికెట్ ఇస్తే జయనాగేశ్వరరెడ్డి రాజకీయ ప్రయాణం ముగిసినట్లే! ఆదోని ఇన్చార్జ్గా మీనాక్షి నాయుడు కొనసాగుతున్నారు. పొత్తులో భాగంగా జనసేన తరఫున సినీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ టికెట్ దక్కించుకోవాలని భావిస్తున్నారు. కుదరకపోతే తానే టీడీపీ తరఫున బరిలోకి దిగాలనే యోచన కూడా చేస్తున్నట్లు తెలు స్తోంది. టీజీ వెంకటేశ్కు బంధువు కావడంతో విశ్వప్రసాద్కు టికెట్ ఇప్పించేందుకు వెంకటేశ్, భరత్ కూడా యత్నిస్తున్నట్లు తెలు స్తోంది. దీంతో మీనాక్షినాయుడు శుక్రవారం ఆదోని లో సదస్సు నిర్వహించారు. ‘ఎవరంటే వారు టికెట్ అడుగుతున్నారని, ఇదేమైనా సినిమా టికెట్టా? అంటూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నట్లు తె లుస్తోంది. తనకేనా లేదా తన కుమారుడు భూపాల్ నాయుడుకైనా టికెట్ వస్తుందని,లేనిపక్షంలో ఏం చేయాలో ఆలోచిస్తానని చెప్పినట్టు సమాచారం. మంత్రాలయంలో రాఘవేంద్ర జపం మంత్రాలయం టీడీపీ ఇన్చార్జ్గా తిక్కారెడ్డి ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో తిక్కా రెడ్డి ఓడారు. ఈ ఎన్నికల్లో ఆయనకు కాకుండా బీసీ వర్గానికి చెందిన రాఘవేంద్రని బరిలోకి దించాలని టీడీపీ యోచిస్తోంది. ఇటీవల టీడీపీలో చేరిన రాఘవేంద్ర.. చంద్రబాబును కలిశారు. కచ్చితంగా బీసీలకే టిక్కెట్ ఇస్తామని, డబ్బులు సిద్ధం చేసుకోవాలని రాఘవేంద్రకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో 2 ఎన్నికల్లో టీడీపీ కోసం భారీగా ఖర్చు చేశానని, తనకు టి కెట్ ఇవ్వకపోతే పార్టీలో కొనసాగనని తిక్కారెడ్డి తన వర్గీయులతో చెప్పినట్లు సమాచారం. -
బనియన్ల నిండా బంగారం, నగదే
సాకక్షి, కర్నూలు: సినీ ఫక్కీలో ఒంటిపై చొక్కా లోపల ధరించిన బనియన్లలో భారీగా బంగారం, నగదు పెట్టుకుని దర్జాగా బస్సులో నిద్రిస్తున్న నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.1,84,53,500 నగదు, 4.565 కిలోల బంగారం, 5కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... అక్రమంగా బంగారం తరలిస్తున్నారని స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టెబుల్ ఖాజాహుసేన్ సమాచారం ఇవ్వడంతో కర్నూలు జిల్లా అమకతాడు టోల్ప్లాజా వద్ద కృష్ణగిరి, వెల్దుర్తి ఎస్ఐలు ఎం.చంద్రశేఖర్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డితో కలిసి సీఐ గురువారం అర్ధరాత్రి వాహన తనిఖీ చేపట్టారు. హైదరాబాద్ నుంచి కోయంబత్తూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులో తనిఖీలు చేయగా, అమర్ప్రతాప్ పవార్(నంద్యాల), శబరి రాజన్(సేలం, తమిళనాడు), వెంకటేష్ రాహుల్(కోయంబత్తూరు), సెంథిల్కుమార్ (కోయంబత్తూరు) సినీ ఫక్కీలో బంగారం తరలిస్తున్నట్లు గుర్తించారు. వారు పథకం ప్రకారం తమ ఒంటిపై ధరించిన బనియన్కు పెద్ద జేబులు ఏర్పాటు చేసుకుని వాటిలో బంగారం, వెండి, నగదు పెట్టుకుని, దానిపై చొక్కా వేసుకుని ఎవరికీ అనుమానం రాకుండా ప్రయాణిస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అమర్ప్రతాప్ పవార్ నుంచి రూ.1,20,80,000, శబరి రాజన్ నుంచి 5 కిలోల వెండి బిస్కెట్లు, వెంకటేష్ రాహుల్ నుంచి 3.195 కిలోల బంగారం, రూ.19,23,500 నగదు, సెంథిల్కుమార్ నుంచి 1.37కిలోల బంగారం, రూ.44,50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి విలువ రూ.2,74,54,800 ఉంటుంది. బంగారం, వెండి, నగదు తరలిస్తున్న వారి వద్ద ఎటువంటి పత్రాలు లేకపోవడంతో ఆర్ఐ మస్తాన్, వీఆర్వో గిడ్డయ్య ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి సీజ్ చేశారు. నలుగురి నుంచి వివరాలు నమోదు చేసుకుని పంపించారు. కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ శుక్రవారం ఉదయం సెట్ కాన్ఫరెన్స్లో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టెబుల్ ఖాజాహుసేన్తోపాటు తనిఖీల్లో పాల్గొన్న వెల్దుర్తి సర్కిల్ సిబ్బందిని అభినందించారు. కాగా, గత నెల 26న రాత్రి ఇదే టోల్ప్లాజా వద్ద హైదరాబాద్ నుంచి అనంతపురానికి వెళుతున్న ట్రావెల్స్ బస్సులో కూడా ఓ వ్యక్తి నుంచి రూ.43.20లక్షలు స్వాదీనం చేసుకున్నారు. -
చంద్రబాబు ప్రసంగానికి కుర్చీలే అతిథులు!
కర్నూలు(సెంట్రల్)/నెల్లూరు, సాక్షి ప్రతినిధి/ నెల్లూరు సిటీ : నెల్లూరు నగరంలో, కర్నూలు జిల్లా పత్తికొండలో టీడీపీ ఆదివారం నిర్వహించిన ‘రా.. కదలి రా’ సభలు జనం లేక వెలవెలబోయాయి. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఖాళీ కుర్చీలను చూస్తూ ప్రసంగించాల్సి వచ్చింది. ఒక్కో సభకు లక్ష మంది చొప్పున రప్పించాలనుకున్న వారి వ్యూహం బెడిసికొట్టింది. కనీసం ఏడెనిమిది వేల మంది చొప్పున కూడా జనం హాజరు కాలేదు. వచ్చిన వారు కూడా బాబు ప్రసంగిస్తుండగానే వెళ్లిపోయారు. దీంతో స్థానిక నేతలపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఇలాగైతే ప్రజల్లోకి వేరే సంకేతాలు వెళతాయని, ప్రజా వ్యతిరేకత ఉందని స్పష్టం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు, పత్తికొండలో భారీ జన సమీకరణకు ఆ పార్టీ నేతలు యత్నించినా ఫలితం లేకపోయింది. చాలాచోట్ల డబ్బులిస్తామన్నా.. ‘మేము రాము బాబో.. మీ సభలకు’ అంటూ ప్రజలు ముఖంమీదే తేల్చి చెప్పడంతో స్థానిక టీడీపీ నేతలు చేతులెత్తేశారు. రెండు జిల్లాల్లోనూ సభలు జనం లేక వెలవెలబోవడంతో పార్టీ అధిష్టానంతోపాటు క్యాడర్ నైరాశ్యంలోకి వెళ్లిపోయింది. జగన్ అర్జునుడు కాదు : చంద్రబాబు పత్తికొండ, నెల్లూరు సభల్లో చంద్రబాబు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘ఆయన అభిమన్యుడు కాదు.. అర్జునుడూ కాదూ.. భస్మాసురుడు’ అని విమర్శించారు. సాక్షి పత్రికలో అబద్ధాలే రాస్తారని, చదవొద్దని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తామని చెప్పారు. రైతులకు రూ.1.50 లక్షల రుణమాఫీ చేసిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. ఐటీకి తానే ఆద్యుడినని, తనకు 80 దేశాల్లో మద్దతు ఉందని చెప్పారు. ఎమ్మెల్యేలు అనిల్కుమార్ యాదవ్, ప్రసన్నకుమార్రెడ్డి, విక్రమ్రెడ్డిపై విమర్శలు గుప్పించారు. సీఎం వైఎస్జగన్ చెబుతున్నట్లు 175 సీట్లు వారు గెలవలేరని, పులివెందులలో జగన్ను ఓడిస్తామన్నారు. జగన్ టిక్కెట్లు ఇచ్చిన వారిలో రౌడీలు, దోపిడీ దారులే అధికంగా ఉన్నారన్నారు. ఈ ప్రభుత్వంలో మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. సీఎం వైఎస్ జగన్ను ఓడించేందుకు ఏపీలోని 5 కోట్లమంది స్టార్ క్యాంపెయినర్లు కలసి తనతో రావాలని పిలుపునిచ్చారు. తన 45 ఏళ్ల పాలనలో ఇంత తీవ్ర వ్యతిరేక ఉన్న ప్రభుత్వాన్ని చూడలేదన్నారు. సీఎం జగన్ నాపై ఎన్ని కేసులుపెట్టి వేధించారో ప్రజలు చూశారన్నారు. సీఎం జగన్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. రాయలసీమకు గోదావరి జలాలు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. జనసేన కార్యకర్తలపై సోమిరెడ్డి మండిపాటు నెల్లూరు సభలో జనసేన కార్యకర్తలు వారి పార్టీ జెండాలను ఊపుతుండగా, టీడీపీ నాయకులు పొంగూరు నారాయణ, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి జెండాలు అడ్డుగా ఉన్నాయని, పక్కకు వెళ్లాలని సూచించారు. అయినా ఆ పార్టీ కార్యకర్తలు వినలేదు. జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్రెడ్డి సూచించినా పట్టించుకోలేదు. దీంతో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మైక్ తీసుకుని జనసేన కార్యకర్తలపై మండిపడ్డారు. మీరు ఎవరు చెప్పినా వినరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జనసేన కార్యకర్తలు టీడీపీ నాయకుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మాట్లాడుతూ జనవరి 31న కృష్ణపట్నం పోర్టులో ఉన్న కంటైనర్ టెర్మినల్ తమిళనాడుకు తరలిపోతుందని విమర్శించారు. మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిని పరోక్షంగా దుర్భాషలాడారు. డబ్బులు, మద్యం ఎర చూపినా.. నెల్లూరులో డబ్బులు, మద్యం ఎర చూపినా ప్రజలు చంద్రబాబు సభ వైపు రాలేదు. కేవలం రెండు వేల మంది మాత్రం ఎస్వీజీఎస్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో హడావుడి చేశారు. వారూ వసతుల్లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెద్ద నాయకులకు టెంట్, కూలింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేసిన నిర్వాహకులు కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో మండుటెండలో వారు విలవిలలాడారు. ఉదయం 11.30 గంటలకు రావాల్సిన చంద్రబాబు మధ్యాహ్నం 12.45 గంటలకు ఆలస్యంగా సభా ప్రాంగణానికి చేరుకోవడం కార్యకర్తల సహనానికి పరీక్ష పెట్టింది. సభకు వచ్చిన కార్యకర్తలకు రూ.250, క్వార్టర్ మద్యం బాటిల్ పంపిణీ చేయడం కనిపించింది. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ఆద్యంతం కుర్చీలు ఖాళీగా కనిపించడంతో స్థానిక నాయకులపై బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తాను మాట్లాడే సమయానికి ప్రజలను నిలబెట్టలేకపోయారా అని నెల్లూరు నగర రూరల్ ఇన్చార్జిపై మండిపడ్డారు. పత్తికొండలోని ఆదోని రోడ్డులో జరిగిన సభకు కచ్చితంగా లక్ష మంది వస్తారని శనివారం సాయంత్రం స్థానిక నేతలు చంద్రబాబుకు సమాచారం ఇచ్చారు. తీరా ఆదివారం ప్రజలెవరూ రాకపోవడంతో సభాస్థలిలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. వచ్చిన కొద్ది మంది కూడా సభ మధ్యలోనే వెళ్లిపోవడంతో ఆ పార్టీ నేతలకు దిక్కుతోచలేదు. -
సైకిలెక్కితే సైడ్ట్రాకే!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఒకప్పుడు సీమ రాజకీయాల్లో పేరొందిన ఆ రాజకీయ నేతలు చంద్రబాబు పంచన చేరితే వంచనకుగురై చతికిలపడ్డారు. సైకిలెక్కి తప్పుచేశామని, బాబు నిండాముంచేశారని తెరవెనుక గగ్గోలు పెడుతున్నారు. కోట్ల.. భూమా.. గౌరు.. బుడ్డా కుటుంబాలకు చెందిన రాజకీయ నాయకులతోపాటు నంద్యాల వరదరాజులరెడ్డి, దేవగుడి ఆదినారాయణరెడ్డి ఒకప్పుడు కాంగ్రెస్, వైఎస్సార్సీపీలో బలమైన నేతలు. బలమైన రాజకీయ నేపథ్యం వారి సొంతం. చంద్రబాబు కల్లబొల్లి మాటలు నమ్మి టీడీపీలో చేరితే ‘సీమ’ రాజకీయాల్లో తెరమరుగయ్యే స్థితికి చేరారు. చంద్రబాబును నమ్మి వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన మరికొంతమంది కనీసం టికెట్ దక్కించుకోలేక మోసపోయారు. వీరిలో కొందరు తిరిగి వైఎస్సార్సీపీలో చేరారు. చంద్రబాబు మోసం గ్రహించి ‘సీమ’లో టీడీపీ పని ఖతమైందని తెలుసుకున్న కొందరు.. ఆ పార్టీలో ఉండి ఓడిపోవడం కంటే మౌనంగా ఉండటం మంచిదనే నిర్ణయానికి వచ్చారు. ఈసారి తాము కోరిన టికెట్ ఇవ్వకపోతే పోటీనుంచి తప్పుకోవాలనే భావనలో మరికొందరు ఉన్నారు. కోట్ల కోటకు బీటలు కర్నూలు జిల్లాలో కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి, భూమా నాగిరెడ్డి, బుడ్డా వెంగళరెడ్డి కుటుంబాలు ‘సీమ’ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేవి. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్రెడ్డి తనయుడు సూర్యప్రకాశ్రెడ్డి కేంద్రమంత్రిగా చేశారు. భూమా నాగిరెడ్డి జిల్లాలో బలమైన నేతగా ఉండేవారు. 2014లో సూర్యప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ తరఫున కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆపై చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా కోట్ల, ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన సతీమణి సుజాతమ్మ పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీలో చేరడమే కోట్ల కుటుంబం చేసిన తప్పిదమని, దీంతోనే గెలుపు దక్కడం లేదనే భావన ఆయన అనుచరవర్గంలో ఉంది. ఈ దఫా కూడా ఎంపీగా గెలవలేమని కోట్ల భావిస్తున్నారు. అందుకే ఎమ్మిగనూరు టికెట్ ఆశించగా.. డోన్ ఎంచుకోవాలని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. అక్కడ బరిలోకి దిగితే ఓటమి తప్పదని కోట్ల భయపడుతున్నారు. భూమా కుటుంబం తంటాలు వైఎస్సార్సీపీ నుంచి 2014లో నంద్యాల, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలుగా గెలిచిన భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియలు అనంతర పరిణామాల్లో టీడీపీలో చేరారు. ఆ తర్వాత నాగిరెడ్డి మృతి చెందారు. అఖిలప్రియ టీడీపీ తరఫున 2019లో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయింది. దీంతో పార్టీ మారి తప్పుచేశామనే చర్చ అఖిల కుటుంబంలో జరిగింది. ఆమె కుటుంబీకులు కూడా దూరమయ్యారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికి ఈ సారి మొండిచేయి చూపారు. అతని స్థానంలో ఫరూక్కు టికెట్ ఖాయమైంది. ఆళ్లగడ్డలో కూడా అఖిలకు కాకుండా పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ ఇస్తారని సమాచారం. ఇదే జరిగితే పోటీ నుంచి భూమా కుటుంబం పూర్తిగా వైదొలిగినట్లే.. నమ్మితే నిండాముంచారు శ్రీశైలం, పాణ్యం, జమ్మలమడుగు ఎమ్మెల్యేలుగా గెలిచిన బుడ్డా రాజశేఖరరెడ్డి, గౌరు చరిత, దేవగుడి ఆదినారాయణరెడ్డిలు కూడా 2014 తర్వాత టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వీరికి ఘోర ఓటమి తప్పలేదు. వైఎస్సార్సీపీలో ఎమ్మెల్యేగా గెలిచిన బుడ్డా.. రాజకీయ భవిష్యత్ ఇచ్చిన పార్టీని కాదని చంద్రబాబును నమ్మడంతో 2019లో ఓటమి తప్పలేదు. ఇప్పుడు అసలు టికెట్ దక్కని పరిస్థితి నెలకొంది. గౌరు వెంకటరెడ్డి కుటుంబానికి వైఎస్ చేసిన మేలు అందరికీ తెలిసిందే.. జగన్మోహన్రెడ్డిని కాదని టీడీపీలో చేరితే 2019లో ఓడిపోయారు. ఈ దఫా కూడా వీరు గెలిచే పరిస్థితి లేదు. మరోవైపు జమ్మలమడుగు ఎమ్మెల్యే కడప ఎంపీగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఐదుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2019లో అతనికి టికెట్ కూడా ఇవ్వలేదు. అంతర్మథనంలో నేతలు రాయలసీమలో అత్యంత బలంగా వైఎస్సార్సీపీ ఉంది. 52 అసెంబ్లీ స్థానాల్లో 49 చోట్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో బలహీనంగా ఉన్న టీడీపీలో కొనసాగినా రాజకీయ భవిష్యత్తు ఉండదనే భావనకు వచ్చారు. చంద్రబాబు మోసపూరిత వైఖరిపై ప్రజలతో పాటు సొంత పార్టీలోని నేతలకు కూడా స్పష్టత వచ్చింది. ప్రత్యామ్నాయం లేక టీడీపీలో కొనసాగుతున్నామని, ఏ ఆప్షన్ ఉన్నా వెంటనే సైకిల్ దిగి వెళ్లిపోతామని ఈ నేతలంతా తమ అనుచరులతో చెబుతున్నారు. కల్లబొల్లి మాటలు నమ్మి వెళ్తే.. 2014లో వైఎస్సార్సీపీ తరఫున గెలిచి టీడీపీలో చేరిన వారిలో కర్నూలు, కోడుమూరు, కదిరి, బద్వేల్ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్రెడ్డి, మణిగాంధీ, అత్తర్ చాంద్బాషా, జయరాములు ఉన్నారు. వీరికి 2019 ఎన్నికల్లో చంద్రబాబు టికెట్ ఇవ్వలేదు. దీంతో మోహన్రెడ్డి, మణిగాంధీ తిరిగి వైఎస్సార్సీపీలో చేరారు. చంద్రబాబును నమ్మినందుకు చాంద్బాషా, జయరాములు పూర్తిగా రాజకీయ భవిష్యత్ కోల్పోయారు. కర్నూలు, నంద్యాల ఎంపీలు బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డి కూడా వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరారు. ఇద్దరికీ చంద్రబాబు టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో బుట్టా రేణుక 2019 ఎన్నికలకు ముందే తిరిగి సొంత పార్టీలో చేరారు. చంద్రబాబును నమ్మి మోసపోయానంటూ ఎస్పీవై రెడ్డి జనసేన తరఫున నంద్యాల ఎంపీగా, అల్లుడు సజ్జల శ్రీధర్రెడ్డి నంద్యాల ఎమ్మెల్యేగా, కుమార్తె సుజల శ్రీశైలం నుంచి, మరో కుమార్తె అరవిందరాణి బనగానపల్లి నుంచి పోటీ చేశారు. ఇలా వీరంతా చంద్రబాబును నమ్మి మోసపోయినవారే. చంద్రబాబును నమ్మి మోసపోయానని ఎస్పీవై రెడ్డి 2019లో బహిరంగ ప్రకటన కూడా చేశారు. -
పాణ్యంలో సాధికార పండుగ
సాక్షి ప్రతినిధి కర్నూలు: కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలు సాధికార పండుగ చేసుకొన్నారు. గురువారం వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలో వేలాదిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్ తమకు చేసిన మేలును వేనోళ్ల కీర్తిస్తూ వీధివీధిలో కలియదిరిగారు. డాక్టర్లు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, ఆటో డ్రైవర్లు ఇలా అన్ని వృత్తుల వారు స్వచ్ఛందంగా తరలివచ్చారు. మధాహ్నం అన్ని వర్గాల ప్రతినిధులతో కేఎస్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో సమావేశం అనంతరం యాత్ర ప్రారంభమైంది. చెన్నమ్మ సర్కిల్ వరకు ర్యాలీ ఘనంగా జరిగింది. 500 బైక్లతో యువత ర్యాలీలో పాల్గొన్నారు. కళాకారుల నృత్యాలు, సంగీత కార్యక్రమాలతో పండుగ వాతావరణం కన్పించింది. మహిళలు, ప్రజాప్రతినిధులు కూడా నృత్యం చేసి సందడి చేశారు. సాయంత్రం జరిగిన సభలో వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు. సభ ఆద్యంతం ‘జగనే కావాలి.. మళ్లీ జగనే రావాలి’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. బడుగుల గురించి ఆలోచించిన సీఎం ఒక్క జగన్ మాత్రమే: ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి సభలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.. పేదల పిల్లలు కూడా సంపన్నుల పిల్లల మాదిరిగా అత్యున్నతస్థాయికి ఎదిగేలా అత్యాధునిక చదువులు చెప్పిస్తున్న దేవుడు సీఎం వైఎస్ జగన్ అని చెప్పారు. ఒకే వేదికపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కూర్చోబెట్టి ఆ వర్గాలకు న్యాయం చేశామని ధైర్యంగా ప్రజలకు చెబుతున్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో జగన్మోహన్రెడ్డి మాత్రమేనన్నారు. 75 ఏళ్లలో ఎవ్వరూ ఆలోచించని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతి గురించి సీఎం జగన్ ఆలోచిస్తున్నారని తెలిపారు. ఈ వర్గాలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత స్థితికి చేర్చారని చెప్పారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమాన్ని అడ్డుకోవడానికి రామోజీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు చాలామంది ప్రయత్నిస్తున్నారని, అయినా, వెనుకాడేది లేదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చంద్రబాబు చేసింది ఏమీ లేదని, బీసీలకు ఒక్క రాజ్యసభ సీటు కూడా ఇవ్వలేదని చెప్పారు. సీఎం జగన్ అన్ని స్థానాలు, పదవుల్లో ఈ వర్గాలకే అగ్రతాంబూలం ఇచ్చారన్నారు. పురందేశ్వరి, ఈనాడు, ఏబీఎన్, టీవీ5కు చంద్రబాబు కావాలని, ప్రజలకు మాత్రం సీఎం జగన్మోహన్రెడ్డే కావాలని అన్నారు. స్వార్థం కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు: ఎంపీ గోరంట్ల రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని సంక్షేమ పథకాల్లో, అన్ని పదవుల్లో కనీసం 70 శాతం ఇచ్చి సామాజిక న్యాయం చేసింది సీఎం జగన్ మాత్రమేనని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలను సీఎం జగన్ నాయకులుగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. ఎలాంటి స్వార్ధం లేకుండా ప్రజా సంక్షేమమే పరమావధిగా సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ఆయన స్వార్ధం కోసం రాష్ట్రానికి, ప్రజలకు తీరని అన్యాయం చేశారని, ప్రత్యేక హోదాను మోదీకి అమ్మి ప్రత్యేక ప్యాకేజికి ఒప్పుకున్న దుర్మార్గుడని చెప్పారు. బాబు ప్రజలకు అందించిన స్కీములేవీ లేవని, స్కాములు మాత్రం లెక్కలేనన్ని చేశారని అన్నారు. ఆయన చేసిన తప్పులకు జీవితకాలం జైలులో ఉండాలన్నారు. సీఎం జగన్ గొప్ప దార్శనికుడు: ఎంపీ గురుమూర్తి సీఎం వైఎస్ జగన్ గొప్ప దార్శనికుడని తిరుపతి ఎంపీ గురుమూర్తి చెప్పారు. పేదల అభ్యున్నతి కోసం విద్య, వైద్య రంగాలను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నారని, సంక్షేమ పథకాలతో ప్రజల స్థితిగతులను ఉన్నతంగా మారుస్తున్నారని తెలిపారు. చంద్రబాబు నారాయణ, చైతన్య లాంటి ప్రైవేటు విద్యా సంస్థల అభ్యున్నతి కోసం పని చేస్తే.. వాటికి దీటుగా సీఎం జగన్ ప్రభుత్వ బడులను ఆధునీకరించి మంచి చదువు చెప్పిస్తున్నారని కొనియాడారు. అభివృద్ధి లేదు అనే వారు పాణ్యానికి వచ్చి చూడాలి: ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి పాణ్యంలో ఈ నాలుగున్నరేళ్లలో 1.60 లక్షల మందికి రూ.170 కోట్లు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్దేనని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి చెప్పారు. పిన్నాపురంలో ప్రపంచంలోనే అతి పెద్ద గ్రీన్కో రెన్యువబుల్ పవర్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నారని, త్వరలోనే దీనిని ప్రారంభిస్తామన్నారు. గుట్టపాడు దగ్గర రూ.600 కోట్లతో ఏర్పాటు చేస్తున్న జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంటు కూడా పూర్తయిందన్నారు కర్నూలు సిటీలో అభివృద్ధి పనులకు రూ.800 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంజీవ్కుమార్, ఎమ్మెల్యేలు హఫీజ్ఖాన్, సుధాకర్, మేయర్ బీవై రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సామాజిక సాధికార యాత్ర
-
నేడు ఎమ్మిగనూరు, మండపేటలో సామాజిక సాధికార యాత్ర
సాక్షి, తాడేపల్లి: ఏపీ వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారిని ఆత్మీయంగా పలకరించేందుకు వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు చేపట్టిన యాత్ర నేడు ఎమ్మిగనూరు, మండపేటలో సాగనుంది. కర్నూలు జిల్లా: ఎమ్మినూరులో ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగనుంది. మండల పరిషత్ కార్యాలయంలో 3.30 గంటలకు ముఖ్య నేతలతో ముఖాముఖి అనంతరం.. 4.30కుఎద్దుల మార్కెట్ నుండి సోమప్ప సర్కిల్ మీదుగా వైఎస్సార్ సర్కిల్కు వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు బస్టాండ్ ఎదుట బహిరంగ సభ జరగనుంది. మంత్రులు అంజాద్ భాష, ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాం, మా జీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ , ఎంపీ. సంజీవ్ కుమార్, తదితరులు హాజరుకానున్నారు. కోనసీమ జిల్లా మండపేటలో ఎమ్మెల్సీ తీట త్రిమూర్తులు ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు తాపేశ్వరంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం అనంతరం మండపేటలోని పూలే విగ్రహం నుంచి కలువ పువ్వు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు కలువు పువ్వు సెంటర్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మంత్రి జోగి రమేష్, ఎంపీలు పిల్లి సుభాస్ చంద్రబోస్, మార్గాని భరత్, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ, తదితరులు హాజరుకానున్నారు. ఇదీ చదవండి: ఏపీ ఎన్నికలకు కసరత్తు.. నేడు, రేపు ఈసీ సమీక్ష -
క్వింటా పత్తి రూ. 7,711
ఆదోని అర్బన్: కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం పత్తి ధర రూ.7,711గా నమోదైంది. గత వారంలో రూ.7,500 ధర ఉండగా.. ఈ వారం రోజురోజుకు రూ.50, రూ.100 చొప్పున పెరుగుతూ రూ.7,711కు చేరుకుంది. శుక్రవారం మార్కెట్కు 2,626 క్వింటాళ్ల పత్తి రాగా గరిష్ట ధర రూ.7,711, మధ్య ధర రూ.7,389, కనిష్ట ధర రూ.5,169 పలికింది. అలాగే, వేరుశనగ 1,437 క్వింటాళ్లు రాగా గరిష్ట ధర రూ.7,969, కనిష్ట ధర రూ.3,849.. ఆముదాలకు గరిష్ట ధర రూ.5,475, కనిష్ట ధర రూ.4,500, పూల విత్తనాలకు గరిష్ట ధర రూ.4,212, కనిష్ట ధర రూ.3,926 లభించింది. -
దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో ఉద్రిక్తత.. ఒకరు మృతి
సాక్షి, కర్నూలు జిల్లా: దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో ఒకరు మృతి చెందగా, 60 మందికిపైగా గాయపడ్డారు. కర్రల సమరాన్ని చూసేందుకు కొందరు స్థానికులు చెట్టు ఎక్కారు. ప్రమాదవశాత్తూ చెట్టు కొమ్మ విరిగిపడి గణేష్ అనే యువకుడు మృతిచెందాడు. గాయాలపాలైన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దేవరగట్టులో ప్రతీ ఏడాది దసరా పండుగ రోజున బన్నీ ఉత్సవం కర్రల యుద్ధంగా జరుగుతుంది. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని పాటిస్తూ బన్ని ఉత్సవాన్ని మంగళవారం అర్ధరాత్రి కొనసాగించారు. ఈ నేపథ్యంలో దేవరగట్టులో మరోసారి సంప్రదాయమే గెలిచింది. ఆచారం పేరిట యథావిధి ఈ భక్తి పోరాటం కొనసాగింది. ఈ బన్నీ ఉత్సవ యుద్దానికి పూర్వ చరిత్ర ఉంది. మాలమల్లేశ్వర విగ్రహం కోసం దేవరగట్టుతో పాటు చుట్టుపక్కల గ్రామాలవారు కర్రలతో కొట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దసరా రోజున అర్ధరాత్రి వేళా స్వామి విగ్రహాన్ని తీసుకెళ్తే అంతా మంచి జరుగుతుందని అక్కడి ప్రజల నమ్మకంతో.. ఉత్సవంలో పాల్గొంటారు. ప్రతీ ఏడాది జరుగుతున్న ఈ సమరంలో అనేక మందికి గాయాలయ్యి, తలలు పగిలి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఇదివరకూ అనేకసార్లు జరిగింది. మా ఆచార సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగిస్తాం.. మాళమల్లేశ్వర స్వామిని దక్కించుకోవడంలో వెనుకడుగు వేసేది లేదన్న భక్తులు.. ఈ కర్రల సమరంలో సుమారు 2 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. -
అభాగ్యులకు ఆపన్న హస్తం..సహాయార్థులను ఆదుకున్న సీఎం జగన్
-
ఆంధ్రప్రదేశ్లో పేదవాడికి, పెత్తందారుకు మధ్య కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందన్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఎమ్మిగనూరుకు సీఎం జగన్ వరాల జల్లు..!
-
పట్టు వదలని విక్రమార్కుడు మన సీఎం జగన్
-
సీఎం జగన్ ఎంట్రీ..దద్దరిల్లిన ఎమ్మిగనూరు
-
కర్నూల్ జిల్లాలో అడుగుపెట్టిన సీఎం వైఎస్ జగన్
-
Live: ఎమ్మిగనూరులో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ
-
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
రేపు ఎమ్మిగనూరులో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్
-
రేపు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు సీఎం జగన్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ ఈ నెల 19న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పర్యటించనున్నారు. ఆరోజు ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఎమ్మిగనూరుకు చేరుకుంటారు. వీవర్స్ కాలనీ వైడబ్ల్యూసీఎస్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో పాల్గొని.. జగనన్న చేదోడు పథకం కింద అర్హులైన రజక, నాయీబ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం జమ చేయనున్నారు. సభ అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు. -
కర్నూల్ జిల్లాలో టీడీపీ కి బిగ్ షాక్
-
మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం వైఎస్ జగన్..
-
నీటి విలువ, సీమ కష్టాలు తెలిసిన ప్రభుత్వం మనది: సీఎం జగన్
సాక్షి, నంద్యాల/డోన్: రాయలసీమ నీటి కష్టాలు నాకు తెలుసు కాబట్టే సాగునీరు, తాగు నీరు అందించే చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. నీటి విలువ, సీమ కష్టాలు తెలిసిన ప్రభుత్వం మనది అని అన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలను పట్టించుకోలేదని ప్రజలకు గుర్తు చేశారు సీఎం జగన్. కాగా, ముఖ్యమంత్రి జగన్ డోన్ సభలో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు నమ్మకం.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు. చంద్రబాబు ఉద్దేశ్యం రాష్ట్రాన్ని దోచుకోవడం. దోచుకున్నది వీళ్లతో పంచుకోవడం. అలా పంచుకుంటే ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించే ప్రసక్తే ఉండదు. ఇవన్నీ ఈనాడు రాయదు.. చూపించదు. ఒక ఆంధ్రజ్యోతి చంద్రబాబు కోసం ఢంకా భజాయిస్తుంది. ఒక టీవీ5 చంద్రబాబు ఎంత దారుణంగా పాలన చేసి బ్రహ్మండంగా చేసిందని చెబుతుంది. ఇలా దుర్మార్గమైన ఆలోచనతో చేసిందే చంద్రబాబు పాలనంతా. టీడీపీ హయంలో జరిగిదంతా.. దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం. దోచుకోవడం గ్రామస్థాయిలో జన్మభూమి కమిటీలో ప్రారంభమైతే.. చివరకు దత్తపుత్రుడి షేరింగ్తో ఎండ్ అవుతుంది’ సీమ కష్టాలు మీ బిడ్డకు తెలుసు.. రాయలసీమ నీటి కష్టాలు నాకు తెలుసు. కరువు జిల్లాలకు సాగు, తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నాం. కర్నూలు, నంద్యాల జిల్లాలకు మెట్ల ప్రాంతాలకు సాగు నీరు అందుతుంది. లక్కసాగరం పంప్హౌస్ ద్వారా 77 చెరువులకు నీరు అందుతుంది. హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి చెరవులకు నీటి కేటాయింపు జరిగింది. గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలను పట్టించుకోలేదు. ఎన్నికలకు 4 నెలలకు ముందు చంద్రబాబు జీవోలు, శంకుస్థాపనలు చేశారు. ప్రాజెక్ట్ కోసం భూమిని కూడా కొనుగోలు చేయలేదు. కేవలం టెంకాయలు కొట్టడానికి ఏదో నామ మాత్రంగా 8 ఎకరాలు కొనుగోలు చేశారు. అధికారంలోకి రాగానే ప్రాజెక్ట్లు పూర్తి చేశాం.. నా సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా చూశాను. అధికారంలోకి రాగానే ప్రజల కష్టాలు తీర్చేందుకు చర్యలు తీసుకున్నాను. కరువుతో అల్లాడుతున్న సీమకు మంచి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. హంద్రీనీవాను దివంగత మహానేత వైఎస్సార్ పూర్తి చేశారు. ఆ మహానేత బిడ్డ హయాంలో ప్రజలకు మంచి జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్ట్ల పూర్తికి చర్యలు తీసుకున్నాం. రూ. 253 కోట్లతో ప్రాజెక్ట్ను పూర్తి చేశాం. డోన్, పత్తికొండ నియోజకవర్గాలకు మంచి జరుగుతుంది. గత ప్రభుత్వం ప్రాజెక్ట్లను పట్టించుకోని పరిస్థితి ఉండేది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాయలసీమ లిఫ్ట్ పనులు చేపట్టాం. వెలుగొండ ప్రాజెక్ట్ను వడివడిగా పూర్తి చేస్తున్నాం. రెండో టన్నెల్ పూర్తి చేసి అక్టోబర్లో ప్రారంభిస్తున్నాం. కరువుతో అల్లాడుతున్న సీమకు మంచి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నది మన ప్రభుత్వం. మీ బిడ్డ ప్రభుత్వంలో తేడాను గమనించండి.. గతంలో ఇదే బడ్జెట్. అప్పటి కంటే ఇప్పుడు అప్పులు తక్కువ చేశాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గమనించండి. అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి రూ.2లక్షల35వేల కోట్లు జమ చేశాం. గత ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది?. మా ఊరిలో స్కూళ్లను, ఆసుపత్రులను గమనించండి. వైద్య, విద్య, సంక్షేమంలో మన ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. దొంగల ముఠా అబద్దాలు, మోసాలను ప్రజలు నమ్మవద్దు. ఈ ముఠా రానున్న కాలంలో మరిన్ని అబద్దాలను వడ్డిస్తుంది. మన ప్రభుత్వంలో మంచి జరిగిందా లేదా అన్నది ఆలోచించండి. మీ ఇంట్లో మంచి జరిగిందనుకుంటే మీ బిడ్డను ఆశీర్వదించండి. -
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన
-
ఎర్రనేలల్లో పసిడి పంట
తుగ్గలి(కర్నూలు): ఎర్ర నేలల్లో బంగారం పండనుంది. దాదాపు 45 ఏళ్లకు పైగా చేసిన సర్వేలు ఎట్టకేలకు ఫలించాయి. బంగారు నిక్షేపాలు వెలికితీసేందుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి–బొల్లవానిపల్లి మధ్య గోల్డ్ మైనింగ్ ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణానికి జియో మైసూర్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్ చార్లెస్ డెవినిష్, మేనేజింగ్ డైరెక్టర్ హనుమప్రసాద్ శనివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణ నమూనాను విడుదల చేశారు. అనంతరం చార్లెస్ డెవినిష్ మాట్లాడుతూ 30 ఎకరాల్లో దాదాపు రూ.200 కోట్లతో గోల్డ్ మైనింగ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 1945 తర్వాత ఇలాంటి ప్లాంట్ నిర్మించడం ఇదే తొలిసారి దేశంలో 1945 సంవత్సరం తర్వాత ఇలాంటి ప్లాంట్ నిర్మించడం ఇదే తొలిసారి అని చార్లెస్ డెవినిష్ తెలిపారు. రోజుకు 1,000 నుంచి 1,500 టన్నుల వరకు ముడి సరుకును ఈ ప్లాంట్లో ప్రాసెసింగ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద ప్రాసెసింగ్ చేస్తున్నామని, వచ్చే ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నాటికి ప్లాంట్ నిర్మాణం పూర్తయి పూర్తి స్థాయి ఉత్పత్తిని ప్రారంభిస్తామని వివరించారు. ప్లాంట్ ఏర్పాటైన తర్వాత ఏడాదికి 750 కిలోల బంగారం ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే కంపెనీలో 100 మందికి ఉపాధి కల్పించామని, మరో 200 మందికి ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు మానసబిశ్వాల్, హరికిరణ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, గోల్డ్ మైనింగ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్లాంట్ ఏర్పాటుతో తుగ్గలి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
అక్కడ టీడీపీ అడ్రసే లేదు.. పక్క జిల్లాలకు నేతలు!
ఉమ్మడి కర్నూల్ జిల్లాలో 2019 ఎన్నికల్లో సైకిల్ అడ్రస్సే లేకుండా పోయింది. దీంతో టీడీపీ నేతలు తలో దిక్కు పోయి వ్యాపారాలు చేసుకుంటున్నారు. చాలా నియోజకవర్గాల్లోని నేతలు పక్క ప్రాంతాలు, పక్క జిల్లాల్లో సెటిల్ అవుతున్నారు. అటువంటిదే ప్రస్తుత నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం. ఇక్కడ టీడీపీకి నాయకుడు లేకపోవడంతో అక్కడున్న కొద్దిపాటి కేడర్ డీలా పడుతోందట. గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన నంద్యాల జిల్లా బనగానపల్లె టీడీపీ అభ్యర్థి, ప్రస్తుత ఇన్చార్జ్ బీసీ జనార్థనరెడ్డి...ఆ తర్వాత నియోజకవర్గం గురించి పట్టించుకోలేదు. ఉమ్మడి జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర జరుగుతున్నపుడు కొంత హడావుడి చేసి, ఆయన వెళ్ళిపోయాక మళ్ళీ నియోజకవర్గాన్ని వదిలేశారు. అప్పుడప్పుడు చుట్టం చూపుగా బనగానపల్లెని చూసి పోతున్నాడు కాని.. వచ్చే ఎన్నికల్లో గెలవాలనే ఆలోచన ఆయనకు లేదని కేడర్ చెబుతోంది. 2019 ఎన్నికల్లో సొంత అన్న బిసి బాలతిమ్మారెడ్డి దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని టాక్. అయితే జనార్దన్ రెడ్డి మాత్రం తన అన్న గుండె పోటుతో చనిపోయాడని అందరినీ నమ్మించారనే ఆరోపణలు బనగానపల్లెలో దుమ్ము రేపుతున్నాయి. సొంత అన్నకు న్యాయం చెయ్యలేని నాయకుడు ప్రజలకు ఏమి చేస్తాడనే విమర్శలు సొంత పార్టీలోనే చెలరేగుతున్నాయి. అక్కడ తుడిచి పెట్టుకుపోయిన టీడీపీ 2019 ఎన్నికల్లో బనగాపల్లెలో తెలుగుదేశం జెండా ఎగురుతుందని ఆ పార్టీ కేడర్ నమ్మకంతో ఉంది. అయితే రాయలసీమ నాలుగు జిల్లాల్లో కలిపి టీడీపీకి వచ్చింది మూడే స్థానాలు. ఉమ్మడి కడప, కర్నూల్ జిల్లాల్లో అయితే తుడిచిపెట్టుకుపోయింది. బనగానపల్లెలో బిసి జనార్థనరెడ్డి అర్థబలం, అంగబలం వైఎస్సార్సీపీ ముందు నిలబడలేక బోర్లా పడ్డాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేదల సొంతింటి కల నెరవేర్చడానికి పూనుకుంటే.. ఆ గొప్పతనం వైఎస్సార్సీపీకి వస్తుందనే దురుద్దేశంతో పట్టాల పంపిణీ జరుగకుండా అతని అనుచరులతో కోర్టుల నుంచి స్టే తెప్పించాడు. పేదలకు ఇంటి స్థలాలు రాకుండా చేసిన ఘనత సాధించాడు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ జనార్థనరెడ్డి. బిసిపై ప్రజలలో రోజు రోజుకూ వ్యతిరేకత పెరుగుతుండటంతో నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నాడని టాక్ నడుస్తోంది.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీలకు అతీతంగా పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. అయితే టీడీపీ నేత బీసీ జనార్థనరెడ్డి మాత్రం అర్హులైన లబ్దిదారులకు పథకాలు అందకుండా అడ్డుకుంటూ ప్రజా వ్యతిరేకిగా ముద్ర వేయించుకున్నాడు. -
శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు
-
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొక్కుబడిగా చంద్రబాబు పర్యటన
-
ఈయనేనా మాజీ సీఎం.. చంద్రబాబును పట్టించుకోని జనం
సాక్షి, పగిడ్యాల(నంద్యాల జిల్లా): ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన మొక్కుబడిగా సాగింది. ముచ్చుమర్రిలో నిశ్శబ్ద వాతావరణంలో పర్యటన సాగగా, స్వాగతం పలికేందుకు నాయకులు కరువయ్యారు. ఎప్పటిలాగే బూటక మాటలు చెప్పి చంద్రబాబు వెళ్లిపోయారు. నందికొట్కూరులో రోడ్షోను ముగించుకుని ప్రత్యేక కాన్వాయ్లో మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన ముచ్చుమర్రికి చేరుకున్నారు. అయితే చంద్ర బాబుకు జనసంచారం లేని నిర్మానుష్యమైన దారులు మాత్రమే స్వాగతం పలికాయి. సుమారు కిలోమీటరు దూరం ఊరిలో ఓపెన్ టాపు వాహనంలో చంద్రబాబు కనిపించినా స్థానికులు ఎవరూ ఆయనను పట్టించుకోకపోవడం గమనార్హం. స్థానిక నాయకత్వ లోపం కొట్టొచ్చినట్లు కనిపించడంతో బాబు ప్రాజెక్టు సందర్శన కేవలం 25 నిముషాల్లోనే ముగిసింది. ఇలా వచ్చి, అలా వెళ్లడం చూసి ఈయనేనా మాజీ ముఖ్యమంత్రి అనే చర్చ కొనసాగింది. చదవండి: తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారు? -
పొలంలో దొరికిన వజ్రం .. రూ.25 లక్షలకు కొన్న వ్యాపారి?
పత్తికొండ: కర్నూలు జిల్లాలో ఓ మహిళ పంట పండింది. తుగ్గలి మండలం జొన్నగిరి పొలాల్లో ఇటీవల ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తికి తేనె రంగు వజ్రం లభించిందని ప్రచారం జరిగింది. ఈ వజ్రాన్ని స్థానిక వ్యాపారి రూ.25 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అదే రోజు మరో రెండు వజ్రాలు లభ్యమైనట్లు సమాచారం. మద్దికెర మండలం మదనంతపురం వాసి పొలంలో కలుపు తీస్తుండగా శనివారం వజ్రం దొరికినట్లు ప్రచారం సాగుతోంది. మహిళా రైతు శనివారం పొలంలో కలుపు మొక్కలు తీసే పనుల్లో ఉన్నారు. ముందు రోజు రాత్రి వర్షం కురవడంతో తళతళ మెరిసే రాయి కనిపించింది. వెంటనే ఆ రాయిని తీసుకెళ్లి పెరవళిలో ఓ వ్యాపారికి చూపించగా.. వెంటనే రూ.14 లక్షలు డబ్బులు.. 2 తులాలు బంగారం ఇచ్చి ఆ వజ్రాన్ని వ్యాపారి సొంతం చేసుకున్నట్లు తెలిసింది. అంటే దాదాపు రూ.15 లక్షల వరకు రాగా.. ఒక్క రోజులో ఆమె లక్షాధికారి అయ్యారు. తొలకరి వర్షాలు కురవగానే కర్నూలుతో పాటుగా అనంతపురం జిల్లాల్లోని గ్రామాల్లో వజ్రాల వేట ప్రారంభమవుతుంది. భూమిలో నుంచి వజ్రాలు బయట పడతాయని ప్రచారం ఉంది. దీంతో గ్రామాల్లో జనాలు పొలాలకు వెళతారు.. వజ్రాల కోసం గాలిస్తుంటారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి, తుగ్గలి, పగిడిరాయి, ఎర్రగుడి, ఉప్పర్లపల్లి.. అలాగే మద్దికెర మండలం వజ్రాల బసినేపల్లి, పెరవళి, మదనంతాపురంలలో వజ్రాలు దొరుకుతాయనే ప్రచారం ఉంది. ఈ వజ్రాల కోసం కర్నూలు జిల్లాల వాళ్లే కాదు ఆ పొరుగు ఉండే జిల్లాల్లు, రాష్ట్రాల నుంచి వస్తుంటారు. పొలాల్లో తిరుగుతూ వజ్రాల వేటలో ఉంటారు. వజ్రాలు దొరికితే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడుతుంటారు. ఒకవేళ వజ్రం దొరికితే.. బరువు, రంగు, రకాన్ని బట్టి క్యారెట్లలో లెక్కకట్టి డబ్బులు చెల్లిస్తారు. ఈ వ్యాపారం అధికారికంగా జరగదనే చర్చ ఉంది. గత నెలలో మద్దికెర మండలం వజ్రాల బసినేపల్లిలో ఓ వ్యక్తికి రూ.2 కోట్ల విలువైన వజ్రం దొరికిందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. -
మరోసారి పెద్ద మనస్సు చాటుకున్న సీఎం జగన్.. కీలక ఆదేశాలు
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండలో గురువారం వైఎస్సార్ రైతు భరోసా పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి బాధితులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. బాధితుల సమస్యలను ఓపిగ్గా విని రాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందచేయాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శుక్రవారం 9 మంది బాధితుల కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ డా.జి. సృజన తన కార్యాలయంలో ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందచేశారు. ఆర్థిక సహాయం అందుకున్న వారు.. K.సావిత్రి భర్త వెంకట్రాముడు 1. పత్తికొండ మండలం పత్తికొండ గ్రామానికి చెందిన కె.సావిత్రికి ఎనిమిది నెలల నుంచి గుండె, ఊపిరితిత్తుల సమస్య ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుట తన సమస్యను విన్నవించుకున్నారు. T. నరసింహులు 2. కౌతాళ మండలం తోవి గ్రామం చెందిన టి నరసింహులు తను పేదరికంతో ఉన్నానని, కుమారునికి అనారోగ్య కారణంగా వైద్యం చేయించేందుకు ఆర్థిక సాయం అందజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేశారు. మెహరున్నీసా 3. కర్నూలు నగరానికి చెందిన మెహరున్నీసా తన కుమార్తెకు కిడ్నీ సమస్య ఉందని, అలాగే తన కుమార్తె చదువుకు ఆర్థిక సహాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి తన సమస్యను విన్నవించుకున్నారు. దిలీప్ కుమార్ రెడ్డి 4.మద్దికెర మండలం, గురజాల గ్రామం చెందిన పి. దిలీప్ కుమార్ రెడ్డి తాను తలసేమియా వ్యాధితో బాధపడుతున్నానని, నెలకు రెండుసార్లు రక్తం ఎక్కించుకోవలసి వస్తుందని,. ఆపరేషన్ చేయించుకునేందుకు ఆర్థిక సోమత లేక ఇబ్బందులు పడుతున్నానని తనను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు విన్నవించుకున్నారు. బోయ నరసింహులు 5. నందవరం మండలం, సోమల గూడూరు గ్రామం చెందిన బోయ నర్సింహులు తనకు కుడి కాలు, కుడి చేయి పని చేయడం లేదని, తనకు ఆర్థిక సహాయం అందజేయాలని ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు. K.రంగమ్మ 6. పత్తికొండ మండలం, నక్కల దొడ్డి గ్రామానికి చెందిన కె.రంగమ్మ వికలాంగత్వంతో ఉన్న తన కుమార్తెకు ఆర్థిక సహాయం చేయాలని సీఎం జగన్కు విన్నవించుకున్నారు. P. ఈరన్న సోదరుడు 7.ఆలూరు మండలం, కోటవీధికి చెందిన పి. చిదానందం తన కుమారుడు ఈరన్నకు కడుపునొప్పి సమస్య ఉందని, ఆర్థిక సహాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు. కురువ లక్ష్మి 8. ఆదోని మండలం, ఆదోని గ్రామానికి చెందిన కురవ లక్ష్మి తన కుమార్తెలు ఇరువురికి సరిగా చూపు కనపడక అందత్వంతో బాధపడుతున్నారని సీఎం జగన్కు విన్నవించుకున్నారు. L.మహేష్ 9. పత్తికొండ మండలం, పత్తికొండ గ్రామం ఎల్ మహేష్ తన కుమార్తె మూగ మరియు చెవిటి బాధతో ఇబ్బంది పడుతుందని తనను ఆదుకోవాలని వారు ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు. తమ సమస్యలను విని మానవతా దృక్పథంతో ఇంత తొందరగా ఆర్థిక సహాయం అందజేయడంపై రాష్ట్ర ముఖ్యమంత్రికి, జిల్లా కలెక్టర్కు బాధితులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పాల్గొన్నారు. -
బటన్ నొక్కి వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ నిధులు జమ చేసిన సీఎం వైఎస్ జగన్
-
మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన ప్రతీ హామీ నిలబెట్టుకున్నాం