ఓ మనిషీ.. తిరిగిచూడు | Humanity faded World | Sakshi
Sakshi News home page

ఓ మనిషీ.. తిరిగిచూడు

Published Wed, Dec 30 2015 2:05 AM | Last Updated on Sun, Sep 3 2017 2:46 PM

ఓ మనిషీ..  తిరిగిచూడు

ఓ మనిషీ.. తిరిగిచూడు

ఉరుకులు.. పరుగుల నగర జీవనంలో.. తోటి మనిషికి ఏ ఆపదొచ్చినా.. పట్టించుకునే ఓపిక.. సాయపడాలనే తాపత్రయం అరుదు. సృష్టిలోనే జ్ఞాన సంపన్నుడైన మనిషే.. తోటివారు చచ్చినా చలించని కాలమిది. మానవత్వం మరుగైపోతున్న  ప్రపంచమిది. అలాంటిది వాహనం ఢీకొన్న లేగదూడ కోసం ఏ జ్ఞానంలేని పశువులు మూడు గంటల పాటు రోడ్డుపై మూగగా రోదించాయి.

దూడ దగ్గరికొచ్చిన వారిపై తిరగబడి రక్షణగా నిలిచాయి. వాహనాలనూ అడ్డుకున్నాయి. ముఖ్యంగా తల్లి పశువు ఆవేదన చూపరులను కలచివేసింది.   ఈ ఘటన తిరుపతిలోని టౌన్‌క్లబ్-అలిపిరి మార్గంలో మంగళవారం చోటు చేసుకుంది.
 ఫొటోలు: కె.మాధవరెడ్డి, తిరుపతి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement