CATTLE
-
‘పశువధ ఫ్యాక్టరీని మూయించేవరకూ పోరాటం ఆగదు’
తణుకు(ప.గో. జిల్లా): తేతలిలో పశువధ ఫ్యాక్టరీని మూయించేవరకూ ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తామన్నారు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు. తణుకు వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఈరోజు(శనివారం) మీడియాతో మాట్లాడిన కారుమూరి.. పశువధ కర్మాగారం మూయించటానికి తన ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.రోజుకి నాలుగు వందల పశువులను వధించటానికి ఇలాంటి పరిశ్రమ ఇరవై ఎకరాల్లో ఉండాలని, కానీ కేవలం మూడెకరాల్లో జనావాసాల మధ్య నడుపుతుంటే ఎందుకు అడ్డకోరని ప్రశ్నించారు. ఇక్కడ ఎమ్మెల్యే ప్రలోభాలకు లొంగిపోయి కొంతమందికి తొత్తులా వ్యవహరిస్తున్నాడని కారుమూరి మండిపడ్డారు. అసలు అనుమతులు లేని ఫ్యాకరీకి పోలీసులు ఎలా కాపలా కాస్తారని ప్రశ్నించారు.‘పంచాయితీ తీర్మానం లేదు.. నో అబ్జక్షన్ సర్టిఫికేట్ లేదు అయినా అధికారులు ఎందుకు ముందుకు రారు..?, పచ్చటి తణుకును వాయు కాలుష్యం నీరు కాలుష్యం కమ్మేస్తుంటే అధికారులకు పట్టదా ....?, అక్కడ ప్రజలు ముక్కులు బద్దలయ్యే వాసనతో రోదిస్తుంటే 144 సెక్షన్ పెట్టి పోలీస్లను పెట్టి వారి నోళ్లు నొక్కేస్తారా....?, గోస్థానం నుండి పుట్టిన గొస్తానీ నదిని గోవు రక్తంతో కలుషితం చేస్తారా?, శాంతియుతంగా ప్రజలు దీక్ష చేస్తుంటే పోలీస్లు గూండాల వ్యవహరించి టెంట్లు పీకేస్తారా?, ఎక్కడో యూపీ మనిషికి కొమ్ము కాస్తారా?, ఇక్కడ లక్షల మంది ప్రజల గోడు పట్టదా? అని నిలదీశారు.తణుకు నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.. రానున్న రోజుల్లో పోరాటానికి సిద్ధం కావాలి. ఇది మంచిది కాదు.. ఇలాంటింటి ప్రకృతి విరుద్ధమైన పరిశ్రమ ఇక్కడ ఉండకూడదు. పశువులను తరలిస్తునప్న వాహనాన్ని ఒక్క పోలీస్ కూడా ఆపి చెక్ చేయడం లేదు. పాలు ఇవ్వని ఒట్టిపోయిన పశువుగా వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్లు లేకుండా పాడి పశువుల్ని వధిస్తుంటే కళ్లప్పగించి చూస్తారా?, నా హయాంలో ఒక్క పశువుని కూడా వధించకుండా కాపాడుకున్నాను. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యేకు అంత దమ్ము లేదు.. అతనికి డబ్బే ముఖ్యం. ప్రజలు సమస్యలు పట్టవు.. ప్రజలు ఏమైపోయినా పర్లేదు’ అని కారుమూరి ధ్వజమెత్తారు. -
పశువులు, కోళ్ల వైద్యానికి ప్రామాణిక మార్గదర్శకాలు
పశువులు, కోళ్ల వైద్యానికి సంబందించి సరికొత్తప్రామాణిక మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రంయాంటీబయాటిక్ తదితర ఔషధాల వినియోగాన్ని తగ్గించటం, దుర్వినియోగాన్ని అరికట్టే ప్రత్యామ్నాయ చికిత్సలపై దృష్టి సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతుల (ఈవీఎంల)కు పెద్దపీటఈవీఎంలపైప్రాంతీయ భాషల్లో పుస్తకాలు, వీడియోలు ఉచితంగా అందుబాటులోకి తెచ్చిన ఎన్.డి.డి.బి.దేశంలో పశువులు, కోళ్లకు వచ్చే జబ్బులు, ఇన్ఫెక్షన్లకు అందించేప్రామాణిక చికిత్సా పద్ధతులను నిర్దేశిస్తూ కేంద్ర పశు సంవర్థక, పాడి అభివృద్ధి శాఖ సరికొత్త మార్గదర్శకాలను ఇటీవల విడుదల చేసింది. పాడి ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు తదితర పశువులతో పాటు కోళ్ల చికిత్సకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి. నిర్హేతుకంగా యాంటీబయాటిక్స్ తదితర అల్లోపతి ఔషధాల వినియోగాన్ని కట్టడి చేయటంతో పాటు.. ఆరోగ్యదాయకమైన ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతులను విస్తృతంగా వ్యాప్తిలోకి తెచ్చే లక్ష్యంతో కేంద్రం ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యంగా పాడి పశువుల చికిత్సలో చీటికి మాటికి యాంటీబయాటిక్స్ను అతిగా వాడటం, దుర్వినియోగం చేయటం వల్ల పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లు తదితర ఆహారోత్పత్తుల్లో వాటి అవశేషాలు మోతాదుకు మించి మిగిలి΄ోతున్నాయి.పశువైద్యంలో యాంటీబయాటిక్ మందులను అతిగా వాడటం వల్ల సూక్ష్మజీవులు నిరోధకతను సంతరించుకుంటున్నాయి. ఫలితంగా యాంటీబయాటిక్ ఔషధాలు నిరర్థకంగా మారుతున్నాయి. ఇది ప్రజారోగ్యానికి పైకి కనిపించని పెను ముప్పుగా పరిణమిస్తోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ), యుఎస్ఎయిడ్ సంస్థల తోడ్పాటుతో కేంద్ర పశుసంవర్థక మంత్రిత్వ శాఖ 6 నెలల పాటు సుమారు 80 మంది ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని నిపుణులతో చర్చించింది. సరికొత్తప్రామాణిక మార్గదర్శకాలను రూపొందించి ఇటీవలే విడుదల చేసింది. అల్లోపతి ఔషధాలను ఏయే జబ్బులకు ఎంత మోతాదులో వాడాలో మార్గదర్శకాలలో పొందుపరిచారు.ఈవీఎంలకు పెద్ద పీటఅంతేకాకుండా, సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతుల (ఎత్నో వెటరినరీ మెడిసిన్ప్రాక్టీసెస్ – ఈవీఎంల)ను, హోమియో వంటి ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతులకు కూడా ప్రభుత్వం ఈ మార్గదర్శకాల్లో పెద్ద పీట వేయటం విశేషం. సంప్రదాయ ఆయుర్వేద పద్ధతుల్లో రైతులే స్వయంగా తయారు చేసుకొని వాడేందుకు వీలుగా ఉండే చికిత్సా పద్ధతులను కూడా పొందుపరిచారు. ఈ రంగంలో 20 ఏళ్లు కృషి చేసిన తమిళనాడుకు చెందిన ఎమిరిటస్ ప్రొఫెసర్ ఎన్. పుణ్యస్వామి 22 రకాల పశువ్యాధులకు రూపొందించిన ఈవీఎం పద్ధతులకు చోటు కల్పించారు. దేశంలో పాడిపై ఆధారపడిన చిన్న, సన్నకారు రైతులకు అతితక్కువ ఖర్చుతో సమకూరే ఈవీఎం చికిత్సా పద్ధతులు ఉపయోగపడతాయని కేంద్ర పశుసంవర్థక శాఖ కార్యదర్శి అల్క ఉపాధ్యాయ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, హోమియో గురించి ప్రస్తావించినప్పటికీ ఈ చికిత్స పద్ధతుల గురించి మార్గదర్శకాల్లో వివరించలేదు. దేశంలోని నలుమూలల్లోని పశు వైద్యులు, వైద్య సిబ్బంది, సంప్రదాయ వైద్యులు, పశు΄ోషకుల అనుభవాలు, సూచనలతో ప్రతి 2–3 ఏళ్లకోసారి ఈ మార్గదర్శకాలను పరిపుష్టం చేయనుండటం మరో విశేషం.సంప్రదాయ ఆయుర్వేద చికిత్సాపద్ధతులు తమిళనాడుకు చెందిన తంజావూరులోని వెటరినరీ యూనివర్సిటీ పరిశోధనా కేంద్రంలో ‘ఎత్నో–వెటరినరీ హెర్బల్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ యూనిట్’ అధిపతిగా పనిచేసిన ఎమిరిటస్ ప్రొఫెసర్ డా.ఎన్. పుణ్యస్వామి, టిడియు ఎమిరిటస్ప్రొఫెసర్ ఎం.ఎన్. బాలకృష్ణన్ నాయర్ పశువ్యాధులకు సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతుల (ఎత్నో వెటరినరీ మెడిసిన్ప్రాక్టీసెస్– ఈవీఎంల)పై సుదీర్ఘంగా పరిశోధన చేసి ప్రమాణీకరించారు. ముఖ్యమైన 22 రకాల జబ్బులకు (అల్లోపతి మందులు, యాంటీబయాటిక్స్ వాడవసరం లేకుండా) రైతుల ఇళ్లలో ΄ోపు డబ్బాల్లో ఉండే మసాలా దినుసులు, పెరట్లో ఉండే మొక్కలతో ఆయుర్వేద మందుల్ని రైతులే స్వయంగా తయారు చేసుకొని వాడుకోగలిగే పద్ధతులను పొందుపరచిన ఒక చిరు పుస్తకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలతో పాటు అందుబాటులోకి తెచ్చింది. ఆంగ్లం, హిందీ, తెలుగుతో పాటు 12 భాషల్లో ఈ చిరుపుస్తకాల పీడీఎఫ్లను అందుబాటులోకి తెచ్చింది. పశువులకు, ముఖ్యంగా పాడి ఆవులు, గేదెలకు వచ్చే జబ్బులకు ఆయుర్వేద మందులను రైతులు ఇంటి దగ్గరే ఎలా తయారు చేసుకోవాలి? ఎలా వాడాలి? అనేది తెలుగు సహాప్రాంతీయ భాషల్లో రూపొందించిన వీడియోలను జాతీయ పాడి అభివృద్ధి సంస్థ (ఎన్.డి.డి.బి.) యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచారు. ఈ చిరు పుస్తకాల పిడిఎఫ్లను, ఆయుర్వేద మందుల తయారీ, వాడే పద్ధతులు తెలిపే వీడియోలను ఉచితంగానే చూడొచ్చు.. డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాంటీబయాటిక్స్, రసాయనిక ఔషధాల అవశేషాల్లేని ఆరోగ్యదాయకమైన పాలు, మాంసం ఉత్పత్తికి దోహదం చేసే మార్గం ఇది. -
కనుమ విశిష్టత..ఆ రోజు ప్రయాణాలు ఎందుకు చెయ్యరంటే..
సంక్రాంతి తర్వాతి రోజు వచ్చే పండుగ కనుమ. ఈ రోజున పశువులను ఎందుకు పూజిస్తారు?. పైగా ఈ రోజు ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రయాణాలు చెయ్యరు ఎందుకు?. తదితరాల గురించి తెలుసుకుందాం! సంక్రాంతి వేడుకల్లో ఈ మూడవ రోజును పశువులకు కృతజ్ఞతలు తెలపడానికి కేటాయిస్తారు. కాబట్టి ఇది కనుమ పండుగ. నిజానికి వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడువాదోడు ఉన్న పశువులను రైతులు తమ కుటుంబసభ్యులుగా భావిస్తారు. కాబట్టి ఈ కనుమ పండుగను 'పశువుల పండుగ' అని కూడా సంబోధిస్తుంటారు. ముఖ్యంగా పల్లెటూళ్లలో ఈ పండుగను ఎంతో ప్రత్యేకంగా ఓ వేడుకలా జరుపుతుంటారు. ఈ రోజు పశువులను అందంగా అలంకరించి పూజలు చేస్తారు. కొందరైతే కొమ్ములకు ఇత్తడి తొడుగులు, మూపురాల మీద పట్టుబట్టలు, కాళ్లకి గజ్జలు, మెడలో పూలదండలు.. ఇలా చక్కగా అలంకరిస్తారు. పశువులతో పాటూ పక్షులను కూడా ఆదరించే సంప్రదాయం ఉంది. అందుకే ధాన్యపు కంకులను ఇంటి చూర్లకు వేలాడదీస్తారు. వాటికోసం ఇంటి చుట్టూ చేరిన చిన్న చిన్నపిట్టలు, పక్షుల కిలకిలరావాలతో ఆ ప్రాంగణం అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. పంట చేతికందేందుకు సహాయపడిన వారిందరికీ ఈ రోజున కొత్త బట్టలు కూడా పెడతారు. ఇక కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్ర దేశాన ఆనవాయితీగా వస్తోంది. మాంసాహారులు కాని వారు, గారెలతో (మినుములో మాంసకృతులు హెచ్చుగా ఉంటాయి కనుక ఇది శాకాహారులకు మాంసంగా ఉపయోగ పడుతోంది.) సంతృప్తి పడతారు. ఆ రోజు ప్రయాణాలు ఎందుకు చెయ్యరంటే.. సంక్రాంతి అంటే మూడు రోజుల పండుగ. దీంతో ప్రతీ లోగిలి బంధువులతో కళకళాలాడుతూ కన్నుల పండుగగా ఉంటుంది. అందువల్ల ఈ మూడో రోజు ఎవరిళ్లకు వాళ్లు ప్రయాణం కావడం వల్ల చాలా ఆనందాన్ని మిస్ అవుతారనే ఉద్దేశ్యంతో బహుశా కనుమ రోజు ప్రయాణం చేయొద్దని చెబుతుంటారు పెద్దలు. ఈ కారణంతోనే ‘కనుమ రోజు కాకి కూడా కదలదు’ అనే సామెత వచ్చి ఉండొచ్చు. మరికొందరైతే ఇలా పెద్దలు చెప్పారంటే దాని వెనుక ఏదో ఆంతర్యం ఉంటుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. అదీగాక ఈ కనుమ రోజు ఎక్కడికైనా ప్రయాణం చేస్తే వెళ్లిన పని పూర్తికాదని, ఆటంకాలు తప్పవని నమ్మకం కూడా ప్రబలంగా ఉంది. అందువల్లే చాలామంది కనమ రోజున ప్రయాణాలు ఎట్టిపరిస్థితుల్లో చెయ్యరు. (చదవండి: సంక్రాంతి వైభవాన్ని కనుమా!) -
ఆర్బీకేల్లోనూ పశు వైద్యసేవలు
సాక్షి, అమరావతి: మూగ, సన్న జీవాలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను మరింతగా పటిష్టపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో పశువులకు ఏ చిన్న సమస్య వచ్చినా మండల కేంద్రంలో ఉండే పశు వైద్యశాలలు, డిస్పెన్సరీలకు పరుగులెత్తాల్సి వచ్చేది. దీనివల్ల సకాలంలో వైద్యసేవలు పొందలేక పాడి రైతులు పడరాని పాట్లు పడేవారు. గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఆర్బీకేలను రూరల్ లైవ్ స్టాక్ యూనిట్లుగా తీర్చిదిద్దడంతో పాడి రైతుల వెతలకు చెక్ పడింది. రాష్ట్రంలో మొత్తం 10,778 ఆర్బీకేలుండగా.. 7,272 ఆర్బీకేల పరిధిలో పాడి సంపద అధికంగా ఉంది. వీటిలో 4,652 ఆర్బీకేల్లో గ్రామ పశు వైద్య సహాయకులు, మిగిలిన ఆర్బీకేల్లో రూరల్ లైవ్స్టాక్ యూనిట్ల (ఆర్ఎల్యూ) సిబ్బంది సేవలందిస్తున్నారు. రేషనలైజేషన్ అనంతరం 1,896 ఆర్బీకేల పరిధిలో వీఏహెచ్ఏలు అవసరమని గుర్తించగా.. ఆ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రతి ఆర్బీకేలో 105 రకాల మందులు పాడి సంపద ఉన్న ప్రతి ఆర్బీకేలో రూ.10 వేల విలువైన ట్రెవీస్ (ఇనుప చట్రాల)ను ఏర్పాటు చేశారు. కృత్రిమ గర్భోత్పత్తి కోసం పశు వీర్యాన్ని నిల్వ చేసేందుకు వీలుగా రూ.16.90 కోట్ల విలువైన లిక్విడ్ నైట్రోజన్ కంటైనర్లను ఆర్బీకేల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి ఆర్బీకేలో 105 రకాల మందులను అందుబాటులో ఉంచుతున్నారు. మూడేళ్లలో ఆర్బీకేల ద్వారా రూ.24.30 కోట్ల విలువైన మందులను పంపిణీ చేశారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేకంగా రూ.24 కోట్ల విలువైన మందులను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు ఆర్బీకేల ద్వారా పశువులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేస్తున్నారు. జబ్బుపడిన జంతువులకు ప్రథమ చికిత్స అందించడంతో పాటు రైతుల ఇంటి గుమ్మం వద్దనే రోగ నిరోధక టీకాలు వేస్తున్నారు. నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాలు నిర్వస్తున్నారు. ఇనాఫ్ ట్యాగ్లు వేస్తున్నారు. ప్రతి మూగజీవానికి హెల్త్ కార్డులు ఇస్తున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఆర్థిక చేయూత అందిస్తున్నారు. ప్రతి వారం పశువైద్యులు ఆర్బీకేలను సందర్శిస్తూ వీహెచ్ఏల సహాయంతో సేవలందిస్తున్నారు. ప్రతి ఆర్బీకేలో రూరల్ లైవ్ స్టాక్ యూనిట్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఆర్బీకేల ద్వారా నాణ్యమైన సేవలందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రతి ఆర్బీకేను ఓ రూరల్ లైవ్స్టాక్ యూనిట్గా తీర్చిదిద్దాం. మూడేళ్లలో రూ.24.30 కోట్ల విలువైన మందులను పంపిణీ చేస్తే.. ఈ ఏడాది ప్రత్యేకంగా రూ.24 కోట్ల విలువైన మందులను అందుబాటులో ఉంచుతున్నాం. – డాక్టర్ సీదిరి అప్పలరాజు, పశు సంవర్ధక శాఖ మంత్రి -
పశువుల కొనుగోలులో ఒక్క రూపాయి కూడా సబ్సిడీ లేదు
సాక్షి, అమరావతి: జగనన్న పాల వెల్లువ పథకం కింద పశువుల కొనుగోలులో ఎలాంటి అవినీతి, అవకతవకలు జరగలేదని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్ స్పష్టం చేశారు. ఈ పథకంలో లబ్ధిదారులకు ఒక్క రూపాయి కూడా సబ్సిడీ లేదని, అవినీతికి ఆస్కారమే లేదని చెప్పారు. వైఎస్సార్ చేయూత లబ్ధిదారుల్లో ఆసక్తి చూపించిన వారు మాత్రమే స్త్రీ నిధి, ఉన్నతి, బ్యాంక్ రుణాల ద్వారా పాడి పశువులను కొనుగోలు చేశారన్నారు. వీటి కొనుగోలులో ప్రభుత్వం, పశు సంవర్ధక శాఖ ప్రమేయం ఏమాత్రం లేదన్నారు. ఇష్టపూర్వకంగా ముందుకొచ్చిన లబ్ధిదారులు ప్రభుత్వం ఇచ్చిన చేయూత లబ్ధి ద్వారా పొందిన రుణంతో వారికి నచ్చిన పాడి పశువులను నచ్చిన చోట బేరసారాలు సాగించి మరీ కొనుక్కొంటారని చెప్పారు. ఈ విధంగా నాలుగేళ్లలో ఈ పథకం కింద 3.94 లక్షల పాడి పశువుల యూనిట్లు మహిళా లబ్ధిదారులు పొందారన్నారు. పాడి పశువుల కొనుగోలు యూనిట్ రూ.75 వేలుగా నిర్దేశించామన్నారు. వైఎస్సార్ చేయూత లబ్ధి రూ.18,750కి అదనంగా బ్యాంకుల నుంచి రూ.56,250 రుణం రూపంలోనూ లేదా స్త్రీ నిధి, ఉన్నతి పథకాల కింద రుణంగా తీసుకున్నారని చెప్పారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారుని నిర్ణయం మేరకు రైతుల నుంచి నచ్చిన జాతి పశువులను నేరుగా కొన్నారని చెప్పారు. లబ్ధిదారులకు రుణం సమకూర్చడం తప్ప పశువుల కొనుగోలులో ప్రభుత్వ పాత్ర ఏమీ లేదన్నారు. బ్యాంక్ నుంచి పొందిన రుణం చెల్లింపునకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా పొందిన ప్రభుత్వ సాయాన్ని వాయిదాల పద్దతిలో చెల్లించే వెసులుబాటు మాత్రమే ప్రభుత్వం కల్పించిందన్నారు. రుణాన్ని తిరిగి చెల్లించవలసిన భాద్యత లబ్ధిదారులదేనని అన్నారు. అమూల్ పాల సేకరణ కేంద్రాలకు పాలు పోసే లబ్ధిదారులను గుర్తించడం కోసం ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ సర్వే నిర్వహించిందే తప్ప వైఎస్సార్ చేయూత లబ్ధిదారులను గుర్తించడానికి కాదన్నారు. సాధారణంగా పాడి రైతులు వారి అవసరాలను బట్టి పశువులను కొనడం, అమ్మడం చేస్తుంటారన్నారు. ఈ పథకం లబ్ధిదారుల్లో ఎక్కువ మంది రాష్ట్ర పరిధిలోని రైతుల నుంచి, అతి కొద్ది మంది మాత్రమే పొరుగు రాష్ట్రాల రైతుల నుంచి వారికి నచ్చిన పశువులను కొన్నారని తెలిపారు. ఈ కారణంగా పాడి సంపద పెరగదని, అలాంటప్పుడు స్థూల పాల దిగుబడులలో పెరుగుదల ఎందుకు ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం నుండి అందించే లబ్ధిదారుని వాటా, స్త్రీనిధి, ఉన్నతి లేదా బ్యాంక్ రుణాలు నేరుగా లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాకు జమ అవుతాయని, ఆ డబ్బుతోనే లబ్ధిదారులు పాడి పశువులను కొంటున్నారని తెలిపారు. అవినీతికి ఆస్కారం లేని రీతిలో పూర్తి పారదర్శకతతో ఈ ప«థకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ‘పాడి పశువుల కొనుగోలులో రూ.2,887 కోట్లు తినేశారు’ అంటూ ఈనాడులో ప్రచురితమైన కథనంలో అన్నీ అవాస్తవాలేనని ఆయన స్పష్టం చేశారు. -
పశువులకు అలాంటి గడ్డి వేస్తున్నారా? కాల్షియం లోపం వస్తుంది!
‘మేపు లోనే సేపు’ అని నానుడి. పాడి పశువుల్లో పాల ఉత్పత్తి పూర్తి సామర్ధ్యం పొందాలంటే మేలైన, నాణ్యమైన పశుగ్రాసాలను పచ్చిమేతగా అందించాలి. దాణా కన్నా పచ్చని పశుగ్రాసాలను మేతగా అందిస్తే అధిక పాల దిగుబడి సాధించడంతో పాటు పాడి పశువుల్లో రోగ నిరోధక శక్తిని పెంచినవారమవుతాం. పాడి పరిశ్రమ లాభసాటి కావాలంటే ఖర్చు తగ్గాలి. ఇది తగ్గాలంటే మేలు జాతి పశుగ్రాసాలను పశువులకు మేతగా అందించాలి. దీనితో 40–50 శాతం ఖర్చు తగ్గటంతో పాటు పాల దిగుబడి 20 శాతం పెరుగుతోంది. రైతులు పశుగ్రాసాల్లో ఏదో ఒకటి లేదా రెండు రకాలను పెంచి పాడి పశువులకు మేపుతుంటారు. అలా కాకుండా కొన్ని రకాల పశుగ్రాసాలను పెంచి పశువులకు క్రమపద్ధతిలో మేపితే మరింత మేలు జరుగుతోంది. ఈ విధానాన్ని అమలాపురం ఏరియా పశు వైద్యశాల అధికారులు ప్రయోగాత్మకంగా అమలు చేసి చూపిస్తున్నారు. ఏరియా పశు వైద్యశాల వెనుక నిరుపయోగంగా ఉన్న స్థలాన్ని చదును చేసి పదిహేను సెంట్ల స్థలంలో పది రకాల పశుగ్రాసాలను పెంచుతున్నారు. పశు సంవర్థక శాఖ సహాయ సంచాలకులు ఎల్.విజయ్రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనా క్షేత్రంలో సూపర్ నేపియర్, గిని గడ్డి, కనుమ గడ్డి, రెడ్ నేపియర్, గిని గ్రాస్, మోని, చంగల్ గడ్డి, బొబ్బర గడ్డి, సీవో4, సీవో 5 రకాల గడ్డిని పెంచుతున్నారు. ఔత్సాహికులైన పాడి రైతులకు పశుగ్రాసాల పెంపక విధానాన్ని వివరిస్తున్నారు. ప్రతి గడ్డిలో వైవిధ్యభరితమైన పోషకాలు ఉండటంతో అన్ని రకాలు మేపితే మంచి ఫలితాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. కేవలం పేరా గ్రాస్ (ఇంగ్లీష్ గడ్డి) మాత్రమే మేపితే పశువుల్లో కాల్షియం లోపించే అవకాశముంది. చెంగల్ గడ్డి ‘రాగి సంగటి’తో సమానం. సూపర్ నేపియర్ ఐదేళ్లు పాటు మేత అందుతోంది. కాండం మెత్తగా ఉండడంతో పాటు ఇందులో అధిక పోషకాలుంటాయి. రెడ్ నేపియర్లో ప్రోటీన్, గినీ గడ్డిలో శక్తినిచ్చే పోషకాలు ఎక్కువ. వీటిని కలిపి అందించడం వల్ల అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా అందుతాయి. దీని వల్ల పాల దిగుబడి పెరగడంతో పాటు పశువులు బలంగా ఉంటాయి. శాస్త్రీయ పద్ధతిలో పశు పోషణలో భాగంగా వివిధ పోషకాలున్న పశుగ్రాసాలను పరిచయం చేయటంతో పాటు వివిధ రకాల నేలలకు అనువైన పశుగ్రాసాల రకాల పెంపకంపై శిక్షణ ఇస్తున్నారు. గడ్డి విత్తనాలు, కనుపులను ఉచితంగా అందజేస్తున్నారు. రైతులతో పాటు వెటర్నరీ విద్యార్థులకూ అవగాహన కల్పిస్తున్నారు. పదిహేను సెంట్లలో ఏడాదికి సగటున 2.5 టన్నుల పశు గ్రాసాన్ని రైతులు పొందనున్నారు. ఒక ఎకరం భూమిలో ఈ విధంగా పశుగ్రాసాలు పెంచితే 5 నుంచి 6 పాడి పశువులకు ఏడాది పొడవునా మేత అందించవచ్చు. వీటితో పాటు కలబంద, నల్లేరు, పసుపు, రణపాల, తులసి, తిప్పతీగ, ఇన్సులిన్ మొక్క వంటి ఔషధ మొక్కలను కూడా పెంచుతూ, సంప్రదాయ వైద్యంలో వాటి ఉపయోగాల గురించి రైతులకు తెలియజేస్తున్నారు. ఒకటికి పది రకాల పశుగ్రాసాల పెంపకం వల్ల పాడి రైతుల ఆదాయం పెరుగుతోందంటున్నారు విజయ్రెడ్డి (98663 27067). – నిమ్మకాయల సతీష్ బాబు, సాక్షి, అమలాపురం 13 నుంచి సింహపురి సేంద్రియ మేళా గో–ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, సింహపురి సేంద్రియ వ్యవసాయదారుల సంఘం, మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి 15 వరకు నెల్లూరులోని వి.ఆర్ కాలేజి గ్రౌండ్స్లో సేంద్రియ ఉత్పత్తులతో పాటు చేపలు, రొయ్యలు, పీతల ప్రదర్శన–అమ్మకం మేళా జరగనుంది. ఇతర వివరాలకు.. 81436 32488. 15,16 తేదీల్లో సేంద్రియ సేద్యంపై శిక్షణ ఆదిగురు భారత్ ఫౌండేషన్ అధ్వర్యంలో జనగాంలోని బానపురంలో గో΄ాల్ గోశాలలో ఈ నెల 15, 16 తేదీల్లో సేంద్రియ, గోఆధారిత వ్యవసాయంపై శిక్షణ ఉంటుంది. ద్రావణాలు, కషాయాలు, గానుగ నునెలు, నెయ్యి, ధూప్ స్టిక్లు తదితర ఉత్పత్తుల తయారీపై నిపుణులు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 70953 14226. -
గ్రామ సర్పంచ్ వింత నిబంధన.. అతిక్రమిస్తే ఐదు చెప్పు దెబ్బలు..
భోపాల్: మధ్యప్రదేశ్లో ఓ గ్రామ సర్పంచ్ వింత నిబంధన వివాదాస్పదంగా మారింది. గ్రామంలో పశువులు యధేచ్చగా సంచరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలిపాడు. ఆయా పశువుల యజమానికి ఐదు చెప్పు దెబ్బల దండన విధిస్తామని హెచ్చరించాడు. అంతే కాకుండా రూ.500 జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించాడు. ఈ నిబంధనపై గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. అధికారులకు ఫిర్యాదు చేశారు. షాహదోల్ జిల్లా నగ్నాదుయ్ గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామంలో రోడ్లపై పశువులను యధేచ్చగా వదిలేస్తున్నారని గమనించిన సర్పంచ్.. వాటి యజమానుల బాధ్యతారాహిత్యంపై మండిపడ్డాడు. పలుమార్లు హెచ్చరించినా ప్రయోజనం లేకపోవడంతో ఇక చెప్పు దెబ్బలతో దండన విధిస్తామని దండోరా వేయించాడు. గ్రామ పంచాయతీ అధికారులు ఇంటింటికీ వెళ్లి నిబంధనలను వివరించారు. ఈ వీడియోను గ్రామస్థులు అధికారులకు చూపించి, ఫిర్యాదు చేశారు. ఇదేం వింత నిబంధన, వెంటనే తొలగించాలని అధికారులకు మొరపెట్టుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఇదీ చదవండి: ఉచితంగా టమాటాలు.. ఆటోవాలా సరికొత్త ఆఫర్.. కానీ.. -
పాల దిగుబడిపై వడ‘దెబ్బ’
నరసాపురం రూరల్: వేసవిలో పాడిపశువుల సంరక్షణపై రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు. వేసవిలో పశువులకు వడదెబ్బ తగిలితే పాల దిగుబడి తగ్గడమే కాక పశువులు ఎదకు వచ్చే పరిస్థితులు కనిపించవని, అంతేకాక పశువు చూడుకట్టే అవకాశం ఉండదని పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వై.సుధాకర్ చెబుతున్నారు. వేసవిలో పశువులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పశువుల్లో సోకే వ్యాధులను ఆయన వివరించారు. వేసవిలో గేదెలు, ఆవులపై సరైన శ్రద్ధ తీసుకోనట్లయితే వడదెబ్బకు గురై ఒక్కొక్కసారి పశువు ప్రాణాలను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తలు ఇవే వేసవిలో పశువులు తాగే నీరు స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంచాలి. వేసవిలో సహజంగానే నీటి వనరులు తగ్గి నిల్వ ఉండే నీరు మురికిగా, ఆకుపచ్చగా మారతాయి. పశువులు ఈ కలుషితమైన నీరు తాగితే వ్యాధికారక క్రిములు శరీరంలోకి చేరి పారుడు వ్యాధులు కలుగుతాయి. కాబట్టి పశువులు తాగేందుకు స్వచ్ఛమైన నీటిని ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. లేదంటే రోజులో కనీసం మూడుసార్లు నీటిని అందించడం అవసరం, ఆరుబయట తొట్టెల్లో పగలు నిల్వ ఉన్న నీరు వెచ్చగా మారతాయి. నీడ ప్రాంతంలో నిల్వ ఉంచిన చల్లటి నీటినే పశువులకు తాగించాలి. ఆవులతో పోలిస్తే గేదెలు ఎక్కువ నీటిని తాగుతాయి. వాతావరణ ఉష్ణోగ్రత, గాలిలో తేమ, పశువు వయస్సు తదితరాలనుబట్టి రోజుకు సుమారుగా 28 లీటర్ల నీరు అవసరమవుతాయి. పాలిచ్చే పశువులు అదనంగా ప్రతి లీటరు పాల దిగుబడికి నాలుగు లీటర్ల చొప్పున నీటిని తాగుతాయి. ఇది కాకుండా పశువులను శుభ్రపరిచేందుకు, షెడ్లలో నేలను శుభ్రపరిచేందుకు ప్రతి పశువుకు 110 లీటర్ల నీరు అవసరం పడుతుంది. వడదెబ్బ తగలకుండా.. పశువులకు వడదెబ్బ తగలకుండా ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పశువుల పాక చుట్టూ పాత గోనెలు కట్టి వాటిని అప్పుడప్పుడు తడుపుతూ ఉండాలి. పైకప్పును కొబ్బరి ఆకులతో గానీ, ఎండి వరిగడ్డితో గాని కప్పాలి. మంచినీరు ఎల్లప్పుడు అందుబాటులో ఉండేట్లు చూడాలి. పశువులను ఉదయం, సాయంత్రం మాత్రమే అంటే చల్లని వాతావరణంలోనే మేత మేసేందుకు విప్పాలి. పశువులు ఎక్కువగా ఎండలో తిరగకుండా చూడాలి. వీలైనంత పచ్చని మేతను ఇవ్వాలి. సంకర జాతి ఆవులైతే పంకాలు ఏర్పాటు చేయాలి. వడదెబ్బకు గురైతే లక్షణాలు ఇలా.. వడదెబ్బకు గురైన పశువు లక్షణాలను పరిశీలిస్తే శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల నుంచి 108 డిగ్రీల వరకు పెరుగుతుంది. పశువులు నడిచేటప్పుడు తూలుతాయి. శ్వాసక్రియ ఎక్కువగా ఉంటుంది. పశువు చాలా నీరసంగా కనబడుతుంది. ఒక్కొక్కసారి కింద పడి కొట్టుకుని స్పృహకోల్పోతాయి. పశువు నీటి కొరకు చూస్తుంటుంది. పశువు చర్మం ఎండిపోయినట్లు ఉంటుంది. పశువులో పాల ఉత్పత్తి కొల్పోతుంది. ఇటువంటి లక్షణాలు ఉంటే వడదెబ్బ తగిలిందని రైతు గ్రహించాలి. చేయాల్సిన చికిత్స ఇదే వడదెబ్బ తగిలిన పశువును రైతులు గుర్తించిన వెంటనే చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. గుడ్డతో ఐస్ చుట్టి పశువు నుదుటిపై నొత్తాలి. కొద్ది ఊరట కలిగిన తరువాత దగ్గరలోని పశు వైద్యుడిని సంప్రదించి సైలెన్లు పెట్టాలి. ఒక్క సారి వడదెబ్బ తగిలిన పశువుకు బతికినంత కా లం పాలదిగుబడి గతంలో మాదిరిగా ఉండదు. జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ వై సుధాకర్, పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకులు -
యూపీలో ఆవు దొంగతనం.. అర్థరాత్రి కారులో వచ్చి.. వైరలవుతున్న వీడియో
-
విషపునీరు తాగి 43 పశువులు మృతి
నాంపల్లి: నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం మేళ్లవాయిలో పురుగుమందు కలిసిన నీరు తాగి శుక్రవారం వరకు 30 పశువులు చనిపోగా శనివారం వాటి సంఖ్య 43కు చేరింది. నేరడుకొమ్ము మండలం కాచరాజుపల్లికి చెందిన కృష్ణయ్య, బుచ్చయ్య సోదరులకు పశువుల పెంపకమే జీవనాధారం. తమ ప్రాంతంలో పశుగ్రాసం దొరకని సమయాల్లో మందను ఇతర ప్రాంతాలకు తోలుకుని వెళ్తుంటారు. ఇదే క్రమంలో సోదరులిద్దరితోపాటు మరో ఎనిమిది మంది 250 పశువుల మందను మేపుకుంటూ నాలుగు రోజుల క్రితం నాంపల్లి మండలం మేళ్లవాయి గ్రామానికి వచ్చారు. అక్కడ పొలాల్లోంచి వదిలిన పురుగుమందున్న నీటిని తాగిన కొన్ని పశువులు మృత్యువాతపడుతున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలోనే 43 పశువులు మృతిచెందడంతో స్థానిక పశువైద్యాధికారుల సమాచారం మేరకు జేడీ యాదగిరి, ఏడీ విశ్వేశ్వర్రావు, ఇతర అధికారులు శనివారం మేళ్లవాయి గ్రామాన్ని సందర్శించారు. ఆ పశువుల శాంపిల్స్ను సేకరించి హైదరాబాద్ ల్యాబ్కు పంపారు. అయితే, పశువులకు ఎలాంటి వ్యాధులు సోకలేదని, క్రిమిసంహారక నీటిని తాగడంతోనే మృతి చెందాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. ‘పశువులను మేపుకుని జీవనం సాగిస్తున్నాం. పశువుల మృతితో రూ.లక్షల నష్టం వాటిల్లింది. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలి’అని పశువుల కాపరులు నేతాళ్ల కృష్ణయ్య, లింగమ్మ కోరారు. -
ఇంటి కుళాయికి బిరడా
మంగపేట: రోడ్డువెంట మొక్కల్ని పశువులు ధ్వంసం చేస్తున్నాయంటూ పశువుల కాపరికి రూ.7,500 జరిమానా విధించిన అధికారులు.. తాజాగా సదరు కాపరి ఇంటి కుళాయికి బిరడా బిగించడం వివాదాస్పదమైంది. ములుగు జిల్లా మంగపేటలో అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలను పశువులు ధ్వంసం చేయడానికి కారకుడంటూ పశువుల కాపరి గంపోనిగూడెంకు చెందిన బోయిన యాకయ్యకు పంచాయతీ అధికారులు రూ.7500 జరిమానా విధించడం తెలిసిందే. తాజాగా యాకయ్య ఇంటి కుళాయి (నల్లా)ను సైతం పంచాయతీ అధికారులు సీజ్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బుధవారం కలెక్టర్ కృష్ణ ఆదిత్య వాహనానికి పశువులు అడ్డం వచ్చాయి. ఎంత హారన్ కొట్టినా వాటిని పక్కకు అదిలించకుండా పశువుల కాపరి యాకయ్య ఫోన్ మాట్లాడుతుండడంతో కలెక్టర్ అసహనానికి గురయ్యారు. దీంతో తన గన్మెన్ను పంపి కాపరి ఫోన్ను లాక్కున్నట్టు స్థానికులు చెబుతున్నారు. దీనికి పశువులు మొక్కలను ధ్వంసం చేస్తున్నాయన్న సాకుతో జరిమానా విధించినట్లు చెబుతున్నారు. నల్లాకు బిరడా బిగింపుపై పశువుల కాపరి యాకయ్య మాట్లాడుతూ రూ.7,500 జరిమానాను మూడు నెలల్లో చెల్లించాలని చెప్పి ఫోన్ ఇచ్చారని తెలిపాడు. ఇంటికి వచ్చి చూడగా పంచాయతీ సిబ్బంది తన ఇంటి నల్లాకు బిరడా వేసి సీజ్ చేశారని పేర్కొన్నాడు. సాయంత్రం ఎంపీడీవో ఫోన్ చేసి నల్లా బిరడా తొలగించుకోమన్నారని, తనకు తెలియదని చెబి తే.. పంచాయతీ సిబ్బంది వచ్చి తొలగించి వెళ్లారని వివరించాడు. తనకు విధించిన జరిమానాపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశాడు. నిర్లక్ష్యానికే జరిమానా: ఎంపీడీవో మండలంలోని ఏటూరునాగారం–బూర్గంపాడు ప్రధాన రోడ్డుకిరువైపులా నాటిన అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలను పశువులు ధ్వంసం చేస్తున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినందుకే పశువుల కాపరికి పంచాయతీరాజ్ చట్టం ప్రకారం జరిమానా విధించామని ఎంపీడీవో శ్రీధర్ ఓ వీడియోలో వివ రణ ఇచ్చారు. ఈ వీడియో సామాజిక మాధ్యమా ల్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై వివరణ కోరేందుకు ఎంపీడీవోకు ఫోన్ చేయగా స్విచాఫ్ అని వస్తోంది. -
ప్రభవించిన పుంగనూరు
పలమనేరు పశు పరిశోధన కేంద్రంలో ఉత్పత్తి చేస్తున్న పుంగనూరు జాతి ఆవు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు–2022కు ఎంపికైంది. ఈ నెల 23న కిసాన్ దివస్ సందర్భంగా హరియాణాలోని కర్నాల్లోగల జాతీయ జన్యు వనరుల కేంద్రం(యానిమల్ జెనటిక్ రిసోర్స్ సెంటర్)లో ఈ అవార్డును అందించనున్నారు. దీనికి సంబంధించిన సమాచారం రిసోర్స్ సెంటర్ చీఫ్ సైంటిస్ట్ ఏకే మిశ్రా నుంచి ఇప్పటికే అందిందని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ వీసీ డా.పద్మనాభరెడ్డి చెప్పారు. ప్రపంచంలోనే అరుదైన రకం పశువులుగా పుంగనూరు పొట్టి పశువులకు పేరుంది. వీటి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో వీటిని మరింత ఉత్పత్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్కేవీవై ద్వారా కృషిచేస్తోంది. ఇందులో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ నిధుల ద్వారా పలమనేరు పశు పరిశోధన కేంద్రంలో ఐవీఎఫ్ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ కృత్రిమ పిండోత్పత్తి ద్వారా పుంగనూరు జాతి పశువులను ఎక్కువగా ఉత్పత్తి చేసే అవకాశం ఏర్పడింది. – పలమనేరు పొట్టి పశువుల పరిశోధన కేంద్రం లక్ష్యం ఇదీ పలమనేరు సమీపంలోని క్యాటిల్ఫామ్ వద్ద 1953లో సంకర జాతి ఆవుల ఉత్పత్తి, పరిశోధన కేంద్రంగా ఈ పశు పరిశోధన సంస్థ ప్రారంభమైంది. 1995 నుంచి పుంగనూరు పొట్టి రకం పశువుల ఉత్పత్తి కేంద్రంగా మారింది. 20 పొట్టి రకం పశువులతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు.. 268 పశువులు వరకూ చేరింది. అయితే నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా వీటి సంఖ్యను పెంచాలని ప్రభుత్వం సంకల్పించింది. దీంతో స్థానిక పరిశోధన కేంద్రంలో ఆర్కేవీవై, ఐకార్ నిధులు రూ.2.85 కోట్లతో పిండమార్పిడి కేంద్రాన్ని(ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ల్యాబ్), ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్)ల్యాబ్ను ఏర్పాటు చేశారు. గతంలో పుంగనూరు జాతి ఎద్దు నుంచి సెమన్ను తీసి ఎదకొచ్చిన ఆవుకు ఇచ్చేవారు. దీంతో ఆవుకు ఓ దూడ మాత్రమే పుట్టేది. అయితే ఐవీఎఫ్ ద్వారా ఎద్దు సెమన్ నుంచి ఎక్కువ కణాలను తీసుకుని సరోగసి పద్ధతిలో ఎదకొచ్చిన ఎక్కువ ఆవులకు ఇంప్లాంట్ చేస్తారు. దీంతో ఒకే ఏడాదిలో ఈ జాతి పశువులను ఎక్కువ ఉత్పత్తి చేసేందుకు వీలవుతుంది. ఈ విధానం ద్వారా ఏటా వందల సంఖ్యలో పొట్టి రకం పశువుల ఉత్పత్తి జరగనుంది. వచ్చే ఐదేళ్లలో వీటి సంఖ్యను 500కు పెంచే లక్ష్యంతో పశు పరిశోధన కేంద్రం కృషి చేస్తోంది. అధిక వెన్న, పోషక విలువలు పుంగనూరు ఆవులు మూడడుగుల పొడవు మాత్రమే ఉంటాయి. తోకలు దాదాపుగా నేలను తాకుతుంటాయి. ఇవి సగటున 1 నుంచి 2 లీటర్ల వరకు మాత్రమే పాలిస్తాయి. ఈ పాలలో ఎక్కువ వెన్నతో పాటు.. పోషక విలువులు, రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటాయి. తక్కువ మేతతోనే జీవించగలుగుతాయి. ఇవి మనిషిని అత్యంత ప్రేమగా నమ్మి విశ్వాసంగా ఉంటాయి. తనకు పరిచయం లేని వారిని దరిదాపులకు కూడా రానివ్వవు. ఒక్కో ఆవు ధర రూ.10 లక్షల దాకా ఉంది. -
పైన ఎల్లిగడ్డలు.. కింద పశువులు.. ట్రక్కులో కుక్కి...
సాక్షి, ఎడపల్లి (నిజామాబాద్): ఎవ్వరికీ అనుమానం రాకుండా పైన ఎల్లిగడ్డ సంచులు, కింద అరలో పశువులను ఉంచి తరలిస్తున్న ట్రక్కును నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీసులు పట్టుకున్నారు. ట్రక్కులోపల 50 పశువులను కుక్కి కుక్కి పెట్టడంతో అవి తీవ్ర గాయాల పాలయ్యాయి. మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామానికి ఈ పశువులను తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న ఎడపల్లి ఎస్సై పాండేరావు ట్రక్కును, పశువులను స్వా«దీనం చేసుకున్నారు. పశువులను బోధన్ గోశాలకు తరలించారు. కాగా, పశువులతోపాటు ఆవులు ఉన్నాయేమోనన్న అనుమానంతో స్థానిక బీజేపీ నేతలు పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. పరిశీలించగా ఆవులు కనిపించకపోవడంతో వెనుదిరిగారు.ఎడపల్లి (బోధన్): ఎవ్వరికీ అనుమానం రాకుండా పైన ఎల్లిగడ్డ సంచులు, కింద అరలో పశువులను ఉంచి తరలిస్తున్న ట్రక్కును నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీసులు పట్టుకున్నారు. ట్రక్కులోపల 50 పశువులను కుక్కి కుక్కి పెట్టడంతో అవి తీవ్ర గాయాల పాలయ్యాయి. మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామానికి ఈ పశువులను తీసుకొచ్చారు. గాయపడిన ఎద్దు సమాచారం అందుకున్న ఎడపల్లి ఎస్సై పాండేరావు ట్రక్కును, పశువులను స్వా«దీనం చేసుకున్నారు. పశువులను బోధన్ గోశాలకు తరలించారు. కాగా, పశువులతోపాటు ఆవులు ఉన్నాయేమోనన్న అనుమానంతో స్థానిక బీజేపీ నేతలు పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. పరిశీలించగా ఆవులు కనిపించకపోవడంతో వెనుదిరిగారు. చదవండి: అందం హిందోళం.. అధరం తాంబూలం -
పశువులపై విష ప్రయోగం
హనుమాన్జంక్షన్ రూరల్ (గన్నవరం): రాజకీయ కక్షలతో కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని వీరవల్లి–1 సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యురాలు దూసరి నిర్మల (వైఎస్సార్ సీపీ)కు చెందిన పశువులపై విషప్రయోగం జరిగింది. ఈ ఘటనలో ఓ గేదె దూడ మృతి చెందగా, మరో మూడు గేదెలు అస్వస్థతకు గురయ్యాయి. గ్రామంలో ఆదివారం ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన దూసరి నిర్మల, జోజి దంపతులు పాడి పశువులను పెంచుకుంటూ కౌలు రైతులుగా జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా రాజకీయంగా వారిద్దరూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. దీంతో కొందరు పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని వారిపై ద్వేషాన్ని పెంచుకున్నారు. ఇటీవల నిర్మల దంపతులు కౌలుకు సాగు చేసిన 16 ఎకరాల వరి కుప్పలను ప్రత్యర్థులు దహనం చేశారు. కాగా, శనివారం అర్ధరాత్రి నిర్మల ఇంటి ప్రాంగణంలోని గేదెలపై విషప్రయోగం జరగగా.. సంఘటనాస్థలంలోని ఆనవాళ్లును బట్టి చూస్తే దోసకాయ, వంకాయలలో గుళికల మందు కలిపి గేదెలకు పెట్టినట్లు తెలుస్తోంది. సంఘటనాస్థలంలో పడి ఉన్న గుళికలు కలిపి పెట్టిన కూరగాయలు ఆదివారం తెల్లవారుజామున నిర్మల యథావిధిగా పశువులకు మేత వేసేందుకు వెళ్లినపుడు పశువులన్నీ అపస్మారక స్థితిలో కనిపించాయి. స్థానికులు వీరవల్లి ప్రభుత్వ వైద్యశాల, సంచార పశువైద్యశాల సిబ్బందికి సమాచారం అందించటంతో వారు హుటాహుటిన పశువులకు వైద్యం అందించారు. దీంతో గేదెలకు ప్రాణాపాయం తప్పినట్లేనని పశు వైద్యులు భావిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు వీరవల్లి ఎస్ఐ ఎం.సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేశారు. గతంలో వరి కుప్పలు దహనం చేసిన వ్యక్తే ఈ ఘటనకు పాల్పడ్డాడా? లేక వేరేఎవరైనా విష ప్రయోగం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
Allola DIVYA REDDY: గోమాత
ఆవు... అమ్మ తర్వాత అమ్మ. పిల్లలకు పాలిచ్చి పోషిస్తుంది. నేలకు సారం... మట్టికి జీవం ఇస్తుంది. పంటకు ప్రాణం... అవుతుంది. అందుకే ఆవు... ఆరాధ్యదైవం అయింది. మనిషి మనుగడకు ఆధారం అయింది. అలాంటి మన ఆవు ప్రమాదంలో ఉంది. ఇప్పుడు ఆవును కాపాడే ఒక అమ్మ కావాలి. ఆ అమ్మ... అల్లోల దివ్యారెడ్డి. పెట్ రైట్స్ కోసం పోరాటాలు జరుగుతున్నాయి. వన్యప్రాణుల సంరక్షణకు చట్టాలున్నాయి. పులుల సంఖ్యను పెంచడానికి ప్రత్యేక సంరక్షణ చర్యలు తీసుకుంది ప్రభుత్వం. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచమంతా ఉద్యమాలు జరుగుతున్నాయి. మరి పర్యావరణ వ్యవస్థలో మన ఆవులు ఎందుకు స్థానాన్ని కోల్పోతున్నాయి. ఆవును మచ్చిక చేసుకుని అడవి నుంచి ఇంటికి తెచ్చుకున్నారు మన పూర్వికులు. ఇప్పుడవి ఎల్లలు దాటి వెళ్లిపోతుంటే చూస్తూ ఊరుకుంటున్నాం మనం. ఇప్పుడు కూడా మేల్కొనకపోతే ఆ తర్వాత ఉద్యమించినా ప్రయోజనం ఉండదంటారు అల్లోల దివ్యారెడ్డి. మన దేశీయ ఆవులను సంరక్షించే బాధ్యతను చేపట్టారామె. ‘ప్రమాదం అంచున ఉన్న దేశీయ ఆవులను సంరక్షించు కుందాం’... అని పిలుపునిస్తున్నారు. ఇందుకోసం సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇప్పుడు ఎకలాజికల్ ఇంజనీరింగ్ బాధ్యతను చేపట్టిన ప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారామె. ఏటూ మిల్క్ మన ఆవులవే! ‘‘మాది తెలంగాణ, సంగారెడ్డి జిల్లా కేంద్రం. పెరిగింది మాత్రం హైదరాబాద్లోనే. నాన్న వాటర్ వర్క్స్లో ఇంజనీర్ ఇన్ చీఫ్గా రిటైర్ అయ్యారు. నేను ఇంజనీరింగ్ తర్వాత పెళ్లి చేసుకుని, మా వారికి వ్యాపారంలో సహాయంగా ఉన్నాను. అత్తగారిల్లు నిర్మల్. ఇద్దరు పిల్లలతో నాలోకం నాదిగా, పిల్లలను చక్కగా పెంచుకోవడమే తొలి ప్రాధాన్యంగా ఉండేది. అలాంటిది 2014 నన్ను పూర్తిగా మార్చేసింది. అప్పుడు వార్తా పత్రికల్లో, టీవీ చానెళ్లలో పాల కల్తీ గురించి వరుస కథనాలు వచ్చాయి. నా పిల్లలకు తాగిస్తున్న పాలు స్వచ్ఛమైనవి కావా, విషపూరితమైన ఆహారాన్ని పిల్లలకు ఇస్తున్నానా... అని ఎంత ఆవేదన చెందానో మాటల్లో చెప్పలేను. అప్పటి నుంచి స్వచ్ఛమైన ఏటూ (అ2) పాల గురించి అధ్యయనం మొదలుపెట్టాను. మన దేశీయ ఆవు ఇచ్చే పాలే ఏటూ మిల్క్ అని తెలిసిన తర్వాత సంతోషం వేసింది. హైదరాబాద్లో ఏటూ మిల్క్ కోసం అన్వేషణ మొదలు పెట్టాను. ఆశ్చర్యం... పాలు దొరకనే లేదు. మనం, మన పిల్లలు మాత్రమే కాదు, మన ఆవు కూడా ప్రమాదం అంచున ఉన్నట్లు అప్పుడు తెలిసింది. వెంటనే పది ఆవులతో సంగారెడ్డిలోని మా పొలంలోనే క్లిమామ్ గోశాల మొదలుపెట్టాను. అక్కడి నుంచి మా ఇంటికి నలభై నిమిషాల ప్రయాణం. అప్పటి నుంచి మా పిల్లలు స్వచ్ఛమైన పాలతో పెరుగుతున్నారు. మన దేశీయ గోసంతతి పెంచడానికి నేను చేస్తున్న ప్రయత్నంలో భాగంగా 2015లో పది ఆవులతో మొదలైన గోశాలలో ఇప్పుడు 250 ఉన్నాయి. మా క్లయింట్లు చాలా మంది ఇప్పుడు రెండు – మూడు ఆవులను పెంచుకుంటున్నారు. కొంతమంది ఏకంగా వంద ఆవులతో ఫార్మ్ పెట్టారు. దేశ పర్యటన మూపురం ఉన్న ఆవు మన దేశీయ ఆవు. అలాంటి దేశీయ ఆవుల సంఖ్య పెంచడానికి దాదాపుగా దేశమంతా పర్యటించాను. రైతులతో మాట్లాడాను. ఆవును పెంచడం పాలకోసం అనుకుంటారు, కానీ నిజానికి ఆవు పాలు మనకు బోనస్ మాత్రమే. అసలైన ప్రయోజనం నేలకోసం. నేలను సారవంతంగా ఉంచుకున్నంత కాలమే మనిషికి మనుగడ. వందగ్రాముల ఆవుపేడలో పదిలక్షల సూక్ష్మజీవులుంటాయి. అవి నేలను సజీవంగా ఉంచుతాయి. రసాయన ఎరువులు, పురుగుమందులతో నేలలో ఉండాల్సిన జీవజాలం అంతరించిపోతోంది. ఆవుపేడ ద్వారా వాటిని తిరిగి పొందవచ్చు. అందుకే ‘నేల పండాలంటే ఆవు ఉండాలి. అది మన దేశీయ ఆవు అయి ఉండాలి’ అంటాను. సేంద్రియం మనకు కొత్త కాదు! మన రైతులు సేంద్రియ వ్యవసాయమే చేసేవారు. యాభై – అరవై ఏళ్ల వెనక్కి వెళ్లి చూడండి. వాళ్లకు యూరియాలు, డీఏపీలు తెలియదు. ఆవులు, గేదెల ఎరువుతో సేద్యం చేసుకుంటూ రైతు రాజులాగా జీవించాడు. అలాంటి రైతును అధిక దిగుబడి అంటూ రసాయన ఎరువులతో పక్కదారి పట్టించాం. ఇప్పుడు రైతు ఉన్నంత దీనస్థితిలో మరెవరూ ఉండకపోవచ్చు, వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న ఒడిదొడుకులు మరే పరిశ్రమలోనూ కనిపించవు. ఇప్పుడు మళ్లీ రైతును సేంద్రియం వైపు మళ్లించడానికి వ్యయప్రయాసలు పడాల్సి వస్తోంది. గ్రామాల్లో ప్రతి ఇంట్లో కనీసం ఒక్క దేశీయ ఆవు ఉన్నా చాలు, దేశంలో ఆవుల సంతతి పెరుగుతుంది, వ్యవసాయం బాగుపడుతుంది. మనిషి జీవనం గాడిలో పడుతుంది. ఆవులకు కృత్రిమ గర్భధారణను తప్పనడం లేదు, కానీ విదేశీ బ్రీడ్తో గర్భధారణను వ్యతిరేకిస్తున్నాను. రెడ్ సింధీ, సహీవాల్, గిర్ వంటి రోజుకు పదిహేను లీటర్ల పాలిచ్చే రకాలున్నాయి. అలాంటి మనదేశీయ జాతితో గర్భధారణ చేసినప్పుడే మన ఆవు మనకు మిగులుతుంది. లేకపోతే శ్రీలంక పరిస్థితి తప్పదు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల నుంచి ఆవులను దిగుమతి చేసుకుందా దేశం. సొంత నేల ఆవు జాతులను పట్టించుకోలేదు. చివరికి దిగుమతి చేసుకున్న బ్రీడ్ నిలవలేదు, సొంత బ్రీడ్ అంతరించిపోయిందక్కడ. నేను న్యాయస్థానం మెట్లెక్కింది కూడా ఈ విషయంలోనే. కృత్రిమ గర్భధారణ హైబ్రీడ్తో వద్దు, మన దేశీయ జాతులతో చేయాలని న్యాయస్థానాన్ని కోరాను’’ అన్నారు అల్లోల దివ్యారెడ్డి. ఇంత పెద్ద బాధ్యతను భుజానికెత్తుకున్నప్పటికీ ఎక్కడా అవరోధాలు లేకుండా ముందుకు సాగడానికి ఇంట్లో అందరి సహకారం ఉందని, కుటుంబ సభ్యుల పట్ల కృతజ్ఞత వ్యక్తం చేశారామె. ఆవు నన్ను ఎంచుకుంది! అవుతో కలిసి సాగుతున్న నా జర్నీ అంతటినీ ఓసారి వెనక్కి చూసుకుంటే... గోసేవను ఎంచుకున్నది నేను కాదు, గోవులే నన్ను ఎంచుకున్నాయనిపిస్తోంది. నేను చేస్తున్నదేదీ ముందుగా ప్రణాళిక వేసుకుని మొదలుపెట్టింది కాదు. పాల కల్తీ గురించి తెలిసినప్పటి నుంచి ఒక్కటొక్కటిగా అడుగులు వాటంతట అవే పడుతున్నాయి. ఈ పోరాటంలో విజయం సాధించేవరకు విశ్రమించను. ఆవును నగరాల్లో ఇళ్లకు కూడా పరిచయం చేయడానికి మట్టి గణపతిలో కొద్దిగా గోమయం కలిపి చేస్తున్నాను. గోమయంతో కూడిన మట్టి గణపతి విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేయవచ్చు లేదా కరిగించి ఇంట్లో మొక్కలకు ఎరువుగానూ వేసుకోవచ్చు. మన ఆవు కోసం ఇంకా ఏ ఆలోచన వస్తే దానిని ఆచరణలో పెడుతూ ముందుకు వెళ్తాను. మన జాతీయ చిహ్నంలో ఉన్న ఎద్దు బొమ్మను ఉదహరిస్తూ జాతి సంపదను పరిరక్షించుకుందాం... అని సమాజాన్ని చైతన్యవంతం చేసే ప్రయత్నంలో ఉన్నాను. – అల్లోల దివ్యారెడ్డి, వ్యవస్థాపకురాలు, క్లిమామ్ గోశాల – వాకా మంజులారెడ్డి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
సిరుల గ్రాసం.. పచ్చగడ్డి కాదు.. పసిడి పంట!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రికొత్తగూడెం: ఒకప్పుడు గ్రామాలు పశువులతో కళకళలాడేవి. వాటి మేత కోసం గ్రామాల్లో బంజరు భూములు ఉండేవి. పొలం గట్లు, అంచుల వెంబడి రైతులు పశుగ్రాసం పెంచేవారు. క్రమేణా బంజరు భూములు సాగునేలలుగా మారాయి. లేదంటే కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. యాంత్రీకరణతో వ్యవసాయంలో పశువుల వినియోగం తగ్గింది. కానీ పాడి పశువుల సంఖ్య పెరిగింది. పాలిచ్చే గేదెలు, జెర్సీ ఆవులను పెంచే రైతుల సంఖ్య గ్రామాలతో పాటు పట్టణాల్లోనూ పెరుగుతోంది. అందుకు తగ్గట్టు పశుగ్రాసం లభించడం లేదు. అడవులు అధికంగానే ఉన్నా.. రాష్ట్రంలోనే అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ పశుగ్రాసం సమస్య తీవ్రంగానే ఉంది. అడవుల సంరక్షణ పేరుతో అటవీ అధికారులు కట్టుదిట్టం చేయడంతో పశువులకు మేత దొరకడంకష్టమైపోయింది. దీంతో పాడిరైతులు పశుగ్రాసాన్ని మోపుల లెక్కన కొనాల్సి వస్తోంది. ఈ క్రమంలో పశువుల ఆహార కొరతను తీరుస్తూ రైతులకు ఆదాయాన్ని అందించే వనరుగా సూపర్ నేపియర్ రకం గడ్డి వెలుగులోకి వచ్చింది. నేపియర్ గ్రాస్తో పెంచుతున్న పశువులు సాగు సులభం.. అచ్చం చెరుకుగడలా కనిపించే ఈ నేపియర్ గడ్డి థాయ్లాండ్ నుంచి వచ్చింది. భారత్ పరిస్థితులకు తగ్గట్టుగా హైబ్రిడ్ నేపియర్, సూపర్ నేపియర్, రెడ్ నేపియర్ గడ్డి రకాలు అభివృద్ధి చేశారు. ఇందులో ప్రస్తుతం సూపర్ నేపియర్ రకం సాగు జోరందుకుంది. పశుగ్రాసం కోసం పెంచే జొన్న, దుబ్బ వంటి గడ్డిజాతులు ఒకసారి నాటితే ఒకసారి మాత్రమే దిగుబడి ఇస్తాయి. ఏడాది తర్వాత మళ్లీ పెట్టుబడి పెట్టాల్సిందే. కానీ సూపర్ నేపియర్ గడ్డిజాతి మొక్కలు ఒకసారి నాటితే ఎనిమిదేళ్ల వరకు తిరిగి చూడాల్సిన పనిలేదు. తొలి పంట 90 రోజుల్లో చేతికొస్తుంది. ఒకసారి కోస్తే తిరిగి 45 రోజుల్లో మళ్లీ కోతకొస్తుంది. ఇలా ఎనిమిదేళ్ల పాటు రాబడిని అందిస్తోంది. రైతుల మొగ్గు... పట్టణాలకు సమీపంలో పాడి ఎక్కువగా విస్తరించిన గ్రామాల్లో రైతులు సంప్రదాయ వరి, పత్తి, మిర్చిల కంటే నేపియర్ సాగుకే మొగ్గు చూపుతున్నారు. వరి వేసి నానా కష్టాలు పడితే ఎకరానికి రూ.15 వేలకు మించి ఆదాయం రావట్లేదు. పత్తివేస్తే అన్ని ఖర్చులు పోను ఎకరానికి రూ.30 వేలైనా మిగలడం లేదు. కానీ సూపర్ నేపియర్ స్టెమ్స్ ఒకసారి నాటితే ఎనిమిదేళ్ల వరకు ఢోకాలేదు. ఎకరాకు అన్ని ఖర్చులు పోనూ రూ.70 వేల వరకు మిగులుతున్నాయని రైతులు అంటున్నారు. రెట్టింపు లాభం.. బెంగళూరులో ఉన్నప్పుడు సొంతూరిలో పాడి పరిశ్రమ పెట్టాలనుకున్నా. అప్పుడే సూపర్ నేపియర్ గురించి తెలిసింది. మా ఊళ్లో ఫాంహౌస్ కట్టి దానిలో ఈ గడ్డి పెంచుతున్నా. సాధారణ గడ్డి ఎకరంలో పండిస్తే.. ఐదారు పశువులకే సరిపోతుంది. కానీ నేపియర్ 16 అడుగుల పొడవు పెరగడం వల్ల 10 పశువులకు సరిపోతుంది. పైగా ఇందులో ప్రొటీన్స్ ఎక్కువ. పాల దిగుబడి బాగుంటుంది. – కళ్యాణ్, రైతు, అశ్వాపురం సమయం ఆదా అవుతోంది గతంలో భూమి కౌలుకు తీసుకుని గడ్డి పెంచేవాన్ని. ప్రతీ ఏడాది దుక్కి దున్ని విత్తనాలు చల్లాల్సి వచ్చేది. సూపర్ నేపియర్తో ఈ సమస్య లేదు. ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు. 6 ఏళ్లు పాడి పశువులకు ఆహార కొరత లేదు. ఉదయం ఈ గడ్డి కోసి ఇస్తే చాలు. మిగిలిన సమయంలో ఇతర పను లు చూసుకునే వెసులుబాటు కలుగుతోంది. – బాదం శ్రీనివాసరెడ్డి, రైతు, బూర్గంపాడ -
కస్టడీలో వ్యక్తికి పోలీసుల కరెంట్ షాక్
బదౌన్: పశువుల దొంగతనం కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు 20 ఏళ్ల యువకుడిని కరెంట్ షాక్తో చిత్రహింసలకు గురిచేశారు. బాధితుడు ఆస్పత్రి పాలయ్యాడు. ఘటనకు సంబంధించి ఐదుగురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు. రెహాన్ అనే రోజుకూలీ ఈ నెల 2వ తేదీన సాయంత్రం ఇంటికి వెళ్తుండగా బదౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశువుల దొంగల ముఠాకు సహకరిస్తున్నాడంటూ అతడిని చిత్రహింసలు పెట్టారు. కరెంట్ షాక్కు గురి చేయడంతోపాటు లాఠీతో తీవ్రంగా కొట్టడంతో నడవలేని, కనీసం మాట్లాడలేని పరిస్థితికి చేరుకున్నాడని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. అతడిని విడిపించేందుకు రూ.5 వేలు లంచం ఇవ్వాల్సి వచ్చిందన్నారు. తీవ్రంగా గాయపడిన అతడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
విషాదం: గడ్డివాముకు నిప్పు.. పశువులను కాపాడబోయి.. వదిన, మరిది..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పశువులను కాపాడబోయి వది న, మరిది కరెంట్ షాక్తో ప్రా ణాలు కోల్పోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండ లం ఎర్రగడ్డతండాలో ఈ ఘట న జరిగింది. గురువారం రాత్రి తండాలో బానోతు నీల (37), బానోతు రవి(34) ఇంటికి సమీపంలో ఉన్న ట్రా న్స్ఫార్మర్ నుంచి మంటలు వెలువడి గడ్డివాముకు నిప్పంటుకుంది. దీంతో సమీపంలోని పాకలో ఉన్న పశువులను మంటల నుంచి కాపాడేందుకు నీల, రవి వెళ్లా రు. అదే సమయంలో మంటలకు విద్యుత్ తీగలు తెగి వారిపై పడ్డాయి. తీగలు కాళ్లకు చుట్టుకోవడంతో కరెంట్ షాక్కు గురై ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గ్రామస్తులు, బంధువులు శుక్రవారం ఉదయం మృతదేహాలతో వీర్నపల్లి సబ్స్టేషన్ను ముట్టడించారు. తమకు న్యాయం చేయాలని మూడు గంటలపాటు రోడ్డుపై బైఠాయించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అక్కడికి చేరుకొని కలెక్టర్, సెస్ ఎండీతో మాట్లాడారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం, ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. -
చిన్ని ప్రాణుల చలివేంద్రాలు
సాక్షి, విశాఖపట్నం: వేసవి వచ్చిందంటే చాలు నీటి చుక్క కోసం అల్లాడిపోతాం. కాలు బయటపెడితే.. కాసిన్ని నీళ్లు ఎక్కడ దొరుకుతాయా అని ఆశగా వెదుకుతుంటాం. ఎప్పటికప్పుడు ఉష్ణతాపాన్ని తీర్చుకునేందుకు ఏదో రూపంలో నీటిని శరీరానికి అందిస్తుంటాం. అందుకే వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చాలాచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. మరి మూగజీవాల పరిస్థితి ఏమిటి? చుక్క నీటి కోసం మైళ్ల దూరం ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోతున్నాయి. పక్షి జాతుల్లో కొన్ని అంతరించిపోవడానికి వేసవీ ఒక కారణమని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయలేమా? అని కెన్ ఫౌండేషన్ సభ్యులకు కలిగిన ఆలోచన.. నేడు నగరంలో వేలాది పశుపక్ష్యాదుల దాహార్తిని తీరుస్తోంది. 10 ఏళ్లుగా ఎన్నో జీవాలకు వేసవిలో ఊపిరిపోస్తోంది. సాధారణంగా పక్షుల శరీర సాధారణ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్. ఈ ఉష్ణోగ్రత దాటితే ఎక్కువ సేపు జీవించలేవు. అందుకే చాలా పక్షులు ఎక్కడ నీరు కనిపిస్తే అందులో మునకేస్తూ శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకుంటాయి. ప్రస్తుతం నగరంలో వేసవి నేపథ్యంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు సమీపిస్తోంది. ఈ తరుణంలో పక్షుల సంరక్షణకు నడుం బిగించింది నగరానికి చెందిన కెన్ ఫౌండేషన్. సేవే మార్గంగా.. విద్యార్థులు వలంటీర్లుగా.. సంస్థ అధ్యక్షుడు పుల్లేటికుర్తి సంతోష్ ఈ సంస్థ తరఫున వాటర్ బౌల్ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. 100 తొట్టెలతో ప్రారంభమై.. పక్షులను వేసవి తాపం నుంచి రక్షించి వాటి దాహార్తి తీర్చే ఉద్దేశంతో 2012లో కెన్ ఫౌండేషన్ నగరంలో వాటర్ బౌల్ పేరుతో సామాజిక కార్యక్రమాన్ని ప్రారంభించింది. తొలి ఏడాది ఫౌండేషన్ వలంటీర్లే నగరంలోని పలుచోట్ల 100 నీటి తొట్టెలు ఏర్పాటు చేశారు. ఆ వాటర్ బౌల్స్ వద్దకు పక్షులు, మూగజీవాలు వచ్చి నీటిని తాగుతుండటం చూసి నగర ప్రజలు చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తామూ ఈ వాటర్ బౌల్ ప్రాజెక్ట్లో భాగస్వాములమవుతామని ముందుకువచ్చారు. దీంతో వాటర్ బౌల్ ప్రాజెక్ట్ను విస్తరించారు. పిచ్చుకలు, రామచిలుకలు, పావురాలు, కోయిలలు, కాకులతో పాటు ఉడుతలు, ఆవులు, కుక్కలు కూడా ఈ వాటర్ బౌల్స్ వద్దకు చేరుకుని తమ దాహార్తిని తీర్చుకుంటున్నాయి. సంస్థ చైర్పర్సన్ గీతానారాయణ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నీటి తొట్టెల ఖర్చును భరిస్తూ.. అందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. 2017 వరకు 750 నీటి తొట్టెలు పంపిణీ చేయగా.. 2021 నాటికి ఆ సంఖ్య 1800 కు చేరింది. ఈ ఏడాది 150 నుంచి 200 వరకు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. నగరమంతా విస్తరణ నగరంలోని అనేక చోట్ల నుంచి జంతు ప్రేమికులు ఈ వాటర్ బౌల్స్ను తీసుకుని వెళ్తున్నారు. ఇంకా ఎవరైనా పక్షి ప్రేమికులుంటే మరికొన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెందుర్తి, విశాలాక్షినగర్, కొత్తవలస, స్టీల్ప్లాంట్, అనకాపల్లి, డాల్ఫిన్ నోస్... ఇలా శివారు ప్రాంతాల నుంచి పక్షి ప్రేమికులు వచ్చి నీటితొట్టెలను తీసుకెళ్తున్నారు. ఈ నీటితొట్టెల్లో నీటిని నింపి మేడ చివర్లో కానీ, పెరడులో గానీ పెడితే పక్షులు అక్కడికి చేరి దాహాన్ని తీర్చుకుని ఉపశమనం పొందుతున్నాయి. ఐదేళ్లుగా సరఫరా చేసిన నీటి తొట్టెల వద్దకు ఎన్నో పక్షులు కాలంతో పనిలేకుండా వస్తుండటం విశేషం. ఉచితంగా అందిస్తాం.. వేసవి వస్తే మనుషుల కోసం అడుగడుగునా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ మూగజీవాల గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అందుకే మా ఫౌండేషన్ తరఫున వాటర్ బౌల్ ప్రాజెక్ట్ ప్రారంభించాం. ఇవి జంతువులకు, పక్షులకు చలివేంద్రాలు. నగరంలోని అనేక కళాశాలలు, ప్రైవేట్ సంస్థల్లో కూడా వీటిని ఏర్పాటుచేశాం. మూగ జీవాలను ప్రేమించేవారు ఎవ్వరు వచ్చినా.. ఉచితంగా నీటితొట్టెలు అందిస్తాం. ఆసక్తి ఉన్న వారు 98856 74949ను సంప్రదించవచ్చు. – పుల్లేటికుర్తి సంతోష్, కెన్ ఫౌండేషన్ అధ్యక్షుడు ప్రజల స్పందన అనూహ్యం కెన్ ఫౌండేషన్ తరఫున ముందుగా ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించాం. 100 చోట్ల పెట్టి వాటినే ప్రతి ఏటా కొనసాగించాలని భావించాం. అయితే.. నీటి తొట్టెలు చూసిన వారు ఇళ్ల వద్ద కూడా పెడతామని సంప్రదించారు. దీంతో ఆరేళ్లుగా దీన్ని కొనసాగిస్తున్నాం. – గీతానారాయణ్, చైర్పర్సన్, కెన్ ఫౌండేషన్ -
కర్మన్ఘాట్లో ఉద్రిక్తత
చంపాపేట: గోవులను కబేళాకు తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకోవడంతో ఓ వర్గానికి చెందిన యువకులు మరో వర్గం వారిపై తల్వార్లతో దాడికి యత్నించిన సంఘటన మంగళవారం అర్దరాత్రి చంపాపేట డివిజన్ కర్మన్ఘాట్లో చోటు చేసుకుంది. బీఎన్రెడ్డి చౌరస్తా నుంచి మీర్పేట నందిహిల్స్ మీదుగా ఓ వాహనంలో గోవులను చంద్రాయణగుట్టకు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో గోరక్షక్ సభ్యులు కర్మన్ఘాట్ శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఆలయం సమీపంలో వాహనాన్ని అడ్డుకుని గోవులను కిందకు దించేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలియడంతో మరో వర్గానికి చెందిన యువకులు ఓ వాహనంలో వేగంగా వచ్చి గోరక్ష సభ్యుల ఇన్నోవాను బలంగా ఢీకొట్టి ధ్వంసం చేశారు. అనంతరం సమితి సభ్యులపై తల్వార్లతో దాడికి యత్నించారు. దీంతో వారు కర్మన్ఘాట్ శ్రీ ధ్యానాంజనేయ స్వామివారి ఆలయంలోకి వెళ్లి తలదాచుకున్నారు. వారిని వెంబడించిన దుండగులు ఆలయంలోకి జొరబడి తల్వార్లతో వీరంగం సృష్టించారు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ బీజేపీ నాయకులు, గోరక్షక్ సభ్యులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో దుండగులు పరారయ్యారు. అనంతరం బీజేపీ, భజరంగదళ్, గోరక్షా సభ్యులు ఆలయం ఎదుట బైటాయించి దుండగులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. -
పోలీసులుగా మీకు ఆత్మగౌరవం లేదా? హోంమంత్రి తీవ్ర వ్యాఖ్యలు
Karnataka Home Minister Araga Jnanendra Slams Cops: కర్ణాటక హోంమంత్రి అరగా జ్ఞానేంద్ర పోలీసులపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు వైరల్గా మారాయి. పశువుల అక్రమ రవాణాదారుల నుంచి లంచాలు తీసుకుంటారని పోలీసులుపై మండిపడ్డారు. కొంతమంది పోలీసులు లంచాలు తినే కుక్కల్లా బతుకుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఓ పోలీసు ఉన్నతాధికారితో ఫోన్లో మాట్లాడిన వీడియో రికార్డింగ్ వైరల్గా మారింది. అయితే పుశువుల అక్రమ రవాణాదారుల నుంచి లంచాలు తీసుకొని కొంతమంది పోలీసులు వారిని వదిలేస్తున్నారని, విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఆత్మగౌరవం ఉండదా? అని ప్రశ్నించారు. వధించడం కోసం పశువులను రవాణా చేయడం కర్ణాటక ప్రభుత్తం నిషేధించిన విషయం తెలిసిందే. తాను పోలీసులందరినీ విమర్శించడం లేదని, డబ్బు కోసం పశువుల అక్రమ రవాణాదారులతో కుమ్మక్కైన పోలీసులను మాత్రమే విమర్శిస్తున్నానని తెలిపారు. -
కార్లను కుమ్మేసి.. మనుషులను పొడిచేసి..
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం ఓ ఆవు విధ్వంసం సృష్టించింది. రోడ్లపై కనబడిన వారినల్లా పొడిచింది. అలాగే, వాహనాలపైనా ప్రతాపం చూపింది. మూడు గంటలపాటు ఆవు సృష్టించిన గందరగోళంతో అశోక్నగర్, శ్రీనివాసనగర్ కాలనీ వాసులు హడలిపోయారు. కనిపించిన వారినల్లా పొడవడంతో జనం రోడ్లపై పరుగులు తీశారు. పార్క్ చేసి ఉన్న కార్లను సైతం వదలకుండా కొమ్ములతో కుమ్మడంతో నాలుగు కార్లు దెబ్బతిన్నాయి. ఆవు దాడిలో ముగ్గురికి గాయాలుకాగా ఆసుపత్రికి తరలించారు. చివరకు పోలీసులు, పశువైద్య అధికారులు చేరుకుని తాళ్ల సాయంతో ఆవును బంధించి మత్తు మందు ఇచ్చి నియంత్రించారు.దీంతో కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. -
Neetu Yadav And Kirti Jangra: బర్రెలు అమ్మే బిజినెస్.. 2500 కోట్ల అమ్మకాలు!
‘ఇంత చదువు చదివి బర్రెలు అమ్ముతావా?’ నీతూ యాదవ్, కీర్తి జంగ్రాలను అందరూ ఇదే అడిగారు. ఇద్దరూ ఢిల్లీ ఐఐటిలో చదివారు. ఒకటి రెండు ఉద్యోగాలు చేశారు. మానేసి ఆన్లైన్లో పశువుల సంత పెడతామంటున్నారు. ‘మీకేమైనా పిచ్చా?’ ‘బుద్ధి గడ్డి తింది’ ‘చదివాక పిసలు అన్నారట’ ఎన్నో కామెంట్స్... కాని ఈ ఇద్దరు అమ్మాయిలు ‘యానిమాల్’ అనే యాప్ తయారు చేశారు. 2019లో మొదలెట్టారు. ఇప్పటికి 2500 కోట్ల విలువైన పశు అమ్మకాలు సాగించారు. IITians Neetu Yadav And Kirti Jangra: అది 2019. నీతూ యాదవ్ బెంగళూరు నుంచి జైపూర్లో ఫ్లయిట్ దిగింది. సెప్టెంబర్ నెల. జల్లు పడుతోంది. నీతూ బుర్రలో కూడా ఆలోచనల జల్లు కురుస్తోంది. బెంగళూరులో ఆన్లైన్ కథల వేదిక ‘ప్రతిలిపి’లో ఉద్యోగం మానేసి జైపూర్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న సొంతవూరు నవల్పూరుకు వెళుతోందామె. అక్కడ ఏం చేయాలో తన తల్లిదండ్రులకు ఏం చెప్పాలో మననం చేసుకుంటూ ఉంది. మరోవైపు అదే సమయానికి హర్యానాలోని హిసార్ పట్టణంలో కీర్తి జంగ్రా నివాసం కోలాహలంగా ఉంది. కీర్తికి అమెరికాలో ఉన్నత చదువులకు సీట్ వచ్చింది. ఆమె అమెరికాకు వెళ్లనున్నందున తల్లిదండ్రులు బంధువులను పిలిచి చిన్న పార్టీ అరేంజ్ చేశారు. కాని కీర్తి మనసులో ఏముందో తెలిస్తే వారి రియాక్షన్ ఏమిటో. రియాక్షన్ ఎలా ఉన్నా నిర్ణయం చెప్పాల్సిందే కదా. ‘ఆన్లైన్లో పశువులు అమ్ముతాం’... ఇదీ నీతూ యాదవ్, కీర్తి జంగ్రా తమ ఇళ్లల్లో చెప్పింది. వాళ్లిద్దరూ ఐఐటి ఢిల్లీలో చదివారు. రూమ్మేట్స్. జీవితంలో ఏదైనా సాధించాలని ఎన్నో కలలు కన్నారు. ఐఐటి అయ్యాక నీతూ బెంగళూరులో ‘ప్రతిలిపి’లో పని చేయడానికి వెళ్లింది. కీర్తి గుర్గావ్లో ‘పెంగ్విన్’ పబ్లిషింగ్ హౌస్లో పని చేయడానికి వెళ్లింది. ఇద్దరూ కాంటాక్ట్లో ఉన్నారు. ఇద్దరికీ తాము చేస్తున్న ఉద్యోగాలు అంత సంతృప్తినివ్వడం లేదు. ఏదైనా సొంతగా సాధించాలనే తపన. నీతూ యాదవ్ తండ్రి పాడి రైతు. నీతూకు పశువులతో చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. కీర్తి తండ్రి టీచర్. కాని అతని మేనమామలు పాడి రైతులు. చిన్నప్పటి నుంచి ఇద్దరూ పశువుల సంతలు చూశారు. పశువుల లావాదేవీల సమయంలో రైతుల హైరానా చూశారు. ఇద్దరికీ ఒకేసారి ‘అసలు ఆన్లైన్లో పశువులు ఎందుకు అమ్మకూడదు’ అనే ఆలోచన వచ్చింది. ఇక్కడే కుటుంబ సభ్యులకు ఆశ్చర్యం ఎదురైంది.పశువులంటే ఉప్పులో పప్పులో కాదు. బట్టలు కాదు ఆన్లైన్లో కొనడానికి. రైతులు సంతకు వచ్చి ఒకటికి రెండుసార్లు చూసుకొని కొనుక్కుంటారు. మరి ఆన్లైన్లో వీళ్లు ఎలా అమ్ముతారు? ఇదే ప్రశ్న అందరూ వేశారు ఇద్దరినీ. వాళ్లు సమాధానం చెప్పలేదు. చివరకు ఇద్దరి ఇళ్లలోనూ ‘సరే.. మీకు నచ్చిందే చేయండి’ అన్నారు. 2019 చివరలో బెంగళూరులో 11 వేల రూపాయల అద్దెతో ఒక చిన్న గది నుంచి నుంచి నీతూ, కీర్తిల ‘యానిమాల్’ కార్యకలాపాలు మొదలయ్యాయి. ‘యానిమల్’ పశువు. ‘యానిమాల్’ పశువుల సంత. ఇది ఆన్లైన్లోనే ఉంటుంది. వర్చువల్ సంత. కొనాలనుకున్న రైతు అమ్మాలనుకున్న రైతు వీళ్లు తయారు చేసిన ‘యానిమాల్’ ద్వారా లావాదేవీలు ముగించవచ్చు. ‘అసలు జనం టిక్టాక్, యూట్యూబ్, ఫేస్బుక్లాంటి కాలక్షేపం యాప్లను కాకుండా పనికొచ్చే ఉపాధికి అవసరమయ్యే యాప్లను ఎందుకు చూడరు. దేశంలో 30 కోట్ల పశువులు ఉన్నాయి. ఇవి ఏడున్నర కోట్ల పాడి రైతుల దగ్గర ఉన్నాయి. భారతదేశంలో ఇది పెద్ద మార్కెట్. ఆన్లైన్ అమ్మకాలలో వీటిని తేవచ్చునని చాలామంది అనుకోలేదు. ఎందుకంటే సంప్రదాయ సంతల్లోనే వీటి అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతాయి. కాని మేము వీటిని ఆన్లైన్లో తేదలుచుకున్నాం. యాప్ తయారు చేశాం. సక్సెస్ అయ్యాం’ అంటుంది నీతూ యాదవ్. అయితే ఇలా సక్సెస్ కావడం అంత సులభం కాలేదు. 2019 చివరి వరకూ వీళ్లు కేవలం 50 పశువులే తమ యాప్ ద్వారా అమ్మారు. కాని 2020లో లాక్డౌన్ వచ్చాక వీరి యాప్ ఊపందుకుంది. దీనిని రైతుల సౌలభ్యం కోసం హిందీలో కూడా డెవలప్ చేశారు. దాంతో రాజస్థాన్లోనే ఐదులక్షల మంది పాడిరైతులు డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ తర్వాత హర్యానా, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్లలో యానిమాల్ కార్యకలాపాలు విస్తరించాయి. 2020 నవంబర్ నాటికి 30 వేల పశువుల లావాదేవీలు సాగితే డిసెంబర్కు వాటి సంఖ్య 40 వేలు అయ్యింది. 2021 నుంచి సగటున నెలకు 50 వేల పశువులు ‘యానిమాల్’ ద్వారా అమ్మకమో కొనుగోలో జరుగుతోంది. ఇప్పటికి 80 లక్షల మంది రైతులు ‘యానిమాల్’ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. ‘ఇన్వెస్టర్లు భారీగా మాకు ఫండ్ చేయడానికి ముందుకు వచ్చారు. చేశారు కూడా’ అని మెరుస్తున్న కళ్లతో అంటుంది కీర్తి. ఇప్పటికి 160 కోట్ల రూపాయల ఫండ్స్ వీరికి ఏజెన్సీల నుంచి దక్కాయి. కీర్తి, నీతూ చేసింది ఏమిటంటే అమ్మే రైతును, కొనే రైతును అనుసంధానం చేయడమే. ‘మేం చెప్పామని కొనొద్దు. పాలు పితికి చూసి మరీ తీసుకోండి’ అని వీరు అంటారు. ఈ యాప్ ద్వారా అమ్మకానికి వచ్చే పశువులను పశువైద్యులు సర్టిఫై చేసే ఏర్పాటు చేశారు. అలాగే పాడిరైతులకు పాల దిగుబడి పెంచే సలహాలు ఇస్తారు. పశువులు కొనడానికి ఫైనాన్స్ ఎలా పొందాలో కూడా తెలియ చేస్తారు. ఉత్తర భారతదేశంలో యానిమాల్ పెద్ద విప్లవమే తీసుకొచ్చింది. ఇది రైతుల మాటే. ‘ఇలా మేము ఎప్పుడూ పశువులను కొనలేదు’ అని వారు అంటున్నారు. ఇద్దరు అమ్మాయిలు ఒక కొత్త ఆలోచన మెరిపించారు. అది ఇవాళ వేల కోట్ల రూపాయల లావాదేవీలకు కారణమైంది. ‘నీ తెలివి సంతకెళ్లా’ అనేది మనకు తిట్టు. కాని తెలివి నిజంగా సంతకెళితే ఏమవుతుందో చూశారుగా! -
మల్లన్నసాగర్లో చిక్కుకున్న పశువులు
మల్లన్నసాగర్ రిజర్వాయర్లో పశువులు చిక్కుకుపోయాయి. సిద్దిపేట జిల్లా తుక్కాపూర్ గ్రామానికి చెందిన బర్రెంకల చిన చంద్రయ్యకు 40 వరకు ఎడ్లు, ఆవులు ఉన్నాయి. శనివారం ఉదయం ఆయన పశువులను మేతకోసం అడవిలోకి వదిలిపెట్టాడు. ఆ రోజు సాయంత్రం మల్లన్నసాగర్ చుట్టూ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంతో చంద్రయ్య పశువుల వద్దకు వెళ్లలేకపోయాడు. ఆదివారం తెల్లవారు జామున మల్లన్నసాగర్లోకి గోదావరి జలాలను వదలడంతో పశువులు పక్కనే ఉన్న బ్రాహ్మణ బంజేరుపల్లి శివారులోని గుట్ట సమీపంలోకి వెళ్లాయి. మరొక పక్కన గతంలో కొండపోచమ్మసాగర్కు నీటిని తరలించిన కాల్వ ఉంది. ప్రస్తుతం ఈ కాలువ ద్వారా నీరు మల్లన్నసాగర్లోకి వెళుతోంది. కాగా తుక్కాపూర్కు చెందిన మరో రైతుకు చెందిన నాలుగు గేదెలు కూడా చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.– తొగుట (దుబ్బాక) అక్కడే నిరసన..అక్కడే నిద్ర వీరంతా జనగామ జిల్లా జఫర్గఢ్ మండలానికి చెందిన ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లు. రెవెన్యూ అధికారుల తప్పిదంతో తొమ్మిది గ్రామాలకు చెందిన వేలాది మంది రైతుల పట్టాభూములు అసైన్డ్ భూములుగా నమోదయ్యాయి. ఈ తప్పును సరిదిద్దాలంటూ బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో నిరసన దీక్షను ప్రారంభించి.. రాత్రంతా సమావేశపు గదిలోనే పడుకున్నారు. గురువారం కూడా నిరసన కొనసాగించారు. మరోపక్క వీరికి మద్దతుగా రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి.. విధులకు హాజరయ్యేందుకు వచి్చన తహసీల్దార్ స్వప్న, రెవెన్యూ సిబ్బందిని లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. 15 రోజుల్లో రికార్డులు సరిచేసి న్యాయం చేస్తామని అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు ప్రజాప్రతినిధులకు, రైతులకు హామీనివ్వడంతో ఆందోళనకు తెరపడింది.– జఫర్గఢ్ -
థ్రిల్లర్ సినిమాను తలపించే ట్విస్టులు.. బకరా అయిన డాక్టర్
సాక్షి, హైదరాబాద్: పశువుల వ్యాక్సిన్ల తయారీకి వినియోగించే ఆగ్రో మెటాజైమ్ ఆయిల్ను భారత్లోనే ఖరీదు చేసి, తమకు ఎగుమతి చేస్తే భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన ఎన్నారై వైద్యుడికి టోకరా వేశారు. వివిధ దఫాల్లో మొత్తం రూ.11.94 కోట్లు (16,11,025 డాలర్లు) కాజేశారు. గురువారం హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంతో ముడిపడి ఉన్న సైబర్ నేరం నమోదు కావడం ఇదే తొలిసారని అధికారులు చెప్తున్నారు. ఇది నైజీరియన్ల పనిగా అనుమానిస్తున్న అధికారులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అమీర్పేట ప్రాంతానికి చెందిన వైద్యుడు ఎ.చంద్రశేఖర్ రావు (82) అమెరికా పౌరసత్వం ఉండగా... అక్కడ సుదీర్ఘకాలం వైద్యుడిగా పని చేసి వచ్చారు. ఈయనకు ఈ ఏడాది ఫిబ్రవరిలో లండన్లో ఉంటున్న డాక్టర్ బెంజిమన్ అని చెప్పుకున్న వ్యక్తి నుంచి ఈ–మెయిల్ వచ్చింది. తాను పని చేస్తున్న సంస్థ పశువులకు వేసే వ్యాక్సిన్లు తయారు చేస్తుందని నమ్మబలికాడు. దీనికోసం తాము నిత్యం భారత్ నుంచి ఆగ్రో మెటాజైమ్ ఆయిల్ను ఖరీదు చేస్తామని చెప్పాడు. ఈ ఆయిల్పై చంద్రశేఖర్కు పరిజ్ఞానం ఉండటంతో నమ్మారు. ఇప్పటి వరకు తమకు ఆయిల్ సరఫరా చేసిన వారితో అనివార్య కారణాల నేపథ్యంలో ఒప్పందం రద్దయిందని పేర్కొన్నాడు. ఆయిల్ను మీరే లీటర్ 14,625 డాలర్లకు (రూ.10.84 లక్షలు) ఖరీదు చేసి తమకు సరఫరా చేస్తే 22 వేల డాలర్లకు (రూ.16.31 లక్షలు) కొంటామంటూ ఎర వేశాడు. మహిళ నుంచి ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఓపక్క ఈ సంప్రదింపులు జరుగుండగానే డాక్టర్ గీత నారాయణగా చెప్పుకున్న మహిళ నుంచి ఫేస్బుక్ రిక్వెస్ట్ వచ్చింది. అలా పరిచయమైన ఈమె వైద్యుడిని తెలివిగా ముగ్గులోకి దింపి సదరు ఆయిల్ను రాయ్గఢ్కు చెందిన మిల్లులో తయారు చేస్తారంటూ నమ్మించింది. అక్కడ పని చేసే లక్ష్మీ అనే మహిళతో తనకు పరిచయం ఉందంటూ చెప్పి ఆ పేరుతో సంప్రదింపులు జరిపింది. ఈ కథ ఇలా నడుస్తుండగా... మరోసారి టచ్లోకి వచ్చిన బెంజిమన్ శాంపిల్గా ఒక లీటర్ ఖరీదు చేసి పంపాలని, ఆ కంపెనీ ఖాతాలో డబ్బు జమ చేస్తే వాళ్లే తమకు ఆయిల్ పంపేస్తారంటూ చెప్పాడు. నగదు మాత్రం మీరే పేర్కొన్న ఖాతాలో వేస్తామంటూ పూర్తిగా నమ్మించాడు. చంద్రశేఖర్ ఒక లీటర్ ఆయిల్ కోసం లక్ష్మీని సంప్రదించారు. దాని నిమిత్తం 14,625 డాలర్లు పంపించారు. ఈలోపు మళ్లీ సీన్లోకి వచ్చిన బెంజిమన్... లీటర్తో తమకు ఉపయోగం లేదని, కనీసం 350 పంపిస్తే ఒక బ్యాచ్ వ్యాక్సీన్లు తయారవుతాయని చెప్పాడు. చంద్రశేఖర్ దానికి సంబంధించిన మొత్తం లక్ష్మీ పేర్కొన్న ఖాతాలకు పంపిన తర్వాత మరో కథ మొదలైంది. విమానాశ్రయంలో పట్టుకున్నారంటూ.. ఆ ఆయిల్ను లండన్ విమానాశ్రయంలో పట్టుకున్నారంటూ బెంజిమన్ చెప్పాడు. రిలీజ్ చేయడానికి కస్టమ్స్ డ్యూటీ, వ్యాట్ కట్టాలని చెప్పి మరికొంత మొత్తం కాజేశాడు. ఇలా ఈ ఏడాది మార్చ్ నుంచి మే వరకు వివిధ విడతల్లో మొత్తం 16,11,025 డాలర్లు వివిధ బ్యాంకు ఖాతాల్లో వేయించుకున్నారు. మరో 2 వేల డాలర్లు పంపాలంటూ నేరగాళ్ల కోరడంతో చంద్రశేఖర్ అనుమానించారు. ఈ క్రమంలో ఈ ఏడాది మేలో ఓ అపరిచిత వ్యక్తి నుంచి చంద్రశేఖర్కు మరో ఈ–మెయిల్ వచ్చింది. అందులో ఆయిల్ పేరుతో జరుగుతోంది పెద్ద మోసమంటూ అతడు పేర్కొన్నాడు. దీంతో అనుమానం వచ్చిన ఆయన లండన్ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులను సంప్రదించగా మొత్తం ఓ స్కామ్గా తేలింది. కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో చంద్రశేఖర్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బయటకు రాలేదు. చివరకు గురువారం తన సమీప బంధువు మురళీమోహన్ ద్వారా సీసీఎస్ సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతికి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. అమెరికా, దుబయ్ బ్యాంకులకు నగదు బదిలీ ప్రాథమిక పరిశీలన నేపథ్యంలో చంద్రశేఖర్కు అమెరికాలోని వెల్స్ మార్గో బ్యాంకులో ఉన్న ఖాతా నుంచి అమెరికా, దుబయ్ల్లో ఉన్న మొరిల్లా బ్యాంక్ ఆఫ్ అమెరికా బ్రాంచ్లకు చెందిన తొమ్మిది ఖాతాల్లోకి ఈ నగదు వెళ్లినట్లు గుర్తించారు. కొన్నేళ్ల క్రితం ఇలానే ఓ వైద్యుడి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.2.5 కోట్లు కాజేశారు. ఇప్పటి వరకు ఇదే పెద్ద కేసుగా రికార్డుల్లో ఉంది. -
Punganur Cow: వెయ్యేళ్ల నాటి ఆవుకు వెయ్యికోట్లు
ఈ ఆవుల కోసం యుద్ధాలు జరిగాయి.. శాసనాలు కీర్తించాయి. కరువు రక్కసిని తట్టుకున్నాయి. ఔషధ పాలను అందించాయి. దేశవ్యాప్తంగా ఖ్యాతి గడించాయి. అయితే కాలక్రమేణా అంతరించిపోయాయి. మందల నుంచి వందల్లోకి చేరాయి. ఈ క్రమంలో పశుసంపద అభివృద్ధికి ప్రభుత్వం సంకల్పించింది. వెయ్యేళ్ల నాటి ఆవు కోసం వెయ్యి కోట్ల నిధులు విడుదల చేసింది. పుంగనూరు: దేశవాళీ ఆవుల్లోనే విశిష్టమైన పుంగనూరు జాతి అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఆవుల పరిశోధనలు, ఉత్పత్తికి వెయ్యి కోట్ల నిధులు విడుదల చేసింది. కడపలో ఈ ఆవుల అభివృద్ధి, పునరుత్పత్తి కేంద్రం ఏర్పాటుకు గత ఏడాది రూ.70 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం పుంగనూరు జాతి పశువులు 241 వరకు ఉన్నట్లు సమాచారం. పలమనేరు క్యాటిల్ఫామ్లో 221 ఉండగా, అనంతపురం జిల్లా కూడేరులో పాడి రైతు కృష్ణమూర్తి వద్ద 20 ఉన్నాయి. వీటిని సంరక్షిస్తూ పునరుత్పత్తిని పెంచడానికి అవసరమైన పరిశోధనలు జరిపేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పుంగనూరు జాతి అభివృద్ధే లక్ష్యం పలమనేరు సమీపంలోని కేటిల్ఫామ్ వద్ద 1953లో సంకర జాతి ఆవుల ఉత్పత్తి, పరిశోధనా కేంద్రం ఏర్పడింది. ఈ పశుపరిశోధన సంస్థ 1995 నుంచి పుంగనూరు పొట్టి రకం పశువుల ఉత్పత్తి కేంద్రంగా మారింది. ఇన్సైటీవ్ కాన్జర్వేషన్(స్థానికంగా వీటి సంఖ్యను ఉత్పత్తి చేయడం) అనే లక్ష్యంతో ఇది ప్రారంభమైంది. గతంలో పుంగనూరు పొట్టి రకం ఆవులు పుంగనూరు, పలమనేరు, మదనపల్లెల్లో పుట్టి వృద్ధి చెందేవి. అప్పట్లో పుంగనూరు సంస్థానాధీసులు వీటిని పిఠాపురం, కాకినాడ సంస్థానాధీసులకు బహుమానంగా అందజేయడంతో ఆ ప్రాంతంలోనూ ఇవి కొంతవరకు ఉన్నట్లు తెలుస్తోంది. అంతరించిపోతున్న అరుదైన జాతులు దేశంలో 34 రకాల పశు జాతులున్నాయి. వీటిల్లో అత్యంత ముఖ్యమైంది పుంగనూరు పొట్టి రకం పశువులు. ప్రస్తుతం దేశంలో ఇలాంటి పశువులు 350 దాకా ఉండగా, అందులో 221 వరకు పలమనేరులోని పశు పరిశోధనా కేంద్రంలోనే ఉన్నాయి. అలాగే కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లాలో వేచూరు రకం పొట్టి ఆవులు (ఇవి ఎరుపు రంగులో ఉంటాయి) సంఖ్య పదికి పడిపోయింది. అధిక పాలనిచ్చే షాహీవాల్ రకం కూడా కనుమరుగవుతోంది. ప్రస్తుతం ఇవి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, పాకిస్తాన్లోని మాటంగొమేరి జిల్లాలో మాత్రం కనిపిస్తున్నాయి. తగ్గుతున్న ఉత్పత్తి పదిహేడేళ్ల క్రితం 20 పొట్టి రకం ఆవులతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో అనుకున్నంతగా ఉత్పత్తి జరగడం లేదు. క్రమేణా ఇక్కడ పేయి దూడల ఉత్పత్తి తగ్గుతోంది. ఒకే రక్త సంబంధం కలిగిన కోడెలతో సంకరణం చెందడంతో ఉత్పత్తి అయ్యే దూడలు ఆరోగ్యంతో జన్మిస్తున్నాయి. జన్యుపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ కోడెల ద్వారా ఉత్పత్తి అయ్యే దూడలు బలహీనంగా పుట్టి మృతిచెందుతున్నాయి. పిండమార్పిడి పద్ధతి ద్వారా.. పరిశోధనా కేంద్రంలో ప్రభుత్వం రూ.1.18 కోట్లతో పిండమార్పిడి కేంద్రాన్ని (ఎంబ్రో ట్రాన్స్ఫర్ ల్యాబ్) నెలకొల్పింది. దీని ద్వారా ఎదకొచ్చిన ఆవుకు పుంగనూరు జాతి సెమన్ను ఇచ్చి దాని ద్వారా ఎక్కువ అండాలను ఉత్పత్తి చేయిస్తారు. ఆపై కృత్రిమ గర్భాధారణ ద్వారా ఫలదీకరణం జరిపి ఈ అండాలను పోగు చేసి సరోగసి పద్ధతిలో ఇతర ఆవులకు ఇంప్లాంట్ చేస్తారు. ఇక్కడి నుంచి ఈ జాతి వీర్యాన్ని గుంటూరు జిల్లాలోని లాంఫారం, కర్ణాల్లోని యన్.బి.ఏ.జి.ఆర్ (జాతీయ జన్యువనరుల కేంద్రం)లో భద్రపరుస్తున్నారు. పుంగనూరు జాతి చరిత్ర క్రీస్తుశకం 610 సంవత్సరంలో పుంగనూరు జాతి ఆవులను గుర్తించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. దక్షిణాపద దేశంలోని పుంగనూరు ప్రాంతంలో పొట్టి ఆవులను కనుగొన్నారు. బాణులు, నోళంబులు, వైదంబచోళ ప్రభువులు పుంగనూరు ఆవులను తమ సంస్థానాల్లో పోషించేవారు. పుంగనూరు నుంచి తిరుపతి వరకున్న అప్పటి అభయారణ్యంలో పుంగనూరు ఆవుల అభివృద్ధి సాగింది. మందలు మందలుగా ఉండే ఈ ఆవుల కోసం యుద్ధాలు చేసేవారు. విజేతలు విజయచిహ్నంగా ఆవుల మందలను తీసుకెళ్లినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ప్రత్యేకతలు పుంగనూరు జాతి ఆవులు దేశంలోనే మరెక్కడా కనిపించవు. సాధారణ ఆవు పాల ధరకంటే ఈ ఆవుపాలకు రెట్టింపు గిరాకీ ఉంది. తెలుపు, నలుపు ఆవుల పాలు, పెరుగు, నెయ్యికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ పాలలో అత్యధికంగా ఔషధ గుణాలున్నట్లు బయోడైవర్సిటీ ప్రకటించింది. పుంగనూరు ఆవుల చరిత్ర, విశిష్టతపై మద్రాస్ ప్రభుత్వం అప్పట్లో గెజిట్ను విడుదల చేసింది. కెఎస్ఎస్.శేషన్ అనే రచయిత తన పరిశోధనాత్మక పుస్తకం బ్రిటీష్ రోల్ ఇన్ రూరల్ ఎకానమిలో పుంగనూరు జాతి సంరక్షణకు జమీందారులు చేపట్టిన చర్యలు విశదీకరించారు. మహాబలి బాణరాజు విక్రమాదిత్య కాలంలో నోళంబులు దాడులు చేసి ఆవుల మందలను తోలుకెళ్లినట్లు బూడిదపల్లె, కురిజల, మినికి, మేటిమంద, కరకమంద, ఈడిగపల్లె, సోమల, రామసముద్రం గ్రామాల్లోని శాసనాలు చెబుతున్నాయి. అప్పట్లో రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, ముఖ్యమంత్రులు జలగం వెంగళరావు, కోట్ల విజయభాస్కర్రెడ్డి, ఎన్టీరామారావు పుంగనూరు ఆవులను పోషించుకునేవారు. విశిష్టతలు ► పశువు 70 నుంచి 90 సెంటిమీటర్ల ఎత్తు మాత్రమే ఉంటుంది. ► ఈ ఆవు పాలలో 8 శాతం కొవ్వు ఉండి, ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ► ఈ జాతి ఆవులు 115 నుంచి 200 కిలోల బరువుంటాయి. ► రోజుకు 5 కిలోల పచ్చిగడ్డిని తింటుంది. ► 2 నుంచి 4 లీటర్ల వరకు పాల దిగుబడిని ఇస్తుంది. ► ఎంత కరువు పరిస్థితులు ఎదురైనా తట్టుకుని జీవించగలవు. ► లేత చర్మము, చిన్న పొదుగు, చిన్నతోక, చిట్టికొమ్ములు కలిగి నలుపు, తెలుపు వర్ణంలో ఉంటాయి. ► ఈ ఆవుల ధర లక్ష నుంచి ఇరవై లక్షల వరకు పలుకుతుంది. పూర్వవైభవం దిశగా చర్యలు కనుమరుగవుతున్న పుంగనూరు జాతి పాడి ఆవులకు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ప్రణాళిక సిద్ధం చేశాం. అతి తక్కువ ధరకు లభించే ఈ ఆవులను ఇప్పుడు లక్షలాది రూపాయలతో కొనుగోలు చేయాల్సి వస్తోంది. తాజా పరిస్థితిపై సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డికి నివేదికలు అందజేశాం. ప్రభుత్వం కూడా వెనువెంటనే స్పందించింది. గతంలో ఏ ముఖ్యమంత్రి చొరవ చూపని విధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పుంగనూరు ఆవుల పునరుత్పత్తికి రూ.వెయ్యి కోట్లు కేటాయించడం అభినందనీయం. ఈ ప్రాంతం ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటుంది. – డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి మంచి పరిణామం పుంగనూరు జాతి ఆవులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మంచి పరిణామం. నా చిన్నప్పుడు పుంగనూరు, పరిసర ప్రాంతాల్లో ప్రతి ఇంటిలోను రెండు, మూడు ఆవులు ఉండేవి. ప్రస్తుతం అవి వెదికినా కనిపించడం లేదు. నూరు రూపాయలకు లభించే ఆవు ఇప్పుడు రెండు లక్షల ధర పలుకుతోంది. ఈ జాతికి కోడెదూడలు పుడుతుండడంతో పునరుత్పత్తి బాగా తగ్గిపోయింది. – ఖాదర్ఖాన్, ఆవుల వ్యాపారి, పుంగనూరు మరింత అభివృద్ధి ఇక్కడి పరిశోధనా కేంద్రంలో 221 వరకు పుంగనూరు రకం పశువులున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎల్డీఏ ద్వారా కూడా ఈ జాతి వీర్యాన్ని అందించేందుకు కృషి చేస్తున్నాం. అరుదైన పుంగనూరు పొట్టి రకం జాతులను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. – గంగరాజు, సీనియర్ సైంటిస్ట్, పలమనేరు సంరక్షణ సులభం పుంగనూరు ఆవులను డార్వ్స్కౌస్ అంటారు. ప్రపంచ దేశాలలో అతిపొట్టి రకమైన పుంగనూరు ఆవులో వ్యాధి నిరోధక శక్తి అధికం. ఇంగ్లండ్లోని డెస్టర్కౌ 90 సెంటిమీటర్ల ఎత్తు ఉంటుంది. పుంగనూరు ఆవులు 70 నుంచి 80 సెంటిమీటర్లు ఎత్తు మాత్రమే ఉంటాయి. అయినప్పటికీ ప్రపంచ రికార్డును ఇంగ్లండ్ డస్టర్కౌకు ఇవ్వడం సమంజసం కాదు. జమీందారులకు ప్రీతిపాత్రమైన పుంగనూరు జాతి ఆవుల మేత కోసం నియోజకవర్గంలోని ఆవులపల్లెలో కొన్నివేల ఎకరాలను కేటాయించిన చరిత్ర ఉంది. – కెఎస్ఎస్.శేషన్, విశ్రాంత ప్రొఫెసర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ -
మూగజీవాలపై యమపాశం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని హనుమాన్ బస్తీ, రామవరంలోని చిట్టిరామవరం పొలాల్లో విద్యుత్ తీగలు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. లక్ష్మీదేవిపల్లి, రేగళ్ల, ప్రగతినగర్ కాలనీలో కూడా విద్యుత్ తీగలు భయపెట్టిస్తున్నాయి. ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ లేకుండా ప్రధాన రోడ్డుకు దగ్గరగా ఉన్నాయి. 2020–21 సంవత్సరంలో జిల్లాలో జరిగిన విద్యుత్ ప్రమాదాల్లో 79 పశువులు, 23 మంది వ్యక్తులు చనిపోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. సాక్షి, హైదరాబాద్: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు పాడి పశువులు, మూగ జీవాల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. తక్కువ ఎత్తులో ప్రమాదకరంగా వేలాడే విద్యుత్ తీగలు, ఏళ్ల తరబడి మరమ్మతులు, నిర్వహణ లేక గాలివానలకు తెగిపడే తీగలు, పడిపోయే స్తంభాలు, ఎర్తింగ్ లోపాలు, నాసిరకం పరికరాల కారణంగా రాష్ట్రంలో ఏటా వందల సంఖ్యలో మూగజీవాలు విద్యుదాఘాతానికి గురై మరణిస్తు న్నాయి. పెద్ద సంఖ్యలో రైతులు, ఇతరులు కూడా మృత్యువాత పడుతున్నారు. ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్/ ఎస్పీడీసీఎల్)ల అధికారిక లెక్కల ప్రకారం గడిచిన నాలుగేళ్లలో.. అనగా 2017–21 మధ్య కాలంలో రాష్ట్రంలో ఏకంగా 5,400కు పైగా మూగజీవాలు విద్యుత్ ప్రమాదాలకు బలయ్యాయి. ఏటా సగటున 1,300 మూగజీవాలు విద్యుత్ సంబంధిత ప్రమాదాల్లో మరణిస్తున్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక అధికారిక లెక్కలకు అందని మూగజీవాల మరణాలు మరో రెండు రెట్లు అధికంగా ఉంటాయని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. రైతన్నల కుడిఎడమ భుజాలైన కాడెద్దులు పంట పొలాల్లో మేతకు వెళ్లినప్పుడో, మరో సందర్భంలోనో కరెంట్ షాక్కు గురై మృత్యు వాత పడటం ఆయా కుటుంబాలకు తీవ్ర దుఃఖాన్ని కలిగిస్తోంది. ప్రేమతో పెంచుకునే పాడి పశువులు విద్యుత్ ప్రమాదాల్లో మరణించినప్పుడు ప్రజల ఆవేదన వర్ణనాతీతంగా ఉంటోంది. లక్షల విలువైన పశువులతో పాటు జీవనాధారాన్ని కోల్పోయి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. 50 శాతం ప్రమాదాలకు శాఖా పరమైన లోపాలే కారణం కావడం విచారకరం. పరిహారం చెల్లింపుల్లో జాప్యం.. శాఖాపరమైన కారణాలతో మనుషులు, మూగ జీవాలు విద్యుదాఘాతానికి గురై మరణిస్తే డిస్కంలు విచారణ జరిపి పరిహారం చెల్లించాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. మనుషులకు రూ.5 లక్షలు, ఆవులు, ఎద్దులు, గేదెలు వంటి పాడి పశువులకు రూ.40 వేలు, మేకలు, గొర్రెలకు రూ.7 వేల చొప్పున పరిహారం చెల్లించాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) స్పష్టం చేసింది. అయితే ఈ పరిహారం చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. విచారణలు, నివేదికల పేరిట క్షేత్ర స్థాయి అధికారులు తాత్సారం చేస్తున్నారు. కొం త మంది క్షేత్రస్థాయి అధికారులు నెపాన్ని వినియో గదారులపై నెట్టేసి తప్పుడు నివేదికలు ఇచ్చి పరిహారం రాకుండా చేస్తున్నారనే విమర్శ లు న్నాయి. బాగా పాలిచ్చే ఆవులు, గేదెల మార్కెట్ ధర రూ.50 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు ఉండగా, పరిహారం 50 శాతం కూడా రావడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లో గతేడాది (2020–21) సంభవించిన విద్యుత్ ప్రమా దాల్లో 175 మంది మనుషులు మరణించగా, 150 బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించారు. 471 మూగజీవాలు బలి కాగా, 377 జీవాల యజమా నులకు పరిహారం చెల్లించారు. ప్రస్తుత 2021–22 లో గత మే నెల నాటికి 21 మంది మనుషులు,75 మూగజీవాలు మరణించగా 19 మందికి, 40 జీవా లకు పరిహారం లభించింది. చాలా ప్రమాదాలు శాఖాపరమైన కారణాలతోనే.. తక్కువ ఎత్తులో విద్యుత్ వైర్లు వేలాడటం, ఎర్తింగ్ నిర్వహణ లేకపోవడం, విద్యుత్ స్తంభాలు/వైర్లు తెగిపడడం, 11/6.6 కేవీ జంపర్లు విఫలం కావడం, 11 కేవీ ఏబీ స్విచ్ పైప్/కేబుల్ ఇన్సులేటర్ ఫెయిల్ కావడం, హెచ్టీ/ఎల్టీ లైన్ స్నాప్ కావడం, విద్యుత్ స్తంభాలకు సపోర్ట్గా ఉండే స్టే–వైర్లకు విద్యుత్ సరఫరా కావడం, చాలాచోట్ల రక్షణ లేని ట్రాన్స్ఫార్మర్లు, ఎల్టీ లైన్లకు చెట్ల కొమ్మలు తగలడం వంటి శాఖాపర కారణాలతోనే 50 శాతానికి పైగా విద్యుత్ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తీగలు వేలాడటం వంటి వాటిపై క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఏళ్ల తరబడి సమస్యలను పరిష్కరించట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజల అజాగ్రత్తలు, అవగాహన లోపం, భద్రత ప్రమాణాలు పాటించకపోవడం వంటి కారణలతో చాలా ప్రమాదాలు సంభవిస్తున్నాయని డిస్కంల అధికారవర్గాలు పేర్కొంటుండటం గమనార్హం. ‘పవర్ వీక్’ నిర్వహించినా మారని పరిస్థితి.. చాలా సందర్భాల్లో చిన్నచిన్న లోపాలే విద్యుదాఘాతాలకు దారితీసి నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. ఈ నేపథ్యంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు పవర్ వీక్ నిర్వహించాలని గతేడాది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు డిస్కంలను ఆదేశించారు. ఇకపై ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా అన్ని రకాల సమస్యలను పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగా ఎస్పీడీసీఎల్ సంస్థ రూ.195 కోట్లు ఖర్చు చేసి తమ పరిధిలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లోని 8,567 గ్రామాల్లో వివిధ రకాల పనులు చేసినట్టు ప్రకటించుకుంది. వంగిన/తుప్పుపట్టిన/పాడైపోయిన 43,486 స్తంభాల మార్పిడి, దెబ్బతిన్న 22,483 స్టే వైర్ల మార్పిడి, 1,24,175 చోట్లలో వదులుగా ఉన్న తీగలను సరి చేయడం తదితర పనులు చేపట్టినట్లు వెల్లడించింది. ఎన్పీడీసీఎల్ సైతం ఇదే తరహాలో పవర్ వీక్ నిర్వహించి మరమ్మతు, నిర్వహణ పనులు చేపట్టినట్లు తెలిపింది. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ సమస్యలు కొనసాగుతుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుని పెద్ద సంఖ్యలో మూగజీవాలు బలవుతున్నాయి. -
ఏపీ: నవంబర్ 26న పాడి పండుగ
సాక్షి, అమరావతి : వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల లబ్ధిదారులైన మహిళలకు నవంబర్ 26వ తేదీన పాడి పశువులను పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పంపిణీకి ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. వర్చువల్ విధానంలో వచ్చే గురువారం రోజు తొలిదశలో ప్రకాశం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లోని 400 గ్రామాల్లో దాదాపు 7 వేల యూనిట్ల పాడి పశువుల పంపిణీని సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం దశలవారీగా పంపిణీ చేసేలా ప్రణాళికలను సిద్ధం చేశారు. వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల లబ్ధిదారులైన మహిళలకు పాడి పశువులు, గొర్రెలు, మేకల పంపిణీ కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లాలవారీగా వివరాలను పరిశీలించారు. చేయూత ద్వారా కొత్తగా లబ్ధి పొందిన 2.78 లక్షల మంది నుంచి కూడా ఆప్షన్లు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పశువులపై పెట్టుబడి పోషకులకు కచ్చితంగా గిట్టుబాటు కావాలని, ఈ మేరకు పాడి పశువులను ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. పాల దిగుబడి బాగుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా సాధికారత, సుస్థిర ఆర్ధికాభివృద్ధి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు చెప్పారు. పశువుల దాణా, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల ద్వారా ఇప్పటివరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 78 వేల దుకాణాలు ప్రారంభం అయినట్లు అధికారులు సీఎంకు వివరించారు. సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీదిరి అప్పలరాజు, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమీక్షలో సీఎం సూచనల్లో ముఖ్యాంశాలివీ.. ఆర్బీకేల్లో సదుపాయాలను వినియోగించుకోవాలి పెట్టుబడి కచ్చితంగా గిట్టుబాటు అయ్యేలా మేలు జాతిని ఎంపిక చేసేలా జాగ్రత్త వహించాలి. కొనుగోళ్ల కమిటీలో సాంకేతిక నైపుణ్యం కలిగిన వారుండాలి. బీమా సంస్థ ప్రతినిధితో పాటు బ్యాంకర్ కూడా ఆ కమిటీలో సభ్యులుగా ఉండాలి. పశు సంవర్థక శాఖ సేవలను బలోపేతం చేసి ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలి. పాడి పశువులకు ఎలాంటి సమస్య వచ్చినా ఆర్బీకేల పరిధిలో వెంటనే వాటికి వైద్యం అందించేలా అధికారులు సన్నద్ధం కావాలి. ఆర్బీకేల పరిధిలో ఏర్పాటయ్యే వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాలను వైద్య సేవల కోసం వినియోగించుకోవాలి. కాల్ సెంటర్ల ద్వారా వైద్యం అందించాలి. సహజసిద్ధమైన దాణా.. పశువుల దాణా సక్రమంగా సరఫరా చేస్తూ రసాయనాలు (కెమికల్స్) లేకుండా సహజమైన పదార్థాలతో తయారైనవే అందించాలి. పశువులకు కలుషితమైన ఆహారం అందించడం వల్ల క్యాన్సర్ లాంటి వ్యాధులు పెరుగుతున్నాయి. సేంద్రీయ (ఆర్గానిక్) పాలు, సేంద్రీయ మాంసం ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి. దీనివల్ల ఉత్పత్తులకు మరింత మెరుగైన ధర లభించే అవకాశం ఉంటుంది. సేంద్రీయ పాల బ్రాండ్పై విస్తృత ప్రచారం చేపట్టి మహిళలకు అవగాహన కల్పించాలి. పశువులకు ఆరోగ్య కార్డులు.. ప్రతి పశువునూ పశు సంవర్థక శాఖ అధికారులు భౌతికంగా తనిఖీ చేశాక లబ్ధిదారులకు అందచేయనున్నారు. లబ్ధిదారుల జాబితాను ఆర్బీకేల పరిధిలో నమోదు చేసి ప్రతి నెలా పశువుల ఆరోగ్యాన్ని వైద్యులు పరిశీలిస్తారు. పాడి పశువులకు ఇచ్చే ఆరోగ్య కార్డులో ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేస్తారు. పాల దిగుబడి వివరాలు కూడా ఇందులో పొందుపరుస్తారు. లబ్ధిదారులకు పాడి పశువులు, గొర్రెలు, మేకల పంపిణీ ఇలా 2020 నవంబర్ 26 : ప్రకాశం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లోని 400 గ్రామాల్లో దాదాపు 7 వేల యూనిట్ల గేదెలు, ఆవుల పంపిణీ 2020 డిసెంబర్ 5 – 2021 ఫిబ్రవరి 28 మధ్య :దాదాపు లక్ష యూనిట్ల ఆవులు, గేదెల పంపిణీ ఆగస్టు 2021 – ఫిబ్రవరి 2022 మధ్య : 3.69 లక్షల యూనిట్ల ఆవులు, గేదెల పంపిణీ 2021 నవంబరు 30 నుంచి – 2021 డిసెంబర్ 31 వరకు: గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీ -
పశువులూ దూరం దూరం
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో పాడి రైతులు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా డెయిరీ ఫాంలలో పశువుల నిర్వహణ పకడ్బందీగా చేయాలని జాతీయ పశు పరిశోధన సంస్థ (ఈటానగర్) సూచించింది. కొత్త గా పశువులను కొనుగోలు చేస్తే వాటిని నేరుగా ఫాం షెడ్లలోకి తీసుకురావద్దని, 3 వారాల పాటు వాటిని క్వారంటై న్ చేసిన తర్వాతే ఇతర పశువులతో వాటిని కలపాలని పేర్కొంది. రోజూ పశువులు ఆహారం సరిగా తీసుకుంటున్నాయా లేదా అనేది జాగ్రత్తగా గమనించాలని సూచించింది. ఉదయం, సాయంత్రం మూత్రం క్రమం తప్పకుండా చేస్తున్నాయో లే దో చూసుకోవాలని వెల్లడించింది. వివిధ దేశాల్లో జంతువులకు కరోనా వైరస్ సోకుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో డెయిరీ ఫాంలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పశువుల పట్ల వ్యవహరించా ల్సిన తీరుపై సంస్థ పలు సూచనలు చేసింది. సూచనలు ఇవే.. ► డెయిరీ ఫాంలలోకి సాధ్యమైనంత వరకు కొత్త వ్యక్తులను రానీయకుండా ఉంటే మంచిది. ► ఫాంలలో పనిచేసే వారి సంఖ్య కూడా వీలున్నంత తగ్గించాలి. ► పనిచేసే వారంతా మాస్కులు ధరించాలి. వారికి థర్మల్ స్కానింగ్ చేసిన తర్వాతే ఫాంలోకి అనుమతించాలి. ► షెడ్లు క్రమం తప్పకుండా శానిటైజ్ చేయాలి. సబ్బు, నీళ్ల బకెట్, హ్యాండ్ శానిటైజర్ ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. ప్రతి గంట లేదంటే 2 గంటలకు ఒకసారి చేతులు శుభ్రం చేసుకోవాలి. ► ఫాంలలోకి వెళ్లే వాళ్లు వాచ్లు, ఆభరణాలు ధరించొద్దు. మొబైల్ ఫోన్ వినియోగించకుండా ఉంటే మంచిది. ఫోన్ తీసుకెళ్లాలనుకుంటే శానిటైజ్ చేయాలి. ► పశువులకు అవసరమైన గడ్డి, దాణా, మందులు అందుబాటులో ఉంచుకోవాలి. ► పశువుల తీరును శ్రద్ధగా గమనించాలి. గడ్డి, ఇతర ఆహారం సరిగా తీసుకుంటున్నాయా, లేదా గమనించాలి. రోజూ ఉదయం, సాయంత్రం మూత్రం క్రమం తప్పకుండా పోస్తున్నాయా లేదా చూసుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పశు వైద్యుడిని సంప్రదించాలి. ► ఏవైనా పశువులు అనారోగ్యం బారిన పడితే పడ్డ వాటిని ఐసోలేట్ చేయాలి. ► వ్యాధులు రాకుండా టీకాలు వేయించాలి. ► గర్భంతో ఉన్న పశువుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. అవి ఉండే ప్రదేశాల్లో వేడి ఎక్కువ లేకుండా చూసుకోవాలి. ► రోజూ పశువులను కడగాలి. కొత్తగా పుట్టిన దూడలకు పాలు, ఎలక్ట్రోలైట్ నీళ్లు తగినంత తాపించాలి. ► పాల విక్రయం కోసం వినియోగదారుల వద్దకు పశువులను తరలించి అక్కడ పాలు పిండటాన్ని మానేయాలి. క్వారంటైన్ విషయంలో పాడి రైతులు పూర్తి అవగాహన పెంచుకోవాలి. ప్రభుత్వం పాడి అభివృద్ధిలో భాగంగా జరిపే పరిశోధనలు, ఇతర విషయాల్లో క్వారంటైన్ తప్పకుండా పాటిస్తాం. 21 రోజులు కొత్త పశువును దూరంగా ఉంచిన తర్వాతే మందలో కలపాలి. రైతులు పూర్తిగా ఇది పాటిం చట్లేదు. జాతీయ పశు పరిశోధనా సం స్థ సూచనల నేపథ్యంలోనైనా పాడి రైతులు ‘క్వారంటైన్’ అలవాటు చేసుకో వాలి. అన్ని సూచనలను విధిగా పాటించాలి. – డాక్టర్ లాకావత్ రాంసింగ్,అసిస్టెంట్ ప్రొఫెసర్, పీవీ నరసింహారావు పశు విశ్వవిద్యాలయం -
రైతుల కన్నా పశుపోషకుల ఆదాయం ఎక్కువ
తెలంగాణకు తలమానికం వంటి పశు జాతి ‘పొడ తూర్పు’. తూర్పు కనుమల్లోని అమ్రబాద్ టైగర్ రిజర్వ్ నల్లమల అటవీ ప్రాంతంలో విరాజిల్లుతున్న పశు జాతి ఇది. నాగర్కర్నూల్ (పాత మహబూబ్నగర్) జిల్లాలోని తూర్పు భాగాన రైతులు, పశుపోషకులు అయిన లంబాడాలు, గొల్లలు, చెంచులకు తరతరాలుగా జీవనాధారంగా నిలుస్తున్నందున ఈ పశుజాతికి ‘తూర్పు’ అనే మాట వచ్చింది. ఈ జాతి పశువుల దేహంపై పొడ మచ్చలు ఉండటంతో ‘పొడ తూర్పు’ అని పేరు వచ్చింది. స్థానికులు ‘పొడ ఎడ్లు’ అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ జాతి ఎడ్లు మెట్ట రైతులకు వ్యవసాయంలో పెద్ద భరోసాగా నిలుస్తున్నాయి. మెట్ట పొలాలను దున్నటంతో పాటు మాగాణుల్లో దమ్ము చేయడానికి, ఇతర వ్యవసాయ పనుల్లో పొడ ఎడ్లు బాగా పనిచేస్తాయి. ఎంత కష్టమైన పనైనా విసుగు విరామం లేకుండా కొనసాగించి పూర్తి చేయటం, చీటికి మాటికి జబ్బుపడకుండా ఉండటం, తక్కువ మేత, తక్కువ నీటితో కూడా మనగలగడం ఈ పశు జాతి ఎడ్లకున్న సుగుణాలు. అందుకే నాగర్కర్నూల్ ప్రాంత పశుపోషకులకు, రైతులకు పొడ ఎడ్లంటే అంత మక్కువ. వారి పండుగలు జాతర్లలో ఈ పశువులకు ప్రాధాన్యం ఉంటుంది. పొడ జాతి ఆవులు పాలు తక్కువగా ఇస్తాయి. అందుకే ఆ పాలను కూడా పూర్తిగా దూడలకే వదిలేసే పశుపోషకులు కూడా ఈ ప్రాంతంలో కనిపిస్తారు. మూడేళ్ల క్రితం వాసన్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పొడ తూర్పు పశు జాతి విశిష్టతల గురించి, స్థానిక పశు సంరక్షక, వ్యవసాయ కుటుంబాల వారు తరతరాలుగా ఈ పశుజాతిని పరిరక్షించుకుంటూ పొట్టపోసుకుంటున్న వైనం గురించి రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. 2016లో, 17లో పొడ ఎడ్ల మేళాలను ఏర్పాటు చేయటంతో ఈ జాతి ఎడ్లంటే వివిధ ప్రాంతాల, రాష్ట్రాల రైతులకున్న మక్కువ వెల్లడైంది. దీంతో తెలంగాణ పశుసంవర్థక శాఖ పొడ తూర్పు జాతి పశు జాతి జన్యు స్వచ్ఛతను కాపాడాలని సంకల్పించింది. కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్లు చెయ్యడం నిలిపివేసింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన 44వ పశుజాతి ఆ తర్వాత రెండేళ్ల పాటు ఈ జాతి పశు సంపద స్థితిగతులపై అధ్యయనం జరిగింది. స్థానిక రైతులు, పశుపోషకుల జీవితాలతో, వారి జీవనోపాదులతో ఈ పశు జాతి తరతరాలుగా ఎంత గాఢంగా పెనవేసుకొని ఉన్నదో అధికారికంగా గుర్తించడానికి ఈ అధ్యయనం తోడ్పడింది. సుమారు 450–500 వరకు లంబాడి, గొల్ల, ఎస్సీ కుటుంబాలు కేవలం పొడ తూర్పు పశు జాతి పోషణనే జీవనాధారంగా చేసుకొని జీవిస్తున్నారు. ప్రస్తుతం ఈ జాతి పశువులు 15,076 ఉన్నాయి. వీటికి ప్రత్యేకంగా మేత వేయటం, దాణా పెట్టడం అవసరం లేదు. పచ్చిక బయళ్లలో, అటవీ ప్రాంతంలో మేసే మేతే చాలు. ప్రత్యేకంగా మేత, దాణా వేయక్కరలేదు. ఈ నెల 19న కేంద్ర ప్రభుత్వానికి చెందిన జాతీయ పశు జన్యువనరుల బోర్డు(ఎన్.ఎ.పి.జి.ఆర్.) పొడ తూర్పు జాతి పశువులకు గుర్తింపునిస్తూ నిర్ణయం తీసుకుంది. త్వరలో ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. ఎన్.ఎ.పి.జి.ఆర్. ఇప్పటికే 43 భారతీయ పశుజాతులను గుర్తించింది. తాజాగా గుర్తింపు పొందిన ‘పొడ తూర్పు’ 44వది. రైతుల కన్నా పశుపోషకుల ఆదాయం ఎక్కువ నాగర్కర్నూల్, పాత మహబూబ్నగర్ ప్రాంతంలో వర్షాధార వ్యవసాయమే ఎక్కువ. తరచూ కరువు పరిస్థితులను చవిచూసే ఈ ప్రాంత రైతులు వ్యవసాయంపై పొందే ఆదాయం కన్నా ‘పొడ తూర్పు’ పశువులను పెంచుకుంటూ జీవించే కుటుంబాల ఆదాయం ఎక్కువగా ఉన్నట్లు వాసన్ అధ్యయనంలో తేలింది. 110 మంది పశుపోషకులపై అధ్యయనం చేశారు. వీరంతా కలిసి ‘అమ్రాబాద్ పొడ లక్ష్మి గోవు సంఘం’గా సంఘటితమయ్యారు. 80 నుంచి 120 పొడ తూర్పు ఆవులు, ఎద్దులు, దూడల మంద కలిగిన పశుపోషకుడు ఏటా 20 నుంచి 30 వరకు గిత్త దూడలను విక్రయిస్తూ, రూ. లక్షన్నర నుంచి రూ. 3 లక్షల వరకు ఆదాయం గడిస్తున్నారు. 8 నుంచి 15 నెలల గిత్త దూడల ధర రూ.8 వేల నుంచి 15 వేల వరకు పలుకుతోంది. రెండున్నర ఏళ్ల వయసు నుంచి 20 ఏళ్ల వయసు వరకు వ్యవసాయ పనుల్లో ఈ గిత్తలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఐదెకరాల మెట్ట భూమిలో వ్యవసాయం చేసే రైతులు సైతం రూ. 30 వేలకు మించి ఆదాయం పొందలేకపోతున్న ఆ ప్రాంతంలో పొడ తూర్పు పశువులను పెంచి గిత్త దూడలను అమ్ముకునే పశుపోషకుల ఆదాయం చాలా ఎక్కువగా ఉందని వాసన్ డైరెక్టర్ డా. సవ్యసాచిదాస్ ‘సాక్షి’తో చెప్పారు. మెట్ట ప్రాంత వ్యవసాయానికి చాలా అనువైన ఈ పశుజాతిని పరిరక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వ గుర్తింపు ఇందుకు తోడ్పడుతుందని ఆయన అంటున్నారు. మేత కోసం నెలల తరబడి వలస దాదాపు 400 ఏళ్ల క్రితం నుంచి ఈ పశుజాతిని స్థానికులు పోషించుకుంటూ జీవనం గడుపుతున్నారని ఒక అంచనా. గతంలో నల్లమల అటవీ ప్రాంతంలో 15 కిలోమీటర్ల లోపలి వరకు వెళ్లి పశువులను మేపుకునే వారు. అయితే, అటవీ శాఖ అధికారులు ఇటీవలి కాలంలో మూడు కిలోమీటర్ల కన్నా లోపలికి అనుమతించడం లేదు. దీంతో శీతాకాలం నుంచే మేత దొరకడం గగనమైపోయింది. జనవరి నెల నుంచి మే, జూన్ నెల వరకు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, కృష్ణాజిల్లాలకు పశువులతో వలస వెళ్లక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. పిల్లలతో సమానంగా ప్రేమిస్తాం! ముత్తాతల కాలం నుంచి పొడ(తూర్పు) ఎడ్లే మాకు జీవనాధారం. వీటితో మా జీవితాలకు విడదీయలేని అనుబంధం ఉంది. మా పిల్లలతో సమానంగా వీటిని మేం ప్రేమిస్తాం. మా తాతలు, తండ్రులు, మేము, మా పిల్లలు అందరం వీటిపైనే ఆధారపడి బతుకుతున్నాం. పిలిస్తే పలుకుతాయి మా ఎడ్లు. కొండలు, గుట్టలు ఎక్కి మేస్తాయి. విజిల్ వేస్తే చాలు చప్పున దిగి వస్తాయి. మా ప్రాంతంలో నెల క్రితమే మేత కరువైంది. మాకున్న 300 పొడ తూర్పు పశువులను తోలుకొని 15 రోజుల క్రితం గుంటూరు జిల్లాకు వలస వచ్చాం. ఇక్కడినుంచి కృష్ణా జిల్లాకు వెళ్తాం. మే, జూన్లో వర్షాలు కురిసి పచ్చిమేత మొలిచే వరకూ మాకు సంచార జీవనం తప్పదు. నేను గత పదిహేనేళ్లుగా ప్రతి ఏటా పశువులను తోలుకొని వలస వస్తూ ఉన్నాను. శ్రమ, ఖర్చు అయినా మాకు జీవనాధారమైన పశువులను రక్షించుకోవాల్సిందే. పొడ ఎడ్లకు ప్రభుత్వ గుర్తింపు రావటం సంతోషంగా ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహం కావాలి. మా పశువులకు, మాకు, జీతగాళ్లకు బీమా కల్పించాలి. – గంటల హనుమంతు (96525 21052), అధ్యక్షుడు, అమ్రాబాద్ పొడ లక్ష్మి గోవుల సంఘం, బీకే లక్ష్మీపుర్ తండా, నాగర్కర్నూల్ జిల్లా గుర్తింపు వల్ల ఒరిగేదెమిటి? పొడ తూర్పు పశుజాతికి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు రావడం వల్ల తరతరాలుగా ఈ పశుజాతిని పరిరక్షిస్తున్న స్థానిక గ్రామాల్లోని లంబాడాలు, గొల్లలు, చెంచులు, ఎస్సీలకు గ్రామ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీల (బి.ఎం.సి.ల) ద్వారా ఈ పశుజాతిపై ప్రత్యేక హక్కులు దఖలుపడతాయి. అందువల్ల ఈ పశువులను పెంచే వారికి ప్రభుత్వ పథకాలు వర్తింపజేయడానికి వీలవుతుంది. ఈ ఎడ్లను, ఆవులను కొనుగోలు చేసే రైతులు బ్యాంకుల నుంచి సబ్సిడీ రుణాలు తీసుకోవచ్చు. ఫలితంగా పశుపోషకుల ఆదాయం పెరుగుతుంది. అంతేకాదు.. అటవీ హక్కుల చట్టం కింద కూడా పొడ తూర్పు పశుపోషకులకు హక్కులు సంక్రమిస్తాయి. అటవీ శాఖ స్థానిక పశుపోషకుల హక్కులను గుర్తించేందుకు, సానుకూలంగా స్పందించడానికి అవకాశం ఉందని వాసన్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ డా. సవ్యసాచిదాస్ (94408 04860) ఆశాభావం వ్యక్తం చేశారు. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
పశువుల్లో బాక్టీరియా వ్యాధులు
శీతాకాలంలో పశువులను వ్యాధుల బారి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. గొంతువాపు: పాస్టురెల్లా మల్టోసైడా అనే బ్యాక్టీరియా వల్ల గొంతువాపు వస్తుంది. ఒక్కసారిగా జ్వరం రావడం, నోటి చొంగ, ఊపిరి కష్టంగా ఉండటం లాంటివి చూపిస్తుంది. 24 గంటల్లో పశువు చనిపోతుంది. చలికాలంలో పశువులు దగ్గర దగ్గరగా ఉంటుంటాయి. అందువల్ల చొంగ ద్వారా ఈ వ్యాధి త్వరగా వ్యాపించవచ్చు. ఇంతకుముందే టీకాలు వేయించుకొని ఉంటే గొంతువ్యాపు రాదు. ఇప్పుడు కూడా టీకా వేయించుకోవచ్చు. వైద్యము ఖరీదు కాబట్టి నివారణ మేలు. పింక్ ఐ: ఇన్ఫెచ్యువస్ బొవైన్ కెరెటో కంజెక్టువైటిస్ అనే వ్యాధికి పింక్ ఐ అని కూడా పేరు. దీని తీవ్రత వర్షాకాలంలో ఎక్కువైనప్పటికీ శీతాకాలంలోనూ వ్యాపిస్తుంది. మోరాక్సెల్లా బోవిస్ అనే బ్యాక్టీరియా వల్ల పింక్ ఐ సోకుతుంది. వ్యాధి బారిన పడి తేరుకున్న పశువుల ముక్కు రంధ్రాల ద్వారా ఈ బాక్టీరియా బయటకు వ్యాప్తి చెందుతుంది. త్వరగా వైద్యం మొదలు పెట్టడం, పశువైద్యుని సలహా మేరకు టెట్రాసైక్లిన్స్ గల ఆంటీబయోటిక్స్ని వాడాలి. ఫుట్ రాట్: దీనినే గొర్రెల్లో వాడుక భాషలో కుంట్లు అంటారు. గిట్టల మధ్య వాచి, నొప్పిగా ఉండి, పశువులు కుంటుతూ ఉంటాయి. ఫ్యూసోబ్యాక్టీరియమ్ నెక్రోఫోగమ్ అనే బ్యాక్టీరియా వలన కలుగుతుంది. చిత్తడి నేలల్లో పశువులను ఉంచినట్లయితే ఈ పరిస్థితి వస్తుంది. కాళ్ల మీద బరువు మోపలేకపోవడం, నొప్పి కనబరచడం, వాసన కలిగి ఉండడం, మేత మేయలేకపోవడం లాంటి లక్షణాలను పశువు చూపిస్తుంది. పశువులను పొడి నేలల్లో ఉండడం, పెన్సిలిన్, సెప్టియోఫర్, టెట్రాసైక్లిన్ లాంటి యాంటీ బయోటిక్స్ను వాడాలి. కాఫ్ దిప్తీరియా/లారిన్జైటిస్: ఇది కూడా ఫూసోబ్యాక్టీరియమ్ నెక్రోఫోరమ్ వల్లనే కలుగుతుంది. 3 నుంచి 18 నెలల వయసున్న దూడల్లో ఎక్కువగా కనబడుతుంది. జ్వరం, దగ్గు, రొప్పడం వంటి లక్షణాలు కనబడతాయి. పక్కపక్కనే ఉన్న పశువులకు సోకుతుంది. పశువైద్యుని సలహా మేరకు యాంటిబయోటిక్స్ను వాడాలి. కంటేజియస్ బొవైన్ ఫ్లూగో నిమోనియా: చలికాలంలో పశువుల ఊపిరితిత్తులు వాచి, 107 డిగ్రీల ఫారన్హీట్ వరకు జ్వరం రావడం, కళ్ల వెంబడి పుసులు రావడం, పశువు బాగా చిక్కిపోవడం, కష్టసాధ్యమైన ఊపిరి.. ఇవీ లక్షణాలు. పశువు 1–3 వారాల్లో చనిపోయే ప్రమాదం ఉంది. ఖచ్చితమైన పరిశుభ్రత పాటించాలి. టైలోసిస్ లాంటి యాంటిబయోటిక్స్ కొంత ఉపయోగకరం. – డా. ఎం.వి.ఎ.యన్. సూర్యనారాయణ (99485 90506), ప్రొఫెసర్ – అధిపతి, డిపార్ట్మెంట్ ఆఫ్ లైవ్స్టాక్ ఫామ్ కాంప్లెక్స్, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతి -
శీతాకాలంలో పశువులకు నిల్వ నీళ్లివ్వవద్దు
వేసవిలోలాగానే, శీతాకాలంలో కూడా పశువులు కొంత ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కొంటాయి. సాధారణంగా పశువులు తమ శరీర ఉష్ణోగ్రతను 101 డిగ్రీల ఫారెన్ హీట్గా సరిచేసుకుంటూ జీర్ణప్రక్రియను కొనసాగిస్తూ ఉంటాయి. మెటబాలిజమ్ ద్వారా ఉత్పత్తి అయ్యే వేడిని వేసవిలో చెమటద్వారా, శీతాకాలంలో మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. ఈ వేడిని బయటకు పంపే ప్రక్రియ పశువు పరిసర వాతావరణాన్ని బట్టి ఉంటుంది. వేసవిలో ఎక్కువ వేడి శరీరంలో ఉన్న పక్షంలో వడదెబ్బ తగలడం, అలానే శరీరంలో శీతాకాలంలో సరిౖయెన వేడి శరీరంలో లేనప్పుడు పశువు శీతలపు వత్తిడిని చవిచూస్తుంది. దీనినే ‘కోల్డ్ స్ట్రెస్’ అంటారు. దీని నివారణకు కొన్ని సూచనలు: 1 బాగా చల్లగా ఉన్న నీటిని పశువులకు అందించరాదు. దీనికి నివారణగా నిల్వ ఉన్న వాటిని కాకుండా, తాజా బోర్వెల్ నుంచి వచ్చిన నీటిని పశువులకు అందించాలి. నిల్వ ఉన్న నీరు ఎక్కువ చల్లగా ఉంటుంది. 2 బయట వాతావరణం చల్లగా ఉంటే, ఎక్కువ వేడి శరీరం నుంచి బయటకు పశువు వదులుకోవాల్సి వస్తుంది. అందుచేత ఎక్కువగా వేడిని ఉత్పత్తి చేసే మేపు పదార్ధాలను పశువులకు అందించాలి. ఎండుమేత వంటి వాటిని పశువుకు ఎక్కువగా అందించాలి. దాణా పదార్థాలకంటే ఇవి మేలు. 3 పశువుల షెడ్లకు ఉన్న అన్ని ద్వారాలు మూయకూడదు. గాలి, వెలుతురు తగ్గిపోయి, షెడ్లలో తేమ వాతావరణం ఏర్పడుతుంది. 4 చల్లగాలుల నుంచి పశువులను కాపాడాలి. షెడ్లలో సూర్యరశ్మి పడేటట్లు చూడాలి. 5 వీలయితే పశువులకు వరిగడ్డితో వెచ్చదనం కోసం ఒక బెడ్డును ఏర్పాటు చేయాలి. వీటిని పొడిగా ఉంచడం అవసరం. 6 సాధ్యమయినంత వరకు పశువులకు గోరువెచ్చటి నీటిని అందించగలిగితే మంచిది. శీతాకాలంలో నీటిని పశువు తక్కువగా తాగినట్లయితే, మేత ద్వారా లభ్యమయ్యే ఘన పదార్ధాన్ని తక్కువగా మేయడం, తద్వారా పాల దిగుబడి తగ్గిపోవడం జరుగుతుంది. 7 వయస్సు మళ్లిన పశువులు, దూడలు, వ్యాధి బారిన పడిన పశువులు ఎక్కువగా ఈ కోల్డ్ స్ట్రెస్ బారిన పడుతుంటాయి. వీటిని జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. 8 పాలు తీసిన తర్వాత పశువుల చనులను శుభ్రంగా తుడిచి, ఆరబెట్టి మందలోకి వదలాలి. లేకపోతే ‘ఫ్రాస్ట్ బైట్’ అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా శీతాకాలంలో కొన్ని సూచనలు పాటించవలసిన అవసరముంది. – డా. ఎం.వి.ఎ.యన్. సూర్యనారాయణ (99485 90506), ప్రొఫెసర్–అధిపతి, డిపార్ట్మెంట్ ఆఫ్ లైవ్స్టాక్ ఫామ్ కాంప్లెక్స్, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతి -
మూగ జీవాలపై వైరల్ పంజా
సాక్షి, పాలకొండ: జిల్లాలోని పశువులు వ్యాధులతో నీరసించిపోతున్నాయి. మొదట్లో చిన్న కురుపు వస్తుంది. రెండు రోజుల్లో అది పుండుగా మారి గాయం ఏర్పడుతుంది. ఇలా శరీరమంతా పుళ్లు మాదిరిగా ఏర్పడతాయి. ఈ గాయాలపై చీము పట్టి పురుగులు చేరుతున్నాయి. ఒక్కరోజు వ్యవధిలోనే పక్కన ఉన్న పశువులకు వ్యాపిస్తోంది. దీంతో అవి ఆహారం తీసుకోవడంలేదు. కాళ్ల కింద పుళ్లు కావడంతో నడవలేక పోతున్నాయి. వారం రోజుల్లో పశువులు పూర్తిగా క్షీణించిపోతున్నాయి. ఆవులు, ఎద్దులకు మాత్రమే ఈ వైరల్ వ్యాధి సోకుతోంది. దున్నలు, గేదెలలో ఈ లక్షణాలు కనిపించడం లేదు. జిల్లాలో పసువుల సంఖ్య 2.23 లక్షలు కాగా ఇంతవరకూ 42 వేల ఆవులు, ఎద్దులు అనారోగ్యం పాలయ్యాయి. పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, కొత్తూరు, పాతపట్నం, మెళియాపుట్టి, రేగిడి తదితర మండలాల్లో వైరల్ వ్యాధుల ప్రభావం కనిపిస్తోంది. పాలకొండ మండలంలోని సింగన్నవలస, పరశురాంపురం, వెలగవాడ, కొండాపురం, ఎన్కే రాజపురం తదితర గ్రామాల్లో 90 శాతం పశువులు ఈ వ్యాధితో బాధపడుతున్నాయి. ఈ వ్యాధికి ఏ మందులు వినియోగించాలో తెలియక రైతులు వేప ఆకులు, పసుపు కొమ్ములు ముద్ద చేసి రాస్తున్నారు. వ్యాధి సోకిన పశువుల రక్త నమూనాలను పశు వైద్యులు సేకరించి పరీక్షలకు పంపించారు. ప్రతి గ్రామంలోనూ వైద్యశిబిరాలు నిర్వహించేలా చర్యలు తీసుకుం టున్నారు. వ్యాధి సోకిన పశువులకు సమీపంలో ఇతర పశువులు ఉంచకుండా రైతులకు అవగాహన కలిగిస్తున్నారు. శరీరమంతా వ్యాపిస్తుంది.. ముందు శరీరంపై తామర వచ్చినట్లు కనిపిస్తుంది. రెండు రోజుల్లో గాయాలు కనబడుతున్నాయి. ఒక్కరోజులో శరీరం మొత్తం వ్యాపిస్తుంది. వాపులు ఏర్పడి పశువులు ఆహారం తీసుకోవడంలేదు. –మునికోటి రవి, రైతు, పరశురాంపురం జిల్లా అంతటా వ్యాధి లక్షణాలు.. జిల్లా అంతటా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. రైతుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. వ్యాధిని గుర్తించేందుకు చర్యలు తీసుకున్నాం. ప్రధానంగా పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, కొత్తూరు, పాతపట్నం, మెళియాపుట్టి, రేగిడి తదితర మండలాల్లో ఎక్కవగా పశువులు ఈ వ్యాధికి గురయ్యాయి. వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. నివారణ చర్యలు చేపట్టేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. –కృష్ణారావు, పశుసంవర్ధక శాఖ ఏడీ పశువులు నడవలేక పోతున్నాయి.. వారం రోజులుగా రెండు ఎద్దులకు, ఆవుకు ఈ వ్యాధి సోకింది. కాళ్ల కింద పుళ్లు ఏర్పడి నడవలేక పోతున్నాయి. గాయాలు పెద్దవి గా ఉంటున్నాయి. ప్రైవేటుగా వైద్యం చేయిస్తున్నా ఫలితం మాత్రం కలగలేదు. రూ.60 వేలు విలువ చేసే రెండు ఎద్దులు పూర్తిగా నీరసించిపోయాయి. –కాయల సత్యనారాయణ, సింగన్నవలస, రైతు వ్యాధి నిర్ధారణకు చర్యలు తీసుకున్నాం వ్యాధి సోకిన పశువుల నుంచి రక్త నమూనాల సేకరించి ల్యాబ్ పంపించాం. ఈ విషయం ఉన్నతాధికారులకు నివేదించాం. కొండ ప్రాంతం సమీపంలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. దీనికి కారణమైన వైరస్ను గుర్తించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతం వ్యాధి సోకిన పశువులకు యాంటీ బయోటిక్ ఇంజక్షన్లు వేస్తున్నాం. –ప్రదీప్ సాహు, మండల పశువైద్యాధికారి -
మాయదారి రోగం..హడలిపోతున్న ప్రజలు
‘‘మాయదారి రోగం మా ఊర్లో పశులన్నింటినీ మింగేస్తోందయ్యా.. ఏం రోగమో అంతుబట్టడడం లేదు. బాగానే ఉంటాయి.. రాత్రి పడుకున్న ఆవు తెల్లారేసరికి చనిపోతోంది. పశువుల డాక్టరు మాఊరికి వచ్చి మూడేళ్లకు పైగా అవుతోంది. ఏదైనా ఉంటే అటెండర్కు ఫోన్ చేస్తాం. ఆయన వచ్చి రెండు సెలైన్లు పెడతాడు. అయినా తెల్లారేసరికి చనిపోతున్నాయి. వేణుగోపాలసాగర్ ప్రాజెక్టులో మా భూములన్నీ పోయాయి. బతికేందుకు వేలకు వేలు అప్పులు చేసి నాలుగు ఆవులు, గేదెలను కొనుక్కున్నాం. ఒక్కొక్కటి ఇలా చనిపోతుంటే మేం ఎట్లా బతకాలయ్యా.. ఆ మాయదారి రోగమేదో మాకు వస్తే బాగుండేది.. ఈ బాధలన్నీ లేకుండా హాయిగా ఊపిరి వదిలేస్తాం...’’ ఇదీ పుత్తూరు మండల పరిధిలోని తడుకు పంచాయతీకి చెందిన పాడి రైతుల ఆవేదన. సాక్షి, పుత్తూరు: తడుకు పంచాయతీ.. తిరుపతి–చెన్నై జాతీయ రహదారికి ఆనుకుని ఉంటుంది. ఈ పంచాయతీ పరిధిలోనే వేణుగోపాలసాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. దీంతో వేణుగోపాలపురం, టీఆర్ కండ్రిగ కాలనీ, ఎస్టీ కాలనీలోని రైతులు తమ భూముల్ని ప్రాజెక్టులో భాగంగా కోల్పోయారు. నష్టపరిహారం చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో జీవనాధారం కోసం పాడిపై ఆధారపడుతున్నారు. ఆవులు, గేదెలను పోషించుకుంటూ సుమారు 300 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి పాడి రైతుల జీవితాలను అతలాకుతలం చేసే కష్టం వచ్చిపడింది. పాడి పశువులు ఒక్కొక్కటే వింతరోగంతో మృతి చెందుతుండడంతో ఏమి చేయాలో రైతులకు పాలుపోవడం లేదు. వేలకు వేలు అప్పు చేసి కొనుగోలు చేసిన పశువులు కళ్లెదుటే మృత్యువాత పడుతుండడంతో కన్నీటిపర్యంతమవుతున్నారు. కబళిస్తున్న వింత రోగం భూములు కోల్పోయాక రైతులు పశుపోషణ ఒక్కటే జీవనాధారమైంది. దీంతో అప్పులు చేసి మరీ రైతులు ఆవులు, గేదెలు కొనుగోలు చేశారు. గ్రామంలో ప్రస్తుతం వెయ్యికి పైగా పశువులు ఉన్నాయి. రెండేళ్లలో దాదాపు 40 పశువులు చనిపోయాయి. రెండు నెలలుగా వారానికి రెండు మూడు పశువులు మృత్యువాత పడ్డాయి. రైతుల కథనం మేరకు.. ‘‘పశువులు ఆరోగ్యంగానే ఉంటున్నాయి. మేత కూడా బాగానే తీసుకుంటున్నాయి. అయితే రాత్రికి రాత్రే అస్వస్థతకు గురవుతున్నాయి. సమీపంలో ఉన్న పశువైద్యశాఖకు చెందిన అటెండర్కు సమాచారం అందిస్తే రెండు సెలైన్లు ఎక్కిస్తున్నారు.ఆ తరువాత కొంత సమయానికే మృతి చెందుతున్నాయి.. రోగమేమనేది అంతుచిక్కడం లేదు’’ అని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు గేదెలు, ఆవులు ఉన్న పాడి రైతుకి ఇప్పుడు ఒక్కటి కూడా మిగలలేదని వాపోతున్నారు. కొనుగోలుకు చేసిన రుణం అలాగే ఉందని, పశువులు మాత్రం మృతి చెందుతున్నాయని కన్నీటి పర్యంతం అవుతున్నారు. గ్రామం ముఖం చూసి మూడేళ్లు పశుసంపద ఎక్కువగా ఉన్నప్పటికీ గ్రామానికి పశువైద్యాధికారి వచ్చి మూడేళ్లుకు పైగా అవుతోందని పాడిరైతులు ఆరోపిస్తున్నారు. ఏ రోగమొచ్చినా అటెండర్ దిక్కుగా మారారని పేర్కొంటున్నారు. ఇన్ని పశువులు మృతి చెందుతున్నా పశువైద్యశాఖ వైద్యులు గ్రామానికి రాకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగుతున్నాయి. కేవలం పాడిపైనే ఆధారపడి బతుకుతున్న తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. ఇకనైనా పశువైద్య శాఖ అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయమై పుత్తూరు పశువైద్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ చంద్రమౌళి గౌడ్ వివరణ కోసం ఫోన్లో ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
ప్రతి పశువుకూ ఆరోగ్యకార్డు
యాచారం(ఇబ్రహీంపట్నం): రాష్ట్రంలోని ప్రతి పాడి పశువుకు సంబంధించి ఆరోగ్య(ఆధార్) కార్డు జారీ చేస్తున్నామని, పశువుల ఆరోగ్యం విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలియజేశారు. మండల పరిధిలోని చింతపట్ల గ్రామం లో మంగళవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సర్పంచ్ లిక్కి సరితారెడ్డి అధ్యక్షతన గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేసి పశువులకు రాయితీపై దాణాను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గొల్లకురుమలు ఆర్థికంగా బాగుపడేందుకు సీఎం కేసీఆర్ రూ. 4,500 కోట్ల నిధులతో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. మొదటివిడతలో భాగంగా 7 లక్షల పంపిణీకి 4 లక్షల గొర్రెలను అందజేసినట్లు వివరించారు. మరో 3 లక్షలకు పైగా జీవాల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. జీవాల పంపిణీ పథకాన్ని సీఎం కేసీఆర్ ఎంతో ప్రతి ష్టాత్మకంగా భావిస్తున్నారని తెలిపారు. గొల్లకురుమలకు అందిస్తున్న జీవాలు ఆరోగ్యంగా ఉండి అధిక బరువుంటే మాంసం ఉత్పత్తి పెరుగుతుందనే ఉద్దేశంతో నట్టల నివారణ మందులను ఏడాదికి మూడుసార్లు వేస్తున్నట్లు తెలిపారు. జీవాల ఎదుగుదల, మాంసం ఉత్పత్తి పెరుగుదలతో కాపరులు ఆర్థికంగా బాగుపడుతారని చెప్పారు. ఈ ఏడాది రూ. 7 కోట్లు ఖర్చు చేసి నట్టల నివారణ మందులేయనున్నామని, తద్వారా రూ. 300 కోట్ల మాంసం ఉత్పత్తులు పెరిగే అవకాశం ఉందన్నారు. రైతులు జీవాలను అమ్ముకోకుండా కాపాడుకొని మంచి ఆదాయం పొంది ఆర్థిక ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. గాలికుంటు వ్యాధి పూర్తిగా నిర్మూలించడం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. గొర్రెల పథకం కింద పంపిణీ చేసిన జీవాలు రోగాలబారినపడి చనిపోతే వెంటనే వేరే గొర్రెలను ఇస్తామని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం డివిజన్లో పశువులు, గొర్రెల, మేకల పెంపకం అధికంగా ఉందని తెలిపారు. వైద్య సిబ్బంది సరిగా లేకపోవడంతో జీవాలు, పశువులు మృత్యువాత పడుతున్నాయని ఈ సందర్భంగా మంత్రి తలసాని దృష్టికి తీసుకెళ్లారు. వైద్య సిబ్బంది, ఆస్పత్రుల ఏర్పాటు విషయమై నివేదిక పంపిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. సీఎం కేసీఆర్ అన్నివర్గాల అభ్యున్నతి కోసం అహర్నిషలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్, సీఈఓ మంజువాణి, ఎండీ లక్ష్మారెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అమరేందర్, ఎంపీపీ వరŠాధ్యవత్ రజితారాజునాయక్, జెడ్పీటీసీ రమేష్గౌడ్, ఎంపీటీసీ ఎండీ షాహిన్, పీఏసీఏస్ ఉపాధ్యక్షుడు లిక్కి శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేష్, చింతపట్ల ఉప సర్పంచ్ పెండ్యాల వెంకటేష్ సాగర్, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. యాచారం: మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్కు చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం ఆయన మండల పరిధిలోని చింతపట్ల గ్రామంలో పశువులకు నట్టల నివారణ మందులు, పాడి పశువులకు దాణా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సమావేశంలో మాట్లాడారు. మూగజీవాల ఆరోగ్యం విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు. మూగజీవాల కోసం సర్కారు 1962 టోల్ఫ్రీ నంబరు ప్రవేశపెట్టిందని, ఆ నంబర్కు రైతులు పగలు, రాత్రి తేడా లేకుండా ఫోన్ చేయొచ్చని, వెంటనే అంబులెన్స్ వచ్చి సిబ్బంది చికిత్స చేస్తారని అన్నారు. ప్రతి పశువైద్యశాలలో ఉచితంగా మందులను పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. ఆ సమయంలో చింతపట్ల గ్రామానికి చెందిన రైతు బండ పర్వతాలు లేచి ‘సార్ నీవు చెప్పేది నిజం కాదు.. ఆస్పత్రిలో మందులు ఉండడం లేదు. డాక్టర్లు మెడికల్ దుకాణాల్లో కొనుగోలు చేసుకోమని అంటున్నారు. 1962కు ఫోను చేసినా అంబులెన్స్ రావడం లేద’ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. చింతపట్ల వెటర్నరీ సబ్ సెంటర్లో ఒక్కరే సిబ్బంది ఉండడంతో ఇబ్బందిగా ఉందన్నాడు. దీంతో మంత్రి తలసాని ఆగ్రహానికి గురయ్యారు. పర్వతాలను పిలిచి ‘నీవు కాంగ్రెస్ పార్టీ నాయకుడివా... రా పైకి అంటు స్టేజీ మీదికి’ అంటూ పిలిచారు. మంత్రి సూచన మేరకు పర్వతాలు తన ఫోన్ ద్వారా 1962కు కాల్ చేయగా లిఫ్ట్ చేయలేదు. అక్కడే ఉన్న సంబంధిత అధికారులు తమ ఫోన్ ద్వారా కాల్ చేయగా స్పందించారు. మంత్రి వారితో మాట్లాడి రైతులు ఫోన్ చేస్తే ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై అలా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపై క్ష్రేతస్థాయిలో ఏ సెంటర్లోనైనా రైతులకు కావాల్సిన మందులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖలో ఫోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
తేలిన లెక్క..!
సాక్షి, యాదాద్రి : జిల్లాలో మూగ జీవాల లెక్క తేలింది. డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్ఫర్మా టిక్స్ సెంటర్ (ఎన్ఐఎస్) చేపట్టిన 20వ జంతు గణన జిల్లాలో పూర్తయింది. యాదాద్రిభువనగిరి జిల్లాలోని 17 మండలాల్లో 2018 సెప్టెంబర్ 1 నుంచి ఈ ఏడాది మే మొదటి తేదీ వరకు ఈగణనపూర్తి చేశారు. గతంలో 2011, 2012లో జంతు గణన చేయగా.. మళ్లీ ఇప్పుడు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న గృహాల వద్దకు ఎన్యుమరేటర్లు వెళ్లి ఎన్ని జంతువులు ఉన్నాయనే లెక్కలను తేల్చారు. ఈ గణన ప్రకారం జంతువులకు అవసరమైన వైద్యశాలలు, మందులు, ఇతర వసతులను ఏర్పాటు చేయడానికి కేంద్రం సహకరించనుంది. జిల్లాలో గొర్రెల సంఖ్య పెరిగినప్పటికీ కోళ్ల సంఖ్య తగ్గింది. జిల్లా వ్యాప్తంగా గల ఫౌల్ట్రీ పరిశ్రమ ఇటీవల కాలంలో క్రమంగా తగ్గుతూ రావడమే ఇందుకు కారణం. అలాగే కుందేళ్లు, గాడిదలు, గుర్రాల సంఖ్య తగ్గాయి. పెరిగిన గొర్రెలు, పశువులు.. జిల్లా వ్యాప్తంగా గొర్రెలు, పశువులు, గేదెలు, మేకలు, కోళ్లు, పందులు, కుక్కలు, సీమకోళ్లు సంఖ్య గణనీయంగా పెరిగింది. మాంసహార ప్రియులైన ప్రజలకు అవసరమైన మేకలు, గొర్రెలు, పందులు, సీమకోళ్ల సంఖ్య పెరిగింది. అలాగే పాల దిగుబడి కోసం గేదెలు, ఆవుల సంఖ్య కూడా పెరిగింది. 2012గణనతో పోల్చితే కోళ్లు, కుందేళ్లు, గాడిదలు, గుర్రాలు మినహా మిగతా జంతువుల సంఖ్య పెరగడం విశేషం. ఔత్సాహికవేత్తల ద్వారా సీమకోళ్లు, టర్కీకోళ్లు, పందుల పెంపకం పెరుగుతూ వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగినప్పటికీ పశువుల సంఖ్య పెద్దగా తగ్గలేదు. 2011లో 98వేలు ఉన్న పశువులు ప్రస్తుతం 1,14,003కు పెరిగాయి. అలాగే పాడిగేదెలు 1.60 లక్షల నుంచి 1,73,181కి పెరగడం విశేషం. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీతో గొర్రెల సంఖ్య ఈ సంవత్సరం భారీగా పెరిగింది. 2011లో 4,50,000 ఉన్న గొర్రెలు ప్రస్తుతం 7,66,685కు పెరిగాయి. జిల్లాలోని నాన్ ఆయకట్టు ప్రాంతమైన ఆలేరు, తుంగతుర్తి, భువనగిరి, మునుగోడు నియోజకవర్గాల్లోని వర్షాధార మండలాల్లో ప్రస్తుతం తీవ్ర కరువు నెలకొంది. ఈ ప్రాంతాల్లో పాడిపై జనం పెద్ద ఎత్తున ఆధారపడి జీవిస్తున్నారు. గేదెలు, ఆవుల ద్వారా నిత్యం సుమారు లక్షకు పైగా లీటర్ల పాల ఉత్పత్తి చేయడం ద్వారా జీవనోపాధి కల్పించుకుంటున్నారు. అయితే జిల్లాలో గతంలో చౌటుప్పల్, భువనగిరి, బీబీనగర్, బొమ్మలరామారం, పోచంపల్లి, వలిగొండ మండలాల్లో పెద్ద ఎత్తున ఫౌల్ట్రీ పరిశ్రమ ఉండేది. కరువు పరిస్థితులు, తీవ్రమైన ఎండ, నీటి ఎద్దడి పెరిగిన దాణా రేట్లతో ఫౌల్ట్రీ క్రమంగా తగ్గుతూ వస్తోంది. యాదగిరిగుట్ట, కొలనుపాక, రాయగిరి ప్రాంతాల్లో గతంలో జట్కాలు (టాంగాలు) అధికంగా ఉండేవి. దీంతో గతంలో 512 గుర్రాలు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 381కి తగ్గింది. ఆటోలు రావడం, టాంగాలపై ఎక్కే వారి సంఖ్య తగ్గడం, వాటిపై ఆధారపడ్డ వారు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు వెతుక్కోవడం, మరికొందరు ఆ వృత్తిని వదిలేయడం వంటి కారణాలతో గుర్రాల సంఖ్య తగ్గుతోంది. గాడిదల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఇంటింటికి వెళ్లి లెక్కలు.. జిల్లాలో 2011లో 1,60,272 ఇళ్లలో జంతు గణన చేశారు. ప్రస్తుతం 1,80,263 ఇళ్లలో ఈగణన జరిగింది. ఇందుకోసం 25మంది సూపర్వైజర్లు 17 మండలాల్లో 68 మంది ఎన్యుమరేటర్లు ఎనిమిది నెలలుగా జంతుగణన చేశారు. పశుసంవర్ధక శాఖ అధికారుల పర్యవేక్షణలో జరిగిన సర్వే వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. గణనతో ఇవీ లాభాలు.. జంతు గణన ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్ధిష్టమైన లెక్క తెలుస్తుంది. ఆయా జంతువులకు కావాల్సిన దాణా, ఎండుగడ్డి, పచ్చిగడ్డి సేకరణతోపాటు జంతువులకు కాలానుగుణంగా వచ్చే జబ్బులకు అవసరమయ్యే మందులు సిద్ధం చేయడానికి ఈ లెక్క దోహదపడుతుంది. అలాగే సంచార, పశువైద్యశాలలు, ప్రస్తుతం ఉన్నవి సరిపోతాయా లేక మరిన్ని పెంచాలా అన్న విషయం తెలుస్తుంది. ప్రజలకు నిత్యం అవసరమయ్యే మాంసం, పాల కోసం ఆయా జంతువుల సంఖ్య ప్రస్తుత లెక్కలకు అనుగుణంగా సరిపోతుందా మరింత పెంచాల్సిన అవసరం ఉందా వంటి విషయాలను శాస్త్రీయంగా పరిశోధించి అవసరమైన చర్యలను తీసుకుంటారు. మొత్తంగా బడ్జెట్లో జంతువులకు అవసరమైన బడ్జెట్ను కేటాయింపులకు ఈసర్వే ఎంతో ఉపయోగపడుతుంది. పూర్తయిన జంతు గణన జిల్లాలో జంతుగణన పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల జంతువుల వివరాలను సేకరించి లైవ్స్టాక్ సెన్సెస్ వెబ్సైట్లో అప్లోడ్ చేశాం. వీటి ఆధారంగా ప్రభుత్వాలు నిధుల కేటాయిస్తాయి. గతంలో పోల్చితే కోళ్లు, గాడిదలు, గుర్రాల సంఖ్య తగ్గిపోయింది. ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తున్నందున గొర్రెలు, పాడి పశువుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. – మదన్కుమార్, జిల్లా పశువైద్యాధికారి -
పశువులకూ ‘ఆధార్’!
మొయినాబాద్(చేవెళ్ల): ఇకనుంచి పశువుల ఆరోగ్య వివరాలు ఆన్లైన్లో పొందుపరుస్తామని.. ప్రతి పశువుకు 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య(ఆధార్ వంటిది), హెల్త్ కార్డులు ఇవ్వనున్నట్లు రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ జి.మంజులవాణి వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్రంలోని పశువైద్య కేంద్రాన్ని బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలో పశుగణన తీరు, వేసవిలో పశువుల పరిస్థితి , గొర్రెల పంపిణీ పథకం అమలు ఎలా ఉందనే విషయాలను మండల పశువైద్యాధికారి శ్రీలతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రైతుల వద్ద ఉన్న పశువుల సమగ్ర వివరాలు సేకరించి ఆన్లైన్లో పొందుపరుస్తున్నామని అన్నారు. ప్రతి పశువుకు ఆధార్ నంబర్ మాదిరిగా 12 అంకెల గుర్తింపు సంఖ్యను కేటాయిస్తున్నామని.. గుర్తింపు సంఖ్య ఉన్న పోగును పశువుల చెవులకు వేస్తున్నట్లు వివరించారు. ప్రత్యేక గుర్తింపు సంఖ్యతోపాటు రైతు వివరాలు కూడా ఫీడ్ చేస్తామన్నారు. పశువు వివరాలతోపాటు దాని ఆరోగ్య పరిస్థితిని నమోదు చేస్తున్నామని తెలిపారు. వాటికి హెల్త్కార్డులు సైతం ఇవ్వనున్నట్లు చెప్పారు. పశు సంపదను పెంచే చర్యలు ముమ్మరం చేసినట్లు తద్వారా పాలఉత్పత్తి పెంచి రైతుల ఆదాయం పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం సత్ఫలితాలు ఇస్తున్నట్లు చెప్పారు. గొర్రెల పంపిణీ పథకం కింద అందజేసిన జీవాల ద్వారా రాష్ట్రంలో 50 లక్షల గొర్రెపిల్లలు ఉత్పత్తి అయ్యాయన్నారు. రెండో విడత పంపిణీ త్వరలోనే మొదలవుతుందని చెప్పారు. అనంతరం శ్రీరాంనగర్ గ్రామాన్ని సందర్శించి దూడలను పరిశీలించారు. కార్యక్రమంలో డీఎల్డీఓ ఈఓ కె.సింహరావు, పశువైద్యులు దేవేందర్రెడ్డి, శ్రీలత, గోపాలమిత్రలు శ్రీనివాస్, బాలకిష్టయ్య తదితరులు ఉన్నారు. -
గొడ్డు.. గోడు
కరువు రక్కసి మూగజీవాల పాలిట శాపంగా మారింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో పశుగ్రాసానికి తీవ్రకొరత ఏర్పడింది. కనీసం తాగించేందుకు నీళ్లు కూడా సరిగా దొరకని పరిస్థితి నెలకొంది. పోషించే మార్గం కనిపించక.. మేతలేక కళ్లముందే పశువులు బక్కచిక్కిపోతుండడంతో పశుపోషకులు వాటిని కబేళాలకు తరలిస్తూ కళ్లనీళ్లు పెట్టుకుంటున్నారు. తల్లిలా పాలిచ్చే పాడిగేదెలు, ఆవులు, దూడలు మొదలుకుని రేయింబవళ్లు కష్టంచేసే జోడెడ్లు, దున్నపోతులను సైతం విక్రయిస్తున్నారు. మెదక్జోన్: వరుస కరువు కాటకాలతో చెరువులు, కుంటలన్నీ ఎడారిలా మారిపోయాయి. జిల్లాలో 95వేల బోరుబావులు ఉండగా అందులో సుమారు 70 శాతం పూర్తిగా నీటి ఊటలు అడుగంటిపోయాయి. మరో 30 శాతం బోర్ల నుంచి వచ్చే కొద్దిపాటి నీటితో వరి సాగుచేశారు. చాలా వరకు నీటితడులు అందక పొట్టదశలో ఎండిపోవడంతో పశువులను మేపారు. ప్రస్తుతం అదీ లేకుండా పోయింది. ఆధునిక వ్యవసాయం అందుబాటులోకి రావడంతో వరిచేలను రైతులు కోతమిషన్లతో కోయిస్తున్నారు. మిషన్ సగానికి కోయడంతో ఎకరాకు 100 మోపులు రావాల్సిన గడ్డి 20 మోపులు మాత్రమే వస్తోంది. దీంతో పశుగ్రాసానికి డిమాండ్ బాగా పెరిగింది. మార్కెట్లో ఒక్కో మోపు ధర రూ.70 ఉంది. ట్రాక్టర్లో సుమారు వంద మోపుల గడ్డిపడుతోంది. దీనికి రూ.7000 ఖర్చవుతోంది. అంత మొత్తం వెచ్చించలేక .. చేసేది లేక పశుపోషకులు వాటిని కబేళాలకు తరలిస్తున్నారు. జిల్లాలో 2.79 లక్షల పశు సంపద ఉంది. వీటిలో 1.55 లక్షల తెల్లజాతి పశువులు (ఆవులు, లేగదూడలు, కాడెడ్లు) ఉన్నాయి. 1.24 లక్షల నల్లజాతి పశువులు (దున్నపోతులు, పలురకాల పాడిగేదెలు, దెడ్డెలు) ఉన్నాయి. గొర్లకూ కష్టకాలమే గొల్లకురుముల అభివృద్ధి కోసం ప్రభుత్వం 75 శాతం సబ్సిడీపై గొర్లను అందించింది. ప్రభుత్వం అందించిన వాటితో పాటు ఇతర గొర్లు కలిపి జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 7.80 లక్షల గొర్లు ఉన్నాయి. గొర్లు గడ్డిని మాత్రమే మేస్తాయి. వరుస కరువు కాటకాలకు తోడు రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా భూమ్మీద గడ్డి మాడిపోయి చూద్దామంటే కనిపించని పరిస్థితి నెలకొంది. మేత కష్టాలతో పాటు తాగునీటి సమస్యలు తలెత్తాయి. ఫలితంగా వాటిని పోషించడం భారంగా మారడంతో చాలామంది గొర్లకాపరులు వాటిని విక్రయించడం ప్రారంభించారు. అలంకారప్రాయంగా నీటితొట్లు మూగజీవాల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం పల్లెల్లో నీటితొట్లను నిర్మించింది. జిల్లావ్యాప్తంగా 625 తొట్లు ఉన్నాయి. నీటి ఎద్దడి కారణంగా ఎందులోనూ నింపడంలేదు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో తాగునీటికి కటకట ఏర్పడింది. మనుషులకే తాగునీటి కష్టాలు ఉత్పన్నం కావడంతో తొట్లలో నింపడం మానేసినట్లు పలువురు పేర్కొంటున్నారు. పశుపోషణ భారమైంది నాకు మూడు పాడిగేదెలు, రెండు దుడ్డెలు ఉన్నాయి. నాకున్న రెండెకరాల పొలంలో బోరు ఆధారంగా ఎకరం పొలం నాటు వేశాను. పంట పొట్టదశకు వచ్చే సమయంలో బోరుబావిలో నీటి ఊటలు పూర్తిగా ఎండిపోయాయి. పంటంతా పోయింది. పశువులకు మేపేందుకు గడ్డి కూడా లేదు. వాటి పోషణ భారంగా మారింది. కబేళాకు తరలించేందుకు మనసొప్పడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. – చాకలి నర్సింలు, జంగారాయి సబ్సిడీపై గడ్డి విత్తనాలు అందించాం పశుగ్రాసం కొరత తీర్చేందుకు జిల్లావ్యాప్తంగా 60 వేల మెట్రిక్ టన్నుల గడ్డివిత్తనాలను సబ్సిడీపై పశుపోషకులకు అందించాం. ఆ విత్తనాలతో 40 వేల ఎకరాల మేర గడ్డిని పెంచుకునే వీలుంది. బోరుబావుల్లో నీటిఊటలు తగ్గిపోవడంతో చాలామంది రైతులు విత్తనాలను తీసుకెళ్లినప్పటికీ వాటిని సాగుచేయలేదు. బోరుబావుల్లో నీళ్లున్న రైతులు మాత్రం సాగు చేశారు. – అశోక్కుమార్, పశుసంవర్థక శాఖ జిల్లా అధికారి -
పశుగ్రాసం లేక పరేషాన్!
తాంసి(బోథ్): ఆరుగాలం రైతులకు వ్యవసాయంలో తోడ్పడే కాడెద్దులకు మేత కరువైంది. ఇంటా, బయట మేత లేక మూగజీవాలు అంబా అంటున్నాయి. కాడెద్దులకు పశుగ్రాసం దొరకకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కబేళాలకు అమ్ముకుంటున్నారు. కొందరు ఆర్థికభారమైన వేలకువేలు పెట్టి గడ్డి కొని పశువులను సాకుతున్నారు. జిల్లాలోని పశుసంపదకు సరిపడా పశుగ్రాసం దొరకడం లేదు. ఉన్న కొద్దిపాటి మేత కూడా ప్రియమైంది. పశువులకు మేత కొనాలంటే రైతులకు తలకు మించిన భారమవుతోంది. వర్షాలు లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. పలు గ్రామాల్లో నీటిసౌకర్యం ఉన్న రైతులు గడ్డి, మొక్కజొన్న వంటివి సాగుచేసినా ఈ సంవత్సరం వర్షాలు సరిగా లేక పశువుల మేత కోసం వేసిన పంటలు కూడా ఎండిపోయాయి. దీంతో జిల్లాలో పశుగ్రాసం కొరత తీవ్రంగా ఏర్పడింది. రైతులకు ఆర్థిక భారమైనా ఒక్కో గడ్డి కట్టను రూ.15 నుంచి రూ.20 పెట్టి మేత కొనుగోలు చేస్తున్నారు. ఇక ట్రాక్టర్ గడ్డి ధర అయితే వేలల్లో ఉంది. దీనికి రవాణా చార్జీలు అదనం. దూర’భారం’ జిల్లాలోని తాంసి, తలమడుగు, భీంపూర్, బోథ్, నేరడిగొండ, ఇచ్చోడతోపాటు తదితర మండలాలకు చెందిన గ్రామాల రైతులు దూరభారమైనా నిర్మల్ జిల్లాతోపాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి వరిగడ్డిని ఒక్కో ట్రాక్టర్ రూ.10 వేలు పెట్టి తీసుకొస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో రబీలో రైతులు 8వేల హెక్టార్లలో జొన్న, మొక్కజొన్నతోపాటు, 4 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. దీంతో జిల్లాలోని పశువులకు సరిపడ మేత లేక గడ్డి ధరలు ఆకాశాన్నంటాయి. సాకలేక సంతకు తరలింపు జిల్లాలో ఏర్పడిన తీవ్ర పశుగ్రాసం కొరతతో రైతులు తమకున్న పశువులను సాకలేక సంతకు తరలించి కబేళాలకు అమ్ముకుంటున్నారు. పెంచుకున్న పశువులకు వేలకువేలు పెట్టి పశుగ్రాసం కొనలేకపోతున్నారు. అయినా పశుసంవర్ధక శాఖ ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదు. రైతులకు సబ్సిడీ ద్వారా గడ్డి విత్తనాలతోపాటు, దాణా వంటివి ముందుగా పంపిణీ చేస్తే ఈ గోస తప్పేది. రైతులకు విత్తనాలు అందజేశాం జిల్లాలో పశుగ్రాసం కొరత లేకుండా పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో 10 వేలమెట్రిక్ టన్నుల గడ్డి విత్తనాలను రైతులకు 75 శాతం సబ్సిడీపై అందజేశాం. త్వరలోనే రైతులకు అందించడానికి మరో 10 వేల మెట్రిక్ టన్నుల గడ్డి విత్తనాలకు ఆర్డర్ ఇచ్చాం. ఇవి రాగానే 50 శాతం సబ్సిడీపై రైతులకు అందజేస్తాం. పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు చేపడుతున్నాం. – సురేశ్, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి మేత లేక ఎడ్లను అమ్మేశా.. నాకున్న 8 ఎకరాలను రెండు ఎడ్లతో సాగు చేసుకుంటున్నా. వర్షాలు లేక పశువులకు సరిపడా పశుగ్రాసం లేకపోవడంతో వాటిని పస్తులు ఉంచలేక..డబ్బులు పెట్టి గడ్డి కొనలేక ఆదిలాబాద్ సంతలో 15 రోజుల క్రితం రూ.45వేలకు ఎడ్లను అమ్మాల్సి వచ్చింది. – సురేందర్రెడ్డి, రైతు తాంసి సబ్సిడీపై పశుగ్రాసం అందించాలి పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉన్నందున ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై పశుగ్రాసాన్ని అందించాలి. జిల్లాలో గడ్డి దొరకకపోవడంతో పక్కన ఉన్న మహారాష్ట్ర నుంచి తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వర్షాకాలం వచ్చేంత వరకు పశుగ్రాసం దొరకని పరిస్థితి నెలకొంది. రైతులకు పశుగ్రాసంతోపాటు దాణా పంపిణీ చేయాలి. – విఠల్, యువరైతు, తాంసి -
నడిరోడ్డుపై తిష్ట.. రహదారిలో వెళ్లేదెట్ట..?
సాక్షి, కడప: రాత్రి వేళ వాహనదారులు, చిరు వ్యాపారులు పనులు ముగించుకొని హడావుడిగా ఇళ్లకు వెళ్లే సమయంలో కడప నగర వాసులకు ప్రతి రోజు ఓ సమస్య వేధిస్తోంది. సరిగ్గా రోడ్డు మధ్యలో పశువులు తిష్టవేసి వచ్చి పోయే వాహనాలకు స్పీడు బ్రేకర్లుగా తయారవుతున్నాయి. వీటిని తప్పించుకు పోవాలంటే ప్రజలకు గగనమవుతోంది. నగర శివారు ప్రాంతంల్లోనో లేక ఏదైనా వీధిలో అయితే పర్వాలేదు. ఏకంగా ప్రధాన కూడళ్లైన ఆర్టీసీ బస్టాండు, ఏడురోడ్లు, అప్సర సర్కిల్, ఐటీఐ, చిన్నచౌక్లలో రోడ్ల మధ్యలో గంటల తరబడి ఇవి నిలబడడం, పడుకోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ఆందోళన చెందుతున్నారు. రాత్రి పూట దగ్గరికి వచ్చినంత వరకు పశువులు పడుకున్నది అర్థం కాని పరిస్థితి. వాహనాలు రాత్రిపూట కొద్దిగా వేగంగా వెళుతున్న సమయంలో పశువులు గుంపులు గుంపులుగా రోడ్డుకు అడ్డంగా రావడంతో వాహనాలు తిరగబడి ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయని చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశువులు రోడ్లపైకి విచ్చలవిడిగా తిరుగుతూ వాహనచోదకులతోపాటు చిరువ్యాపారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. తోపుడు బండ్లపై ఆకుకూరలు, కూరగాయలు, పలు రకాల పండ్లను తింటూ పాడు చేస్తున్నాయని చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెచ్చరికలు సరే.. చర్యలేవీ? రోడ్డు మీదకు ఆవులు, గేదెలను వదిలితే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేసే కార్పొరేషన్ అధికారులు వాటిని అమలు చేయటంలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. రోడ్డు మీదకు వదిలిన పశువులను బందించి రోజుకు రూ.50 అపరాద రుసం వసూలు చేస్తామని, 15 రోజుల్లోపు బంధించిన పశువులను యజమానులు వచ్చి తోలుకెళ్లకపోతే వాటిని అడవులకు తరలిస్తామని గతంలో హెచ్చరికలు జారీ చేయటంతో కొద్దిరోజుల పాటు మాత్రమే వాటిని బయటకు రానీయకుండా యజమానులు జాగ్రత్త పడ్డారు. ప్రస్తుతం కార్పొరేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో మళ్లీ రోడ్లపైకి వచ్చి యథేచ్చగా తిరుగుతున్నాయి. ఇప్పటికైనా వాటి యజమానులు జాగ్రత్తలు తీసుకునే విధంగా కార్పొరేషన్ అధికారులు కట్టడి చేయాలని నగర ప్రజలు, వాహనచోదకులు కోరుతున్నారు. -
పశుబజార్ అమలెప్పుడో?
బేల(ఆదిలాబాద్): ఈ–మార్కెట్లో పండించిన పంటలు ఆన్లైన్ ద్వారా క్రయవిక్రయాలు చేయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అదే తరహాలో ఏడాదిన్నర క్రితం ప్రతిష్ఠాత్మకంగా పశుబజార్ కార్యక్రమం తీసుకొచ్చింది. ఇది ఎప్పుడు అమలు అవుతుందో ప్రశార్థకంగా మారింది. పశువులు, గొర్రెలు, మేకలు, పందులు తదితర వాటి విక్రయాలు, కొనుగోళ్లు చేపట్టేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు పశుసంవర్థకశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా పశుబజార్ ఆన్లైన్ వెబ్సైట్ను ఏడాదిన్నరక్రితం ప్రారంభించారు. పశువులు అమ్మేందుకు, కొనేందుకు వేదికగా ఈ పశుబజార్ ఉపయోగపడుతుంది. ఈ పశుబజార్ వెబ్సైట్లో విక్రేతలు వారి పశువుల వివరాలు నమోదు చేసుకుంటే..అవసరమైన రైతులు తెలుసుకొని ఆయా ప్రాం తాలకు వెళ్లి స్వయంగా పరిశీలించి కొనుక్కోవాలనేది లక్ష్యం. తద్వారా శ్రమ, సమయం వృథా కావు. అయితే ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో రైతులు, పశు పోషణదారుల వరకు చేరలేదు. అవగాహన కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలు లేకపోలేదు. ఈ కార్యక్రమంపై గ్రామాల్లో ఆశించిన ప్రచారం, రైతులతోపాటు పశు పోషణదారులతో ప్రత్యేక సమావేశాలు, సభలు ఇంతవరకు నిర్వహించలేదు. కేవలం పశువైద్యశాలలో వాల్ పోస్టర్ అతికించి వదిలేశారు. పశుబజార్ వెబ్సైట్పై అవగాహన, సాంకేతికంగా ఎలా వినియోగించుకోవాలనే అంశాలు ఎంత మాత్రమూ వివరించలేదని తెలిసింది. దీంతో పశువులు, మేకలు, గొర్రెలు, పందులు తదితర అమ్మకాలు పాత పద్ధతిలోనే కొనసాగతున్నాయి. దీంతో అందుబాటులోని సంతకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. పశు బజార్తో కొనుగోలు, అమ్మకాలు ఎంతో సులభం.. ఈ పశుబజార్తో పశువుల కొనుగోలు, అమ్మకాలు ఎంతో సులభతరం కానుంది. పశువులు, ఇతరాత్ర వాటిని అమ్మదలచిన రైతులు వివరాలను పశు బజార్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. ఈ వివరాలు 30రోజుల వరకు వెబ్సైట్లో ఉంటాయి. పశువులను కొనదలిచిన వారు ఈ వెబ్సైట్ ద్వారా మొత్తం వివరాలు తెలుసుకోవచ్చు. ఇరువర్గాలు సంప్రదింపులు జరుపుకునే అవకాశం కూడా చేర్చారు. స్థానిక వాతావరణానికి తట్టుకునే పశువులు ఎంపిక చేసుకోవచ్చు. ఆశించిన పాడి పశువులు, దుక్కిటెద్దులు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఇక గొర్రెలు, మేకలు, పందులు తదితరవి విక్రయించే వారికి కొనుగోలు చేసే వారికి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. మాంసంకోసం వ్యాపారులు, వినియోగదారులకు కూడా ఈ పశుబజార్ మరింత ప్రయోజనకరంగా మారనుంది. ధరలు, నాణ్యత, అవసరమైన మేరకు సరుకు లభిస్తుంది. ఈ పశుబజార్ ఆన్లైన్ అనుసంధానంతోపాటు భౌతికంగా చూసి కొనుగోలు చేస్తే, మరింత మేలు జరగనుంది. దళారులకు చెక్.. సంతల్లో పశువులు, మేకలు, గొర్రెలు, పందులు తదితర కొనుగోలు, అమ్మకాల్లో దళారుల ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. అమ్మకందారులు, కొనుగోలుదారుల మధ్య దళారులుగా వ్యవహరించే వారు ఇరువర్గాల నుంచి కమీషన్లను వసూలు చేస్తుంటారు. ఇంతేకాకుండా పలు సందర్భాల్లో విక్రయించే వారి నుంచి ధర కుదుర్చుకుని కొనుగోలుదారుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని అధిక రేట్లకు అమ్ముతున్న పరిస్థితి సంతల్లో జరుగుతోంది. పశు బజార్లపై అవగాహన కల్పిస్తే రైతులు, పశు పోషణదారులు నేరుగా కొనుగోలు, అమ్మకాలు చేసుకోవచ్చు. తద్వారా ఎలాంటి మోసాలకు ఆస్కారం ఉండదు. పశు బజార్ గురించి ఎవరు చెప్పలేదు సంతలు, అంగళ్లు తెలుసు. కానీ గవర్నమెంటు కొత్తగా పెట్టిన పశుబజార్ గురించి ఎవరూ చెప్పలేదు. తెలియదు. దుక్కిటెద్దులు, పాడి పశువులు అవసరం ఉంటే అందుబాటులోని సంతలకు వెళ్లి కొనుగోలు చేస్తున్నాం. పశుబజార్పై అవగాహన లేదు. వివరిస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. – గౌరి పురుషోత్తం,రైతు బేల పశువులు అమ్మే, కొనేఆన్లైన్ మంచిదే పంటలను ఆన్లైన్ ఆమ్ముతున్నట్లు పశువులు అమ్మే, కొనే పశుబజార్ ఆన్లైన్ మంచిదే. దీనిపై గ్రామాల్లో ఆఫీసర్లు అవగాహన కల్పించాలి. మధ్యవర్తులతో ప్రమేయం లేకుండా నిర్ణీత ధరలతోపాటు భౌతికంగా పశువు నచ్చితే అమ్మే, కొనే రైతులు నేరుగా క్రయవిక్రయాలు చేసుకోవచ్చు. నష్టపోకుండా ఉంటాం.– గేడాం మనోహర్, పశు పోషణదారుడు సిర్సన్న అవగాహన కల్పిస్తాం రైతులు, పశు పోషణదారుల్లో ఈ పశుబజార్పై అవగాహన కల్పిస్తాం. ఏడాదిన్నర క్రితం ఇది ప్రారంభమైంది. పెద్దగా వినియోగంలో లేదు. అంతగా ప్రచారం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఈ పశు బజార్తో ప్రత్యేకంగా పశువుల సంతకు వెళ్లే అవసరం లేదు. ధర, నాణ్యత పశుబజార్ ఆన్లైన్లో ఉండడంతో కూర్చున్న చోటనే మనకు నచ్చిన సరుకు మన దగ్గరకు తెప్పించుకోవచ్చు. సమయం, శ్రమ వృథాకావు. ఈ పశు బజార్పై సాంకేతికపరమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. పశు బజార్ను వినియోగించుకుని, మంచి ప్రయోజనాలు పొందవచ్చు. – సురేశ్, జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి -
మంచి ఆలోచన
పంజాబ్, లూథియానా జిల్లాలోని, తల్వారా గ్రామం.. గ్రామానికంటే పెద్దది. అలాగని పట్టణం అనేందుకు లేదు. నివాస ప్రాంతాల్లో రోడ్డు మీద మనుషులు, వాహనాలతోపాటు పశువులు కూడా స్వేచ్ఛగా తిరుగుతూనే ఉంటాయి. రోడ్డు మీద పశువులనగానే... కదలాడే స్పీడ్ బ్రేకర్లని సరదాగా నవ్వుకోవడానికి బాగానే ఉంటుందేమో కానీ అక్కడి వాళ్లకు అది ప్రాణాల మీదకు తెస్తోంది. పగలైతే ఫర్వాలేదు, రాత్రిళ్లు పరిస్థితి మరీ ఘోరం. పశువులను తప్పించుకోబోయిన వాహనాలకు యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఆ ప్రమాదాల్లో వాహనదారులకు, కొన్నిసార్లు పశువులకు కూడా తీవ్ర గాయాలవుతున్నాయి. రోడ్డు మీద నడిచే వాళ్లకూ ప్రమాదాలు తప్పడం లేదు. ఇది ఎంత తీవ్రంగా పరిణమించిందీ అంటే.. 2015 నుంచి 2017 జూన్ నాటికి ఇలాంటి ప్రమాదాల్లో మూడు వందల మంది చనిపోయారు. సగటున మూడు రోజులకో మరణం! వార్తాపత్రికల్లో కూడా కథనాలు ఎక్కువగానే వచ్చాయి. అయితే, ఈ వార్తలు అధికారులను కానీ పాలకులను కానీ ఏ మాత్రం కదిలించలేక పోయాయి. ఓ రోజు.. ఘోర ప్రమాదం! ఒకరోజు పశువులను తప్పించుకోబోయిన ఒక కారు ఘోరమైన ప్రమాదానికి లోనయింది, కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటన తల్వారా గ్రామం మొత్తాన్నీ కదిలించి వేసింది. అంతకంటే ఎక్కువగా స్థానిక ‘సత్య భారతి’ స్కూల్ పిల్లల్లో ఆలోచన రేకెత్తించింది. ‘ప్రమాదాలు జరగకుండా మనం ఏమైనా చేయవచ్చా?’ ఈ ప్రశ్న వాళ్ల చిన్న బుర్రల్లో కలగడం ఆలస్యం.. వాళ్లిక రకరకాల పరిష్కార మార్గాలను ఆలోచించడం మొదలుపెట్టారు. మొదటి ఆలోచన రోడ్డుపక్కన నాటిన చెట్ల కాండాలకు రంగులు వేయడం గుర్తు వచ్చింది ఆ స్కూలు పిల్లలకు. అవి రాత్రి పూట వెలుగుతూ ఉంటాయి. ఆ వెలుగు వాహనదారులకు డైరెక్షన్గా పనిచేస్తోంది. పశువుల కొమ్ములకు రాత్రి పూట వెలిగే రేడియం పెయింట్ వేస్తే ఎలా ఉంటుందీ అనుకున్నారు. కానీ ఒక చోట కదలకుండా ఉండని పశువులను పట్టుకుని వాటి కొమ్ములకు రంగులు వేయడం కష్టమైంది. పిల్లలు దగ్గరకు వెళ్లగానే అవి పారిపోయేవి. దాంతో మళ్లీ ఆలోచనలో పడ్డారు. రెండో ఆలోచన రెండో ఆలోచనగా పశువుల మెడలో దండలు వేస్తే ఎలాగుంటుందీ అనుకున్నారు. పశువుల మెడలకు చుట్టేటంత పొడవున్న తాడుకి రేడియం టేపుని అతికించి, మువ్వల గంటలను కట్టారు. వాటిని వీధిలో తిరుగుతున్న పశువుల మెడలో వేశారు. పిల్లలు చేసిన ఈ పనితో పెద్దవాళ్లు ముందుకొచ్చి మిగిలిన పశువులకు రేడియం దండలు వేసుకున్నారు. ఇక రాత్రిళ్లు అవి రోడ్ల మీద తిరిగినా సరే, దూరం నుంచే వాహనదారులకు వాటి ఆనవాలు తెలుస్తుంది కాబట్టి ప్రమాదాలు వాటంతటవే నివారణ అయ్యాయి. ‘ఐ కెన్’ అవార్డు పిల్లలు చేసిన ఈ మంచి పని గురించి స్కూలు టీచర్ ఒకరు ‘ఐ కెన్ అవార్డ్స్ 2017’ కు పంపించారు. పార్లే జీ కంపెనీ ‘డిజైన్ ఫర్ చేంజ్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ అవార్డుకి స్కూలు పిల్లలైన లక్ష్మి, కిరణ్దీప్ కౌర్, అమృత్పాల్ సింగ్, గగన్దీప్ సింగ్, జషన్దీప్ సింగ్ ఎంపికయ్యారు. సామాజిక శ్రేయస్సు, సహేతుకమైన మార్పు కోసం ప్రయత్నించి, సఫలమైన వాళ్లకు ఈ అవార్డు ఇస్తారు. ఈ స్కూలు పిల్లలంతా పదేళ్ల పిల్లలే. వీళ్లు చేసిన పని చిన్నదిగానే కనిపిస్తుంది. అయినప్పటికీ వాళ్ల ఆలోచనను, ప్రయత్నాన్ని ప్రశంసించాల్సిందే. - మంజీర -
నేటినుంచి పశుగణన
సాక్షి, రంగారెడ్డి : అఖిల భారత పశుగణన ప్రక్రియ సోమవారం నుంచి జిల్లాలో ప్రారంభం కానుంది. తొలిసారిగా ఈసారి ట్యాబ్లను వినియోగించనున్నారు. క్షేత్రస్థాయి నుంచే ట్యాబ్ల ద్వారా పశువుల వివరాలు సేకరించి అప్పడికప్పుడే డేటా సెంటర్కు పంపనున్నారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ గణన మొత్తం మూడు నెలలపాటు జరగనుంది. ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనుంది. జిల్లాలోని సుమారు 5.36 లక్షల ఇళ్లకు ఎన్యుమరేటర్లు తిరుగుతూ పశువులు, పెంపుడు జంతువులు, పక్షుల వివరాలు సేకరిస్తారు. ఇందుకోసం సుమారు 190 మంది ఎన్యుమరేటర్లను సిద్ధం చేసింది యంత్రాంగం. గ్రామీణ ప్రాంతంలో ఒక్కో ఎన్యుమరేటర్ నెలకు 1,500, పట్టణ ప్రాంతంలో 2 వేల ఇళ్లకు తిరిగి సమాచారం సేకరించనున్నారు. ప్రతి ఐదేళ్లకోసారి పశు గణన జరుగుతోంది. చివరిసారిగా 2012లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. వాస్తవంగా గతేడాది గణన జరగాల్సి ఉండగా.. వివిధ కారణాల వల్ల అది సాధ్యపడలేదు. ప్రస్తుతం జరగబోయే గణనలో అన్ని మూగజీవుల సమాచారాన్ని సంపూర్ణంగా సేకరించాలని పశు సంవర్ధక శాఖ అధికారులు సిబ్బందికి సూచించారు. స్వచ్ఛందంగా వివరాలివ్వండి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తమ వద్ద అన్ని రకాల పశువులు, పెంపుడు జంతువులు, పక్షుల వివరాలను ఎన్యుమరేటర్లకు తెలియజేయాలని జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి కేవీఎల్ నర్సింహారావు కోరారు. కచ్చితమైన సమాచారాన్ని అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీని ఆధారంగానే వచ్చే ఐదేళ్లపాటు ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాల్లో బడ్జెట్ కేటాయింపులు, అభివృద్ధి కార్యక్రమాలకు తగిన ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అలాగే వ్యాక్సినేషన్ ఉంటుందన్నారు. గ్రామాల్లో ఇంటింటికీ వివరాల సేకరణ చేపట్టే తేదీలను ముందుగానే తెలియజేస్తామన్నారు. -
పశువుల గణన
ఆదిలాబాద్టౌన్: జనాభా లెక్కల మాదిరిగానే పశుసంవర్ధక శాఖ పశు గణన కార్యక్రమాన్ని చేపడుతోంది. ప్రతీ ఐదేళ్లకోసారి పశువులను లెకిస్తోంది. గతంలో 2012 సంవత్సరంలో గణన చేపట్టగా.. 2017లో నిర్వహించాల్సి ఉంది. కానీ కేంద్రం ఒక సంవత్సరం ఆలస్యంగా నిర్వహిస్తోంది. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఈ గణన కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే జిల్లాకు చెందిన ఇద్దరు అధికారులకు హైదరాబాద్లో శిక్షణ ఇప్పించారు. వారు మండల స్థాయి పశువైద్యాధికారులు, ఎన్యుమరేటర్లకు ఇటీవల రెండు రోజులు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎప్పటికప్పుడు వివరాలను ఆన్లైన్లో పొందుపర్చేందుకు ఎన్యుమరేట్లకు ట్యాబ్లను అందించనున్నారు. గతంలో మ్యానువల్(రికార్డు) పద్ధతిలో గణన జరగగా, ఈసారి డిజిటల్ పశుగణన చేపట్టనున్నారు. 20 నుంచి షురూ.. ఈ నెల 20 నుంచి పశు గణన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మూడు నెలలపాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. అప్పటిలోగా బాధ్యతలు అప్పగించిన అధికారులు పశువుల వివరాలను సేకరించాల్సి ఉంటుంది. జిల్లాలోని 18 మండలాలకు సంబంధించి ఒక్కో మండలానికి ముగ్గురు ఎన్యుమరేటర్ల చొప్పున 54 మందిని నియమించారు. వీరితోపాటు మండల పశువైద్యాధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ఇంటింటికి వెళ్లి ఆవులు, గేదెలు, కోళ్లు, మేకలు, గొర్రెలు, కుక్కలు, ఇతర పశువుల వివరాలను రైతులు, పశుపోషకులను అడిగి నమోదు చేసుకుంటారు. రైతుల వద్ద వ్యవసాయ పరికరాలు ఎన్ని, ఏవేవనే వాటినీ నమోదు చేసుకుంటారు. ప్రత్యేక సాఫ్ట్వేర్.. డిజిటల్ పశు గణన కోసం ఈసారి ప్రత్యేక సాఫ్ట్వేర్ ఏర్పాటు చేశారు. ఈ సాఫ్ట్వేర్ ద్వారా ప్రతీ పశువుకు ఒక డిజిటల్ నంబర్ను ఇచ్చి అందులో యజమానితోపాటు పశువు వివరాలను పొందుపరుస్తారు. పశువులను అమ్మినా, కొనుగోలు చేసినా వెంటనే వివరాలు తెలిసే విధంగా సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే అడవుల్లో జీవించే వన్యప్రాణుల గణనను అటవీ శాఖాధికారులు చేపట్టారు. 20వ పశుగణన.. ప్రస్తుతం చేపట్టనున్న పశుగణన 20వది కానుంది. దేశంలో తొలిసారిగా 1919 సంవత్సరంలో ఈ గణనను చేపట్టారు. అప్పటినుంచి ఐదేళ్లకోసారి ప్రక్రియ కొనసాగుతూ వస్తోంది. గత సంవత్సరం జరగాల్సి ఉండగా ఒక సంవత్సరం ఆలస్యమైంది. ఇప్పటివరకు 19సార్లు పశుగణన పూర్తయ్యింది. ఈసారి గణన కార్యక్రమాన్ని చేపట్టేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత పశుగణనలో జిల్లాలో 9లక్షల 98వేల 609 పశువులు ఉన్నట్లు అధికారులు లెక్కించారు. ఈసారి దాదాపు 14 లక్షల వరకు వాటి సంఖ్య చేరుకోనుందని అంచనా వేస్తున్నారు. పకడ్బందీగా చేపడతాం.. జిల్లాలో పశుగణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తాం. ఈ నెల 20 నుంచి నవంబర్ మాసం వరకు కొనసాగనుంది. మండలానికి ముగ్గురు చొప్పున ఎన్యుమరేటర్లను నియమించాం. మూడు నెలల్లో పశువులన్నింటి వివరాలను ఆన్లైన్లో ట్యాబ్లా ద్వారా పొందుపర్చాల్సి ఉంటుంది. ఎన్యుమరేటర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాం. – సురేష్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి -
పొలానికి వెళ్లిన చిన్నారిపై అఘాయిత్యం
ముజఫర్పూర్/పట్నా: బిహార్లో మరో ఘోరం చోటుచేసుకుంది. పశువులను మేపడానికి వ్యవసాయం పొలం వద్దకు వెళ్లిన తొమ్మిదేళ్ల చిన్నారి అత్యాచారం, హత్యకు గురయింది. ఘటనా ప్రాంతంలోనే ఉన్న ఆమె తమ్ముడిని (7)సైతం దుండగుడు ప్రాణాలతో విడిచిపెట్టలేదు. ఈ ఘోరం ముజఫర్పూర్ జిల్లాలోని పారు పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వ్యవసాయ పొలం వద్ద రెండు కుంటుంబాల మధ్య గత కొంత కాలంగా గొడవ కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం పశువులను మేపడానికి తమ్ముడిని తీసుకుని పొలం వద్దకు వెళ్లిన చిన్నారిపై దుండగులు అత్యాచారానికి ఒడిగట్టారు. అడ్డుగా వచ్చిన ఆమె తమ్ముడిని, అనంతరం పాపను హత్యచేసి పక్కనే ఉన్న నది గట్టుపై పడేసి పరారయ్యారని పోలీసులు వెల్లడించారు. చిన్నారుల తల్లిదండ్రులు అదే గ్రామానికి చెందిన ముగ్గురిపై అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా, కేసు నమోదు చేశామనీ, పరారీలో ఉన్న నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని జిల్లా ఎస్పీ హర్ప్రీత్ కౌర్ తెలిపారు. గత కొంత కాలంగా బిహార్లో అత్యాచార ఘటనలు తీవ్రమవుతున్నాయి. 2018 మొదటి మూడు నెలల్లో మహిళలు, బాలికలపై 127 అత్యాచార ఘటనలు చోటుచేసుకోగా, జూన్ నెల ముగిసేసరికి ఆ సంఖ్య రెట్టింపు అయిందని పోలీసు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. -
పశువులను దొంగిలించారని పైశాచికం
సాక్షి, రాంచీ : జార్ఖండ్లో దారుణం చోటుచేసుకుంది. పశువులను దొంగిలించారనే అనుమానంతో ఇద్దరు ముస్లింలను గ్రామస్థులు కొట్టి చంపారు. గొద్దా జిల్లాలోని దుల్లు గ్రామంలో బుధవారం రాత్రి మున్షి ముర్ము ఇంటి నుంచి అయిదుగురు వ్యక్తులు బర్రెలను దొంగిలించారనే అనుమానంతో గ్రామస్థులు వారిపై దాడి చేసిన ఘటన వెలుగుచూసిందని డీఐజీ అఖిలేష్ కుమార్ ఝా చెప్పారు.బర్రెలు కనిపించకపోవడంతో ముర్ముతో పాటు ఇతర గ్రామస్థులు అయిదుగురు వ్యక్తుల కోసం గాలించగా గురువారం తెల్లవారుజామున సమీప బంటకి గ్రామంలో వారిని గుర్తించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్తులు సిరాబుద్దీన్ అన్సారి (35), ముర్తజా అన్సారీ(30)లను చావబాదారు. మిగిలిన ముగ్గురు తప్పించుకుని పారిపోయారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన సంబంధించి ముర్ముతో పాటు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. కాగా బాధితులు ఇదే జిల్లాకు చెందిన తలిజారి గ్రామస్తులని పోలీసులు తెలిపారు. శాంతిభద్రతల పర్యవేక్షణకు గ్రామంలో పోలీస్ పికెట్ను ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. -
మూగ జీవాలకూ తీపి మాత్రలు!
పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు అనారోగ్యానికి గురైనప్పుడు ఖరీదైన ఇంగ్లిష్ మందులుæ వాడటం తప్ప రైతులకు మరో మార్గం లేదన్న అభిప్రాయం బలంగా ఉంది. ఇంగ్లిష్ మందులతో ఇతర సమస్యలు రావడంతోపాటు ఈ వైద్యం సన్న, చిన్నకారు రైతులకు శక్తికి మించిన భారంగా మారుతోంది. ఈ నేపధ్యంలో పశువులకు హోమియో వైద్యం ద్వారా అతి తక్కువ ఖర్చుతో సత్ఫలితాలను పొందవచ్చంటున్నారు డాక్టర్ దంటు సత్యన్నారాయణ. హోమియో మందులతో పశువుల్లో వచ్చే ఎలాంటి వ్యాధినైనా వేగంగా, పూర్తిగా తగ్గిస్తున్నారు. పశుపోషణపై ఆధారపడిన రైతులకు ఇది వరమని నిరూపిస్తున్నారు. డా. సత్యన్నారాయణ అందిస్తున్న హోమియో వైద్యంతో కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంతంలో పలువురు పాడి రైతులు, పశుపోషకులు సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఖమ్మంకు చెందిన డా. దంటు సత్యన్నారాయణ పశుసంవర్థకశాఖలో వైద్యునిగా పనిచేసి 2003లో రిటైరయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తున్న ఈయన అల్లోపతి మందుల కంటే హోమియో మందులు మెరుగైన ఫలితాలను ఇస్తున్నాయని గమనించి.. రిటైరవ్వకు ముందు నుంచే పశువులకు హోమియో వైద్యం చేస్తున్నారు. లాభాపేక్ష లేకుండా కొన్న ధరకే 50 రకాల హోమియో మందుల కిట్ను రైతులకు అందజేస్తున్నారు. పశువులకు హోమియో వైద్యం వల్ల లాభాలు ఖర్చు తక్కువ, ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవు, మందులు నిల్వ ఉంచడానికి ఫ్రిజ్ అవసరం లేదు. పశువులకు సారా, బీడీ, చుట్ట, మసాలా వంటి ఎలాంటి అలవాట్లు ఉండవు కాబట్టి పశువులలో ఈ మందులు బాగా పనిచేస్తాయి. డాక్టర్ కోసం ఎదురుచూడకుండా రైతే ఈ మందులను పశువులకు వేయవచ్చు. జబ్బులు రాక ముందుగానే ఈ మందులను అతితక్కువ ఖర్చుతో వేసుకోవచ్చు. తెల్ల మాత్రల్లో ద్రవరూప మందును ఒకసారి కలిపితే చాలాకాలం పాటు వాడుకోవచ్చు. ఎలాంటి యాంటీబయాటిక్స్ వాడనందున పశువులు త్వరగా కోలుకుంటాయని డా. సత్యన్నారాయణ తెలిపారు. ఏయే పశు వ్యాధులకు హోమియో చికిత్స పశువులు మేత మేయకపోవడం, జ్వరం, కడుపు ఉబ్బరం, ఎదకు రాకపోవడం, పొదుగు వాపు, చూడి కట్టకపోవడం, మాయ వేయకపోవడం, గర్భకోశ వ్యాధులు, పాలు చేపకపోవడం, పాలు పితకకుండానే కారిపోవడం, పాలు తగ్గడం, గాయాలు, దెబ్బలు, గాంగ్రిన్, గాలికుంటు పుండ్లు, పాముకాటు, దూడలలో బొడ్డు వాపు, రక్త విరోచనాలు, తెల్ల విరేచనాలు, ఏలికపాములు, మలబద్దకం వంటి సమస్యలన్నిటికీ హోమియో మందులు వాడొచ్చు. కోళ్లు, గొర్రెలు, కుక్కలకు వచ్చే అన్ని రకాల వ్యాధులకు హోమియో వైద్యం ఉందని డా. సత్యన్నారాయణ తెలిపారు. గొర్రెలలో నీలి నాలుక వ్యాధిని కూడా హోమియో మందులతో తగ్గిస్తుండటం విశేషం. – ఉమ్మా రవీంద్రకుమార్ రెడ్డి, సాక్షి, నూజివీడు ఆవుల ఆరోగ్య సమస్యలు తగ్గాయి మాకు దేశవాళీ ఆవులు 13, ఆవు దూడలు 8 ఉన్నాయి. వీటికి అల్లోపతి వైద్యం చేయించి విసుగు పుట్టింది. వైద్యులు, సిబ్బంది మనకు కావల్సినప్పుడు అందుబాటులో ఉండరు. అటువంటి పరిస్థితుల్లో డా.దంటు సత్యన్నారాయణ గారి గురించి విని ఆవులకు హోమియో చికిత్స చేయిస్తున్నాను. హోమియో వైద్యం మొదలుపెట్టిన తరువాత ఆవుల్లో ఆరోగ్య సమస్యలు చాలా వరకూ తగ్గాయి. ఆవులలో అనారోగ్య లక్షణాలను కనిపెట్టి.. ఆ వెంటనే హోమియో మందులను మేమే ఎలా వాడుకోవాలో డా. సత్యన్నారాయణ నేర్పించారు. వీటితో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఏ లక్షణాలకు ఏ మందులు వాడాలనే కరపత్రం కూడా ఉంది. దానిలో పేర్కొన్న విధంగా వాడితే పశువులకు నయమవుతోంది. మరీ అర్థంకాని పరిస్థితి ఉంటే.. డా. సత్యన్నారాయణకు ఫోన్ చేసి లక్షణాలు చెబితే ఏ మందు వాడాలో చెప్తారు. చెప్పిన మందు వాడితే తగ్గిపోతున్నది. దూడలకు విరేచనాలు, చర్మ సంబంధిత సమస్యలు, పొదుగువాపు, జ్వరం తదితర సమస్యలు వచ్చినప్పుడు హోమియో మందులు వాడి సత్ఫలితాలు పొందాము. అల్లోపతి కంటే హోమియోతో ఖర్చు చాలా తక్కువ. – మేకా అమృత (94402 40393), పశుపోషకురాలు, నూజివీడు, కృష్ణా జిల్లా గోపాల మిత్రల ద్వారా వ్యాప్తిలోకి తేవాలి! నా దగ్గర ఏడు దేశవాళీ ఆవులున్నాయి. వీటికి ఏడాది నుంచి హోమియో మందులే వాడుతున్నాను. మంచి ఫలితాలు వస్తున్నాయి. జ్వరాలు, విరోచనాలు, పొదుగు వాపు వ్యాధి, కాల్షియం లోపం, జ్వరం, చర్మ సంబంధిత వ్యాధులు, ఇతర జబ్బులకు హోమియో వైద్యం అందిస్తున్నాం. ఖర్చు బాగా తక్కువ. ఉపయోగించడం సులువు. ప్రభుత్వం గోపాల మిత్రలకు ఈ మందుల వాడకంలో శిక్షణ ఇప్పించడం ద్వారా హోమియో పశువైద్యాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి. యాంటీబయోటిక్ మందు మార్కెట్లో రూ.100లు ఉండగా, హోమియో మందు రూ.5లకే లభ్యమవుతుంది. – డా.రేమెళ్ల సత్యన్నారాయణ (9440996727) విశ్రాంత వైద్యులు, పశుపోషకులు, నూజివీడు పశువుల్లో పొదుగువాపు వ్యాధికి రూ.200తో చికిత్స! అల్లోపతి మందులు వాడినప్పటికంటే హోమియో వైద్యంలో వేగంగా మంచి ఫలితాలు వస్తున్నాయి. ఖర్చు కూడా చాలా తక్కువ. మందులు బాగా పనిచేస్తున్నాయి. పశువైద్యం అంటే అల్లోపతి వైద్యం మాత్రమే కాదు. హోమియోపతి వైద్యం కూడా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కృషి చేస్తున్నా. 1995 నుంచి పశువులకు హోమియో వైద్యాన్ని అందిస్తున్నా. తక్కువ ఖర్చే కాకుండా ఒకసారి తెచ్చి పెట్టుకున్న మందులు చాలాకాలం వరకు ఉపయోగపడతాయి. మందులను పశువులకు సులువుగా వేసుకోవచ్చు. పొదుగు వాపు వ్యాధికి అల్లోపతి మందులతో రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చు చేసినా తగ్గదు. హోమియో వైద్యంలో రూ. 200తో తగ్గిస్తున్నాం. ఈ వైద్యం సురక్షితమైనది. తక్కువ ఖర్చుతోనే అందించే ప్రయత్నం చేస్తున్నా. దీన్ని మరింతగా ప్రచారం చేస్తే రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. – డాక్టర్ దంటు సత్యన్నారాయణ (9440580903, 9059060491), హోమియో పశువైద్య నిపుణులు సహజాహారం కూరగాయలు, వరి, పత్తి విత్తనాలు సహజాహారం ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ఖరీఫ్ సీజన్ కోసం సూటి రకం పత్తి(సూరజ్), సంప్రదాయ వరి, కూరగాయల దేశవాళీ విత్తనాలను సికింద్రాబాద్ తార్నాకలోని సహజ ఆహారం స్టోర్లో రైతులకు అందుబాటులో ఉంచింది. గత సీజన్లో సేంద్రియ పద్ధతుల్లో ఉత్పత్తయిన ఈ సంప్రదాయ విత్తనాలు 90% మొలక, 80% ఏకరూపతతో ఉంటాయని సుస్థిర వ్యవసాయ కేంద్రం డైరెక్టర్ జనరల్ డా. రామాంజనేయులు తెలిపారు. బచ్చలికూర, బీర, బెండ, కాకర, వంగ, చెట్టుచిక్కుడు, మిరప(తేజ), గోరుచిక్కుడు, పత్తి(సూరజ్), చిక్కుడు, మునగ, గోంగూర రెడ్, మెంతి, పాలక్, గుమ్మడి, కంది, పొట్లకాయ, సొరకాయ, వరి (గోవింద్భోగ్, కాలాభాత్, సుగంధి, పరిమళ సన్న, జింక్ రైస్ వంటి 16 దేశవాళీ రకాలు) అందుబాటులో ఉన్నాయి. వివరాలకు.. సహజాహారం స్టోర్, తార్నాక, సికింద్రాబాద్. ఫోన్లు: 81439 47491, 83007 83300. విత్తనాలను నేరుగా కొనుగోలు చేయవచ్చు. దూరప్రాంతాల రైతులు ఫోన్ ద్వారా ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. 10న సిరిధాన్యాలు, కూరగాయల సాగుపై శిక్షణ సేంద్రియ పద్ధతుల్లో సిరిధాన్యాలు, పప్పుధాన్యాలు, కూరగాయల సాగుపై కడప జిల్లా వేంపల్లెకు చెందిన రైతు శాస్త్రవేత్త విజయకుమార్ సికింద్రాబాద్లో ఈ నెల 10(ఆదివారం– ఉ. 9.30 గం. నుంచి)న రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రకృతి వ్యవసా యం గ్రూప్ ఆధ్వర్యంలో ఉస్మాని యా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విభాగంలో ప్లాటినం జూబ్లీ కాన్ఫరెన్స్ హాల్ ఎస్ 6 రూమ్లో శిక్షణ ఇవ్వనున్నారు. హాజరుకాదలచిన వారు క్రాంతి(94903 87574, 80748 47144), శ్యాంరెడ్డి (84640 76429), పాపిరెడ్డి (85019 04201)లను సంప్రదించి రిజిస్టర్ చేసుకోవాలి. ప్రవేశం మొదట రిజిస్టర్ చేసుకున్న 500 మంది రైతులకు మాత్రమే. 10న సేంద్రియ సేద్యంపై డా. నారాయణరెడ్డి శిక్షణ కర్ణాటకకు చెందిన సుప్రసిద్ధ సేంద్రియ వ్యవసాయ నిపుణుడు, సీనియర్ రైతు డాక్టర్ ఎల్. నారాయణరెడ్డి ఈ నెల 10(ఉ.10గం.–సా. 4 గం.)న పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రైతులకు సేంద్రియ వ్యవసాయంపై తెలుగులో శిక్షణ ఇస్తారు. సేంద్రియ వ్యవసాయంపై తొట్టతొలిసారిగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్, లయన్స్క్లబ్, పతంజలి యోగ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరం జరగనుంది. బెంగళూరు రూరల్ దొడ్డబళ్లాపూర్ సమీపంలో గత 40 ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్న డా. నారాయణరెడ్డి ‘లీసా ఇండియా’ పత్రికకు గౌరవ సంపాదకుడుగా ఉన్నారు. సేంద్రియ రైతుగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆయన వద్దకు దేశ విదేశాల నుంచి రైతులు వచ్చి శిక్షణ పొందుతూ ఉంటారు. కొద్ది ఏళ్లుగా చోహాన్ క్యు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను కూడా అనుసరిస్తున్నారు. వివరాలకు.. డాక్టర్ పి.బి.ప్రతాప్కుమార్– 94401 24253 కూరగాయలు, ఔషధ మొక్కలపై 41 రోజుల ఉచిత శిక్షణ దక్షిణ కొరియాకు చెందిన డా. చోహాన్ క్యూ సహజ సాగు, చింతల వెంకటరెడ్డి(సీవీఆర్) మట్టి ద్రావణం వాడే పద్ధతుల్లో ఆకుకూరలు, కూరగాయలతోపాటు.. కలబంద, అశ్వగంధ, నిమ్మగడ్డి, కాశీగడ్డి తదితర ఔషధ, సుగంధ మొక్కల సాగు, శుద్ధి, విక్రయాలపై ఉచిత శిక్షణ ఇవ్వడం ద్వారా యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో జూలై 1 నుంచి 41 రోజుల పాటు పొలంలో ఆచరణాత్మక ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు న్యూలైఫ్ ఫౌండేషన్(హైదరాబాద్) వ్యవస్థాపకుడు శివశంకర్ షిండే తెలిపారు. కనీసం పదో తరగతి చదివిన 18 ఏళ్లు నిండిన వారు అర్హులు. యాదాద్రి, మేడ్చల్ జిల్లాల్లోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో శిక్షణ ఇస్తామని, శిక్షణతోపాటు భోజన, వసతి ఉచితమే. ఆసక్తిగలవారు పేరు, విద్యార్హత, వయస్సు, చిరునామా తదితర వివరాలను ఈ నెల 11వ తేదీ లోగా 70133 09949, 81210 08002 నంబరుకు వాట్సప్ లేదా టెలిగ్రామ్ ద్వారా మాత్రమే మెసేజ్ పంపవలసి ఉంటుంది.. 9న సేంద్రియ/ప్రకృతి సేద్యంపై అవగాహన సదస్సు రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంపై హైదరాబాద్ లక్డీకపూల్ రెడ్హిల్స్లోని ఫ్యాప్సీ ఆడిటోరియంలో ఈనెల 9(శనివారం)న ఉ.10 గం. నుంచి సా. 4 గం. వరకు అవగాహన సదస్సు జరగనుంది. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మిరప, పత్తి, కూరగాయలు, అరటి, చిరుధాన్యాల సాగు, కషాయాలు/ద్రావణాలు, జీవన ఎరువులు, వేస్ట్ డీకంపోజర్ వినయోగంపై అవగాహన కల్పిస్తారు. సీనియర్ రైతులు ఎం.సి.వి. ప్రసాద్, కొక్కు అశోక్కుమార్, లావణ్యారెడ్డి, శరత్, అరుసుమిల్లి కృష్ణ, పడాల గౌతమ్, కె.రామచంద్రం అవగాహన కల్పిస్తారు. వివరాలకు 98493 12629, 96767 97777 నంబర్లలో సంప్రదించవచ్చు. సదస్సుకు హాజరయ్యే రైతులకు తలా ఒక వేస్ట్ డీకంపోజర్ బాటిల్ను ఉచితంగా పంపిణీ చేస్తారు. -
ఇకపై పశువులకు ఆధార్
వీరపునాయునిపల్లె : ఇప్పటివరకు మనుషులకు ఉన్న ఆధార్ నెంబర్ను ఇకపై పశువులకు కేటాయించే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది. పశు సంజీవని పథకంలో భాగంగా ఆనాఫ్ పేరుతో పాడి ఆవులు, గేదెలకు 12 అంకెలతో కూడిన ట్యాగును అమర్చుతారు. ఇనాఫ్ పేరుతో మొబైల్ యాప్ కూడా రూపొందించి ఈ కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికపుడు తెలుసుకునేలా చేస్తోంది. ఆన్లైన్లో పూర్తి సమాచారం ట్యాగులోని 12 అంకెల ఆధారంగా పశువు పూర్తి సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఆ పశువు ఎపుడు ఎక్కడ పుట్టింది. ఏజాతికి చెందింది, దాని యజమాని ఎవరు, ఇంతవరకు ఎన్ని ఈతలు ఈనింది, ఎన్ని పాలు ఇస్తుంది. ఏదైనా జబ్బు చేసినపుడు చికిత్స పొందిందా..లేదా.. ఎంత విలువ చేస్తుంది. ఇలా పశువు పూర్తి సమాచారం అందులో ఉంటుంది. ఎవరైనా పశువును కొనాలనుకుంటే దాని నెంబర్ ఆధారంగా పెద్ద శ్రమ లేకుండా ఆన్లైన్లోనే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మందులు, దాణా పంపిణీ పశువులకు సాధారణంగా వచ్చే వ్యాధులు, నివారణ మందులు, పోషక విలువలతో కలిగిన దాణా, పశుగ్రాసం, బీమా సాయం, ఇకమీదట పశువుకు తగిలించిన ట్యాగులోని బిల్ల ఆధారంగా జరుగుతాయని అధికారులు తెలిపారు. పరిమితికి మించి మందులు, దాణా, పశుగ్రాసం యజమాని పొందే అవకాశం ఉండదని తెలిపారు. బీమా సాయం కూడా ఒకసారికి మించి తీసుకునే వీలు ఉండదని అధికారులు చెబుతున్నారు. -
పశువుల లెక్క పక్కాగా
కరీంనగర్అగ్రికల్చర్: పశువుల లెక్కను పక్కాగా తేల్చేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సర్వే చేయనున్నారు. ప్రతి పశువుకూ ఓ విశిష్ట నంబర్ కేటాయించనున్నారు. పశుగణనకు 105 మంది ఎన్యుమరేటర్లతోపాటు పర్యవేక్షణకు సూపర్వైజర్లు, సిబ్బందికి శిక్షణ పూర్తిచేశారు.. కేంద్ర ప్రభుత్వం నుంచి అతి త్వరలో షెడ్యూల్ వచ్చే అవకాశముండగా.. అందుకు యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఈనెల చివరి వారంనుంచి రెండునెలల్లో సర్వే పూర్తయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఐదేళ్లకోసారి సర్వే దేశవ్యాప్తంగా ప్రతి ఐదేళ్లకోసారి పశుగణను చేపడతారు. రాష్ట్రంలో కూడా పశుగణన జరగాల్సి ఉండగా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీతో జాప్యం జరిగింది. సర్వేలో పశువులు, గొర్రెలు, మేకలు, కుక్కలు, గాడిదలు, గుర్రాలు, పందులు, కోళ్లు, బాతులు, ఒంటెలతో సహా ప్రతి పెంపుడు జీవి కూడా లెక్కలోకి రానుంది. 2011లో నిర్వహించిన పశుగణన లెక్కల ప్రకారం జిల్లావ్యాప్తంగా 83,732 తెల్లజాతి పశువులు, 1000801 నల్లజాతి పశువులు, 4.10 లక్షల గొర్రెలు, 83,104 మేకలు, 8,696 పందులు, 4,48,484 నాటు కోళ్లు, 15,20,215 పౌల్ట్రీ కోళ్లు లెక్కలో ఉన్నాయి. వ్యవసాయ యాంత్రీకరణ కారణంగా ఆవులు, ఎద్దులు, జెర్సీ ఆవుల సంఖ్య తగ్గే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కుర్మలకు అందిస్తున్న సబ్సిడీ గొర్రెల పథకంతో జిల్లాలో గొర్రెల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.. జిల్లాలో ఇప్పటికే 4606 యూనిట్లు (96,726 గొర్రెలు) పంపిణీ చేశారు. మరో 31 వేల గొర్రెలు పునరుత్పత్తి జరిగినట్లు అధికారులు ఒక అంచనాకు వచ్చారు. పందులు, మేకలు, పౌల్ట్రీ పరంగా కోళ్ల సంఖ్య కూడా పెరుగుతుందని చెబుతున్నారు. ఆన్లైన్లో గణన.. 2017లో జరగాల్సిన పశుగణన ఈ యేడాది ఆలస్యంగా చేపట్టబోతున్నారు. జిల్లాలోని గోపాల మిత్ర, పశుమిత్రతో పాటు నిరుద్యోగులను కలుపుకుని 105 మంది ఎన్యుమరేటర్లను ఎంపిక చేశారు. వీరికి ట్యాబ్లెట్లు అందిస్తున్నారు.. పర్యవేక్షణకు మరో 30 మంది శాఖ అధికారులు, సిబ్బందిని సూపర్వైజర్లుగా ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. సర్వే సమయంలో వివిధ సమస్యల పరిష్కారానికి ’ ఈ కేంద్రం’ ద్వారా పర్యవేక్షణకు ఒక నోడల్ అధికారితో పాటు ఇద్దరు పారా సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. 2 నెలల పాటు ఇంటింటి సర్వే నిర్వహించి లెక్క తేల్చనున్నారు. గతంలో జరిగిన పశుగణన మ్యానువల్గా కాగితాలపై రాయగా.. ఈసారి ఒక విశిష్ట గుర్తింపు నంబర్ను కేటాయిస్తూ వివరాలు నమోదు చేస్తారు. జంతు రక్షణకు చర్యలు. పశుగణనలో భాగంగా పశువులతోపాటు యజమానులు, వారి ఆదాయం, విద్యార్హతలు, కోళ్ల ఫారాల సంఖ్యనూ ఆరాతీసి లెక్కించనున్నారు. ఇందులో పశువులు, గొర్రెలు, మేకలు, కుక్కలు, గాడిదలు, గుర్రాలు, పందులు, కోళ్లు, బాతులు, ఒంటెలతో పాటు ప్రతి పెంపుడు జీవుల లెక్క కంప్యూటర్లో నిక్షిప్తం కానుంది. ఉమ్మడి రాష్ట్రంలో పశువుల అభివృద్ధికి కచ్చితమైన కేటాయింపులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సకల జనుల సర్వే, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, సకల నేరస్తుల సర్వే, మత్య్సకారుల సర్వేలతో దేశంలోనే సాంకేతికతను ఉపయోగించిన ప్రత్యేక రాష్ట్రంగా గుర్తింపు పొందింది.. పశుగణనతో ప్రభుత్వం జంతు సంరక్షణకు అవసరమైన నిధుల కేటాయింపు, వైద్య సదుపాయాలకు కావాల్సిన సామగ్రి కొనుగోలు, వాటి సంతాన ఉత్పత్తికి తీసుకోవాల్సిన చర్యలను చేపట్టేందుకు ఈ గణన కీలకం కానుంది. పశుగణనకు సిద్ధం పశుగణనకు సర్వం సిద్ధం చేశాం. కేంద్ర ప్రభుత్వం నుంచి షెడ్యూల్ రాగానే గణన చేపడుతాం. అందుకు ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల ఎంపికతోపాటు శిక్షణ కూడా పూర్తి చేశాం. ప్రభుత్వం కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విశిష్ట గుర్తింపు సంఖ్యతో పాటు పశువుల సమగ్ర సమాచారాన్ని నమోదు చేసి గణన చేయాలనే ఆలోచనతో కొంత జాప్యం జరిగింది. గణన ద్వారా పూర్తిస్థాయి సమాచారం సేకరించడంతో నిధుల కేటాయింపు, వాటి పరిరక్షణ సులభతరం కానుంది.-ఎన్.విక్రమ్కుమార్,జిల్లా పశుసంవర్దక శాఖ అధికారి -
రోడ్లపైనే పశువులు
ఉట్నూర్రూరల్(ఖానాపూర్) : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా పరిధిలోని ఆయా మండలాల్లో పశువులు రోడ్లపై, సంతల్లో సంచరిస్తుండటంతో అటు వాహనదారులు, ఇటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పశువుల యజమానులు మాత్రం తమకేమి పట్టనట్లు వ్య వహరిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారిపై ఉన్న జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలైన ఉట్నూర్, నేరడిగొం డ, ఇచ్చోడ, గుడిహత్నూర్, ఇంద్రవెల్లి ప్రధాన రోడ్ల గుండా పశువులు రోడ్డుపైనే సంచరిస్తుండటంతో ప్రజలు తంటాలు పతున్నారు. ఇలా సంవత్సరాల పాటు ఇదే సమస్య ఉన్నప్పటికీ పట్టించుకునే నాథులు కరువయ్యారు. పలు ప్రాంతాల్లో ఇరుకు వంతెనలు, వంతెనలు పగిలిపోయి, స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ సమీపం వరకు రోడ్డు బాగానే ఉన్నప్పటికీ అక్కడి నుండి ఉట్నూర్ మండల కేంద్రం వరకు రోడ్డు గుంతలమయంగా మారింది. దీంతో అసలే ఇరుకురోడ్లు ఆపై కిక్కిరిసే వాహనాలు. ఇది చాలదన్నుట్లు కొన్ని పశువులు గుంపులుగా వివిధ ప్రాంతాల్లో రోడ్లపై తిష్టవేసి వాహనదారుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. పశువులను రోడ్లపైకి వదిలి యజమానులు తమను ఎవరేం చేస్తారనే చంద ంగా వ్యవహరిస్తున్నారు. రోడ్లపైకి వదలకుండా యజమానులను కట్టడి చేయాల్సిన పంచాయ తీ పట్టించుకునే పరిస్థితిలో లేదు. పశువులు మందలు మందలుగా రోడ్లపై ఉండటంతో కని పించక రాత్రివేళల్లో ప్రమాదాలు చోటు చేసుకునే ప్రమాదం నెలకొంది. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి పశువులు రోడ్లపైకి రాకుండా చర్యలు చేపట్టాలని వాహన చోదకులు, స్థానికులు కోరుతున్నారు. బంజరు దొడ్లు ఉన్నా.. గ్రామాల్లో పశువుల యజమానులు రోడ్లపై వదిలేసిన పశువులను బంజరు దొడ్లలో వేసి వారికి తగిన రుసుము విధించి వారికి అప్పచెప్పడం జరుగుతుంది. కాని ఉన్న బంజరుదొడ్లు నిరుపయోగంగా మారాయి. గతంలో రోడ్డుపై ఉన్న పశువులను బంజరు దొడ్లలో వేసి యజ మానులకు అప్పజెప్పేవారు. కాని మరల పశువులు యథావిధిగా రోడ్లపై సంచరిస్తున్నాయి. అటు పంచాయతీ అధికారులు, ఇటు పశువుల యజమానులు పట్టించుకోక పోగా పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రాత్రి వేళల్లో అతివేగంగా వచ్చే వాహనదారులు ఢీ కొట్టడంతో మత్యువాత పడటంతో పాటు వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వారసంతల్లో కిక్కిరిసిన జనాల మధ్య పశువులు సంచరిస్తూ ప్రజలను ఇబ్బంది పరుస్తూ కుమ్ములాటలో జనాలు గాయాల పాలవుతున్న సంఘటనలున్నాయి. ఇంత జరిగిన పంచాయతీ అధికారులు వారసంతలో ట్యాక్సులు తీసుకుంటున్న సంతకు కావాల్సిన రక్షణ కల్పించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రోడ్డుపై, సంతల్లో సంచరించే పశువులను పట్టుకొని వాటి యజమానులకు అప్పగించి లేని ఎడల వేలం నిర్వహించి లేద గోశాలకు అప్పగించాలని ప్రజలు కోరుతున్నారు. స్పీడ్ బ్రేకర్లు లేక ఇబ్బందులు.. జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారికి పక్కనే కళాశాలలు, పాఠశాలలు ఉన్నాయి. వాహనాల రద్దీ పెరగడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ని విద్యార్థుల తల్లి దండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ఎన్ని పనులున్న పిల్లలను పాఠశాలలకు విడిచిపెట్టాల్సిందేనంటున్నారు. ప్ర«ధాన రహదారులపై పాఠశాలల ముందు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది. -
మన పశువైద్యం అంత ‘సేఫ్’ కాదా!?
పశు వైద్యశాలల్లో నాసిరకం యాంటీబయాటిక్స్ మందులు సాక్షి, అమరావతి: రైతుకు బర్రె, గొర్రె జీవనాడి. వ్యవసాయం భారంగా మారిన పరిస్థితుల్లో ఏ పల్లెలో చూసినా పాడి మీదే ఆధారపడి జీవిస్తున్న ఘటనలు కోకొల్లలు. అలాంటి గొర్రెకు, బర్రెకు జబ్బుచేస్తే వేసే మందులు కూడా నాసిరకమైనవైతే రైతు నడ్డి విరిగినట్టే. స్వయానా ప్రభుత్వంలో అత్యున్నత పదవులు అనుభవిస్తున్నవారే ఇలాంటి నాసిరకం మందులు తయారు చేసి, అమ్ముతున్నారంటే.. ఎం త దారుణం. అధికారంలో ఉన్నాం, మా కంపెనీల జోలికొస్తే, మా మందులను ప్రశ్నిస్తే మీ అంతు చూస్తామంటూ బెదిరిస్తుండటంతో అధికారులు సైతం నోరు మెదపడంలేదు. ‘సాక్షి’ పరిశీలనలో విస్మయపరిచే అంశాలు దృష్టికి వచ్చాయి. నాసిరకం యాంటీబయాటిక్స్ పశువులకు జబ్బుచేస్తే మనుషులకు లాగే తక్షణమే యాంటీబయాటిక్స్ వాడతారు. ప్రస్తుతం పశువు లకు వాడే యాంటీబయాటిక్స్లో ఆక్సీటెట్రాసైక్లిన్ అనేది చాలా ప్రధానమైనది. ఈ మందును ‘సేఫ్’ కంపెనీ తయారు చేసి, ప్రభుత్వ పశువైద్యశాలలకు సరఫరా చేసింది. పారదర్శకంగా ఉండాల్సిన ఈ యాంటీబయోటిక్ ద్రావణం రాగిజావలాగా ఉండటంతో తూర్పుగోదావరి, చిత్తూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాలోని సహాయ సంచాలకులు ఆ మందుల బాటిళ్లను జూన్లోనే జాయింట్ డైరెక్టర్లకు పంపించారు. కానీ జాయింట్ డైరెక్టర్లు వాటిపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం. సేఫ్ కంపెనీ తయారుచేసిన ఆక్సీ టెట్రాసైక్లిన్ మందు... ఈ ఏడాది ఫిబ్రవరిలో సరఫరా చేసినప్పుడు కూడా కర్నూలులో నాసిరకం అని తేలింది. దీనిపై పత్రికల్లో వార్తలు సైతం వచ్చాయి. ఆ తర్వాత సేఫ్ కంపెనీ యాజమాన్యం రంగంలోకి దిగి ఎలాంటి చర్యలూ లేకుండా చేసుకోగలిగింది. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన ఔషధ నియంత్రణ శాఖ కనీసం ఈ ఫిర్యాదులపై కన్నెత్తికూడా చూడటం లేదు. సేఫ్ కంపెనీ కోసం మార్కెట్ స్టాండింగ్ నిబంధన ఎత్తివేత ఒక కంపెనీనుంచి ఏ మందునైనా కొనాలంటే కనీసం మూడేళ్ల మార్కెటింగ్ స్టాండింగ్ సర్టిఫికెట్ ఉండాలి. కానీ సేఫ్ కంపెనీ వ్యాపారంలోకి ప్రవేశించాక ఆ నిబంధన ఎత్తేశారు. అంతేకాదు... గతంలో డీవార్మింగ్ మందులను రూ.230కి ఒక కంపెనీ సరఫరా చేసేది. దానినుంచి ఈ ఆర్డరు లాక్కుని సేఫ్ కంపెనీకి రూ.430కి ఇచ్చారు. మరో ఎమ్మెల్యే కంపెనీ ఉత్పత్తి కూడా నాసిరకమే గుంటూరు జిల్లాకు టీడీపీ ఎమ్మెల్యే కంపెనీకి సంబంధించిన ఇంజక్షన్లు నాసిరకం అని తేలాయి. అభినందన అగ్రొవెట్ ఇండియా పేరుతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈక్విన్ (ఎన్రోఫ్లాక్సిసిన్) ఇంజ క్షన్లను ప్రభుత్వ పశువైద్యశాలలకు పంపించారు. ఈ మందుకూడా యాంటీబయాటిక్స్ ఇంజక్షనే. ఈ ఇంజక్షన్ను కూడా ‘సేఫ్’ కంపెనీలోనే తయా రు చేయించారు. కాగా ఈ ఇంజక్షన్ నాసిరకం అని (బ్యాచ్ నెం.050516) ఔషధ నియంత్రణ శాఖ తేల్చింది. ఇలా నాసిరకం మందులను తయారు చేసిన కంపెనీల జాబితాను ఔషధ నియంత్రణ శాఖ వెబ్సైట్లో కూడా పెట్టింది.అయినా ఎవరూ పట్టించుకోక పోవడం విశేషం. నా దృష్టికి రాలేదు తూర్పుగోదావరి జిల్లాలో ఆక్సీ టెట్రాసైక్లిన్ ఇంజక్షన్లపై ఎలాంటి ఫిర్యాదులూ మా శాఖ దృష్టికి రాలేదు. అలాంటి ఫిర్యాదులు వస్తే తప్పకుండా పరిశీలిస్తాం. í –మూర్తి, అసిస్టెంట్ డైరెక్టర్, ఔషధ నియంత్రణశాఖ, తూర్పుగోదావరి జేడీకి ఇప్పటికే పంపించాం ఆక్సీటెట్రా సైక్లిన్ ఇంజక్షన్లపై ఇప్పటికే జాయింట్ డైరెక్టర్లకు పంపించాం. ఆ మందుల్లో నాణ్యత కొరవడిందనే ఉద్దేశంతోనే నాణ్యతా పరీక్షలకు ఆదేశించాలని పంపించాం. ఇంతవరకూ రిపోర్టులు రాలేదు. –డాక్టర్ వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ, రాజమండ్రి మాకు తెలియనే తెలియదు అసలు ఇలాంటి మందులు సరఫరా చేసినట్టు మాకు తెలియనే తెలియదు. సరఫరా అయిన మందులను తెప్పించుకుని ఔషధ నియంత్రణ శాఖకు పంపిస్తాం. –డాక్టర్ సోమశేఖర్, సంచాలకులు, పశు సంవర్ధకశాఖ, ఏపీ -
రోజుకు రూ. 840 కోట్లు ఖర్చుపెట్టేదెవరు?
న్యూఢిల్లీ: వ్యవసాయరంగంలో ఆధునిక పద్ధతులు అంకురించడంతో పశువులు, ముఖ్యంగా ఎద్దుల అవసరం తగ్గుతూ వస్తోన్న విషయం తెల్సిందే. నేడు సన్న, చిన్నకారు రైతులు మినహా ఎవరూ ఎద్దులపై ఆధారపడి వ్యవసాయం చేయడం లేదు. నాగళ్ల చోట ట్రాక్టర్లు రావడం, మోట బావుల చోట బోరింగ్లు రావడంతో ఎద్దులతో మోట కొట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. దేశంలోని మారుమూల పల్లెల్లో కొన్ని మోట బావులు ఉన్నప్పటికీ కరెంటు మోటార్లు రావడంతో వాటికీ ఎద్దుల శ్రమ లేకుండా పోయింది. పాల కోసం ఆవులను మాత్రం సాధుతున్న రైతులు వాటిని పాలిచ్చేంత వరకు ప్రాణంగానే చూసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి పశువులు, ముఖ్యంగా ఎద్దులు ఏమవుతున్నాయన్న ప్రశ్నకు సమాధానం అందరికి తెల్సిందే. పనికిరాని పశువులను కబేళాలను తరలిపోతున్నాయన్నది. ఇప్పుడు కబీళాలకు ఎద్దులను, ఆవులను తరలించకుండా కేంద్ర ప్రభుత్వం క్రయ,విక్రయాలను నియంత్రిస్తూ జాతయ జంతు క్రూరత్వ నిరోధక చట్టంలో మార్పులు తీసుకువచ్చింది. పశువులను కబేళాలకు తరలించకుండా కొన్ని రాష్ట్రాలు కఠిన చట్టాలు కూడా తీసుకవచ్చాయి. గుజరాత్ రాష్ట్రమైతే యావజ్జీవ కారాగార శిక్ష విధించేలా చట్టాన్ని తీసుకొచ్చింది. 2012 నుంచి దేశంలో ట్రాక్టర్ల పెరుగుదల తొమ్మిది శాతంగా ఉంది. అప్పటి పశు సంపద గణాంకాల ప్రకారం సమీప భవిష్యత్తులో 4.40 లక్షల ఎద్దులు నిరుపయోగం కానున్నాయి. తన జీవనోపాధికే అష్టకష్టాలు పడుతున్న రైతులు ఈ నిరుపయోగమయ్యే ఎద్దులను ఆదరించే అవకాశం ఏ మాత్రం లేదు. డబ్బుల కోసం గతంలో కబేళాలలకు విక్రయించేవారు. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. ఈ ఏడాది ట్రాక్టర్ల వద్ధి రేటు ఏడు శాతం ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. ఆరు శాతమే వద్ధి ఉంటుందనుకున్నా మరో పదేళ్ల కాలంలో దాదాపు 14 కోట్ల ఎద్దులు రోడ్డున పడనున్నాయి. మరి వాటిని ఎవరు పోషించాలి? పశువధను నిషేధించిన కర్మానికి వాటిని పోషించేందుకు ప్రభుత్వమే ముందుకు వచ్చిన పక్షంలో ప్రస్తుతమున్న దాణా రేట్ల ప్రకారం వాటిని పోషించేందుకు ఒక్కదానికి 60 రూపాయల చొప్పున రోజుకు 840 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాల్సి వస్తుంది. పంట చేతికిరాక అప్పులపాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితుల్లో ఇంత సొమ్ము పశుదాణాపై ప్రభుత్వం ఖర్చు పెట్టడం ఏ మేరకు సబబు? -
పశువులకు సంచార వైద్యశాలలు
►మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖమ్మం వ్యవసాయం: 108 వైద్య సేవల మాదిరిగానే పశువులకూ సంచార వైద్య సేవలను తీసుకొస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కురమలు, యాదవుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పశువులకు, జీవాలకు అత్యవసర సేవలందించేం దుకు ఈ నెల చివరి నుంచి సంచార వైద్యశాలలు ప్రారంభిస్తున్నామని చెప్పారు. -
మూగజీవాలకు మేత కరువు
► కరువు దెబ్బకు అల్లాడుతున్న పశువులు ► జిల్లాలో తగ్గిన పాల ఉత్పత్తి సాక్షి ప్రతినిధి – నెల్లూరు : జిల్లాలో నెలకొన్న తీవ్ర దుర్భిక్షం కారణంగా మూగ జీవాలకు మేత, నీటి సమస్య ఏర్పడింది. వర్షాలు కురవక పోవడంతో గడ్డి కొరత ఏర్పడింది. దీంతో రైతులు పశువులను పోషించలేక కబేళాలకు అమ్మేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న అరకొర సహాయక చర్యలు రైతుల్లో ధైర్యం నింపలేక పోతున్నాయి. దీంతో రెండు నెలలుగా జిల్లాలో పాల దిగుబడి సైతం గణనీయంగా తగ్గింది. మూడేళ్లుగా జిల్లాలో తిష్ట వేసిన కరువు ఈ సారి తన ఉగ్ర రూపం చూపింది. జిల్లాలో దాదాపు 70 శాతం వర్షపాతం లోటు ఏర్పడింది. దీంతో జలాశయాల్లో నీరు అడుగంటడంతో పాటు, జిల్లాలోని చెరువులన్నీ నీళ్లు లేక బీటలు వారాయి. రైతులు ఖరీఫ్కు సెలవు ప్రకటించారు. కరువు పరిస్థితుల్లో పాడిని నమ్ముకుని బతుకు సాగించే పాడి రైతులు సైతం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 1,17,966 ఆవులు ఉండగా, ఇందులో 54,505 ఆవులు పాలు ఇస్తున్నాయి. 6,24,654 గేదెలు ఉంటే, ఇందులో 2,93,587 గేదెలు పాలు ఉత్పత్తి చేస్తూ రైతులను ఆదుకుంటున్నాయి. రోజుకు సరాసరి 2 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అయ్యేవి. అయితే కరువు కారణంగా మేత, నీరు లేక పోవడంతో రెండు నెలలుగా 25 శాతం దాకా పాల ఉత్పత్తి తగ్గి పోయింది. తగ్గిన పాల దిగుబడి పెంచుకోవడం కోసం పశుసంవర్ధక శాఖ జిల్లాకు 728 సూటు గేదెలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. రూ.60 వేల విలువయ్యే ఈ గేదెను రూ.15 వేలకే రైతులకు అందించనున్నారు. కరువు మండలాల్లో పశువులను రక్షించుకోవడం కోసం పశుసంవర్ధక శాఖ సబ్సిడీ మీద 2వేల మెట్రిక్ టన్నుల దాణా, 1000 మెట్రిక్ టన్నుల సమీకృత దాణా, 500 టన్నుల పాతర గడ్డి సరఫరా చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీంతో పాటు ప్రతి పంచాయతీలో పశువుల కోసం రెండు నీటి తొట్టెలు నిర్మించి అందులో నీరు నింపేలా చర్యలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తోంది. అయితే గ్రామాల్లో ప్రజలు తాగడానికే నీరు లేక పోతే ఇక పశువులకు ఎక్కడి నుంచి తెచ్చి పోయాలని, పశువుల కోసం నిర్మించే తొట్లలో ప్రభుత్వమే తాగునీటిని నింపేలా ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నారు. -
గనిగుంత మింగేసింది..!
- బర్రెలు తోలేందుకు వెళ్లి ఒకరు - ప్రమాదం నుంచి కాపాండేందుకు వెళ్లి మరొకరు - ఇద్దరు మహిళలు మృత్యువాత - సుంకేసుల గ్రామంలో విషాదం అవుకు: వేసవిలో పశువుల తాపం తీర్చే గనిగుంత ఇద్దరు మహిళలను మింగేసింది. ఈ విషాదకర ఘటన బుధవారం అవుకు మండలం సుంకేసుల గ్రామ శివారులో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సంజామల మండలం రామిరెడ్డికి పల్లెకు చెందిన మూరబోయిన లక్ష్మీదేవి (26), మూరబోయిన రాజశ్వేరి (35) అనే మహిళలు తమ బర్రెలను మేపుకోవడానికి సుంకేసుల గ్రామ సమీపానికి వచ్చారు. మధ్యాహ్నం సమయంలో బర్రెలకు వేసవి తాపం తీరుతందని గనిగుంతలోకి పంపారు. వాటిని బయటకు తోలేందుకు వెళ్లన లక్ష్మీదేవి గని గుంతలో చిక్కుకుపోయి ఆర్తనాదాలు చేసింది. గమనించిన రాజేశ్వరి.. తాను కూడా గనిగుంతలోకి దిగి ప్రమాదం కొని తెచ్చుకుంది. ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలిసి సుంకేసుల గ్రామంతో పాటు రామిరెడ్డి పల్లె గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సంజామల మండల మంగంపల్లె చెందిన లక్ష్మీదేవికి, రామిరెడ్డి పల్లెకు చెందిన లక్ష్మీనారాయణతో ఆరు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఎల్కేజి చదువుతున్న కూతురు, ఒకటో తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు. అలాగే మహానంది మండలం బొల్లవరానికి చెందిన రాజేశ్వరికి రామిరెడ్డి పల్లెకు చెందిన తిమ్మయ్యతో ఇరవై సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇంటర్ చదువుతున్న హేమంత్, 8 వతరగత చదువుతున్న మధుసూదన్ ఉన్నారు. ఒకే గ్రామంలో ఇద్దరు మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
పీటీపీకి రూ.22 కోట్ల నిధులు
పెంటపాడు: మేలుజాతి పశువుల అభివృద్ధి పథకానికి (పీటీపీ) ప్రభుత్వం రూ.22 కోట్ల నిధులు అందించనున్నట్టు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ పాకలపాటి గాంధీ తెలిపారు. పెంటపాడులో గోపాలమిత్ర సూపర్వైజర్ల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఐదేళ్ల ప్రోగ్రాంలో భాగంగా పలు జిల్లాలకు ఉపయోగపడేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు. దీనిలో భాగంగా గ్రామాలను దత్తత తీసుకుని ఎక్కువ పాలనిచ్చే ముర్రాజాతి ఆవులు, గిత్తల యజమానులను ప్రోత్సహిస్తామన్నారు. రాష్ట్రంలోనే ఇతర జాతులను అభివృద్ధి చేయడమే పథకం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. జిల్లాలో 15 జాతుల స్వదేశీ పశువులతో కామధేను పథకం, రూ.10 కోట్ల నిధులతో సంచార వైద్యశాలల అభివృద్ధి పనులను వచ్చేనెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. గోపాలమిత్రల సంఘ అధ్యక్షుడు వి.సుబ్బారాయుడు, సాయిబాబు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
తూర్పుగోదావరి జిల్లాలో ఎడ్లపోటీలు
-
సంపూర్ణ సమీకృత దాణాతో ఎంతో మేలు
మిర్యాలగూడ రూరల్ జిల్లా వ్యాప్తంగా పశువులు, జీవాలు(గొర్రెలు, మేకలు) పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వీటిని చాలా మంది సాంప్రదాయ పద్ధతిలోనే మేపుతున్నారు. పచ్చిక బయళ్లలోకి తీసుకెళ్లి గాని, ఇంటి వద్దే కట్టేసి గాని మేత మేపుతున్నారు. దాణా వినియోగం నామ మాత్రంగానే ఉంటుంది. కొనే స్థోమత లేక చాలా మంది దాణా జోలికి వెళ్లడం లేదు. దీని వల్ల పశువులకు, జీవాలకు పోషకాలు సరైన నిష్పత్తిలో అందడం లేదు. ఫలితంగా వాటి ఎదుగుదలలో లోపం కనిపిస్తుంది. ముఖ్యంగా పాడి పశువుల్లో ఆశించిన మేర పాల దిగుబడి పెరగడం లేదు. ఈ పరిస్థితుల్లో ‘సంపూర్ణ సమీకృత దాణా ’ మంచి ప్రత్యమ్నాయమని మిర్యాలగూడ వెటర్నరీ ఏడీ జూలకంటి వెంకట్ రెడ్డి తెలిపారు. పెద్దగా ఖర్చు లేకుండానే ఎండు పంటలను దాణా దినుసులను కలిపి తయారు చేసుకోవచ్చని ఆయన వివరించారు. పశువులకు కావాల్సిన అన్ని పోషక పదార్థాలను సరైన మోతాదులో సమకూర్చేలా ఎండ మేతతో సహా అన్ని దాణా దినుసులను పొడి చేసి మిశ్రమంగా తయారు చేసే దాణాను సమీకృత దాణా అంటారు. ఇందులో పత్తి కట్టె, కంది కట్టె, మొక్క జొన్న చొప్ప, కండెలు, ఉలువ చొప్ప, వేరుశనగ పొట్టు, పొద్దు తిరుగుడు మొక్కలు, పూలు, చింత గింజలు, చెరకు ఆకులు, మొదలైన ఎండు పంటలను, మొక్క జొన్నలు, జొన్నలు తౌడు, గానుగ చెక్క యముకల పొడి, యూరియా దాణా దిగుబడులను ఉపయోగించుకోవచ్చు. తయారీ ఇలా... ముందుగా ఎండు మేత, దాణా దినుసులను యంత్రంలో వేసి పొడి చేయాలి. తరువాత మిక్సర్లో నింపాలి. ‘ఫ్రీమిక్స్’ చేసిన తరువాత 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడిచేసి మొలాసిస్ను తగిన మోతాదులో కలపాలి. పది నిమిషాల పాటు అన్ని పదార్థాలను బాగా కలియ బెట్టాలి. ఉదాహరణకు వేరుశనగ పొట్టు 60 కిలోలు, మొక్కజొన్న గింజలు ఎనిమిది కిలోలు, వరి తవుడు ఏడు కిలోలు, సాధారణ ఉప్పు అరకిలో, యూరియా 20.5 కిలోలు, ఖనిజలవణ మిశ్రమం కిలో, మొలాసిస్ ఒక శాతం వినియోగించి సంపూర్ణ సమీకృత దాణా తయారు చేసుకోవచ్చు. ఎన్నో ఉపయోగాలు సంపూర్ణ సమీకృత దాణా వల్ల పశువులకు కావాల్సిన పోషక పదార్థాలు అన్ని సరైన మోతాదులో లభిస్తాయి. దాణాలో దినుసులు కలుస్తున్నందున పశువులు ఇష్టంగా మేస్తాయి. అదికాక సాంప్రదాయేతర మాంసకృత్తులు(యూరియా)వినియోగం పెరగడానికి వీలుంటుంది. ఘన పదార్థాల రూపంలో పశువులు ఎక్కువ మేత తినడానికి అవకాశం ఉంది. పాడి పశువులకు ఇది చాలా మంచిది. పాడి శాతం 11 నుంచి 23 వరకు పెరగవచ్చునని పరిశోధనలు తెలుపుతున్నాయి. దాణా ఖర్చు కూడా 21నుంచి 25 శాతం తగ్గుతుంది. గొర్రెల్లో 20–22, మేకల్లో 11–32 శాతం పెరుగుదల నమోదు అయ్యే అవకాశం ఉంది. కరువు పరిస్థితుల్లో గొర్రెలను, మేకలను వలసకు తీసుకువెళ్లకుండా స్థానికంగానే సమీకృత దాణా ఇచ్చి మేపవచ్చు. ఎంత మోతాదులో ఇవ్వాలంటే ... గొర్రెలకు అయితే వాటి శరీర బరువులో మూడు శాతం వరకు ఇవ్వాలి. సా«ధారణ మేకలైతే శరీర బరువులో మూడు శాతం వరకు, పాలిస్తుంటే ఐదు శాతం వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఆవులకు 2.5 శాతం, గేదెలకు మూడు శాతం వరకు ఇస్తే ఫలితం ఉంటుంది. -
గో సంరక్షణకు కృషి
ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో భజన మందిరాల నిర్మాణం టీటీడీ బోర్డు పాలకమండలిసభ్యుడు, ఎమ్మెల్యే సండ్ర ఖమ్మం అర్బన్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గో సంరక్షణ కార్యక్రమం చేపడుతున్నట్లు టీటీడీ పాలక మండలి సభ్యుడు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. టీటీడీ నిధులతో నిర్మిస్తున్న టేకులపల్లి(ఖమ్మం)లోని శ్రీ వేంకటేశ్వర గోశాల పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. సామాజిక స్ఫూర్తితో గో సంరక్షణకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. టేకులపల్లిలో రూ. 24 లక్షలతో షెడ్డు నిర్మాణం చేపట్టామని వివరించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో రూ. 8 లక్షల వ్యయంతో భజన మందిరాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. గతంలో భజన మందిరాలకు స్థానికుల నుంచి రూ 2 లక్షల కంట్రిబ్యూషన్ ఉంటే మిగతా∙రూ. 6 లక్షలు ఇచ్చేవారని తెలిపారు. దీంతో నిర్మాణాలకు ముందుకు సాగడం లేదని ఇటీవల తిరుపతిలో జరిగిన బోర్డు సమావేశంలో తాను లేవనెత్తగా మొత్తం ఖర్చు రూ 8 లక్షలు కూడా టీటీడీ నుంచే ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. జిల్లాలో 15 భజన మందిరాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని, వాటిలో ఆరింటికి రూ. 50 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. భద్రాచలానికి రూ. 4 కోట్లు భద్రాచలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సీతారామచంద్రస్వామి వారి ఆలయ అభివృద్ధికి రూ. 4 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రూ. 40 లక్షలతో జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపానికి నూతన హంగులు కల్పిస్తున్నట్లు చెప్పారు. భక్తులకు ఉపయోగపడే విధంగా వసతి గదులు నిర్మించనునున్నట్లు వివరించారు. కూసుమంచి మండలం ఈశ్వరమాధారం దేవాలయం, ఎర్రుపాలెం మండలంలోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం, ఏన్కూరు మండలంలోని నాచారం శ్రీవేంకటేశ్వర ఆలయం, ఖమ్మం ఖానాపురంలోని ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని తెలిపారు. తొలుత వెంకటేశ్వరస్వామి ఆలయంలో సండ్ర పూజలు నిర్వహించారు. ఆయన వెంట దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం ఈఈ ఎస్.చంద్రశేఖర్, డీఈ కె.రాధాక్రిష్ణ, ఏఈ సి. రమేష్, కార్పొరేటర్ హనుమాన్, గోశాల నిర్వహకుడు, అర్చకుడు ఆరుట్ల శ్రీనివాసరావు, గోశాల అభివృద్ధి కమిటీ సభ్యులు యల్లంపల్లి హనుమంతురావు, గొడ్డెటి మాధవరావు, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు గొల్లపూడి హరిక్రిష్ణ, కోలేటి రాధాకృష్ణ, చిరుమావిళ్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
గోసంరక్షణ పేరుతో దళితులపై దాడులా?
మహారాణిపేట: గో సంరక్షణపేరిట దళితులపై కొంతమంది హిందువులు చేస్తున్న దాడులను దళితసేన రాష్ట్ర అధ్యక్షుడు పాల్తేటి పెంటారావు తీవ్రంగా ఖండించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో కొందరు మతోన్మాదులు దళితులపై దాడి చేయడమే కాకుండా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుంటున్నారని దుయ్యబట్టారు. గోమాంసం తిన్నారనే నెపంతో ముస్లిం, మైనార్టీలను దారుణంగా హతమార్చినందుకు నిరసనగా సోమవారం కలెక్టరేట్ ఎదుట దళితసేన ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సంధర్బంగా పాల్తేటి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో దళితులకు జీవించే హక్కు లేదా అని ఇటు పాలకులను అటు హిందూమత పెద్దలను ప్రశ్నించారు. దాళితులపై దాడులకు దిగిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సేన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నక్కెళ్ల నాగమణి, రాష్ట్ర కార్యదర్శి చింతాడ సూర్యం పలువురు దళితసేన నేతలు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ ప్రవీణ్కుమార్కు వినతి పత్రం అందచేశారు. -
సుత్తితో ఆవుల తలపై మోది..
మాంసాన్ని ఎగుమతి చేసేందుకు జంతువులను అత్యంత క్రూరంగా చంపుతున్నట్లు చూపించే ఓ వీడియో నెట్లో హల్చల్ చేస్తోంది. స్లెడ్జింగ్ సుత్తులతో ఇద్దరు వియత్నామీలు ఆవులను వధిస్తున్నట్లు చూపుతున్న ఈ వీడియోలో కనికరం లేకుండా ఆవుల తలపై సుత్తితో మోది మరీ వాటిని చంపుతున్నారు. దీంతో ఆ భయానక పరిస్థితులను తట్టుకోలేక.. పక్కనే వధకు సిద్ధంగా ఉన్న జీవాలు కళ్లు తిరిగి పడిపోయాయి. రక్తసిక్తంగా ఉన్న వధ గదిలో కట్టె గుంజలకు వధకు తెచ్చిన ఆవులను కట్టేశారు. అలా కట్టిన వాటి తలమీద సుత్తితో తీవ్రమైన వేగంతో అది మరణించే వరకూ ఆపకుండా కొట్టడంతో మొదట ఆ మూగజీవం ముందరికాళ్లను కిందకు వంచేసింది. ఆ తర్వాత బాధను భరించలేక పెద్దగా అరుస్తూ నేలకూలింది. దీంతో ఉలిక్కిపడిన పక్కనే ఉన్న మరో ఆవు ఒక్క దెబ్బ కూడా కొట్టకముందే కుప్పకూలిపోయింది. కాగా, ఇలా చంపిన ఆవు మాంసాన్ని వీరు ఆస్ట్రేలియాకు ఎగుమతి చేస్తారు. ఈ వీడియో ఆన్ లైన్ లో వైరల్ అయిన తర్వాత స్పందించిన ఆస్ట్రేలియా, వియత్నాం ప్రభుత్వాలు ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించాయి. -
మేత లేక.. మేప లేక..
♦ కరువు కాటుకు పశువులు విలవిల ♦ దొరకని పశుగ్రాసం.. పెరిగిన గడ్డి ధర ♦ మేపలేక అమ్మకానికి మొగ్గు ♦ కొనుగోలు చేసేవారూ కరువు ♦ దక్కని ప్రభుత్వ చేయూత ఆందోళనలో రైతాంగం కరువు ధాటికి గొడ్డూగోదా విలవిల... రెండేళ్లుగా సరైన వర్షాలు లేక ఎండిపోయిన చెరువులు, కుంటలు... వట్టిపోయిన బోర్లు.. వరిసాగు లేక పశు గ్రాసం కరువు... పంటలు లేక కూలీలుగా మారిన రైతులు. పూటగడవడమే కష్టం... పశువులను మేపే పరిస్థితి లేదు. గ్రాసం అందక ప్రాణాలు పోయే పరిస్థితిలో పశువులు. వాటి గోస చూడలేక అమ్మేందుకు మొగ్గు చూపుతున్న దుస్థితి... అటు పశువులను కొనే వారూ కరువు... వాటిని మేపలేక.. అమ్మలేక తల్లడిల్లుతున్న రైతులు.. సర్కార్ చేయూత లేక దయనీయ స్థితిలో అన్నదాతలు. - నర్సాపూర్ గ్రాసం పెట్టలేక అమ్ముకుంటున్నా... నాకు ఆరెకరాల పొలం ఉంది. కరువుతో బోరు ఎండి వ్యవసాయం సాగడం లేదు. పొట్టకూటి కోసం ఉపాధి పనులకు పోతున్నాం. గడ్డి ధరలు కూడా పెరిగాయి. కొనుగోలు చేసి పశువులకు గడ్డి పెట్టే పరిస్థితి లేదు. తూర్పు కోడెలను అమ్మేందుకు నర్సాపూర్ అంగడికి తీసుకుపోతున్నా. మూడు గేదెలు ఉన్నాయి. వాటికీ గ్రాసం పెట్టనందున పాలు తక్కువ ఇస్తున్నా యి. ఎంతో ప్రేమతో పెంచుకు న్న ఎడ్లను అమ్మాల్సి వస్తుం ది. గతంలో సరైన ధర రాలేదు. ఇప్పుడు మళ్లీ ప్రయత్ని స్తున్నా. - అర్జున్, హత్నూర కరువు ప్రభావం పాడి పశువులపైనా పడింది. కరువు పరిస్థితులు రోజురోజుకు రైతన్నలను కుంగదీస్తున్నాయి. రైతులు తమ ప్రాణపదంగా పెంచుకునే పశువులకు సరిపడా పశుగ్రాసం పెట్టలేకపోతున్నారు. వాటి గోసను చూడలేక అమ్ముకుంటున్నారు. ఎక్కడ చూసినా అంగట్లో విక్రయానికొచ్చిన పశువులే కన్పిస్తున్నాయి. చెరువులు, కుంటల్లో నీరు లేక... బోర్లు ఎండిపోవడంతో పంటలు పండలేదు. అదే సమయంలో పశువులకు గడ్డి సైతం దొరకని పరిస్థితి. ఒకప్పుడు బక్కచిక్కిన, వ్యవసాయ పనులకు పనికిరాని పశువులనే అంగట్లో అమ్మేవారు. తాజాగా పశువులకు మేత, నీటిని అందించే పరిస్థితి లేక రైతులు అమ్ముకుంటున్నారు. నర్సాపూర్ సంతకు జిల్లాలోని పలు మండలాల నుంచి రైతులు తూర్పు కోడెలు, పడమట కోడెలతోపాటు చిన్న వయస్సులో ఉన్న కోడెలను, ఇతర ఎడ్లను అమ్మేందుకు తీసుకొస్తున్నారు. గడ్డి కూడా భారమే... గడ్డి ధర విపరీతంగా పెరిగిందని, గడ్డి మోపు ధర రూ.వంద నుంచి రూ.125 వరకు పలుకుతుందని రైతులు అంటున్నారు. గడ్డి కొనలేని పరిస్థితులు ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు. వరి సాగు చేయనందున గడ్డి కరువైందని, అందుకే ధర విపరీతంగా పెరిగిందని చెబుతున్నారు. ధర పెరిగినా ప్రభుత్వం నుంచి పశుగ్రాసం సరఫరా చేసే విషయంలో తమకు ఎలాంటి మద్దతు లభించడం లేదని అంటున్నారు. తాము తినడానికి ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రాణపదంగా చూసుకునే పశువులకు గడ్డి, ఇతర గ్రాసం పెట్టలేకపోతున్నామని కన్నీరు కారుస్తున్నారు. వాటిని చంపుకోలేక అమ్ముకోవాల్సి వస్తుందని బాధపడుతున్నారు. కాగా పశువులను పోషించే స్థోమత లేక కొందరు రైతులు ఆరోగ్యంగా ఉన్న పశువులను సైతం అంగడికి తరలిస్తున్నారు. అంతటా కరవు ఉన్నందున వ్యవసాయం సాగక పశువుల వినియోగం తగ్గడం వల్ల వాటిని కొనేవారు కరువయ్యారు. -
పిడుగుపాటుకు మూగజీవాలు మృతి
తెలంగాణ వ్యాప్తంగా బుధవారం కురిసిన అకాల వర్షానికి మూగ జీవాలు మృతి చెందాయి. పిడుగుపాటుకు గురై మూడు మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. మంగళవారం రాత్రి పిడుగు పడి మండల పరిధిలోని రంగారెడ్డి జిల్లా అగర్మియాగూడకు చెందిన ఎండీ ఆయూబ్ పొలంలో కట్టేసిన రెండు ఒంగోలు జాతి గిత్తలు మృతి చెందాయి. వాటి విలువ రూ.1 లక్ష ఉంటుందని బాధితుడు వాపోయాడు. మరో ఘటనలో రాచులూరుకు చెందిన గుయ్యని మల్లయ్య వ్యవసాయ పొలంలోని షెడ్లో ఉన్న గేదె పిడుగుపాటుతో మృతి చెందింది. దాని విలువ రూ.50 వేలు ఉంటుందని బాధితుడు తెలిపాడు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు 15 మూగజీవాలు మృతి చెందాయి. నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూరులో పిడుగుపడి 3 పాడి గేదెలు మృతిచెందాయి. ఎల్లారెడ్డి మండలం అజాంబాద్ గ్రామంలో పిడుగుపాటుకు 12 మేకలు ప్రాణాలు విడిచాయి. మూగజీవాల మృతితో యజమానులు లబోదిబోమంటున్నారు. -
పశువుల దొంగల ముఠా ఆటకట్టు
♦ రూ. 12.50 లక్షలు రికవరీ ♦ ముఠా సభ్యుల్లో ఇద్దరి రిమాండ్ ♦ జిల్లా ఎస్పీ సుమతి కొండపాక : వ్యవసాయ బావుల వద్ద నుంచి పశువులను ఎత్తుకెళ్లే అంతర్ జిల్లా పశువుల దొంగల ముఠాను కుకునూర్పల్లి పోలీసులు పట్టుకున్నారు. కొండపాక మండలం వెలికట్ట శివారులో గల జనగామ క్రాస్రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ ముఠా గుట్టు రట్టయింది. సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్, తొగుట సీఐ ఏరుకొండ వెంకటయ్యతో కలిసి శనివారం జిల్లా ఎస్పీ సుమతి విలేకరులకు వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడకు చెందిన మహ్మద్ అయూబ్ (64), మహ్మద్ బాబా (40), హైదరాబాద్ బషీరాబాద్కు చెందిన మహ్మద్ గౌస్ ఖురేషీ (47), బహుదూర్ఫురాకు చెందిన మహ్మద్ ఇషాక్ ఖురేషీ (51) మరో ఐదుగురు ముఠాగా ఏర్పడ్డారు. వీరిలో ముఖ్యుడైన మహ్మద్ అయూబ్ 2001 నుంచి రోడ్డు పక్కన, వ్యవసాయ బావుల వద్ద ఉన్న పశువుల పాకలను టార్గెట్ చేస్తూ వంద పశువులను దొంగిలించాడు. అతనిపై 39 కేసులు నమోదు కాగా, జైలుకు వెళ్లి వచ్చాడు. అదే క్రమంలో ఈ ముఠా 68 లారీలను సైతం అపహరించింది. పశువులను అపహరించిన అనంతరం వాటిని తరలించేందుకు ఉనపయోగించే వాహనాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. అపహరించి తెచ్చిన పశువులను మహ్మద్గౌస్ ఖురేషీ పశుమాంస విక్రయ దుకాణాలకు సరఫరా చేసేవాడు. వచ్చే డబ్బులను ఈ ముఠా విలాసాలకు వెచ్చించేది. సొంత ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసింది. ఇలా మెదక్, నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఈ ముఠా పశువులను అపహరించింది. ముఠా వాడిన వాహనాలు రాజీవ్ రహదారిపై, జాతీయ రహదారిలపై ఏర్పాటు చేసి సీసీ కెమేరా పుటేజీల్లో స్పష్టంగా నమోదై ఉన్నాయి. ఈ క్రమంలో నిఘా ఉంచిన తొగుట సీఐ వెంకటయ్య, కుకునూర్పల్లి ఎస్ఐ రామకృష్ణారెడ్డి.. శనివారం ఉదయం వెలికట్ట శివారులో గల జనగామ క్రాస్రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. దీంతో ఈ ముఠాలోని మహ్మద్ అయూబ్, మహ్మద్ గౌస్ ఖురేషీ పట్టుబడ్డారు. వాహనాన్ని, రూ. 12.50 లక్షల నగదు, పశువులు అరవకుండా ఇచ్చే మత్తు ఇంజక్షన్లు, కత్తులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ముఠా నుంచి సుమారు 70 శాతం సొమ్మును రికవరీ చేశామని మిగతా 30 శాతాన్ని వారు కొన్న ఇళ్ల స్థలాల ద్వారా చేస్తామన్నారు. ముఠాను పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఎస్పీ సుమతి అభినందించారు. -
పశువులకూ పైసల నీళ్లు
♦ బోరు అద్దెకు తీసుకున్న రైతులు ♦ నిత్యం తాగు నీటిని అందిస్తున్న వైనం ♦ మల్కాపూర్ గిరిజనుల వినూత్న ఆలోచన ఈ వింతను ఏనాడైన చూశారా?, నీటిని కొనుగోలు చేసి పశువుల దాహం తీర్చే రోజులొస్తాయని ఎవరైనా ఊహించారా?, ఇక్కడ అలాంటి పరిస్థితే నెలకొంది. పశువుల దాహార్తి తీర్చేందుకు గిరిపుత్రులు నీళ్లను కొంటున్నారు. ఇంటింటికీ డబ్బులు పోగుచేసుకుని ఓ బోరు అద్దెకు తీసుకున్నారు. నిత్యం మూగ జీవాలకు నీటిని అందిస్తూ ఊపిరి పీల్చుకుంటున్నారు. మెదక్: మెదక్ మండలం రాయిన్పల్లి పంచాయతీ పరిధి మల్కాపూర్ గిరిజన తండాలో ఇరవైకిపైగా గిరిజన కుటుంబాలున్నాయి. వీరందరికీ వ్యవసాయమే ఆధారం. పాడి పశువులతో వీరికి యేళ్లతరబడి బంధం పెనవేసుకుంది. ఒక్కో ఇంటికి 20 నుంచి 50 వరకు పశువులు ఉండగా, గొర్రెలు, మేకలు సైతం భారీగానే ఉన్నాయి. రెండేళ్లుగా కరువు నెలకొనడంతో గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటాయి. బోరుబావులన్నీ మూలనపడ్డాయి. మనుషులతోపాటు మూగ జీవాలకు సైతం తాగునీటి కష్టం ఏర్పడింది. మనుషులకు దాహమేస్తే ఎలాగోలా తిప్పలు పడి ఏదో ఒకటి తాగుతాడు. మరీ మూగజీవాల పరిస్థితి?. దాహమేసినా... ఆకలేసినా.. అమాయక చూపులు... ఆవేదనతో చూడటం తప్ప మరేం చేయగలవు. దీంతో తండాలోని గిరిజనులంతా ఓ ఆలోచన చేశారు. ఇంటింటికి డబ్బులు వేసుకుని తండా సమీపంలోని ఓ రైతు బోరును రూ.10 వేలకు అద్దెకు తీసుకున్నారు. వర్షాలు పడేంత వరకు తమ పశువులకు తాగునీరివ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. జేసీబీ గుంతలో బోరునీటిని నిల్వ చేసుకుని మూగజీవాల దప్పిక తీరుస్తున్నారు. -
బక్కచిక్కిన పశువులకు మంచి రోజులు
♦ నల్లవాగులో పునరావాస కేంద్రం ఏర్పాటు ♦ దక్షిణ భారత దేశంలోనే తొలికేంద్రం ♦ మొదటిరోజు తరలివచ్చిన మూడువేల పశువులు ♦ తొలకరి మొదలయ్యే వరకు కొనసాగింపు ఎన్నాళ్లకెన్నాళ్లకు... మూగజీవాలకూ మంచి రోజులొచ్చాయి. ఓవైపు కరువు మరోవైపు మండుటెండలతో పశువులు అల్లాడుతున్నాయి. గ్రాసం, నీరు దొరక్క బక్కచిక్కిపోతున్నాయి. ఇప్పటికే వందలాది పశువులు మృత్యువాత పడ్డాయి. మరికొన్ని కబేళా బాటపడుతున్నాయి. పశువుల దీనస్థితిని గుర్తించి న ప్రభుత్వం పునరావాస కేంద్రాన్ని ప్రారంభించింది. దక్షిణ భారత దేశంలో ఎక్కడా లేని విధంగా కల్హేర్ మండలం నల్లవాగు ప్రాజెక్టు ఒడ్డున ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. పదివేల పశువులు పునరావాసం పొందేందుకు వీలుగా ఏర్పాట్లు చేయగా మొదటిరోజు మూడు వేలవరకు వచ్చాయి. ప్రాజెక్టు ఒడ్డున టెంట్లు వేసి నీడ, దాణాతోపాటు సకల వసతులు కల్పించారు. - కల్హేర్ కల్హేర్: నల్లవాగు ప్రాజెక్టులో నీళ్లు ఉండటం కేంద్రం ఏర్పాటుకు అనుకూలంగా మారింది. ఫలితంగా నియోజకవర్గంలోని నారాయణఖేడ్, పెద్దశంకరంపేట, మనూర్, కంగ్టీ, కల్హేర్ మండలాల్లోని పశువులకు ప్రయోజనం చేకూరింది. పశుసంవర్దక శాఖ అధికారులు ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించారు. తొలకరి వర్షాలు వచ్చాక అంటే దాదాపు జూన్ మొదటి వారం వరకు కేంద్రం కొనసాగనుంది. ఎండ తగలకుండా టెంట్లు, నీటితొట్లు, ఒక్కో పశువుకు రోజుకు 5 కిలోల ఎండుగడ్డి ఉచితంగా అందించనున్నారు. అంతేకాదు 50 శాతం సబ్సిడీపై దాణా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే 22 మె ట్రిక్ టన్నుల ఎండుగడ్డి, కావాల్సినంత దాణా సిద్ధంగా ఉంచారు. పాలిచ్చే గేదెలు, ఆవుల కోసం ప్రత్యేకంగా విజయ డెయిరీ తరపున పాలకేంద్రం నిర్వహణతో పాటు వాటి ఆరోగ్యం కాపాడేందుకు డాక్టర్లను నియమించారు. పాడి యజమానుల ఆరోగ్య సంరక్షణ కోసం వైద్య సిబ్బంది, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నారు. రాత్రిళ్లు ఇక్కడ ఉండేవా రు ఇబ్బంది పడకుండా కరెంటు అందించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే విద్యుత్తు స్తంభాలు ఏర్పాటుచేస్తున్నారు. అంచనాలకు మించి పశువులు కేంద్రానికి తరలివచ్చే పశువుల వివరాలను అధికారులు నమోదు చే స్తున్నారు. మొదటి రోజే అంచనాలకు మించి మూడు వేలకు పైగా పశువులు తరలివచ్చాయి. మొత్తం పదివేల మూగజీవాలు పునరావాసం పొందేందుకు సౌకర్యాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. కేంద్రం ఏర్పాటుపై ఖేడ్ నియోజకవర్గ రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పశువులకు మంచి జరుగుతుంది నల్లవాగులో పశువుల కోసం కేంద్రం పెట్టడంతో వాటికి మంచి జరుగతది. చెరువులు, కుంటల్ల నీళ్లు లేవు. రోజు గట్ల వైపు తిరిగి మేపినా గ్రాసం దొరుకతలేదు. అందుకే ఇక్కడికి బర్రెలు, ఆవుల్ని తోలుకొచ్చిన. - మల్లయ్య, సిర్గాపూర్ బతికించుకుంటాం కరువులో నాలా చాలా మంది రైతులు పశువులను కాపాడుకునేందు కు చాలా ఇబ్బందులు ప డుతున్నరు. నల్లవాగులోని కేంద్రంలో పశువులు తీసుకొచ్చిన. పశువులను బతికించకుంటాం. - రాజు, ముబారక్పూర్ సరిపడా స్టాక్ పునరావాస కేంద్రంలో పశువులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. సకల వసతులు కల్పించాం. ఎండుగడ్డి, దాణా సరఫరా చేస్తున్నాం. ఇప్పటికే సరిపడా స్టాక్ ఉంది. - లక్ష్మారెడ్డి, పశుసంవర్ధక శాఖ జేడీ -
ఖేడ్ లో పశు షెల్టర్
♦ నేడు ప్రారంభం ♦ రెండు నెలల పాటు 2వేల పశువులకు వసతి ♦ దక్షిణ భారతదేశంలోనే మొదటిది.. ♦ పశు సంవర్ధక శాఖ జేడీ లక్ష్మారెడ్డి జోగిపేట: వేసవి కాలంలో పశు సంపదను కాపాడుకునేందుకు పశు సంవరక్షణ కేంద్రం ప్రారంభిస్తున్నట్టు ఆ శాఖ జాయింట్ డెరైక్టర్ డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. నారాయణఖేడ్ నియోజకవర్గం నల్లవాగు ప్రాంతంలో శుక్రవారం ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు. దక్షిణ భారతదేశంలోనే ఇది మొదటిదన్నారు. సంరక్షణ కేంద్రంలో రెండు నెలల పాటు 2వేల పశువులకు సరిపడా వసతులను కల్పించనున్నామని తెలిపారు. పశువులకు గడ్డి, నీరు, రైతులకు వసతి, ఉచితంగా భోజనం, ఇతర సదుపాయాలతో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రారంభ కార్యక్రమానికి మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్లు హాజరవుతున్నారని చెప్పారు. -
అనంత ఔదార్యం పశువులపై మమకారం
♦ పొలాన్ని బీడుగా ఉంచి మూగజీవాలకు నీరు ♦ నాలుగు నెలలుగా మూడు పూటలా.. ♦ 200 జీవాలకు నీటి దానం ♦ తిమ్మాపురం రైతు అనంతిపై ప్రశంసల జల్లు అసలే కరువు... ఆపై వేసవి... ఎక్కడా చుక్క నీరు దొరకని పరిస్థితి. గొంతు తడుపుకునేందుకు రైతులు, ప్రజలే కాదు పశువులు సైతం తల్లడిల్లిపోతున్నాయి. చాలాచోట్ల ప్రాణాలు సైతం వదులుతున్నాయి. ఇలాంటి గడ్డుపరిస్థితుల్లో ఓ రైతన్న కరుణించాడు. పెద్ద మనసుతో తన పొలాన్ని బీడుగా పెట్టి దాదాపు రెండు వందల పశువులకు నిత్యం తాగునీటిని అందిస్తున్నాడు. నాలుగు నెలలుగా మూడుపూటలా నీరందిస్తోన్న రైతు అనంతిని స్థానికులంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. - రేగోడ్ ఆనందంగా ఉంది... నా భూమిని బీడుగా ఉంచి పశువులకు తాగునీటిని అందిస్తున్నా. వాటి దాహార్తిని తీర్చే అవకాశం రావడం నాకెంతో ఆనందంగా ఉంది. పశువులు బతికితేనే వ్యవసాయం నిలుస్తుంది. పాడిపరిశ్రమ కూడా అభివృద్ధి చెందుతుంది. - అనంతి, రైతు, తిమ్మాపురం రే గోడ్ మండలం కొండాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన మాల అనంతికి రెండు చోట్ల కలిపి మొత్తం మూడెకరాల భూమి ఉంది. ఎకరంన్నర ఉన్న భూమిలో పెద్దబండపై నాలుగు నెలల క్రితం బోరుబావి తవ్వించాడు. తన కష్టానికి ప్రతిఫలంగా వేసిన బోరులో నీళ్లు పుష్కలంగా వచ్చాయి. పంట వేద్దామనుకునే లోపే గ్రామంలో నీటి సమస్య మొదలైంది. ప్రజలతోపాటు పశువులు పడుతున్న ఇబ్బందులను తలచుకుంటేనే భయమేస్తోంది. స్థానికులంతా కలిసి రైతు అనంతిని కలిశారు. నీటి గోసతో పశువులు తల్లడిల్లుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. ఆయన స్వయాన రైతు కావడం.. స్థానికుల విన్నపంతోపాటు పశువుల బాధను అర్థం చేసుకున్న అనంతి వాటికి తాగు నీటిని అందించేందుకు ముందుకు వచ్చాడు. తన పొలాన్ని బీడుగా ఉంచి బోరునుంచి నీటిని వదులుతున్నాడు. రోజుకు మూడుసార్లు సుమారు రెండు వందల పశువులకు నాలుగు నెలలుగా దాహార్తిని తీరుస్తున్నాడు. ప్రశంసలు... పశువులకు నీటిని అందిస్తోన్న రైతు అనంతిని స్థానికులు, రైతులు అభినందిస్తున్నారు. ఆయన తన పొలంలో సాగు చేపడితే కనీసం రూ.25 వేల లాభం వచ్చేది. కానీ డబ్బులను ఆశించకుండా పశుసంతతిని కాపాడాలనే పెద్దమనసుతో ఆయన ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నారు. -
ఇదో గోకులం
మెదక్లో గిరిజనుల మూగ ప్రేమ ♦ కరువుతో మొదళ్లకుంట తండావాసుల పోరాటం ♦ మేత కోసం మైళ్లదూరం.. పాపన్నపేట: కరువు కాటుకు పచ్చని పల్లెలు, పాడి పశువులు విలవిల్లాడుతున్నాయి. భగభగ మండుతున్న ప్రచండ భానుడి ప్రభావంతో జలవనరులు ఎడారులయ్యాయి. చెరువులు, కుంటలు ఎండిపోయి నైబారాయి. గుక్కెడు నీటికోసం మనుషులే కాదు.. మూగజీవాలు తహతహలాడుతున్నాయి. అయినా ఆ గిరిపుత్రులు మాత్రం పశు సంపదను బతికించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. వాటి మేత కోసం కాళ్లు బొబ్బలెక్కుతున్నా లెక్క చేయకుండా మండుటెండల్లో మైళ్ల దూరం అడుగులు వేస్తున్నారు. కరువు కోరలకు తమ కాడెడ్లను బలికాకుండా చూసుకుంటామని ధీమాతో చెబుతున్నారు. తమ సంకల్పానికి సర్కార్ చేయూతనివ్వాలని వేడుకుంటున్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో మారుమూలనున్న మొదళ్లకుంట ఓ గిరిజన తండా. అక్కడ 50 కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నా.. రెండు వేల పశుసంపద వారి సొంతం. మండలంలో మొత్తం ఆరు వేల పశువులుంటే ఈ ఒక్క తండాలోనే 2 వేల పశువులు ఉండటం వారి మూగప్రేమకు నిదర్శనం. పశు సంపదతో వచ్చే ఎరువు వారి ప్రధాన ఆదాయం. సేంద్రియ ఎరువులు వాడాలనుకునే మండలంలోని రైతులంతా ఈ గిరిజన తండాకే వస్తుంటారు. ఉద యం 10గంటల సమయంలో మేత కోసం పశువులు వెళ్తుంటే.. శ్వేత సైన్యమే కదనభూమికి కదులుతున్నట్లు కనిపిస్తుంది. తాగునీటికి తండ్లాట 50 గుడిసెల ఆ తండాలో నాలుగు బోర్లు ఉన్నప్పటికీ ఒక్కటి కూడా పనిచేయడం లేదు. ఇటీవల కొత్తగా ఓ బోరు వేయగా అందులో నీళ్లు పడ్డప్పటికీ మోటారు బిగించకపోవడంతో అది అలంకారప్రాయంగానే మిగిలింది. ప్రస్తుతం సమీపంలోని నర్సింగరావుపల్లి తండాలో ఓ సింగిల్ఫేస్ బోరు నుండి వచ్చే నీటితో ఓ మడుగును ఏర్పాటు చేశారు. ఆ రెండు తండాల పశువుల దాహార్తి తీర్చేందుకు ఈ మడుగును ఉపయోగించుకుంటున్నారు. ఇక మేత కోసం ఉదయం 10గంటలకు ఇంటి నుంచి బయల్దేరే వీరు మండుటెండలో మంజీరా చుట్టూ పశువులను తిప్పుతారు. పశువులను కాపాడుకుంటాం ఒక్క గడ్డిమోపు కొనాలంటే రూ.100లు కావాలి. కరువు కాలంలో పశువులకు కొని పెట్టాలంటే మా వల్ల కాదు. పశువులు ఇంటి ముందుంటే లక్ష్మికళ కనిపిస్తుంది. అందుకే పశువులను మాత్రం అమ్మకుండా కాపాడుకుంటాం. - తులసీరాం -
ఎడ్ల పోటీలను తిలకించిన సుప్రీంకోర్టు జడ్జి
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలను గురువారం ఉదయం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ తిలకించారు. ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో మూడు రోజులుగా జరుగుతున్నాయి. గురువారం నాలుగు పళ్ల విభాగంలో జరిగిన పోటీలకు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ హాజరయ్యారు. ఈ పోటీలు వచ్చే నెల 4వ తేదీ వరకు జరుగనున్నాయి. -
గడ్డుకాలం
♦ అలమటిస్తున్న మూగజీవాలు ♦ గ్రాసమూ లేదు.. నీళ్లూ లేవు ♦ కబేళాలకు తరలుతున్న పశుసంపద ♦ కొన్నిచోట్ల అయినకాడికి విక్రయాలు ♦ కరువు కాలంలో భారంగా మారిన పశుపోషణ ♦ చేతికొచ్చిన పంటే గ్రాసమాయె.. కొన్యాలకి చెందిన యాదాగౌడ్ మాదూర గ్రామంలో ఎకరం ఎనిమిది కుంటల పొలంలో రబీ కింద వరి సాగు చేశాడు. పొట్టపోసుకునే దశలో నీరందక పంటంతా ఎండిపోయింది. దీంతో పొలంలో పశువులను వదిలేశాడు. స్వేదం చిందించి చేసిన సేద్యం తనకు కలిసి రాకున్నా.. కనీసం పశువుల ఆకలినైనా తీరుస్తుందని ఆ రైతు అంటున్నాడు. - హత్నూర నెమరు వేసేందుకు గడ్డి పరకలు కరువు.. గొంతు తడిసే దారే లేదు. కనీసం నిలువ నీడా లేకుండాపోయింది. దుర్భిక్షం రైతులనే కాదు.. వ్యవసాయంలో రైతన్నకు వెన్నుదన్నుగా ఉండే పశుసంపదనూ నకనకలాడిస్తోంది. నిన్నటి వరకు వెన్నంటి ఉన్న మూగజీవాల్ని.. పోషించే దారి లేక రైతులు వదిలించుకుంటున్నారు. గడ్డి మోపు ధర రూ.150 నుంచి రూ.300 వరకు పలుకుతుండటంతో కరువు కాలంలో అంత పెట్టి కొనే స్థోమత లేక వారాంతపు సంతల్లో అయిన కాడికి అమ్మేసుకుంటున్నారు. కొందరు కబేళాలకు తరలిస్తున్నారు. - జోగిపేట మెదక్ జిల్లాలో మూగజీవాలు జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్నాయి. పశువులకు తినడానికి గడ్డి లభించక, తాగేందుకు నీరు దొరకక, కనీసం నిలబడేందుకు చెట్ల నీడ లేక అల్లాడిపోతున్నాయి. వర్షాలు సరిగ్గా కురియకపోవడంతో రైతులు భూములన్నింటినీ సాగు చేయలేక వృథాగా వదిలేశారు. పొలాల్లోని చెట్లను నరికి వేస్తూ కలపను విక్రయించుకుంటున్నారు. పశుగ్రాసం దొరకకపోవడంతో గ్రామాల్లో ఉన్న పశువులను అమ్ముకుంటున్నారు. మరికొన్ని పశువులను ఎంత దొరికితే అంతకే లాభం ఆశించకుండా విక్రయిస్తున్నారు. నారాయణఖేడ్ ప్రాంతం నుంచి ఎక్కువగా జహీరాబాద్ ప్రాంతంలో గల అల్లానా ఫ్యాక్టరీకి తరలిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలోనే పశుసంపద అత్యధికంగా ఉండే మెదక్ జిల్లా.. ప్రస్తుతం గడ్డు పరిస్థితి నెలకొంది. కరవు నేపథ్యంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎండుగడ్డి కూడా లభించ క వ్యవసాయదారులు పక్క జిల్లాలకు పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలో ఎద్దులు, ఆవులు 4.42 లక్షలు, గేదెలు 4.37 లక్షలు, గొర్రెలు 10.83 లక్షలు, మేకలు 5.72 లక్షలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఐదేళ్ల కొకసారి జరిగే పశుగణన ప్రకారం నిర్ధారించిన లెక్కలివి. ఇంత పెద్దసంఖ్యలో పశుసంపద గల జిల్లాలో వాటికి మేత సమస్యగా మారింది. మేకలు, గొర్రెలు తినడానికి పచ్చిగరక, తాగడానికి నీళ్లు లభించక వీటి పెంపకందారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పశుగ్రాసం కొరత వాస్తవమే జిల్లాలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల గత రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో తీవ్ర పశుగ్రాసం కొరత ఏర్పడిన విషయం వాస్తవమేనని పశుసంవర్ధక శాఖ జేడీ లక్ష్మారెడ్డి చెప్పారు. ఆయనేమన్నారంటే.. ‘జిల్లాలో 50 వేల మెట్రిక్ టన్నుల గ్రా సం కొరత ఉంది. దాన్ని అధిగమించేందుకు పశు సంవర్ధక శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. జిల్లా వ్యాప్తంగా 160 మెట్రిక్ టన్నుల పశుగ్రాసం విత్తనాలకు రూ.40 లక్షలు వెచ్చించి 5 వేల ఎకరాలలో పండించాం. మరో 10 వేల ఎకరాలలో విత్తనాలు పండిస్తే కొంత వరకు కొరత తీరే అవకాశం ఉంది. జిల్లాలోని అన్ని మండలాల్లో పశుగ్రాసం విత్తనాలను 75 శాతం సబ్సిడీతో రైతులకు అందుబాటులో ఉంచాం. జిల్లాలో 8.50 లక్షల పశుసంపద ఉంది. కేవలం వ్యవసాయానికి ఉపయోగానికి రాని పశువులను మాత్రమే విక్రయించాలని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. పశువులు కబేళాలకు తరలించొద్దు. జిల్లాలోని అల్లానా, ఆల్కబీర్ ఫ్యాక్టరీలకు పశువులను తరలిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. సాధ్యమైనంత వరకు వాటిని నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రైతులు తాము పండిస్తున్న పంటలతో పాటే పశుగ్రాసాన్ని కూడా పండించుకోవాలి. పశువులకు తాగునీటి అవసరాల కోసం నీటి తొట్టెలను ఈజీఎస్ ద్వారా నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’. ఊహకందని వేదన.. నాకు ఊహ వచ్చిన నాటి నుంచి ఇంత దుర్భిక్షాన్ని చూడలేదు. గతంలో పశువులకు ఎంతంటే అంత పశుగ్రాసం లభించేది. రెండేళ్ల నుంచి పరకే కరువైంది. గడ్డి మోపు రూ.250 పెట్టి కొన్నా.. పశుగ్రాసం కోసం ఎన్నడూ ఇన్ని తిప్పలు పడింది లేదు. పశువులకు మేతే కాదు.. నీళ్లూ అందించలేకపోతున్నాం. చెరువులు, కుంటలు ఎండిపోయాయి. కుళాయిల ద్వారా వచ్చే నీళ్లు మనుషుల అవసరాలకే సరిపోవట్లేదు. పశుగ్రాస విత్తనాలు సబ్సిడీపై ఇస్తున్నట్టు అధికారులు చెబుతున్నా అవి ఎవరికి ఇస్తున్నారో మాకైతే తెలియదు. - కిష్టయ్య, రైతు, అన్నాసాగర్ పశువులను అమ్ముకోవద్దు పంటలు పండకపోవడం, విస్తీర్ణం తగ్గిపోవడం, ధరలు పెరగడం, కూలీల లభ్యత లేకపోవడంతో పశువులను రైతులు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు అమ్మితే తిరిగి కొనాలంటే ధరలు విపరీతంగా పెరడం వల్ల కొనలేకపోతామన్న విషయాన్ని గమనించాలి. మండలాల వారిగా పశుసంవర్ధక శాఖ డాక్టర్లను పర్యటింపజేసి రైతులను చైతన్య పరిచే కార్యక్రమాలు చేపడతాం. పశువుల సంత, దళారుల అమ్మకాలపై నిఘా పెట్టి అక్రమంగా పశువుల్ని తరలించడం, అమ్ముకోవడం లాంటి వాటిని నియంత్రణ చేస్తాం. జిల్లాలో పశుసంపదను కాపాడేందుకు చర్యలు తీసుకుంటాం. - డాక్టర్ లక్ష్మారెడ్డి, జేడీ, పశుసంవర్ధకశాఖ గడ్డి కొరత.. తీరని వెత.. జిల్లాలో సగటున ఒక్కో రైతు నాలుగు నుంచి ఆరేడు పశువుల వరకు పోషిస్తున్నారు. కరువు కారణంగా రైతులు తమకున్న పశువుల్లో కొన్నింటిని అమ్మేసుకుంటున్నారు. నారాయణఖేడ్, జోగిపేట, మెదక్, రామాయంపేట, సిద్దిపేట ప్రాంతాల్లో రైతులు పశువులకు అవసరమన గ్రాసం కొరతతో పశువులను వదిలించుకుంటున్నారు. పశువులను అమ్ముకునేందుకు సిద్ధంగా ఉన్న వారి వద్దకు దళారులు చేరుకొని క్రయవిక్రయాలు జరుపుతున్నారు. సంతల్లో ఎక్కువగా ఎద్దులు, గేదెల విక్రయాలకు పశుగ్రాసం కొరతే కారణమని రైతులు అంటున్నారు. ఇతర ప్రాంతాలకు తరలింపు.. పశువులు లేని రైతులు తాము పండించిన వరి ధాన్యం పంటలో వచ్చే గడ్డిని డబ్బులు వస్తున్నాయన్న ఆశతో ఇతర ప్రాంతాలకు రూ.150 చొప్పున గడ్డిమోపును అమ్ముకుంటున్నారు. ఎక్కువగా రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలకు గడ్డి తరలిపోవడం వల్ల కూడా స్థానికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. గత ఖరీఫ్, రబీ సీజన్లోనే సుమారుగా 25 శాతం ఎద్దులు, గేదెలు తగ్గిపోయినట్లుగా సమాచారం. గడ్డిలేకపోవడంతో చేసేది లేక రైతులు పశువులను వదిలించుకోవాలన్న ఆలోచనకు వచ్చారు. జిల్లాలో ప్రధాన పట్టణాల్లో జరిగే సంతల రోజున ఇతర జిల్లాలకు చెందిన వారు వచ్చి స్థానికంగా ఉన్న రైతులు విక్రయించే పశువులను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా పశువులను జహీరాబాద్ ప్రాంతంలోని అల్లానా ఫ్యాక్టరీకి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. -
పశువులకూ హాస్టల్
రాష్ట్రంలోనే తొలిసారిగా కొయ్యూరు మండలంలో ఏర్పాటుకు ప్రతిపాదన రూ.2 కోట్లు ఖర్చవుతుందని అంచనా ఎకరా స్థలంలో షెడ్ల నిర్మాణం.. 200 గేదెలకు అవకాశం 13 ఎకరాల్లో పశుగ్రాసం పెంపకం రాష్ట్రంలోనే మొదటిసారిగా పశువుల హాస్టల్ను కొయ్యూరు మండలంలో ఏర్పాటుచేసేందుకు మంగళవారం ప్రతిపాదనలు తయారు చేశారు. దీనికి రూ.రెండు కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. పాల ఉత్పత్తిని పెంచి గిరిజన రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నడింపాలెం పంచాయతీ నల్లగొండలో దీన్ని ఎకరా స్థలంలో ఏర్పాటు చేస్తారు. 200 గేదెలను ఇక్కడ ఉంచుతారు. 13 ఎకరాల్లో పశుగ్రాసం పెంచేందుకు రైతులు అంగీకరించారు. ఐటీడీఏ పీవో నుంచి ఈ ప్రతిపాదన కలెక్టర్కు వెళ్తే అక్కడ నుంచి నేరుగా ప్రభుత్వానికి చేరుతుంది. కొయ్యూరు: పశువుల పెంపకంలో సరికొత్త పద్ధతిని ప్రవేశపెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా పశు సంవర్థక శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొయ్యూరు వెటనరీ వైద్యుడు కె.రాజేశ్కుమార్ మంగళవారం పశువుల హాస్టల్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనలను పాడేరు ఏడీ కిషోర్కు అందజేశారు. ఆయన వాటిని ఐటీడీఏ పీవో హరినారాయణన్కు అందజేస్తారు. దానిని పరిశీలించిన అనంతరం పీవో కలెక్టర్కు ప్రతిపాదన పంపిస్తారు. అది ప్రభుత్వానికి చేరిన తరువాత నిధులు విడుదలవుతాయి. గత నెలలో పశుసంవర్థక శాఖ జేడీ నల్లగొండను సందర్శించారు. అక్కడ రైతులతో మాట్లాడి ఇక్కడే పశువుల హాస్టల్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీనిలో భాగంగా ప్రతిపాదన తయారుచేశారు. కంపరేగుల, నల్లగొండ, పెదమాకవరం, వెలగలపాలెం పంచాయతీ శీకాయపాలేనికి చెందిన 70 మంది రైతుల గేదెలను ఇక్కడ ఉంచుతారు. ఉపాధి హామీ నుంచి పశువులకు గ్రాసం నిమిత్తం భూమిని సేకరిస్తారు. దీనికి అవసరమైన సాగునీటిని ఆర్డబ్ల్యుఎస్ అధికారులు కల్పిస్తారు. అక్కడ రైతులు పశుగ్రాసానికి 13 ఎకరాలు ఇచ్చేందుకు అంగీకరించారు. పాల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని భూమి ఇచ్చిన రైతులకు చెల్లిస్తారు. ఇందుకు రివాల్వింగ్ నిధిని ఏర్పాటు చేస్తారు. ప్రతి లీటరు పాలకు వచ్చే ఆదాయంలో కొంత ఈ నిధికి జమచేసి పశుగ్రాసానికు చెల్లిస్తారు. వెయ్యి లీటర్ల వరకు పాల సేకరణ 200 గేదెలను హాస్టల్లో ఉంచితే సుమారు వెయ్యి లీటర్ల వరకు పాల దిగుబడి వస్తుంది. దీని ద్వారా రైతులు నెలకు రెండు గేదెలు ఉంటే రూ.16 వేల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఎక్కువమంది రైతులు పాలను విక్రయిండం ద్వారా నెలకు ఒక గేదె నుంచి రూ. 8 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. పశువుల హాస్టల్ ఏర్పాటు తరువాత ఎవరు ఎక్కువ చెల్లిస్తే వారికే పాలు విక్రయించాలని రైతులు నిర్ణయించారు. పశువులను శుభ్రమైన వాతావరణంలో ఉంచి వాటికి నీరు, గ్రాసం కొరత లేకుండా చూడటం హాస్టల్ ఏర్పాటు ద్వారా సాధ్యపడుతుందని అధికారులు భావిస్తున్నారు. పాల ఉత్పత్తితో పాటు గిరిజనుల ఆదాయాన్ని పెంచడం దీని ప్రధాన ఉద్దేశం. దీనిపై కొయ్యూరు పశువైద్యుడు కె.రాజేశ్కుమార్ను సంప్రదించగా హాస్టల్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు పంపామని చెప్పారు. దీనికి రూ.రెండు కోట్ల వరకు ఖర్చవుతుందన్నారు. రైతుల ఆధార్ కార్డులతో పాటు పూర్తి వివరాలను అందజేశామని తెలిపారు. -
ఓ మనిషీ.. తిరిగిచూడు
ఉరుకులు.. పరుగుల నగర జీవనంలో.. తోటి మనిషికి ఏ ఆపదొచ్చినా.. పట్టించుకునే ఓపిక.. సాయపడాలనే తాపత్రయం అరుదు. సృష్టిలోనే జ్ఞాన సంపన్నుడైన మనిషే.. తోటివారు చచ్చినా చలించని కాలమిది. మానవత్వం మరుగైపోతున్న ప్రపంచమిది. అలాంటిది వాహనం ఢీకొన్న లేగదూడ కోసం ఏ జ్ఞానంలేని పశువులు మూడు గంటల పాటు రోడ్డుపై మూగగా రోదించాయి. దూడ దగ్గరికొచ్చిన వారిపై తిరగబడి రక్షణగా నిలిచాయి. వాహనాలనూ అడ్డుకున్నాయి. ముఖ్యంగా తల్లి పశువు ఆవేదన చూపరులను కలచివేసింది. ఈ ఘటన తిరుపతిలోని టౌన్క్లబ్-అలిపిరి మార్గంలో మంగళవారం చోటు చేసుకుంది. ఫొటోలు: కె.మాధవరెడ్డి, తిరుపతి -
'ఒంగోలు జాతి'పై ఒప్పందాలు వద్దు
* కేంద్ర వ్యవసాయ మంత్రికి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వినతి * బ్రెజిల్ వ్యవసాయ మంత్రితోనూ భేటీ * సాంకేతిక సహకారంపై విన్నపం సాక్షి, న్యూఢిల్లీ: ఒంగోలు జాతి పశువుల కృత్రిమ పిండాలను బ్రెజిల్కు ఇచ్చేందుకు ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోవద్దని వైఎస్సార్సీపీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్సింగ్కు విజ్ఞప్తి చేశారు. అలాగే బ్రెజిల్ వ్యవసాయ మంత్రిని కలసి పశుగణాభివృద్ధి, పాల ఉత్పత్తి పెంపుపై తగిన సాంకేతిక సహకారం అందించాలని కోరారు. ఆయన శనివారం ఉదయం ఢిల్లీలో వారితో సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడారు. 'ఈరోజు కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్సింగ్ను కలిసి మాట్లాడాను. దేశానికి తలమాణికమైన ఒంగోలు జాతి పశువులకు సంబంధించి మనకు గల హక్కులను కాపాడాలని కోరాం. అనధికారికంగానే బ్రెజిల్ ఒంగోలు జాతిని అభివృద్ధి పరుచుకుంది. అధికారికంగా ఇస్తే ఇక మొత్తం హక్కులు వాళ్లకే దక్కే ప్రమాదం ఉందని చెప్పాం. ఆయన దానికి సానుకూలంగా స్పందించారు. భారత దేశ ఆస్తి అయిన ఒంగోలు పశువులపై ఎలాంటి హక్కును బ్రెజిల్కు ఇచ్చే ఉద్దేశం లేదని స్పష్టంచేశారు' అని తెలిపారు. కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్సింగ్తో పొగాకు రైతుల విషయమై కూడా మాట్లాడినట్లు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ప్రకాశం జిల్లాలో 34 మంది రైతులు చనిపోగా అందులో 17 నుంచి 18 మంది పొగాకు రైతులేనని తెలిపారు. -
కబేళాకు తరలిస్తున్న పశువుల పట్టివేత
ఘట్కేసర్: ఇతర జిల్లాల నుంచి అక్రమంగా హైదరాబాద్లోని కబేళాలకు తరలిస్తున్న 40 పశువులను స్థానికులు అడ్డుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్రోడ్డు వద్ద శుక్రవారం సాయత్రం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు పశువుల వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేసిన 40 లేగ దూడలను ఓ లారీలో అక్రమంగా తరలిస్తుండగా.. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పిడుగు పాటుకు ముగ్గురి మృతి
ఆంధ్ర ప్రదేశ్ లో గురువారం కురిసిన భారీ వర్షంలో పిడుగు పాటుకు గురై ముగ్గురు మరణించారు. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్ణం జిల్లాసీలేరు ప్రాంతంలోని బచ్చుపల్లి గ్రామానికి చెందిన కన్నయ్య(45) పొలంలో పనిచేసుకుంటుండగా.. అతనిపై పిడుగు పడింది. కన్నయ్య అక్కడి క్కడే మరణించాడు. ఇంకో ఘటనలో శ్రీకాకుళం జిల్లా బామిని సమీపంలో ఆరికి ఇలియాస్ (16) అనే ఇంటర్ విద్యార్థి మరణించాడు. కాలేజీ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో భారీ వర్షం కురవటంతో అతను చెట్టు కిందకు పరిగెత్తాడు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడి.. ఇలియాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఘటనలో గుంటూరు జిల్లా అమరావతిలో పల్లెకొండ అనే పశువుల కాపరి మరణించాడు. కృష్ణానది ఒడ్డున పశువులు కాస్తుండగా.. ఆయనపై పిడుగు పడింది. ఇక గుంటూరు జిల్లా రామాంజనేయ పురంలో పిడుగుపాటుకు 40 మేకలు మృతి చెందాయి. ఇదే ఘటనలో అక్కయ్య(38) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పిడుగు, వ్యక్తి మృతి, విశాఖపట్టణం, గుంటూరు, అమరావతి, పశువులు, సీలేరు, భారీ వర్షం, విద్యార్ధి, శ్రీకాకుళంThunder, person died, Visakhapatnam , sileru, heavy rain , Guntur , Amaravati , cattle, Student , Srikakulam -
మూగ జీవాలకూ ‘తీపి’ మాత్రలు!
మామిడి, మిరప తదితర పంటల్లో విశిష్టమైన వంగడాలకు రూపకల్పన చేసి ప్రఖ్యాతి పొందిన రైతు శాస్త్రవేత్త కొంగర రమేష్. స్వీయ అధ్యయనం, అనుభవ జ్ఞానం, సృజనాత్మకతలను మేళవించి అద్భుతాలు సాధిస్తూ శాస్త్రవేత్తలను సైతం అబ్బుర పరుస్తున్నారు. అంతేకాదు.. మనుషులతోపాటు.. పశువులకూ స్వల్ప ఖర్చుతోనే హోమియో వైద్య సేవలు అందిస్తున్నారు. తన సేవలను మరింత విస్తృతం చేయడం కోసం హోమియో వెటర్నరీ కాలేజీని ఏర్పాటు చేయాలని సంకల్పిస్తున్నారు. ఈ ఆరు పదుల రైతు శాస్త్రవేత్త సేవల వివరాలు ‘సాగుబడి’ పాఠకుల కోసం.. గుంటూరు జిల్లా కాకుమానుకు చెందిన కొంగర రమేష్ది వ్యవసాయ కుటుంబం. తండ్రి సర్పంచ్గా ఎన్నికవడంతో 14 ఏళ్ల వయసులోనే (8వ తరగతి) చదువుకు స్వస్తి చెప్పి రమేష్ సేద్యం బాటపట్టారు. తమ పొలాలకు సమీపంలోనే ఉన్న బాపట్ల వ్యవసాయ కళాశాల అధ్యాపకులతో పరిచయాలు పెంచుకొని వ్యవసాయ పరిజ్ఞానం సంపాదించారు. కాలక్రమంలో ఆయన విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లువాడ సమీపంలోని నవనీత ఎవర్గ్రీన్స్లో స్థిరపడి.. వ్యవసాయంపై, హోమియోపై అనేక దశాబ్దాలుగా విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆయన ఆరోగ్యం ఉప్పల సత్యనారాయణ (గుంటూరు) అనే హోమియో వైద్యుడు ఇచ్చిన మందుతో కుదుటపడింది. దీంతో హోమియోపై ఆసక్తితో ఆ వైద్యంతో విస్తృతంగా అధ్యయనం చేశారు. సత్యనారాయణ ప్రోత్సాహంతో హోమియోపై పట్టు సాధించి మనుషులకు, పశువులకు మందులివ్వడం మొదలెట్టారు. ఒక శాతం ఖర్చుతోనే హోమియో వైద్యం మనుషులకు హోమియో మందుతో రోగం నయమవుతుంటే పశువులకెందుకు నయం కాదు? అన్న ఆలోచన కలిగింది రమేష్కి. దాదాపు 20 ఏళ్ల క్రితమే తన మదిలో మెదిలిన ఈ ఆలోచనకు పదును పెట్టారు. అప్పటికే హోమియో వైద్యంపై పట్టు సాధించిన ఆయన స్వయంగా హోమియో మందును తయారు చేసి వ్యాధిపీడిత పశువులకు ఇచ్చారు. అది సత్ఫలితాలివ్వడంతో ఉచిత వైద్యం కొనసాగిస్తున్నారు. పొదుగు వాపు, పారుడు, గాలికుంటు వ్యాధి, జ్వరం నివారణకు, పశువులు తేలికగా ఈనేందుకు, గాయాలకు కూడా మందిస్తారాయన.పశువులకు ప్రాణాంతకమైన బ్రూసిలోసిస్ వ్యాధికి తొలుత ఇంగ్లండ్ నుంచి మందు తెప్పించారు. తర్వాత తానే ఆ మందును తయారు చేసి ఈ వ్యాధిని నయం చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో ముంబైలో జరిగిన అంతర్జాతీయ హోమియో సదస్సులో బ్రూసిలోసిస్ వ్యాధి నివారణపై తన వైద్యం గురించి రమేష్ వివరించారు. హోమియో వైద్యం చేయించడానికి పలువురు రైతులు తమ పశువులను రమేష్ వద్దకు తీసుకొస్తుంటారు. ఇప్పటిదాకా ఐదు వేల పశువులకు ఆయన వైద్యం చేశారు. అల్లోపతితో పోల్చుకుంటే ఒక శాతం ఖర్చుతోనే హోమియో వైద్యాన్ని అందించవచ్చంటున్నారు రమేష్. హోమియో వెటర్నరీ కాలేజీ ఏర్పాటు యోచన.. హోమియో పశువైద్యంపై పట్టు సాధించిన రమేష్ హోమియో వెటర్నరీ కాలేజీని ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నారు. ఇందుకు తోడ్పాటునందించడానికి ‘ఆయుష్’ శాఖ సుముఖత వ్యక్తం చేసిందన్నారు. నవనీత ఎవర్గ్రీన్స్ ఆవరణలో ఈ కాలేజీ ఏర్పాటుకు నవనీత చైర్మన్, ఎండీ అనుమతించారన్నారు. బీహెచ్ఎంఎస్ పూర్తిచేసిన రమేష్ కుమార్తె ప్రతిభ హోమియో వెటర్నరీ (ఇంగ్లండ్) కరస్పాండెన్స్ కోర్సు చదవాలనుకుంటున్నారు. హోమియో సేద్యంపైనా దృష్టి రసాయన ఎరువుల అవసరం లేకుండా బ్రెజిల్ తదితర దేశాల్లో మాదిరిగా హోమియో సేద్యంపైన కూడా ఆయన దృష్టిసారించారు. పురుగులను పారదోలే హోమియో మందు తయారీపై పరిశోధనలు సాగిస్తున్నారు. హోమియో సేద్యం వల్ల అధిక దిగుబడులతో పాటు ఆరోగ్యకరమైన పంటలను ఉత్పత్తి చేయవచ్చంటారు రమేష్. హోమియో సేద్యంపై ప్రయోగాలు మరో ఏడాదిలో తుది ఫలితాలనిస్తాయన్నారు. అబ్బుర పరచే వంగడాలెన్నో.. మిరప, మామిడిలో అనేక విశిష్టమైన వంగడాలను రూపొందించిన రైతు శాస్త్రవేత్తగా రమేష్కు మంచి గుర్తింపుంది. ఏడాదంతా కాసే రెడ్టాప్-365 (పాండవ్), ‘అర్జున్’ మిరప వంగడాలను రూపొందించారు. మామిడి సీజన్కన్నా నెల ముందే కాపునిచ్చే ‘స్వాగతం’, అతి తియ్యని ‘అమృతం’ వంగడాలు ప్రసిద్ధి పొందాయి. ప్రీజర్లో ఉంచిన ఈ అమృతం రకం మామిడిపండునే ఐస్ ఫ్రూట్ మ్యాంగోగా మార్కెట్లోకి తెచ్చారు. అల్ఫెన్సాను రసాలతో సంకరం చేసి మరో వంగడాన్ని సృష్టించే పనిలో ఉన్నారు. మొక్కల్లో పోషకాల లోపాన్ని గుర్తించేందుకు ఉపయోగపడే టిష్యూ కిట్ను ఆయన రూపొందించారు. కేవలం రూ. 10 ఖర్చుతో పావుగంటలోనే లోపాన్ని తెలుసుకోవచ్చు. ఆయన సృజనాత్మక కృషి మరిన్ని కొత్తపుంతలు తొక్కి రైతాంగానికి మరింతగా ఉపయోగపడాలని ఆశిద్దాం. - బొల్లం కోటేశ్వరరావు, సాక్షి, విశాఖపట్నం ఫోటోలు: మహంతి శివాజీ, ఆనందపురం హోమియో పశువైద్యం నేర్పిస్తా.. నేను కన్న కలలు నా పిల్లలు, నాతో కలిసి చేస్తున్న వాలంటీర్ల ద్వారా నిజం కావాలని ఆకాంక్షిస్తున్నాను. పెద్దమ్మాయి హరిత ఎమ్మెస్సీ హార్టికల్చర్ చేసింది. ఉద్యోగం వచ్చినా చేరకుండా నాతో కలిసి పరిశోధనలు చేస్తోంది. చిన్నమ్మాయి ప్రతిభ బీహెచ్ఎంఎస్ చదివింది. వారంలో రెండ్రోజులు నాతోపాటే హోమియో వైద్య సేవలందిస్తోంది. నా స్నేహితుని కొడుకు ప్రకాష్ బయోటెక్నాలజీ పూర్తి చేసి నాకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. వీరంతా నా కలల సాకారానికి కృషి చేస్తున్నారు. ఈ పరిశోధనలు నాకు ఎంతో సంతృప్తినిస్తున్నాయి. నా వద్ద శిక్షణ పొందిన సుమారు 40 మంది హోమియో పశువైద్యం చేస్తున్నారు. జీవితాంతం ప్రయోగాలు కొనసాగిస్తా. ఆసక్తి ఉన్న వారికి నేర్పిస్తా. - కొంగర రమేష్ (98492 78889), తర్లువాడ, ఆనందపురం మండలం, విశాఖ జిల్లా -
కబేళాలకు పశువులు
ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు అనంతయ్య. రంగారెడ్డి జిల్లా ధారూరు మండలం అల్లిపూర్. అప్పులు చేసి ఈ ఏడాది ఐదెకరాల్లో పత్తి, మొక్కజొన్న వేశాడు. వర్షాల్లేక పంట ఎండిపోయింది. దీంతో పశువులను అమ్ముకునేందుకు సిద్ధపడ్డాడు. ‘‘గట్లపై కూడా గడ్డి లేదు. వరిగడ్డి మోపు ఒక్కటి రూ.100 నుంచి రూ.150 దాక ఉంది. ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలె. అందుకే అమ్ముకుంటున్నా..’’ అని ఆయన వాపోయాడు. ఈయనే కాదు చాలాచోట్ల రైతులు పశువులను తెగనమ్ముకుంటున్నారు. రైతులు వాటిని కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి కబేళాలకు తరలిస్తున్నారు. నల్లగొండ జిల్లా నుంచి సగటున రోజుకు 1,500 పశువులు, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్, జడ్చర్ల ప్రాంతాల నుంచి నిత్యం వందల కొద్ది పశువులు కబేళాలకు తరలుతున్నాయి. పాలమూరు జిల్లాలో అయితే పశువులకు మేత మాత్రమే కాదు తాగేందుకు నీళ్లూ దొరకడం లేదు. నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లోనూ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ పరిస్థితిని అంచనా వేసిన పశుసంవర్థక శాఖ సబ్సిడీపై గడ్డి విత్తనాలను సరఫరా చేసినా.. నీళ్లు లేక రైతులు ఆసక్తి చూపడంలేదు. -
మూగజీవాల ఆకలి వేదన
మూగజీవాలకు పెద్ద కష్టమొచ్చింది. గ్రాసం లేక ఆకలి బాధలు మొదలయ్యాయి. తమ ప్రమేయం లేకుండానే బలిపీఠమెక్కుతున్నాయి. వరుస కరువుతో రాయలసీమలో పొలాలు బీళ్లుగా మారి పశువులకు గ్రాసం కొరత ఏర్పడింది. తమ జీవనోపాధికే ఇబ్బందులు ఎదురైన రైతులు తప్పని పరిస్థితుల్లో పుట్టెడు దుఃఖంతో వాటిని అయినకాడికి అమ్ముకుంటున్నారు. ఎండనక, వాననక కష్టపడుతూ, చివరకు తమ మల, మూత్రాల ద్వారాకూడా పంటల సాగుకు ఉపయోగపడుతూ మానవజాతికి ప్రాణాధారమైన ఆహార ఉత్పత్తులకు తోడ్పడుతున్న మూగ జీవాలు, చివరి క్షణంలోకూడా మనుషులకు ఆహారంగానే కబేళాలకు తరలిపోతున్నాయి. అప్పటిదాకా ఆలనాపాలనా చూసిన తమ యజమానులకు దూరమవుతున్నామని అవిపడుతున్న మూగ వేదన సీమ జనానికి కంటనీరు పెట్టిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు. - సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాయలసీమలో మూడేళ్లుగా పంటల్లేవు. ఈ ఏడాదీ అదే పరిస్థితి. పంటల్లేకపోవడంతో గ్రాసం నిల్వలు లేవు. వర్షం లేక ‘అనంత’లో ఎక్కడా పచ్చిగడ్డి మొలక కన్పించడం లేదు. దీంతో గ్రాసం సమకూర్చలేక, పశువులను కాపాడుకునేందుకు మరో మార్గం లేక రైతులు వాటికి అమ్మేస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్న ఎద్దులను ఇతర ప్రాంతాల రైతులు కొంటుంటే, బక్కచిక్కిన వాటిని వ్యాపారులు కబేళాలకు తరలిస్తున్నారు. కనిపించని గ్రాసం నిల్వలు గతంలో పల్లెలకు వెళితే వేరుశనగ, వరి గడ్డి వాములు కనిపించేవి. ఏడాది పాటు పశువులకు గ్రాసాన్ని నిల్వ చేసుకునేవారు. మరో ఏడాది వర్షం కురవకపోతే నిల్వచేసుకున్న గ్రాసం ఊరట కలిగించేది. జిల్లాలో మూడేళ్లుగా పంటలు లేవు. మరీముఖ్యంగా గతేడాది దారుణమైన పరిస్థితి. 5.06లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగుచేయగా వర్షాభావంతో మొత్తం ఊడ్చుకుపోయింది. దీనివల్ల 20-30 ఎకరాలున్న పెద్ద రైతుల కల్లాల్లోనూ గడ్డివాములు కన్పించడం లేదు. పొలాల గట్లపై, కొండ గుట్టలపై కూడా గడ్డి దొరకడం లేదు. భూగర్భజలాలు కూడా అడుగంటడంతో పెద్దపెద్ద వృక్షాలే నిలువునా ఎండిపోతున్నాయి. దీంతో పశువులకు మేత అందించడం రైతులకు సాధ్యం కాలేదు. ఈ ఏడాది రెండువేల మెట్రిక్టన్నుల వరిగడ్డిని పశుసంవర్ధకశాఖ అధికారులు పంపిణీ చేసినా.. కొరత తీరలేదు. కబేళాలకు పశుసంపద ప్రతి ఆదివారం అనంతపురం, గోరంట్ల, కదిరిలో పశువుల సంతలు జరుగుతాయి. ఇంతకుముందు రైతులు సంతకు పాడిపశువులు, ఎద్దులను కొనేందుకు వెళ్లేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతి రైతూ పశువులను విక్రయించడానికి మాత్రమే వస్తున్నారు. కేరళ, తమిళనాడు, హైదరాబాద్లోని 'మీట్ మార్కెట్ల'కు ఈ పశువులు వెళుతున్నాయి. ప్రతివారం వేల సంఖ్యలో తరలిపోతున్నాయి. 2007-08 పశుగణన ప్రకారం జిల్లాలో 15.42 లక్షల గేదెలు, ఆవులు, ఎద్దులు ఉండేవి. 2013కు వీటి సంఖ్య 9.30 లక్షలకు తగ్గింది. ప్రస్తుతం మరో 1.50 లక్షల పశువులు తగ్గిపోయి ఉంటాయని పశుసంవర్ధకశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అందులోనూ కదిరి, ధర్మవరం డివిజన్లలో పశువుల సంఖ్య తీవ్రంగా తగ్గిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా గడ్డి పంపిణీ చేయకపోతే పశుసంపద మరింత తరగిపోయే ప్రమాదముంది. గడ్డి లేదయ్యా.. ఎక్కడా గడ్డి లేదయ్యా! వానలేక తోట మొత్తం ఎండిపోయింది. రైతుల బతుకు కష్టంగా మారింది. మూగజీవుల పరిస్థితి మరీ దారుణం. ఎక్కడైనా గడ్డి కొందామంటే చేతిలో చిల్లగవ్వలేదు. అప్పుచేసి కొన్నా గడ్డి దొరకడం లేదు. దీనివల్లే ఎద్దులను అమ్ముదామని మార్కెట్కు వచ్చినా. - వన్నూరప్ప, జంతలూరు, బుక్కరాయసముద్రం మండలం గడ్డి లేకే అమ్మాల్సి వస్తోంది ఏడాది కిందట రూ. 40 వేలకు కాడెద్దులను కొన్నా. వ్యవసాయపనులకు ఉపయోగపడతాయి. రైతులకు బాడుగకు వెళితే కాస్త ఆర్థికంగా మేలుంటుందని కొన్నా. తీరా చూస్తే వాటిని పోషించేందుకు గడ్డి లేదు. దీంతో ఎద్దులను రూ. 24 వేలకు అమ్మేశా. కేవలం గడ్డిలేకనే వాటిని అమ్మేశా. సంతలో పశువుల అమ్మకాలు చూస్తుంటే మళ్లీ నేను ఎద్దులు కొనాలంటే దొరుకుతాయా లేదా అని భయమేస్తోంది. - రామన్న, రైతు, పి. కొత్తపల్లి, ఆత్మకూరు మండలం -
పటాన్చెరువులో జిల్లాస్థాయి పశుప్రదర్శన
మెదక్: పటాన్చెరువు మండలం పెద్దకంజర్ల గ్రామంలో శుక్రవారం జిల్లాస్థాయి పశుప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భారీ నీటిపారుదల శాఖామంత్రి టి. హరీశ్రావు ప్రారంభించారు. ఈ పశుప్రదర్శన కార్యక్రమానికి ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డితోపాటూ, ఎంపీలు కొత్తకోట ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్ లు హజరయ్యారు. -
ఎవరు పశువులు!?
మీలో ఎవరైనా చేయరాని పని చేస్తే పశువులా ప్రవర్తించావంటారు.. బుద్ధి లేకుండా ప్రవర్తిస్తే దున్నపోతులా ఉన్నావని తిట్టిపోస్తారు.. చెప్పింది అర్ధం చేసుకోకపోతే ఎద్దులా తలూపుతున్నావని ఎద్దేవా చేస్తారు.. తెలివైన ఓ మనిషీ మాకో సందేహం.. నిబంధనల్ని తుంగలో తొక్కి మమ్మల్నిలా లారీలో కుక్కి కుక్కి అంబా.. అని అరిచినా ఆలకించకుండా వధశాలకు పంపుతున్నారే.. మిమ్మల్ని ఏ పేరుతో పిలవాలి !? వన్టౌన్ : అక్రమంగా కబేళాకు తరలిస్తున్న 50 పశువులను విజయవాడ గోసంరక్షణ దళ్ పట్టుకుని పోలీసులకు అప్పగించిన సంఘటన వన్టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ర్టంలోని మెదక్ జిల్లా జహీరాబాద్ నుంచి కృష్ణా జిల్లా హనుమాన్జంక్షన్కు రెండు కంటెయినర్ లారీల్లో 50 ఎద్దులను తరలిస్తున్నారు. లారీలు అశోక్పిల్లర్ వద్దకు రాగానే గోసంరక్షణ దళ్ అధ్యక్షుడు ప్రదీప్సింగ్రాజపురోహిత్ ఆధ్వర్యంలో పలువురు వాహనాలను అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. వాహనాలను పోలీసుస్టేషన్ తరలించి లారీ డ్రైవర్లు షోకాత్, మంటాఖాన్లను అరెస్ట్ చేశారు. జహీరాబాద్కు చెందిన అస్లాం వీటిని కృష్ణాజిల్లా హనుమాన్జంక్షన్లో విక్రయించేందుకు పంపినట్లు డ్రైవర్లు తెలిపారు. కంటెయినర్లో కిక్కిరిసి నింపడంతో వీటిలో రెండు గాయాలపాలై మరణించినట్లు గుర్తించారు. అనంతరం పశువులను గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఎర్రబాలెంలోని గోసంరక్షణ కేంద్రానికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పశువుల జాతర
మణికొండ: విభిన్న జాతులకు చెందిన పశువులు సందడి చేశాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రత్యేక గేదెలు ఆకర్షణగా నిలిచాయి. నార్సింగ్లో శుక్రవారం నిర్వహించిన పశుసంక్రాంతిలో బర్రెలు, ఆవులు 300 వరకు రాగా.. వాటిలో 152 వరకు అమ్ముడుపోయాయి. హర్యానాకు చెందిన ముర్రా జాతి రూ. లక్ష ధర పలికింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన మల్లారెడ్డి అనేవ్యక్తి రూ. లక్షకు ముర్రాజాతి బర్రెను కొనుగోలు చే శారని మార్కెట్ కమిటీ కార్యదర్శి వరలక్ష్మి తెలిపారు. సాయంత్రం వరకు అధికారికంగా రూ. 60 లక్షల వ్యాపారం జరిగిందని ఆమె పేర్కొన్నారు. జెర్సీ ఆవులు రూ. 40 వేల నుంచి రూ. 60 వేల వరకు అమ్ముడుపోయాయి. రోజుకు 20 లీటర్లు.. గుజరాత్కు చెందిన దులియా జాతి బర్రె రూ. 2.10 లక్షలకు ఒకటి చొప్పున రెండు రూ. 4.20 లక్షలకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించాయి. వీటిని మహేశ్వరంకు చెందిన పాలవ్యాపారి రవియాదవ్ కొనుగోలు చేశారు. అధికారికంగా మాత్రం తక్కువ ధరకు కొన్నట్టు మార్కెట్యార్డు రిసిప్టు తీసుకున్నట్టు తెలిసింది. ఉదయం, సాయంత్రం కలసి రోజుకు 20 లీటర్ల పాలు ఇవ్వటం వీటి ప్రత్యేకత. -
క్షీర సాగర పథకం రైతులకు ఓ వరం
జిల్లా పశుసంవర్థక శాఖ జేడీ వెంకట్రావు పులివెందుల రూరల్: ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్షీర సాగర పథకం రైతులకు ఓ వరం లాంటిదని జిల్లా పశుసంవర్థక శాఖ జేడీ వెంకట్రావు పేర్కొన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని పశువైద్యులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు 4150 యూనిట్లు మంజూరయ్యాయన్నారు. అలాగే ప్రభుత్వం పశువులకు ప్రత్యేక హాస్టల్స్ నిర్మించనుందన్నారు. పశువులకు ఇన్సూరెన్స్ చేయించాలన్నారు. రైతులు అధిక పాల ఉత్పత్తి కోసం దాణాను తప్పనిసరిగా వాడాలన్నారు. బోరుబావులలో నీటి సౌకర్యం ఉన్న రైతులకు రాయితీతో మంచి పోషక విలువలు ఉన్న గడ్డి విత్తనాలు ఇస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గొర్రెల పెంపకం ఏడీ మాల కొండయ్య మాట్లాడుతూ బేడ్ పాలక్ బీమా యోజన పథకం గొర్రెల కాపరులకు ఎంతో ఉపయోగకరమన్నారు. కార్యక్రమంలో డెయిరీ ఏడీ హేమంత్కుమార్, పులివెందుల డివిజన్ ఏడీ శ్రీనివాస్, డివిజన్ పరిధిలోని పశు వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
డొక్కల కరువు
ఆంధ్రదేశాన్ని గడగడలాడించిన అతి పెద్ద కరువులలో ఒకటైన పుర్రెల కరువులో (1791-95) ఒకటిన్నర కోటి మంది మరణించారని బ్రిటిష్ రికార్డులు చెప్తాయి. డొక్కల కరువుగా కూడా పేరు గడించిన ఈ కరువులో ఒక్క ఆంధ్ర ప్రాంతంలోనే యాభైలక్షల మంది బలయ్యారు. కరువు వల్ల ప్రాణ నష్టమే కాదు పశువులు, విత్తనాలూ నష్టమయ్యేవి. రైతులు, కూలీలు వలస పోవటం వల్ల గ్రామాలు నిర్మానుష్యమై మరలా కోలుకొనేందుకు చాలాకాలం పట్టేది. ఖననం చేయకుండా వదిలేసిన మనుషుల, జంతువుల కళేబరాల వల్ల కలరా, ప్లేగు వంటి అంటువ్యాధులు ప్రబలడం సర్వసాధారణం. తరచూ కరువు కాటకాల వల్ల మద్రాస్, బెంగాల్ ప్రెసిడెన్సీ ప్రాంతాల నుండి వేల కొలదీ సన్నకారు రైతులు, కూలీలు సుదూరమైన వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఆగ్నేయాసియా దేశాలకు వలసపోయారు. 1780లో బ్రిటిష్ రాజకీయవేత్త ఎడ్మండ్ బర్క్ ఇండియాలో కంపెనీ విధానాన్ని ‘దోపిడీ రాజ్యం’ అన్నాడు. 19వ శతాబ్దంలో సిపాయి తిరుగుబాటు తరువాత ప్రభుత్వం ఈస్టిండియా కంపెనీ నుండి క్రౌన్కి మారటంతో ప్రభుత్వ దృక్పథంలో కాస్త మార్పు వచ్చిన మాట వాస్తవమే. కరువు కారణాలు, పరిస్థితులూ, సహాయక విధానం గురించి స్థానిక ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు ‘ఫామైన్ కమిషన్లు’ ఏర్పాటయ్యాయి. ఆ సలహా సంఘాల నివేదికలు ఆనాటి దుర్భర పరిస్థితులను ఏకరువు పెడతాయి. మత ప్రచారమే ముఖ్యోద్దేశ్యమైనా కాటకాలతో తల్లడిల్లుతున్న బడుగు ప్రజలకి క్రైస్తవ మిషనరీల సేవ గుర్తింపతగ్గది. 16వ శతాబ్దానికే కొందరు ఫ్రాన్సిస్కన్ ప్రచారకులు ఆంధ్రదేశంలోకి వచ్చారు. వారిని రోమా సన్యాసులు అనేవారు. 18వ శతాబ్దిలో క్యాథలిక్ జెసుయైట్ మిషన్లు ఆంధ్రలో ప్రవేశించాయి. ఆ కాలంలో రచింపబడిన తెలుగు గ్రంథాలు పూర్వవేదం, రాజుల చరిత్ర, క్రీస్తు చరిత్ర మొదలైన బైబిల్ కథలు క్రైస్తవ మతానికి ప్రజలలో ప్రాచుర్యాన్ని ఇచ్చాయి. 1805లో విశాఖపట్టణంలో లండన్ మిషనరీ సొసైటీ స్థాపనతో ప్రొటెస్టెంట్ క్రైస్తవ సంఘాలు రావటం మొదలయింది. 19వ శతాబ్ది మధ్యకాలంలో ఇండియాకి అనేక క్రైస్తవ సంఘాలు వెల్లువలా వచ్చాయి. వాటిలో ముఖ్యమైనది మెథొడిస్ట్ చర్చ్. గోదావరి జిల్లాలని సస్యశ్యామలం చేసిన సర్ ఆర్థర్ కాటన్ సహకారంతో గోదావరి మిషన్ రాజమండ్రిలో, హిందుస్తానీ మిషన్ హైదరాబాద్ రామ్కోటీలో కార్యకలాపాలు సాగించాయి. హైదరాబాద్లో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు రెవరెండ్ వెస్లీ చేసిన సేవలు అపారం. 1847లో జాన్ ఫ్రెడెరిక్ హైయ్యర్ గుంటూరులో స్థాపించిన లూథరన్ చర్చితో అమెరికన్ క్రైస్తవ మిషన్ల ఆగమనం మొదలయింది. మేరీలాండ్లోని వాల్టర్ రీడ్ హాస్పిటల్ నమూనాతో నిర్మించిన అమెరికన్ హాస్పిటల్ కోస్తాంధ్రలో ఆధునిక వైద్య సేవలకి కేంద్రబిందువు అయింది. మరో అమెరికన్ శాఖ, బాప్టిస్ట్ సమావేశం. కెనడాకి చెందిన శామ్యూల్ డే ద్వారా నెల్లూరులో వేళ్లూని నెల్లూరు, ఒంగోలు ముఖ్య కేంద్రాలుగా వృద్ధి చెందింది. తెలుగులో మొట్టమొదటి బైబిల్ ఈ సంఘానికి చెందిన లైమన్ జ్యూవెట్చే రచించబడింది. ఒంగోలు ప్రాంతంలో జ్యూవెట్ దంపతులు, జాన్ క్లోవ్ కరువు బాధితులకు ఎనలేని సేవలు అందించారు. -
మురి‘పాలు’ కావాలంటే..!
చలికాలంలో పశువులపై దృష్టి సారించాలి యాజమాన్య పద్ధతులు పాటించాలి సమీకృత దాణా విడిగా ఇవ్వాలి శరీర ఉష్ణోగ్రత కోసం ప్రత్యేక ఆహారం ఇవ్వాలి సాధారణంగా 12గంటల వ్యవధిలో పాలు పితుకుతుంటారు. కానీ చలికాలంలో పగటిపూట సమయం తక్కువగా, రాత్రి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చలికాలంలో ఉదయం 6గంటల నుంచి 7 గంటల మధ్య, సాయంత్రం 4గంటల నుంచి 5గంటల మధ్య పాలు పితకడం మంచిది. శీతాకాలంలో పశువుల శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూడాలి. శరీరం వేడిగా ఉండడానికి అదనపు ఆహారం ఇవ్వాలి. లేకపోతే మేత తినక పాల దిగుబడి తగ్గుతుంది. పశువులకు అందించే దాణాలో పిండి పదార్థాలు ఎక్కువగా, మాంసకృత్తులు తక్కువగా ఉండాలి. లూసర్న్, బర్సీం వంటి పశుగ్రాసాల సాగును చేపట్టి అధిక పాల దిగుబడి పొందాలి. వరి కోతలు పూర్తవగానే పొలంలో మిగిలి ఉన్న తేమతో జనుము వంటి పశుగ్రాసాలను సాగు చేసుకోవాలి. శీతాకాలంలో ఎక్కువగా పశువులు ఎదకొచ్చి పొర్లుతాయి. కాబట్టి ప్రతిరోజు పశువులను కనీసం రెండు మూడుసార్లు ముందూ, వెనకా పరిశీలించాలి. పశువు వెనక భాగంలో పరిశీలిస్తే, మూగ ఎదలో ఉన్న పశువులను గుర్తించడం వీలవుతుంది. గత ఎద పూర్తయిన తర్వాత 16-25 రోజుల్లో పశువుల ప్రవర్తనలో మార్పు, పాల దిగుబడిలో తగ్గుదలను బట్టి ఎదను గుర్తించాలి. వెంటనే వీర్యదానం చేయించాలి. చలిగాలులు, మంచు కురవడం వల్ల న్యూమోనియా సోకే ప్రమాదం ఉంది. గొంతు వాపు, గిట్టలు మెత్తబడడం, మేత తినకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. పశువులు, దూడలను ఆరుబయటే కట్టేయకూడదు. ఈదురుగాలిని నిరోధించడానికి వాతావరణంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీల కంటే తక్కువైన సందర్భాల్లో పాకల చుట్టూ పరదాలు కట్టాలి. లేగ దూడల వెంట్రుకలను శీతాకాలంలో కత్తిరించకూడదు. {పతి రోజు పశువులశాలను రెండు సార్లు శుభ్రం చేయాలి. సోడా కార్బోనేట్, 4 శాతం బ్లీచింగ్ పౌడర్ వంటి క్రిమిసంహారక మందులతో శుభ్రపరచాలి. నీటి తొట్లను వారానికి ఒకసారి శుభ్రం చేయాలి. తరుచూ వాటికి సున్నం వేస్తుంటే పశువులకు కాల్షియం, ఖనిజ లవణాలు లభ్యమవుతాయి. ఫంగస్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది. పశువులు తాగేందుకు రోజుకు 50-60 లీటర్ల నీరు అవసరం. శీతాకాలంలో 2-3 సార్లు తాగేందుకు నీరందించాలి. తాగేందుకు నీళ్లు పుష్కలంగా అందిస్తే పాల దిగుబడి బాగుంటుంది. పాలు పితికే గంట, రెండు గంటల ముందు లేదా పితికిన తర్వాత దాణా ఇవ్వాలి. -
అటు సేవలు ఇటు రోగాలు
కామారెడ్డి : పారిశుధ్య కార్మికులు తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని, పరిశుభ్రతను అందించేందుకు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారులు చీపుర్లు చేతపట్టుకుని ఫొటోలకు ఫోజులివ్వడం వారిని అబ్బురపరుస్తుంది. పల్లె నుంచి పట్టణాలు, నగరాలు, మహా నగ రాల దాకా ప్రతీ చోటా అందరికన్నా ముం దే రోడ్లపైకి వచ్చేది పారిశుధ్య కార్మికులే. తెలవారకముందే వారు తమకు కేటాయించిన ప్రాంతాలకు బయలుదేరుతారు. మురికి కాలువలను శుభ్రం చేయ డం, రోడ్లను ఊడ్చడం, చెత్తను ఎత్తి ఆటోలు, ట్రాక్టర్లలో పోయండంలాంటి పనులు చేసే కార్మికులు నిత్యం అనేక సమస్యలను ఎదుర్కొంటుంటారు. మురికితో ముక్కుపుటాలు అదిరిపోతున్నా తమ విధులను నిర్వహిస్తుంటారు. ఒక్కోసారి మురికి కాలువల లో పశువులు, పందులు, కుక్కల కళేబరాలు ఉం టా యి. దుర్గంధం వెదజల్లుతున్నా ముక్కుకు గుడ్డ కట్టుకుని వాటిని బయటకు లాగుతారు. పట్టణాలకు దూరంగా తీసుకెళ్లి పడేస్తారు. రోడ్లపై దుమ్ము, ధూళిని ఊడ్చే సమయంలో నానా యాతన పడుతుంటారు. దగ్గు, తుమ్ములు వస్తున్నా ఆపుకుంటూ ఊడుస్తూనే ఉంటారు. చెత ్తకుండీలు కంపు కొడుతున్నా సరే అందులో నుంచి మొత్తం చెత్తను తొలగిస్తారు. అరకొర వేతనాలు సమాజానికి ఆరోగ్యాన్ని అందించేందుకు తమ జీవితాలను పణంగా పెట్టి కష్టించే కార్మికులకు అందే వేతనాలు అంతంతే ఉంటాయి. పట్టణాలలో అయితే మున్సిపా లిటీలు ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు ఇస్తాయి. పల్లెలలో కేవలం వెయ్యి నుంచి మూడు వేల రూపాయలు మాత్రమే అందుతాయి. పల్లె అయినా పట్టణమైనా సరే కార్మికులకు నెలనెలా వేతనాలు సక్రమంగా అందవు. కార్మికుల వేతనాలకు ప్రత్యేక బడ్జెట్ లేకపోవడంతో ప్రజలు చెల్లించే పన్నుల నుంచే వేతనాలు ఇస్తుంటారు. దీంతో బడ్జెట్ లేదంటూ వేతనాలు ఇవ్వడంలో ప్రతీసారీ జాప్యం జరుగుతూనే ఉంటుంది. రోగాలే మిగిలేది తెలవారకముందే పనిలో నిమగ్నమయ్యే పారిశుధ్య కార్మికులకు ఇచ్చే వేతనాలు అరకొరగానే ఉంటున్నా యి. ఇదే సమయంలో దుర్గంధం, మురికి మధ్యన నిత్యం జీవితాలను గడపడంతో వారు అనేక రకాల రోగాలబారిన పడుతుంటారు. కార్మికుల ఆరోగ్యం విషయంలో పాలకులు, అధికారులు ఏనాడూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దీంతో వారు అనేక రకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యంపాలైన కార్మికులకు వైద్య సహాయం అందించే విషయాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవు. ఎందరో కార్మికులు రోగాలతో ఇబ్బందులు పడుతూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలున్నాయి. వైద్యం, మందులకయ్యే ఖర్చులకే సంపాదన నైవేద్యం లా ఖర్చు చేయాల్సి వస్తోందని పలువురు కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వారు నిజమైన సేవకులు సమాజానికి స్వచ్ఛతనందించే పారిశుధ్య కార్మికులే నిజమైన సేవకులుగా సమాజంలో గుర్తింపు పొం దారు. నిత్యం సేవలందించే కార్మికులకు పండుగల సమయంలో చాయ్ నీళ్లకంటూ ఐదో, పదో రూపాయలిస్తూ ప్రజలు వారి సేవలను గుర్తిస్తుంటారు. ఎప్పుడైనా సమ్మెకు దిగితే ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొనాల్సిందే. పా రిశుధ్య కార్మికులు లేని ప్రపంచాన్ని ఊహించుకోలేమన్నది సామాజిక కార్యకర్తల అభిప్రాయం. అందుకే వారి సంక్షేమం విషయంలో పాలకులు దృష్టి సారించి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. -
‘షేడ్నెట్’తో.. కాలం కలిసొస్తుంది!
భాస్కర్రెడ్డి సాధారణ పద్ధతిలో నారు పెంచితే... సాధారణ పద్ధతిలో పెంచే నారును పశువులు, గొర్రెలు, మేకలు మేసే ప్రమాదం ఉంటుంది. దీనికి రైతు కాపలా ఉండాల్సి వస్తుంది. ఏ తెగులు ఎలా వస్తుందో తెలుసుకోవడం కష్టం. మురుగు నీరు పారే వసతి (నీరు ఇంకిపోయే గుణం) నారుమడుల్లో ఉండకపోవడం వల్ల నారు కుళ్లు సోకే ప్రమాదం ఉంటుంది. విత్తనాలు దగ్గర దగ్గరగా వేయడం వల్ల నారు ఒత్తుగా పెరిగి బలంగా ఉండదు. దీన్ని పొలంలో నాటిటే మొక్కలు వంగిపోయి చనిపోతాయి. నారును బహిరంగ ప్రదేశాల్లో పెంచడం వల్ల తామర, పేనుబంక, తెల్లదోమ వంటి రసం పీల్చే పురుగు ఆశించి పాడవుతుంది. నారును పొలం నుంచి పీకినప్పుడు పీచువేర్లు తెగిపోయి వేర్లతో సహా మట్టి తక్కువగా ఉండడం లేదా పూర్తిగా లేక పోవడంవల్ల నాటిన తర్వాత మొక్కలు చనిపోయి పొలంలో ఖాళీలు ఏర్పడుతాయి. మళ్లీ మొక్కలు నాటినా అవి పెరిగే వరకు చాలా సమయం పడుతుంది. పొలంలో నాటడానికి 30 రోజులు ముందే విత్తనాలు సేకరించుకుని నారు పోసి కనీసం 26 నుంచి 40రోజుల వరకు నారు మడులను సంరక్షించాల్సిన వస్తుంది. మధ్యకాలంలో అనువైన వర్షాలు కురిసి అదును ఉన్నా నారు సాగు చేయడానికి పనికిరాదు. షేడ్నెట్ హౌస్తో ఉపయోగాలు.. నర్సరీలలో నారును ట్రేలలో పెంచుతారు. ముందుగా కొబ్బరి పీచులో విత్తనాలను పూడ్చడం వల్ల తగు మేర తేమ ఉండి మొలకశాతం పెరుగుతుంది. తద్వారా విత్తన మోతాదు తగ్గి ఖర్చు తగ్గుతుంది. నారును ప్లాస్టిక్ ట్రేలలో పెంచడం వల్ల వేర్లు సమృద్ధిగా పెరిగి పక్క మొక్కకు సంబంధం లేకుండా ఎదుగుతాయి. మొక్కలు ట్రేల నుంచి పెరిగినప్పుడు వేరు వ్యవస్థ దెబ్బతినకుండా కొబ్బరి పీచుతో సహా పూర్తిగా ఊడివస్తుంది. ఈ మొక్కలను పొలంలో నాటినప్పుడు చనిపోయే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కో ట్రే గుంత రెండున్నర సెంటీమీటర్లు ఉండటం వల్ల ప్రతి మొక్కకు నలువైపులా కావాల్సినంతా ఖాళీ ఉండి మొ క్కలు ధృడంగా పెరుగుతాయి. ఇలాంటి మొక్కలు పొలంలో నాటిన వెంటనే పెరుగుదల ప్రారంభం అవుతుంది. మొక్కలు షేడ్నెట్హౌస్లలో పెరగడం వల్ల తగినంత వెలుతురు, గాలి, తేమ ఉండి మొక్కల పెరుగుదలతో అన్ని సమంగా ఉండి ప్రధాన పొలంలో త్వరగా నాటుకునే అవకాశం ఉంటుంది. షేడ్ నెట్ హౌస్ల చుట్టూ తెల్లటి ఇన్సెక్ట్ నెట్ ఏర్పాటు చేయడం వల్ల తామర పురుగులు, పేనుబంక, తెల్లదోమ వంటి వైరస్ తెగుళ్ల వ్యాప్తికి సహాయపడే రసం పీల్చే పురుగులు ఆశించడానికి అవకాశం ఉండదు. ఫలితంగా నాణ్యమైన, ఆరోగ్యవంతమైన నారు లభిస్తుంది. ఈ షేడ్నెట్ మౌస్లలో పాముపొడ, చీడపీడలు నారు మొక్కలపై ఆశించే అవకాశం ఉండదు. పంట ఎప్పుడు సాగు చేసుకోవాలనుకున్నా నారు అప్పటికప్పుడు రెడీమేడ్గా అదును వచ్చిన వెంటనే సాగుకు అవకాశం ఉంటుంది. సాధారణ పద్ధతిలో ఖర్చు అధికం.. ఎకరం పొలంలో పంటసాగుకు ముందుగా నారు మళ్లు తయారు చేసుకోవాలి. ఎత్తుబెడ్లు ఏర్పాటు చేసుకోవాలి. ఫ్రూడాన్ గుళికలు, వేప పిండి చల్లి విత్తనాలు చల్లుకోవాలి. రెండుమూడు సార్లు మందు పిచికారీ చేయాలి. ఈ సాధారణ పద్ధతికి గాను పెట్టుబడి మొత్తం రూ. 5వేలు అవుతుంది. ఎకరం కూరగాయల సాగుకు 12వేల మొక్కలు కావాలి. అయినా అందులో ఎన్ని చనిపోతాయో చెప్పలేని పరిస్థితి. షేడ్నెట్లలో.. నారును ట్రేలలో పెంచుతారు. ఎలాంటి రోగ లక్షణాలు ఉండవు. అన్ని రకాల పిచికారీ మందులు వాడతారు. ఎకరం కూరగాయల సాగుకు 8వేల మొక్కలు సరిపోతాయి. ఏ మొక్కా చనిపోదు. నారు ఖర్చు మొక్కకు 30 పైసలు అయితే పెట్టుబడి రూ.2,400, నారు 40పైసలు అయితే పెట్టుబడి రూ. 3,200 అవుతుంది. సాధారణంతో పోల్చితే షేడ్నెట్హౌస్ల ద్వారా తక్కువ ఖర్చవుతుంది. -
మేతకు వెళ్లిన పశువులు మాయం!
విజయవాడ: కృష్ణా జిల్లా నూజివీడు మండలం వట్టిగుడిపాడులో మాయమవుతున్న పశువులన్నీ అక్కడ ఉన్న కబేళాకు తరలివెళుతున్నాయి. వందలాది గేదెలను దొంగిలించి పారిశ్రామికవేత్త పుట్టగుంటకు చెందిన బీఫ్ ఫ్యాక్టరీకి తరలిస్తున్నారని రైతులు ఆరోపించారు. విషయం తెలిసి రైతులు ఫ్యాక్టరీపై దాడి చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాయమైన పలు గేదెలు ఫ్యాక్టరీ వద్ద ఉండటంతో రైతులు ఆందోళనకు దిగారు.పోలీసులకు ఫిర్యాదు చేశారు. గేదెలను దొంగిలించి ఫ్యాక్టరీకి తరలిస్తున్నారని రైతులు ఆరోపించారు. ఈ ఫ్యాక్టరీ నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాలకు కూడా బీఫ్ను పంపుతున్నట్లు చెప్పారు. ** -
పశువులు ఈనే సమయంలో జాగ్రత్త అవసరం
ఒంగోలు టూటౌన్ : జిల్లాలో చాలా మంది రైతులు వ్యవసాయంతో పాటు పాడి పశువులను పోషిస్తున్నారు. పశువులు ఈనే ముందు, ఈనిన తర్వాత జాగ్రత్తల విషయంలో నిర్లక్ష్యంతో కొన్ని సార్లు పశువులు మృత్యువాత పడుతున్నాయి. ఈ సమయంలో పశుపోషకుడు అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధక శాఖ ఒంగోలు ఏడీఏ మురళీకృష్ణ తెలిపారు. ఇందుకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పశువులు ఈనే ముందు.. చూడిపశువు ఎక్కువ నీరు తాగకుండా చూడాలి. మందతో బయటకు పంపకూడదు. ఎత్తు ప్రదేశాలకు వెళ్లకుండా చూసుకోవాలి. పరుగెత్తనీయకూడదు. బెదరగొట్టడం, దున్నపోతులు, ఆంబోతులు పొడవకుండా, దాటకుండా చూడాలి. చూడి పశువులను విడిగా ఉంచాలి. కొన్ని పశువుల్లో ఈనడానికి పది రోజుల ముందు పొదుగు భాగంలో నీరు దిగి వాపు వస్తుంది. ఇది సహజంగా వస్తుంది. దీనిని వ్యాధిగా భావించనవసరం లేదు. పశువు ఈనే సమయంలో.. పశువును, కొష్టాన్ని శుభ్రపరచాలి. ఈనడానికి రెండు గంటల ముందు జొన్నలు, రాగులు, సజ్జలు మొదలైన చిరుధాన్యాలను ఉడికించి పెట్టాలి. పచ్చిగడ్డి కూడా కొద్దిగా వేయాలి. ఈనే ముందు పచ్చిగడ్డి సరిగా తినవు. పారుకుంటూ ఉంటాయి. శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈనే సమయం దగ్గర పడినప్పుడు బొడ్డు కింద నీరు చేరుతుంది. ముర్రుపాలు కనపడతాయి. ఆరోగ్యవంతమైన పశువు ఈనే ముందు ఇబ్బందిపడుతూ అరగంట నుంచి ఆరు గంటల్లోనే ఈనుతాయి. ఆరు గంటలు మించితే వైద్యుడి సహాయం తీసుకోవాలి. ఈనే ముందు సాధారణంగా లేగదూడ ముందరికాళ్లు, ముట్టె ముందు బయటకు వస్తాయి. సాధ్యమైనంతవరకు పశువు దానంతట అదే ఈనేందుకు ప్రయత్నించాలి. ఈనిన తర్వాత.. వేడినీళ్లతో శరీరాన్ని శుభ్రం చేయాలి. వరిగడ్డితో బెడ్డింగ్ ఏర్పాటు చేయాలి. నీరసం తగ్గడానికి బెల్లం కలిపిన గోరువెచ్చని తాగునీరు ఇవ్వాలి. పశువులకు కొన్ని రోజుల వరకు కొద్దిగా దాణా అందిస్తూ రెండు వారాల్లో పూర్తిగా దాణా ఇవ్వాలి. ఈనిన రెండు నుంచి ఎనిమిది గంటల్లో మాయ వేస్తాయి. అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటే పశువైద్యుడి సహాయం తీసుకోవాలి. మాయని అశాస్త్రీయ పద్ధతిలో లాగితే గర్భకోశం చిట్లి రక్తస్రావం జరుగుతుంది. కొన్ని సార్లు పశువు మరణించే అవకాశం ఉంది. అధిక పాలిచ్చే పశువులకు ఈనిన తర్వాత పాలజ్వరం రాకుండా కాల్షియం ఇంజక్షన్ వేయించాలి. ఈనే వారం రోజుల ముందు, తర్వాత వారం రోజులు పశువుకు విటమిన్-డి ఇవ్వాలి. -
వ్యాధుల కాలం.. పశువులు పైలం
గొంతువాపు వ్యాధి వర్షాకాలంలో పశువులకు ప్రధానంగా వచ్చేది గొంతువాపు వ్యాధి. దీనిని గురకవ్యాధి అంటారు. నీరసంగా ఉండే పశువులకు ఈ వ్యాధి త్వరగా సోకుతుంది. పశువు ఆయాస పడుతూ శ్వాస పీలుస్తుంది. గుర్రు గుర్రుమని శబ్దం వస్తుం ది. జ్వర తీవ్రత 104 నుంచి 106 డిగ్రీల వరకు ఉంటుంది. కంటి నుంచి నీరు, నోటి నుంచి చొంగ పడుతుంది. గొంతు పై భాగాన మెడ కింద వాపు వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన పశువు 24 గంటల్లో మరణించే అవకాశాలు ఉంటాయి. చికిత్స.. వ్యాధి లక్షణాలు కనిపించిన పశువును వెంటనే మంద నుంచి వేరు చేయాలి. వెంటనే డాక్టర్ సలహా తీసుకోవాలి. వ్యాధి సోకిన పశువుకు వ్యాధి తీవ్రతను బట్టి సల్ఫాడిమిడిన్, ఇంటాసెఫ్టాజు, ఎక్సెప్ట్ వంటి ఇంజక్షన్లు ఇవ్వాలి. వ్యాధి ముదిరితే ఏమీ చేయని పరిస్థితి ఉంటుంది. అలాగే ఆరోగ్యంగా ఉన్న పశువుకు బూస్టర్ డోస్ తప్పక వేయించాలి. జబ్బవాపు.. ఈ వ్యాధి క్లాస్ట్రిడియం చొవై అనే బ్యాక్టిరియా ద్వారా పశువులకు సోకుతుంది. ఆరు మాసాల నుంచి రెండేళ్ల లోపు వయసున్న పశువులకు ఎక్కువ సోకుతుంది. ఈ వయసులో పశువుకు రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. భుజం, తొడ ప్రాంతాల్లోని కండరాలను ఆశించి, మాంసం కుళ్లిపోయేలా చేస్తుంది. వాపుతో పశువులు కుంటుతాయి. వెనక కాలు కాని ముందు కాలు గాని పైకి లేపి ఉంచి కుంటడం చేస్తాయి. వాపు దగ్గర కరకరమని శబ్దం వస్తుంది. చికిత్స.. వ్యాధి ప్రారంభంలోనే పెన్సిలిన్, ఆక్సివంటి యాంటిబయాటిక్స్ వాడాలి. వాటితో పాటు డెక్ట్రోజ్ నార్మల్ సెలైన్ వాడాలి. వ్యాధిగ్రస్థ పశువుల్ని వేరుచేయాలి, చనిపోయిన పశువును ఉన్నట్లయితే గొయ్యిలో పాతిపెట్టాలి. వ్యాధి రాకుండా వర్షాకాలం ముందే జబ్బవాపు వ్యాధి టీకాలు వేయించాలి. గాలికుంటు వ్యాధి.. గాలికుంటు వ్యాధి సోకిన పశువు చాల బలహీనంగా ఉంటుంది. పాలు ఇచ్చే గేదేలు చాలా నీరసంగా ఉంటాయి. పాల ఉత్పత్తి చాలా తగ్గిపోతుంది. ఎడ్లు వ్యవసాయం పనులు చేయడానికి సాహసించవు. సంకరజాతి పశువులతో పాటు షెడ్లలో పెంచుకొనే పశువులకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఎక్కువగా మార్చి, ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఈ వ్యాధి పశువులకు వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి సోకిన పశువుకు నోటి గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి. 3, 4 వారాల్లో బొబ్బలు పగిలి పుండ్లుగా మారుతాయి. చర్మం గరుకుగా మారుతుంది. నోటి చిగుళ్లపై పొక్కులు ఏర్పడటం చేత పశువులు మేత, తీసుకోక నీరసించి పోతాయి. నోటి నుంచి సొంగ కారుతుంది. చికిత్స వ్యాధి సోకిన పశువును మంద నుంచి వేరు చేయాలి. నోటిలోని పుండ్లకు బోరిక్ పౌడర్, గ్లిసరిన్ కలిపి పూయాలి. అంతే కాకుండా ముందు జాగ్రత్తగా స్థానిక పశువైద్యాధికారులు జాతీయ గాలికుంటు వ్యాధి నివా రణ పథకం కింద టీకాలు కూడా ఉచితంగా వేస్తున్నారు. గొర్రెల్లో కాలి పుండ్లు.. వర్షాకాలంలో గొర్రెలు బురదలో తిరగడం వల్ల కాలి పుండ్ల వ్యాధి సోకుతుంది. బురదలో తిరిగినప్పుడు గిట్టల మధ్య చర్మం మెత్తబడి, వాచి చిట్లిపోతుంది. చీము పట్టి నొప్పితో ముందు కాళ్లపై గెంటుతుంటాయి. వ్యాధి మరింత జటిలం అయితే గిట్టలూడి పోతాయి. ఈ వ్యాధి సోకిన పశువులకు 10 శాతం మైలతుత్తం, పది శాతం జింక్సల్ఫేట్, లేదా ఐదు శాతం ఫార్మలిన్లో ఏదైనా ఒక ఆయింట్మెంట్ పూయాలి. యాంటిబయాటిక్ ఇంజక్షన్లు వరుసగా 3-5 రోజులు వేయించాలి. అంతే కాకుండా గొర్రెలను బురద నేలల్లో ఎక్కువగా తిరగనీయొద్దు. గట్టి నేలల్లో మేపే విధంగా చూడాలి. -
గోమాత వ్యథ..
ఖమ్మం అర్బన్ : ఎంతోమంది అతి పవిత్రంగా భావించే గోవులకు కొందరు దళారులు బతికి ఉండగానే నరకం చూపిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పశుగ్రాసం లేక కొందరు రైతులు పశువులను విక్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో పాటు తక్కువ ఖర్చుతోనే వాటిని కబేళాకు తరలించేదుకు ఒక్కో కంటెయినర్లో లెక్కకు మించి ఎక్కిస్తున్నారు. ఇలా తరలిస్తున్న మూగజీవాలను ఇటీవల అర్బన్ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఆరు పశువులను తరలించాల్సిన కంటెయినర్లో ఏకంగా 30 నుంచి 80 వరకు రవాణా చేస్తున్నారు. ఇలా శ్రీకాకుళం, విజయనగరం, ఖమ్మం తదితర జిల్లాల నుంచి హైదరాబాద్లోని గోవధ శాలకు పంపిస్తున్నారు. ఈ క్రమంలో ఊపిరాడక కొన్ని పశువులు మృత్యువాత పడుతుండగా, ఒకదానికి ఒకటి తగలడంతో పలు ఆవులు, దూడలు తీవ్రంగా గాయపడుతున్నాయి. అయితే ఆరెస్సెస్ ప్రతినిధులు, మరికొందరు ఇచ్చిన సమాచారంతో జిల్లా పోలీసులు ఇటీవల పలు పశువులను స్వాధీనం చేసుకుని గోశాలకు తరలించారు. గోశాలలోనూ ఇక్కట్లే... గత శుక్రవారం ఒక్క రోజే ఖమ్మం అర్బన్, ఏన్కూర్ తదితర మండలాల నుంచి కంటెయినర్ల ద్వారా తరలిస్తున్న పశువులను పోలీసులు పట్టుకుని నగరంలోని గొల్లగూడెం, ధంసలాపురం గోశాలలకు తరలించారు. గొల్లగూడెం గోశాలలో గతంలో ఉన్నవాటికి తోడు మరో 35 పశువులను చేరవేశారు. అయితే అన్నింటికి గ్రాసం సరిపోక అవి ఆకలితో అలమటిస్తున్నాయి. దాతలు ఇచ్చిన కొద్దో..గొప్పో గ్రాసంతోనే గోశాలను నిర్వహిస్తున్నామని, తాగునీరు, గ్రాసం అందించడం పెద్ద ప్రయాసగా మారిందని నిర్వాహకులు చెపుతున్నారు. మూడు పశువులతో ప్రారంభించిన గోశాలలో నేడు 370 పైగా ఉన్నాయని, ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తే వీటిని సంరక్షించగలమని చెపుతున్నారు. ప్రశ్నార్థకంగా గోవధ నిషేధ చట్టం.. పోలీసులు పట్టుకున్న పశువులను సమీపంలోని గోశాలలకు తరలిస్తున్నారు. అయితే వీటి సంరక్షణ భారంగా మారుతుండడంతో పలువురు నిర్వాహకులు ఆ పశువులను తమవద్ద ఉంచవద్దంటూ నిరాకరిస్తున్నారు. దీంతో గోవధ నిషేధ చట్టం ప్రశ్నార్థకంగా మారుతుందని జంతుప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్, ఎస్పీ గోశాలలను సందర్శించి, అక్కడ నెలకొన్న సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని, గోశాలలో వందల సంఖ్యలో పశువులు ఉంటంతో వాటికి అవసరమైన వైద్యం అందించడానికి కూడా ప్రత్యేక వైద్యాధికారిని నియమించాలని కోరుతున్నారు. -
కన్నీళ్లతో..
సాక్షి, కడప : 2014 జనవరి నుంచి ఇప్పటివరకు జిల్లాలో సరైన వర్షం లేదంటే నమ్మశక్యంగా లేకపోయినా నమ్మి తీరాల్సిందే. ఒక్క భారీ వర్షం కూడా కురవకపోవడంతో జిల్లాలోని భారీ ప్రాజెక్టులతోపాటు చెరువులు బోసిపోయాయి. ఎక్కడ చూసినా పంట పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. అరకొర పదునుతో సాగుచేసిన పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. రైతులకు సంబంధించి పెట్టుబడి నష్టం కాగా.. మరో పక్క పండ్ల తోటల రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. నీళ్లు వచ్చే బోర్లు సైతం నిలువునా ఎండిపోతుండగా పండ్ల తోటలను ఏవిధంగా సంరక్షించుకోవాలో అన్నదాతకు దిక్కు తో చడం లేదు. మూగజీవాలను అమ్ముకుంటున్న అన్నదాతలు : జిల్లాలో ఎక్కడ చూసినా ట్రాక్టర్లతో వ్యవసాయ పనులు చేస్తున్నా అక్కడక్కడ రైతులు ఎద్దులను నమ్ముకుని వ్యవసాయం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీటిని మేపలేక సంతకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. పులివెందుల, మైదుకూరులోనే కాకుండా రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రాజంపేట, కడప, కమలాపురం, బద్వేలు, జమ్మలమడుగు తదితర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పశుగ్రాసం కొరతతో గొర్రెలను కూడా అమ్మేందుకు సిద్ధపడుతున్నారు. కొనేవారేరీ.. ! జిల్లాలో 8 నెలలుగా వర్షాలు లేకపోవడంతో ఏం చేయాలో తెలియక పాడి రైతులు పశువులను విక్రయించేందుకు సిద్ఢపడుతున్నా కొనేవారు కనిపించడం లేదు. గ్రామాల్లోకి వచ్చి కొనుగోలు చేసేవారు లేకపోవడంతో.. చివరకు సంతకు తీసుకొచ్చినా అక్కడ కూడా కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. దళారులు కొనుగోలు చేసి కబేళాలకు తరలిస్తున్నారు. కొన్నేళ్లుగా వ్యవసాయంలో తోడు నీడగా నిలిచిన మూగజీవాలను కటిక వ్యాపారస్తులకు అమ్మాలంటే అన్నదాతకు మనసొప్పడం లేదు.. కన్నీళ్లు పెట్టుకుంటూ వాటిని విక్రయిస్తున్నారు. పదుల సంఖ్యలో పశువులను లారీలలో ఎక్కించి నిలబడటానికి కూడా చోటులేని విధంగా వాటిని చిత్రహింసలకు గురిచేస్తూ తీసుకెళుతుంటారు. -
నారుమళ్లు...పశువులపాలు
నీరులేక ఎండిపోతున్న వైనం ఎకరాకు రూ.4వేలు నష్టం కౌలు రైతు పరిస్థితి మరీ దయనీయం తూర్పుకృష్ణాలో కరువు కష్టాలే! చల్లపల్లి : వరుణుడు కరుణించకపోయినా ఆయిల్ ఇంజన్లు, గుల్లపంపుతో నీరు తోడి పోసి కంటికి రెప్పలా కాపాడుకున్న నారుమళ్లను రైతులే పశువుల పరం చేస్తున్నారు. రెక్కలు, ముక్కలు చేసుకుని ఎంతో కష్టపడి పోసుకున్న నారుమడిని తమ కళ్లముందే పశువులు మేస్తుండటంతో తీవ్ర ఆవేదనకు గురౌతున్నారు. ఒకప్పుడు సాగులో ముందుండే తూర్పుకృష్ణాలోని మొవ్వ, పామర్రు, దివిసీమలోని ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి ప్రాంతాల్లో ఈ దుస్థితి ఎదురవ్వడం రైతులను మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. జిల్లాలో ఈ ఏడాది 6.34లక్షల ఎకరాల్లో వరిసాగు చేసేందుకు రైతులు సన్నద్ధమయ్యారు. సకాలంలో సాగునీరందక పోయినా విద్యుత్ బోర్లు, ఆయిల్ ఇంజన్లతో వర్షపునీరు, తాగునీటికి వదిలిన నీటిని తోడుకుని ఎన్నో ఇబ్బందులు పడి నారుమళ్లు పోశారు. అనంతర కాలంలో వానలు లేకపోవడం, ఎండలు మండిపోవడంతో నారుమళ్లు ఎండిపోయాయి. ఘంటసాల, మొవ్వ, చల్లపల్లి మండలాల్లో నారుమళ్లను కాపాడుకునేందుకు కూలీలతో నీళ్లపోత పోయించారు. ఎకరం పొలానికి నారుమడి పోసేందుకు వర్షాభావ పరిస్థితుల వల్ల రూ.3,000 నుంచి రూ.4,000 ఖర్చుపెట్టారు. అయితే ఆగస్టు నెల సగం రోజులు పూర్తవుతున్నా వర్షాల్లేక సాగునీరందకపోవడంతో ఈ ప్రాంతాల్లో చాలాచోట్ల నారుమళ్లు ఎండిపోయి భూములు నోళ్లు తెరిచాయి. చేసేదిలేక రైతులు నారుమళ్లలో పశువులను తోలుతున్నారు. ఇప్పటికే నెలరోజులు అదును తప్పడంతో మళ్లీ నారుమళ్లు పోసినా సమయం చాలదని, ఎక్కడైనా నారు దొరికితే నాట్లు వేస్తాం లేదంటే ఖాళీగా వదిలేస్తామని ఘంటసాల, చల్లపల్లి మండలాలకు చెందిన కొంతమంది రైతులు చెబుతున్నారు. మరోవైపు మొవ్వ, పామర్రు, ఉయ్యూరు, గుడివాడ ప్రాంతాల్లో బోర్ల ఆధారంగా పోసిన నారుమళ్లకు 50 నుంచి 60రోజులు గడిచింది. సాగునీరు లేకపోవడం వల్ల పొలాలు తడవక ఈ ప్రాంతాల్లో చాలాచోట్ల నాట్లు వేయలేదు. ఎక్కువ కాలం ఉన్న ఈ నారుమళ్లు నాట్లు వేసేందుకు ఉపయోగపడకుండా పోతుండడంతో ఈ ప్రాంత రైతులకు దిక్కుతోచడం లేదు. కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయం... దివిసీమతో పాటు తూర్పు కృష్ణాలో ఈ ఏడాది ఎకరం పొలానికి 12 బస్తాల నుంచి 20 బస్తాల కౌలు ఇచ్చేందుకు రైతులు ఒప్పందం కుదుర్చుకున్నారు. కొన్నిచోట్ల పొలాలు ఇవ్వరేమోనని భయపడిన కొంతమంది కౌలు రైతులు బయట అందినకాడికి అప్పులు తెచ్చి ముందుగానే కౌలు చెల్లించారు. పోసిన నారుమళ్లకు నీరందక ఎండిపోతుండటంతో కౌలు రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో నాట్లు వేయలేమని రైతులు చేతులెత్తేస్తున్నారు. రెండోపంట మినుము, మొక్కజొన్నపై ఆశపెట్టుకుని పెద్ద మొత్తంలో కౌలుకు తీసుకుని సాగుచేసేందుకు ప్రయత్నించిన కౌలురైతులు నారుమళ్లు ఎండిపోయి చనిపోవడంతో రెండోపంటకు సమయం చాలక కౌలుకు తీసుకున్న పొలాలను వదిలేస్తున్నారు. ఇకముందు సాగునీరందినా నాట్లు వేసే పరిస్థితిలేక పోవడంతో ఈ ఏడాది వేలాది ఎకరాల్లో నాట్లు పడే అవకాశం లేదు. దీంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా తూర్పుకృష్ణాలో కరువు తాండవించే పరిస్థితులు కనబడుతున్నాయి. తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. చేసేది లేక పశువులకు మేపుతున్నాం ఎకరం పొలంలో వరినాట్లు వేసేందుకు నారుమడి పోశాము. సాగునీరు అందకపోవడంతో ఆయిల్ ఇంజన్తో మడిపోశాం. ఎండలు మండిపోవడం, సాగునీరందకపోవడంతో నారుమడి ఎండిపోయి చనిపోయింది. చేసేదిలేక పశువులకు మేపుతున్నాం. కంటి పాపలా కాపాడుకున్న నారుమడిని పశువులకు మేపుతుంటే కడుపు తరుక్కుపోతుంది. - కోరుకొండ ధనలక్ష్మీ, రైతు, రామానగరం, చల్లపల్లి సాగు వదిలేయాల్సిందే... ఎకరానికి ఇరవై వేలు కాడికి నాలుగెకరాలు కౌలుకు తీసుకున్నాను. ఆయిల్ ఇంజన్లతో నారుమళ్లు పోశాను. తరువాత రెండుసార్లు తడుపులు చేశాను. అయినా నారుమడి ఎండిపోయి చనిపోయింది. నాటేయడానికి పనికిరాదు. ప్రస్తుత పరిస్థితుల్లో నారు ఎక్కడా దొరకదు. ఈ ఏడాది వదిలేయడం తప్ప ఏమీ చేయలేం. - గుమ్మడి భీమారావు, పుచ్చగడ్డ, చల్లపల్లి మండలం -
పశువులు భద్రం
లక్సెట్టిపేట : పశు సంపద మానవులకు ఎన్నో విధాలుగా మేలు చేస్తూ లాభాలనిస్తోంది. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. కాలం, వాతావరణాన్ని బట్టి మానవుల మాదిరిగానే పశువుల్లోనూ వ్యాధులు వస్తుంటాయి. సీజనల్ వ్యాధులపై జాగ్రత్త వహించాలి. సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు, ఇతర వ్యాధుల బారి నుంచి వాటిని కాపాడుకోవాలి. పశువులకు సీజనల్గా వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండి తొలిదశలోనే గుర్తిస్తే నివారణ సులభమని లక్సెట్టిపే పశు వైద్యాధికారి వీరయ్య వివరించారు. వర్షాకాలంలో పరిసరాల ప్రభావం, వరద నీళ్లు, మెలిచిన పసక గడ్డిపైన ఉండే కీటకాలు, అటువంటి మేత తినడం వల్ల గేదెలు, మేకలు, గొర్రెలు, రకరకాల పశువులకు పలురకాల వ్యాధులు సోకి అనారోగ్యానికి గురవుతాయి. దీని వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి అంటువ్యాధుల బారిన పడి చివరకు చనిపోయే ప్రమాదం ఉంటుంది. వ్యాధులు.. నివారణ.. గొంతు వాపు వ్యాధి : ఈ వ్యాధిని గురకవ్యాధి అని కూడా పిలుస్తారు. వర్షాకాలంలో పశువులకు సూక్ష్మ జీవుల వలన సంక్రమిస్తుంది. కలుషితమైన నీరు, మేత ద్వారా రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధి బారిన పడుతాయి. ఇది అంటువ్యాధిగా ఇతర పశువులకు సోకుతుంది. గొంతు కిందకు నీరు దిగి గొంతువాపు వస్తుంది. నోటి నుంచి చొంగకారుస్తూ, గురక, శ్వాస పీల్చడం కష్టమవుతుంది. కళ్లు వస్తాయి. నివారణ : వర్షాకాలం ముందు జూన్, జూలైలో వ్యాధి నిరోధక టీకాలు చేయించాలి. వ్యాధి ఉన్న పశువుల దొడ్డిని క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయాలి. ఇతర పశువుల కు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సమీప పశువుల వైద్యాధికారిని సంప్రదించాలి. గాలి కుంటు వ్యాధి : ఇది వైరస్ సోకడం లేదా కలుషితమైన గాలి ద్వారా వస్తుంది. తల్లిపాల ద్వారా దూడలకు వచ్చే అవకాశం ఉంటుంది. జ్వరం ఉంటుంది. నోరు గిట్టల మధ్య బొబ్బలు, నోటి నుంచి సొంగ కారడం జరుగుతుంది. నివారణ : నోటిలోని పుండ్లకు బోరిక్ పౌడర్, గ్లిజరిన్ కలిపి రాయాలి. గిట్టల మధ్య పుండ్లకు పరమాంగనెట్ ద్రావణంతో శుభ్రం చేసి వేపనూనె రాయాలి. దీనితో గాలికుంటు వ్యాధులను నివారించవచ్చు. గొర్రెలలో నీలినాలుక వ్యాధి : గ్రామాల్లో చాలామంది గొర్రెలను మేపుతూ వాటిపైనే జీవనోపాధి పొందుతారు. గొర్రెల్లో వచ్చే వ్యాధులలో చాలా ముఖ్యమైన వ్యాధి నీలినాలుక వ్యాధి. దీనినె మూతి వాపు వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి దోమకాటు వలన వస్తుంది. ఈ వ్యాధి సోకిన గొర్రె మేత వేయడం మానేస్తాయి. నెమరు వేయదు. జ్వరం ఉంటుంది. నాలుక వాచి నీలి రంగుగా మారుతుంది. కాళ్ల గిట్టలు వాచి పుండ్లు అవుతాయి. ఆహారం తీసుకోకపోవడంతో ఆరోగ్యం క్షీణించి వారం రోజులలో చనిపోతాయి. నివారణ : వ్యాధి సోకిన గొర్రెలను సకాలంలో గుర్తించి వైద్యులతో చికిత్స చేయించాలి. నోటిపుండ్లను ఒక శాతం బోరిక్ యాసిడ్ లోషన్తో శుభ్రం చేయాలి. రెండు శాతం బొరిగ్లిసరిన్ పూయాలి. గొర్రెలు ఆకలితో చనిపోకుండా ఉండేందుకు జావలాంటిది అందించాలి. వైద్యుల సలహాతో యాంటిబయోటెక్ ఇంజక్షన్ ఇప్పించాలి. -
పాడికి ఆధారం పచ్చిమేతే!
పాడి-పంట కడప అగ్రికల్చర్: పాడికి ఆధారం పచ్చిమేతే అన్నారు పెద్దలు. పచ్చిమేత లేనిదే పాడి లాభసాటి కాదు. కేవలం చొప్ప పైన మాత్రమే ఆధారపడితే ప్రయోజనం ఉండ దు. పచ్చిమేత మేపితే పశువులు ఆరోగ్యంగా ఉంటా యి. సకాలంలో ఎదకు వచ్చి చూలు కడతాయి. పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. అయితే ఒక్క వర్షాకాలం లో మినహా మిగిలిన అన్ని కాలాలలోనూ పాడి రైతులు తగినంత పశుగ్రాసం లభించక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. దీనికి కారణం... పాడి పశువులకు కావాల్సిన పచ్చిమేతలో కేవలం మూడో వంతు మాత్రమే అందుబాటులో ఉండడం. ఈ పరిస్థితిని అధిగమించాలంటే రైతు లు విధిగా పశుగ్రాస పైర్లు వేసుకోవాలి. ప్రస్తుతం అడపాదడపా కురుస్తున్న వర్షాలు పశుగ్రాసాల సాగుకు అనువుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పచ్చిమేతల సాగుపై వైఎస్ఆర్ జిల్లా పశు గణాభివృద్ధి శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ హేమంత్ కుమార్ అందిస్తున్న సూచనలు... ఎలా ఉండాలి? మనం పండించే పశుగ్రాస పైరు రుచికరంగా, ఎక్కువ మాంసకృత్తులను కలిగి ఉండాలి. పశువులకు ఏ మాత్రం హాని కలిగించకుం డా, సులభంగా జీర్ణం కావాలి. తక్కువ కాలంలో, ఎక్కువ దిగుబడిని ఇవ్వగలగాలి. ఎరువుల అవసరం తక్కువ ఉండే పశుగ్రాసాన్ని ఎంచుకోవాలి. కోసిన తర్వాత నిల్వకు అనువుగా ఉండాలి. పశుగ్రాసాలు రెండు రకాలు. అవి ధాన్యపు జాతి పశుగ్రాసాలు, కాయ జాతి పశుగ్రాసాలు. ధాన్యపు జాతి పశుగ్రాసాల్లో పిండి పదార్థాలు, కాయ జాతి పశుగ్రాసాల్లో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. పంటకాలాన్ని బట్టి పశుగ్రాసాలను ఏక వార్షికాలు, బహు వార్షికాలుగా విభజించారు. రైతులు తమకు అనువైన పశుగ్రాసాన్ని ఎంచుకొని సాగు చేయాలి. ఇవి ధాన్యపు జాతి పచ్చిమేతలు మొక్కజొన్న, సజ్జ వంటివి ధాన్యపు జాతికి చెందిన ఏక వార్షిక పచ్చిమేతలు. మొక్కజొన్న పైరు రుచికరంగా, ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది. ఎకరానికి 16-20 కిలోల విత్తనాలు వేసుకుంటే 70 రోజులకు 12-16 టన్నుల గ్రాసాన్ని ఇస్తుంది. అధిక పాల ఉత్పత్తి పొందడానికి, సైలేజీ (పాతర గడ్డి)కి బాగా అనువుగా ఉంటుంది. సజ్జను పశుగ్రాసంగా సాగు చేయాలనుకుంటే ఎకరానికి 5 కిలోల విత్తనాలు కావాలి. ఇందులో అలసంద, పిల్లిపెసరను కూడా మిశ్రమ పంటగా వేసుకోవచ్చు. ఈ పైరు 40 రోజులలో కోతకు వస్తుంది. 10-12 టన్నుల దిగుబడి ఇస్తుంది. బెట్ట పరిస్థితులను తట్టుకొని మంచి దిగుబడులను అందిస్తుంది. కాయ జాతి పచ్చిమేతలు ఇవే పిల్లిపెసర, లూసర్న్ గడ్డి, అలసంద వంటివి కాయ జాతి పచ్చిమేతలు. పిల్లిపెసర సాగుకు ఎకరానికి 10 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. ఇది బలవర్ధకమైన పశుగ్రాసం. పాల దిగుబడి బాగుంటుంది. 50 రోజులకు ఒకసారి చొప్పున రెండు కోతలు తీసుకోవచ్చు. 8-10 టన్నుల పచ్చిమేత వస్తుంది.లూసర్న్ గడ్డి మొక్క 80 సెంటీమీటర్ల ఎత్తు వరకూ పెరుగుతుంది. ఎకరానికి 3-5 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. 50 రోజులకు ఒకసారి చొప్పున ఐదు కోతలు తీసుకోవచ్చు. 8-10 టన్నుల దిగుబడి వస్తుంది. ఇక అలసంద మొక్కలోని అన్ని భాగాలూ పశువులు తినడానికి ఉపయోగపడేవే. ఎకరానికి 12-15 కిలోల విత్తనాలు వేసుకుంటే 65 రోజుల్లో కోతకు వచ్చి 6-8 టన్నుల గ్రాసాన్ని అందిస్తుంది. మిశ్రమ పంటగా వేస్తే 6 కిలోల విత్తనాలు సరిపోతాయి. ఇవి కూడా... మెట్ట/బంజరు భూములకు అనువైన పశుగ్రాసం అంజన్ గడ్డి. ఇది నల్లరేగడి భూముల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఎకరానికి 2- 3 కిలోల విత్తనాలు సరిపోతాయి. పైరు వేసిన 80 రోజులకు మొ దటి కోత కోసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతి 60 రోజులకూ పచ్చిమేతను పొందవచ్చు. ఈ పైరు 15-20 టన్నుల పచ్చిమేతను అం దిస్తుంది. మాగాణి, మెట్ట ప్రాంతాలకు అనువైన పశుగ్రాసపు చెట్టు అవిశ. దీని ఆకులు, కొమ్మలు పశువులకు మంచి పోషకాల తో కూడిన ఆహారాన్ని ఇస్తాయి. ఎకరానికి 5 వేల మొక్కలు నాటా లి. 60 రోజులకు ఒకసారి చొప్పున 8 సార్లు ఆకులు, కొమ్మలు కోసుకోవచ్చు. ఎకరానికి 15-20 టన్నుల దిగుబడి లభిస్తుంది. ఇక సుబాబుల్ చెట్టు ఆకులే కాకుండా కొమ్మలను కూడా పశువులు ఇష్టంగా తింటాయి. ఎకరానికి 2-4 వేల మొక్కలు వేసుకోవాలి. ఆరు నెలలకు మొదటి కోత తీసుకోవచ్చు. అనంతరం 60 రోజులకు ఒకసారి చొప్పున 6 కోతలు కోసుకోవచ్చు. 15-20 టన్నుల దిగుబడి వస్తుంది. ఏ పశుగ్రాసమైనా దానిని ఛాప్ కట్టర్తో చిన్న చిన్న ముక్కలుగా కోసి పశువులకు వేస్తే వృథా కాదు. పచ్చిమేతపై కొద్దిగా బెల్లపు నీటిని చల్లితే పశువులు ఇష్టంగా తింటాయి. -
అశ్రద్ధ చేస్తే ప్రాణం పోతుంది
పాడి-పంట: జి.కొండూరు (కృష్ణా) : వర్షాకాలం వచ్చిందంటే చాలు... పశు పోషకులు కలవరపడుతుంటారు. ఎందుకంటే ఈ సీజన్లో పశువులు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సూక్ష్మజీవుల కారణంగా గొంతువాపు, జబ్బవాపు వంటి వ్యాధులు సోకడంతో పాటు ఈగలు, దోమల దాడి కూడా పెరుగుతుంది. ఈ సమస్యలను అధిగమించేందుకు రైతులు సకాలంలో తగిన యాజమాన్య చర్యలు చేపట్టాలని, పశువులకు వైద్య చికిత్సను అందించాలని సూచిస్తున్నారు కృష్ణా జిల్లా జి.కొండూరు మండల పశు వైద్యాధికారి డాక్టర్ కె.నరసింహారావు. ఆ వివరాలు... లేత గడ్డి ప్రమాదం తొలకరి వర్షాలకు మొలిచే లేత గడ్డి మొక్కలను పశువులు ఆబగా తింటుంటాయి. అయితే ఎదిగీ ఎదగని లేత గడ్డిలో హైడ్రో సైనైడ్ అనే విష పదార్థం ఉంటుంది. ఇలాంటి గడ్డిని మేసిన 15 నిమిషాలకే పశువులో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. వెంటనే తగిన చికిత్స చేయించకపోతే పశువు మృత్యువాత పడే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులు సాధ్యమైనంత వరకూ పచ్చిక బయళ్లలో పశువులకు లేత గడ్డిని అతిగా మేపకుండా ఉండడమే మంచిది. గురక వ్యాధి సోకితే... వర్షాకాలంలో పశువులకు సోకే ప్రాణాంతక వ్యాధుల్లో గొంతువాపు (గురక) ఒకటి. ముఖ్యంగా వయసులో ఉన్న గేదె జాతి పశువుల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వ్యాధి సోకిన పశువుకు అకస్మాత్తుగా అధిక జ్వరం వస్తుంది. పశువు మేత మేయదు. గొంతు పైన, మెడ కింద వాపు కన్పిస్తుంది. పశువు ఆయాసపడుతూ శ్వాస పీల్చుకుంటుంది. ఆ సమయంలో గురక శబ్దం వస్తుంది. నోరు, ముక్కు నుంచి ద్రవం కారుతుంది. పశువు వణుకుతూ ఉంటుంది. కళ్లు ఎర్రబడి నీరు కారుతుంటుంది. పాడి పశువుల్లో పాల దిగుబడి తగ్గుతుంది. వ్యాధి తీవ్రత ఎక్కువైతే పశువు ఎడతెరిపి లేకుండా దగ్గుతూ, చివరికి అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోతుంది. వ్యాధి సోకిన పశువును వెంటనే మంద నుంచి వేరు చేయాలి. దాని మలమూత్రాలను, అది తినగా మిగిలిన గడ్డిని తీసి కాల్చేయాలి. పశువుల పాక/షెడ్డును ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. వ్యాధి సోకిన పశువు మరణిస్తే ఊరికి దూరంగా తీసికెళ్లి, గొయ్యి తవ్వి, అందులో సున్నం వేసి పూడ్చేయాలి. గురక వ్యాధి లక్షణాలు కన్పించిన వెంటనే పశు వైద్యుడి సలహా మేరకు పశువుకు గ్లూకోజ్, యాంటి బయటిక్ మందు, నెప్పి నివారణ మందు ఇవ్వాలి. ఎంత త్వరగా వైద్యం చేయిస్తే పశువు అంత త్వరగా కోలుకుంటుంది. వ్యాధి ముదిరిన తర్వాత చికిత్స చేసినా ఫలితం ఉండదు. జబ్బ వాపూ ప్రమాదమే వయసులో ఉన్న ఆరోగ్యవంతమైన పశువుల్లోనూ, తెల్ల జాతి పశువుల్లోనూ జబ్బవాపు వ్యాధి ఎక్కువగా కన్పిస్తుంది. వ్యాధి సోకిన పశువు అధిక జ్వరంతో బాధపడుతుంది. మేత మేయకుండా పడుకొని ఉంటుంది. జబ్బ భాగం వాచి, నల్లగా కములుతుంది. అక్కడ కండరాలు ఉబ్బుతాయి. వాటిలో గాలి బుడగలు, నీరు చేరి పశువు తీవ్రమైన నెప్పితో బాధపడుతుంది. వాచిన చోట చేతితో తాకితే గరగరమని శబ్దం వస్తుంది. సకాలంలో వైద్యం అందకపోతే పశువు నీరసించి, చనిపోతుంది. వ్యాధి సోకిన పశువుకు పశు వైద్యుని సలహా మేరకు పెన్సిలిన్ మందు ఇవ్వాలి. నెప్పి, జ్వర నివారణ మందులతో పాటు రక్తనాళాల ద్వారా గ్లూకోజ్ ద్రావణాన్ని అందించాలి. గురక, జబ్బ వ్యాధులు సోకకుండా రైతులు ముందుగానే పశువులకు టీకాలు వేయించడం మంచిది. వ్యాధి సోకిన వెంటనే అశ్రద్ధ చేయకుండా పశు వైద్యశాలకు తీసికెళ్లి తగిన చికిత్స చేయించాలి. ఈగలు-దోమలు దాడి చేస్తే... నేల చిత్తడిగా-వాతావరణం అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశంలో, నీరు నిల్వ ఉన్న గుంతల్లో, మురుగు నీటి కాలువల్లో ఈగలు, దోమలు ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. ఇవి ఆహారం కోసం పశువులను పట్టి పీడిస్తుంటాయి. వర్షాకాలంలో వీటి తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈగలు, దోమలు పశువుల శరీరంపై వాలి రక్తాన్ని పీలుస్తాయి. వీటి తాకిడి కారణంగా పశువులు పడుకోలేవు... నిలబడలేవు. వాటిని వదిలించుకోవడానికి తోకను అటూ ఇటూ కొట్టుకుంటూ, చెవులు ఊపుతూ అసహనానికి గురవుతాయి. కడుపు నిండా మేత మేయలేవు. ఫలితంగా పశువులు రక్తహీనతకు లోనవుతాయి. ఈగలు, దోమల కాటు వల్ల పశువు శరీరంపై పుండ్లు పడతాయి. వీటి ద్వారా సూక్ష్మక్రిములు పశువు శరీరంలో ప్రవేశించి ఇతర వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. పాడి పశువుల్లో పాల దిగుబడి తగ్గుతుంది. పశువులకు అంటువ్యాధులు వచ్చే ప్రమాదమూ ఉంది. ఏం చేయాలి? ఈగలు, దోమల నివారణకు నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో కిరోసిన్ను పిచికారీ చేయాలి. మురుగు నీరు చేరే చోటును, చిత్తడి ప్రదేశాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ బ్లీచింగ్ పొడి చల్లాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో పశువుల పాకలో ఎండు పిడకలు, వేపాకుతో పొగ పెట్టాలి. వైద్యుల సలహా మేరకు పశువు శరీరంపై కీటక నాశనులను పిచికారీ చేయాలి. సాయంకాలం వేళ పశువుల శరీరంపై వేపనూనె రాయాలి. అలాగే వేపాకు, పసుపు కలిపి మెత్తగా నూరి శరీరానికి పట్టించాలి. -
అంతరిస్తున్న పశు సంపద
వరుస కరువుతో గ్రాసం కొరత కబ్జాలకు గురైన మందబయళ్లు, చెరువు భూములు పాడి పరిశ్రమకు అమలు కాని ప్రణాళికలు ఆందోళనలో అన్నదాతలు తిరుపతి స్పోర్ట్స్ : వ్యవసాయ ప్రధానమైన మన జిల్లాలో రోజురోజుకూ పశు సంపద అంతరిస్తోంది. మందబయళ్లు, చెరువులు ఆక్రమణలకు గురికావడం, పశుపోషణ రైతులకు భారంగా మారడం, పాలకులు పాడిని పట్టించుకోకపోవడంతో అరుదైన పశుసంపద సైతం అంతరించిపోతోంది. కాడెద్దులుంటే గౌరవం.. పొలాన్ని దుక్కి చేయాలంటే ఎద్దులుండాలి. పొలానికి ఎరువు తోలాలన్నా, విత్తు వేయాలన్నా, పంట దిగుబడిని ఇంటికి చేర్చాలన్నా.. పశువులు తప్పనిసరి. రైతుల జీవితంతో పశువుల అనుబంధం అంతగా పెనవేసుకుపోయింది. ఇదంతా గతం. ఇప్పుడు కాడెద్దులు లేవు.. వ్యవసాయ పనులు మాత్రం సాగుతున్నాయి. ఈ పనులకు ఆధునిక యంత్రాలు వచ్చాయి. ట్రాక్టర్ వాడకం పెరిగాక దాదాపుగా వ్యవసాయ పనుల్లో పశువుల అవసరం బాగా తగ్గింది. జిల్లాలో అధిక భాగం వ్యవసాయం వర్షాధారంతోనే సాగవుతోంది. ఏడాదికి ఒక పంట మాత్రమే చేతికొస్తుంది. అంటే, రైతులకు ఆరునెలలు పని ఉంటుంది. మిగతా ఆరు నెలలు ఖాళీ. ఇలాంటి వారంతా దుక్కులు చేయడానికి, గింజలు వేయడానికి ట్రాక్టర్నే ఉపయోగిస్తున్నారు. ఈ రెండు పనులకోసం సంవత్సరం పొడవుకూ వీటిని పో షించడం రైతులకు భారంగా మారింది. ఈ నేపథ్యంలో పశువుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. 1957లో ప్రతి 1000 మందికి 1800 పశువులు ఉండేవి. 2014 గణాంకాల ప్రకారం ప్రతి 1000 మందికి 186 పశువులు మాత్రమే మిగిలాయంటే ఇవి ఎంతగా అంతరించిపోయాయో తెలుస్తోంది. అరుదైన పశువులూ అంతరించాయి.. యంత్రాల వాడకం పెరిగాక, పశుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అయితే పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలోనే ఎంతో పేరున్న మన జిల్లాకు చెందిన పుంగనూరు పశువులు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఇటీవల పుంగనూరు ప్రాంతానికి చెందిన ఒక రైతు క ర్ణాటక ప్రాంతానికి వెళ్లి ఈ ఆవును కొనుగోలు చేసుకుని వచ్చారు. ఇటీవల ఈ జాతి పశువులను సంరక్షించడం కోసం పశువైద్య విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. పాడి ఆదుకుంటున్నా... అదునుకు వాన లేక, బోరుబావుల్లో నీళ్లు లేక, పంటలు సాగు కాక అల్లాడుతున్న జిల్లా రైతాంగం పాలిట పాడిపరిశ్రమ వరంలా మారింది. చాలా మంది సన్న చిన్నకారు రైతులు ఆవులను పట్టుకుని వాటి నుంచి వచ్చే పాల దిగుబడితో కుటుంబాన్ని నెట్టుకు రావడం ప్రారంభించారు. వీటికి మేతకోసం ఉండే మందబయళ్లు క్రమేణా ఆక్రమణకు గురయ్యాయి. పశుగ్రాసం దొరకడం కష్టంగా మారింది. దాణా ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో పాడి రైతులకు పాలదిగుబడి కంటే పశుపోషణే ఎక్కువ ఖర్చుగా మారింది. ఈ నేపథ్యంలో జిల్లాలో పశువుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఇప్పటికైనా పశుసంవర్ధక శాఖ, పాలకులు పట్టించుకుని జిల్లాలో పాడి వృద్ధికి ప్రణాళికలు అమలు చేయాలని జిల్లా రైతాంగం కోరుతోంది. పాల ఉత్పత్తి తగ్గలేదు పశువుల సంఖ్య తగ్గిందే కానీ పాల ఉత్పత్తి తగ్గలేదు. పూటకు నాలుగులీటర్ల పాలు ఇచ్చే నాలుగు వాటికి బదులు ఎనిమిది లీటర్ల పాలు ఇచ్చే ఆవులు రెండు ఉంటే చాలనుకుంటున్నారు. పశుగణాభివృద్ధి ప్రకారం 40 సంవత్సరాల నుంచి పాల ఉత్పత్తి తగ్గలేదు. చూలు కట్టని ఆవులకు కూడా చూలు నిలిచేవిధంగా ‘సుఫలం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. - శ్రీనివాసరావు, జేడీ, పశుసంవర్ధక శాఖ -
నివృత్తం: పూజామందిరంలో కలశాన్ని ఎందుకు స్థాపిస్తారు?
ఇలా చేయమని శాస్త్రాలే చెబుతున్నాయి. కలశ ముఖంలో విష్ణుమూర్తి, కంఠభాగంలో శివుడు, మూల భాగంలో బ్రహ్మ, మధ్యభాగంలో మాతృగణాలు ఉంటారట. కలశంలోని జలాల్లో సాగరాలు, సప్తద్వీపాలతో కూడిన భూమి, వేద వేదాంగాలు, సమస్త దేవతలూ ఆశ్రయించి ఉంటారట. సమస్త పాపాలనూ తొలగించి దీవించేందుకు వారంతా దిగి రావాలని కోరుతూ కలశాన్ని స్థాపించాలని చెబుతారు. అది మాత్రమే కాక... మానవ జీవితాన్ని నిండు కుండతో పోలుస్తారు. అంటే అది ప్రాణానికి ప్రతీక అన్నమాట. అందువల్ల శుభ సందర్భాల్లో కలశ పూజ చేయడం వల్ల ఆయురారోగ్యాలు చేకూరుతాయని చెబుతారు. (సన్నని మూతి కలిగి, నీటితో నింపిన పాత్రను కలశం అంటారు). లంక మేత గోదారి ఈతకు సరిపోయినట్టు... నదుల మధ్యలో ఉండే భూమిని లంక అంటారు. గోదావరి జిల్లాల్లో ఇలాంటి లంకలు చాలానే ఉన్నాయి. ఆ జిల్లాల్లోని గ్రామస్తులు చాలామందికి పశువులు ఉంటాయి. వాటిని పాలేళ్లు గోదారి గట్టున మేపుతుంటారు. ఒక్కోసారి మేత సరిపోక... లంకల్లో ఉండే గడ్డి తినడానికి అక్కడికి తోలుకు పోతుంటారు. పశువులు కడుపుల నిండా మేత మేశాక తిరిగి ఒడ్డుకు తీసుకు వస్తారు. అయితే అవి తిన్నదంతా ఒడ్డుకు ఈదుకొచ్చేలోపు అరిగిపోతుంది. దాంతో వాటికి మళ్లీ ఆకలేస్తుంది. ఈ పరిస్థితిలోంచి పుట్టిందే ఈ సామెత. కొందరు చిన్న ప్రతిఫలం కోసం చాలా ఎక్కువ కష్టపడిపోతుంటారు. తీరా అంత చేశాక వీరికి మిగిలేదేమీ ఉండదు. అలాంటప్పుడు ‘లంక మేత గోదారి ఈతకు సరిపోయినట్టు’ అయ్యింది వీడి పని అంటూ పరిహాసమాడుతుంటారు! -
ఇది ‘పాడి’యేనా..!
పెరిగిన ఎండలతో కరువైన పశుగ్రాసం విలవిల్లాడుతున్న పశువులు జిల్లాలో 20 శాతం తగ్గిన పాల దిగుబడి వేసవికి లేని ప్రత్యేక ప్రణాళిక నివేదికలతో సరిపెడుతున్న ప్రభుత్వాలు పాడి పంట అన్నారు పెద్దలు..పంటపోతే పాడి ఆదుకుంటుంది. ఆరుగాలం ఇంటిల్లిపాదీ కష్టించినా, వ్యవసాయం కలిసిరావడం లేదు. ఎంత ఎక్కువ సేద్యం చేపడితే అంత ఎక్కువ అప్పుల్లో రైతు కూరుకుపోతున్నాడు. ఈ పరిస్థితుల్లో అన్నదాతలు పాడివైపు ఆసక్తి చూపుతున్నారు. పశుపోషణ చేపడుతున్నారు. క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే ఏకైక మార్గమైన పాడికి నేడు గడ్డు పరిస్థితులు దాపురించాయి. ప్రభుత్వ ఉదాశీనత కారణంగా ఈ రంగం కూడా రైతుకు ఆదరవు కాకుండా పోతోంది. మరో పక్క ఎండలు పెరగడంతో పశుగ్రాసం కొరత ఏర్పడి పరోక్షంగా పాల దిగుబడిపై ప్రభావం చూపుతోంది. నర్సీపట్నం/యలమంచిలి: పాడిపరిశ్రమపై ఎండల ప్రభావం కనబడుతోంది. పశుగ్రాసం కొరతతో మూగజీవాలు అల్లాడుతున్నాయి. వాటిపోషణకు అన్నదాతలు అష్టక ష్టాలు పడుతున్నారు. వేలాది కుటుంబాలను ఆదుకుంటున్న పాడిపరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. జిల్లా వ్యాప్తంగా ఆవులు నాలుగు లక్షలు, గేదెలు రెండు లక్షల వరకు ఉంటాయి. వీటిలో 50 శాతం పశువులు పాల దిగుబడిని ఇస్తుంటాయి. వీటి నుంచి రోజుకు లక్షల లీటర్ల వరకు పాల దిగుబడి వస్తుంది. విశాఖ డెయిరీ, సుప్రజ, హెరిటేజ్, తిరుమల డెయిరీలు రైతుల నుంచి పాలు సేకరించి, వివిధ రకాలైన ఉత్పత్తుల ద్వారా అమ్మకాలు చేస్తుంటారు. ఎండల తీవ్రత, వర్షాభావం కారణంగా విశాఖ డెయిరీ పాలసేకరణ జూన్ 5 నాటికి 7.02లక్షల లీటర్లు ఉండగా, ప్రస్తుతం 6.66లక్షల లీటర్లకు దిగజారింది. జిల్లాలోని పలు ప్రైవేట్ డెయిరీలలోనూ ఇదే పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా పశువులకు రోజుకు 1.25 లక్షల క్వింటాళ్ల పశుగ్రాసం అవసరమవుతుంది. రైతులు మెట్టభూముల్లోనే పశుగ్రాసం పెంపకం చేపడతారు. వర్షాభావంతో పంటపొలాలు బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. అంతటా పశుగ్రాసం కొరత ఏర్పడింది. మార్కెట్లోదాణా ధరలు అందుబాటులో లేకుండాపోయాయి. కనీసం పశువులకు తాగునీరు కూడా అందించలేకపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా పాలసేకరణ చేస్తున్న యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో పాల దిగుబడి తగ్గిపోయింది. విశాఖ డెయిరీకి రోజుకు రెండువేల లీటర్ల వరకు సరఫరా చేస్తున్న పలు పాల సేకరణ కేంద్రాలకు ప్రస్తుతం వెయ్యి లీటర్లకు మించి రావడం లేదు. వ్యవసాయం కలిసిరాకపోవడంతో ఎక్కువమం ది రైతులు పాడిపరిశ్రమపైనే ఆధారపడుతున్నారు. ఒక్కొక్క కుటుంబానికి రెండు నుంచి మూడు పశువులు ఉంటున్నాయి. ఇక పల్లెల్లో పలువురు యువకులు పాడిపడిశ్రమ ద్వారా ఉపాధి పొందుతున్నారు. గత కొద్ది రోజులుగా పలువురు రైతులు ఎండలకు భయపడి ఇళ్లవద్దనే అందుబాటులో ఉన్న ఎండుగడ్డితో కాలం నెట్టుకొస్తున్నారు. ఇప్పటికే బహిరంగ మార్కెట్లో కిలో తౌడు రూ.10ల నుంచి రూ.15లు, నూకలు రూ.20నుంచి రూ.25ల వరకు ఉండడంతో దాణా కొనుగోలు రైతులకు ఆర్థిక భారంగా మారింది. విశాఖ డెయిరీ ద్వారా సరఫరా చేసే దాణా ధరలు కూ డా నెలన్నర క్రితం పెంచేశారు. ప్రస్తుతం 50 కిలోల దాణా రు.550లకు రైతులకు పంపిణీచేస్తున్నారు. జిల్లాలో పలు పాల సేకరణ కేంద్రాల్లో గత 20రోజులుగా దాణా అందుబాటులో లేకపోవడంతో రైతు లు ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా పాలదిగుబడిపై ప్రభావం కనబడుతోంది. పూటకు రెండు లీటర్ల వరకు పాలిచ్చే పశువు లీటరుకంటే తక్కువ ఇస్తోందని చెబుతున్నారు. దీంతో రోజువారీ ఆదా యం తగ్గి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామన్నారు. వేసవి ప్రణాళిక ఏదీ? జిల్లాలో అధికశాతం వర్షాధార భూములు కావడంతో ఏటా వేసవిలో పశుగ్రాసానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితుల్లో పాడి రైతులకు రాయితీపై ఎండుగడ్డిని సరఫరా చేసేవారు. ఈ ఏడాది అటువంటి ప్రణాళికకు ప్రభుత్వం స్వస్తి పలికింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం కాస్తున్న ఎండలపై స్పందించిన ప్రభుత్వం నివేదిక ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న పశువులకు ఎంత గ్రాసం అవసరముంది? అందుబాటులో ఎంత ఉంది? ఎంత మేర అవసరం? అనే దానిపై పూర్తి వివరాలివ్వాలంటూ ఆదేశించింది. దీనిపై వెటర్నరీ జేడీ వి.వెంకటేశ్వరావు మాట్లాడుతూ వేసవిలో గ్రాసం కొరతపై నిల్వ విధానాన్ని అలవాటు చేసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రస్తుతమున్న పశుగ్రాసం కొరతపై ప్రభుత్వానికి నివేదించి, వారి ఆదేశం మేరకు తదుపరి చర్యలు చేపడతామని వివరించారు. -
పశువులకు వీటి అవసరమూ ఉంటుంది!
పాడి-పంట: ఖనిజ లవణాల లోపం కారణంగా పశువులు అనేక సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. వాటిలో ఆలస్యంగా ఎదకు రావడం, తిరిగి పొర్లడం, గొడ్డుమోతుతనం ప్రధానమైనవి. పునరుత్పత్తి సమస్యలు కూడా ఎదురైతే ఈతల మధ్య అంతరం పెరుగుతుంది. అలాంటప్పుడు పాడి పశువుల పెంపకం లాభసాటిగా ఉండదు. ఆవు జాతి పశువు సంవత్సరానికి ఒక దూడను, గేదె 15 నెలలకు ఒక దూడను అందించగలిగినప్పుడే పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. అలా ఉండాలంటే పశువులకు అవసరమైన ఖనిజాలను విధిగా అందించాలి. పశువులు ఖనిజాలను తమ శరీరంలో ఉత్పత్తి చేసుకోలేవు కాబట్టి వాటిని మేత ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మేత వనరుల్లో ఉండే ఖనిజాలు సైతం పూర్తి స్థాయిలో పశువులకు అందుబాటులో ఉండడం లేదు. ఫలితంగా రికెట్స్, ఆక్టియోమలేసియా, పైకా (విపరీతమైన ఆకలి), గిట్టల పెరుగుదలలో లోపం, చర్మం రంగును కోల్పోవడం, రక్తహీనత, మృత దూడలు పుట్టడం, గొంతువాపు, ఎదుగుదల లోపించడం, పాల దిగుబడి పడిపోవడం, పునరుత్పత్తి సామర్థ్యం తగ్గడం.... ఇలా అనేక ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి. పాడి పశువుకు జన్యుపరంగా అధిక పాల దిగుబడినిచ్చే సామర్థ్యం ఉన్నప్పటికీ సమతుల్యమైన పోషణ లేకపోవడం వల్ల వాటి నుంచి పూర్తి స్థాయిలో ఉత్పాదకతను పొందలేకపోతున్నాము. వీటి అవసరం ఎక్కువ పాలలో 0.12% కాల్షియం, 0.10% భాస్వరం ఉంటాయి. పాడి పశువు శరీరానికి ఇవి తగినంత లభిస్తే పాల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఆవులతో పోలిస్తే గేదెలకు కాల్షియం అవసరం ఎక్కువ. ఎందుకంటే గేదె పాలలో వెన్న శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి మేతలో కొవ్వు పదార్థాలను ఎక్కువగా అందించాలి. అలాగే కొన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉత్పత్తి కావడానికి గంధకం చాలా అవసరం. విటమిన్ల తయారీకి కూడా గంధకం అవసరమవుతుంది. పశువు రక్తంలో కాల్షియం, భాస్వరం సరైన నిష్పత్తిలో ఉండాలి. లేకపోతే ఎముకల్లో నిల్వ ఉండే కాల్షియం రక్తంలోకి చేరుతుంది. అనంతరం ఆ పశువు అందించే పాలను తాగడం ద్వారా మన శరీరంలోకి చేరుతుంది. సాధారణ పశువు ఈనిన తర్వాత పాలజ్వరం, హైపోకాల్షియం (రక్తంలో కాల్షియం తగ్గడం) వంటి లక్షణాలు కన్పిస్తాయి. వీటిని నివారించాలంటే చూడి సమయంలో పశువుకు అదనంగా కాల్షియం ఇవ్వాలి. ఎందుకంటే పాలజ్వరం వచ్చిన పశువుల్లో పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. పాలజ్వరం నుంచి తేరుకున్న తర్వాత పశువుకు పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీనికి ఓ కారణం ఉంది. పాలజ్వరం బారిన పడిన పశువుకు చనుల కండరాలు వదులవుతాయి. సూక్ష్మక్రిములు చనుల రంధ్రాల ద్వారా పొదుగులోకి ప్రవేశించి వ్యాధిని కలిగిస్తాయి. కాబట్టి పశువుకు కాల్షియం, భాస్వరం, సోడియం, పొటాషియం, గంధకం వంటి ఖనిల లవణాల ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. అవసరం తక్కువే అయినా... పశువుకు రాగి (కాపర్), జింక్, మాంగనీస్, అయొడిన్, కోబాల్ట్, క్రోమియం వంటి ఖనిజాల అవసరం కూడా ఉంటుంది. కాకపోతే కాస్త తక్కువ పరిమాణంలో అందిస్తే చాలు. ఇవి కూడా పాల దిగుబడికి దోహదపడతాయి. ఇవి లోపిస్తే పశువులు తక్కువ మేత తింటాయి. బరువు కోల్పోతాయి. పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. ఈనిన తర్వాత మాయ పడదు. పశువు ఈసుకుపోతుంది. దూడలు తక్కువ బరువుతో పుడతాయి. విటమిన్ ‘ఎ’తో జింక్ కలిసినప్పుడు పశువు పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. జననేంద్రియాల కణాల క్రమం ఆరోగ్యంగా ఉంటుంది. ఇక రాగి ధాతువు జననేంద్రియ సంబంధమైన ఓవరీస్ పనితనాన్ని పెంచుతుంది. మాంగనీస్ ఖనిజం చాలా వరకు ఎంజైమ్ రసాయనిక చర్యల్లో పాలుపంచుకుంటుంది. ఈ ఖనిజం లోపిస్తే పశువు శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. పునరుత్పత్తి సమస్యలు ఎదురవుతాయి. పాల దిగుబడి తగ్గుతుంది. పశువు గర్భంలోని దూడ పెరగడానికి అయొడిన్ దోహపడుతుంది. ఇది లోపిస్తే పశువు గర్భంలోనే దూడలు చనిపోతాయి. చూడి పశువు ఈసుకుపోతుంది. పుట్టిన దూడలు కూడా బలహీనంగా ఉంటాయి. మగ పశువుల్లో సంపర్క సామర్థ్యం తగ్గిపోతుంది. ఖనిజాలను పశువు శరీరం ఉత్పత్తి చేయదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో... అంటే అధిక పాల దిగుబడికి, పునరుత్పత్తి సామర్థ్యం పెరగడానికి, ఎదుగుదలకు, జీర్ణ ప్రక్రియ సజావుగా సాగడానికి, వేసవిలో ఒత్తిడి లేకుండా ఉండడానికి విధిగా మేతలో ఖనిజ లవణాలను అందించాల్సి ఉంటుంది. డాక్టర్ ఎం.వి.ఎ.ఎన్.సూర్యనారాయణ సీనియర్ శాస్త్రవేత్త-అధిపతి పశు పరిశోధనా స్థానం, గరివిడి విజయనగరం జిల్లా ఒత్తిడిలో ఎంతో అవసరం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు పశువులు ఒత్తిడికి గురవుతాయి. మేత తినడం తగ్గిపోతుంది. ఫలితంగా పశువులకు ఖనిజాల లభ్యత కూడా తగ్గుతుంది. పశువు తన శరీరంలోని వేడిని చెమట ద్వారా బయటికి పంపుతుంది. అంటే పొటాషియం, సోడియం, మెగ్నీషియం ఖనిజాలను ఎక్కువగా కోల్పోతుందన్న మాట. కాబట్టి వీటిని... ముఖ్యంగా పొటాషియంను మేత ద్వారా అందించాల్సి ఉంటుంది. ఈ ఖనిజం పాలలో 0.15% వరకు ఉంటుంది. అధిక పాల దిగుబడిని అందించే పశువులకు, వేసవిలో ఒత్తిడికి లోనయ్యే పశువులకు ఈ ఖనిజాన్ని తప్పనిసరిగా అందించాలి. ఎండలో పశువు రొప్పుతున్నప్పుడు లాలాజలం ఎక్కువగా బయటికి పోతుంది. దీనితోపాటు శరీరంలోని సోడియం బైకార్బొనేట్ కూడా పోతుంది. దీనిని మేత ద్వారా అందిస్తే పశువు ఆహార అవసరాలు తీరతాయి. -
ఆధునికీకరణ పనుల్లో దగా!
లైనింగ్ పనులు పోయి రిటైనింగ్ వాల్ నిర్మాణాలు అధికారులతో కాంట్రాక్టర్ లాలూచీ రైతులకు ఉపయోగపడని పనులు చల్లపల్లి : కాంట్రాక్టర్లతో అధికారులు లాలూచిపడి ఇష్టారాజ్యంగా ఆధునికీకరణ పనులను మార్చేస్తున్నారు. రైతులకు ఉపయోగపడాల్సిన ఈ పనులు కాంట్రాక్టర్ల జేబులు నింపేవిగా మారాయి. సాగునీటి ఇబ్బందులను తొలగించేందుకు ఆధునికీకరణ పనుల్లో భాగంగా ప్రధాన పంటకాలువలకు లైనింగ్ పనులు చేయాల్సి ఉండగా వాటిని మార్చి రైతులకు ఏవిధంగా ఉపయోగపడని రిటైనింగ్వాల్ నిర్మాణ పనులు చేపట్టడంపట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లైనింగ్పోయి రిటైనింగ్ వచ్చే! రూ.2,180కోట్ల నిధులతో కృష్ణాజిల్లాలో డెల్టాను ఆధునికీకరించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 2008 జూన్ 6న మోపిదేవి వార్పు వద్ద ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. మట్టిపని, లైనింగ్ చేయడం, వంతెనల నిర్మాణం, ఓటీలు, రెగ్యులేటర్లు, క్యాటిల్ ర్యాంపులు, మేజరు, మీడియం డ్రెయిన్ల పూర్తిస్థాయి ఆధునికీకరణ వంటి 25ప్యాకేజీల ద్వారా పనులు చేపట్టాల్సి ఉంది. శంకుస్థాపన నాటి నుంచి 51నెలల్లో పనులు పూర్తిచేయాల్సి ఉన్నప్పటికీ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఈ పనులు నత్తనడకన సాగాయి. పంటకాలువలకు లైనింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. నాలుగు అంగుళాలలోపు మాత్రమే లైనింగ్ పనులకు ప్రభుత్వం అనుమతివ్వడంతో ఈ ప్రాంతంలో ఉన్న నల్లరేగడి నేలలో ఈ పనులు చేపడితే పగిలిపోతాయన్న ఉద్దేశంతో వీటిని రిటైనింగ్వాల్కు మార్చినట్లు అధికారులు చెబుతున్నారు. లైనింగ్ పనులు చేపడితే సాగునీరు వృథాకాకుండా పంటపొలాలకు సక్రమంగా నీరందుతుంది. కోడూరు మండలం దింటిమెరక నుంచి ఊటగుండం వరకు, మచిలీపట్నం మండలంలోని 9/7వ నంబరు కాలువలో పెదయాదర నుంచి పల్లెతుమ్మలపాలెం వరకు లైనింగ్ పనులు చేయాల్సి ఉండగా వాటిని మార్చి రిటైనింగ్వాల్ నిర్మాణ పనులు చేపట్టడంపట్ల ఈ ప్రాంత రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లైనింగ్ పనులు చేయాల్సిన రూ.40కోట్ల నిధులతో ప్రస్తుతం అవనిగడ్డ మండలంలోని పులిగడ్డ నుంచి అవనిగడ్డ వరకు, అవనిగడ్డ నుంచి కొత్తపేట వరకు, బందలాయిచెర్వు నుంచి గుడివాకవారిపాలెం వరకు రిటైనింగ్వాల్ నిర్మాణ పనులు చేస్తున్నారు. వీటి వల్ల తమకు ఎలాంటి ఉపయోగం ఉండదని రైతులంటున్నారు. రైతుల ప్రయోజనం కోసం రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం నేడు కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు ఉపయోగపడుతుందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. కోడూరు మండలం దింటిమెరక నుంచి ఊటగుండం వరకు 14, 14బీ కాలువకు 8కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు చేపట్టాల్సి ఉండగా రెండేళ్ల క్రితం దింటిమెరక మొదట్లో రెండు కిలోమీటర్లు లైనింగ్ పనులుచేసి తర్వాత రెండు కిలోమీటర్లు వదిలేశారు. దీని తర్వాత రామకృష్ణాపురంలో 14వ నెంబరు బీ కాలువలో మొదట్లో రెండు కిలోమీటర్లు లైనింగ్ పనులుచేసి తర్వాత రెండు కిలోమీటర్లు వదిలేశారు. ఇలా పూర్తిస్థాయిలో లైనింగ్ పనులు చేయకపోవడం వల్ల ఈ ప్రాంత పంటపొలాలకు సాగునీరు అందకపోవడంతో గతంలో రైతులు పలుసార్లు ఆందోళన చేశారు. గతంలో ఈ ప్రాంత రైతులు ఆందోళన చేసినప్పుడు అప్పటి కలెక్టర్ పీయూష్కుమార్ త్వరితగతిన లైనింగ్ పనులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ రెండేళ్ల నుంచి ఒక్కడుగు కూడా ముందుకు వేయలేదు. మేటవేసిన పంట కాలువలు ... ఆధునికీకరణలో భాగంగా తొలుత లైనింగ్ పనులు చేస్తామని చెప్పి తర్వాత వీటిని రిటైనింగ్వాల్గా మార్చటం వల్ల రైతులకు భవిష్యత్తులో సాగునీటి ఇబ్బందులు తప్పెటట్లు లేవు. పంటకాలువలు మట్టి మేటవేసి పూడుకుపోయాయి. ఈ విషయమై ఇరిగేషన్ డీఈ భానుబాబును వివరణ కోరగా నాలుగు అంగుళాలోపు మాత్రమే లైనింగ్ పనులకు అనుమతులివ్వడం వల్ల నల్లమట్టికి ఇవి అనుకూలంగా లేకపోవడంతో ఈ నిధులను రిటైనింగ్వాల్కు మార్చినట్లు చెప్పారు. దింటిమెరక, రామకృష్ణాపురంలో మిగిలిపోయిన లైనింగ్ పనులు ఈ ఏడాది చేపట్టలేమని తెలిపారు. -
అయ్యో.. పశువులకు ఎంత కష్టమొచ్చెనే !
-
గాలికుంటుకు పరిహారం
=‘అక్రమ-సక్రమ’ వర్తింపు వ్యవధి పెంపు =మంత్రి వర్గం నిర్ణయాలు సాక్షి, బెంగళూరు : రాష్ర్టంలో గాలికుంటు వ్యాధితో మృతిచెందిన పశువులకు సంబంధించిన యజమానులకు రూ.25 వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. బెంగళూరుతో పాటు ఇతర నగరాల్లో అక్రమ-సక్రమ వర్తింపు వ్యవధిని పెంచాలని తీర్మానించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన సమావేశం అనంతరం న్యాయ శాఖ మంత్రి టీబీ. జయచంద్ర మంత్రి వర్గం నిర్ణయాలను విలేకరుల సమావేశంలో తెలిపారు. ముఖ్యాంశాలు. = గాలికుంటు వ్యాధితో మరణించిన ఒక్కో ఆవుకు రూ.25 వేల నష్ట పరిహారం. ఇందులో కర్ణాటక పాడి సమాఖ్య వాటా రూ.10 వేలు. గేదెలు, దూడలకు నష్ట పరిహారం త్వరలో వెల్లడి. = బెంగళూరు సహా నగరాల్లో బ్లూప్రింట్కు వ్యతిరేకంగా నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు వ్యవధి విస్తరణ. ఇప్పటి వరకు 2009 డిసెంబరు 31కి ముందు నిర్మించిన భవనాలకే ఈ పథకం వర్తించేది. ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చి, గవర్నర్ దానిపై సంతకం చేసే తేదీ వరకు విస్తరణ. = ఆశా కార్యకర్తలకు ఇకపై నెలకు రూ.1,000 ప్రోత్సాహకం. = పేద విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లు. = రేషన్ షాపుల్లో అక్రమాల నిరోధానికి నలుగురితో కమిటీ. = జిల్లాకో తాలూకాలో ఉచిత డయాలసిస్ కేంద్రం = ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో అన్ని ఆదాయ వర్గాలకు ఇళ్ల నిర్మాణానికి విధానం = ముఖ్యమంత్రికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపిక అధికారం. -
ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్కు తప్పిన ముప్పు
సాక్షి, కాజీపేట (వరంగల్): డ్రైవర్ అప్రమత్తతతో ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్కు భారీ ప్రమాదం తప్పింది. గురువారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు వేగంగా వస్తున్న ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్ వరంగల్ జిల్లా ఇంటికన్నె వద్ద్డ గేదెలను ఢీకొట్టడంతో రైలు ఇంజిన్ ముందు భాగంలో ఉండే క్యాటిల్ గార్డ్ సగం వంగిపోయింది. కాజీపేటకు చేరుకున్నాక సిబ్బంది దాన్ని సరిచేసి సికింద్రాబాద్కు వెళ్లేందుకు అనుమతించారు. కానీ రైలు చిన్నపెండ్యాల స్టేషన్కు వచ్చేసరికి క్యాటిల్గార్డ్లోని కొంతభాగం విరిగి పట్టాలకు రాసుకుంటూ చక్రాల వద్దకు వచ్చింది. కానీ అప్రమత్తంగా ఉన్న డ్రైవర్ వెంటనే రైలును నిలిపివేయటంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. తర్వాత కాజీపేట నుంచి మరో ఇంజిన్ను తెప్పించి రైలుకు జతచేసి పంపారు. 3 గంటలపాటు రైలు చిన్నపెండ్యాలలోనే నిలిచిపోయింది. సాయంత్రం 5.45కు సికింద్రాబాద్కు చేరుకోవాల్సిన రైలు రాత్రి 10.10కు చేరుకుంది. -
విద్యుదాఘాతంతో వివాహిత మృతి
చీడిపల్లి (చీడికాడ), న్యూస్లైన్: తెగిపడిన విద్యుత్ తీగ తగిలి ఒక వివాహిత మృతి చెందింది. గ్రామానికి చెందిన వేచలపు లక్ష్మి (38) ఇంటి సమీపంలోని పొలాల్లో పశువులకు గడ్డి కోసేందుకు సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో వెళ్తోంది. రెండు చెరకు తోట ల మధ్య గట్టుపై తెగిపడిన విద్యుత్ తీగను పొరపాటున తాకడంతో విద్యుదాఘాతానికి గురై పెద్దగా కేకలు వేసింది. అవి విన్న భర్త సన్నిబాబు వెళ్లి చూసేసరికే మృతి చెందింది. ఆది వారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు విద్యుత్ తీగెలపై చెట్టు కొమ్మ విరిగిపడటంతో తెగిపడింది. సంఘటన స్థలా న్ని విద్యుత్ ఏడీఈ సత్యనారాయణ, ఏఈ రవికుమార్ పరిశీలించారు. అప్పటి వరకూ ఇంట్లో తిరిగి అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందంటూ లక్ష్మి కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ విలేకరులకు తెలిపారు. మృతురాలికి ఇద్దరు పెళ్లి కాని కుమార్తెలున్నారు.